Venky atluri
-
ధనుష్ హానెస్ట్ రాజ్?
హిట్ ఫిల్మ్ ‘సార్’ (2023) (తమిళంలో ‘వాతి’) తర్వాత హీరో ధనుష్( Dhanush )–దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో మరో మూవీ రానుందా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్నగర్ వర్గాలు. దుల్కర్ సల్మాన్తో ‘లక్కీ భాస్కర్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తీసిన వెంకీ అట్లూరి నెక్ట్స్ మూవీ ఎవరితో ఉంటుందనే చర్చ కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో జరుగుతోంది.ఇటీవల సూర్యకు వెంకీ అట్లూరి ఓ కథ వినిపించారనే టాక్ తెరపైకి వచ్చింది. తాజాగా హీరో ధనుష్( Dhanush )కు వెంకీ ఓ కథ వినిపించారట. ఈ కథకు ధనుష్( Dhanush ) అంగీకారం తెలిపారని, ప్రస్తుతం ఈ స్క్రిప్ట్కు తుది మెరుగులు దిద్దే పనిలో వెంకీ అట్లూరి ఉన్నారని భోగట్టా. అంతేకాదు... ఈ సినిమాకు ‘హానెస్ట్ రాజ్’ అనే టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. మరి... ధనుష్( Dhanush )–వెంకీ అట్లూరిల కాంబినేషన్ రిపీట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
లక్కీ భాస్కర్.. హీరోయిన్ను మెచ్చుకోవాల్సిందే! : పరుచూరి గోపాలకృష్ణ
మహానటి, సీతారామం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు హీరో దుల్కర్ సల్మాన్. ఈ ఏడాది లక్కీ భాస్కర్ మూవీతో మరోసారి అలరించాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైంది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. తాజాగా ఈ సినిమాను వీక్షించిన ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ.. లక్కీ భాస్కర్ ఎలా ఉందో తెలియజేస్తూ యూట్యూబ్లో ఓ వీడియో రిలీజ్ చేశాడు.ముందు జాగ్రత్తమధ్యతరగతి జీవితంలో జరిగిన అద్భుతమే ఈ సినిమా. కథ ముంబైలో జరుగుతుంది, పాత్రలు తెలుగులో మాట్లాడతాయి అని ముందే చెప్పేశారు. ముంబైలో తెలుగు మాట్లాడటమేంటని ఎవరూ విమర్శించకుండా జాగ్రత్తపడ్డారు. సినిమా ప్రారంభ సన్నివేశం బాగుంది. దర్శకుడు వెంకీ అట్లూరి స్క్రీన్ప్లేతో ఆటాడుకున్నారు. ఎన్నిరకాలుగా డబ్బును కాజేయొచ్చనేది సినిమాలో చూపించారు. దిగువమధ్యతరగతి స్థాయిలో ఉన్న భాస్కర్ వందకోట్లకు అధిపతి అయిపోతాడు. అసలు గేమ్ప్రపంచంలో కొందరు కోటీశ్వరులుగా ఎలా ఎదుగుతున్నారన్నది సినిమాలో చూపించారు. ప్రేమకథపై కాకుండా ఒరిజినల్ కథపైనే ఎక్కువ దృష్టి సారించడం బాగుంది. మొదట అతడి కష్టం, కన్నీళ్లు చూపించాక అసలైన గేమ్ మొదలుపెట్టారు. చివర్లో తను సంపాదించిన డబ్బంతా చెక్కులపై రాసిచ్చేసినప్పుడు ప్రేక్షకులకు బాధేస్తుంది. కట్ చేస్తే ఉద్యోగానికి రాజీనామా చేసి అమెరికాలో గ్రీన్ కార్డ్ సంపాదించి అక్కడ ప్రశాంతంగా ఉన్నాడు.ట్విస్టులు బాగున్నాయిప్రతి రూపాయిని బ్లాక్మనీలా కాకుండా వైట్ మనీ చేసుకున్న హీరో బ్రెయిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది. సినిమాలో ట్విస్టులు బాగున్నాయి. వంద కోట్ల కలెక్షన్స్ సాధించిందంటే మూడు రెట్ల లాభాలు వచ్చాయి. చిన్న పాత్ర అని తెలిసినా ఒప్పుకుని నటించిన హీరోయిన్ మీనాక్షి చౌదరిని అభినందించాల్సిందే! అని పరుచూరి చెప్పుకొచ్చాడు.చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు -
గ్రీన్ సిగ్నల్?
సూర్య మంచి జోరు మీద ఉన్నారు. ఇప్పటికే కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ మూవీని పూర్తి చేశారు సూర్య. ప్రస్తుతం ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. కాగా దర్శకుడు వెంకీ అట్లూరి ఇటీవల సూర్యకు ఓ కథ చెప్పారట.వెంకీ ఇప్పటివరకూ ధనుష్తో ‘సార్’, దుల్కర్ సల్మాన్తో ‘లక్కీ భాస్కర్’ వంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన విషయం తెలిసిందే. తొలి, మలి చిత్రాల్లో ఉన్నట్లుగానే సూర్యకి చెప్పిన కథలో మంచిపాయింట్ ఉండటంతో వెంకీ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఈ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. -
ఓటీటీలో 'లక్కీ భాస్కర్'.. అధికారిక ప్రకటన
దీపావళి సందర్భంగా 'లక్కీ భాస్కర్' సినిమాతో దుల్కర్ సల్మాన్ మరోసారి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. మహానటి, సీతారామం సినిమాలతో తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆయన ఈసారి లక్కీ భాస్కర్తో అక్టోబర్ 31న థియేటర్స్లోకి వచ్చేశాడు. సుమారు రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి టాలీవుడ్లో తన సత్తా నిరూపించుకున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేందుకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు.దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా 'లక్కీ భాస్కర్' చిత్రాన్ని నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకున్న ఈ మూవీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ఆ సంస్థ ఒక పోస్టర్ను కూడా విడుదల చేసింది. నవంబర్ 28 నుంచి లక్కీ భాస్కర్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో అందుబాటులో ఉండనుంది. కథేంటి?ఈ కథ అంతా ముంబైలో 1989-92 మధ్యలో జరుగుతుంది. భాస్కర్ కుమార్(దుల్కర్ సల్మాన్).. మగధ బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తుంటాడు. ఇంటి నిండా అప్పులే. కనీసం ప్రమోషన్ వస్తే చాలు.. కష్టాలు తీరుతాయి అనుకుంటాడు. కష్టపడి పనిచేసినా అది వేరే వాళ్లకు దక్కుతుంది. దీంతో డబ్బు అవసరమై ఆంటోనీ(రాంకీ) అనే వ్యక్తితో కలిసి బ్యాంక్ డబ్బులతో చిన్న చిన్న స్కామ్స్ చేస్తాడు. అంతా బాగానే ఉంటది. డబ్బులు బాగానే సంపాదిస్తాడు. కొన్ని కారణాల వల్ల ఇదంతా ఆపేస్తాడు. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఏకంగా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ అవుతాడు. కోట్లకు కోట్లు సంపాదిస్తాడు. ఇంత డబ్బు ఎలా సంపాదించాడు? భాస్కర్ ని సీబీఐ వాళ్ళు ఎందుకు ఎంక్వయిరీ చేశారు? ఈ కథకి బిగ్ బుల్ హర్ష మెహ్రాకి సంబంధం ఏంటనేది మిగిలిన స్టోరీ. -
అది నా అదృష్టం : వెంకీ అట్లూరి
‘నా మొదటి సినిమా 'తొలిప్రేమ' విజయం సాధించినప్పటికీ, ఒక ఐదు శాతం మంది ప్రేమకథే కదా అన్నట్టుగా కాస్త నెగటివ్ గా మాట్లాడారు. కానీ 'లక్కీ భాస్కర్'కి మాత్రం ఒక్క శాతం కూడా అలాంటి నెగటివ్ స్పందన రాలేదు. ప్రీమియర్ల నుంచే అన్ని చోట్లా పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రేక్షకులు, రివ్యూ రైటర్లు అందరూ సినిమా బాగుంది అన్నారు. ఒక సినిమాని ఇలా చూసిన వారందరూ బాగుందని చెప్పడం నిజంగా గొప్ప విషయం. అదృష్టంగా భావిస్తున్నాను’అన్నారు డైరెక్టర్ వెంకీ అట్లూరి. ఆయన దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలై మంచి టాక్తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ వెంకీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ 'లక్కీ భాస్కర్' కథ విని అందరూ బాగుంది అన్నారు. కానీ, కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందా అనే సందేహం వ్యక్తం చేశారు. అలాంటి సమయంలో సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ అవుతుందని భరోసా ఇచ్చారు.→ నేను సాధారణ ప్రేక్షకులతో కలిసి సినిమా చూసినప్పుడు.. ప్రతి సన్నివేశానికి, ప్రతి సంభాషణకి వారి నుంచి వచ్చిన స్పందన చూసి చాలా చాలా సంతోషం కలిగింది. కొన్ని సంభాషణలు అప్పటికప్పుడు చిత్రీకరణ సమయంలో రాయడం జరిగింది. వాటికి కూడా ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన లభించింది.→ సినిమా సెట్ లో హీరోనే మెయిన్ పిల్లర్. హీరో డల్ గా ఉంటే సెట్ మొత్తం డల్ గా ఉంటుంది. దుల్కర్ ఉదయం రావడమే ఫుల్ ఎనర్జీతో వచ్చేవారు. ఆయన ఈ కథని నమ్మడం వల్ల, సెట్ లో అంత సంతోషంగా ఉండటం వల్లే ఇంతమంచి అవుట్ పుట్ వచ్చింది. సన్నివేశాలు, సంభాషణలు చదివి బాగున్నాయని అభినందించే వారు. దాని వల్ల మరింత ఉత్సాహంగా ఇంకా మెరుగ్గా రాసేవాడిని.→ మొదట కథ రాసుకున్నప్పుడు ఇంత భారీ సినిమా అవుతుందని నేను అనుకోలేదు. నిజమైన లొకేషన్స్ లో షూటింగ్ చేసి, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేయొచ్చనే ఆలోచనలో ఉన్నాను. కానీ నిర్మాత వంశీ ఈ కథని ఎంతో నమ్మారు. కథకి తగ్గ భారీతనం తీసుకురావడం కోసం సెట్లు వేయాలని నిర్ణయించారు. కథని అంతలా నమ్మారు కాబట్టే వంశీ గారు ఎక్కడా రాజీ పడకుండా సినిమాని భారీస్థాయిలో నిర్మించారు.→ బ్యాంకింగ్ నేపథ్యం సాగే కథ ఇది. దీని కోసం ఎంతో రీసెర్చ్ చేశాను. కొన్ని సిరీస్ లు చూశాను. అయితే అవి టెక్నికల్ గా సాధారణ ప్రేక్షకులు అర్థం చేసుకునేలా లేవు. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకొని.. చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలా ప్రతి సన్నివేశాన్ని రాసుకోవడం జరిగింది.→ సినిమాలు ఎడిట్ టేబుల్ మీద తయారవుతాయని భావిస్తాను. ఎడిటర్ నవీన్ నూలితో తొలిప్రేమ సినిమా నుంచి ట్రావెల్ అవుతున్నాను. నవీన్ ని ఎంతో నమ్ముతాను. ఏదైనా తప్పు అనిపిస్తే నిర్మొహమాటంగా చెప్తాడు. ఎడిటర్ గా లక్కీ భాస్కర్ కి పూర్తి న్యాయం చేశాడు. ఈ సినిమా ఎడిటింగ్ గురించి అందరూ అందుకే అంత గొప్పగా మాట్లాడుకుంటున్నారు.→ ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్ ఏది ఒప్పుకోలేదు. ఏ జానర్ సినిమా చేయాలనే నిర్ణయానికి ఇంకా రాలేదు. ప్రస్తుతం కొన్ని కథా ఆలోచనలు ఉన్నాయి. ఖచ్చితంగా మరో మంచి చిత్రంతో అలరించడానికి ప్రయత్నిస్తాను. -
దిల్ రాజు సినిమా చాన్స్ ఇస్తే.. చేయనని చెప్పేశా: దుల్కర్ సల్మాన్
‘మంచి మనసున్న మనుషులంతా కలిస్తే గొప్ప సినిమా తెరకెక్కించవచ్చని నేను నమ్ముతా. దానికి ‘లక్కీ భాస్కర్’ చిత్రమే ఓ మంచి ఉదాహరణ. ఈ సినిమాలో పని చేసినవారంతా గొప్ప వ్యక్తులు. వారి వారి పాత్రల్లో చక్కగా నటించారు. అందుకే ఇంత పెద్ద విజయం లభించింది.తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. వారితో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ఇకపై కూడా మంచి కథలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తాను’అని అన్నారు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 31న విడుదలై హిట్ టాక్తో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించింది. చిత్ర బృందంతో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ప్రముఖ దర్శకులు నాగ్ అశ్విన్, హను రాఘవపూడి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా దుల్కర్ మాట్లాడుతూ.. ‘సినిమా బ్లాక్ బస్టర్ అని నాకు ఫస్ట్ మెసేజ్ చేసింది జి.వి. ప్రకాష్. వెంకీ-జి.వి ఇద్దరూ డైనమిక్ కాంబో. నిర్మాతలకు జి.వి. ప్రకాష్ లాంటి టెక్నీషియన్స్ కావాలి. ఎందుకంటే పాటలు గానీ, నేపథ్య సంగీతం గానీ ఆలస్యం చేయరు. డీఓపీ నిమిష్, ప్రొడక్షన్ డిజైనర్ బంగ్లాన్, ఎడిటర్ నవీన్ అందరూ సినిమా అద్భుతంగా రావడానికి ఎంతో కృషి చేశారు. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. వారితో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ‘ఓకే బంగారం’ విడుదలయ్యాక నిర్మాత దిల్రాజు నాకొక అవకాశం ఇచ్చారు. తెలుగు సరిగ్గా రాకపోవడంతో ఆ సినిమా అంగీకరించలేకపోయా. నాగి, స్వప్న 'మహానటి' కోసం నన్ను సంప్రదించినప్పుడు నాకు తెలుగు రాదనే చెప్పాను. కానీ నన్ను తీసుకొచ్చి, ఈరోజు ఇలా నిలబెట్టారు. ఆ తర్వాత హను గారు 'సీతారామం'తో నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాన్ని అందించారు. ఇప్పుడు వెంకీ. చూడటానికి కుర్రాడిలా ఉంటాడు. కానీ ఎంతో ప్రతిభ ఉంది. అందుకే ఇంత గొప్ప సినిమాలు చేస్తున్నాడు. లక్కీ భాస్కర్ సినిమాకి, ఇందులోని పాత్రలకు ప్రాణం పోసిన వెంకీకి థాంక్స్. అలాగే ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని అన్నారు.హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ, "ఈ సినిమాలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను. టీం అందరం ఎంతో కష్టపడి పని చేశాము. ఆ కష్టానికి తగ్గ ఫలితంగా ప్రేక్షకుల నుంచి లభిస్తున్న స్పందన చూసి ఎంతో సంతోషంగా ఉంది. ఇందులో నేను పోషించిన సుమతి పాత్ర పట్ల ఎంతో ప్రేమను కురిపిస్తున్నారు. దుల్కర్ గారితో కలిసి నటించడం ఆనందంగా ఉంది’ అన్నారు. ‘పేరుతో పాటు, సినిమాకి డబ్బులు కూడా రావడం సంతోషంగా ఉంది’ అని దర్శకుడు వెంకీ అట్లూరి అన్నారు. -
లక్కీ భాస్కర్ డైరెక్టర్ పై మండి పడుతున్న నితిన్, అఖిల్
-
'లక్కీ భాస్కర్' తొలిరోజు కలెక్షన్ ఎంతంటే?
'సీతారామం'తో అద్భుతమైన క్రేజ్ దక్కించుకున్న దుల్కర్ సల్మాన్.. హీరోగా నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ 'లక్కీ భాస్కర్'. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలోకి వచ్చింది. ప్రీమియర్స్ వేసినప్పుడే సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది. ఇక తొలిరోజు వసూళ్లలోనూ మంచి నంబర్స్ నమోదు చేసింది. ఇంతకీ ఎన్ని కోట్లు వచ్చాయంటే?(ఇదీ చదవండి: 'క' సినిమా ధమాకా.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?)సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్పై దుల్కర్- వెంకీ అట్లూరి కాంబోలో తీసిన ఈ సినిమాని డబ్బు ప్రధాన ఇతివృత్తంగా తీశారు. 1992లో జరిగిన హర్షద్ మెహతా స్కామ్ని కాస్త టచ్ చేశారు. ఆద్యంతం ఎంటర్టైన్ చేస్తూ సాగిన ఈ మూవీకి తొలిరోజు రూ.12.7 కోట్లు గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. ఈ మేరకు అధికారిక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.స్వతహాగా తెలుగు హీరో కానప్పటికీ దుల్కర్ 'లక్కీ భాస్కర్' సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయంటే విశేషమనే చెప్పాలి. దీపావళి లాంగ్ వీకెండ్ ఉంది. వచ్చే వారం కూడా పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ లేవు. కాబట్టి ఈ మూవీతో పాటు క, అమరన్ చిత్రాలకు కలెక్షన్ పరంగా బాగా కలిసి రావొచ్చనిపిస్తోంది. దిగువన 'లక్కీ భాస్కర్' రివ్యూ ఉంది. దానిపై ఓ లుక్కేయండి.(ఇదీ చదవండి: 'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ)Baskhar's 𝐒𝐄𝐍𝐒𝐀𝐓𝐈𝐎𝐍𝐀𝐋 start at the Box-Office 🔥#LuckyBaskhar Grosses over 𝟏𝟐.𝟕𝟎 𝐂𝐑 on 𝐃𝐀𝐘 𝟏 Worldwide! 💰𝑼𝑵𝑨𝑵𝑰𝑴𝑶𝑼𝑺 𝑫𝑰𝑾𝑨𝑳𝑰 𝑩𝑳𝑶𝑪𝑲𝑩𝑼𝑺𝑻𝑬𝑹 🤩🏦In Cinemas Now - Book your tickets 🎟 ~ https://t.co/Gdd57KhHT3 @dulQuer #VenkyAtluri… pic.twitter.com/B0VTxFbI07— Dulquer Salmaan (@dulQuer) November 1, 2024 -
వెంకీకి ఎప్పటినుంచో పూజా హెగ్డేపై కన్నుంది: నిర్మాత నాగవంశీ
'సీతారామం' సినిమా దెబ్బకు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇతడి లేటెస్ట్ మూవీ 'లక్కీ భాస్కర్'. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలోకి వస్తోంది. ఇప్పటికే దాదాపు ప్రమోషన్స్ పూర్తి చేశారు. ఇప్పుడు 'అన్స్టాపబుల్' షోలో పాల్గొన్నారు. ఇదివరకే షూటింగ్ పూర్తవగా.. తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు.గతవారమే 'అన్స్టాపబుల్' నాలుగో సీజన్ మొదలైంది. తొలి ఎపిసోడ్కి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఇప్పుడు రెండో ఎపిసోడ్లో 'లక్కీ భాస్కర్' హీరోహీరోయిన్ దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ కనిపించారు.(ఇదీ చదవండి: 'జై హనుమాన్' నుంచి సడన్ సర్ప్రైజ్)కారు డ్రైవింగ్ స్పీడ్ గురించి బాలకృష్ణ.. 300 కిమీ వేగంతో నడుపుతానని దుల్కర్ చెప్పాడు. అలానే మాటల సందర్భంలో నిర్మాత నాగవంశీ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వెంకీ అట్లూరికి ఎప్పటినుంచో పూజా హెగ్డేపై కన్నుందని అన్నాడు. అలానే దిల్ రాజు.. చాలాసార్లు పింక్ ప్యాంట్ వేసుకుని వస్తున్నారని, అది వద్దని చెప్పాలనుందని నాగవంశీ అన్నారు.సినిమా సినిమాకు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అనే తెలుగు హీరో గురించి బాలకృష్ణ-నాగవంశీ మధ్య చర్చ జరిగింది. ఆ హీరో పేరు ఏంటనేది మాత్రం సస్పెన్స్గానే ఉండిపోయింది. ప్రోమో చూస్తుంటే సరదాగానే అనిపించింది. ఎపిసోడ్ కూడా ఇలానే ఉంటే మంచి ఫన్ గ్యారంటీ.(ఇదీ చదవండి: హాట్ బ్యూటీతో విడిపోవడంపై క్లారిటీ ఇచ్చిన హీరో) -
'లక్కీ భాస్కర్' బ్యాంక్ ఖాతాలో కోట్లలో డబ్బు.. ఆసక్తిగా టీజర్
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా లక్కీ భాస్కర్.. పుష్కర కాలం పాటు ఆయన ఎన్నో చిత్రాలతో మెప్పించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వినూత్న చిత్రాలు, పాత్రలు చేస్తూ వస్తున్నారు దుల్కర్. ఇక పన్నెండేళ్లయిన సందర్భంగా దుల్కర్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైన సమయం నుంచి ఆసక్తిని పెంచుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ను విడుదల చేశారు మేకర్స్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నారు. దుల్కర్ సరసన మీనాక్షి చౌదరి నటిస్తుంది. 'మగధ బ్యాంక్లో క్యాషియర్గా పని చేసే పాత్రలో దుల్కర్ కనిపించారు. 1980ల నాటి బొంబాయి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఒక సాధారణ మనిషి తాలూకు అసాధారణమైన ప్రయాణమే ఈ సినిమా. నమ్మశక్యం కాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి కథగా రూపొందనున్న సినిమా ‘లక్కీ భాస్కర్’. దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్లో నటించనున్న సినిమా ఇది. ‘లక్కీ భాస్కర్’ టీజర్ను గమనిస్తే డబ్బు చుట్టూ ఈ కథ నడుస్తుందని తెలుస్తోంది. నమ్మశక్యం కాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన వ్యక్తి కథ అంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. సో..‘లక్కీ భాస్కర్’ కథలోని ప్రధానాంశం డబ్బే అని తెలుస్తోంది. జులై నెలలో ఈ చిత్రం విడుదల కానుంది. -
మీనాక్షి చౌదరినే కావాలని పట్టుబట్టిన త్రివిక్రమ్ భార్య
త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్లో ప్రముఖ దర్శకనిర్మాతలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. అతను ఇటీవల చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టాడు. సినిమాకు సంబంధించిన పలు పనుల్లో అతని భార్య సాయి సౌజన్య కూడా చురుకుగా పాల్గొంటున్నారు. స్క్రిప్ట్ డిస్కషన్స్లో కూడా సౌజన్య పాల్గొంటోంది. ఇప్పుడు, ఆమె సితార ఎంటర్టైన్మెంట్తో కలిసి దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మొదటి స్ట్రైట్ తెలుగు సినిమా లక్కీ భాస్కర్ని నిర్మిస్తోంది. (ఇదీ చదవండి: రవితేజ, విజయ్ దేవరకొండ ఎవరైతే ఏంటి.. శ్రీలీల పరిస్థితి ఇదీ!) అయితే ఆశ్చర్యకరంగా ఈ సినిమాలో కథానాయికగా మీనాక్షి చౌదరిని టీమ్ ఎంపిక చేసింది. మీనాక్షి చౌదరి మహేష్ బాబు గుంటూరు కారం కోసం త్రివిక్రమ్ కాంపౌండ్లోకి ప్రవేశించింది. ఆమె ఈ చిత్రంలో ద్వితీయ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ధనుష్ తొలి తెలుగు స్ట్రైట్ మూవీ అయిన 'సార్'ను వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఇప్పుడు దుల్కర్ సినిమాను కూడా ఆయన తెరకెక్కించనున్నారు. లక్కీ భాస్కర్లో దుల్కర్కు సరిజోడిగా మీనాక్షి అయితే బాగుంటుందని సౌజన్య పట్టుబట్టి మరీ తీసుకున్నారట. ఒక సాధారణ మనిషి ఉన్నత శిఖరాలకు చేరిన అసాధారణమైన ప్రయాణంగా ‘లక్కీ భాస్కర్’ రూపొందుతోందని డైరెక్టర్ చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా హైదరాబాద్లో జరిగాయి. ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్ సతీమణి సౌజన్యతో మీనాక్షి చౌదరి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్పై సూర్యదేవర నాగవంశీ, సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్. -
లక్కీ భాస్కర్ షురూ
‘మహానటి, సీతారామం’ వంటి హిట్ చిత్రాల తర్వాత దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న స్ట్రయిట్ తెలుగు చిత్రం ‘లక్కీ భాస్కర్’ షూరూ అయింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘‘ఒక సాధారణ మనిషి ఉన్నత శిఖరాలకు చేరిన అసాధారణమైన ప్రయాణంగా ‘లక్కీ భాస్కర్’ రూపొందుతోంది. ‘సార్’(తమిళంతో ‘వాతి’) చిత్రం తర్వాత వెంకీ అట్లూరితో మేము నిర్మిస్తున్న రెండో పాన్ ఇండియా చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నిమిష్ రవి, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్. -
'సీతారామం' హీరో మరో తెలుగు మూవీ.. అలాంటి కాన్సెప్ట్తో!
దుల్కర్ సల్మాన్ పలు భాషల్లో స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. పాన్-ఇండియా స్థాయిలో అలరిస్తూ, ప్రస్తుత ఉత్తమ నటులలో ఒకడిగా ఫేమ్ సంపాదించాడు. తన గత చిత్రం 'సీతారామం'తో బ్లాక్ బస్టర్ కొట్టిన దుల్కర్.. ఇప్పుడు మరోసారి తెలుగు దర్శకుడితో పనిచేసేందుకు రెడీ అయిపోయాడు. హీరో పుట్టినరోజు సందర్భంగా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: BRO Movie Review: ‘బ్రో’మూవీ రివ్యూ) ధనుష్ తో చేసిన 'సార్'(వాతి)తో వెంకీ అట్లూరి బిగ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న వెంకీ అట్లూరి.. ఇప్పుడు తన ప్రతిభను పాన్-ఇండియా స్థాయికి తీసుకెళ్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. 'నమ్మశక్యం కాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి కథ'గా ఈ చిత్రం రూపొందుతోందని నిర్మాతలు చెప్పుకొచ్చాడు. ఈ మూవీకి 'లక్కీ భాస్కర్' టైటిల్ ఫిక్స్ చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. Presenting to you #LuckyBaskhar - Embark on a Captivating Journey, The Unraveling Triumphs of an Ordinary Man! 📈🎬#VenkyAtluri @gvprakash @vamsi84 @Banglan16034849 @NavinNooli #SaiSoujanya @sitharaents @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/NwNaZ9NAwC — Dulquer Salmaan (@dulQuer) July 28, 2023 (ఇదీ చదవండి: బ్రో మూవీ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!) -
మరో స్ట్రయిట్ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దుల్కర్
‘మహానటి’, ‘సీతారామం’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ మరో స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. తెలుగులో ‘తొలిప్రేమ’, ‘రంగ్ దే’, ‘సార్’ వంటి సినిమాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్న చిత్రంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించనున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘‘అక్టోబరులో షూటింగ్ను ఆరంభించి, వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం. ప్రేక్షకులను అలరించే మరో మంచి కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్గా ఈ చిత్రం ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
దర్శకుల ప్రతిభను పెంచే నటుడు ధనుష్: వెంకీ అట్లూరి
తమిళ సినిమా: ధనుష్ తొలిసారిగా తెలుగులో కథానాయకుడిగా నటించిన చిత్రం సార్. తమిళంలో పార్టీ పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని నాగ వంశీ, సాయి సౌమ్య నిర్మించారు. వెంకీ అట్లూరి కథ దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. 1990 ప్రాంతంలో జరిగే కథా చిత్రంగా తెరకెక్కించారు. విద్య కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లిన పెద్ద వ్యాపారంగా మారి పేద విద్యార్థులకు ఎలా భారమవుతోంది, దాన్ని మార్చడానికి ఓ యువ ఉపాధ్యాయుడు చేసే పోరాటమే ఈ చిత్రం. ఈనెల 17న తమిళం, తెలుగు భాషల్లో విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. దీంతో చిత్రం శనివారం ఉదయం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్లో సక్సెస్ మీట్ను నిర్వహించారు. ఇందులో పాల్గొన్న దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ ఇంత మంచి విజయాన్ని అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనను నమ్మి ఈ అవకాశాన్ని కల్పించిన నిర్మాతలకు ధన్యవాదాలు చెప్పారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం పక్క బలంగా నిలిచిందన్నారు. ఇక నటుడు ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదని, ఆయన దర్శకుల ప్రతిభను పెంచే నటుడని పేర్కొన్నారు. షూటింగ్లో ఏ విషయం గురించి అయినా వెంటనే ఓకే చెప్పే నటుడని కొనియాడారు. ఆయనతో పనిచేయటం మంచి అనుభవంగా పేర్కొన్నారు. వాతి చిత్రం 8 రోజుల్లో రూ. 75 కోట్లు వసూలు చేసిందని దర్శకుడు తెలిపారు. ఇంకా భారీ మొత్తంలో వసూలు చేస్తుందని దర్శకుడు వెంకీ అట్లూరి ధీమా వ్యక్తం చేశారు. -
ధనుష్ ‘సార్’ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ (ఫోటోలు)
-
సార్ సినిమాకు సీక్వెల్ లేదు: డైరెక్టర్
‘‘సార్’ సినిమాకు తల్లిదండ్రులు, విద్యార్థులు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతారు. ఈ సినిమా చూసిన తర్వాత విద్యార్థులకు వారి తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో అర్థం అవుతుంది. మనసున్న ప్రతి మనిషి కీ ‘సార్’ సినిమా నచ్చుతుంది’’ అన్నారు దర్శకుడు వెంకీ అట్లూరి. ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ద్విభాషా చిత్రం ‘సార్’ (తమిళంలో ‘వాతి’). సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలైంది. ‘సార్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ చిత్రదర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ– ‘‘చదువు అనేది నిత్యావసరం. అందుకే ‘సార్’ సినిమా బ్యాక్డ్రాప్ 1990 అయినప్పటికీ ఇప్పటి ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారనిపించింది. ధనుష్గారికి మా నిర్మాత ‘సార్’ కథ చెప్పమనగానే హ్యాపీ ఫీలయ్యాను. కథ విన్నాక ధనుష్ గారు చప్పట్లు కొట్టి, కాల్షీట్స్ ఎప్పుడు కావాలని అడగటంతో ఇంకా హ్యాపీ ఫీలయ్యాను. ఇందులో తండ్రీకొడుకుల మధ్య మంచి సీన్ ఉంటుంది. అది త్రివిక్రమ్గారితో జరిపిన సంభాషణల నుంచే పుట్టింది. ‘సార్’ యూనివర్సల్ సబ్జెక్ట్. తమిళంలోనూ మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రానికి సీక్వెల్ ఆలోచన లేదు. ఇక నుంచి నా ప్రతి సినిమాకీ వైవిధ్యం చూపించడంతో పా టు విభిన్న జోనర్లలో చిత్రాలు చేస్తాను’’ అన్నారు. -
ధనుష్ 'సార్' మూవీ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం సార్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో వాతి పేరుతో విడుదలయ్యింది.ధనుష్కి జోడీగా సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటించింది.రిలీజ్కు ముందే ఈ సినిమా పాటలు మాంచి బజ్ను క్రియేట్ చేశాయి. ఇక సార్ విడుదలైన తొలిరోజే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. విద్యావ్యవస్థపై ఓ లెక్చరర్ పోరాటం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. దీంతో ధనుష్కి టాలీవుడ్లో సాలిడ్ డెబ్యూ లభించిందని టాక్ వినిపిస్తుంది. కలెక్షన్స్ విషయంలోనూ సార్ దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్పై క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ ధరకు సార్ డిజిటల్ రైట్స్ను కొనుగోలు చేసినట్లు సమాచారం. సినిమా రిలీజ్ అయిన ఐదు వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. -
రఘువరన్ బీటెక్ టోటల్ కలెక్షన్స్.. సార్ ఫస్ట్డేకు వచ్చేస్తాయి!
‘‘గత ఏడాది మా బ్యానర్ నుంచి వచ్చిన ‘భీమ్లానాయక్’, ‘డీజే టిల్లు’ సినిమాలకు హౌస్ఫుల్ అంటూ నాకు ఫోన్కాల్స్ వచ్చాయి. ఇప్పుడు ‘సార్’కు అంత మంచి రెస్పాన్స్ వస్తుండడం హ్యాపీగా ఉంది’’ అని అన్నారు సూర్యదేవర నాగవంశీ. ధనుష్ హీరోగా నటించిన ద్విభాషా చిత్రం ‘సార్’ (తమిళంలో ‘వాతి’). వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది. అదే రోజు సాయంత్రం జరిగిన విలేకర్ల సమావేశంలో నాగవంశీ మాట్లాడుతూ– ‘‘ధనుష్ గారి ‘రఘువరన్ బీటెక్’ మొత్తంగా తెలుగులో ఎంత వసూలు చేసిందో ఆ స్థాయి వసూళ్లు ‘సార్’ తొలి రోజునే వచ్చేలా ఉన్నాయి. ఆయన కెరీర్లో ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టేలా ఉంది’’ అన్నారు. ‘‘ఇంటర్మీడియట్ చదివినప్పుడు, నేను చూసిన చుట్టుపక్కల ఘటనల ఆధారంగా ఈ చిత్రకథ రాశాను’’ అన్నారు వెంకీ అట్లూరి. -
ధనుష్ ‘సార్’ మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
Sir Review: ‘సార్’ మూవీ రివ్యూ
టైటిల్: సార్(తమిళ్లో ‘వాతి’) నటీనటులు: ధనుష్, సంయుక్త మీనన్, సముద్ర ఖని, హైపర్ ఆది తదితరులు నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య దర్శకత్వం: వెంకీ అట్లూరి సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్ సినిమాటోగ్రఫీ: జె.యువరాజ్ ఎడిటర్: నవీన్ నూలి విడుదల తేది: ఫిబ్రవరి 17, 2023 తమిళ స్టార్ ధనుష్కి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఆయన కోలీవుడ్లో నటించిన చిత్రాలన్ని తెలుగులో డబ్ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి. అందుకే ఈ సారి నేరుగా తెలుగులోనే ‘సార్’(తమిళ్లో ‘వాతి’) సినిమా చేశాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్కు మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై హైప్ని క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(ఫిబ్రవరి 17) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1998-2000 కాలంలో సాగుతుంది. త్రిపాఠీ విద్యాసంస్థల చైర్మన్ శ్రీనివాస్ త్రిపాఠి(సముద్రఖని)కి విద్య అనేది ఒక వ్యాపారంగా భావిస్తాడు. క్వాలిటీ ఎడ్యుకేషన్ పేరుతో భారీగా ఫీజులు వసూళ్లు చేస్తూ ప్రభుత్వ కాలేజీలు మూత పడేలా చేస్తాడు. అధిక ఫీజుల వసూళ్లు చేస్తున్నరంటూ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో.. ఫ్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్ర కోసం ప్రభుత్వం ఓ జీవోని తీసుకురావాలని నిర్ణయించుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో త్రిపాఠీ ఓ ఒప్పందం కుదుర్చుకుంటాడు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలను దత్తత తీసుకొని.. త్రిపాఠి విద్యా సంస్థల ఫ్యాకల్టీతో ఉచితంగా విద్యను అందిస్తామని చెబుతాడు. దానికి ప్రభుత్వం కూడా సై అంటుంది. దీంతో త్రిపాఠి తమ విద్యా సంస్థలో పనిచేసే జూనియర్ లెక్చర్లను ప్రభుత్వ కాలేజీలకు పంపిస్తాడు. వారిలో ఒకరే బాలా గంగాధర్ తిలక్ అలియాస్ బాలు(ధనుష్). అతను కడప జిల్లా సిరిపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీకి వెళ్తాడు. దత్తత పేరుతో ప్రభుత్వ విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం చేయాలనేది త్రిపాఠి టార్గెట్ అయితే.. కాలేజీలో చదివే విద్యార్థులందరిని పాస్ చేయించి ప్రమోషన్ సాధించాలనేది బాలు లక్ష్యం. అతని లక్ష్యం నెరవేర్చుకునే క్రమంలో బాలుకు ఎదురైన సమస్యలు ఏంటి? త్రిపాఠి కుట్రను బాలు ఎలా తిప్పి కొట్టాడు? సిరిపురం ప్రెసిడెంట్(సాయి కుమార్) బాలు సార్ని ఊరి నుంచి బహిష్కరించినా.. పిల్లలకు పాఠాలు ఎలా చెప్పాడు? తను చదువు చెప్పిన 45 మంది విద్యార్థులు ఎంసెట్ పరీక్షల్లో రాణించారా? లేదా? పేద విద్యార్థులకు నాణ్యమైన చదువుని అందించాలని కృషి చేస్తున్న బాలు సార్కి బయాలజీ లెక్చర్ మీనాక్షి(సంయుక్త మీనన్) ఎలాంటి సహాయం చేసింది? బాలు కారణంగా సిరిపురం యువతలో ఎలాంటి మార్పులు వచ్చాయి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ‘విద్య అనేది గుడిలో పెట్టిన నైవేద్యం లాంటిది..పంచండి. అంతేకానీ ఫైవ్స్టార్ హోటల్లో డిష్లా అమ్మకండి’.. ఇంటర్వెల్ ముందు విలన్తో హీరో చెప్పే మాట ఇది. ఈ ఒక్క డైలాగ్ చాలు ‘సార్’ సినిమా ఓ మంచి సందేశాత్మక చిత్రం అని చెప్పడానికి. దేశంలో ఎడ్యుకేషన్ మాఫీయా సాగిస్తున్న అరాచకాలు ఏంటి? ప్రైవేట్ విద్యా సంస్థలు చదువుని వ్యాపారంగా మార్చడం వల్ల మధ్య తరగతి కుటుంబాలు పడుతున్న అవస్థలు ఎంటి? అనేది ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు వెంకీ అట్లూరి. ఎక్కడా అసభ్యతకు అశ్లీలతకు తావు లేకుండా చెప్పాలనుకున్న పాయింట్ నేరుగా చెప్పడంలో దర్శకుడు సఫలమయ్యాడు. సినిమా ప్రారంభమే ఆసక్తిగా ఉంటుంది. ఐఏఎస్ అధికారి ఏఎస్ మూర్తి (సుమంత్)ను వెతుక్కుంటూ కొంతమంది విద్యార్థులు రావడం..ఆయన బాలు సార్ గురించి చెప్పడంతో అసలు కథ మొదలవుతుంది. సినిమా అంతా బాలు క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది. పిల్లలకు చదువుపై ఆసక్తి పెంచడం కోసం బాలు చేసే ప్రయత్నం.. ఈ క్రమంలో అతనికి ఎదురైన సమస్యలు.. మీనాక్షి మేడంతో ప్రేమాయణం..మధ్యలో కెమిస్ట్రీ లెక్చరర్ కార్తిక్(హైపర్ ఆది) వేసే పంచ్ జోకులతో సోసోగా ఫస్టాఫ్ సాగుతుంది. చూస్తుండగానే ఇంటర్వెల్ వచ్చేస్తుంది. ఇక సెకండాఫ్లో అసలు కథ మొదలవుతుంది. పిల్లలకు మెరుగైన విద్యను అందించేందుకు బాలు సార్ చేసేప్రయత్నం.. ఆ ప్రయత్నం ఫలించకుండా చేసేందుకు త్రిపాఠి చేసే కుట్రలు సెకండాఫ్లో చూపించాడు. అయితే కథనం మొత్తం ప్రేక్షకుడి ఊహకు అందేలా సాగడం, ట్విస్టులు లేకపోవడం మైనస్. ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ ఎలా ఉండబోతుంది? క్లైమాక్స్ ఏంటి? అనేది సగటు ప్రేక్షకుడు ఈజీగా ఊహించగలడు. కొన్ని సన్నివేశాలు సినిమాటిక్గా అనిపిస్తాయి. నేపథ్య సంగీతంలో ఉన్నంత బలం.. కంటెంట్లో ఉండదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఉన్నంత ఎమోషన్.. సన్నివేశంలో కనిపించదు. ఇంటర్వెల్ తర్వాత వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ హృదయాలను హత్తుకుంటాయి. 'అవసరానికి కులం ఉండదు' , ‘అడిగింది కొనివ్వకపోతే ఆ పిల్లలు ఒక్క రోజే ఏడుస్తారు..కానీ వాళ్ల అమ్మ నాన్న కొనివ్వలేని పరిస్థితి ఉన్నంత కాలం ఏడుస్తూనే ఉంటారు’, ‘డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు.. కానీ మర్యాదని చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది’ లాంటి డైలాగ్స్.. ఆ సందర్భంలో వచ్చే సన్నివేశాలు హృదయాలను హత్తుకుంటాయి. ఎవరెలా చేశారంటే.. బాలు పాత్రలో ధనుష్ పరకాయ ప్రవేశం చేశాడు. సినిమా మొత్తం బాలు పాత్ర చుట్టే తిరుగుతుంది. ఒకరకంగా చెప్పాలంటే ధనుష్ వన్ మ్యాన్ షో నడిపాడని అనొచ్చు. ఫైట్ సీన్స్తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా చక్కగా నటించాడు. మీనాక్షిగా సంయుక్త మీనన్ తన పాత్ర పరిధిమేర నటించింది. సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. త్రిపాఠి విద్యా సంస్థల చైర్మన్గా సముద్ర ఖని తనదైన నటనతో మెప్పించాడు. సిరిపురం ప్రెసిడెంట్గా సాయి కుమార్ ఉన్నంతలో చక్కగా నటించాడు. హైపర్ ఆది తనదైన పంచ్ డైలాగ్స్తో నవ్వించే ప్రయత్నం చేశాడు. ఏఎస్ మూర్తిగా సుమంత్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. .ఈ సినిమాకు ప్రధాన బలం జీవీ ప్రకాశ్ సంగీతం. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. ‘మాస్టారు మాస్టారు’పాట ఆకట్టుకుంటుంది. జె.యువరాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. నవీన్ నూలి ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆ స్టార్ హీరోకు వెల్కమ్ చెప్పిన నితిన్.. ట్వీట్ వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సార్ సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు(ఫిబ్రవరి17)న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నితిన్ మూవీ టీంకు బెస్ట్ విషెస్ తెలిపారు. ధనుష్కు టాలీవుడ్కు స్వాగతం అంటూ అంటూ చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమాలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. #SIR In cinemas, From Tomorrow!Hearing great things about the film already👏👏 Congrats to my dear Swami #VenkyAtluri & Grand Welcome to @dhanushkraja garu to Telugu. My heartfelt wishes to my hattrick producer @vamsi84 n @sitharaents , each and everyone from the Team #Sir pic.twitter.com/HcYFzxydrt — nithiin (@actor_nithiin) February 16, 2023 -
టాలీవుడ్ డైరెక్టర్స్ కోసం కోలీవుడ్ స్టార్స్ క్యూ
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ డైరెక్టర్స్ పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తున్నారు. మన దర్శకుల కోసం ఇతర భాషల హీరోలు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కోలీవుడ్ హీరో-టాలీవుడ్ డైరెక్టర్ కాంబోలో ఇటీవల వచ్చిన సినిమాల్లో ‘ప్రిన్స్’ మొదటిది. తెలుగు దర్శకుడు అనుదీప్ డైరెక్షన్ లో... తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమా.. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ, డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత కోలీవుడ్ లో టాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కించిన మూవీ - వారిసు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. సంక్రాంతి బరిలో దిగిన ఈ మూవీ కోలీవుడ్ లో 300 కోట్లు వసూళ్లు చేసింది. విజయ్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీగా వారిసు రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మరో తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి కోలీవుడ్ బాక్సాపీస్ దగ్గర సక్సెస్ అందుకునేందుకు రెడీ అయ్యాడు. తొలిప్రేమ, మజ్ను, రంగ్ దే సినిమాలతో ఆకట్టుకున్నఈ డైరెక్టర్.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ‘వాతి’ అనే మూవీ తెరకెక్కించాడు. ఈ సినిమా తెలుగులో సార్ పేరుతో ఈ నెల 17న రిలీజ్ చేయబోతున్నారు. ఎడ్యుకేషన్ మాఫీయా బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగు డైరెక్టర్ కోలీవుడ్లో ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటాడో చూడాలి. ధనుష్.. వెంకీ అట్లూరి తోనే కాకుండా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా నటించబోతున్నాడు. -
కళ్లు తిప్పుకోలేని అందం..అప్సరసలా మెరిసిపోయిన సంయక్త మీనన్ (ఫొటోలు)
-
సార్ మీ అందరి కథ – ధనుష్
‘‘సార్’ సినిమా అన్నివర్గాల వారికి నచ్చుతుంది. ఎందుకంటే ప్రేక్షకులు వాళ్ల కథతో కనెక్ట్ అవుతారు. ‘సార్’ మీ అందరి కథ.. మీకు నచ్చుతుందని, అందరూ ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది’’ అని హీరో ధనుష్ అన్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్, సంయుక్త మీనన్ జంటగా తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘సార్’ (తమిళంలో ‘వాతి’). శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారంవిడుదలకానుంది. హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ధనుష్ మాట్లాడుతూ– ‘‘2002లో నా తొలి చిత్రం విడుదలయినప్పుడు నెర్వస్గా ఉన్నా.. ఇప్పుడు 2023లో నా తొలి తెలుగు సినిమా రిలీజ్ అవుతోంది.. ఇప్పుడు కూడా అలాగే ఉంది. తమిళ్, హిందీ, ఇంగ్లిష్ సినిమాలు చేశాను.. ప్రతి సినిమాని నా మొదట దిగానే భావిస్తా. ‘సార్’ ఒక సింపుల్ ఫిల్మ్.. కానీ, గ్రాండ్ ఎమోషన్స్, మెసేజ్ ఉంటుంది. నా తర్వాతి తెలుగు సినిమాకి తప్పకుండా తెలుగులో మాట్లాడతాను’’ అన్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ–‘‘ఒక మనిషి జీవన శైలిని మార్చేది చదువు మాత్రమే. అంత గొప్ప ఆయుధాన్ని డబ్బులేని వాళ్లకి దూరం చేయడం ఎంత వరకు న్యాయం? అనే ప్రశ్నే ‘సార్’ సినిమాలో వెంకీ అడిగే ప్రయత్నం చేశాడు. భారతీయ సినిమా చరిత్రలో ఒకప్పటి తరంలో శివాజీ గణేశన్గారు, కమల్ హాసన్గారు, తెలుగులో ఎన్టీఆర్గారు, నాగేశ్వరరావుగారు.. ఇలా తొలి తరం నటుల్లో ఎంత గొప్పవారుఉన్నారో తర్వాతి తరం గొప్ప నటుల్లో ధనుష్కి నేను టాప్ ప్లేస్ ఇస్తాను.. ఎందుకంటే సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఆయనకు భయం లేదు. పని చేయడాన్ని మాత్రమే ఇష్టపడతాడు. అలా పనిచేసుకుంటూ పోయే ధనుష్ని ఎవరూ ఆపలేరు’’ అన్నారు. ‘‘మా సార్’ చిత్రం ప్రీమియర్స్ ఒక రోజు ముందే వేస్తున్నామంటే సినిమాపై మాకు ఎంత నమ్మకం ఉందో జనాలకు ఇప్పటికే అర్థమై ఉంటుంది.. చాలా మంచి సినిమా ఇది.. ఎవరూ నిరుత్సాహపడరు’’ అన్నారు సూర్యదేవర నాగవంశీ. ‘‘నా ‘తొలి ప్రేమ’ సినిమా తర్వాత ఇంత నమ్మకంగా చెబుతున్నా. ‘సార్’ ప్రీమియర్స్ అయిన తర్వాత వచ్చే మౌత్ టాక్తో 17న అందరూ సినిమాకి వస్తారు’’ అన్నారు వెంకీ అట్లూరి. ఈ వేడుకలో నిర్మాత ఎస్.రాధాకృష్ణ, కెమెరామేన్ జె.యువరాజ్, నటుడు సాయికుమార్, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి పాల్గొన్నారు. -
ఇప్పుడు ఇండియన్ సినిమా అంటున్నారు: ధనుష్
‘‘ఒకప్పుడు తెలుగు సినిమా, తమిళ సినిమా, కన్నడ సినిమా, హిందీ సినిమా.. అనేవాళ్లు. ఇప్పుడు ఇండియన్ సినిమా అనడం సంతోషించదగ్గ విషయం’’ అని హీరో ధనుష్ అన్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘సార్’(తెలుగు), ‘వాత్తి’ (తమిళం). శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ట్రైలర్ విడుదల చేశారు. ధనుష్ మాట్లాడుతూ– ‘‘సార్’ నా మొదటి తెలుగు సినిమా.. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు వెంకీ అట్లూరిగారికి థ్యాంక్స్. అలాగే నిర్మాతలు చినబాబు, నాగవంశీగార్లకు, డైరెక్టర్ త్రివిక్రమ్గారికి కృతజ్ఞతలు’’ అన్నారు. వెంకీ అట్లూరి మాట్లాడుతూ– ‘‘లాక్డౌన్ సమయంలో ఈ కథని వంశీగారికి వినిపించగా ఆయనకు నచ్చింది. ధనుష్గారు ఈ మూవీ చేసినా చేయకపోయినా ఆయనకు కథ చెప్పానన్న సంతృప్తి చాలనుకున్నాను. కానీ, ఆయన కథ వినగానే చేస్తాననడంతో ఆనందంతో మాటలు రాలేదు’’ అన్నారు. -
పెళ్లికి ఆ డ్రెస్లో వస్తావా? కీర్తి సురేశ్పై ట్రోలింగ్
తొలి ప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి పెళ్లిలో తళుక్కుమని మెరిసింది హీరోయిన్ కీర్తి సురేశ్. రంగురంగుల లెహంగాలో నూతన వధూవరులతో ఫోటోలు దిగింది. కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్తూ వారితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు కీర్తి.. ఇంద్రధనస్సును నేలకు తెచ్చిందంటూ మురిపెంగా కామెంట్లు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం అబ్బే.. తన ఫ్యాషన్ సెన్స్ చండాలంగా ఉందని విమర్శిస్తున్నారు. టెంట్ను డ్రెస్గా కుట్టించుకుందని సెటైర్లు విసురుతున్నారు. 'నీ డ్రెస్సింగ్ సెన్స్ తెగ నచ్చేది. కానీ ఈ సారి మాత్రం మైనస్ 1 మార్క్ ఇస్తున్నా', 'షామియానా లెహంగా..', 'మరేం అనుకోనంటే ఓ మంచి స్టైలిష్ను పెట్టుకోవచ్చుగా', 'ఆ డిజైనర్ను చంపేయ్ కీర్తి', 'పాపం అవకాశాల్లేక ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటోంది' అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Congratulations Venkyyyy Swamy and Pooja! May god shower all the love on you both for this new beginning! 🤗♥️♥️ pic.twitter.com/wp82WEXRjb — Keerthy Suresh (@KeerthyOfficial) February 1, 2023 Papam chances levu ga andhuke ee dresses 🤣 — HeathLedger (@HeathLedger150) February 1, 2023 Always liked yr dressing sense.. but this is -1/10 — a happy soul 💃 (@angelhere2022) February 1, 2023 Very nice outfit 👌 Marriage ki ilanti outfit design cheyyadame rotha ante nuv adhi veskelladam rotha pro max 🫡🤡 Urgent ga stylist/designer ni change chesey plox 🤡 — ɴ ᴀ ᴠ ᴇ ᴇ ɴ (@Naveen_Tweetz_) February 1, 2023 Keerthi fans r very disappointed with this Dress. — Gadidesi Venkateswarlu (@GVRgadidesivhp) February 1, 2023 @KeerthyOfficial please do one thing for your own sanity. Shoot 🔫 your designer 🤢 — Wednesday Walnut (@WednesdayWalnut) February 1, 2023 -
ధనుష్ ‘సార్’ వచ్చేస్తున్నాడు
నటుడు ధనుష్ ఇటీవల నటించిన చిత్రం తిరుచ్చిట్రం ఫలం. నిత్యామీనన్ కథానాయకిగా నటించిన ఇందులో ప్రియా భవానీశంకర్, రాశీఖన్నా అతిథులుగా మెరిశారు. మిత్రన్ జవహర్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కాగా ప్రస్తుతం ధనుష్ తమిళం, తెలుగు భాషల్లో నటించిన చిత్రం వాతి. తెలుగులో సార్ పేరుతో తెరకెక్కింది. సంయుక్త మీనన్ నాయకిగా నటించారు. దర్శకుడు సముద్రఖని, రాజేంద్రన్, సాయికుమార్, ఆడుగళం నరేన్, తణికెళ్ల భరణి, హైపర్ ఆది, తోటపల్లి మధు, ఇళవరసు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. జీవీ.ప్రకాశ్కుమార్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని పాటలు ఇటీవల విడుదలై మంచి హిట్ అయ్యాయి. దీన్ని తమిళనాడు విడుదల హక్కులను 7 స్క్రీన్ స్టూడియో అధినేత ఎస్ఎస్.లలిత్కుమార్ పొందారు. ఈయన ప్రస్తుతం విజయ్ హీరోగా ఆయన 67వ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీంతో వాతి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలో ఈ నెల 4వ తేదీ భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కాగా చిత్రాన్ని 17వ తేదీ విడుదల చేస్తున్నట్లు ఇప్పుటికే నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. -
దర్శకుడు వెంకీ అట్లూరి పెళ్లిలో తారల సందడి.. ఫోటోలు వైరల్
-
పెళ్లిపీటలెక్కిన దర్శకుడు, ఫోటో వైరల్
ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి ఓ ఇంటివాడయ్యాడు. పూజ అనే అమ్మాయితో ఏడడుగులు నడిచాడు. ఈ వివాహానికి హీరో నితిన్ తన భార్య శాలినితో కలిసి హాజరయ్యాడు. అలాగే హీరోయిన్ కీర్తి సురేశ్, డైరెక్టర్ వెంకీ కుడుముల సైతం ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లి వార్తను నితిన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. 'జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్న వెంకీకి శుభాకాంక్షలు. వెంకీ- పూజ.. ఆనందకరమైన జీవితం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని నితిన్ ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చాడు. వెంకీ పెళ్లికి హాజరైన ఫోటోను దీనికి జత చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా వెంకీ అట్లూరి.. రంగ్దే, మిస్టర్ మజ్ను, తొలి ప్రేమ వంటి చిత్రాలను తెరకెక్కించి డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతడు ధనుష్తో సార్ అనే సినిమా చేస్తున్నాడు. View this post on Instagram A post shared by N I T H I I N (@actor_nithiin) -
సీక్రెట్గా నిశ్చితార్థం చేసుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి
-
సీక్రెట్గా నిశ్చితార్థం చేసుకున్న యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి, ఫొటోలు వైరల్
ప్రముఖ నటుడు, డైరెక్టర్ వెంకీ అట్లూరి ఓ ఇంటివాడు కాబోతున్నాడు. పూజా అనే అమ్మాయితో త్వరలో ఆయన ఏడడుగులు వేయబోతున్నాడు. కొద్దిమంది ఇండస్ట్రీ సన్నిహితుల మధ్య సీక్రెట్గా, నిరాండబరంగా వెంకీ అట్లూరీ నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయనే స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియా వైరల్గా మారాయి. వెంకీ అల్లూరీ నిశ్చితార్థం ఫొటోలు చూసి సినీ నటీనటుల, ప్రముఖు, ఫాలోవర్స్ నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఈ వేడుకు ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ భార్య, మహానటి, సీతారామం చిత్రాల నిర్మాత స్వప్నదత్తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. కాగా వెంకీ అల్లూరి జ్ఞాపకం అనే చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత స్నేహగీతం చిత్రంలో నటించడమే కాకుండా ఈ మూవీకి డైలాగ్స్ అందించాడు. ఆ తర్వాత కేరింత, ఇట్స్ మై లవ్స్టోరీ చిత్రాలకు రైటర్గా పనిచేశాడు. ఇక వరుణ్ తేజ్-రాశిఖన్నా తొలిప్రేమ మూవీతో డైరెక్టర్గా మారి తొలి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, రంగ్దే చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో ధనుష్తో సార్ మూవీ చేస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. చదవండి: ఎయిర్పోర్టులో తారక్, మళ్లీ ఫ్యామిలీతో విదేశాలకు! నిరాశలో ప్యాన్స్ మహేశ్ బాబు భార్య నమ్రత కొత్త రెస్టారెంట్, రేట్స్ ఎలా ఉన్నాయంటే..! -
ప్రేక్షకులకు పాఠాలు చెప్పేందుకు రెడీ అయిన ధనుష్
కోలీవుడ్ స్టార్ ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సార్. ఇది తమిళంలో వాతి పేరిట రూపొందుతోంది. విద్యావ్యవస్థలోని లోపాలను సరి చేయాలనుకునే మాస్టారుగా ధనుష్ కనిపించనున్నాడు. ఈ సినిమాకు తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్ చేస్తున్నాడు. సంయుక్తా మీనన్ హీరోయిన్. తాజాగా ఈ సార్ ప్రేక్షకులకు పాఠాలు చెప్పేందుకు ఎప్పుడు రెడీ అవుతున్నాడో చెప్పేశారు. సార్ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించారు. ఫిబ్రవరి 17న సార్ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. కాగా ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. #Vaathi / #SIR Movie going to hit the theaters on 17 Feb 2023. ♥️#VaathiOn17Feb / #SIROn17Feb@dhanushkraja #VenkyAtluri @iamsamyuktha_ @gvprakash @dopyuvraj @NavinNooli @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios @adityamusic @AdityaTamil_ pic.twitter.com/69YOuvpEqs— Sithara Entertainments (@SitharaEnts) November 17, 2022 చదవండి: అతిలోక సుందరి శ్రీదేవి ఇల్లు చూశారా? ఎంత బాగుందో బ్రెయిన్ దగ్గర పెట్టుకుని మాట్లాడు.. రేవంత్కు ఆదిరెడ్డి వార్నింగ్ -
మాస్టారు... నా మనసును గెలిచారు
‘‘శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది. సీతకు మల్లే నీతో అడుగేసే మాటడిగింది. నీకు నువ్వే గుండెలోనే అన్నదంత విన్నాలే.. ’ అని ప్రేమగీతం పాడుకున్నారు సంయుక్తా మీనన్. ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న సినిమా ‘సార్’ (తమిళంలో ‘వాతి’). శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా నుంచి ‘మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు.. అచ్చం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను గురువారం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మాస్టారు ధనుష్ని ఉద్దేశించి సంయుక్త పాడే ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. తెలుగులో రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, శ్వేతా మోహన్ ఆలపించారు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. కాగా, ఈ పాట తమిళ వెర్షన్కు ధనుష్ సాహిత్యం అందించడం విశేషం. -
టీజర్: గట్టిగా క్లాసులు పీకిన ధనుష్ 'సార్'
స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సార్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తమిళంలో వాత్తి పేరిట రిలీజ్ కానుంది. ఈరోజు ధనుష్ బర్త్డే కావడంతో సార్ మూవీ టీజర్ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. జీరో ఫీజు.. జీరో ఎడ్యుకేషన్.. మోర్ ఫీజు.. మోర్ ఎడ్యుకేషన్.. ఇదేరా ఇప్పుడు ట్రెండ్.. అన్న డైలాగ్తో టీజర్ మొదలువుతుంది. ఆ తర్వాత యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. ఇక టీజర్లో ధనుష్ పాత్రను రివీల్ చేశారు. అతడి పేరు బాలగంగాధర్ తిలక్ అని, జూనియర్ లెక్చరర్గా నటించాడని హీరోనే స్వయంగా వెల్లడించాడు. 'విద్య అనేది గుడిలో దేవుడికి పెట్టే నైవేద్యంతో సమానం సర్.. పంచండి, ఫైవ్స్టార్ హోటల్లో డిష్లాగా అమ్మకండి' అని హీరో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. టీజర్ చూస్తుంటే విద్యావ్యవస్థలో ఉన్న లోపాను ఎత్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. సాయికుమార్, తనికెళ్ల భరణి, సముద్ర ఖని, తోటపల్లి మధు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్లతో కలిసి సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ధనుష్కు ఇది తొలి తెలుగు స్ట్రయిట్ ఫిలిం కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. చదవండి: విక్రాంత్ రోణ సినిమా రివ్యూ 'ఇంద్ర' సినిమాలో అందుకే నటించలేదు: పరుచూరి గోపాలకృష్ణ -
త్రివిక్రమ్ క్లాప్తో ధనుష్ సినిమా మొదలు (ఫోటోలు)
-
ధనుష్ తొలి తెలుగు సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్
కోలివుడ్ స్టార్ ధనుష్ తొలి తెలుగు సినిమా టైటిల్ వచ్చేసింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి ‘సార్’అని నామకరణం చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. తమిళంలో ‘వాతి’అనే టైటిల్తో తెరకెక్కుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మించనున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సంయుక్త హీరోయిన్గా నటిస్తోంది. ఈ విషయాలను తెలియజేస్తూ మేకర్స్ ఓ మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. టైటిల్ ను బట్టి చూస్తుంటే ఈ సినిమాలో ధనుష్ టీచర్ గా కనిపించనున్నాడని తెలుస్తుంది. కాగా, ధనుష్ ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయనున్నాడు. -
మరో తెలుగు సినిమాకు ధనుష్ గ్రీన్సిగ్నల్.. డైరెక్టర్ ఎవరంటే..
కోలీవుడ్ స్టార్ ధనుష్ ప్రస్తుతం యమ జోరుమీదున్నారు. ‘కర్ణన్’, ‘జగమేతంత్రం’ సినిమాలతో ఆకట్టుకున్న ధనుష్ ఇప్పుడు టాలీవుడ్పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. విభిన్నమైన పాత్రలతో తమిళంతో పాటు తెలుగులోనూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్న ధనుష్ ప్రస్తుతం తెలుగులో ఓ ప్రాజెక్టుకు ఓకే చెప్పేశాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమాను ధనుష్ సైన్ చేసిన సంగతి తెలిసిందే. తమిళనాడు రాజకీయాలతో ముడిపడిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. ఇక ధనుష్ నటిస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. అయితే ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభించకముందే మరో తెలుగు మూవీకి ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ సినిమాలతో ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ప్రాజెక్టుకు ధనుష్ ఇటీవలె పచ్చజెండా ఊపినట్లు ఫిల్మ్ నగర్ టాక్. లవ్ స్టోరీ కథాంశంగా ఈ మూవీ తెరకెక్కనుందని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. దీనికి సంబంధించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. చదవండి : కొత్తింటి కోసం ధనుష్ ఎంత ఖర్చు చేస్తున్నాడో తెలుసా? లోకల్ ట్రైన్లో రజనీ అలా.. ఫోటోలు లీక్.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ -
‘నాకన్నా నితిన్, కీర్తి ఎక్కువ నమ్మారు’
‘‘నా జీవితంలోని ప్రేమకథలనే నేను సినిమాలుగా తీస్తున్నానని కొందరు అంటారు. అది కరెక్ట్ కాదు. నా జీవితంలో ప్రేమకథలే లేవు. నా తొలి రెండు చిత్రాలు ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’లో ఎంటర్టైన్ మెంట్ ఎక్కువగా ఉంటుంది. ‘రంగ్ దే’లో హ్యూమన్ ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి’’ అన్నారు వెంకీ అట్లూరి. నితిన్, కీర్తీ సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘రంగ్ దే’ నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా వెంకీ అట్లూరి చెప్పిన విశేషాలు. ► ‘రంగ్ దే’ కథను నితిన్ కు చెప్పినప్పుడు ఆయన కమర్షియల్ సినిమా ‘భీష్మ’ చేస్తున్నారు. అలాగే ‘పవర్పేట’ అనే ఓ పొలిటికల్ మూవీ కమిటయ్యారు. ఈ సమయంలో నా కథకు ఓకే చెబుతారా? అనిపించింది. కానీ ఓకే అన్నారు. ఫస్ట్ సిట్టింగ్లోనే నితిన్, కీర్తి సినిమాకు ఓకే చెప్పారు. ఈ కథను ఇద్దరూ నాకన్నా ఎక్కువగా నమ్మారు. వారి నమ్మకం నాలో ధైర్యాన్ని పెంచింది. ► పక్క పక్క ఇళ్లల్లో ఉండే ఓ అమ్మాయి, అబ్బాయిల మధ్య చదువు, కెరీర్... ఇలా ప్రతి విషయంలోనూ పోలిక పెడుతుంటారు. అందుకే మొదట్లో ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండదు. కానీ ఆ తర్వాత ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? అన్నదే ‘రంగ్ దే’ కథ. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్కి కనెక్ట్ అయ్యే సినిమా ఇది. కెమెరా మ్యాన్ పీసీ శ్రీరామ్గారితో వర్క్ చేయడం వల్ల దర్శకుడిగా మెరుగయ్యాను. నా తర్వాతి సినిమాను సితార, ‘దిల్’ రాజు నిర్మాణ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. -
వాళ్లిద్దరూ హ్యాండిచ్చారు : నితిన్
‘‘కర్నూలుకు రావడం ఇదే తొలిసారి. కర్నూలు అంటే నాకు గుర్తొచ్చేది కొండారెడ్డి బురుజు. అక్కడ తీసిన సినిమాలు హిట్టయ్యాయి. ఆ ప్రదేశం ఎంత పవర్ఫుల్లో మీరూ (కర్నూలువాసులను ఉద్దేశించి) అంతే పవర్ఫుల్గా ఉన్నారు’’ అని హీరో నితిన్ అన్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్, కీర్తీ సురేష్ జంటగా నటించిన చిత్రం ‘రంగ్ దే’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకను కర్నూలులో నిర్వహించారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, డీజీ భరత్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ‘‘రంగ్ దే’ ఘనవిజయం సాధించాలి. కర్నూలుకు తరచూ వచ్చి సినిమా షూటింగ్స్ చేయాలని నితిన్ను కోరుతున్నాం’’ అన్నారు హఫీజ్ ఖాన్, సుధాకర్. నితిన్ మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ విడుదలకు కీర్తీ సురేశ్, వెంకీ అట్లూరి రావాల్సింది.. కానీ ఇద్దరూ హ్యాండిచ్చారు. రాయలసీమ అంటే మాస్, ఫ్యాక్షన్ అంటారు. కానీ ఆ రెండింటి కంటే కూడా మీలో ఎక్కువ ప్రేమ ఉంది. ఇదే ప్రేమతో మా సినిమా చూసి, హిట్టివ్వండి’’ అన్నారు. ‘‘మా సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నాగవంశీ. -
దర్శకుడి వెంటపడి చితకబాదిన హీరోయిన్
నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న చిత్రం 'రంగ్ దే'. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. కోవిడ్ బ్రేక్ తర్వాత ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కొన్ని పాటల చిత్రీకరణ కోసం యూనిట్ దుబాయ్కి వెళ్లింది. ఈ క్రమంలో సినిమా సెట్లో 'మహానటి' కీర్తి సురేశ్ కాసేపు కునుకు తీస్తుండగా డైరెక్టర్ వెంకీతో కలిసి నితిన్ ఆమె వెనకాల చేరి సెల్ఫీ దిగారు. అనంతరం దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. షూటింగ్తో తమకు చెమటలు పడుతుంటే కీర్తి మాత్రం హ్యాపీగా రిలాక్స్ అవుతోందని నితిన్ అక్కసు వెళ్లగక్కారు. (చదవండి: సన్నీ డియోల్కు కరోనా) ఈ ఫొటో నెట్టింట వైరల్ కాగా కీర్తి సైతం స్పందించారు. షూటింగ్ సెట్లో ఎప్పుడూ నిద్రపోకూడదన్న గుణపాఠం నేర్చుకున్నానని, కానీ డైరెక్టర్, హీరోపై మాత్రం పగ తీర్చుకుంటానని శపథం చేశారు. అన్నట్లుగానే ఆమె ఈ ఇద్దరిలో ఒకరిపై తొందరగానే పగ తీర్చుకున్నట్లు కనిపిస్తోంది. చేతికి ఓ గొడుగు దొరకడంతో వెంకీ అట్లూరిని కీర్తి చితకబాదారు. ఆయనను పరిగెత్తించి మరీ కొట్టారు. అయితే అదంతా సరదాగానే చేశారు. ఇక నితిన్ ఒక్కడే మిగిలాడని, అతనిపై ప్రతీకారం తీర్చుకుంటే కానీ తన పగ చల్లారదంటున్నారు. చూస్తుంటే నితిన్ కూడా ఏదో ఒక రోజు ఆమె చేతిలో అడ్డంగా దొరికిపోతాడని అనిపిస్తోంది. కాగా రంగ్ దే సినిమాను చిత్రబృందం సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తోంది. (చదవండి: భాష లేని ఊసులాట!) -
ఏమిటో ఇది వివరించలేనిది.. మాయ చేసిన దేవిశ్రీ
యంగ్ హీరో నితిన్, ‘మహానటి’ కిర్తి సురేష్ జంటగానటిస్తున్న చిత్రం ‘రంగ్దే’.. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నితిన్ వెడ్డింగ్ సందర్భంగా ‘రంగ్ దే` నుంచి విడుదల చేసిన చిన్న వీడియోకి విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా తొలి పాటను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. `ఏమిటో ఇది వివరించలేనిది.. మది ఆగమన్నది తనువాగనన్నది.. భాష లేని ఊసూలాట సాగుతున్నది. అందుకే ఈ మౌనమే భాష ఐనది’ అంటూ సాగే ఈ మెలోడీ గీతానికి శ్రీమణి సాహిత్యం అందించగా.. హరిప్రియ, కపిల్ కపిలన్ ఆలపించారు. రాక్స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. చాలా నెమ్మదిగా సాగే ఈ మెలోడీ సాంగ్ని వెండితెరపై ప్రేక్షకులకు కనువిందు కలిగించేలా చిత్రీకరించనట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల కాలంలో డీఎస్పీ నుంచి ఇలాంటి మెలోడీ సాంగ్ రాలేదనే చెప్పాలి. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. (చదండి : ఫ్రెండ్స్తో స్టెప్పులేసిన స్టార్ హీరో కూతురు) -
‘నాన్నా నవ్వుతోంది.. నేను కట్టలేను’
హీరో నితిన్ మరి కొద్ది గంటల్లో తన ప్రేయసి షాలిని కందుకూరి మెడలో మూడు మూళ్లు వేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నితిన్ తాజా చిత్రం రంగ్దే టీమ్ ప్రత్యేక బహుమతి ఇవ్వనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చిత్ర బృందం.. ఆదివారం సాయంత్రం రంగ్దే టీజర్ను విడుదల చేసింది. నితిన్కు వివాహ శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ టీజర్పై స్పందించిన.. ఈరోజు మరింత స్పెషల్గా చేసినందుకు రంగ్దే టీమ్కు థ్యాంక్స్ చెప్పారు. కాగా, ఈ చిత్రంలో నితిన్ సరసన కీర్తీ సురేశ్ కథానాయికగా నటిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.(మెహందీలో మెరిసిన షాలిని-నితిన్) ఈ టీజర్లో నితిన్ తన తండ్రి నిర్ణయం మేరకు కీర్తి సురేష్ను పెళ్లి చేసుకున్నట్టు, పెళ్లి తర్వాత ఇంటి పనులు చేయడంతో బిజీ అయినట్టు చూపించారు. ఇందులో ‘అది నా గర్ల్ ఫ్రెండ్ కాదు’, ‘చేయి తీయ్ జస్టిస్ చౌదరి’, ‘నాన్న నవ్వుతుంది.. నేను కట్టలేను’ అంటూ నితిన్ చెప్పే డైలాగ్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. మరోవైపు వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావిస్తున్నట్టు చిత్ర బృందం పేర్కొంది. (పెళ్లి సందడి షురూ) మరోవైపు నితిన్-షాలిని పెళ్లి వేడుకకు అంతా సిద్ధమైంది. ఈ రోజు రాత్రి 8.30 గంటలకు వీరిద్దరు వివాహ బంధంతో ఒకటి కానున్నారు. నగరంలోని తాజ్ ఫలక్నుమాలో ఈ వేడుక జరగనుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇరు కుటుంబాలతో పాటుగా, అతికొద్ది మంది సన్నితులు, అతిథులు ఈ పెళ్లి వేడుకకు హాజరు కానున్నారు. -
అను, అర్జున్ల పరిచయం అదిరింది
యంగ్ హీరో నితిన్, ‘మహానటి’ కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘రంగ్ దే!’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. విజయదశమి పర్వదినాన ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంది. అయితే కరోనా లాక్డౌన్తో సినిమా షెడ్యూల్ వాయిదా పడింది. అయితే రేపు(మార్చి 30) హీరో నితిన్ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్కు చిత్ర బృందం చిన్న ట్రీట్ ఇచ్చింది. నితిన్ బర్త్డే కానుకగా ‘రంగ్ దే’ చిత్ర మోషన్ పోస్టర్ను విడుదల చేసింది. ఈ సందర్భంగా సినిమాలోని ప్రధాన పాత్రలైన అను, అర్జున్లను పరిచయం చేస్తూ ముస్తాబుచేసిన మోషన్ పోస్టర్ సినీ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా దేవిశ్రీప్రసాద్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్లో ఉంది. దీంతో ప్రస్తుతం ‘రంగ్ దే’మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య,గాయత్రి రఘురామ్,బ్రహ్మాజీ,వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,అభినవ్ గోమటం,సుహాస్, మాస్టర్ రోనిత్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. చదవండి: కరోనా ఎఫెక్ట్: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నితిన్ తెలుగు రాష్ట్రాలకు నితిన్ విరాళం -
నితిన్.. కీర్తి.. రంగ్ దే
దాదాపు ఏడాది పాటు కెమెరాకు దూరంగా ఉన్నారు నితిన్. ‘శ్రీనివాస కల్యాణం’ తర్వాత స్క్రీన్పై కనిపించలేదు. ఇప్పుడు వరుస సినిమాలు అనౌన్స్ చేసి తీసుకున్న విరామాన్ని వడ్డీతో సహా తీర్చేస్తున్నారు. ఆల్రెడీ ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుములతో ‘భీష్మ’ సినిమా మొదలుపెట్టారు. మొన్నే చంద్రశేఖర్ యేలేటి సినిమాకు ముహూర్తం పెట్టారు. తాజాగా వెంకీ అట్లూరితో సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి ‘రంగ్ దే!’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. కీర్తీ సురేశ్ కథానాయిక. నితిన్, కీర్తీ కలసి యాక్ట్ చేయడం ఇది తొలిసారి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై పీడీవీ ప్రసాద్, నాగవంశీ నిర్మించనున్నారు. ఈ సినిమాకు పీసీ శ్రీరామ్ కెమెరామేన్. 2020 సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. మరోవైపు కృష్ణచైతన్య దర్శకత్వంలో ఓ సినిమా కూడా కమిట్ అయిన సంగతి తెలిసిందే. -
జెట్ స్పీడ్లో దూసుకుపోతున్న నితిన్
ఓ వైపు భీష్మ షూటింగ్తో బిజీగా ఉన్నాడు.. నిన్ననే మరో చిత్రానికి కొబ్బరికాయ కొట్టేశాడు.. నేడు మరో చిత్రాన్ని అనౌన్స్ చేసేశాడు హీరో నితిన్. వరుస చిత్రాలతో బిజీ బిజీగా ఉన్న ఈ హీరో ప్రస్తుతం కీర్తి సురేష్తో జోడి కట్టనున్నాడు. తాజాగా ఈ కొత్త చిత్ర విశేషాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ చిత్ర షూటింగ్ను ప్రారంభించగా.. చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో మరో సినిమాను ఆదివారం ప్రారంభించాడు నితిన్. తాజాగా వెంకీ అట్లూరితో కలిసి చేయబోయే కొత్త సినిమా కబుర్లను అభిమానులతో పంచుకున్నాడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించనుందని, ఈ సినిమాకు రంగ్దే అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు తెలిపాడు. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ నిర్మించగా.. సినిమాటోగ్రఫర్గా పీసీ శ్రీరామ్ పనిచేయనున్నారు. #Nithiin29 is titled as RANG DE! Working with the Young n talented dir Venky atluri, costarring @KeerthyOfficial n produced by @vamsi84 @SitharaEnts AND cinematography by my ALL TIME FAV D.o.P @pcsreeram sir 😍😍😍😍😍😍😍 #RangDe #gimmesomelove pic.twitter.com/NeaO2rllRB — nithiin (@actor_nithiin) June 24, 2019 -
నితిన్కు జోడిగా ‘మహానటి’?
శ్రీనివాస కళ్యాణం బోల్తాకొట్టడంతో ఆచితూచి ప్రాజెక్ట్లను ఓకే చేస్తున్నాడు హీరో నితిన్. అఆ తరువాత ఆ రేంజ్ హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం యువ దర్శకుడు వెంకీ కుడుములతో భీష్మ చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నాడు. మహానటితో కీర్తి సురేష్ ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్లో ఓ రేంజ్లో క్రేజ్ సంపాదించుకుంది. అయితే మహానటి సినిమా తరువాత తెలుగులో ఇప్పటివరకు మరో చిత్రానికి ఓకే చెప్పలేదు. ప్రస్తుతం కీర్తి బోనీ కపూర్ తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో నటించనుంది. ఇదికాకుండా తమిళ,తెలుగు ద్విభాషా చిత్రానికి కూడా ఓకే చెప్పినట్లు టాక్. అయితే తాజాగా తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి చెప్పిన కథ కీర్తికి నచ్చిందని.. ఆ చిత్రంలో నటించేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఈ చిత్రంలో నితిన్కు జోడిగా కీర్తి సురేష్ నటించనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ చిత్రంపై ఇప్పటివరకు హీరోగానీ, హీరోయిన్గానీ అధికారికంగా స్పందించలేదు. -
విజయవాడలో మిస్టర్ మజ్ను విజయయాత్ర
-
‘ఆ కామెంట్స్ ఎవరు చేస్తున్నారనేది ముఖ్యం’
‘‘నేను పుట్టింది హైదరాబాద్లో. మా గ్రాండ్ మదర్ ఇక్కడే ఉన్నారు. హైదరాబాద్లో మాకు దాదాపు 500 మంది బంధువులున్నారు. ఐ లవ్ హైదరాబాద్. మై ఫేవరెట్ ప్లేస్ ఇది. తెలుగు మాట్లాడగలను కానీ పూర్తి స్థాయిలో రాదు. తప్పులు దొర్లుతుంటాయి (నవ్వుతూ)’’ అని నిధీ అగర్వాల్ అన్నారు. అఖిల్, నిధీ అగర్వాల్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ మజ్ను’. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా నిధీ అగర్వాల్ పంచుకున్న విశేషాలు. తెలుగులో నాగచైతన్యతో ‘సవ్యసాచి’ మూవీ చేశా. ఇప్పుడు అఖిల్తో ‘మిస్టర్ మజ్ను’లో నటించా. చైతన్య, అఖిల్ ఇద్దరూ ఇద్దరే. మంచి కో స్టార్స్. ఇద్దరికీ ఎందులోనూ పోలిక ఉండదు. ఒకరు నీరు అయితే మరొకరు నిప్పు. కానీ, ఇద్దరూ చాలా క్రమశిక్షణగా ఉంటారు. వారితో పని చేయడం గొప్ప అనుభూతి. ‘మిస్టర్ మజ్ను’కి వస్తున్న స్పందన చూసి టీమ్ అంతా చాలా సంతోషంగా ఉంది. నాకు సంతృప్తి ఇచ్చిన సినిమా ఇది. సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను మేం అధిగమించాం. ఈ చిత్రంలోని నిక్కీ పాత్ర నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే నిజ జీవితంలో నేను నిక్కీలా ఉండను. ఈ పాత్ర నాకు పూర్తి ఆపోజిట్గా ఉంటుంది. ‘మిస్టర్ మజ్ను’ చిత్రంలో ఇంట్రవెల్, క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు చాలా ముఖ్యమైనవి. చాలా ఎమోషనల్గా ఉంటాయి. ఆ సన్నివేశాలు చూసి చాలా మంది ఏడ్చేస్తారు. కొందరు నాకు ఫోన్ చేసి థియేటర్లో మా వాళ్లు ఏడ్చేశారు అని చెబుతుంటే సంతోషంగా అనిపించింది. డైరెక్టర్ వెంకీ రైటింగ్ టఫ్. ‘సవ్యసాచి’ సినిమాలో నటించడం ఈజీగా అనిపించింది. అయితే ‘మిస్టర్ మజ్ను’ చిత్రం కొంచెం కష్టంగా అనిపించింది. ఇందులో పెద్ద పెద్ద డైలాగులున్నాయి. బాగా చదువుకుని, అర్థం చేసుకుని చెప్పేదాన్ని. ఎక్కువ టేక్లు తీసుకునేదాన్ని కాదు. ఈ సినిమా చూసి మా పేరెంట్స్ హ్యాపీ. ‘నువ్వు ఇంత బాగా నటిస్తావా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు’ అని అమ్మ అంది. అవే నాకు బెస్ట్ కాంప్లిమెంట్స్. నేను సింపుల్గా ఉంటాను. ‘మిస్టర్ మజ్ను’ చిత్రంలో చెప్పినట్టు రియల్ లైఫ్లో నాకు రాముడిలాంటివాడు దొరుకుతాడనే నమ్మకం ఉంది (నవ్వుతూ). నా ముఖం కొంచెం అమాయకంగా ఉంటుంది. అందుకే అలాంటి పాత్రలు వస్తున్నాయేమో అనిపిస్తోంది. నాకు డ్యాన్స్ అంటే ప్రాణం. అన్ని రకాల నృత్యాలు నేర్చుకున్నా. బాగా డ్యాన్స్ చేయడం నా బలం కూడా. ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకు నచ్చిన రోల్స్ చేసే స్టేజ్కి వచ్చానని అనుకోవట్లేదు. కానీ, ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత ఒకేరకమైన పాత్రలు కాకుండా వైవిధ్యమైన రోల్స్పై దృష్టి పెడతా. పూరి జగన్నాథ్గారిలాంటి పెద్ద డైరెక్టర్ సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కథ వినగానే చాలా ఎగై్జటింగ్గా అనిపించింది. వెరీ ఇంట్రెస్టింగ్ రోల్ నాది. ఫిబ్రవరిలో ఆ సినిమా షూటింగ్లో జాయిన్ అవుతాను. నెగటివ్ కామెంట్స్ని పాజిటివ్గా తీసుకుంటా. అయితే ఆ కామెంట్స్ ఎవరు చేస్తున్నారనేది ముఖ్యం. రైట్ పర్సన్స్ నుంచి వచ్చిన కామెంట్స్నే పట్టించుకుంటా. ‘మిస్టర్ మజ్ను’కి మాత్రం 100కి 95% పాజిటివ్ కామెంట్సే వచ్చాయి. ఇంతకంటే ఇంకా ఏం కావాలి? తెలుగులో నేను చూసిన మొదటి సినిమా ‘అర్జున్ రెడ్డి’. ‘సవ్యసాచి’ షూటింగ్లో ఉన్నప్పుడు నాగచైతన్య చెబితే ఆ సినిమా చూశా. చాలా బాగా నచ్చింది. అందుకే ఆ సినిమాను 4 సార్లు చూశాను. అవకాశం దొరికితే ఆ సినిమాలో ‘అర్జున్ రెడ్డి’ పాత్ర చేయాలనుంది. రాజమౌళిగారితో పని చేయాలన్నది నా కల. తెలుగులో త్రివిక్రమ్గారు, వెంకీ అట్లూరి.. ఇలా ఇంకా చాలా మంది మంచి డైరెక్టర్లు ఉన్నారు. శ్రీదేవి, రేఖ, దీపికా పదుకోన్లాంటి వారు గ్లామర్ రోల్స్తో పాటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేశారు. వారిలాగా చేయాలనుంది. తెలుగులో అవకాశాలొస్తున్నాయి కానీ తొందరపడటం లేదు. ఇప్పటి వరకూ ‘మిస్టర్ మజ్ను’ చిత్రంపైనే ఫోకస్ పెట్టాను. ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’. కథ, నా పాత్రకి ఇంపార్టెన్స్ ఉండే పాత్రలు చేయాలనుకుంటున్నా. -
‘Mr మజ్ను’ మూవీ రివ్యూ
టైటిల్ : Mr మజ్ను జానర్ : రొమాంటిక్ ఎంటర్టైనర్ తారాగణం : అఖిల్ అక్కినేని, నిధి అగర్వాల్, నాగబాబు, సుబ్బరాజు, ప్రియదర్శి సంగీతం : ఎస్ తమన్ దర్శకత్వం : వెంకీ అట్లూరి నిర్మాత : బీవీయస్ఎన్ ప్రసాద్ తొలి సినిమాతోనే అక్కినేని అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన అఖిల్, రెండో సినిమా హలోతో కాస్త పరవాలేదనిపించుకున్నాడు. అయితే తన మీద ఉన్న అంచనాలను మాత్రం అందుకోలేకపోయాడు. దీంతో మూడో సినిమాగా తన వయసుకు తగ్గ రొమాంటిక్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తొలిప్రేమ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి, అఖిల్ను ప్లేబాయ్గా చూపించాడు. మరి ఈ ఎమోషనల్ లవ్స్టోరితో అయినా అఖిల్ సక్సెస్ అందుకున్నాడా..? దర్శకుడు వెంకీ అట్లూరి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడా..? కథ : మూడో ప్రయత్నంగా అఖిల్ తెలుగు తెర మీద చాలా సార్లు చూసిన రొటీన్ ప్రేమకథను ఎంచుకున్నాడు. విక్రమ్ కృష్ణ అలియాస్ విక్కీ (అఖిల్ అక్కినేని) లండన్లో ప్లేబాయ్లా అమ్మాయిలతో సరదాగా గడుపుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. అమ్మాయిల విషయంలో ఎలా ఉన్నా విక్కీ వ్యక్తిత్వం నచ్చి నిఖిత అలియాస్ నిక్కీ (నిధి అగర్వాల్) అతడిని ఇష్టపడుతుంది. కానీ నిక్కీ ప్రేమను అర్థం చేసుకోలేని విక్కీ ఆమెను దూరం చేసుకుంటాడు. కానీ నిక్కీ దూరమైన తరువాత తాను కూడా నిఖితని ప్రేమిస్తున్న విషయం విక్కీకి అర్థమవుతుంది. దూరమైన ప్రేమ కోసం విక్కీ ఏంచేశాడు..? తిరిగి ఇద్దరు ఎలా కలుసుకున్నారు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : అఖిల్ తన వయసుకు తగ్గ పాత్రలో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో ప్లేబాయ్ తరహా పాత్రలో పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు. లుక్స్ పరంగా మన్మథుడిని గుర్తు చేశాడు. యాక్షన్ సీన్స్, డాన్స్లతోనూ ఆకట్టుకున్నాడు. నటన పరంగా ఎమోషనల్ సీన్స్లో కాస్త ఇబ్బంది పడినట్టుగా అనిపిస్తుంది. నిఖిత పాత్రలో నిధి అగర్వాల్ ఒదిగిపోయింది. అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. తెర మీద చాలా పాత్రలు కనిపించినా ఎవరికి పెద్దగా స్కోప్ లేదు. సితార, పవిత్ర లోకేష్, నాగబాబు, జయప్రకాష్, రావూ రమేష్ ఫ్యామిలీ ఎమోషన్స్తో ఆకట్టుకోగా సుబ్బారాజు, ప్రియదర్శి, హైపర్ ఆది కామెడీతో మెప్పించే ప్రయత్నం చేశారు. విశ్లేషణ : తొలిప్రేమ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి.. అఖిల్ కోసం రొటీన్ లవ్ స్టోరినే తీసుకున్నాడు. అయితే ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ రెండో ప్రయత్నంలో వెంకీ అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ సీన్స్తో బాగానే నడిపించినా.. సెకండ్ హాఫ్ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కథనం కూడా ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా సాగుతూ ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ అంత కన్విన్సింగ్గా అనిపించదు. రచయితగా మాత్రం వెంకీ తన మార్క్ చూపించాడు. చాలా డైలాగ్స్ గుర్తుండిపోయేలా ఉన్నాయి. జార్జ్ సీ విలియమ్స్ సినిమాటోగ్రఫి సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. హీరో హీరోయిన్లతో పాటు లండన్ అందాలను కూడా చాలా బాగా చూపించాడు. తమన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : అఖిల్ సినిమాటోగ్రఫి మైనస్ పాయింట్స్ : రొటీన్ స్టోరి సెకండ్ హాఫ్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
‘మిస్టర్ మజ్ను’ ప్రెస్మీట్
-
సెన్సేషనల్ స్టార్తో సెన్సిబుల్ డైరెక్టర్..!
అర్జున్ రెడ్డి, గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్లతో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు విజయ్ దేవరకొండ. మరోవైపు తొలిప్రేమ లాంటి ప్రేమ కథను తీసి తొలిప్రయత్నంలోనే డైరెక్టర్గా మంచి మార్కులు కొట్టేశాడు వెంకీ అట్లూరి. అయితే వీరిద్దరు కలిసి ఓ సినిమా చేయబోతున్నారనే వార్త ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం వెంకీ అట్లూరి మిస్టర్ మజ్నుతో మరోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్దమయ్యాడు. ఈ మూవీ తరువాత విజయ్తో ఓ సినిమాను చేసే అవకాశమున్నట్లు సమాచారం. విజయ్ ప్రస్తుతం డియర్ కామ్రేడ్తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దీని తరువాత మరో రెండు ప్రాజెక్ట్లపై దృష్టి పెట్టినా.. ఏది మొదలవుతుందో ఇంకా స్పష్టంగా ప్రకటించలేదు. డియర్ కామ్రేడ్ తరువాత వెంకీ అట్లూరితోనే సినిమా ఉండే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. -
‘మిస్టర్ మజ్ను’ మూవీ స్టిల్స్
-
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మజ్ను’
అఖిల్, హలో చిత్రాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా..మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు అఖిల్ అక్కినేని. మిస్టర్ మజ్ను అంటూ అభిమానులను పలకరించేందుకు సిద్దమయ్యాడు. తొలిప్రేమ లాంటి కూల్ హిట్ ఇచ్చిన వెంకీ అట్లూరి డైరెక్షన్లో రాబోతోన్న ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ ట్రెండింగ్లో ఉంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఒక్క కట్ లేకుండా ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ లభించిందని యూనిట్ తెలిపింది. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ జనవరి 25న ప్రేక్షకుల ముందుకురానుంది. -
‘నాకు అలా లవ్ చేయడం చేతకాదు’
చేసిన రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా.. ముచ్చటగా మూడోసారి తన లక్ను పరీక్షించుకునేందుకు సిద్దమయ్యాడు అక్కినేని వారసుడు అఖిల్. తొలిప్రేమతో హిట్ కొట్టిన వెంకీ అట్లూరితో కలిసి ‘మిస్టర్ మజ్ను’గా పలకరించేందుకు అఖిల్ సిద్దమయ్యాడు. ఇప్పటికే ఈ మూవీ టీజర్, సాంగ్స్తో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. నేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అతిథిగా విచ్చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. తొలిప్రేమను డిఫరెంట్గా తెరకెక్కించిన దర్శకుడు ఈ చిత్రాన్ని కూడా కొత్త తరహాలో రూపొందించినట్టు కనిపిస్తోంది. కథ పరంగా కొత్తదనం కనబడకపోయినా.. కథనంలో మాత్రం డైరెక్టర్ మార్క్ కనపడుతోంది. ట్రైలర్లో అఖిల్ చెప్పిన డైలాగ్లు బాగున్నాయి. ‘ నా కోసం ఎవరైనా ఏడిస్తే అది నా తప్పు కాదు. కానీ.. నావల్ల ఒక్కరు ఏడ్చినా అది కచ్చితంగా నా తప్పు అవుతుంది’ , ‘ఇప్పుడు లవ్ అంటే.. ముందు కొంచెం లవ్చేసుకుని, ఆ తర్వాత ఇంకొంచెం ఎక్కువగా లవ్చేసుకుని.. లాస్ట్లో పెళ్లి చేసుకుంటారు ఆ టైప్ లవ్వా.. నాకు అలా లవ్ చేయడం చేతకాదు’ అనే డైలాగ్లు హైలెట్ అయ్యాయి. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘మజ్ను’ ఈవెంట్కు ఎన్టీఆర్..!
‘అఖిల్’ సినిమాతో ఘోర పరాజయాన్ని చవిచూడగా.. హలో సినిమాతో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు అక్కినేని యువ హీరో అఖిల్. ఈసారి మాత్రం బ్లాక్బస్టర్ హిట్ కొట్టేందుకు ఈ యంగ్ హీరో రెడీ అవుతున్నాడు. ఓ డిఫరెంట్ లవ్స్టోరితో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ‘మిస్టర్ మజ్ను’ టీజర్, సాంగ్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు యంగ్టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. జనవరి 19న సాయంత్రం ఆరుగంటలకు హైదరాబాద్లో జరుగనున్న ఈ ఈవెంట్కు ఎన్టీఆర్ హాజరుకాబోతున్నారని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. తొలిప్రేమతో మంచి హిట్ను అందుకున్న వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. See you soon ! Thanks to my brother @tarak9999 for extending his support. Excited to share the stage with you :))) #MrMajnurprereleaseon19th #MrMajnu pic.twitter.com/ySIN37qNPm — Akhil Akkineni (@AkhilAkkineni8) January 17, 2019 -
డ్యాన్స్ మజ్ను డ్యాన్స్
పెళ్లికి ముందు సంగీత్లో సూపర్గా డ్యాన్స్ చేస్తున్నారు అఖిల్. మరి.. ఎవరి పెళ్లి అనేది ఈ నెల 25న థియేటర్స్లో తెలుస్తుంది. అఖిల్ హీరోగా ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘మిస్టర్ మజ్ను’. ఇందులో నిధీ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ పాట చిత్రీకరణ విదేశాల్లో జరుగుతోందని సమాచారం. ‘‘సంగీత్ సెలబ్రేషన్స్లో డ్యాన్స్ మొదలైంది. ఇంకా రెండు రోజులు సాగుతుందీ డ్యాన్స్’’ అని పేర్కొన్నారు అఖిల్. ఈ సినిమాను ఈ నెల 25న విడుదల చేయాలనుకుంటున్నారు. -
లవర్బాయ్ ఆఫ్ ది ఇయర్!
ప్రేమలో పీహేచ్డీ చేయాలనుకునే కొందరు లవర్బాయ్స్ కూడా ఓ మంచి అందమైన అమ్మాయికి ఫిదా అయిపోవాల్సిందే. అలాంటి అమ్మాయితో ప్రేమలో పడ్డ ఓ లవర్బాయ్ కథతో రూపొందుతున్న సినిమా ‘మిస్టర్ మజ్ను’. తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటిస్తున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ‘‘ఆల్రెడీ రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్లుక్, ‘ఏమైనదో.. ఏమైనదో’, ‘మిస్టర్. మజ్ను’ సాంగ్స్కు మంచి స్పందన లభిస్తోంది. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా టీజర్ను బుధవారం సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేయనున్నాం. లవర్ బాయ్ ఆఫ్ ది ఇయర్ ‘మిస్టర్ మజ్నుని’ కలుసుకోండి. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను జనవరి 25న విడుదల చేయబోతున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, ‘హైపర్’ ఆది ముఖ్య పాత్రలు చేసిన ఈ సినిమాకు తమన్ స్వరకర్త. -
‘ఏమైనదో..’ మిస్టర్ మజ్ను తొలి పాట
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మిస్టర్ మజ్ను. తొలి రెండు సినిమాలు నిరాశపరచటంతో అఖిల్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సవ్యసాచి ఫేం నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. తాజాగా తొలి పాటను విడుదల చేశారు. ఏమైనదో అంటూ సాగే ప్రణయ గీతం సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. తమన్ సంగీత సారధ్యంలో అర్మాన్ మాలిక్ ఆలపించిన ఈ గీతానికి శ్రీమణి సాహిత్యమందించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను జనవరిలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. -
ప్రేమ సందేశం
అఖిల్, నిధీ అగర్వాల్ ఇద్దరి ముందు తాగడానికి రెడీగా డ్రింక్, ఫుడ్ ఉన్నాయి. చేతిలో స్పూన్ ఉంది. కానీ వారిద్దరి కళ్లు మాత్రం ఫోన్పై ఉన్నాయి. అంతలా ఫోన్ స్క్రీన్ చూస్తున్నారు అంటే అదేదో ఇంపార్టెంట్ మేసేజ్ అనుకోవచ్చా. అది లవ్ మేసేజేనా? ఏమో సినిమా చూస్తే కానీ అర్థం కాదీ సీన్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్, నిధీ అగర్వాల్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘మిస్టర్ మజ్ను’. ‘‘ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలోని పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేయబోతున్నాం. జనవరి 25న సినిమాను రిలీజ్ చేయబోతున్నాం’’ అని బీవీఎస్ఎన్ ప్రసాద్ పేర్కొన్నారు. ‘‘న్యూ ఇయర్ను ఈ సినిమాతో స్టార్ట్ చేయబోతున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు అఖిల్. నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. -
ప్రేమికుల రోజున ‘మిస్టర్ మజ్ను’
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న మూడో సినిమా మిస్టర్ మజ్ను. తొలి ప్రేమ సినిమాతో సూపర్హిట్ అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ నిర్మాత బీవీయస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల లండన్లో మేజర్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సినిమాను అక్కినేని లక్కీ మంత్ డిసెంబర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు చిత్రయూనిట్. అయితే అదే సమయంలో వరున్ తేజ్ ‘అంతరిక్షం’, శర్వానంద్ ‘పడి పడి లేచే మనసు’ సినిమాలు రిలీజ్ అవుతుండటంతో మిస్టర్ మజ్నును వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ కావటంతో ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తే బెటర్ అని భావిస్తున్నారట. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా అఫీషియల్ రిలీజ్ డేట్ తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
‘దేన్నైతే మిస్ చేయకూడదో.. దాన్నే మిస్ అన్నారు’
అక్కినేని నటవారసుడు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న మూడో సినిమా టైటిల్ను ప్రకటించారు చిత్రయూనిట్. చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నట్టుగా మిస్టర్ మజ్ను అనే టైటిల్నే ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో అఖిల్ ప్లేబాయ్గా కనిపించనున్నాడు. తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. రేపు (గురువారం) అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా అఖిల్ కొత్త సినిమా టైటిల్తో పాటు టీజర్ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నారు. -
‘అఖిల్ 3’ ఫస్ట్ లుక్ రాబోతోంది!
‘అఖిల్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, ‘హలో’ సినిమాతో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు అక్కినేని అఖిల్. ఇక తన తదుపరి చిత్రంతో ఎలాగైన ఘన విజయం సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడీ కుర్ర హీరో. ‘తొలిప్రేమ’ సినిమాతో తొలిప్రయత్నంతోనే నిరూపించుకున్నాడు దర్శకుడు వెంకీ అట్లూరి. సరైన సక్సెస్ కోసం చూస్తున్న అఖిల్, వెంకీ అట్లూరితో కలిసి సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ను రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు. నాగార్జున బర్త్డే స్పెషల్గా ఫస్ట్లుక్ను రివిల్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ లుక్ను మాత్రం రిలీజ్ చేయలేదు. తాజాగా చిత్రబృందం ఈ మూవీ ఫస్ట్ లుక్ను సెప్టెంబర్ 19 సాయంత్రం 4గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. Are you ready ? We are !!! The Count down begins ! #Akhil3FirstLook on 19th #Akhil3 @dirvenky_atluri @george_dop @AgerwalNidhhi @SVCCofficial pic.twitter.com/YAlPP1clMM — Akhil Akkineni (@AkhilAkkineni8) September 16, 2018 -
అఖిల్ సినిమాలో సీనియర్ హీరోయిన్!
అఖిల్, హలో సినిమాలతో నిరాశపరిచిన అక్కినేని యువ కథా నాయకుడు అఖిల్ తన తదుపరి చిత్రం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వరుణ్ తేజ్ హీరోగా తొలిప్రేమ లాంటి బిగ్హిట్ సాదించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు మిస్టర్ మజ్ను అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కనిపించనున్నారట. కాజల్ పాత్ర ఆడియన్స్ను సర్ప్రైజ్ చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను క్రిస్టమస్ కానుకగా డిసెంబర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
‘అఖిల్ 3’ ఫస్ట్లుక్ రేపే..!
అక్కినేని నటవారసుడిగా వెండితెరకు పరిచయం అయిన అఖిల్ తొలి సినిమాతో తీవ్రంగా నిరాశపరిచాడు. రెండో ప్రయత్నంగా చేసిన హలో పరవాలేదనిపించినా తన మీద ఉన్న అంచనాలను మాత్రం అందుకోలేకపోయాడు. దీంతో అఖిల్ మూడో సినిమాపై ఆసక్తి నెలకొంది. అఖిల్ ప్రస్తుతం తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మిస్టర్ మజ్ను అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా టీజర్ను కింగ్ నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 29న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇంతవరకు ఎలాంటి ప్రకటన లేకపోయినా.. అఖిల్ 3 టీజర్తో నాగ్కు బర్త్డే విషెస్ తెలిపేందుకు చిత్రయూనిట్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. టైటిల్, అఖిల్ లుక్తో పాటు సాంగ్ టీజర్ను కూడా విడుదల చేయనున్నారన్న ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే నాగ్కు అక్కినేని వారసుడు ఇచ్చే గిఫ్ట్తో అభిమానులు కూడా పండగ చేసుకోనున్నారు. -
అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ!
అక్కినేని నట వారసుడిగా భారీ అంచనాల మధ్య సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో అఖిల్. తొలి సినిమాతో నిరాశపరిచిన అఖిల్, రెండో ప్రయత్నంగా తెరకెక్కిన హలోతో పరవాలేదనిపించాడు. ప్రస్తుతం తొలి ప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే అఖిల్ తదుపరి చిత్రానికి సంబంధించి ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. అఖిల్ తన నెక్ట్స్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. నటుడు ఆది పినిశెట్టి సోదరుడు సత్య ప్రభాస్ దర్శకత్వంలో అఖిల్ సినిమా చేస్తున్నాడన్న టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. మలుపు సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్య ప్రభాస్ తన నెక్ట్స్ సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నాడు. అఖిల్ హీరోగా తెలుగు, హిందీ భాషల్లో ఓ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కింగ్ నాగార్జున, కరణ్ జోహర్లు సంయుక్తంగా ఈ సినిమా నిర్మించనున్నారట. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా, అఖిల్ బాలీవుడ్ ఎంట్రీపై జోరుగా ప్రచారం జరుగుతోంది. -
అఖిల్ 3 టైటిల్ ఇదేనా..?
అక్కినేని వారసుడిగా వెండితెరకుపరిచయం అయిన యువ కథానాయకుడు అఖిల్. తొలి సినిమా అఖిల్తో నిరాశపరిచిన ఈ యంగ్ హీరో, రెండో సినిమాగా తెరకెక్కిన ‘హలో’తో పరవాలేదనిపించాడు. అయితే స్టార్ వారసుడిగా ప్రూవ్ చేసుకునే స్థాయిలో కమర్షియల్ హిట్ మాత్రం సాధించలేకపోయాడు. దీంతో అఖిల్ మూడో సినిమాపై ఆసక్తి నెలకొంది. తొలిప్రేమ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ మూడో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎక్కువ భాగం విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కు మిస్టర్ మజ్ను అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన మజ్ను అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అదే సెంటిమెంట్ను కంటిన్యూ చేస్తూ అఖిల్ సినిమాకు మిస్టర్ మజ్ను అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. -
బాలీవుడ్ బ్యూటీతో అఖిల్..!
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ ప్రస్తుతం తన మూడో సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. హాలో పరవాలేదనిపించిన ఈ యంగ్ హీరో మూడో సినిమాతో ఎలాగైన మంచి విజయాన్ని సాధించాలని కష్టపడుతున్నాడు. తొలి ప్రేమ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో బాలీవుడ్ నటి ఫరా కరిమీ ఆడిపాడనుందట. ధృవ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించిన ఈ బ్యూటి అఖిల్ సరసన స్పెషల్ సాంగ్ చేసేందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇంగ్లాండ్లో జరుగుతోంది. -
మొదలైన అఖిల్ మూడో సినిమా!
‘అఖిల్’ సినిమాతో అక్కినేని అఖిల్కు దారుణమైన పరాజయం ఎదురైంది. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి చాలా సమయమే పట్టింది. ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకుని విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో ‘హలో’ సినిమా చేశాడు. ఈ సినిమా విజయవంతమైనా.. కమర్షియల్గా సక్సెస్ కాలేకపోయింది. అయితే ప్రస్తుతం అఖిల్ తన తదుపరి చిత్రంపై ఫోకస్ పెట్టాడు. మొదటి చాన్స్లోనే ‘తొలిప్రేమ’ లాంటి సినిమాను తీసి డైరెక్టర్గా తన టాలెంట్ చూపారు వెంకీ అట్లూరి. తన రెండో చిత్రంగా అఖిల్తో ఓ సినిమాను చేయబోతోన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే వీరి కాంబినేషన్లో రాబోతోన్న ఈ సినిమా షూటింగ్ ఈ రోజు (జూన్ 21) ప్రారంభమైనట్లు చిత్ర నిర్మాత ప్రకటించారు. ఈ సినిమాను ఎస్వీసీసీ క్రియేషన్స్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించగా, తమన్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమాలో అఖిల్కు జోడీగా నిధి అగర్వాల్ నటించనుంది. #Akhil3 starts rolling today. Directed by @dirvenky_atluri. A @MusicThaman musical.@George_DOP handles the camera.@AkhilAkkineni8 #SVCC25 pic.twitter.com/F60LN1IAwY — SVCC (@SVCCofficial) June 21, 2018 -
అఖిల్కు జోడిగా మేఘా
హలో సినిమాతో ఆకట్టుకున్న అఖిల్ ప్రస్తుతం తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో తన మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో అఖిల్కు జోడిగా లై ఫేం మేఘా ఆకాష్ ను తీసుకోవాలని భావిస్తున్నారట. ఇప్పటి వరకు చేసిన రెండు సినిమాల్లో కొత్త హీరోయిన్లతో నటించిన అఖిల్ మూడో సినిమాలో మాత్రం ఫాంలో ఉన్న హీరోయిన్తో రొమాన్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా తొలి ఎలాగైన కమర్షియల్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలని కష్టపడుతున్నాడు అక్కినేని వారసుడు. -
అఖిల్ కొత్త సినిమా ఆరంభం
-
నాగ్ క్లాప్.. సల్మాన్ కెమెరా ఆన్
సాక్షి, హైదరాబాద్ : అక్కినేని అఖిల్ మూడో చిత్రం అధికారికంగా లాంఛ్ అయ్యింది. తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్లో ఈ చిత్రం ఉండబోతుందని కొద్ది రోజుల క్రితం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. సీనియర్ హీరో, అఖిల్ తండ్రి నాగార్జున అక్కినేని ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా.. మళయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కెమెరా స్విచ్ ఆన్ చేశాడు. థమన్ మ్యూజిక్ అందించబోతున్న ఈ చిత్రానికి జార్జ్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర(ఎస్వీఎస్సీ) బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. త్వరలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. -
ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది
గత రెండు చిత్రాలు నిరాశపరచటంతో అక్కినేని హీరో అఖిల్ ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. ఈ క్రమంలో మూడో చిత్రం ఏమై ఉంటుందా? అన్న సస్పెన్స్ గత కొన్ని రోజులుగా నెలకొంది. అయితే ఉగాది సందర్భంగా ఆ సస్పెన్స్ను రివీల్ చేస్తూ ఓ క్లారిటీ ఇచ్చేశాడు.తన డెబ్యూ చిత్రం తొలిప్రేమతో బిగ్ హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరితో మూడో ప్రాజెక్టు అన్న విషయాన్ని అఖిల్ చెప్పేశాడు. తొలిప్రేమ చిత్రాన్ని నిర్మించిన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర.. అఖిల్-వెంకీ చిత్రాన్నీ నిర్మించబోతోంది. నటీనటులు, పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తామని నిర్మాణ సంస్థ తన ట్వీట్లో తెలియజేసింది. Here's a special #Ugadi surprise to all the movie lovers. After super successful #TholiPrema, teaming up with @dirvenky_atluri yet again for another wonderful project with @AkhilAkkineni8. Keep watching the space for more details.#Akhil3 #SVCC https://t.co/hERrqfJPNN — SVCC (@SVCCofficial) 18 March 2018 -
అఖిల్ కొత్త సినిమాకు యంగ్ డైరెక్టర్..?
‘అఖిల్’ సినిమాతో గ్రాండ్గా లాంచ్ అయిన అక్కినేని యువ కథానాయకుడు తనపై ఉన్న అంచనాలను అందుకోలేకపోయాడు. దీంతో రెండో సినిమా చేయడానికి చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇటీవల హలో అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్, మంచి మార్కులు సాధించిన బ్లాక్ బస్టర్ సక్సెస్ మాత్రం సాధించలేకపోయాడు. దీంతో మూడో సినిమా కోసం మరోసారి గట్టి కసరత్తులు చేస్తున్నాడు. ఇటీవల అఖిల్.. రామ్గోపాల్ వర్మ శిష్యుడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి. ఈ సినిమాకు సంబంధించిన టెస్ట్ షూట్ కూడా జరిగిందన్న ప్రచారం తెరమీదకు వచ్చింది. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్లో వినిపిస్తోంది. ఇటీవల తొలి ప్రేమ సినిమాతో సూపర్ హిట్ సాధించిన వెంకీ అట్లూరి, అఖిల్ మూడో సినిమాకు దర్శకత్వం వహించనున్నాడట. ఈ సినిమాను బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేకపోయినా.. ఏప్రిల్లోనే సినిమా ప్రారంభం కానుందన్న ప్రచారం జరుగుతోంది. -
వరుణ్.. వరుసగా రెండోసారి..!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం తొలిప్రేమ. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్లోనూ భారీ వసూళ్లు సాదిస్తోంది. ఈ సినిమా రిలీజ్ తరువాత ఒక్క అ! తప్ప ఓవర్ సీస్ ఆడియన్స్ను మెప్పించే చిత్రాలేవి రిలీజ్ కాకపోవటంతో ఇప్పటికీ వసూళ్లను రాబడుతోంది. తాజాగా ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్లో స్థానం దక్కించుకుంది. ఫిదా సినిమాతో ఓవర్సీస్లో తొలిసారిగా మిలియన్ డాలర్ క్లబ్లో జాయిన్ అయిన వరుణ్ తేజ్, తొలిప్రేమతో మరోసారి అదే ఫీట్ను రిపీట్ చేశాడు. వరుణ్ ప్రస్తుతం ‘ఘాజీ’ ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం రెడీ అవుతున్నాడు. అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈసినిమాలో వరుణ్ తేజ్ వ్యోమగామిగా కనిపించనున్నాడట. -
‘తొలిప్రేమ’ టీజర్ విడుదల
-
‘తొలిప్రేమ’ను ఎప్పటికీ మరిచిపోలేం..!
ఫిదా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ తొలిప్రేమ. బాబాయ్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకుడు. వరుణ్ సరసన రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణపనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. వరుణ్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్న ఈసినిమా టీజర్ ను బుధవారం రిలీజ్ చేశారు. తమన్నా స్వరాలందిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీయస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవరి 9న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ‘తొలిప్రేమ’ను ఎప్పటికీ మరిచిపోలేం..! -
కొత్త దర్శకుడితో వరుణ్ తేజ్
మెగా వారసుడు వరుణ్ తేజ్ స్పీడు పెంచాడు. ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో మిస్టర్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న వరుణ్ ఆ సినిమా తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో సినిమాను ప్లాన్ చేశాడు. ఈ రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగాను మరో సినిమాను ఫైనల్ చేశాడు. క్లాస్ మాస్ అనే ఇమేజ్లకు దూరంగా అన్ని రకాల సినిమాలు చేస్తున్న వరుణ్ త్వరలో కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు. ఇటీవల కాలిగాయంతో చాలా కాలం పాటు ఇంటికే పరిమితమైన మెగా ప్రిన్స్ ఇప్పుడు త్వరగా సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. అందుకే మిస్టర్ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి అదే స్పీడు ఫిదా సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత భోగవల్లి ప్రసాద్ నిర్మాతగా కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించే సినిమా షూటింగ్లో పాల్గొంటాడు వరుణ్.