weather forecast
-
13 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా ఈశాన్య భారతంలోని 13 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. రాబోయే ఏడు రోజుల్లో వాతావరణంలో పలు మార్పులు చోటుచేసుకుంటాయని, పర్వత ప్రాంతాల్లో విపరీతంగా మంచుకురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ తుఫాను ప్రభావం నాగాలాండ్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికంగా ఉండనుంది. ఫిబ్రవరి 19న అసోం, మేఘాలయలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 21న పలు ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, హిమాలయ,పశ్చిమబెంగాల్, సిక్కిం తదితర రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.పశ్చిమ బెంగాల్లోని పలు జిల్లాలకు ఇప్పటికే వర్ష సూచన హెచ్చరికలు జారీ చేశారు. ఫిబ్రవరి 23, 24 తేదీల్లో బీహార్లోని 16 జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలో బుధవారం, గురువారం ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 19, 20 తేదీలలో రాజస్థాన్, పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.ఇది కూడా చదవండి: పలు కుంభమేళా రైళ్లు రద్దు.. టిక్కెట్ బుక్ చేసుకుంటే నగదు వాపస్ -
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం
-
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
-
తెలంగాణలో ఫెంగల్ తుపానుతో వర్షాలు.. ఎల్లో వార్నింగ్ జారీ
హైదరాబాద్, సాక్షి: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి తమిళనాడును ముంచెత్తి, ఏపీని వణికిస్తున్న ఫెంగల్ తుపాను.. తెలంగాణపైనా ప్రభావం చూపించనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే ఈ ప్రభావం శుక్రవారం సాయంత్రం నుంచే రాష్ట్రంపై కనిపిస్తోంది. ఇక శనివారం పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి.ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక ఆది, సోమవారాల్లో కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం.... సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు పడనున్నాయి. ఈ మేరకు ఆ జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. అలాగే చలి తీవ్రతా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.ఇదీ చదవండి: మళ్లీ తుపానుగా బలపడిన వాయుగుండం -
ఢిల్లీలో మరింతగా పెరిగిన చలి.. మిగిలిన రాష్ట్రాల్లో..
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశం అంతటా చలి వాతావరణం నెలకొంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఉష్ణోగ్రతల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. ఢిల్లీలో కాలుష్యం కారణంగా అక్కడి ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందడం లేదు. మరోవైపు కొండ ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.ఈరోజు(మంగళవారం) ఉదయం ఢిల్లీలో అంతటా పొగమంచు కమ్మేసింది. గరిష్ట ఉష్ణోగ్రత 26, కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్గా ఉండే అవకాశాలున్నాయి. నవంబర్ 27 నుండి డిసెంబర్ ఒకటి వరకు ఏర్పడే వాతావరణం విషయానికి వస్తే గరిష్ట ఉష్ణోగ్రత 25, కనిష్టంగా 10 డిగ్రీల వరకు ఉండవచ్చు. నవంబర్ 28, 29 తేదీలలో పొగమంచు కమ్మేయనున్న దృష్ట్యా ఎల్లో అలర్ట్ జారీచేశారు. అ సమయంలో వర్షాలు కురిసే అవకాశం కూడా లేదు.ఢిల్లీకి ఆనుకుని ఉన్న పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కూడా చలి మొదలైంది. నవంబర్ 27, 28, 29 తేదీలలో ఉదయం వేళ పొగమంచు కమ్మేయనుంది. చండీగఢ్లో ఫాగ్ అలర్ట్ ఉంది. ఈ రోజు హర్యానాలో గరిష్ట ఉష్ణోగ్రత 26-27 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 11-12 డిగ్రీల సెల్సియస్గా ఉండనుంది. పంజాబ్లో ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రత 25-26 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 10-11 డిగ్రీల మధ్య ఉండనుంది.జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత -2 నుండి -3 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతోంది. ఈరోజు జమ్మూలో కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీలుగా ఉంది. ఈ పరిస్థితి నవంబర్ 29 వరకు కొనసాగనుంది. రాజస్థాన్లో కూడా చలి అధికంగానే ఉంది. ఉత్తరప్రదేశ్లో పొగమంచు కురిసే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: 11 గంటలు లేటుగా వందేభారత్.. ప్రయాణికుల ఆందోళన -
14 రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక
న్యూఢిల్లీ: దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల చలి వాతావరణం నెలకొనగా, మరికొన్ని చోట్ల వర్షం కురుస్తోంది. కోస్తాంధ్రలో బలమైన గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని, పలు రాష్ట్రాల్లో పొగమంచు ఆవరించే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రాబోయే వారంలో దేశంలోని 14 రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతోందో తెలియజేసింది.ఐఎండీ అందించిన వివరాల ప్రకారం నవంబర్ 25న నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతం శ్రీలంక తీరం వెంబడి 45 నుంచి 55 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. నవంబర్ 26న తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్, నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నవంబర్ 27,28 తేదీల్లో గంటకు 50 నుంచి 60 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతం, ఆ పక్కనే ఉన్న తూర్పు భూమధ్యరేఖ హిందూ మహాసముద్రంపై అల్పపీడనం ఏర్పడింది. నవంబర్ 25-29 మధ్య తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. నవంబర్ 27-28 తేదీలలో కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 25న మత్స్యకారులు సముద్రతీరానికి వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది.పలు రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉంది. పంజాబ్, హర్యానా, చండీగఢ్లోని వివిధ ప్రాంతాలలో నవంబర్ 27 నుంచి 29 వరకు, హిమాచల్ ప్రదేశ్లో నవంబర్ 25 నుంచి 28 వరకు, ఉత్తరప్రదేశ్లో నవంబర్ 28 నుంచి 30 ఉదయం వరకు పొగమంచు కురియనుంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, యూపీ, రాజస్థాన్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్, నికోబార్ దీవుల్లో చలిగాలులు వీస్తున్నాయి. ఇది కూడా చదవండి: Jharkhand: ఇలా గెలిచి.. అలా రాజీనామాకు సిద్ధమై.. ఏజేఎస్యూలో విచిత్ర పరిణామం -
తెలంగాణలో దంచికొట్టనున్న వానలు.. హైదరాబాద్కు కుంభవృష్టి హెచ్చరిక!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. వర్షాలు పడే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. కొన్నిచోట్ల మాత్రం ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే.. రాజధాని హైదరాబాద్ నగరంలో కుంభవృష్టి తప్పదని హెచ్చరిస్తూ యెల్లో అలర్ట్ జారీ చేసింది. వాతావరణ కేంద్రం హెచ్చరికలతో అధికార యంత్రాంగం వరుణ గండాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే.. పశ్చిమ విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఆవర్తనం ఏర్పడిందని వాతావరణకేంద్రం తన ప్రకటనలో స్పష్టం చేసింది.నాలుగు రోజులు ఇలా.. 🌧️గురువారం(నేడు) ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్ సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి.🌧️శుక్రవారం రోజున ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే ఛాన్స్ ఉంది. 🌧️19, 20న తేదీల్లోనూ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది. 🌧️వాతావరణ శాఖ అంచనాల ప్రకారమే.. బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్తో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదైంది. -
తెలంగాణ:నేడు, రేపు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: వేసవి తాపం నుంచి కాస్త చల్లబడ్డ రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సౌరాష్ట్ర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. మధ్య మహారాష్ట్ర, ఉత్తర లోతట్టు కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటకకు విస్తరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సూర్యాపేట్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. సోమవారం నుంచి రాష్ట్రంలో పొడివాతావరణం ఉంటుందని వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం, కొన్నిప్రాంతాల్లో అంతకంటే తక్కువగా నమోదవుతున్నాయి. కాగా, సోమవారం నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. నల్లగొండలో గరిష్ట ఉష్ణోగ్రత 40.0 డిగ్రీల సెల్సియస్, అలాగే ఆదిలాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రత 21.7 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీల మేర తక్కువగా నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
IPL 2024: చెన్నై, ఆర్సీబీ మ్యాచ్కు ముందు వాతావరణం, పిచ్ వివరాలు
ఐపీఎల్ 2024 సీజన్ తొలి మ్యాచ్ ఇవాళ (మార్చి 22) జరుగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఫైవ్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్కింగ్స్ (సీఎస్కే), ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. అక్షయ్ కుమార్, ఏఆర్ రెహ్మాన్లచే ప్రత్యేక కార్యక్రమం.. మ్యాచ్కు ముందు సీజన్ ఆరంభ వేడుకలు జరుగనున్నాయి. సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఈవెంట్లో బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, సంగీత మాంత్రికుడు ఎఆర్ రెహ్మాన్, సింగర్ సోనూ నిగమ్ పెర్ఫార్మ్ చేయనున్నారు. సీఎస్కే నూతన కెప్టెన్గా రుతురాజ్.. లీగ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. నూతన కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ను ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించింది. మాజీ కెప్టెన్ ధోని స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకుని రుతురాజ్కు బాధ్యతలు అప్పజెప్పాడు. వాతావరణం ఎలా ఉందంటే.. సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్కు వేదిక అయిన చెన్నైలో వాతావరణం ఆటకు ఆనువుగా ఉంది. వాతావరణం నుంచి మ్యాచ్కు ఎలాంటి అవాంతరాలు సంభవించవు. చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం రాత్రి తేలికపాటి వర్షం పడినప్పటికీ.. ఇవాళ మ్యాచ్ జరిగే సమయంలో (7-11 గంటల మధ్యలో) వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. మ్యాచ్ వేలల్లో ఉష్ణోగ్రతలు 30, 31 డిగ్రీల మధ్యలో ఉండే అవకాశం ఉంది. వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదు. పిచ్ ఎవరికి అనుకూలం.. చెపాక్ పిచ్ బ్యాటింగ్, బౌలింగ్ రెండిటికీ అనుకూలిస్తుందని చెప్పాలి. తొలుత బ్యాటర్లకు స్వర్గధామంగా కనిపించే ఈ పిచ్ క్రమంగా స్నిన్కు అనుకూలిస్తూ బౌలర్ ఫ్రెండ్లీగా మారుతుంది. ఈ పిచ్పై ఛేదన కాస్త కష్టంగానే ఉంటుంది. తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకే విజయావకాశాలు అధికంగా ఉంటాయి. రాత్రి వేళలో తేమ శాతం అధికమైతే స్పిన్నర్లు చెలరేగే అవకాశం ఉంటుంది. హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఐదు సార్లు ఛాంపియన్ అయిన సూపర్ కింగ్స్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘనమైన రికార్డు ఉంది. ఈ ఇరు జట్లు ఐపీఎల్లో 31 సార్లు ఎదురెదురుపడగా.. సీఎస్కే 20, ఆర్సీబీ 10 సందర్భాల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు. చెపాక్ విషయానికొస్తే.. ఆర్సీబీపై సీఎస్కే సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంది. ఇక్కడ ఇరు జట్లు 8 మ్యాచ్ల్లో తలపడగా.. సీఎస్కే ఏకంగా ఏడు మ్యాచ్ల్లో జయకేతనం ఎగురవేసింది. కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే ఆర్సీబీ విజయం సాధించింది. అది కూడా లీగ్ ప్రారంభ ఎడిషన్ అయిన 2008లో. నాటి నుంచి ఇప్పటివరకు ఆర్సీబీ సీఎస్కేపై చెపాక్లో ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేదు. తుది జట్లు (అంచనా).. సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్వెల్, దినేశ్ కార్తీక్ (వికెట్కీపర్), అనూజ్ రావత్, అల్జరీ జోసఫ్, సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాశ్దీప్ -
జీ20 సదస్సు.. ప్రత్యేకంగా వాతావరణ కేంద్రం.. ఇంకా ఎన్నో!
జై సియా రాం భారత మూలాలున్న బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, అక్షతా మూర్తి దంపతులకు శుక్రవారం ఉదయం పాలం విమానాశ్రయంలో.. కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే జై సియా రాం(జై శ్రీరాం) అంటూ స్వాగతం పలికారు. వారికి మంత్రి చౌబే రుద్రాక్షను, భగవద్గీత, హనుమాన్ చాలీసా ప్రతులను కానుకలుగా అందజేశారు. వ్యాపారవేత్తలకు ఆహ్వానాల్లేవ్.. జీ20 ప్రత్యేక విందు కార్యక్రమానికి వ్యాపార దిగ్గజాలకు ఆహ్వానాలు వెళ్లాయన్న వార్తలపై కేంద్రం స్పందించింది. జీ20 స్పెషల్ డిన్నర్కు రావాలంటూ వ్యాపారవేత్తలను ఆహ్వానించలేదని స్పష్టం చేసింది. శనివారం జరిగే విందుకు బిలియనీర్లు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి 500 మందికి పైగా వ్యాపారవేత్తలు హాజరవనున్నారంటూ వస్తున్న వార్తలను తప్పుదోవపట్టించేవిగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వాణిజ్యవేత్తలెవరినీ ఆహ్వానించలేదని తెలిపింది. యూపీఐని పరిచయం చేసేందుకు.. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమంపై జీ20 ప్రతినిధులకు ప్రత్యక్ష అనుభవం కల్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. విదేశీ ప్రతినిధులు ఢిల్లీలో ఉండగా జరిపే కొనుగోళ్లకు గాను యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) ద్వారా చెల్లింపులపై ఆసక్తి కల్పించేందుకు చర్యలు తీసుకుంది. దేశీయంగా రూపకల్పన చేసిన ఈ విధానంలో చెల్లింపులు ఎంత సులువో వారికి తెలియజేయడమే ఉద్దేశం. ఇందులోభాగంగా సుమారు వెయ్యి మంది విదేశీ ప్రతినిధుల ఫోన్ వ్యాలెట్లలో రూ.500 నుంచి రూ.1000 వరకు బ్యాలెన్స్ జమ చేయనుంది. ఇందుకోసం రూ.10 లక్షల వరకు ప్రత్యేకించింది. ప్రత్యేకంగా వాతావరణ కేంద్రం జీ20 సమావేశాలు జరిగే ప్రగతి మైదాన్కు సమీపంలో భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అదనంగా ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచ నేతలు పాల్గొంటున్న కార్యక్రమం అయినందున ఈ వాతావరణ కేంద్రం ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు చేస్తుంది. గురువారం నుంచి ఆదివారం వరకు ఇది నిర్విరామంగా వాతావరణాన్ని పరిశీలిస్తుంటుంది. ఐఎండీకి చెందిన వెబ్పేజీ mausam.imd.gov.in/g20 ద్వారా వాతావరణ సూచనల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. చదవండి: G20 Summit: బైడెన్తో మోదీ ద్వైపాక్షిక చర్చలు స్ట్రీట్ ఫుడ్, మిల్లెట్స్తో ప్రత్యేక మెనూ భారత్లో ఈ సీజన్లో ప్రజలు ఎక్కువగా ఇష్టపడే వంటకాలతో ప్రత్యేకంగా మెనూ సిద్ధమైంది. భారతీయ స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్తోపాటు మిల్లెట్లతో చేసిన ఆహార పదార్థాలకు ఇందులో స్థానం కల్పించారు. ఇంకా గులాబ్ జామ్, రసమలై, జిలేబీ వంటి స్వీట్లు కూడా అతిథులకు వడ్డిస్తారు. వడ్డించే సిబ్బందికి ప్రత్యేక యూనిఫాం రూపొందించారు. మెనూలో ఫలానావి ఉంటాయని అధికారులెవరూ స్పష్టంగా చెప్పనప్పటికీ, భారతీయ వంటకాల్లో వైవిధ్యాన్ని చాటేలా మెనూ ఉంటుందని భావిస్తున్నారు. ప్రత్యేక టేబుల్ వేర్ ప్రపంచనేతలకు ఇచ్చే విందు కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. వారికి మరిచిపోలేని ఆతిథ్య అనుభూతి కల్పించేందుకు ఆహారపదార్థాలను వెండి, బంగారు పూత కలిగిన పాత్రల్లో వడ్డిస్తారు. విదేశీ నేతలు వివిధ హోటళ్లలో బస చేసినప్పుడు, రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యే సమయంలో ఉపయోగించేందుకు 200 మంది కళాకారులతో 15 వేల వరకు సామగ్రిని తయారు చేయించారు. ఇందులో స్టీల్, ఇత్తడి లేదా రెండింటి మిశ్రమంతో తయారైన టేబుల్ సామగ్రికి వెండిపూత వేయించారు. విందు సమయంలో అతిథులకు బంగారు పూత వేసిన గ్లాస్లలో డ్రింక్స్ను సర్వ్ చేస్తారు. ప్లేట్లు, స్పూన్లు తదితర వస్తువులను భారతీయ సంప్రదాయం ప్రతిబింబించేలా ఎంపిక చేశారు. జైపూర్, ఉదయ్పూర్, వారణాసిలతోపాటు కర్ణాటకలో వీటిని తయారు చేయించారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీపై నిషేధం జీ20 దృష్ట్యా ఈ నెల 8, 9, 10వ తేదీల్లో న్యూఢిల్లీలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఢిల్లీ పోలీసులు ఈ ప్రాంతంలో ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు ప్రకటించారు. క్లౌడ్ కిచెన్, ఫుడ్ డెలివరీలు, అమెజాన్ డెలివరీ వంటి వాణిజ్య సేవలపై ఎన్డీఎంసీ ప్రాంతంలో నిషేధం విధిస్తున్నట్లు స్పెషల్ పోలీస్ కమిషనర్ ఎస్ఎస్ యాదవ్ చెప్పారు. ఈ ప్రాంతంలో లాక్డౌన్ విధిస్తారన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. అలాంటిదేమీ లేదన్నారు. బియెన్వెన్యూ నుంచి బియెన్వెనిడో దాకా.. జీ20 శిఖరాగ్రానికి హాజరయ్యే జీ20 ప్రతినిధులు, విదేశీ అతిథులకు వారివారి భాషల్లోనే స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. జీ20 ఇతివృత్తం ‘వసుధైక కుటుంబకమ్’ను జీ20 సభ్యదేశాలు, ఆహ్వానిత దేశాల భాషల్లో ముద్రించారు. దీంతోపాటు ఫ్రెంచిలో బియెన్వెన్యూ, టర్కిష్లో హాస్గెల్డినిజ్, జర్మన్లో విల్కోమెన్, ఇండోనేసియన్లో సెలామట్ దతంగ్, స్పానిష్లో బియెన్వెనిడో అంటూ స్వాగతాన్ని రష్యన్, మాండరిన్ భాషల్లో సైతం ముద్రించారు. దేశాల ప్రతినిధుల కోసం భారత్ మండపం కాంప్లెక్స్ 14వ నంబర్ హాలు ప్రవేశద్వారం వద్ద వీటిని ఏర్పాటు చేశారు. ఖర్గేకు రాని విందు పిలుపు సాక్షి, న్యూఢిల్లీ: జీ 20సదస్సులో భాగంగా శనివారం రాత్రి అతిథులకు ఇస్తున్న విందుకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు పిలుపు రాలేదు. ప్రగతిమైదాన్లోని భారత మండపంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇవ్వనున్న ఈ విందుకు ఖర్గేకు పిలుపు రాలేదని ఆయన కార్యాలయం ధ్రువీకరించింది. మాజీ ప్రధానులు దేవెగౌడ. మన్మోహన్ సింగ్. కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర కార్యదర్శులు, పలువురు పారిశ్రామిక వేత్తలు ఆహ్వానితుల్లో ఉన్నారు. అయితే కేబినెట్ హోదా ఉన్న రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు ఖర్గేకు ఆహా్వనం పంపకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సీఎంలు నితీశ్కుమార్ , మమతా బెనర్జీ, కేజ్రీవాల్, భగవంత్మాన్, హేమంత్ సోరెన్లు విందుకు హాజరు అవుతున్నట్లు ప్రకటించారు. అనారోగ్య కారణంగా విందుకు హాజరుకావడంలేదని మాజీ ప్రధాని దేవెగౌడ ట్వీట్ చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ కూడా అనారోగ్య కారణాలతో విందుకు హాజరుకావడం లేదని సమాచారం. నేతల బస సదస్సుకు హాజరవుతున్న దేశాధినేతలందరికీ సెంట్రల్ ఢిల్లీలోని స్టార్హోటళ్లు, గురుగ్రామ్లో బస ఏర్పాట్లు చేశారు. సుమారు 35 వేల గదులు బుక్ చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు ఐటీసీ మౌర్య 14వ అంతస్తులో, చాణక్యపురిలోని తాజ్ ప్యాలెస్లో చైనా ప్రధాని లీ క్వియాంగ్, బ్రెజిల్ ప్రతినిధులు, షాంగ్రీలాలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, జర్మనీ చాన్స్లర్ ఒలాఫ్ షోల్జ్, క్లారిడ్జ్ హోటల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ఇంపీరియర్ హోటల్లో ఆ్రస్టేలియా ప్రధాని ఆంటొనీ అల్బనీస్, ఒబెరాయ్ హోటల్లో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, గురుగ్రామ్లోని ఒబెరాయ్ హోటల్లో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్, జేడబ్ల్యూ మారియట్, హయత్ రెసిడెన్సీల్లో ఇటలీ ప్రతినిధులు, లీ మెరిడియన్లో నెదర్లాండ్స్, నైజీరియా, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు, లలిత్ హోటల్లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, గురుగ్రామ్ లీలీ హోటల్లో సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ బృందం బస చేయనుంది. -
తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఈ ప్రభావంతో.. తెలంగాణలో రెండు రోజులపాటు భారీవర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో ప్రభుత్వం, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడొచ్చని తెలిపింది. @balaji25_t sirpur Kaghaznagar today morning 9.30 am. pic.twitter.com/trKHQyrWPb — SIDDIQUI (@siddiquiindia) August 19, 2023 వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో గురువారం ఏర్పడిన అల్పపీడనం చురుకుగా ఉంది. రెండు, మూడు రోజుల్లో అది పశ్చిమ వాయవ్య దిశలో ఉత్తర ఒడిశా-ఉత్తర ఛత్తీస్గఢ్ వైపు వెళ్లే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో తెలంగాణలో రాబోయే రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. Heavy rain in jagtial district pic.twitter.com/x1q6Mlkzaz — Laxman Thota (@LaxmanPatels1) August 19, 2023 భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో చీఫ్ సెక్రటరీ శాంతికుమారి కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కంట్రోల్ రూమ్లను నిర్వహించి.. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. మొన్నటి వర్షాలు, వరదల సమయంలో కలిగిన భారీ ప్రాణ-ఆస్తి నష్టం, ప్రజల్ని అప్రమత్తం చేయడంలో అధికార యంత్రాంగ వైఫల్యంపై తెలంగాణ హైకోర్టు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఇకనైనా అప్రమత్తంగా ఉండాలని సూచించిన విషయం తెలిసిందే. ఇక శుక్రవారం.. వివిధ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెంలో అధికంగా వర్షపాతం నమోదు అయ్యింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్లో ఓ మోస్తరు వానలు పడ్డాయి. హైదరాబాద్లోనూ ఓ మోస్తరు వాన కురిసింది. ఇదీ చదవండి: కేసీఆర్కు నేనంటే భయం! -
ఏపీకి రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో నేడు, రేపు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 5.8 కి.మీ.ల ఎత్తులో విస్తరించింది. దీని ప్రభావంతో ఆదివారం ఉత్తర కోస్తాలో అనేకచోట్ల, దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల, రాయలసీమలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ శనివారం వెల్లడించింది. సోమవారం ఉత్తర, దక్షిణ కోస్తాల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. మరోవైపు ఈ నెల 18 నాటికి వాయవ్య బంగాళాఖాతంలోనే మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, అదేరోజు నుంచి రాష్ట్రంలో వర్షాలు ఊపందుకునేందుకు అవకాశం ఉంది. చదవండి: వైఎస్సార్ షాదీ తోఫాలో మార్పులు.. ఏపీ సర్కార్ గుడ్న్యూస్ -
తుఫాన్గా మారిన అల్పపీడనం, తీరం అల్లకల్లోలం.. భారీ వర్ష సూచన
బరంపురం (ఒడిశా): ఉత్తర బంగాళాఖాతం అండమాన్ దీవిలో ఏర్పడిన అల్పపీడనం పెను తుఫానుగా మారనుంది. దీని ప్రభావంతో ఈనెల 6 నుంచి 9వరకు దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురువనున్నట్లు భారత వాతావరణ అధ్యయన కేంద్రం అధికారులు తెలిపారు. తాజా సమాచారం అందే సమయానికి గోపాల్పూర్ తీరానికి 700కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది. మూడు రోజుల క్రితం బంగాళాఖతంలో ఏర్పడిన అల్పపీడనం సైక్లోన్గా మారినట్లు వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీని ప్రభావంతో తుఫాను తీరందాటే సమయంలో భారీ వర్షంతో పాటు గంటకు సుమారు 80నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. అలాగే గంజాం, గజపతి, రాయగడ, ఖుర్దా, జగత్సింగపూర్, పారాదీప్ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర లోని శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం తీరప్రాంతాల్లో భారీ నష్టం జరిగే ప్రమాదం ఉన్నట్లు సమాచారం. మరోవైపు గంజాం జిల్లా ఛత్రపూర్లో కలెక్టర్ దివ్యజ్వోతి పరిడా వివిధ విభాగాలకు చెందిన ప్రభుత్వ అధికార్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సాధ్యమైనంత వరకు తుఫాన్ ప్రభావంతో ప్రాణ, ఆస్తినష్టం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. గోపాల్పూర్లో.. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గోపాల్పూర్ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. పారాదీప్ నుంచి కళింగపట్నం మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర హెచ్చరించగా.. సైక్లోన్ జోన్గా గుర్తింపు పొందిన గోపాలపూర్ సైతం ఇదే ఆందోళన కొనసాగుతోంది. దీని కారణంగా తీరంలో 5 మీటర్లకు పైగా సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఇప్పటికే మోటార్ బోట్లతో చేపల వేటపై నిషేధం ఉండగా.. సంప్రదాయ బోట్లు సైతం తీరానికే పరిమితమయ్యాయి. జిల్లాలోని సముద్ర తీరానికి సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు, మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే పనిలో ఉన్నారు. తుఫాను బాధితులను ఆదుకోవాలి జయపురం: ఇటీవల విరుచుకుపడిన పెనుగాలులతో కూడిన అకాల వర్షాలు, తుఫాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులు, ఇల్లు కోల్పోయిన కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని జయపురం సమితి బాధితులు కోరారు. ఈ మేరకు సామాజిక కార్యకర్త బి.హరిరావు నేతృత్వంలో పలువురు బాధితులు జయపురం సబ్ కలెక్టర్ దేవధర ప్రదాన్ను ఆయన కార్యాలయంలో గురువారం కలిసి, వినతిపత్రం అందించారు. అధికారులు కేవలం టార్పాన్లు ఇచ్చి, చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. ఎవరికి భూమి పట్టాలు ఉన్నాయో వారికి మాత్రం కొంత ఆర్థికసాయం అందించారని, మిగతా బాధితులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. దీనిపై దృష్టి సారించి, బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామస్తులు రమేష్ జాని, సాను ఖొర, బలరాం జాని తదితరులు పాల్గొన్నారు. -
Hyderabad: మరో మూడు రోజులు వర్షాలే!
సాక్షి, హైదరాబాద్: నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మరో మూడు రోజులు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. ఈదురు గాలులతో పాటు వడగండ్ల వాన సైతం కురవొచ్చని తాజా బులిటెన్లో తెలిపింది. పగలంతా అధిక ఉష్ణోగ్రతలు, మధ్యాహ్నం లేదంటే సాయంత్రం పూట వాతవరణంలో మార్పులు రావొచ్చని తెలిపింది. సోమవారం నాటి పరిస్థితులే మరో మూడు నాలుగు రోజులపాటు కొనసాగొచ్చని పేర్కొంది. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ వర్షాభావం కొనసాగొచ్చని తెలిపింది వాతావరణ శాఖ. -
ఒడిశా మీదుగా ఉపరితల ద్రోణి.. వర్షాలకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వానలు, ఒకట్రెండు చోట్ల ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. ఆదివారం రాష్ట్రంలోని పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీ సెల్సియస్ నుంచి 43 డిగ్రీ సెల్సియస్ మధ్యన నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. శనివారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే, గరిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో 39.8 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 20.0 డిగ్రీ సెల్సియస్గా నమోదయ్యాయి. -
TS/AP: మరో రెండు రోజులు వర్షాలు
సాక్షి, హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వర్ష ప్రభావం కొనసాగనుంది. ఏపీలో పలుచోట్ల మోస్తరు వర్షాలు ఉండగా, తెలంగాణలో పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అకాలవర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో.. ఇవాళ, రేపు(సోమ, మంగళవారాల్లో) ఏపీలో వర్షాలు పడనున్నాయి. ఏపీ తో పాటు యానాం మీదుగా కొనసాగుతోంది అల్పపీడనం. దీంతో.. తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు లేదంటే వడగంట్ల వాన కురవొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలుగురాష్ట్రాల్లో కురిసిన అకాల వర్షాలతో ఇప్పటికే భారీగా పంట నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. -
మూడు రోజులు వానలే.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వర్షాలు కొనసాగనున్నాయి. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ తీరం వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. వీటి ఫలితంగా శుక్ర, శని, ఆదివారాల్లో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే వీలుంది. శనివారం దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి నివేదికలో వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవవచ్చని తెలిపింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని పేర్కొంది. ఉరుములు, మెరుపులు, అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని, గంటకు 30నుంచి 40 కిలోమీటర్లు గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మూడు రోజులపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ కోరారు. -
Hyderabad: హైదరాబాద్లో వర్షం
సాక్షి, హైదరాబాద్: అన్సీజన్లో నగరాన్ని వరుణుడు పలకరించాడు. గురువారం అర్ధరాత్రి తర్వాత నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో చిరు జల్లులు కురియగా, శుక్రవారం వేకువఝామునే మరోసారి చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు దాకా వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట, పంజాగుట్ట, ఆర్టీసీ క్రాస్రోడ్, చింతల్, బాలానగర్, సుచిత్ర, కుత్బుల్లాపూర్, బేగంపేట.. ఇంకా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్నిచోట్ల చిరు జల్లులు కురియగా, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షం గట్టిగానే దంచికొట్టింది. ఒకవైపు గత రెండు మూడు రోజులుగా నగరంలో చలి విజృంభణతో నగరవాసులు వణికిపోతుండగా, ఇప్పుడు వర్ష ప్రభావంతో చలి తీవ్రత మరింత పెరగొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. Earlier morning unexpected moderate #rainfall with thunderstorm accompanied by gusty winds on Friday. @ind2day #Hyderabad #oldcity pic.twitter.com/DNdShMsZbU — Mohd Lateef Babla (@lateefbabla) January 6, 2023 -
అమెరికాను గజగజలాడిస్తున్న బాంబ్ సైక్లోన్
చలికాలంలో వణుకు సహజం. కానీ, ఆ వణుకు ప్రాణంపోయేలా, క్షణాల్లో మనిషిని సైతం గడ్డకట్టించేదిగా ఉంటే!. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం.. తన దేశ పౌరులను ఉద్దేశించి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. శీతాకాలపు తుపాను వేగంగా వస్తున్నందున క్రిస్మస్కు కుటుంబ సభ్యులను, స్నేహితులను సందర్శించడానికి వెళ్లాలనుకునే అమెరికన్లు వెంటనే బయలుదేరాలని ఆయన హెచ్చరించారు. మంచు తుపాను బలం పుంజుకోవడంతో.. అత్యంత అరుదైన పరిణామం ‘బాంబ్ సైక్లోన్’గా బలపడొచ్చని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. అమెరికా మంచు తుపాన్తో వణికిపోతోంది. -39(మైనస్) డిగ్రీల సెల్సియస్కు మెర్క్యూరీ మీటర్లు పడిపోతున్నాయి. అర్కిటిక్ బ్లాస్ట్.. విపరీతమైన చలిని, హిమపాతాన్ని, చల్లని గాలులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు అక్కడి ప్రజలు. ఇప్పటిదాకా ఐదుగురు మృత్యువాత చెందారు. గత నలభై ఏళ్లలో ఎన్నడూ ఇంత ఘోరమైన పరిస్థతి ఎదుర్కొలేదని వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే వందల సంఖ్యలో విమానాలు రద్దు అయ్యాయి. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. రోడ్డు, రైల్వే మార్గాలు సైతం మంచు ప్రభావానికి గురికాగా.. క్రిస్మస్పై ఈ ఎఫెక్ట్ పడేలా కనిపిస్తోంది. ఇది ప్రమాదకరమైనది. మీరు చిన్నప్పుడు చూసిన మంచులాంటిది కాదు. ప్రాణాలకు ముప్పు కలిగించేది. చాలా తీవ్రమైన వాతావరణం.. ఓక్లహోమా నుంచి వ్యోమింగ్, మైనే వరకు కొనసాగనుంది. కాబట్టి నేను ప్రతి ఒక్కరూ దయచేసి స్థానిక హెచ్చరికలను పట్టించుకోవాలని ఒవల్ కార్యాలయం నుంచి జాతిని ఉద్దేశించి బైడెన్ కోరారు. మధ్య అమెరికా నుంచి తూర్పు వైపు వీచే ఈ శీతలగాలుల ప్రభావంతో.. 135 మిలియన్ల(సుమారు పదమూడు కోట్ల మంది) జనాభాపై ప్రభావం పడనుందని తెలుస్తోంది. గురువారం ఒక్కరోజే.. 60 మిలియన్ల మందిపై ఇది ప్రభావం చూపెట్టింది. బాంబ్ సైక్లోన్ అంటే.. బాంబ్ సైక్లోన్ అనేది మధ్య-అక్షాంశ తుపాను. దీనిలో కేంద్ర పీడనం గంటకు ఒక మిల్లీబార్ వద్ద కనీసం 24 గంటల పాటు వేగంగా పడిపోతుంటుంది. అయితే, తుపాను ఎక్కడ ఏర్పడుతుందనే అనే దాని ఆధారంగా మిల్లీబార్ రీడింగులు మారే అవకాశం ఉంటుంది. వాయు పీడనం అనేది వాతావరణం యొక్క బరువు ద్వారా ప్రయోగించే శక్తిని కొలవడం. ఈ పీడనం ఎంత తక్కువగా ఉంటే తుపాను అంత బలంగా ఉంటుందన్న మాట. అమెరికా జాతీయ వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. ప్రస్తుత పరిస్థితి కొనసాగితే.. ఉష్ణోగ్రతలు ఇప్పుడున్న దానికంటే 11 డిగ్రీల సెల్సియస్కు పడిపోవచ్చట. అలాగే గాలి పీడనం 1003 మిల్లీబార్ల నుంచి 968 మిల్లీబార్లకు పడిపోవచ్చని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ . బాంబు తుపాన్ ఎలా ఏర్పడుతుందంటే.. వివిధరకాల వాయు ద్రవ్యరాశి (చల్లని, పొడి) గాల్లో కలిసినప్పుడు. వెచ్చని గాలి పెరిగేకొద్దీ, అది గాలి ఒత్తిడిని తగ్గించే క్లౌడ్ వ్యవస్థను సృష్టిస్తుంది. అల్పపీడన ప్రాంతం చుట్టూ అపసవ్య దిశలో ప్రసరించే తుఫానుగా ఏర్పడుతుంది. జనావాసాలపై బాంబ్ సైక్లోన్ ప్రభావం ఊహించని రీతిలో ఉంటుంది. మనుషుల ప్రాణాలు తీయడంతో పాటు ఆస్తి నష్టం కూడా భారీగానే ఉంటుంది. గట్టిగా గాలి పీల్చినా.. మాట్లాడినా సరే ఆ చలికి తెమడ పట్టేసి.. ప్రాణాలకు తీసుకొస్తుంది. 1979 నుంచి 2019 మధ్య.. ఉత్తర అమెరికాలో ఏడు శాతం మంచు తుపానులు బాంబ్ సైక్లోన్లుగా మారాయి. 1980లో బాంబ్ సైక్లోన్ అనే పదాన్ని ఉపయోగించారు. బాంబ్ సైక్లోన్ స్థితి చలికాలంలోనే కాదు.. అరుదుగా సమ్మర్లోనూ నెలకొంటుంది. వీటి ప్రభావంతో ఇప్పటిదాకా వందల నుంచి వేల మంది మరణించారు!. బాంబు సైక్లోన్ తుపాను అనేది.. చల్లని గాలుల తీవ్రతను బట్టి ఉంటుంది. దీంతో అమెరికాలో ఇప్పుడు నెలకొన్న పరిస్థితి మరింత దిగజారవచ్చు. టెంపరేచర్లు.. సున్నా కంటే చాలా తక్కువ ప్రమాదకరమైన కనిష్ట స్థాయికి పడిపోవచ్చు. అంటే.. ఏదైనా సరే నిమిషాల్లో గడ్డకట్టుకుపోతుంది. క్రిస్మస్ తర్వాత నుంచి నెమ్మదిగా మొదలై.. కొత్త సంవత్సరం మొదటిరోజు నాటికి ఈ పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. భారీగా కురుస్తోన్న మంచు(Snow), చలిగాలులకు.. స్థానిక ఉష్ణోగ్రతలు ఘోరంగా పడిపోయాయి. క్రిస్మస్ దగ్గర పడుతున్న వేళ.. ప్రయాణాలకు ఈ వాతావరణం అవరోధంగా మారింది. గురువారం ఒక్కరోజే వేలాది విమానాలు రద్దయినట్లు సమాచారం. కెంచుకీ, జార్జియా, నార్త్ కరోలినా, ఒక్లాహోమాలు అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. మేరీల్యాండ్, మిస్సోరీలు.. అత్యవసర పరిస్థితులకు సిద్దంగా ఉనన్నాయి. మిన్నెసొటాలో జంట నగరాలు స్నో ఎమర్జెన్సీలను ప్రకటించుకున్నాయి. ఈశాన్య వాతావరణంతో పోలిస్తే.. బాంబ్ సైక్లోన్ ప్రభావం మరీ ఘోరంగా ఉంటుంది. -
మాండూస్ ఎఫెక్ట్.. రాయలసీమ, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు.. కంట్రోల్ రూం నెంబర్లివే
Cyclone Mandous Andhra Pradesh LIVE Updates ప్రకాశం జిల్లా: సముద్ర తీరంలో టెన్షన్ సింగరాయకొండ మండలం ఊళ్ళ పాలెం, పల్లెపాలెం సముద్ర తీరంలో టెన్షన్ వాతావరణ నెలకొంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బృందం బయటకురాలేక లోపల చిక్కుకుపోవడంతో ఆందోళన కొనసాగుతుంది. బంధువులతో పాటు పోలీస్, మెరైన్ సిబ్బంది తీరం వద్ద మోహరించారు. సముద్ర తీరానికి కిలోమీటర్ దూరంలో మత్స్యకారుల బోటు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులతో పోలీసులు ఫోన్లో మాట్లాడి, వారికి ధైర్యం చెప్పారు. మత్స్యకారులు కూడా ప్రస్తుతానికి క్షేమంగానే ఉన్నామని తెలిపారు. ఇంజన్లో ఆయిల్ అయిపోవడం వల్ల ఇక్కడ ఇరుక్కుపోయామని మత్స్యకారులు పోలీసులకు తెలిపారు. గత నాలుగో తేదీన చీరాల మండలం ఓడరేవు నుంచి మత్స్యకారులు చేపలు వేటకు వెళ్లినట్లు, తుపానులో బయటకురాలేక చిక్కుకున్నట్టు అధికారులు తెలిపారు. మత్స్యకారులను క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. మాండూస్ తుపాన్పై ఏపీ సీఎస్ జవహర్రెడ్డి టెలికాన్ఫరెన్స్ ► మాండూస్ తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. శనివారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఈసందర్భంగా.. తుపాను ప్రభావిత ప్రాంతాలలో ఆయా జిల్లాల కలెక్టర్లు పర్యటించాలని సీఎస్ ఆదేశించారు. శని, ఆదివారాల్లో రెండు రోజులపాటు పర్యటించాలని తెలిపారు. వర్షపు నీరు తొలగిన తర్వాత నష్టం అంచనాకు ఎన్యుమరేషన్ ప్రక్రియను చేపట్టాలని ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ► తిరుపతిలో వర్షపు నీరు త్వరిత గతిన దిగువకు వెళ్ళేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి కలెక్టర్ ను సీఎస్ ఆదేశించారు. ఈ టెలీకాన్ఫరెన్స్ లో పాల్గొన్న సీఎంవోప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.పూనం మాలకొండయ్య మాట్లాడుతూ.. భారీ వర్షాలు పడిన ప్రాంతాల్లో వెంటనే శానిటేషన్ పనులు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు.వర్షపు నీరు తగ్గిన వెంటనే పంట నష్టం అంచనాలు చేపట్టాలని చెప్పారు. ► రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సంచాలకులు డా.బిఆర్.అంబేద్కర్ మాట్లాడుతూ.. శుక్రవారం రాత్రి 8.30 గం.ల నుండి శనివారం ఉ.8.30గం.ల వరకు అన్నమయ్య జిల్లాలో 23.3 మిల్లీ మీటర్లు, చిత్తూరు జిల్లాలో 30.5,ప్రకాశం జిల్లాలో 14.1, ఎస్పి ఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో 57.6, తిరుపతి జిల్లాలో 75.7, వైయస్సార్ కడప జిల్లాలో 14.5 మిల్లీమీటర్ల వంతున సరాసరి వర్షపాతం నమోదైందని సీఎస్కు వివరించారు. ► ఇంకా ఈటెలీ కాన్ఫరెన్స్ లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు. ► కాగా గత 24 గంటల్లో పై తెలిపిన ఆరు జిల్లాల్లోని 109 ప్రాంతాల్లో 64.5 మిల్లీ మీటర్లకంటే అధిక వర్షపాతం నమోదైనట్టు తెలుస్తోంది. ► మాండూస్ తుపాను బలహీనపడుతోంది. తీవ్ర వాయుగుండంగా మారి బలహీనపడుతోంది. ► తుపాను ప్రభావంతో తమిళనాడుతో పాటు ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ► తిరుపతిలో నీటమునిగిన కాలనీలను ఎమ్మెల్యే భూమన పరిశీలించారు. వరద బాధితులను ఆయన పరామర్శించారు. తిరుపతిలో మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్...మోకాళ్ళలోతు వరద నీటిలో వెళ్లి వరద బాధితులను పరామర్శించిన భూమన...👏👏👍 pic.twitter.com/IYmiYGTHw4 — Radhika Reddy...😍 (@sweety_00099) December 10, 2022 తిరుమల: ► మాండూస్ తుపాను ప్రభావంతో.. తిరుమలలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు టీటీడీ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. వర్షం కారణంగా పాపవినాశనం, జపాలి, వేణుగోపాల స్వామి ఆలయం, ఆకాశ గంగా, శ్రీవారి పాదాలకు వాహనాలను టీటీడీ అనుమతించడం లేదు. ఘాట్ రోడ్డులో అక్కడక్కడా కొండచరియలు విరిగి పడుతున్నాయి. దీంతో.. ద్విచక్ర వాహనదారులను అప్రమత్తం చేస్తోంది టీటీడీ. నెల్లూరు జిల్లా ► కోవ్వూరు నియోజవర్గంలో మాండూస్ తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం ► బలహీన పడుతున్న మాండూస్ తుపాను. తీవ్ర వాయు గుండంగా మారి మరింత బలహీనపడే దిశగా కదులుతోంది. తూర్పుగోదావరి ► మాండూస్ తుఫాను నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో ధాన్యం కొనుగోళ్ళు వేగవంతం చేశారు అధికారులు. జిల్లాలో ఇప్పటివరకు 30 వేల 126 మంది రైతుల నుంచి లక్షా 46 వేల 417 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు జాగ్రత్త లు తీసుకోవాలని చెబుతున్నారు అధికారులు. సాక్షి, అమరావతి: పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీరం దాటింది మాండూస్ తుపాను. పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ.. తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం కనిపిస్తోంది. తీరంలో కొనసాగుతున్న అలజడితో మరో రెండు రోజులు ఉత్తర తమిళనాడు, దక్షిణ ఏపీలోని పలు జిల్లాల్లో అతిభారీ నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. 80 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. తుపాను ప్రభావం తగ్గేవరకూ వేటకు వెళ్లోద్దని మత్యకారులకు అధికారుల సూచిస్తున్నారు. ప్రకాశం జిల్లాలోనూ వర్ష ప్రభావం కనిపిస్తోంది. నెల్లూరు జిల్లాలో టోల్ఫ్రీ నంబర్ 1077 మాండుస్ తుఫాన్ ప్రభావంతో అర్ధరాత్రి నుంచి తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లాలో ఈదురు గాలులు తో కూడిన భారీ వర్షం కురుస్తోంది. తిరుపతి నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమమయ్యాయి. ఘాట్ రొడ్డులో వాహన దారులను అప్రమత్తం చేస్తున్న సిబ్బంది. వర్షంలోనే తడిచి ముద్దవుతున్నారు భక్తులు. ఇంకొంతమంది భక్తులు గదులకే పరిమితం అయ్యారు. నగరంలోని లక్ష్మీపురం సర్కిల్, రామానుజ సర్కిల్, అన్నమయ్య సర్కిల్, పద్మావతి పురం, లీలమహల్, వెస్ట్ చర్చి, మహిళా యూనివర్సిటీ , కృష్ణ నగర్ లో లోతట్టు ప్రాంతాలు జలమమయ్యాయి. 🌀తీరం దాటిన మాండూస్ తుఫాన్ 🌀రాత్రి 1:30 గంటలకు పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటిన తుఫాన్ 🌀సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడే అవకాశం 🌀ఈరోజు ప్రకాశం, SPSR నెల్లూరు, తిరుపతి,చిత్తూరు,అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు pic.twitter.com/wsEOyoxgkl — Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) December 10, 2022 అలాగే.. రాయలసీమలో తుపాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వైఎస్ఆర్లో వర్షాలు.. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు మాండుస్ తుఫాన్ ప్రభావంతో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షo.. అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కడప, రైల్వే కోడూరు, రాయచోటి, రాజంపేట, పులివెందులలో వర్షం పడుతోంది. దీంతో ఆయా జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో మాండూస్ తుపాను ఎఫెక్ట్తో తుపాను, భారీ వర్షాల పట్ల అధికారులు అప్రమత్తం అయ్యారు. జిల్లా కలెక్టరేట్తో పాటు నాలుగు రెవెన్యూ డివిజన్లలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. తుపాను దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పాపాగ్ని నది తీరం వైపు వెళ్లకుండా ప్రజల్ని అప్రమత్తం చేశారు అధికారులు. ► జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కంట్రోల్ రూం నెంబర్:08568-246344, ► కడప రెవెన్యూ డివిజన్ కంట్రోల్ రూం: 08562-295990 ► జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ కంట్రోల్ రూం: 9440767485 ► బద్వేల్ రెవెన్యూ డివిజన్ కంట్రోల్ రూం: 91812160052 ► పులివెందుల రెవెన్యూ డివిజన్ కంట్రోల్ రూం: 7396167368 విజయనగరం మాండూస్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా చెదురు మదురు వర్షాలు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న చిరు జల్లులు తో పెరిగిన చలి తీవ్రత. శ్రీకాకుళం జిల్లా లో పలుచోట్ల గడిచిన రాత్రి నుండి చిరు జల్లులు కురుస్తున్నాయి. చలి తీవ్రత పెరిగింది. విద్యుత్ స్తంభాలు కూలినా, లైన్లు తెగినా.. టోల్ ఫ్రీ నెంబర్ 1912 -
IND VS NZ 3rd ODI: టీమిండియాకు షాకింగ్ న్యూస్
న్యూజిలాండ్తో మూడో వన్డేకు ముందు టీమిండియా అభిమానులకు షాకింగ్ న్యూస్ తెలిసింది. క్రైస్ట్చర్చ్లోని హాగ్లే పార్క్ వేదికగా రేపు (నవంబర్ 30) జరుగబోయే మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉందని స్థానిక వాతావరణ శాఖ వెదర్ ఫోర్కాస్ట్లో పేర్కొంది. క్రైస్ట్చర్చ్లో రేపు ఉదయం నుంచే అకాశం మేఘావృతమై ఉంటుందని, మ్యాచ్ సమయానికి (భారతకాలమానం ప్రకారం ఉదయం 7 గంటకు) భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ ప్రెడిక్షన్లో వెల్లడించింది. ఈ వార్త తెలిసి భారత క్రికెటర్లు, అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఈ మ్యాచ్ సాధ్యపడకపోతే సిరీస్ కోల్పోవాల్సి వస్తుందని బాధ పడుతున్నారు. కనీసం 10 ఓవర్ల పాటైన మ్యాచ్ జరిగితే, సిరీస్ సమం చేసుకునే అవకాశం అయినా ఉంటుందని అనుకుంటున్నారు. కాగా, 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో న్యూజిలాండ్ తొలి వన్డేలో విజయం సాధించగా (7 వికెట్ల తేడాతో).. రెండో వన్డే వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ఇక మూడో వన్డే కూడా రద్దైతే న్యూజిలాండ్ 1-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంటుంది. ఇదిలా ఉంటే, వన్డే సిరీస్కు ముందు జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా, డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం మూడో మ్యాచ్ టైగా ముగిసింది. ఈ మధ్యలో జరిగిన రెండో మ్యాచ్లో గెలిచిన హార్ధిక్ సేన.. 3 మ్యాచ్ల సిరీస్ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. -
Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: ఏపీలో పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం మంగళవారం కోస్తా తీరంలో స్థిరంగా కొనసాగుతోంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం నైరుతి దిశ వైపు వంపు తిరిగి ఉంది. ఉపరితల ద్రోణి అల్పపీడన ప్రాంతం నుంచి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశాల మీదుగా చత్తీస్ఘడ్ వరకు సగటు సముద్రమట్టం వరకు విస్తరించి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. (చదవండి: గుడ్న్యూస్: ఉద్యోగులకు ‘ఈ–స్కూటర్లు’) -
ఉరుములు, మెరుపులతో హైదరాబాద్లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో మళ్లీ వరుణుడి ప్రతాపం మొదలైంది. గురువారం మధ్యాహ్నం ఆకస్మాత్తుగా మొదలైన వాన సుమారు గంటపాటు దంచికొట్టింది. ఆల్వాల్, బోరబండ, యూసఫ్గూడ, మైత్రినవం, నిజాంపేట, కూకట్పల్లి, బోయినపల్లి, మారేడుపల్లి, బేగంపేట, చిలకలగూడ.. ఇలా చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మళ్లీ సాయంత్రం సమయంలో భారీ వర్షం పడింది. ఉరుములు, మెరుపులతో వాన దంచికొట్టింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లోనూ ఈదురు గాలులతో కూడిన వాన కురిసింది. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఏదొక సమయంలో నగరంలో వర్షం కురుసిన నేపథ్యంలో చాలాచోట్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు. చాలాచోట్ల నిలిచిపోయిన నీటిని తరలిస్తున్నారు. ట్రాఫిక్ జామ్ కాకుండా ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. గణేషుడి విగ్రహాల నిమజ్జనం దరిమిలా.. వర్షాలకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందునా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. మరోవైపు.. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజులు పరిస్థితి ఇలాగే కొనసాగవచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Rain Forecast: రాయలసీమలో మరో మూడు రోజులు భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు నుంచి తెలంగాణ వరకు రాయలసీమ మీదుగా విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు పడుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో (సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు) శ్రీసత్యసాయి, అనంతపురం, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో 13 సెంటీమీటర్ల అత్యధిక వర్షం కురిసింది. జూపాడు బంగ్లా మండలంలో 11.5, అన్నమయ్య జిల్లా బీరొంగి కొత్తకోట మండలంలో 10.6, అనంతపురం జిల్లా డి.హీరేలాల్ మండలంలో 10.4, విడపనకల్ మండలంలో 10.2, కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో 8.8, కర్నూలు అర్బన్, అన్నమయ్య జిల్లా కలికిరి మండలంలో 8.3, చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో 7.4, అనంతపురం జిల్లా బొమ్మనహళ్ మండలంలో 7.3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరో 3 రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. -
తెలంగాణ: ఆది, సోమవారాల్లో పలుచోట్ల వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశంఉందని వాతావరణ శాఖ తెలిపింది. వివిధ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు, ఒకట్రెండు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు వివరించింది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి ఇంటీరియర్ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. ఇది సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించినట్టు పేర్కొంది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోని సగానికి పైగా జిల్లాలకు విస్తరించినట్లు తెలిపింది. మరో రెండ్రోజుల్లో పూర్తిస్థాయిలో రుతుపవనాలు వ్యాప్తి చెందే అవకాశంఉందని స్పష్టం చేసింది. -
రాష్ట్రమంతటా రుతుపవనాల విస్తరణ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 13న తెలంగాణలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు గురువారం రాష్ట్రమంతటా విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాల ఉత్తర పరిమితి ఇప్పుడు పోరుబందర్, భావ్నగర్, ఖాండ్వా, గోండియా, దుర్గ్, భవానీపట్నం, కళింగపట్నం గుండా వెళుతోంది. అలాగే ఉపరితల ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగింది. దీంతో రాగల మూడు రోజులు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, చాలా జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశముందని తెలిపింది. ఇతర ప్రాంతాల్లోతేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇదిలావుండగా, గత 24 గంటల్లో మహబూబాబాద్లో 15 సెంటీమీటర్ల అతి భారీ వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా ముధోల్లో 13 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లిలో 12, అశ్వారావుపేటలో 9, మహబూబాబాద్ జిల్లా మల్యాల్లో 8, జగిత్యాల జిల్లా వెలగటూరు, వరంగల్ జిల్లా పర్వతగిరి, కరీంనగర్లలో 7సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్రం తెలిపింది. -
రానున్న రెండ్రోజులు మోస్తరు వానలు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెం డ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు గురువారం వాతావరణ శాఖ వెల్లడించింది. చత్తీస్గడ్ నుంచి కోస్తాంధ్ర తీరం వరకు కొనసాగుతున్న ఉపరితలద్రోణి తెలంగాణకు దూరంగా వెళ్లిందని తెలిపింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు రానున్న రెండ్రోజుల్లో గోవా, దక్షిణ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. గురువారం రాష్ట్రంలో సాధారణం కంటే 2 నుంచి 4డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రత రామగుండంలో 42.8 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత నిజామాబాద్లో 22.9 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. -
తెలంగాణలోకి ప్రవేశించనున్న నైరుతి రుతుపవనాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండల తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు ఊరటనిచ్చేలా వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. తెలంగాణలోకి మంగళవారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే రుతుపవనాల రాకకు రెండ్రోజులు ఆలస్యమైనట్లు పేర్కొంది. ఈ నెల 10వ తేదీ కల్లా రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపింది. వాస్తవానికి మే 29న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించగా ఆ తర్వాత వాటి కదలిక మందగించడంతో వ్యాప్తి ఆలస్యమైంది. ప్రస్తుతం రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వాతావరణ శాఖ వివరించింది. సాధారణం కంటే కాస్త ఎక్కువ వానలు... ఈ ఏడాది రాష్ట్రంలో వర్షాలు సంతృప్తికరంగా ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కంటే కాస్త ఎక్కువ వానలు కురుస్తాయని చెబుతున్నారు. తెలంగాణలో సాధారణ వర్షపాతం 72.05 సెంటీమీటర్లు కాగా.. గతేడాది వానాకాలంలో 100.97 సెంటీమీటర్ల మేర వర్షాలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 6 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదవగా 21 జిల్లాల్లో అధిక వర్షపాతం, మరో 6 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతంతో పోలిస్తే రాష్ట్రంలో ఈసారి మొత్తంమీద 104 శాతం మేర వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రుతుపవనాల కదలికలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అంచనాల్లో మార్పులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పెరిగిన ఉక్కపోత... కేరళలోకి నైరుతి రుతుపవనాలు ముందస్తుగా ప్రవేశించినప్పటికీ తొలి మూడు రోజులు మందకొడిగా కదలడంతో వాతావరణం చల్లబడలేదు. సాధారణంగా సీజన్కు ముందుగా కురిసే వర్షాలతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకొని చల్లబడుతుంది. కానీ ఈసారి నైరుతి సీజన్కు ముందు ఉష్ణోగ్రతలు పెరిగాయి. నడివేసవిలో నమోదైనట్లుగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. అసని తుపానుతో మే నెల మూడో వారంలో వాతావరణం చల్లబడినట్లు కనిపించినా ఆ తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగాయి. దీని ప్రభావంతో వాతావరణంలో ఉక్కపోత పెరిగింది. దీనికి వడగాడ్పులు తోడవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తాజాగా మరో రెండ్రోజులు కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. రుతుపవనాలు పూర్తిగా వ్యాప్తి చెందే వరకు ఉష్ణోగ్రతలు సాధారణానికి కాస్త అటుఇటుగానే నమోదు కానున్నాయి. ఆదివారం నల్లగొండలో 43.8 డిగ్రీ సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదవగా మెదక్లో 25 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. -
రుతుపవనాల దోబూచులాట
గ్రీష్మకాల మార్తాండుడు నిప్పులు చెరుగుతున్నవేళ నీలాకాశం నల్లటి మబ్బు తెరలతో గొడుగు పట్టాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. ఆ మేఘాలు తమ హృదయ కవాటాలు తెరిచి చినుకు ధారలతో నేలతల్లికి అభిషేకం చేస్తే ఇక చెప్పేదేముంది? అందుకే ‘వానంటే ప్రకృతి వరప్రసాదం. నింగి నేలకు దిగిరావడం’ అంటాడు అమెరికన్ రచయిత, కవి జాన్ అప్డైక్. మన దేశంలో జోరుగా వానలు మోసుకొచ్చే నైరుతీ రుతుపవనాల గురించి భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఏటా విడుదల చేసే అంచనాల గురించి అందరిలోనూ ఆసక్తి ఉంటుంది. అంచనాలు తప్పినప్పుడు ఆసక్తి స్థానంలో నిరాసక్తత ఏర్పడటమూ రివాజే. ఈసారి కూడా ఐఎండీ అంచనాలు కాస్త గురితప్పాయి. చాలా ముందే రుతుపవనాలు ఆగమిస్తాయని చెప్పడంతో మొదలుపెట్టి అవి వచ్చేశాయని కూడా ప్రకటించి నాలిక్కరుచుకోవడంతో ఎప్పటికన్నా ఎక్కువగా ఐఎండీపై విమర్శల జోరు పెరిగింది. ‘కడుపుతో ఉన్నమ్మ కనక మానుతుందా’ అన్నట్టు శుక్రవారం నాటికి దాదాపు కేరళ అంతటా వర్షాలు మొదలయ్యాయని తాజా సమాచారం చెబుతోంది. వాతావరణ అంచనాలకు సంబంధిం చిన ఉపకరణాలు, సాంకేతికతలు అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా ఐఎండీకి తొట్రుపాటు ఎందుకు తప్పడం లేదు? ‘సాంకేతికతలుంటేనే సరిపోదు, వాటిని సక్రమంగా వినియోగించాలి. పద్ధతులు పాటించాలి’ అంటోంది ప్రైవేటు వాతావరణ పరిశోధనా సంస్థ స్కైమెట్. ఒక రంగంలో పనిచేసేవారి మధ్య తెలియని పోటీతత్వం ఉండటం, పరస్పరం విమర్శించుకోవడం అసహజమేమీ కాదు. కనుక స్కైమెట్ విమర్శే సర్వస్వం అనుకోనవసరం లేదు. ఐఎండీ ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా అంచనాలు అందించింది. ఈసారి దేశ వాయవ్య ప్రాంతంలో తప్ప ఇతరచోట్ల 103 శాతం వరకూ వర్షపాతం ఉండొచ్చని చెప్పింది. దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో మే నెల 15 కల్లా నైరుతీ రుతుపవనాలు ఆగమిస్తాయన్నది. 19న మరో అంచనా విడుదల చేసింది. అయిదారు రోజులు ముందు... అంటే ఏటా ఇంచుమించు జూన్ 1 ప్రాంతంలో కేరళను పలకరించే రుతుపవనాలు మే 25 నాటికే రావొచ్చని వివరించింది. చివరకు రుతుపవనాలు వచ్చేశాయని 29న కురిసిన వర్షాల ఆధారంగా ఐఎండీ మరో ప్రకటన విడుదల చేసింది కూడా. అయితే ఆ మర్నాడే ఒక వివరణనిచ్చింది. వాతావరణ పరిస్థితుల రీత్యా రుతుపవనాలు ప్రభావం అన్నిచోట్లా సమంగా ఉండకపోవచ్చని తెలిపింది. నిజమే. కేరళలోని 14 వర్షపాత నమోదు కేంద్రాల్లో ఒక్కచోట కూడా వానపడిన దాఖలా లేదు. మరో రెండు కేంద్రాల్లో మాత్రం ఒక మిల్లీమీటరు వర్షపాతం కన్నా తక్కువ నమోదైంది. కేవలం 29న పడిన వర్షం ఆధారంగా అంచనాలు ప్రకటించడం ప్రమాణాలు ఉల్లంఘించడమేనన్నది స్కైమెట్ ఆరోపణ. ‘వాన రాకడ... ప్రాణం పోకడ ఎవరికీ తెలియదు’ అన్నది నానుడి. కానీ ఏళ్లు గడుస్తున్నకొద్దీ ఈ నానుడికి విలువ లేకుండా పోతున్నది. క్షణంసేపు ఆగిన ప్రాణాన్ని సైతం నిలబెడుతున్న మాదిరే వాతావరణ అంచనాలు కూడా దాదాపు సరిగానే ఉంటున్నాయి. అలాగని ప్రమాణాలను పక్కన బెట్టి ఇష్టానుసారం అంచనాలివ్వడం సరికాదు. ఒకటి రెండు రోజులు వేచిచూసి, అన్నివిధాలా అధ్యయనం చేస్తే వచ్చే నష్టం లేదు. ఇంకా చెప్పలేదేమని నిలదీసేవారెవరూ ఉండరు. కానీ అశాస్త్రీయ అంచనాలు వెలువరిస్తే పరిశోధనా సంస్థలకుండే ప్రతిష్ఠ దెబ్బతింటుంది. మార్కెట్లు మెరిసిపోవడానికీ, మదుపరులు హుషారెత్తడానికీ ‘మంచి అంచనాలు’ ఇవ్వాలని వచ్చిన రాజకీయ ఒత్తిడుల కారణంగానే ఐఎండీ అడ్డతోవలో అంచనాలు వేసిందన్న ఆరోపణలున్నాయి. అందులోని నిజానిజాల మాటెలా ఉన్నా అంచనాలు తప్పినప్పుడు శాస్త్రవేత్తలను నిలదీసిన దాఖలాలు మన దేశంలో లేవు. 2009 ఏప్రిల్లో ఒక నగరానికి భారీ నష్టం తీసుకొచ్చి, 306 మందిని బలిగొన్న భూకంపంపై సరైన అంచనాలు ఇవ్వలేకపోయారన్న కారణంగా ఆరుగురు ఇటలీ శాస్త్రవేత్తలకు ఆరేళ్ల చొప్పున జైలు శిక్షలు పడ్డాయి. అదృష్టవశాత్తూ ఇక్కడ అలాంటి పరిస్థితులు లేవు. ఈపాటికి శాంతించాల్సిన భానుడు ఇంకా తన ప్రతాపం చూపుతూనే ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో రానున్న నాలుగైదు రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉన్నదని ఇప్పటికే ఆ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. 47 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకూ ఈ ఉష్ణోగ్రతలుంటాయని దాని అంచనా. అందుకు తగ్గట్టే వాతావరణం భగ్గుమంటున్నది. ఈ పరిస్థితుల్లో ఐఎండీ అంచనా లకు విలువేముంటుంది? మన దేశంలో సాగుయోగ్యమైన భూముల్లో 60 శాతం వర్షాధారం. మనకు కురిసే వర్షాల్లో 80 శాతం నైరుతీ రుతుపవనాల ద్వారానే వస్తాయి. మన జీడీపీలో సాగు రంగం వాటా క్రమేపీ చిక్కిపోతున్నా ఇప్పటికీ అది గణనీయంగానే ఉంది. అన్నిటికీ మించి గ్రామీణ ప్రాంతాల్లో 50 శాతంమందికి సాగురంగమే ఉపాధి కల్పిస్తున్నది. ఉపాధి, ద్రవ్యోల్బణం, పారిశ్రామికరంగ కదలిక, గ్రామీణ ఆదాయాలు వగైరాలన్నీ నైరుతీ రుతుపవన గమనంపైనే ఆధారపడి ఉంటాయి. చినుకు కోసం ఆకాశంకేసి చూసే రైతును నిరాశపరిస్తే... అతని నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తే దాని ప్రభావం సాగు ఉత్పాదకతపై ఎంతగానో ఉంటుంది. ఫలానా తేదీకి రుతుపవనాలు వస్తాయని చెప్పడం వల్ల రైతులు డబ్బు ఖర్చుచేసి అవసరమైనవన్నీ సమకూర్చు కుంటారు. తీరా అనుకున్నట్టు జరగకపోతే నష్టపోతారు. కనుక అంచనాల విషయంలో శాస్త్రవేత్తలు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. విమర్శలకు తావీయని రీతిలో వ్యవహరించాలి. -
రానున్న మూడు రోజులు ‘మంట’లే.. వీలైతేనే బయటకు రండి!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో మూడు రోజల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం ప్రకటించింది. 83 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, మరో 157 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. శుక్ర, శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 46ని– 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే మరికొన్ని జిల్లాల్లో 43ని నుంచి 45, మరికొన్ని జిల్లాల్లో 40–42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. ఈ మూడు రోజులు ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, వడదెబ్బ తగలకుండా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్), లస్సీ, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ తెలిపారు. చదవండి: పందులకూ ఓ పందెం! విజేతలకు రూ.2 లక్షల బహుమతి -
ఢిల్లీలో గాలివాన దుమారం
-
తెలంగాణలో ఉరుములతో కూడిన వర్షాలు
-
వర్ష బీభత్సం
అనకాపల్లి: అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.. అర్ధరాత్రి వేళ వర్ష బీభత్సం జిల్లాను అతలాకుతలం చేసింది. మంగళవారం రాత్రి 12 గంటలు దాటాక గాలివాన మొదలైంది. కుంభవృష్టి కురిసింది. పలు మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కురిసింది గంటపాటే అయిన అధిక వర్షపాతం నమోదైంది. మునగపాకలో అత్యధికంగా 92.6 మిల్లీమీటర్లు, కశింకోటలో 90.2 మి.మీ. వర్షం పడింది. ఈదురుగాలుల బీభత్సానికి అనకాపల్లి, యలమంచిలి, చోడవరం నియోజకవర్గాల పరిధిలో చెట్లు నేలకొరిగాయి. చోడవరంలో 15 విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. అనకాపల్లి, యలమంచిలి పరిధిలో అక్కడక్కడ విద్యుత్స్తంభాలు విరిగిపడ్డాయి. పలుచోట్ల చెట్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు రాత్రంతా అంతరాయం ఏర్పడింది. బుధవారం ఉదయం నుంచి పునరుద్ధరణ పనులు చేపట్టారు. అనకాపల్లిలో రైల్వే బ్రిడ్జి కింద నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలను లక్ష్మీదేవిపేట రైల్వేగేటు వైపు మళ్లించారు. పలు చోట్ల కూలిన చెట్లను ఆయా కాలనీల వారు స్వచ్ఛందంగా తొలగించుకున్నారు. బుచ్చెయ్యపేట మండలం నీలకంఠాపురం గ్రామంలో కోరుకొండ తాతయ్యలకు చెందిన పాడి గేదెపై తాటిచెట్టు విరిగి పడింది. వడ్డాది కస్పా, విజయరామరాజుపేట, మంగళాపురం, కుముదాంపేట, బంగారుమెట్ట తదితర గ్రామాల్లో రబీ వరి పంటకు తీవ్రంగా నష్టం జరిగింది. కోసిన వరి పనులు నీట మునిగిపోయాయి. పలు గ్రామాల్లో అరటి, మామిడి, అపరాలు, కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. పిడుగుపాటుకు పూరిల్లు దగ్ధం గొలుగొండ: మండలంలో ఏఎల్పురం గ్రామానికి చెందిన కె.నాగరాజు ఇల్లు మంగళవారం అర్ధరాత్రి పిడుగుపాటుకు కాలిపోయింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. బుధవారం వీఆర్వో శ్రీధర్ వచ్చి బాధితులను పరామర్శించారు. రైతులకు నష్టం మునగపాక: ఈదురుగాలులు వీయడంతో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపోయాయి. దీంతో రాత్రంతా అంధకారం నెలకొంది. ఆవ ప్రాంతంలో కోసిన వరి పనలు నీట మునిగిపోయాయి. అకాల వర్షం రైతులకు నష్టం మిగిల్చింది. -
దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం..
-
అమెరికాను వణికిస్తున్న ఇజ్జీ.. 1,200 విమానాలు రద్దు
అట్లాంటా: అమెరికా ఆగ్నేయ ప్రాంతాన్ని చలి తుఫాను, పెనుగాలులు, హిమపాతం వణికిస్తున్నాయి. వీటి ప్రభావంతో చాలాచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయాలు, వృక్షాలు నేలకూలడం, రోడ్లన్నీ మంచుతో నిండిపోవడం జరుగుతోంది. జార్జియా, ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా, ఫ్లోరిడా తదితర ప్రాంతాలన్నీ ఆదివారం నుంచి చలిపులి చేతికి చిక్కి వణుకుతున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు హైవే పెట్రోల్ అధికారులు తెలిపారు. (చదవండి: లైన్లో నిలబడితే డబ్బులే డబ్బులు.. గంటకు రూ.2 వేలు పక్కా!) కారును మంచు కప్పేసిన దృశ్యం ఫ్లోరిడాలో గంటకు 190 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో విరుచుకుపడ్డ టోర్నడో బీభత్సంతో ఒక ట్రైలర్ పార్క్ నాశనమైంది. చార్లట్ డగ్లస్ విమానాశ్రయం నుంచి 1,200కు పైగా విమానాలను రద్దు చేశారు. కరోలినాలో దాదాపు 1.5 లక్షల మంది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. న్యూయార్క్ పై ప్రభావం ఉండకపోయినా, లాంగ్ ఐలాండ్, కనెక్టికట్ తీరప్రాంతాల్లో ప్రభావం ఉంటుందని అంచనా. ఒహాయో, పెన్సిల్వేనియాల్లో 6– 13 అంగుళాల మేర హిమపాతం ఉండొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. (చదవండి: అఫ్గనిస్తాన్లో భారీ భూకంపం.. 26 మంది మృతి) -
తమిళనాడుకు మరో తుపాను హెచ్చరిక! రానున్న 48 గంటల్లో..
సాక్షి, చెన్నై: రాష్ట్రంలోని కోస్తా జిల్లాలకు రానున్న 48 గంటల్లో మరో తుపాను పొంచి ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే తీవ్ర వర్షాలతో అల్లాడుతున్న తమిళనాడు నవంబర్ 29 నాటికి మరో తుపాన్ను ఎదుర్కొనబోతోంది. తాజాగా వాతావరణ శాఖ జారీ చేసిన సూచనల ప్రకారం.. రానున్న 48 గంటల్లో దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. నవంబర్ 29 నాటికి అది మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అంచనా. ஆழ்வார்பேட்டை பாரதிதாசன் சாலை மழை நீரால் மூழ்கியது. People.. be safe, drive carefully wherever you see the water as there are damaged roads as well. #ChennaiRains #chennaifloods #Rains #TamilNadu #NEWS #NewsBreak pic.twitter.com/gPuHgoMA7C — suwathy venugopal (@suwavenus) November 27, 2021 #Palar river witnessing the flow of more than 1 lakh cusecs of water #TamilNadu #Vellore #AP #Karnataka pic.twitter.com/nIlLu4nXSp — Shabbir Ahmed (@Ahmedshabbir20) November 21, 2021 అయితే, తమిళనాడుతోపాటు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలలో పరిస్థితి రాబోయే 2-3 రోజుల్లో మరింత ఉధృతంగా మారనుందని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మని కొన్ని ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అంతేకాకుండా డిసెంబర్ 1 నాటికి మధ్యప్రదేశ్లోని పశ్చిమ, నైరుతి ప్రాంతాలతో పాటు గుజరాత్లోని దక్షిణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. Visual from West Mambalam, #Chennai#ChennaiRain @karthickselvaa @Stalin__SP @vedhavalli_13 @dharannniii #Tamilnadu pic.twitter.com/l4vC27lFoo — Tamilnadu Galatas (@tamilnadugalata) November 27, 2021 Beautiful weather at Beasant Nagar beach, Chennai #ChennaiRains2021 #TamilNadu #Chennai pic.twitter.com/Zqk23ZXA5P — Vidhu Trivedi 🇮🇳 (@vidhu0522) November 27, 2021 -
వెల్డన్ ‘వెదర్మ్యాన్’!
యూనివర్సిటీ క్యాంపస్ (చిత్తూరు జిల్లా): తిరుపతికి చెందిన యువకుడు సాయిప్రణీత్ ‘ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్’ పేరిట కచ్చితమైన వాతావరణ సూచనలు అందిస్తూ రైతులకు దోహదపడుతున్నాడు. వృత్తి రీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా వివిధ వెబ్సైట్లు, వివిధ ప్రోగ్రామ్ల ద్వారా వాతావరణాన్ని విశ్లేషించి అన్నదాతలకు సేవలందిస్తున్నాడు. సాయి ప్రణీత్ నేపథ్యం ఇదీ.. సాధారణ కుటుంబం తిరుపతిలోని గాయత్రి నగర్లో నివాసం ఉంటున్న సాయిప్రణీత్ తండ్రి వెంకట సుబ్రమణ్యం ఇన్సూరెన్స్ సంస్థలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. తల్లి భువనేశ్వరి ఎస్వీయూ క్యాంపస్లోని యూనియన్ బ్యాంకులో ఉద్యోగి. సాయిప్రణీత్ చెన్నైలో జన్మించాడు. తిరుపతిలో ఇంటర్ పూర్తి చేసి, చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ఇంజనీరింగ్లో బీఈ పూర్తి చేశాడు. అనంతరం గేట్ ప్రవేశ పరీక్ష రాసి ఎస్వీయూ ఈఈఈ విభాగంలో ఎంటెక్ లో చేరాడు. ఈ సమయంలో ఒక ప్రముఖ సంస్థలో సాప్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం బెంగళూరులోని ఆ సంస్థలో పనిచేస్తున్నాడు. వాతావరణం అంటే ఇష్టం.. సాయి ప్రణీత్కు చిన్నప్పటి నుంచి వాతావరణం అంటే ఎంతో ఇష్టం. తాను బీటెక్ చదివే సమయంలో ఖాళీ సమయంలో వాతావరణానికి సంబంధించిన జర్నల్స్, వ్యాసాలు, పుస్తకాలు చదవడం నేర్చుకున్నాడు. వివిధ రకాల డేటా సోర్స్ ఉపయోగించుకొని విశ్లేషణలు చేసి వాతావరణ మార్పులను కచ్చితత్వంతో అంచనా వేస్తూవచ్చాడు. ఏడాది క్రితం ‘ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్’ పేరిట బ్లాగ్ పేజీ రూపొందించి సామాజిక మాధ్యమాల్లో వాతవరణ మార్పులు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ పోస్టులు పెట్టేవాడు. ఈయన చెప్పిన సూచనలు, అంచనాలు వాస్తవానికి దగ్గరగా ఉంటుండడంతో సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్స్ పెరిగారు. ఫేస్బుక్ పేజీని 26 వేల మంది, ట్విట్టర్లో 11 వేల మంది అనుసరిస్తున్నారు. వాతావరణంలో మార్పులను ఎప్పటికప్పుడు అందిస్తూ రైతులను చైతన్యపరుస్తున్నాడు. ఇంతకుముందే ఐఎండీ, ఐరాస నుంచి ప్రశంసలు పొందాడు. తాజాగా ప్రధాని నుంచి ప్రశంసలు రావడంతో తండ్రి వెంకటసుబ్రమణ్యం, తల్లి భువనేశ్వరి, సోదరి లక్ష్మీప్రత్యూష హర్షం వ్యక్తం చేశారు. ఎంతో సంతోషం ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ పేరిట నేను అందిస్తున్న వాతావరణ సేవలను ప్రధాని మోదీ మన్కీ బాత్లో ప్రస్తావించడం, ప్రశంసించడం ఎంతో సంతోషంగా ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నాకు తక్కువ సమయం దొరుకుతుంది. అయితే, ఉన్న సమయంలోనే రైతులకు సహకారం అందించాలన్న లక్ష్యంతో కచ్చితమైన వాతావరణ సేవలను అందిస్తున్నాను. భవిష్యత్లో మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తాను. – సాయిప్రణీత్, ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ -
WTC Final: తొలి రోజు వర్షార్పణం.. మిగతా రోజులు కూడా డౌటే..?
సౌథాంప్టన్: కనీసం టాస్ కుడా పడకుండానే భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ తొలి రోజు ఆట రద్దైంది. ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో టీ విరామం అనంతరం రిఫరీ తొలి రోజు ఆటను రద్దు చేస్తుననట్లు ప్రకటించాడు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వరుణుడు కాస్త కరుణించినట్లు కనిపించినా, ఆతర్వాత మళ్లీ జల్లులు మొదలుకావడంతో తొలి రోజు ఆటను పూర్తిగా రద్దు చేశారు. మైదానమంతా వర్షం నీరుతో నిండు కుండలా మారిపోయింది. దీంతో రేపటి ఆట సాధ్యాసాధ్యాలపై కూడా అనుమానం నెలకొంది. మరోవైపు సౌథాంప్టన్లో వచ్చే ఆరు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని బ్రిటన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో వెదర్ వార్నింగ్ను జారీ చేసింది. ఎల్లో వెదర్ వార్నింగ్ అంటే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవడం అని అర్ధం. ఈ మ్యాచ్ జరిగాల్సినన్ని రోజులు ఓ మోస్తరు నుంచి భారీ, అతిభారీ వర్షాలు కురుస్తాయని బీఎండీ పేర్కొంది. ప్రస్తుతం అక్కడ 16 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వడంతో పాటు.. చిరుజల్లులు పడుతున్నాయని తెలిపింది. ఇదిలా ఉంటే, నిన్నటి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా ఏజియస్ బౌల్ స్టేడియం మొత్తం చిత్తడిగా మారింది. పిచ్ డ్యామేజ్ కాకుండా గ్రౌండ్ స్టాఫ్ దాన్ని కవర్లతో కప్పి ఉంచారు. వర్షం పూర్తిగా ఎడతెరిపినిస్తే కానీ, గ్రౌండ్లో కి ఎంటర్ కాలేని పరిస్థితి. కాగా, ఈ మ్యాచ్కు రిజర్వ్ డే ఉన్నప్పటికీ.. మరో వారం రోజుల పాటు వర్షాలు కురువనున్న నేపథ్యంలో ఏ రోజు ఎన్ని ఓవర్ల ఆట సాధ్యమయ్యే అవకాశం ఉందన్న విషయాన్ని విశ్లేషకులు పరిశీలిస్తున్నారు. చదవండి: కోహ్లీ మాటతప్పాడు.. సిరాజ్ అభిమానుల ఆగ్రహావేశాలు -
WTC Final: చారిత్రక మ్యాచ్కు వరుణ గండం..?
సౌతాంప్టన్: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారందరికీ ఇదో చేదు వార్త. భారత్, న్యూజిలాండ్ మధ్య మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న మెగా పోరుకు వరుణ గండం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రిజర్వు డేతో కలిపి మొత్తం ఆరు రోజులు పాటు మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి డబ్ల్యూటీసీ ఫైనల్ కావడంతో.. ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. Weather forecast at the Rose Bowl. #WTCFinal #WTCFinal #NZvsIND https://t.co/hLHb7bsG11 pic.twitter.com/JhUprDqO1C — Monty Panesar (@MontyPanesar) June 14, 2021 కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్కు వర్ష గండంపై పొంచి ఉందన్న అంశంపై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ ఓ ట్వీట్ చేశాడు. జూన్ 18 నుంచి 23 వరకు సౌతాంప్టన్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మ్యాచ్కు ఒకరోజు ముందు నుంచే వర్షం మొదలవుతుందని పేర్కొన్నారు. ఇదే జరిగితే మొట్టమొదటి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేతలుగా భారత్, న్యూజిలాండ్ జట్లు సంయుక్తంగా నిలుస్తాయని వెల్లడించాడు. ఇదిలా ఉంటే, వర్షం పడి చల్లటి వాతావరణం ఉంటే మాత్రం కివీస్కే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇందుకు 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్ను ఉదాహరణగా చూపిస్తున్నారు. మరోవైపు ఐసీసీ టోర్నీల్లో కివీస్కు టై గండాలు బయపెడుతున్నాయి. గత వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ సూపర్ ఓవర్లలో స్కోర్లు సమం కావడంతో ఆ జట్టుకు ప్రపంచకప్ దక్కకుండా పోయింది. ఇప్పుడు టెస్టు ఛాంపియన్షిప్లోనూ అలాంటి పరిణామాలే ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ సంయుక్త విజేతను ప్రకటించడం ఆ జట్టుకు ఊరట కలిగించే అంశం. భారత జట్టు: రోహిత్ శర్మ, శుభ్మన్గిల్, పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్య రహానే(వైస్ కెప్టెన్), హనుమ విహారి, రిషభ్ పంత్(కీపర్), సాహా(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్. కివీస్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ బ్లండెల్, ట్రెంట్ బౌల్ట్, డేవాన్ కాన్వే, కోలిన్ గ్రాండ్హోమ్, మాట్ హెన్రీ, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, హెన్రీ నికోల్స్, అజాజ్ పటేల్, టిమ్ సౌథీ, రాస్ టేలర్, నీల్ వాగ్నర్, బీజే వాట్లింగ్, విల్ యంగ్. చదవండి: క్రికెట్లోకి రీ ఎంట్రీ అన్నాడు.. అంతలోనే? -
Monsoon: రుతు పవనాలు వచ్చేస్తున్నాయ్
హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు వేగంగా వచ్చేస్తున్నాయి. జూన్ 3న కేరళ తీరాన్ని తాకనున్నట్టు వాతావారణ శాఖ తెలిపింది. సాధారణంగా జూన్ మొదటి వారంలో నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని చేరుకుంటాయి. అయితే ఈసారి మే 31న కేరళకు రుతుపవనాలు వస్తాయని వాతవరణ శాఖ మొదట అంచనా వేసింది. ప్రస్తుతం జూన్ 3న కేరళను తాకుతాయని చెబుతోంది. తొలకరి చినుకులు జూన్ మొదటి వారానికి కర్నాటక, గోవా తీరాలకు నైరుతి రుతు పవనాలు చేరుకుంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. రుతు పవనాల ఆగమనంతో కేరళ, మహే, కర్నాటకలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. మండుతున్న ఎండలు గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు భగ్గుమంటున్నాడు. మరో వారం పది రోజుల్లో రుతు పవనాలు తెలుగు రాష్ట్రాలకు చేరుకోనున్నాయి. దీంతో ఎండల తీవ్రత తగ్గనుంది. ఇటీవల వచ్చిన టౌటే, యాస్ తుపానుల కారణంగా రుతుపవనాల రాకలో ఏదైనా జాప్యం జరుగుతుందేమమో అనే ఆందోళన రైతుల్లో నెలకొని ఉండేది. కానీ రుతుపవనాలు సకాలంలో వస్తున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతన్నలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. -
Monsoon 2021: ఈ ఏడాది సాధారణ వర్షపాతం
న్యూఢిల్లీ: దేశంలో కురిసే 75 శాతంపైగా వర్షపాతానికి కీలకమైన నైరుతి రుతు పవనాలు ఈ ఏడాది సాధారణంగా ఉంటాయని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ నెలల సరాసరి వర్షపాతం 103 శాతంగా ఉంటుందని, ఈ అంచనాకు అటూఇటూగా 5 శాతం మాత్రమే తేడా ఉండే అవకాశముందని స్కైమెట్ వాతావరణ విభాగం ప్రెసిడెంట్ జీపీ శర్మ తెలిపారు. ఇది ఆరోగ్యకరమైన సాధారణ పరిస్థితిగా ఆయన పేర్కొన్నారు. రుతు పవనాలు సాధారణంగా ఉండేందుకు 65%, సాధారణంగా కంటే ఎక్కువగా ఉండేందుకు 15%వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. 96–104 మధ్యలో వర్షపాతం ఉంటే సాధారణంగా, 103 ఉంటే సాధారణంగా కంటే ఎక్కువగా పరిగణిస్తారు. నెలల వారీగా చూస్తే, జూన్లో సరాసరి వర్షపాతం 106%, జూలైలో 97%, ఆగస్టు, సెప్టెంబర్లలో 99%, 116 శాతం కురిసే అవకాశాలున్నాయని స్కైమెట్ తెలిపింది. వరసగా మూడో ఏడాది 2021లో కూడా రుతుపవనాలు సానుకూలంగా ఉన్నాయని జీపీ శర్మ తెలిపారు. గడిచిన రెండేళ్లలో సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదైందన్నారు. భౌగోళిక పరంగా చూస్తే ఉత్తర భారత మైదాన ప్రాంతం, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో లోటు వర్షపాతం నమోదయ్యే ప్రమాదముందని చెప్పారు. పసిఫిక్ మహాసముద్రంలో గత ఏడాది నుంచి కొనసాగుతున్న లానినా ప్రభావం నెమ్మదించడంతోపాటు ఈ సీజన్లో స్థిరంగా ఉండే అవకాశముందని స్కైమెట్ సీఈవో యోగేశ్ పాటిల్ చెప్పారు. కాగా, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అధికారిక అంచనాలను ఈ వారంలోనే విడుదల చేయనుంది. ఇక్కడ చదవండి: గుడ్న్యూస్: త్వరలో పెట్రోల్, డీజిల్పై పన్ను తగ్గింపు టైమ్ మెషీన్స్: ఏయే పనికి ఎంత టైం కేటాయిస్తున్నామంటే! -
ఏప్రిల్ 16 నుంచి ఏపీలో అకాల వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: వాతావరణం క్రమంగా మారుతోంది. ఎన్నడూ లేని విధంగా నడి వేసవిలో వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా.. ఎండలు పెరిగి అకాల వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. ఇవన్నీ.. నైరుతి రుతుపవనాల రాకకు ముందస్తు సంకేతాలని భావిస్తున్నారు. మధ్య బంగాళాఖాతంలో అధికపీడనం కొనసాగుతోంది. దీనికి తోడు దక్షిణ బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమగాలులు రాష్ట్రంపై విస్తరిస్తున్నాయి. ఈ తేమ గాలులు క్రమంగా దిగువకు వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో.. ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. 16 నుంచి రాయలసీమలోని కర్నూలులో వర్షాలు ప్రారంభమై క్రమంగా మిగిలిన జిల్లాలకు విస్తరిస్తాయని, అదేవిధంగా.. కోస్తాంధ్రలోనూ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ నెల 22 వరకు వర్షాలు పడే సూచనలున్నాయని, దీని వల్ల రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంపై తక్కువ ఎత్తులో ఆగ్నేయ, దక్షిణ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో నేడు, రేపు ఉత్తర కోస్తా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో మాత్రం పొడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో కురుపాంలో 3.1 సెం.మీ., గుమ్మలక్ష్మీపురంలో 2.7, చింటూరులో 2.1, రుద్రవరం, బుట్టాయగూడెంలలో 1.7, పెదకూరపాడులో 1.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
నేడు రాయలసీమలో మోస్తరు వానలు
సాక్షి, విశాఖపట్నం/పాడేరు/అరకులోయ: ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న హిందూ మహాసముద్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 4.5 కిమీ ఎత్తు వరకూ విస్తరించి ఉంది. మరోవైపు మన్నార్ గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం క్రమంగా బలహీనపడింది. ఈ ప్రభావంతో నేడు రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. కోస్తాంధ్రలో మాత్రం పొడి వాతావరణం ఉంటుంది. విశాఖ ఏజెన్సీ వ్యాప్తంగా చలిగాలులు విజృంభిస్తున్నాయి. మంగళవారం చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. పొగమంచు కూడా దట్టంగా కురుస్తోంది. సంతలకు వెళ్లే గిరిజనులు చలి తీవ్రతతో వణికిపోతున్నారు. -
రెడ్ అలర్ట్: రాష్ట్రానికి బురేవి తుపాన్ భయం
సాక్షి, చెన్నై: నివర్ తరువాత రాష్ట్రానికి బురేవి తుపాన్ భయం పట్టుకుంది. బుధవారం సాయంత్రం లేదా రాత్రి దక్షిణ తమిళనాడు జిల్లాల్లో తీరందాటే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముఖ్యమంత్రి పళనిస్వామి మంగళవారం చెన్నై సచివాలయంలో ఉన్నతాధికారులతో తుపాన్ సహాయక చర్యలను సమీక్షించారు. దక్షిణ బంగాళాఖాతంలో గత నెల 28 నుంచి కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం వాయుగుండంగా మారి 24 గంటల్లో తుపానుగా మారుతుందని భారత వాతావరణ కేంద్రం మంగళవారం ప్రకటించింది. మంగళవారం సాయంత్రానికి వాయుగుండం 11 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు కదులుతూ నేడు సాయంత్రం లేదా రాత్రి త్రికోణకొండల సమీపంలో తీరందాటగలదని అంచనావేశారు. దీని ప్రభావంతో దక్షిణ తమిళనాడులోని కన్యాకుమారి, తిరునెల్వేలి, తూత్తుకూడి, తెన్కాశీ జిల్లాల్లో 3, 4 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యలపై సీఎం ఎడపాడి సమీక్ష నిర్వహించారు. చదవండి: (అతి భారీ వర్షాలు: 2న రెడ్ అలర్ట్) బురేవిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని, భయపడాల్సిన పని లేదని రెవెన్యూ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ మీడియాకు మంగళవారం తెలిపారు. అరక్కోణం నుంచి 20 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను నాగర్కోవిల్కు పంపామన్నారు. కుమరి నుంచి 161 మరపడవల్లో ఇటీవల సముద్రంలోకి చేపలవేటకు వెళ్లిన రెండువేల మంది మత్స్యకారులు తీరం చేరకపోవడంతో ఆందోళన నెలకొంది. బురేవి హెచ్చరికల సమాచారాన్ని చేరవేసేందుకు చర్యలు చేపట్టారు. -
అతి భారీ వర్షాలు: 2న రెడ్ అలర్ట్
సాక్షి, చెన్నై: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారనుంది. ఒకటో తేదీ నుంచి దక్షిణ తమిళనాడులో వర్షాలు కురవనున్నాయి. రెండో తేదీ అతి భారీ వర్షాలకు అవకాశాలు ఉండడంతో ముందుగానే రెడ్ అలర్ట్ ప్రకటించేశారు. నివర్ నష్టం తీవ్ర తను పరిశీలించేందుకు కేంద్ర బృందం సోమవారం చెన్నైకు రానుంది. నివర్ తుపాన్ తీరం దాటి నాలుగు రోజులు అవుతున్నా, చెన్నై శివార్లలోని అనేక లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీళ్లు ఇంకా తొలగలేదు. ఈ సమయంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్కు సమీపంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ఆదివారం మరింతగా బలపడింది. ఇది మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారనుంది. ఒకటో తేదీ మరింతగా బలపడనున్న దృష్ట్యా, ఈ ప్రభావం రాష్ట్రంలోని దక్షిణ తమిళనాడుపై పడనుంది. తొలుత సముద్ర తీర జిల్లాలో మోస్తరు వర్షం, రెండో తేదీ అన్ని జిల్లాల్లో అతి భారీ వర్షం పడుతుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రెండో తేదీన బురేవి తుపాన్గా మారి అతి భారీ వర్షాలు పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ముందుగానే ఆదివారం రెడ్ అలర్ట్ ప్రకటించారు. దక్షిణ తమిళనాడులోని జిల్లాల్లో అధికార వర్గాలు ముందస్తు జాగ్రత్తలపై దృష్టి పెట్టే పనిలోపడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. చదవండి: (మళ్లీ గండం.. బంగాళాఖాతంలో ద్రోణి..) నేడు కేంద్ర బృందం రాక.. నివర్ రూపంలో కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి, రాష్ట్రంలోని కడలూరు, విల్లుపురంలలో ప్రభా వం ఎక్కువే. మిగిలిన జిల్లాల్లో వర్షాలు ఆశాజనకంగానే పడ్డాయి. ఈ పరిస్థితుల్లో నివర్ రూపంలో ఏ మేరకు నష్టం వాటిల్లిందో అంచనా వేసి, కేంద్రానికి నివేదిక సమర్పించేందుకు సోమవారం ప్రత్యేక బృందం చెన్నైకు రానుంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అశుతోష్ అగ్నిహోత్రి నేతృత్వంలో ఏడు గురు అధికారులు ఈ బృందంలో ఉన్నారు. రాత్రి చెన్నైకు వచ్చే ఈ బృందం మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షణ్ముగంతో భేటీ అవుతుంది. ఆ తర్వాత నివర్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. చివరగా చెన్నైలో సీఎం పళనిస్వామితో ఈ బృందం భేటీ అవుతుంది. ఈ బృందం ఇచ్చే నివేదిక మేరకు కేంద్రం సాయం ప్రకటించనుంది. ఈ తుపాన్ కారణంగా పెను నష్టం జరగనట్టు అధికారుల పరిశీలనలో తేలింది. కొంత మేరకు నష్టం ఉండడంతో ఆ వివరాలతో నివేదికను ప్రభుత్వ అధికారులు సిద్ధం చేశారు. ఆ మేరకు నలుగురు మరణించినట్టు, ఐదుగురు గాయపడ్డట్టు తేల్చారు. 14 ఎకరాల అరటి పంట పూర్తిగా దెబ్బతింది. పది వేల హెక్టార్లలోని పంటల్లో వరద నీళ్లు చొచ్చుకెళ్లాయి. 108 విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. 2,927 స్తంభాలు ఒరిగాయి. 199 ఇళ్లు దెబ్బ తిన్నాయి. 1,439 గుడిసెలు పాక్షికంగా దెబ్బ తినగా, 302 గుడిసెలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 245 పశువులు మరణించాయి. 2,064 చెట్లు నేలకొరిగాయి. 4,139 శిబి రాల్లో 2.32 లక్షల మంది సురక్షితంగా ఉన్నట్టు తాజా నివేదికలో పేర్కొన్నారు. చదవండి: (మరో వాయు‘గండం’) సెంబరంబాక్కం గేట్లతో.. ఈనెల 26న సెంబరంబాక్కం గేట్లను తెరిచిన విషయం తెలిసిందే. తొలిరోజు 9 వేల గణపుటడుగుల మేరకు నీళ్లు వదిలారు. ఆ తర్వాత వర్షాలు ఆగడం, నీటి రాక తగ్గడం వెరసి గేట్లను మళ్లీ మూయడానికి అధికారులు సిద్ధమయ్యారు. తెరిచిన గేట్ల వద్ద చెట్ల కొమ్మలు, వేర్లు చుట్టుకుని ఉండడంతో మూత కష్టతరంగా మారింది. దీంతో ఆదివారం ఉదయాన్నే భారీ క్రేన్లను రప్పించి, గేట్లకు చుట్టుకెళ్లి ఉన్న వేర్లను, కొమ్మలను తొలగించే పనిలో పడ్డారు. దీంతో జలాశయం నుంచి వృథాగా 350 గణపుటడుగుల మేరకు నీళ్లు బయటకు వెళ్తున్నాయి. చెన్నైకు నీళ్లు అందించే సెంబరంబాక్కంలో 22 అడుగులు, పూండిలో 34 అడుగులు, తేర్వాయి కండ్రిలో 22 అడుగులు, చోళవరంలో పది అడుగులు, పుళల్లో 19 అడుగులు, వీరానంలో 8 అడుగుల మేరకు నీళ్లు తాజా వర్షాలకు వచ్చి చేరాయి. అన్ని చెరువులు నిండే స్థాయిలోనే ఉండడంతో ఈ వేసవిలో చెన్నైకు తాగు నీటికి ఢోకా లేదు. కడలూరు జిల్లా కాట్టుమన్నార్ కోయిల్ పరిసరాల్లోని నీటి పరివాహక ప్రాంతాలు, చెరువుల్లోకి తాజా వరదల రూపంలో మొసళ్లు వచ్చి చేరి ఉండడంతో ఆ పరిసర వాసుల్లో ఆందోళన తప్పడం లేదు. ఉత్తర చెన్నైలో భారీ వర్షాల సమయంలో కొట్టుకెళ్లిన కొళత్తూరుకు చెందిన మహబూబ్ భాష మృతదేహం ఆదివారం మాధవరం సమీపంలోని కాలువలో బయటపడింది. -
ఏపీ: నేడు, రేపు వర్షాలు..
మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం శ్రీలంక తీరానికి దగ్గరలో నైరుతి బంగాఖాతంలోని గల్ఫ్ ఆఫ్ మన్నార్, దాని దగ్గరలో ఉన్న శ్రీలంక ప్రాంతాల్లో 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఈ ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో కోస్తాంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. చదవండి: పాతలైన్లతోనే రెట్టింపు కరెంట్.. -
మరో 3 రోజులపాటు తెలంగాణలో వర్షాలు
సాక్షి, హైదరాబాద్: మధ్య బంగాళాఖాతంలో సుమారు అక్టోబర్ 19వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తాజాగా ప్రకటించింది. దక్షిణ మధ్య మహారాష్ట్రతో పాటు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కొంకన్ ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తదుపరి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి మహారాష్ట్ర తీరంకు దగ్గరలో తూర్పు మధ్య అరేబియా సముద్రంలోనికి ప్రవేశించింది. దీంతో రాగల 48 గంటలలో మహారాష్ట్ర- దక్షిణ గుజరాత్ తీరాలను ఆనుకుని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రంతో పాటు దానిని ఆనుకుని ఉన్న ఈశాన్య అరేబియా సముద్ర ప్రాంతాలలో ఇది వాయుగుండముగా బలపడి క్రమేపి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి మరింత బలపడే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకు 18 డిగ్రీ అక్షాంశం వెంబడి ఉత్తర కోస్తా ఆంధ్ర, తెలంగాణ, దక్షిణ మధ్య మహారాష్ట్ర, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కొంకన్ ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనంకు అనుబంధముగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వరకు 1.5కిమీ నుంచి 3.1 కిమీ ఎత్తు మధ్య ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వివరించింది. -
ఏపీలో మరో 3 రోజుల పాటు వర్షాలు
సాక్షి, అమరావతి: ప్రస్తుతం కొనసాగుతున్న వాయుగుండం దక్షిణ మధ్య మహారాష్ట్ర ఆనుకుని ఉన్న దక్షిణ కోంకణ్ వద్ద తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్యస్థ ట్రోపో స్పియర్ స్థాయిల వరకు కొనసాగుతున్నట్లు అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి మహారాష్ట్రకు దగ్గరలోని తూర్పు మధ్య అరేబియా సముద్రములోనికి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ అల్ఫపీడనం తదుపరి 48 గంటలలో మహారాష్ట్ర-దక్షిణ గుజరాత్ తీరాలను ఆనుకుని తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా దానిని ఆనుకుని ఉన్న ఈశాన్య అరేబియా సముద్ర ప్రాంతాలలో వాయుగుండముగా బలపడే అవకాశం ఉంది. ఈ వాయుగుండం క్రమేపి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తూర్పు అరేబియా సముద్రం వరకు 18°N ఆక్షాంశాల వెంబడి ఉత్తరాంధ్ర, తెలంగాణ దక్షిణ మధ్య మహారాష్ట్ర దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోంకణ్ వద్ద కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా 1.5కిమీ నుంచి 3.1కిమీ ఎత్తు మధ్య ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో అక్టోబర్ 19వ తేదీన మధ్య అరేబియా సముద్రంలో మరోక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన : ఉత్తర కోస్తాంధ్ర, యానాం, దక్షిణా కోస్తాంధ్ర, రాయలసీమలో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే శనివారం ఉత్తర, దక్షిణా కోస్తాంధ్రలతో పాటు రాయలసీమ, యానాంలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. -
మరో 24 గంటల పాటు పోలీసు శాఖ అప్రమత్తం
సాక్షి, అమరావతి: ఏపీ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పోలీసు శాఖ మరో 24 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. మరో రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, వరద తీవ్రత ఎక్కవగా ఉండే ప్రాంతాలను ప్రత్యేకంగా పర్వవేక్షించాలని సూచించారు. ఈరోజు కురిసిన వర్షానికి ప్రజల ప్రాణాలు కాపాడటంతో పాటు ముంపు ప్రాంతాల బాధితులను పునరావాస కేందరాలకు తరలించడంలో పోలీసు శాఖ చోరవ ప్రశంసనీయం అన్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో సమన్వయంతో పోలీసులు పని చేయాడం అభినందనీయమని డీజీపీ వ్యాఖ్యానించారు. తప్పనిసరిగా 100/112కు డయల్ చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చెరువు తలపించిన వెలగపూడి హైకోర్టు ప్రాంగణం: ఒక్కరోజు కురిసిన వర్షానికి వెలగపూడి తాత్కాలిక హైకోర్టు ప్రాంగణం చెరువును తలపిస్తోంది. హైకోర్టుకి వెళ్లే మార్గంలో వెలగపూడి వద్ద రోడ్డుపై దాదాపు మూడు అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. దీంతో హైకోర్టుకి వచ్చే ఉద్యోగులు, న్యాయవాదులు, కక్షిదారులు చెరువుగా మారిన రోడ్లపై ప్రయాణిస్తూ నానా ఇబ్బంధులు ఎదుర్కొన్నారు. -
తీవ్ర అల్పపీడనం: తెలంగాణకు భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నట్లు హైదరాబాద్ వాతవరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం ఇవాళ(సోమవారం) ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేగాక దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉందని అధికారులు చెప్పారు. దీంతో తూర్పు విదర్భ, దానిని ఆనుకుని ఉన్న చత్తీష్గడ్ ప్రాంతాలలో 0.9కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణకు మూడు రోజుల పాటు వర్ష సూచన తీవ్ర అల్ఫపీడనం కారణంగా రాగల మూడు రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ రోజు అదిలాబాద్, కోమురంభీం ఆసీఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్–పట్టణ, వరంగల్-గ్రామీణ, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు నాగర్ కర్నూల్ జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలతో అత్యంత భారీవర్షం కురిసే అవకాశం ఉంది. అదే విధంగా మంగళవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురివగా బుధవారం భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
నేడు, రేపు రాష్ట్రానికి వర్షసూచన
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో.. అదే ప్రాంతంలో ఆదివారం ఉదయం 5.30 గంటలకు అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది మరింత బలపడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ప్రభావంతో సోమ, మంగళ వారాల్లో కోసాంధ్రలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. రాయలసీమలోనూ రెండు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. అల్పపీడన ప్రభావంతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉండనుంది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయి. -
తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు
-
తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు మరిన్ని వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. దక్షిణ ఝార్ఖండ్, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోందని వెల్లడించింది. దీనికి అనుబంధంగా 7.6 ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ కేంద్రం అధికారులు చెప్పారు. ఈ రోజు అనేక చోట్ల మరియు రేపు చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈరోజు ఒకటి రెండుచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలతో పాటు చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. రేపు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో సుమారుగా ఆగస్టు 19 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. (ఆఖరి నిమిషంలో ఆశలు ‘గల్లంతు’) హుస్సేన్సాగర్కు భారీగా వరద వర్షాలతో 513.64 మీటర్లకు చేరిన నీటిమట్టం 24 గంటల పాటు వరద పరిస్థితిని పరిశీలిస్తున్న అధికారులు నగరంలో నిరంతరం పనిచేస్తున్న మాన్సూన్ ఎమర్జెన్సీ, డీఆర్ఎఫ్ బృందాలు క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేసిన జీహెచ్ఎంసీ -
నేడు, రేపు రాష్ట్రానికి వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు కోస్తా, రాయలసీమపై నైరుతి ప్రభావం సాధారణంగా ఉంది. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో కోస్తా, రాయలసీమల్లో పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ కేంద్రం అధికారులు వెల్లడించారు. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 25న కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. తడిసి ముద్దయిన బెజవాడ: ఆదివారం కురిసిన వర్షాలకు విజయవాడ తడిసి ముద్దయింది. నగరంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా భారీ వర్షం కురిసింది. కృష్ణా జిల్లా అంతటా సాయంత్రం వరకు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడగా.. పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. గుంటూరు జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురవగా.. పల్నాడులో అక్కడక్కడా చిరుజల్లులు పడ్డాయి. -
హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం
-
హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం
-
హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్ : నైరుతి రుతుపవనాల ప్రభావంతో నగరంలో బుధవారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. హైదరాబాద్లో పలుచోట్ల కురిసిన భారీ వర్షానికి ట్రాఫిక్ జామ్ అయింది. పలు చోట్ల రోడ్లపైకి నీరు చేరడంతో ట్రాఫిక్ స్తంభించడంతో వాహన చోదకులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. (రెండ్రోజుల్లో ‘నైరుతి’!) రాజేంద్రనగర్, అత్తాపూర్, నార్సింగి, గండిపేట, మణికొండ, పాతబస్తీ లాలదర్వాజ, చార్మినార్, చాంద్రాయణగుట్ట, ఉప్పుగూడా, ఛత్రినాక, అలియబాద్, ముషీరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్, నారాయణగూడ, ఖైరతాబాద్, నాంపల్లి, కోటి, ట్యాంక్ బండ్ గోషామహల్, ఖైతరాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎర్రగడ్డ, కూకట్పల్లి, బంజారాహిల్స్లో వర్షం పడింది. కాగా రానున్న 24 గంటల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, మహారాష్ట్ర, కర్ణాటకలతో పాటు రాయలసీమ, కోస్తా ఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశముంది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ ఈదురుగాలులతో వర్షాలు పడ్డాయి. -
ఉంపన్ పెనుతుపాన్: తాజా అప్డేట్
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఉంపన్ పెనుతుపాన్ కొనసాగుతున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. పారాదీప్కు తూర్పు ఈశాన్యదిశగా 140 కిలోమీటర్ల దూరంలో, సాగర్ఐల్యాండ్కు దక్షిణదిశగా 125 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టు పేర్కొంది. ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ సాయంత్రంలోగా దిఘా(పశ్చిమ బెంగాల్)-హతియా దీవుల(బంగ్లాదేశ్) మధ్య సుందర్బన్స్కు సమీపంలో తీరం దాటనుందని వెల్లడించింది. (తుపాన్లకు ఆ పేర్లు ఎలా పెడతారు?) తీరందాటే సమయంలో గంటకు 155-185 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు.. తీరంవెంబడి గంటకు 45- 50 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా బలమైన గాలులు వీస్తాయని ప్రకటించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. విశాఖ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. కాకినాడ, గంగవరం పోర్టుల్లో ఒకటవ నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కాగా, అంఫన్ పెనుతుపాన్ ప్రభావంతో పశ్చిమ బంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. (తుపాను ఎఫెక్ట్; ముందుకొచ్చిన సముద్రం) ఫోటోగ్యాలరీ: తీరంలో అల్లకల్లోలం -
అలర్ట్: ఆ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ రాష్ట్ర ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణ కమిషనర్ మాట్లాడుతూ.. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం, తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి, అడ్డతీగల మారేడుమిల్లి, విశాఖ జిల్లా వై.రామవరం, పెద్దబయలు, మాడుగుల, చింతపల్లి, జీకే వీధి ప్రాంతాల్లో పిడుగు పడే అవకాశముందని పేర్కొన్నారు. చదవండి: తుప్పు, పప్పు.. 150 మంది సెక్యూరిటీ అవసరమా? మండలాల వ్యాప్తంగా పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు రైతులు, కూలీలు, పశువుల, గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఒడిశాలోని పారదీప్కు దక్షిణంగా 1,060 కిలోమీటర్లు, పశ్చిమ్ బెంగాల్లోని డిగాకు నైరుతిగా 1,220 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది. కాగా.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలపేతమై శనివారం వాయుగుండంగా మారి తుఫాన్గా మారే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇది రేపటికి బలపడి అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిసున్నారు. చదవండి: కరోనా కల్లోలం: ఇద్దరు ఏఎస్ఐలు మృతి మే 17 వరకు ఉత్తర వాయువ్యం దిశగా పయనిస్తూ.. అనంతరం 18,20వ తేదీ నాటికి ఉత్తర ఈశాన్య దిశగా పశ్చిమ బెంగాల్ వైపు పయనిస్తుందని భావిస్తున్నారు. దీనిప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, యానాం, ఉత్తర కోస్తాలో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. సముద్రంలో గంటకు 45 నుండి 65 కిమి వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీచేశారు. ఏపీలోని ప్రధాన పోర్ట్ల్లో ఒకటవ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. చదవండి: కరోనా: ప్రకాశం జిల్లా అరుదైన రికార్డ్ -
జూన్ 5న నైరుతి రుతుపవనాల రాక
సాక్షి, న్యూఢిల్లీ: కేరళకు నైరుతి రుతపవనాలు ఈ ఏడాది నాలుగైదు రోజులు ఆలస్యంగా ప్రవేశించనున్నాయి. జూన్ 5న నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా జూన్ 1వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు రావాల్సి ఉండగా, ఈ ఏడాది కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధముగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది రాగల 12 గంటలలో అదే ప్రాంతంలో వాయుగుండముగా మారే అవకాశం ఉంది. ఇది మరింత బలపడి దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతములో మే 16 వ తేదీ సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇది ప్రారంభంలో మే 17 వ తేదీ వరకు వాయువ్య దిశగా ప్రయాణించి, తరువాత మే 18 నుండి 20 వ తేదీలలో ఉత్తర ఈశాన్య దిశగా ఉత్తర బంగాళాఖాతం వైపు ప్రయాణించే అవకాశం ఉంది. రాగల 48 గంటలలో ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం మరియు నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇవాళ (శుక్రవారం) ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. శనివారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 కిలో) తో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40కిలోమీటర్ల) తో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. -
16న అండమాన్లోకి నైరుతి రుతుపవనాలు
సాక్షి, హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలకు ఈ నెల 16న నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం తెలిపింది. గతేడాది ఇదే నెల 18న అండమాన్లోకి రుతుపవనాలు ప్రవేశించిన సంగతి తెలిసిందే. అంటే ఈసారి రెండ్రోజులు ముందుగానే అండమాన్లోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. ఇక తెలంగాణకు జూన్ 8న నైరుతి రుతుపవనాలు ప్రవేశించాల్సి ఉంది. కేరళకు, తెలంగాణ, ఇతర ప్రాంతాలకు నైరుతి రుతుపవనాల రాకపై భారత వాతావరణశాఖ ఒకట్రెండు రోజుల్లో బులెటిన్ విడుదల చేసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. 13న అల్పపీడనం...: ఇదిలావుంటే తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న సుమత్రా తీర ప్రాంతాల్లో మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తుకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం ప్రాంతాల్లో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. (చదవండి: వైరస్పై యుద్ధం.. ఇలా చేద్దాం) -
విశాఖలో 2 సెంటిమీటర్ల వర్షపాతం
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని సుమత్రా దీవుల తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకొని అండమాన్ సముద్రంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇటీవలే ఈ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో అది బలహీనపడిందని ఐఎండీ అధికారులు తెలిపారు. (విశాఖలో కోలుకుంటున్న ఐదు గ్రామాలు) మరోవైపు దక్షిణ తమిళనాడు నుంచి కోస్తా వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితలద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రెండు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా ఎస్కోటలో 6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. అనకాపల్లిలో 3, విశాఖలో 2 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్టు ఐఎండీ అధికారులు తెలిపారు. (చదవండి: గండం నుంచి గట్టెక్కినట్లే..!) -
వెదర్ రిపోర్ట్: ఉరుములతో వర్షాలు
సాక్షి, విశాఖపట్నం, అమరావతి: వాతావరణ పరిస్థితులు సరిగా అనుకూలించకపోవడంతో దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. ఈ ప్రభావంతో బుధ, గురువారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో పాటు తేలికపాటి ఉంచి మోస్తారు వర్షలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. కాగా, అల్పపీడనం మరో నాలుగు రోజులు అక్కడే కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అంచనాలన్నీ తారుమారు.. కరోనా షాక్ 4,700 కోట్లు! -
తెలంగాణకు వర్ష సూచన..
సాక్షి, హైదరాబాద్: దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 4 రోజుల వరకు అండమాన్ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది. తూర్పు బీహార్ నుండి దక్షిణ ఇంటీరియర్ తమిళనాడు వరకు ఆగ్నేయ మధ్యప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా 1.5 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. నేడు,ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో (30 నుంచి 40 కి.మీ.) పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. నేడు, రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు అక్కడక్కడ 42 నుండి 44 డిగ్రీలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
ఆగ్నేయ బంగాళాఖాతంతో అల్ప పీడనం
సాక్షి, విజయవాడ: దక్షిణ అండమాన్ నుంచి ఆగ్నేయ బంగాళఖాతం వరకు అల్ప పీడనం ఏర్పడినట్లు ఆంధ్ర ప్రదేశ్ విపత్తు నిర్వాహణ శాఖ డైరెక్టర్ వెల్లడించారు. కాగా వచ్చే 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి దక్షిణ అండమాన్ తీరంలో గంటకు 40 నుంచి 60 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఈ అల్పపీడన ప్రభావం ఏపీపై ఉండే అవకాశం లేదన్నారు. దీని ప్రభావం వల్ల ఆగ్నేయా బంగాళాఖాతం, దక్షిణ అండామాన్ సముద్ర పరిస్థితులు కఠినంగా ఉంటాయన్నారు. ఇక ఆంధ్ర కోస్టు తీరంలో చాపల వేటకు వెళ్లే మత్సకారులు ఆగ్నేయ బంగాళాఖాతం వైపుకు వెళ్లోద్దని డైరెక్టర్ హెచ్చరించారు. -
తిరుమలలో కుండపోత వర్షం
సాక్షి, విశాఖపట్నం/తిరుపతి : ఈశాన్య విదర్భ, పరిసర ప్రాంతాల్లో 0.9 కిమీ ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల వర్షం కురుస్తోంది. తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు, కొమరిన్ ప్రాంతం వరకూ ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో శనివారం తిరుపతి, తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. ప్రధాన ప్రాంతాలన్నీ జలమయం కావడంతో రోడ్లపై విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించింది. మరో వైపు నేడు, రేపు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో 41 నుంచి 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. -
నేడు కూడా మోస్తరు వర్షాలు..
సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో నేడు కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో పలు చోట్ల ఆదివారం వర్షాలు పడ్డాయి. దక్షిణ ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. దీనికి తోడు రాష్ట్రంలో ఆగ్నేయ, తూర్పుదిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. గంటకు 40 కి.మీ. వేగంతో గాలులు వీస్తుండటంతో కోస్తా తీరంలో సముద్రం అలజడిగా ఉంటుందని హెచ్చరించారు. రాత్రి వేళల్లో రెండు మూడు రోజుల పాటు చలిగాలులు ప్రభావం కనిపిస్తుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో తెర్లాం, మెరకముడిదాంలో 6 సెంమీ, వీరఘట్టం, గజపతినగరంలో 5, సీతానగరంలో 4, శృంగవరపుకోట, బొండపల్లిలో 3 సెంమీ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లో శీతలగాలులు ఉపరితల ఆవర్తనం ఫలితంగా ఆదివారం హైదరాబాద్లో పలు చోట్ల శీతలగాలులతోపాటు చిరు జల్లులు కురిశాయి. ఆదివారం నగరంలో సాధారణం కంటే 8.2 డిగ్రీలు తక్కువగా 23 డిగ్రీల సెల్సియస్ పగటి ఉష్ణోగ్రత నమోదైంది. నగరంలో అత్యధికంగా రాజేంద్రనగర్లో 27 మి.మీ, ఉప్పల్లో 26, అల్వాల్లో 19.8, సికింద్రాబాద్లో 16 మి.మీ వర్షపాతం నమోదైంది. సోమవారం అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. (చదవండి: హైదరాబాద్లో మసక మసక) -
‘విశాఖ కంటే అమరావతిపైనే తుఫాన్ల ప్రభావం’
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామన్న ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంపై ఏయూ మెట్రాలజీ మాజీ విభాగాదిపతి, వాతావరణ నిపుణులు ప్రొఫెసర్ భానుకుమార్ గురువారం మీడియాతో మాట్లాడారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటుకు అనువైన భౌగోళిక పరిస్థితులు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. గత వంద సంవత్సరాల వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తే హుద్ హుద్ తప్పితే.. విశాఖను నేరుగా తాకిన తుఫాన్లు లేవని ఆయన వెల్లడించారు. విశాఖ కంటే అమరావతిపైనే తుఫాన్ల ప్రభావం ఎక్కువని భానుకుమార్ పేర్కొన్నారు. ఒకేసారి అసాధారణంగా 25 సెంటీమీటర్ల వర్షపాతం పడినా కూడా సముద్రతీర ప్రాంతం వల్ల విశాఖకు మేలు జరుగుతుందని అన్నారు. అన్ని కాలాల్లోనూ విశాఖలో అనువైన వాతావరణం ఉంటుందని భానుకుమార్ అభిప్రాయపడ్డారు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు నిర్ణయం అభినందనీయమని ఆయన అన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రకటనను తాను స్వాగతిస్తున్నానని భానుకుమార్ పేర్కొన్నారు. అదేవిధంగా ఎకనామిస్ట్, ఏయూ మాజీ ఆర్థిక విభాగాధిపతి ప్రొఫెసర్ శ్రీరామమూర్తి మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో చాలా తక్కువ ఖర్చుతో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉందని ఆయన తెలిపారు. ముంబైని మించి విశాఖ నగరం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని శ్రీరామమూర్తి పేర్కొన్నారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖ అని చెప్పారు. ప్రాంతీయ అసమానతలను తొలగించే విధంగా సీఎం వైఎస్ జగన్ ప్రకటన ఉందన్నారు. అధికార వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అయన అభిప్రాయపడ్డారు. అన్నిప్రాంతాలు అభివృద్ధి చెందితే రాష్ట్రంలో జీడీపీ రేటు అభివృద్ధి చెంది హ్యాపీ ఇండెక్స్ ర్యాంకు కూడా పెరుగుతుందని శ్రీరామమూర్తి వ్యాఖ్యానించారు. ప్రపంచంలో చాలా దేశాల్లో రెండు, మూడు రాజధానులు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. ఒక ఆర్థికవేత్తగా సీఎం వైఎస్ జగన్ నిర్ణయాన్ని అభినందిస్తున్నానని తెలిపారు. సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన హర్షణీయమని శ్రీరామమూర్తి తెలిపారు. -
కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తున్న తరుణంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావం రాష్ట్రంపై ముందుగానే మొదలైంది. దీంతో ఉపరితలంలో కోస్తా వెంబడి ఈశాన్య గాలులు వీస్తున్నాయి. నైరుతి రుతుపవనాల తిరోగమనంలో భాగంగా శుక్రవారం లేదా శనివారం ఏపీ మీదుగా వెళ్లిపోగానే.. ఈశాన్య రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించనున్నాయి. అక్టోబర్ 15 నుంచి 20లోపు ఇవి ప్రవేశిస్తాయి. కాగా, ఈశాన్య పవనాల కాలంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. మరోవైపు.. ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో 2.1 కిమీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఆవర్తనం నుంచి కొమరీన్, రాయలసీమ, తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకూ సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాగల రెండు రోజులపాటు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా.. మోస్తరు వర్షాలు పడే సూచనలున్నట్లు ఐఎండీ గురువారం రాత్రి వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో పోలవరం, కొయ్యలగూడెంలో 11 సెం.మీ, వరరామచంద్రాపురంలో 8, అవనిగడ్డ, రాయచోటి, కమలాపురంలో 7, పాడేరు, నూజివీడు, మెంటాడ, చింతూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరులో 6 సెంటిమీలర్ల వర్షపాతం నమోదైంది. విజయవాడలో భారీవర్షం.. అస్తవ్యస్తం వర్షం బెజవాడను వదలనంటోంది.. రోజులో ఏదోక సమయంలో కురుస్తూ నగరవాసుల సహనానికి పరీక్ష పెడుతోంది.. కరి మబ్బులతో కూడిన వాతావరణం ఆహ్లాదకరంగా అనిపిస్తున్నా.. అంతలోనే కురిసే జడివాన జనజీవనాన్ని చెల్లాచెదురు చేసేస్తుంది. దీనికితోడు పక్కనే పడ్డాయా అన్నట్లుగా దిక్కులు పిక్కటిల్లేలా ఉరుములు.. మెరుపులు నగరవాసిని భీతిగొల్పుతున్నాయి. ఇక వర్షానంతరం మన నగర రోడ్లు సొగసచూడతరమా.. రహదారులా లేక చెరువులా అన్నరీతిలో మోకాళ్ల వరకు నీళ్లతో వాహనచోదకులు, పాదచారుల తిప్పలు చెప్పనలవి కావు. గురువారం విజయవాడలో కురిసిన వర్షం చిత్రాలను ‘సాక్షి’ క్లిక్మనిపించింది. -
మూడ్రోజులు అతి భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఈ నెల 18న కోస్తాంధ్రలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, రాయలసీమలోని చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 20, 21 తేదీల్లో కోస్తాంధ్రలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వెల్లడించింది. దక్షిణ కోస్తా జిల్లాల్లోని మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. కాగా, ఆళ్లగడ్డలో 18 సెం.మీ, ఒంగోలులో 14, రుద్రవరంలో 13, దోర్నిపాడు, బత్తులపల్లిలో 12, శింగనమలలో 10, సింహాద్రిపురంలో 9, నంద్యాల, కోయిలకుంట్లలో 6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. -
ఉత్తర కోస్తాంధ్రలో నేడు, రేపు వర్షాలు
సాక్షి, మహారాణిపేట(విశాఖ దక్షిణం): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈశాన్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా ఉంది. దీనికి అనుబంధంగా 7.6 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని సోమవారం వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇది ఎత్తుకి వెళ్లేకొద్ది నైరుతి దిశ వైపుకి వంపు తిరిగి ఉంది. ఈ ప్రభావం వల్ల తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, యానాంలో మంగళ, బుధవారాలు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కాగా, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదులు వరద ప్రవాహంతో పోటెత్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల నుంచి నీటికి దిగువకు వదులుతున్నారు. నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. (చదవండి: తీర గ్రామాలను చుట్టుముట్టిన వరద) -
కుండపోత వర్షానికి వణికిన బెజవాడ
ఉదయం నుంచే దట్టంగా అలముకున్న మబ్బులు.. అడపాదడపా చిరు జల్లులు.. కొన్ని చోట్ల భారీ వర్షం.. మరి కొన్నిచోట్ల మోస్తరు వర్షం.. చల్ల చల్లగా మారిపోయిన వాతావరణం.. ఇదీ విజయవాడ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా మంగళవారం వాతావరణం. ముఖ్యంగా బెజవాడలో వర్షం ముంచెత్తింది. ప్రధాన రహదారులైన బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, ఎన్టీఆర్ సర్కిల్, ఆటోనగర్, కాళేశ్వరరావు మార్కెట్రోడ్డు, గణపతిరావు రోడ్లలో వరద నీరు మురుగుతో కలిసి ఉధృతంగా ప్రవహించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సాక్షి, అమరావతి : వాయువ్య బంగళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి దానికి అనుగుణంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ఫలితంగా కోస్తాంధ్రలో పలుచోట్ల మోస్తరు వర్షాలు.. మరికొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేపు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంటోంది. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల వైరల్ జ్వరాలు ప్రబలే అవకాశముందని వైద్య, ఆరోగ్యశాఖ హెచ్చరిస్తోంది. ఈ కాలంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని.. కాచి వడబోసిన నీటిని తాగడంతోపాటు, వేడివేడి ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం సాయంత్రం వరకు సగటు వర్షపాతం 30.03 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదవగా.. ఒక్క విజయవాడ నగరంలోనే 44.56 మి.మీ నమోదైంది. జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. పెనమలూరు మండలం గంగూరులో 32.75 మి.మీ, ఉయ్యూరులో 31 మి.మీ, పెనమలూరులో 28.25 మి.మీ కంకిపాడు మండలం మద్దూరు 23.50 మి.మీ, కంచికచర్ల మండలం మొగులూరు 23.00 మి.మీ, ఇబ్రహీంపట్నంలో 18.50 మి.మీ, కౌతవరం 18.50 మి.మీ, చాట్రాయి మండలం కోతపాడులో 16.25, విస్సన్నపేట మండలం కోర్లమండలో 13.50 మి.మీ వర్షపాతం నమోదైంది. నగరాన్ని ముంచెత్తిన వాన! మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షంతో బెజవాడ మంగళవారం వణికిపోయింది. ఉదయం నుంచే ముసురేసినట్లు నగరాన్ని మబ్బులు కమ్మేశాయి. 10 గంటల నుంచే మోస్తరుగా ఆయా ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కుండపోతగా పడిన వర్షానికి రోడ్లపై నీరు వరదలా ప్రవహించింది. మోకాలు లోతున వరద నిలిచింది. ప్రధాన రహదారులపై వాహనాలు అరగంటకు కిలోమీటరు చొప్పున కదిలాయి. కిక్కిరిసిన రోడ్లతో పాదచారులు, బస్స్టాపుల్లో ఎదురుచూస్తున్న ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వినాయకచవితి నేపథ్యంలో విగ్రహాలు చూడ్డానికి వచ్చిన ప్రజలు అవస్థలు పడ్డారు. వన్టౌన్, కృష్ణలంక, బందరురోడ్డు, ఆటోనగర్, ఏలూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రంగంలోకి దిగిన వీఎంసీ, అత్యవసర బృందాలు సహాయక చర్యలను చేపట్టాయి. బందరు రోడ్డు ముందు మోకాళ్ల లోతులో నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజయవాడ వన్టౌన్ ప్రాంతంలో అత్యధికంగా 49 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా అత్యల్పంగా ఎంకే బేగ్ స్కూల్ ప్రాంతంలో 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
రెండు రోజులు భారీ వర్షాలు!
సాక్షి, విశాఖపట్నం : పశ్చిమ ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు విపత్తు నిర్వాహణ శాఖ మంగళవారం వెల్లడించింది. దీని ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అలాగే బలమైన ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపింది. దీంతో వినాయక మండపాల నిర్వాహకులు, భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. -
అల్పపీడనం తీవ్రంగా మారే అవకాశం
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర ఒడిషా, పశ్చిమ బెంగాల్ తీరానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు మరింత బలపడి తీవ్రంగా మారే అవకాశం ఉందని మంగళవారం వాతావరణ కేంద్రం పేర్కొంది. అల్పపీడనానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా కోస్తాంధ్రలో విస్తరంగా వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతవరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం అల్పపీడనం ఏర్పడిందని.. రాగాల 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడనున్నట్టు వాతావరణ కేంద్రం పేర్కొంది. అయితే ఈ అల్పపీడనానికి అనుబంధంగా సుమారు 7.6 కి. మీ ఎత్తులో నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం ఉన్నందున కోస్తా ఆంధ్ర, తెలంగాణకు మోస్తరు లేదా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. -
జరభద్రం.. రేపటి నుంచి భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం : పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి వైపు వంగి ఉంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో కొనసాగుతోంది. దీని ప్రభావం రాష్ట్రంపై అంతగా ఉండదని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సెప్టెంబర్ రెండో తేదీన మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నట్లు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) గురువారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 31, సెప్టెంబర్ 1,2 తేదీల్లో కోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని ఐఎండీ వెల్లడించింది. కోస్తా, రాయలసీమలోని జిల్లాల్లో అక్కడక్కడా తేలిక పాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. -
నేడు కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం : ఈశాన్య మధ్యప్రదేశ్, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ ఉత్తర్ప్రదేశ్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి వైపు వంగి ఉంది. గురువారం ఏర్పడిన ఉత్తర–దక్షిణ ద్రోణి కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతూ క్రమంగా బలహీనపడుతోంది. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 4.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ముఖ్యంగా కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ, రాయలసీమలోని 4 జిల్లాల్లోనూ అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గడచిన 24 గంటల్లో డోన్లో 9 సెంటిమీటర్లు, రాయచోటి, ఆత్మకూరు, లక్కిరెడ్డిపల్లి, విజయవాడలో 8 సెం.మీ. వర్షపాతం కురిసింది. -
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం..!
సాక్షి, హైదరాబాద్ : వాయువ్య బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. గాంగేటిక్ పశ్చిమ బెంగాల్ దక్షిణ ప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒరిస్సా ప్రాంతాల్లో ఇది కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధముగా 7.6 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది. రాగల 48 గంటల్లో ఇది మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని చెప్పింది. రాగల మూడురోజులకు వాతావరణ సూచనలు చేసింది. అల్పపీడనం కారణంగా తెలంగాణలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈరోజు (మంగళవారం), రేపు చాలాచోట్ల, ఎల్లుండి అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర, యానాంలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడిచింది. ఈరోజు, రేపు కొన్నిచోట్ల, ఎల్లుండి అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. రాయలసీమలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. -
36 గంటల్లో అల్పపీడనం; భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం : ఈశాన్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తున ఆవరించి ఉంది. దీని ప్రభావంతో రాగల 36 గంటల్లో వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్ప పీడనం ఏర్పడుతుందని ఐఎండీ ఆదివారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. అదేవిధంగా దక్షిణ కోస్తా సముద్రతీరం, దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. వీటి ప్రభావంతో ఈ నెల 13వ తేదీన ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. -
వాతావరణ కేంద్రం హెచ్చరిక
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర ప్రాంతంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్కు అనుకుని ఉపరితల ఆవర్తనం బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు కొనసాగుతుందని పేర్కొంది. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల కోస్తాంధ్ర ప్రాంతంలో విస్తరంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలియజేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయన్నారు. సముద్రతీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని.. మత్స్యకారులు చేపల వేటకు సముద్రానికి వెళ్లద్దని హెచ్చరికలు జారీ చేశారు.