Anilkumar yadav
-
‘జన్వాడ ఫామ్హౌజ్’ అంటేనే వివాదం: ఎంపీ అనిల్ యాదవ్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ డ్రగ్స్ టెస్ట్ లు చేయాలని రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై అనిల్ యాదవ్ మంగళవారం(అక్టోబర్ 29) మీడియాతో మాట్లాడారు. ‘డ్రగ్స్ బయట పడిన ప్రతి సారి బీఆర్ఎస్ వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడుతున్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సిగ్గు ఉంటే డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి.రాజ్ పాకాల,విజయ్ మద్దూరిని వెనుకేసుకరావడానికి కేటీఆర్కు సిగ్గుండాలి.కేటీఆర్కు అసలు బినామీ విజయ్ మద్దూరి.గతం ప్రభుత్వం డ్రగ్స్ కేసును ఏ విధంగా దారి మళ్లించిందో ప్రజలకు తెలుసు.జన్వాడ ఫామ్హౌస్ అంటేనే కాంట్రవర్సీ. ఒక సారి దీపావళి విందని,మరోసారి గృహ ప్రవేశం అని అంటున్నారు.తెలంగాణను కేసీఆర్ కుటుంబం ఏం చేయాలనుకుంటోంది. స్వయంగా డ్రగ్స్ వాడినట్లు పోలీసుల ముందు విజయ్ మద్దూరి ఒప్పుకున్నాడు.రాజ్ పాకాల డ్రగ్స్ ఇచ్చినట్లు విజయ్ మద్దూరి పోలీసులకు చెప్పాడు. ఇప్పుడు విజయ్మద్దూరి మాట మారుస్తున్నాడు.పామ్ హౌస్ దొర కేసీఆర్ డీజీపీకి ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నాడు.ఆయనకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముంది.కేసీఆర్ ఎక్కడ ఉన్నాడని అని ప్రజలు అడుగుతున్నారు’అని అనిల్ యాదవ్ గుర్తుచేశారు. ఇదీ చదవండి: కాంగ్రెస్, బీజేపీ మధ్య క్విడ్ ప్రో కో: కేటీఆర్ -
బీసీలకు సీఎం జగన్ ఇచ్చిన సంక్షేమం అల్ టైమ్ రికార్డ్ : అనిల్ కుమార్ యాదవ్
-
మీ వెంటే మేమంతా
సాక్షి, నెట్వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రజలు ఘన స్వాగతం చెబుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ గురువారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. తమ సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం వైఎస్ జగన్ వెంటే తామంతా నడుస్తామని ప్రజాప్రతినిధులతో ప్రజలు చెప్పారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను తప్పకుండా నెరువేరుస్తున్నామని ప్రజాప్రతినిధులు ప్రజలకు చెప్పారు. -
మా మధ్య విభేదాల్లేవు
సాక్షి, అమరావతి: తమ మధ్య విభేదాల్లేవని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ప్రాంతీయ కో ఆర్డినేటర్ అనిల్కుమార్యాదవ్ స్పష్టం చేశారు. విభేదాలు మీడియా సృష్టేనన్నారు. తామంతా కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. వారు బుధవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. అనంతరం వారు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ను మళ్లీ సీఎంను చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. మంత్రి కాకాణి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనిల్కుమార్యాదవ్తోపాటు నెల్లూరు జిల్లాలో పార్టీ నేతలంతా కలిసికట్టుగా పోరాటం చేశామని చెప్పారు. నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్స్వీప్ చేసిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక తొలి మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న అనిల్తో కలిసి నెల్లూరు జిల్లా అభివృద్ధికి కృషిచేశామన్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ తనను మంత్రివర్గంలోకి తీసుకున్నారని, అనిల్ని వైఎస్సార్, తిరుపతి జిల్లాల పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తగా నియమించారని చెప్పారు. తమ మధ్య విభేదాలు సృష్టించాలనే సంఘవిద్రోహశక్తులు నెల్లూరులో ఫ్లెక్సీలను చింపేశాయన్నారు. నిప్పులేకుండానే పొగ సృష్టించడం ఎల్లో మీడియాకు అలవాటేనన్నారు. ‘సీఎం వైఎస్ జగన్ను కలిశాక మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోతే.. సీఎం వైఎస్ జగన్ చీవాట్లు పెట్టారు.. అందుకే కాకాణి మొహం చాటేశారు.. అంటూ తప్పుడు కథనాలు ప్రసారం చేస్తారు కాబట్టే మీడియాతో మాట్లాడుతున్నా..’ అని చెప్పారు. ‘కరువుకు మారుపేరు చంద్రబాబు.. సుభిక్షానికి మరోపేరు సీఎం జగన్.. ఏ కారణంతో రైతులు టీడీపీకి ఓట్లేస్తారో చంద్రబాబు చెప్పాలి..’ అని పేర్కొన్నారు. రైతులు, కౌలురైతులపై ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడటం తప్ప రైతుల గురించి పవన్కల్యాణ్కు ఏం తెలుసని ఆయన ప్రశ్నించారు. సీఎం మనుషులం.. ఆయన గీతగీస్తే దాటం.. అనిల్కుమార్యాదవ్ మాట్లాడుతూ తామంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సైనికులమని, ఆయన ఏది చెబితే అది చేస్తామని చెప్పారు. తనపై నమ్మకంతో రీజనల్ కో ఆర్డినేటర్గా నియమించిన సీఎం జగన్కి కృతజ్ఞతలు చెప్పేందుకు కలిశానన్నారు. సీఎం జగన్ తనకు మూడేళ్లు మంత్రిగా అవకాశం ఇచ్చారని, ఇప్పుడు కాకాణికి ఇచ్చారని చెప్పారు. అందరం కలిసికట్టుగా పార్టీ బలోపేతం కోసం, ప్రజల కోసం పనిచేస్తామన్నారు. వైఎస్సార్సీపీలో వర్గాలు ఉండవని, అంతా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వర్గమన్నారు. అధినేత మాటే తమకు శిరోధార్యమన్నారు. జగన్ మనుషులమైన తాము ఆయన గీతగీస్తే దాటబోమని స్పష్టం చేశారు. ఇప్పుడు మంత్రి పదవులు కోల్పోయిన 14 మందిమి మళ్లీ మంత్రులమవుతామన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు నియోజకవర్గంలో ఏ పార్టీ ఫ్లెక్సీలైనా తీసేశారంటే.. అది మునిసిపల్ కార్పొరేషన్ వాళ్లు తీసేసినవేనన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కూడా గాలికి చిరిగాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్రంట్ వారియర్స్గా ముందుకెళ్తామని, అందుకు సీఎం జగన్ తమను ఎంచుకుని పార్టీ బాధ్యతలు ఇవ్వడం గర్వంగా ఉందని అనిల్కుమార్యాదవ్ చెప్పారు. -
చంద్రబాబు పాపాల వల్లే జాప్యం
సాక్షి, అమరావతి: ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో పాల్పడిన పాపాలే పోలవరం పనుల్లో జాప్యానికి కారణమని జల వనరుల శాఖ మంత్రి పి.అనిల్కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. లేదంటే 2021 నాటికే ప్రాజెక్టును పూర్తి చేసేవాళ్లమన్నారు. శాసనసభలో మంగళవారం పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. 1941 నుంచి కాగితాలకే పరిమితమైన పోలవరం ప్రాజెక్టుకు 2004లో దివంగత సీఎం వైఎస్సార్ కార్యరూపం ఇచ్చేందుకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. అయితే కమీషన్ల కోసం పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే క్రమంలో రూ.16 వేల కోట్ల అంచనా వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని.. నిధులు ఇస్తామని కేంద్రం షరతు పెడితే దానికి 2016 సెప్టెంబర్ 30న చంద్రబాబు అంగీకరించడం దారుణమన్నారు. నిర్వాసితులకు న్యాయం ‘చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సమస్యలు పరిష్కరించాలని నిర్వాసితులు ఎవరైనా వస్తే పోలీసులతో గెంటేయించేవారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ నిర్వాసితులకు మెరుగైన పునరావాసం కల్పిస్తున్నారు. కేంద్రం నిర్వాసిత కుటుంబాలకు రూ.6.50 లక్షల పరిహారం ఇస్తుంటే.. దానికి అదనంగా రూ.3.50 లక్షలు చేర్చి మొత్తం రూ.పది లక్షలు అందిస్తున్నారు. చంద్రబాబుకు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హతే లేదు.’ – బాలరాజు, ఎమ్మెల్యే, పోలవరం -
పోలవరం ఎత్తు అంగుళం కూడా తగ్గదు
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వం చేతకాని తనం వల్లే పోలవరం ఆలస్యమవుతోందని జల వనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాలనలో ఒక్క పునరావాస కాలనీౖ నైనా నిర్మించారా? ఒక్క కుటుంబానికైనా పునరావాసం కల్పించారా? అని నిలదీశారు. పోలవరం డ్యామ్ ఎత్తు అంగుళం కూడా తగ్గించడం లేదని, కావాలంటే టేపు తెచ్చుకుని కొలుచుకోవచ్చునని సవాల్ విసిరారు. గురువారం శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు మాట్లాడుతూ పోలవరం డ్యామ్ ఎత్తు తగ్గించే స్తున్నారనే అపోహలు రైతుల్లో నెలకొన్నాయని, నిర్మాణం ప్రశ్నార్థకంగా మా రిందన్నారు. దీనిపై మంత్రి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..‘2014 నాటికే 32 శాతం పూర్తయిన ప్రాజెక్టులో ఆ తర్వాత మూడేళ్లు తట్టెడు మట్టి కూ డా వేయలేదు. 2017 ఫిబ్రవరిలో 50 వేల ఇళ్లను తరలిస్తే సరిపోతుందని కేబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ఆ తర్వాత 90 వేలకు పెంచారు. అప్పుడే లక్ష ఇళ్లను తరలించాలని కేంద్రానికి నివే దించి ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. డ్యామ్ కట్టిన తర్వాత ఒకేసారి పూర్తిస్థాయి నీళ్లు నిలబెట్టరు. దానికో ప్రొటోకాల్ ఉంటుంది. ముందుగా మూడింట ఒక వంతు, ఆ తర్వాత 10 శాతం చొప్పున పెంచుకుంటూ వెళ్లి 190 టీఎంసీల స్థాయి కి పెంచుతాం. ప్రస్తుతం 41వ కాంటూర్ వరకు పునరావాసం కల్పించాలనే ఆలోచనతోనే 17 వేల ఇళ్లను తరలించాలని నిర్ణయించాం. ఇప్పటికే 8 వేల ఇళ్లను తరలించడానికి సిద్ధం చేశాం’ అన్నారు. -
పోలవరం పనుల్లో వేగం పెంచండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసే దిశగా పనులను మరింత వేగవంతం చేయాలని జలవనరులశాఖ అధికారులకు మంత్రి పి.అనిల్కుమార్ యాదవ్ దిశానిర్దేశం చేశారు. విజయవాడలో మంగళవారం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి, ఈఎన్సీ సి.నారాయణరెడ్డితో కలిసి అన్ని ప్రాజెక్టుల సీఈలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టులో రెండు కాఫర్ డ్యామ్ల మధ్యన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ పునాది డయా ఫ్రమ్ వాల్ను పటిష్టం చేయడం, కోతకు గురైన జెట్ గ్రౌటింగ్, ఇసుక పొరలను భర్తీచేయడం తదితరాలకు సంబంధిం చిన డిజైన్లను ఈనెల 20న జరిగే డీడీఆర్పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) సమావేశంలో ఆమోదింపజేసుకోవాలని సూచించారు. డిజైన్లు ఆమోదం పొందిన వెంటనే పనులు ప్రారంభించి వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రాధాన్యత ప్రాజెక్టులైన నెల్లూరు, సంగం బ్యారేజీలను వచ్చే జనవరి ఆఖరులో గా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వంశధార స్టేజ్–2 ఫేజ్–2, అవుకు టన్నెల్, వెలిగొండ పనులను వేగవంతం చేయాలన్నారు. -
ఓటర్లను ప్రలోభపెడుతున్నారు
నెల్లూరు సిటీ/దర్శి: కుప్పంలో కూడా ఘోర పరాజయం తప్పదనే విషయం తెలుసుకున్న చంద్రబాబు, లోకేష్లు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పేర్ని నాని, అనిల్కుమార్ యాదవ్ అన్నారు. అనేక ఏళ్ల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు కనీసం తన నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయలేదన్నారు. అందుకే ఇప్పుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు శనివారం నెల్లూరు నగరం, ప్రకాశం జిల్లా దర్శిలో వేర్వేరుగా ఎన్నికల ప్రచారం చేశారు. నెల్లూరు, దర్శిలో మంత్రి బాలినేని మాట్లాడుతూ.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేని చంద్రబాబు.. ఇక రాష్ట్రాన్ని ఏమి అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. అందుకే ఇప్పుడు సొంత నియోజకవర్గంలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికల్లో కూడా ఎదురీదుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన కుమారుడు లోకేష్ కుప్పంలో గెలిచేందుకు ఓటుకు రూ.5 వేలు చొప్పున పంచే పరిస్థితి వచ్చిందన్నారు. కుప్పాన్ని మునిసిపాలిటీ చేసింది సీఎం వైఎస్ జగన్ అనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు. కోవిడ్ సంక్షోభ సమయంలోనూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. మంత్రి అనిల్కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. ఎళ్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించే వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. దర్శిలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. చంద్రబాబు గతంలో రుణమాఫీలంటూ ఎడాపెడా హామీలిచ్చి.. ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం వైఎస్ జగన్ అన్ని హామీలను నెరవేరుస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీలతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారాల్లో ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, మద్దిశెట్టి వేణుగోపాల్, కాకాణి గోవర్ధన్రెడ్డి, విడదల రజిని, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పోలవరం నిర్వాసితులకు వేగంగా పునరావాసం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్కుమార్ యాదవ్ ఆదేశించారు. మంగళవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పోలవరం, వెలిగొండ ప్రాజెక్టు పనులపై ఆయన సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు దిగువ కాఫర్ డ్యామ్లో కుడి వైపున 96 మీటర్ల డయాఫ్రమ్ వాల్ నిర్మించే పనులు చేపట్టామని, నెలాఖరులోగా రక్షిత స్థాయికి దిగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. ఆలోగా ఎగువ కాఫర్ డ్యామ్ పనులు పూర్తవుతాయని మంత్రికి వివరించారు. ఆ తర్వాత రెండు కాఫర్ డ్యామ్ల మధ్య నిల్వ ఉన్న నీటిని తోడివేసి.. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ (డీడీఆర్పీ) సూచనల మేరకు ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు చేపట్టి..2022 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి అనిల్కుమార్..గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నెలలో 5 వేల నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పిస్తామని అధికారులు వివరించారు. పశ్చిమగోదావరి జిల్లాలో తాడ్వాయిలో పునరావాస కాలనీ నిర్మాణంలో జాప్యం జరుగుతుండటంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేస్తూ తక్షణమే పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టులో రెండో టన్నెల్ పనులను వేగవంతం చేసి.. గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించారు. -
విరిగిన పులిచింతల గేటు
సాక్షి, అమరావతి బ్యూరో, సాక్షి, అమరావతి, అచ్చంపేట, జగ్గయ్యపేట : పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకోవడంతో గురువారం తెల్లవారుజామున నీటిని దిగువకు విడుదల చేసేందుకు గేట్లు ఎత్తుతుండగా 16వ గేటు ప్రమాదవశాత్తు విరిగిపోయింది. రెండు అడుగుల మేర గేట్లు ఎత్తడానికి అధికారులు ప్రయత్నిస్తుండగా హైడ్రాలిక్ గడ్డర్ ఊడిపోవడంతో గేటు విరిగి వరద నీటిలో కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న ప్రాజెక్టు ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ ఉదయాన్నే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ప్రాజెక్టుపై ఒత్తిడి పడకుండా డ్యాంలో నీటి నిల్వను తగ్గించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి 4 నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరకు 8 నుంచి 12 గంటల స్వల్ప వ్యవధిలో ఫ్లాష్ ఫ్లడ్ చేరింది. ఈ దృష్ట్యా అధికారులు, నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా వుండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో గుంటూరు, కృష్ణా జిల్లాల యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. 16వ గేట్ వద్ద స్టాప్ లాగ్ గేట్ ఏర్పాటు చేయడానికి ఇరిగేషన్ అధికారులు రిజర్వాయర్లో నీటి నిల్వను తగ్గిస్తున్నారు. దీంతో నీటి విడుదల క్రమంగా 6 లక్షల క్యూసెక్కుల వరకు పెరగనుంది. గురువారం సాయంత్రం ఆరు గంటలకు ప్రాజెక్టులో 34.68 టీఎంసీలు నిల్వ ఉండగా, సాగర్ నుంచి 2,01,099 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. 16వ నంబరు గేటు నుంచి పూర్తి స్థాయిలో, మిగతా గేట్ల నుంచి.. మొత్తంగా 5,05,870 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో 15 టీఎంసీల నీరు తగ్గితేగాని మరమ్మతులు సాధ్యం కాదని అధికారులు భావిస్తున్నారు. మరమ్మతులకు మార్గం సుగమం సాగర్ నుంచి 2,01,099 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టులో గరిష్ట స్థాయిలో నీటి నిల్వ ఉన్న సమయంలో ఊడిపోయిన గేటు స్థానంలో స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. ప్రాజెక్టులో క్రస్ట్ లెవల్ (గేటు బిగించే మట్టం) 36.34 మీటర్లకు నీటి నిల్వను తగ్గిస్తేనే.. స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేయవచ్చు. శుక్రవారం నాటికి పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వ 36.34 మీటర్లకు తగ్గుతుంది. అదే రోజు స్పిల్ వే 16, 17వ పియర్స్(కాంక్రీట్ దిమ్మెలు) మధ్య స్టాప్ లాగ్ గేటును దించి.. ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో అంటే 45.77 టీఎంసీలను నిల్వ చేయడానికి మార్గం సుగమం చేస్తామని ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఆ తర్వాత పూర్తి స్థాయి గేటును బిగిస్తామని చెప్పారు. ట్రూనియన్ బీమ్ విరిగిపోవడంతోనే.. నాగార్జునసాగర్ నుంచి బుధవారం సాయంత్రం 6 గంటలకు 55,028 క్యూసెక్కులను విడుదల చేసిన తెలంగాణ అధికారులు.. దిగువకు వదిలే ప్రవాహాన్ని రాత్రికి 1.80 లక్షల క్యూసెక్కులకు పెంచారు. పులిచింతల ప్రాజెక్టులో అప్పటికే 44.54 టీఎంసీలు నిల్వ ఉండటం... ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో.. అంతే స్థాయిలో దిగువకు విడుదల చేసేందుకు గురువారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఏడు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి దిగువకు వదిలేందుకు అధికారులు సిద్ధమయ్యారు. స్పిల్ వే గేట్లను సంప్రదాయ పద్ధతి(రోప్)లో ఎత్తుతారు. ఒక్కో గేటును ఎత్తేందుకు ఒక్కో వైపు రెండు చొప్పున, నాలుగు రోప్(ఇనుప తీగ)లను అమర్చారు. 16వ గేటును రెండు అడుగుల మేర ఎత్తగానే ఎడమ వైపున ఉన్న ట్రూనియన్ బీమ్ విరిగిపోవడంతో గేటు ఊడిపోయి, వరద ఉధృతికి కొట్టుకుపోయిందని అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా ప్రాజెక్టు గేట్లలో ఎప్పుడైనా సమస్య ఉత్పన్నమైతే, వాటికి మరమ్మతులు చేయడానికి రెండు స్టాప్ లాగ్ గేట్లను ఏర్పాటు చేశారు. సమస్య ఉన్న గేటుకు ముందు భాగంలో స్టాప్ లాగ్ గేటును దించి.. గేటుకు మరమ్మతు చేస్తారు. ఆ తర్వాత స్టాప్ లాగ్ గేటును పైకి ఎత్తేస్తారు. నిపుణుల కమిటీ వేస్తాం.. ప్రాజెక్టు గేటు ఊడిపోవడంపై నిపుణులతో అధ్యయన కమిటీ వేయనున్నామని జల వనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ తెలిపారు. ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్(సీడీవో) సీఈ శ్రీనివాస్ తదితరులతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అధ్యయన కమిటీ ద్వారా ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తి స్థాయిలో పరీక్షించనున్నట్లు తెలిపారు. ఇకపై ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా జాగ్రత్తలు చేపడతామన్నారు. ఊడిపోయిన గేటును రేపు (శనివారం) సాయంత్రానికి పునరుద్ధరిస్తామని తెలిపారు. మూడు నాలుగు రోజులుగా ఈ గేటు ద్వారానే ప్రాజెక్టు దిగువకు లక్ష నుంచి రెండు లక్షల నీటిని విడుదల చేశారని, తెల్లవారు జామున నీటి ప్రవాహ ఉధృతికి ఒక్కసారిగా పెద్ద శబ్దంతో గేటు ఊడినట్లు అధికారులు గుర్తించారని చెప్పారు. మరింత ప్రమాదం చోటు చేసుకోకుండా ఉండేందుకు అన్ని గేట్ల ద్వారా 5,05,870 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నామని చెప్పారు. గేట్ అమర్చేందుకు పోలవరం నుంచి ప్రత్యేక నిపుణుల బృందంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు కూడా వస్తున్నారన్నారు. అనంతరం మధ్యాహ్నం సమయంలో మంత్రులు కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్, పేర్ని నానిలు ప్రాజెక్టును సందర్శించి అధికారులతో మాట్లాడారు. -
తెలంగాణ వాళ్లు దాదాగిరి చేస్తున్నారు
నెల్లూరు(సెంట్రల్): మనకు రావాల్సిన నీటిని రానీయకుండా.. ఏకపక్షంగా నీటిని వదిలేస్తూ మనపై తెలంగాణ వాళ్లు దాదాగిరి చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. నెల్లూరులోని ఆర్అండ్బీ అతిథి గృహంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి పి.అనిల్కుమార్, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్దన్రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, కిలివేటి సంజీవయ్యతో కలసి సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే తెలంగాణలో పలు అక్రమ కట్టడాలు ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ఏపీకి నేడు ఈ దుస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రైతుల శ్రేయస్సు దృష్ట్యా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లందించేందుకు ప్రయత్నిస్తుంటే, తెలంగాణ వాళ్లు ఏకపక్షంగా నీటిని తోడేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ, నెల్లూరుకు సాగు నీటి ఇబ్బందులు లేకుండా సీఎం చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. సీఎం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హౌసింగ్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇళ్లు అందేలా చేస్తామని సజ్జల స్పష్టం చేశారు. -
కర్రా గిరిజా హర్షవర్ధన్రెడ్డి ప్రమాణస్వీకారం
సాక్షి, అమరావతి: స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్గా కర్రా గిరిజా హర్షవర్ధన్రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదలా శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఒకేరోజు 137 మంది చైర్మన్లను ఎంపిక చేయటం గొప్ప విశేషం అని కొనియాడారు. పార్టీకోసం కష్టపడినవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యత ఇచ్చారని ఆయన అన్నారు. మరో 30ఏళ్ళు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని ఆయన తెలిపారు. ఇక గిరిజా హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్గా పదవి ఇచ్చిన సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. తమకు అప్పగించిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తిస్తామని గిరిజా హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, శిల్పా రవిచంద్రా రెడ్డి, ఆర్థర్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఏపీ ఎస్ ఐడీసీ ఎండీ పూర్ణ చంద్రరావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి హర్ష వర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. -
ప్రాంతీయ చిచ్చుకు చంద్రబాబు కుట్ర
సాక్షి, అమరావతి: ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్కుమార్యాదవ్ ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలతో రాయలసీమ లిఫ్ట్ ఆపించాలంటూ లేఖ రాయించడాన్ని తప్పుబట్టారు. చంద్రబాబు, ప్రసార మాధ్యమాల అధిపతులు రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు రాష్ట్రానికి దెయ్యాల్లా దాపురించారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ఆ జిల్లాల అభివృద్ధికి వైఎస్సే కారణం ప్రకాశం, గుంటూరు జిల్లాలను వైఎస్ రాజశేఖర్రెడ్డి ఎన్ఎస్పీ ఆధునికీకరణతో అభివృద్ధి చేశారు. వెలిగొండ ప్రాజెక్టును తీసుకొచ్చారు. గుండ్లకమ్మ రిజర్వాయర్, రామతీర్థం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేశారు. కొర్సిపాడు లిఫ్ట్, సోమశిల నుంచి రాళ్లపాడుకు సామర్థ్యం పెంచడం వైఎస్సార్ కాలంలోనే జరిగాయి. ఈ జిల్లాలకు చంద్రబాబు చేసిందేంటి? వెలిగొండ పనులు వైఎస్సార్ కాలంలో 11.5 కిలోమీటర్లు పూర్తయితే.. చంద్రబాబు ఐదేళ్లలో 4 కిలోమీటర్లు మాత్రమే పూర్తిచేశారు. జగన్ 18 నెలల్లోనే మొదటి టన్నెల్ను 2.8 కిలోమీటర్లు, రెండో టన్నల్ను కిలోమీటరుకుపైగా పూర్తిచేశారు. రెండో టన్నెల్ను కూడా 2023లోగా పూర్తిచేసి నీరందించేందుకు కృషిచేస్తున్నారు. గోదావరి నుంచి నీరు తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజీ నుంచి ఎన్ఎస్పీ కెనాల్కు పంపేందుకు ఇప్పటికే రూ.500 కోట్లు ఖర్చుచేశారు. భయపడి తెలంగాణతో బాబు రాజీ తెలంగాణలో ఐదేళ్లలోనే పాలమూరు రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల ప్రాజెక్టులు కట్టారు. ఓటుకు కోట్లు కేసులో చిక్కుకున్న చంద్రబాబు తెలంగాణతో రాజీపడ్డాడు. అప్పట్లోనే చంద్రబాబు.. రాయలసీమ ఎత్తిపోతల ఆలోచన చేసి ఉంటే బాగుండేది కదా? పోతిరెడ్డిపాడులోంచి నీరు తీసుకెళ్తుంటే ఒకప్పుడు దేవినేని ఉమాతో ప్రకాశం బ్యారేజీ దగ్గర ధర్నా చేయించాడు. చిత్తూరు జిల్లాలో 3 రిజర్వాయర్లు కట్టి 8 నుంచి 10 టీఎంసీల నీరు నింపాలని వైఎస్ జగన్ ఆలోచిస్తే.. రాజకీయభిక్ష పెట్టిన జిల్లాకే ప్రాజెక్టులు రాకుండా కేసులు వేయించి అడ్డుకున్న దుర్మార్గుడు చంద్రబాబు. ఇంత దుష్ప్రచారమా? లేటరైట్ను బాక్సైట్ అంటూ చంద్రబాబు చేస్తున్నదంతా దుష్ప్రచారమే. ఈ ప్రభుత్వం లేటరైట్కు ఒక్క పర్మిషన్ ఇవ్వలేదు. కేవలం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులనే అమలు చేసింది. 2015లో పర్యావరణ అనుమతులు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే. 2018లో కోర్టు ఆర్డర్ ఇచ్చినా ఆయన ఎందుకు అడ్డుకోలేదు? తన పార్టీ వ్యక్తి అయ్యన్నపాత్రుడు, ఆయన కొడుకు గిరిజనుల పేరుతో మైన్లు తీసుకుని నడిపారు. వైఎస్ జగన్ అన్ని ప్రాంతాల అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు. నీటిహక్కు ఉన్నమేరే ప్రాజెక్టులు కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు ఇకనైనా నీచ రాజకీయాలు మానుకోవాలి. -
తెలంగాణ తీరును ప్రజల్లోకి తీసుకెళ్దాం
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించడమే పరమావధిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పని చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య 2015లో కుదిరిన ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందన్నారు. కృష్ణా జలాలపై తెలంగాణ ప్రభుత్వ వాదన, ఆ నీటిపై ఆంధ్రప్రదేశ్ హక్కు, వాడుకుంటున్న నీటిపై వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నేతలకు అవగాహన కల్పించేందుకు శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి జల వనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్తో కలిసి వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దాదాపు 109 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సజ్జల మాట్లాడుతూ.. కృష్ణా జలాల విషయంలో తెలంగాణా మంత్రులు, ఎమ్మెల్యేలు లేనిపోని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని.. వాస్తవ విరుద్ధమైన వారి వాదననను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు. మనకు రావాల్సిన నీటి వాటా కోసమే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టామని, దానిపై తెలంగాణ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందన్నారు. కేసీఆర్ తన పార్టీ ప్రయోజనాల కోసం మాత్రమే జల దోపిడీకి శ్రీకారం చుట్టారని విమర్శించారు. ఈ వ్యవహారంలో పచ్చమీడియా ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందన్నారు. ఒక వైపు తెలంగాణ ప్రభుత్వం నదీ జలాల ఒప్పందాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తుంటే.. మరోవైపు సందట్లో సడేమియాలా చంద్రబాబు దొంగ నాటకాలు ఆడుతూ ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా జలాల వివాదానికి మూల కారకుడు, అసలు నేరస్తుడు చంద్రబాబేనని స్పష్టం చేశారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న ఆయన.. అప్పట్లో తెలంగాణ సర్కార్ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొడదాం తెలంగాణ అబద్ధపు ప్రచారానికి వ్యతిరేకంగా, ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్న అన్యాయాన్ని అందరికి చాటి చెప్పేలా కార్యక్రమాలు చేపట్టాలని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. ఈ విషయాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లామని నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. అందరూ బాగుండాలన్నదే సీఎం అభిమతం అని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల దూకుడును అడ్డుకోవాల్సిన అవసరం ఉందని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. తెలంగాణ అడ్డగోలు వాదనకు గట్టిగా సమాధానం చెప్పాలని ఉన్నా, సంయమనం పాటిస్తున్నామని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, కేంద్రం పరిష్కారం చూపడం లేదని ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, మనం రెచ్చిపోకుండా రైతులకు న్యాయం జరిగేలా వ్యవహరించాలని విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. దిగువన ఉన్న వారు ఎలా దోపిడీ చేస్తారని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రశ్నించారు. వాస్తవ విషయాన్ని ప్రజలందరికి వివరించి, అవగాహన కల్పించాలని ఈ సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులందరూ అభిప్రాయపడ్డారు. మా కోటా నీటినే వాడుకుంటాం కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి గతంలో పలు ఒప్పందాలు ఉన్నప్పటికీ, రాష్ట్ర విభజన తర్వాత 2015లో కుదిరిన ఒప్పందాన్ని తెలంగాణ ఉల్లంఘిస్తోంది. మేము చేపట్టింది ప్రాజెక్టు కాదు. కేవలం ఎత్తిపోతల పథకం మాత్రమే. అందువల్ల దాన్ని ఆపాలని చెప్పడం సరికాదు. శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగులకు పైగా నీరుంటేనే.. పోతిరెడ్డిపాడు ద్వారా మనకు రావాల్సిన 44 వేల క్యూసెక్కుల నీరు తీసుకోవడం సా«ధ్యమవుతుంది. మాకు కేటాయించిన నీటి కంటే ఒక్క చుక్క కూడా ఎక్కువ తీసుకోం. ఇదే విషయాన్ని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో 796 అడుగుల నీరు ఉన్నప్పటికీ తెలంగాణా ప్రభుత్వం విద్యుత్తు ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటి దాకా 30, 40 టీఎంసీలు డ్రా చేశారు. అటు పులిచింతల నుంచి కూడా 14 వేల క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తి చేస్తూ సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ ప్రజలకు వివరించాలి. –అనిల్ కుమార్ యాదవ్, జల వనరుల శాఖ మంత్రి -
పేదల కళ్లలో సొంతింటి వెలుగులు : అనిల్కుమార్యాదవ్
నెల్లూరు (స్టోన్హౌస్పేట): ప్రైవేట్ లేఅవుట్ల కంటే మిన్నగా అభివృద్ధి చేసిన వైఎస్సార్ జగనన్న కాలనీల్లో లబ్ధిదారులు తమ ఇళ్లకు శంకుస్థాపన చేస్తుంటే వారి కళ్లల్లో సంతోషం, ఆనందం కనిపిస్తోందని, ఏక కాలంలో ఇలా శంకుస్థాపనలు చేయడం పండగ వాతావరణాన్ని తలపిస్తోందని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్కుమార్ యాదవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల పథకం కార్యక్రమంలో భాగంగా ఆదివారం నెల్లూరు నగర నియోజకవర్గంలోని పేద ప్రజలకు కొండ్లపూడి వైఎస్సార్ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఇవ్వడం చరిత్ర అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయంలో భాగంగా తొలి విడతగా 17 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. నగర నియోజకవర్గానికి సంబంధించి అర్హులైన దాదాపు 14,500 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నామన్నారు. అందులో మొదటి విడతగా 7,600 ఇళ్లు మంజూరు చేశామన్నారు. లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలోపు రోడ్లు, డ్రెయినేజీ, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి పేదలకు ఇళ్లు నిర్మిస్తూ మంచి ఆశయంతో ముందుకు వెళుతున్నారన్నారు. అయితే ప్రతిపక్ష నాయకులు ఆరు అంకణాలు మాత్రమేనని ఇచ్చారని, విమర్శిస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో పేదలకిచ్చిన టిడ్కో ఇళ్లు కేవలం నాలుగు అంకణాలు మాత్రమేనని గుర్తు చేశారు. పేదలకు సొంతిల్లు నిర్మించాలనే ఆలోచనతో అందుబాటులో ఉన్న స్థలాలను అభివృద్ధి చేసి ఇళ్ల నిర్మాణం చేస్తున్నామని వివరించారు. పట్టణ పరిధిలో తక్కువ భూమి అందుబాటులో ఉండడంతో వీలైనంత వరకు సేకరించి గత ప్రభుత్వం కంటే ఎంతో గొప్పగా పేదలకు సొంతింటి కలను సాకారం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో ఏ ఒక్కరికీ సెంటు స్థలం ఇచ్చిన దాఖాలు లేవన్నారు. గతంలో 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లు ఇచ్చే క్రమంలో పేదలపై రూ.3 లక్షల భారం మోపారన్నారు. ఆ రుణాలు కూడా పూర్తిగా మాఫీ చేసి ఉచితంగా ఇళ్లు లబ్ధిదారులకు ఇస్తామని తెలిపారు. పేదలకు ఇళ్లు నిర్మించుకునేందుకు అన్ని రకాల వెసులుబాటు కల్పిస్తునామన్నారు. జాయింట్ కలెక్టర్ (హౌసింగ్), అధికారులు, సచివాలయ సిబ్బంది పర్యవేక్షణలో నిర్మాణ పనులు జరుగుతాయన్నారు. పేద వారికి అండగా ఉండేది జగనన్న ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్కుమార్, ఆర్డీఓ హుస్సేన్సాహెబ్, వైఎస్సార్సీపీ నాయకులు కొణిదల సుధీర్, ఎండీ ఖలీల్ అహ్మద్, వేలూరు మహేష్, ఇంతియాజ్, గోగుల నాగరాజు, కుంచాల శ్రీనివాసులు, వందవాశి రంగా పాల్గొన్నారు. -
ఏపీ: ప్రజలను చూసి.. కాన్వాయ్ ఆపి
భామిని: ప్రజల కష్టాలు గుర్తించడంలో ముఖ్యమంత్రి జగనన్న బాటలో మంత్రులు పయనిస్తున్నారు. శుక్రవారం భామిని మండలం చిన్నదిమిలి వద్ద రోడ్డుకు పక్కగా గ్రానైట్ క్వారీ బాధితులైన కాలనీవాసులు తమ సమస్య చెప్పేందుకు ఎదురు చూస్తుండగా ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, జనవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్, పాలకొండ ఎమ్మెల్యే కళావతిలు తమ కాన్వాయి ఆపారు. వినతులు స్వీకరించి సమస్యలు విన్నారు. క్వారీ పేలుళ్లు, పరిహారం విషయమై కలెక్టర్కు సూచనలిస్తామని హామీ ఇచ్చారు. కాగా, మంత్రులు పర్యటనను విజయవంతం చేసిన ప్రజలు, అధికారులకు పాలకొండ ఎమ్మెల్యే కళావతి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాను సస్యశ్యామలం చేసే నేరడి–బ్యారేజ్ నిర్మాణానికి తాము ఆటంకం కాదని చెప్పిన ఒడిశా రైతులను అభినందించారు. -
మరింత వేగంగా ప్రాజెక్టుల పనులు
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో మరింత వేగం పెంచాలని జలవనరుల శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి పి.అనిల్కుమార్ యాదవ్ ఆదేశించారు. సోమవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డిలతో కలిసి ఆయన 13 జిల్లాల చీఫ్ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఏడాది పూర్తి చేయాల్సిన ఆరు ప్రాజెక్టులపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా.. పోలవరం ప్రాజెక్టు పనులు షెడ్యూలు ప్రకారమే చేస్తున్నామని సీఈ సుధాకర్ బాబు వివరించగా.. ఎగువ కాపర్ డ్యామ్ పనుల్లో మరింత వేగం పెంచాలని మంత్రి అనిల్ సూచించారు. వరద వచ్చేలోగా నిర్వాసితులకు పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని పోలవరం అడ్మినిస్ట్రేటర్ ఓ.ఆనంద్ను ఆదేశించారు. నెల్లూరు, సంగం బ్యారేజీలు పూర్తయ్యే దశకు చేరుకున్నాయని సీఈ హరినారాయణరెడ్డి చెప్పగా.. వాటిని ఈ ఏడాదే సీఎం వైఎస్ జగన్మోన్రెడ్డి చేతుల మీదుగా జాతికి అంకితం చేయడానికి సిద్ధం చేయాలని మంత్రి అనిల్ ఆదేశించారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగం పనులను అధునాతన సాంకేతిక పరి/ê్ఞనం ఫోర్ పూలింగ్ విధానంలో చేస్తున్నామని, ఆగస్టు నాటికి పూర్తవుతాయని సీఈ మురళీనాథ్రెడ్డి చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను శరవేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. వంశధార ప్రాజెక్టు ఫేజ్–2 స్టేజ్–2, వంశధార–నాగావళి అనుసంధానం పనులను ఈ ఏడాదే పూర్తి చేసి.. వాటిని ప్రారంభించడానికి సిద్ధం చేయాల్సిందిగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ‘యాస్’ తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
గురుమూర్తి నామినేషన్ దాఖలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తిరుపతి పార్లమెంట్ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా డాక్టర్ ఎం.గురుమూర్తి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. 9 మంది రాష్ట్ర మంత్రులు, ఇద్దరు ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు, టీటీడీ చైర్మన్ తదితరులతో కలిసి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులో కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేవీఎన్ చక్రధర్బాబుకు 3 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. తొలుత నెల్లూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి మంత్రులు, పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వీఆర్సీ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మొదటి సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. మునిసిపల్ తీర్పు పునరావృతం ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ పాలనకు ప్రజలు మునిసిపల్ ఎన్నికల ద్వారా బలమైన తీర్పు ఇచ్చారని చెప్పారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లోనూ అదే తీర్పు పునరావృతమవుతుందని పేర్కొన్నారు. దేశం మొత్తం చూసేలా భారీ మెజార్టీ తప్పక సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కులాలు, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ చిన్న కుటుంబం నుంచి వచ్చిన విద్యావంతుడు గురుమూర్తి ఒక వైపు, ఇద్దరు కేంద్ర మాజీ మంత్రులు, ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇలా హేమాహేమీలు మరోవైపు బరిలోకి దిగారని చెప్పారు. గురుమూర్తి గెలుపు ఎప్పుడో ఖాయమైందన్నారు. రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం ఆలోచించే రీతిలో భారీ మెజార్టీ సాధించడానికి తాము ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలు ఇంటింటికి అందిస్తున్న సీఎం రుణం తీర్చుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నెల్లూరులో నామినేషన్ వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి 5 లక్షల మెజారిటీ సాధిస్తాం మంత్రి అనిల్ యాదవ్ మాట్లాడుతూ ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా నామినేషన్ దాఖలు చేయడానికి వస్తేనే పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారని చెప్పారు. దేశమంతా ఆసక్తిగా చూస్తున్న పార్లమెంట్ ఉప ఎన్నికల్లో 5 లక్షల మెజార్టీ సాధిస్తామన్నారు. ఈ ఎన్నికలు రెఫరెండం కాదని చెప్పి టీడీపీ ముందే చేతులెత్తేసిందన్నారు. జగన్ 21 నెలల పరిపాలనకు ప్రజలు భారీ మెజార్టీతో తిరుపతి పార్లమెంట్ స్థానం కానుకగా ఇవ్వనున్నారని పేర్కొన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ దళిత వర్గానికి చెందిన సామాన్యడైన గురుమూర్తిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ, బీజేపీ ఉనికి కాపాడుకోడానికి డ్రామాలకు తెరతీశాయని విమర్శించారు. ర్యాలీకి భారీగా హాజరైన వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ప్రజలు ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణస్వామి, బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకపాటి గౌతమ్రెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, కన్నబాబు, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఆదాల ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, నల్లపరెడ్డి ప్రసనకుమార్రెడ్డి, కాకాణి గోవర్ధన్రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్, కిలివేటి సంజీవయ్య, తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కొలుసు పార్థసారథి, గడికోట శ్రీకాంత్రెడ్డి, రవీంద్రనాథ్రెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, బియ్యపు మధుసూదన్రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్చక్రవర్తి, పార్టీ నాయకుడు నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నెల్లూరు జిల్లాను సుందరంగా తీర్చిదిద్దుతాం
-
తిరుపతి ఉపఎన్నికలో చరిత్ర సృష్టిస్తాం
నెల్లూరు (స్టోన్హౌస్పేట): తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో చరిత్ర సృష్టిస్తామని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్కుమార్ యాదవ్ తెలిపారు. సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, పరిపాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని, తమ 20 నెలల పాలనకు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలే రెఫరెండంగా భావిస్తామన్నారు. నెల్లూరులో ఆదివారం నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు జీవితమంతా స్టేల బతుకేనన్నారు. తప్పులు చేయకపోతే కోర్టుల్లో స్టే తీసుకోవాల్సిన అవసరం ఏముందన్నారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే ధైర్యంగా విచారణను ఎదుర్కొనే వారని, అలాంటి సామర్థ్యం లేనందునే ‘స్టే’ల బాబుగా మారాడన్నారు. -
చంద్రబాబు వల్లే డయాఫ్రంవాల్కు ముప్పు
పోలవరం రూరల్/రంపచోడవరం/దేవీపట్నం: చంద్రబాబు అనాలోచిత నిర్ణయాల వల్లే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రంవాల్కు ముప్పు ఏర్పడిందని జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ తెలిపారు. ఆయన బుధవారం పోలవరం ప్రాజెక్టుతో పాటు పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఎగువ కాఫర్ డ్యాం, జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులతో పాటు ఎడమ కాలువకు, నావిగేషన్ కెనాల్కు సంబంధించిన సొరంగ మార్గాలను పరిశీలించారు. నిర్వాసితుల గృహాలు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు, ప్రాజెక్టు పనుల పురోగతిపై మేఘ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సీఎం జగన్ నిర్దేశించిన సమయానికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్టు మంత్రి చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంలో ముందుగా స్పిల్వే పూర్తి చేసి.. కాఫర్ డ్యాం నిర్మించి.. వరదనీటిని మళ్లించాక డయాఫ్రం వాల్ నిర్మించాల్సి ఉందన్నారు. కానీ చంద్రబాబు అవేమీ పట్టించుకోలేదన్నారు. దీంతో వరద తాకిడికి డయాఫ్రం వాల్ దెబ్బతిందని తెలిపారు. చంద్రబాబు తీరు వల్ల సమయం, డబ్బు.. వృథా అయ్యాయని మండిపడ్డారు. వరదల సమయానికి నిర్వాసితులు ఇబ్బందులు పడకుండా 41వ కాంటూరు పరిధిలోని వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. మే నెలాఖరు నాటికి గృహ నిర్మాణాలు పూర్తి చేసి ఏడు మండలాల పరిధిలోని 17 వేల కుటుంబాలను తరలిస్తామన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఈఎన్సీ నారాయణరెడ్డి, సీఈ ఎం.సుధాకర్బాబు, స్పెషల్ కలెక్టర్ ఆనంద్, ప్రాజెక్టు ఎస్ఈ కె.నరసింహమూర్తి, ఆర్డీవో వైవీ ప్రసన్నలక్ష్మి, ఐటీడీఏ పీవో ఆర్వీ సూర్యనారాయణ, మేఘ జీఎం ఎ.సతీష్బాబు తదితరులున్నారు. -
ఘనంగా మూలపేట మూలస్థానేశ్వర స్వామి రథోత్సవం
-
టీడీపీ నేత దేవినేని ఉమాపై మంత్రి అనిల్కుమార్ యాదవ్ ఫైర్
-
బాబు బాగోతం వల్లే డయాఫ్రమ్ వాల్కు నష్టం
సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో పోలవరం పనులను ప్రణాళిక లేకుండా అస్తవ్యస్తంగా చేయడం వల్ల 2018లోనే డయాఫ్రమ్ వాల్ వరదకు కొట్టుకుపోయిందని జలవనరులశాఖ మంత్రి అనిల్కుమార్యాదవ్ విమర్శించారు. నిజం ఇలా ఉంటే.. ఈనాడు దినపత్రిక మాత్రం దాన్ని కప్పిపుచ్చుతూ కథనం రాసిందని మండిపడ్డారు. నిర్మాణ కాంట్రాక్టర్ రామోజీరావు బంధువే అనే నిజాన్ని వార్తలో దాచిపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణాలేం టో ఈనాడు తన కథనంలో చెప్పకపోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తోందని దుష్ప్రచారం చేయడమే ఈ వార్త ఉద్దేశమన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బుధవారం మీడియాతో మాట్లాడారు. డయాఫ్రమ్ వాల్ను చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే చేపట్టారని, దీనికి ఆయనే బాధ్యత వహించాలన్నారు. అనిల్ ఇంకేమన్నారంటే.. ఆ తప్పు చంద్రబాబుదే.. ఓ ప్రణాళిక ప్రకారం.. పోలవరం ప్రాజెకు నిర్మిం చాల్సి ఉండగా టీడీపీ హయాంలో అతుకులతుకులుగా కట్టడం వల్లే ఇలాంటి దుష్ఫలితాలు వస్తున్నాయి. స్పిల్వే, స్పిల్ చానెల్ పూర్తి చేసి, వరద నీటిని మళ్లించాక కాఫర్ డ్యామ్ను పూర్తి చేయాలి. తర్వాత డయాఫ్రమ్ వాల్ చేపట్టాలి. కానీ వీటిని ఇష్టానుసారం అసంపూర్ణంగా చేశారు. లక్షలాది క్యూసెక్కుల వరద వస్తుందని తెలిసి కూడా అడ్డదిడ్డంగా కట్టడం వల్ల 1.4 కిలోమీటర్లున్న డయాఫ్రమ్ వాల్కు 185 మీటర్ల మేర నష్టం జరిగింది. ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ టీడీపీ ప్రభుత్వం దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదు. జరిగిన నష్టాన్ని పోలవరం అథారిటీ గుర్తించింది. వారి సూచనల మేరకు ముందుకెళ్తాం. మే నాటికి స్పిల్వే, స్పిల్ చానెల్లను పూర్తిచేస్తాం. కాఫర్ డ్యామ్ నిర్మాణం గోదావరి వరదను మళ్లించి, వరద ప్రభావం ఆ ప్రాంతంపై పడకుండా చేస్తాం. విశాఖపై ప్రేమ ఇప్పుడు గుర్తొచ్చిందా? విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తామంటే అడ్డుకున్న చంద్రబాబు, ఎల్లో మీడియాకు అకస్మాత్తుగా విశాఖపై ప్రేమ పుట్టుకురావడం విడ్డూరంగా ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వైఎస్ జగనే కారణమన్న రీతిలో అబద్దపు ప్రచారం చేస్తున్నారు. 1999 నుంచి 2004 వరకు రాష్ట్రంలోనే 54 సంస్థలు మూతపడటమో, ప్రైవేటుపరం అవ్వడమో జరిగితే ఇదే ఈనాడు పత్రిక అప్పట్లో సమర్థించింది. -
సుబాబుల్ రైతుకు ప్రభుత్వం వెన్నుదన్ను
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ విధానాల వల్ల సరైన మార్కెటింగ్ సదుపాయం లేక తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రంలోని దాదాపు 66 వేల మంది సుబాబుల్, యూకలిప్టస్ ఇతర కాగితపు గుజ్జు కలప సాగుదారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, అనీల్కుమార్ స్పష్టం చేశారు. సుబాబుల్ రైతు సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్కమిటీ సోమవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో యూకలిప్టస్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సుబాబుల్ ఎక్కువగా సాగవుతుంది. గతంలో నేరుగా పేపర్ మిల్లులే కొనుగోలు చేసేవి. 2017లో 45 మంది బయటి వారికి ట్రేడ్ లైసెన్సులు ఇచ్చారు. ఈ ట్రేడర్స్ కంపెనీలతో కుమ్మక్కై రైతులను ఇబ్బంది పెడుతున్నారని ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. కంపెనీలతో కుమ్మక్కవుతున్న ట్రేడర్స్ను గుర్తించి లైసెన్సులను రద్దు చేయాలని కేబినెట్ సబ్ కమిటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇతర పంటల మాదిరిగా ఈ పంటలనూ ఈ క్రాప్ ద్వారా నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రైతుల నుంచి పంటను పేపర్ మిల్లులు నేరుగా కొనుగోలు చేసేందుకు వీలుగా పర్మిట్లు జారీ చేయాలని, వ్యవసాయ శాఖ కమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు పాల్గొన్నారు. వేసవిలో మంచినీటి ఎద్దడి రాకుండా చూడండి: మంత్రి పెద్దిరెడ్డి రానున్న వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తక్షణమే మొదలు పెట్టాలని మంత్రి పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం అధికారులతో ఆయన సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి పేర్ని నాని, అధికారులు పాల్గొన్నారు. -
కులమతాల మధ్య చిచ్చు పెట్టడమే చంద్రబాబు అజెండా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న దేవాలయాల ఘటనల వెనుక దురుద్దేశం కనిపిస్తోందని, పోలీసుల విచారణలో కూడా ఇదే వెల్లడైందని జల వనరుల శాఖా మంత్రి పి.అనిల్కుమార్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని చెడగొట్టి, తద్వారా లబ్ధి పొందాలనే నీచమైన నేత చంద్రబాబు అని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పైకి నుదుట బొట్టు.. లోపల కులాలు, మతాల మధ్య చిచ్చు.. ఇదే చంద్రబాబు అజెండా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల్లో ఘటనల గురించి డీజీపీ వెల్లడిస్తే చంద్రబాబు, ఆయన తనయుడు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. టీడీపీ ఉనికి పాట్లు ► తమ ఉనికి కోల్పోతున్నామని టీడీపీ నేతల్లో భయం మొదలైంది. 9 ఆలయాల ఘటనల్లో ఉన్న వారు తమ పార్టీ కార్యకర్తలు కాదని టీడీపీ, బీజేపీ నేతలు చెప్పగలరా? ► ఇటీవల దేవాలయాలపై దాడులకు సంబంధించి పోలీసులు 29 కేసులను ఛేదించి, 80 మందిని అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఛేదించిన 9 కేసులలో రాజకీయ పార్టీలకు చెందిన వారి హస్తం ఉందని డీజీపీ స్పష్టంగా చెప్పారు. ► ఈ దాడుల్లో టీడీపీ బండారం బయట పడుతోందని నారా వారి నరాల్లో వణుకు పుట్టుకొస్తోంది. ఆ పార్టీ నేతల మాటల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరేంటనేది ప్రజలకు బాగా తెలుసు ► వెనక నుంచి కుట్రలు చేసి, ముందుకొచ్చి గగ్గోలు పెట్టేది ఎవరనేది ప్రజలకు అర్థమైంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.80 వేల కోట్లు సంక్షేమంపై ఖర్చు చేస్తే.. అందులో సింహభాగం లబ్ధిదారులు హిందువులే. సీఎం జగన్ను ప్రజల గుండెల్లో నుంచి తీసేయలేరు. కాబట్టే నీచ, నికృష్ట కార్యక్రమాలకు చంద్రబాబు పాల్పడుతున్నారు. ► దేవాలయానికి బూట్లు వేసుకుని వెళ్లే వ్యక్తి, బూట్లు వేసుకుని హారతి తీసుకునే వ్యక్తి ఎవరో ప్రజలకు తెలుసు. దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేయించిన చరిత్ర, విజయవాడలో 40 గుడులను కూల్చేసిన చరిత్ర బాబుదే. ► సీఎం జగన్కు అన్ని మతాల పట్ల విశ్వాసం, దేవుడు అంటే నమ్మకం ఉండబట్టే.. కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా కోట్ల మందికి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. దేశంలోనే అత్యుత్తమ సీఎంల జాబితాలో జగన్ మూడో స్థానంలో నిలిచారు. -
‘వెలిగొండ’ మొదటి సొరంగం పూర్తి
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్ట్ మొదటి సొరంగాన్ని టీడీపీ హయాంలో 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 వరకు కేవలం 600 మీటర్లు మాత్రమే తవ్వారు. రోజుకు సగటున 0.32 మీటర్ల మేర.. అంటే ఒక అడుగు మాత్రమే సొరంగాన్ని తవ్వారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక.. 2019 నవంబర్ నుంచి జనవరి 13, 2021 వరకూ మొదటి సొరంగంలో 3.6 కి.మీ. తవ్వి పనులను పూర్తి చేశారు. మార్చి 2020 నుంచి జూలై 2020 వరకూ లాక్డౌన్ కొనసాగింది. జూన్ నుంచి నవంబర్ వరకూ నల్లమల అడవుల్లో భారీ వర్షాలు కురవడంతో సొరంగం తవ్వకానికి ఆటంకం కలిగింది. ఇన్ని అడ్డంకుల్లోనూ రోజుకు సగటున 9.23 మీటర్ల చొప్పున తవ్వుతూ సొరంగాన్ని పూర్తి చేశారు. ప్రాజెక్ట్ను 2016 నాటికే పూర్తి చేస్తామని చెప్పిన టీడీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా టన్నెల్ బోరింగ్ మెషిన్ల మరమ్మతుల పేరుతో కాంట్రాక్టర్లకు రూ.66.44 కోట్లను దోచిపెట్టిన టీడీపీ సర్కారు కమీషన్లు వసూలు చేసుకుంటే.. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.61.76 కోట్లను ఆదా చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం రికార్డు సమయంలో మొదటి సొరంగాన్ని పూర్తి చేయడం గమనార్హం. వేగం పుంజుకున్న రెండో సొరంగం పనులు ఇదే ప్రాజెక్ట్లో భాగమైన రెండో సొరంగం పనులను వేగవంతం చేశారు. నల్లమల సాగర్ పనులను ఇప్పటికే పూర్తి చేశారు. నల్లమల సాగర్లో ముంపునకు గురయ్యే 11 గ్రామాలకు చెందిన 7,555 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు రూ.1,411.56 కోట్లను జూన్ 24న మంజూరు చేశారు. పునరావాస కాలనీల నిర్మాణాన్ని వేగవంతం చేశారు. శ్రీశైలానికి వరద వచ్చేలోగా నల్లమల సాగర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఆ మేరకు పనులు వేగం పుంజుకున్నాయి. అధికారులను అభినందించిన మంత్రి అనిల్ సొరంగం పనులను రికార్డు సమయంలో పూర్తి చేసిన జల వనరుల శాఖ అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ మేఘాను మంత్రి పి.అనిల్కుమార్ యాదవ్ అభినందించారు. జల వనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, సీఈ జలంధర్లకు బుధవారం రాత్రి ఫోన్ చేసిన మంత్రి గడువులోగా పనులు పూర్తి చేశారని అభినందించారు. రెండో సొరంగం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. మాట నిలబెట్టుకున్న సీఎం ప్రాజెక్ట్ మొదటి సొరంగం పనులు బుధవారం రాత్రి పూర్తయ్యాయి. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసేందుకు దీనిని ప్రాధాన్యత ప్రాజెక్ట్గా ప్రకటించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి దశ పనులను పూర్తి చేసి వచ్చే సీజన్లో నల్లమల సాగర్కు శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను తరలిస్తామని గత ఏడాది ఫిబ్రవరి 20న ప్రకటించారు. ఆ మేరకు పనులు పూర్తి చేయించి మాట నిలబెట్టుకున్నారు. -
బాబు చేతిలో తోలుబొమ్మలా నిమ్మగడ్డ
నెల్లూరు (సెంట్రల్): లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూర్చే అమ్మ ఒడి పథకాన్ని అడ్డుకునేందుకు కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని రాష్ట్ర మంత్రులు అనిల్కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్రెడ్డి, ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ చంద్రబాబు చేతిలో కీలు»ొమ్మగా మారారని, సంక్షేమ పథకాలను నిలిపి వేసి రాక్షసానందం పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి న్యాయ వ్యవస్థను కూడా పరిగణనలోకి తీసుకోక పోవడం సిగ్గు చేటన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అమ్మ ఒడి కార్యక్రమాన్ని నెల్లూరులో ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ‘జగనన్న అమ్మ ఒడి’ రెండో విడత కార్యక్రమం ప్రారంభించనున్న నేపథ్యంలో నెల్లూరులో మంత్రులు విలేకరులతో మాట్లాడారు. లబ్ధిదారులు పెరిగారు: మంత్రి సురేష్ గతేడాది కన్నా ఈ ఏడాది అమ్మ ఒడి పథకానికి అదనంగా 1.76 లక్షల మంది లబ్ధిదారులు పెరిగారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఈ అమ్మ ఒడి పథకం ద్వారా తల్లులకు ముందే సంక్రాంతి వచ్చిందన్నారు. చదువుకు పేదరికం అడ్డు కాకూడదని, బాలకార్మీకులుగా మారకూడదనే ఉద్దేశంతో అమ్మ ఒడి పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్ నగదు జమ చేస్తున్నారన్నారు. విద్యావ్యవస్థలో ముఖ్యమంత్రి సమూల మార్పులు తీసుకువస్తున్నారని చెప్పారు. ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సిన ఉద్యోగులు ఇప్పుడు ఎన్నికలు వద్దని చెబుతున్నారని, వారికి నిమ్మగడ్డ రమేష్ ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సైంధవుడిలా చంద్రబాబు అడ్డుపడుతున్నారు: మంత్రి అనిల్ ప్రజా సంక్షేమానికి చంద్రబాబు సైంధవుడిలా అడ్డుపడుతున్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ మండిపడ్డారు. ప్రజలకు ఎంతో అవసరమైన అమ్మ ఒడి పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తుంటే దాన్ని కూడా అడ్డుకునే కుటిల రాజకీయాలు చంద్రబాబు చేస్తున్నారన్నారు. మహిళలకు మేలు జరిగే సంక్షేమ పథకాలను అడ్డుకునే చంద్రబాబు మహిళా ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారన్నారు. ఒక పక్క వ్యాక్సిన్ పనిలో ప్రభుత్వ యంత్రాంగం ఉంటే, ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. కరోనాకు భయపడి హైదరాబాద్లో దాక్కున్న చంద్రబాబుకు, ఆయన కుమారుడికి ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా? అని ప్రశ్నించారు. ప్రజలపై శ్రద్ధ ఉంటే ఎన్నికలపై ప్రశ్నించు: మంత్రి గౌతమ్రెడ్డి పరిశ్రమల వల్ల ప్రజల ఆరోగ్యానికి ఇబ్బందులు వస్తాయంటున్న పవన్ కళ్యాణ్, కరోనా సమయంలో ఎన్నికలు పెడుతున్న నిమ్మగడ్డను ఎందుకు ప్రశ్నించరని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ధ్వజమెత్తారు. దివీస్ పరిశ్రమల వద్ద పవన్ ఎందుకు ఆందోళన చేశారో ఆయనకే తెలిసినట్లు లేదన్నారు. దివీస్కు అనుమతి ఇచ్చిందే 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వమే అనేది తెలుసుకోవాలన్నారు. టీడీపీ పార్టనర్గా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ఈ సమావేశంలో ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఆదాల ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, కిలివేటి సంజీవయ్య, రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, ఆప్కాబ్ చైర్మన్ అనిల్బాబు, విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘అమ్మఒడి’కి నేటి వరకు గడువు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/పొగతోట (నెల్లూరు): జగనన్న అమ్మఒడి పథకానికి అర్హులైన వారి పేర్లు లబ్ధిదారుల జాబితాలో లేకపోతే మంగళవారం వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం ఇచ్చినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. అవసరమైతే ఈ అవకాశాన్ని మరో రెండురోజులు పొడిగిస్తామన్నారు. అమ్మఒడి రెండో విడత కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ఈనెల 11న నెల్లూరులో ప్రారంభిస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన మంత్రి అనిల్కుమార్యాదవ్తో కలిసి నెల్లూరులో అధికారులతో సమీక్షించారు. తమ ప్రభుత్వానికి ప్రజల ఆదరణ చూసి కడుపు మంటతో ప్రతిపక్షాలు నిందలు వేస్తున్నాయన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రులతోపాటు సీఎం ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సభాస్థలిని పరిశీలించారు. -
ప్రజాబలంతో జగన్ సీఎం అయ్యారు
సాక్షి, నెల్లూరు జిల్లా: వెంకటాచం మండలం సర్వేపల్లిలో రూర్భన్ పథకం కింద రూ. 100 కోట్లతో చేపట్టిన పనులకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి పైలాన్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు గౌతమ్రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో జలజీవన్ మిషన్ ద్వారా చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపనలు చేశారు. అక్కడి నుంచి పూడిపర్తికి చేరుకుని నూతనంగా నిర్మించిన గ్రామసచివాలయం, వాటర్ట్యాంక్లు ప్రారంభించారు. అనంతరం సర్వేపల్లిలో నిర్వహించిన బహిరంగసభలో మంత్రులు మాట్లాడారు. ప్రజాబలంతో వైఎస్ జగన్ సీఎం అయ్యారు: మంత్రి పెద్దిరెడ్డి 'ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ ఆశయాలకు కట్టుబడి ఉన్నారు. ఆయన దొడ్డిదారిలో సీఎం కాలేదు. ప్రజా బలంతో తనను తాను నిరూపించుకొని, కష్టపడి సీఎం అయ్యారు. 19 నెలల్లోనే 90 శాతం మేనిఫెస్టో అమలు చేసిన ఘనత సీఎం జగన్ది. ముఖ్యమంత్రి మొక్కవోని దైర్యంతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారు. వైఎస్ జగన్ ఒక సుదీర్ఘ విజన్తో పనిచేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తే.. వైఎస్ జగన్ బాధ్యతలు తీసుకున్నాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారు. గత ప్రభుత్వాలు ఏవీ కూడా ఇంతపెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేయలేదు. ఏ ఎన్నికల్లో అయినా మీరు మన పార్టీలో ఎవరికి ఓటు వేసినా అది వైఎస్ జగన్కే ఓటేసినట్లు భావించి వేయండి' అంటూ మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. వైఎస్ జగన్ పోరాట పటిమ దేశానికే ఆదర్శం: డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాటపటిమ దేశానికే ఆదర్శం. కష్టపడి, ప్రజాబలంతో పార్టీని అధికారంలోకి తెచ్చారు. చంద్రబాబు దొడ్డి దారిలో, మామాకు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడు. మన ముఖ్యమంత్రికి మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబిల్తో సమానం. ప్రజల కోసం నిత్యం శ్రమించే ముఖ్యమంత్రి జగన్ని తిరుపతి ఎన్నికల్లో ఆశీర్వదించండి' అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి కోరారు. చంద్రబాబుని ఆ రాష్ట్రానికే పరిమితం చేద్దాం: మంత్రి అనిల్ '18 నెలలోనే మన ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. మేనిఫెస్టోలో 90 శాతం ఇప్పటికే అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిది. ఇవాళ ప్రజల ఇంటి ముందే పాలన సాగుతోంది. సచివాలయాల ద్వారా అన్ని పనులు జరిగిపోతున్నాయి. తిరుపతి ఎన్నికలు ముఖ్యమంత్రి పనితీరుకి, గత ప్రభుత్వం అరాచకాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా చెప్పవచ్చు. తిరుపతి ఎంపీ ఉపఎన్నికలో 3 లక్షల మెజారిటీతో గెలవబోతున్నాం. చంద్రబాబుని ఆ రాష్ట్రానికే పరిమితం చేద్దాం. ప్రతిపక్ష నాయకుడిగా తనకి ఇక్కడ పనిలేకనే.. బాబు పక్క రాష్ట్రంలో ఉండి పోయాడు. లోకేష్ ట్రాక్టర్ని ఉప్పుటేరులో పడేసినట్టే.. టీడీపీని కూడా సముద్రంలో ముంచడం ఖాయం. కోవిడ్ సాకు చూపి ముఖ్యమంత్రి ఏ పధకం కూడా ఆపలేదు. అన్ని పనులు చెప్పిన సమయానికి చేసి ముఖ్యమంత్రి గ్రేట్ లీడర్ అనిపించుకుంటున్నారు' అని మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. తిరుపతి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలి: గౌతమ్రెడ్డి వైఎస్ జగన్ ప్రభుత్వం మహిళల, పేదల ప్రభుత్వం. గత ప్రభుత్వం ఒట్టి ఎంవోయూల ప్రభుత్వం, మేము ఆచరణలో పారిశ్రామిక అభివృద్ధి చూపిస్తున్నాం. 18 నెలల్లోనే ధైర్యంగా ప్రజల్లోకి వస్తున్నామంటే మా ముఖ్యమంత్రి చేస్తున్న సంక్షేమం, అభివృద్ధే కారణం. వచ్చే తిరుపతి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి పిలుపునిచ్చారు. బాబు విజన్ 2020 అనేవాడు.. 2020లో కరోనా వచ్చింది: కాకాణి తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి పార్టీకి తీరనిలోటు. రేపు జరగబోయే తిరుపతి ఉపఎన్నికలో అభ్యర్థి ఎవరైనా వైఎస్సార్సీపీ అఖండ మెజారిటీతో గెలిపించాలి. గతంలో చంద్రబాబు విజన్ 2020 అనేవాడు. అంటే 2020లో కరోనా వచ్చింది. మళ్లీ విజన్ 2029 అంటున్నాడు. అప్పుడేం విపత్తు వస్తుందో..?. అప్పట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న టైంలో పనిచేయడం ఇష్టం లేకపోతే దొంగ సంతకం పెట్టేవాడు. మంచికో సంతకం, చెడుకో సంతకం పెట్టే కుటిల నీతి చంద్రబాబు నైజం. వచ్చే తిరుపతి ఉపఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు రాకుండా చేయాలి. నామినేటెడ్ పదవుల్లో, కాంట్రాక్టుల్లో, మహిళలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదే. నెల్లూరు జిల్లాలో ఒక బ్రూస్లీ ఉన్నాడు. ఆయనే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి. సోమిరెడ్డికి ఈ సారి సర్వేపల్లి వైపు కన్నెత్తి చూసే దమ్ములేదు అంటూ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. -
చంద్రబాబు వేసిన చిక్కుముడులు విప్పుతున్నాం
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసిన చిక్కుముడులు ఒక్కొక్కటిగా విప్పుతున్నామని, దానికోసం కసరత్తు చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్యాదవ్ చెప్పారు. సవరించిన అంచనాలు ఆమోదానికి కేంద్రం సానుకూలంగా ఉందన్నారు. శుక్రవారం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో బుగ్గన రాజేంద్రనాథ్, అనిల్కుమార్ భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలు ఆమోదించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. అనంతరం రాష్ట్ర మంత్రులు మీడియాతో మాట్లాడారు. తొలుత మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. మూడు రోజులుగా కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల మంత్రులు, అధికారులతో ఆర్థిక మంత్రి బుగ్గన, రాష్ట్ర అధికారులు భేటీ అయ్యారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన వినతిపత్రం కేంద్రమంత్రికి అందజేశామన్నారు. చంద్రబాబు హయాంలో చేసిన పొరపాట్లు, దరిమిలా పోలవరం ప్రాజెక్టుకు వస్తున్న ఇబ్బందులు కేంద్రమంత్రికి వివరించామన్నారు. ఆ అంశాలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని షెకావత్ తెలిపారన్నారు. పోలవరం ప్రాజెక్టులో తాగునీటికి సంబంధించి కాంపొనెంట్ తీసేశారని, విభజన చట్టం ప్రకారం ఇవ్వాలని కోరామన్నారు. సవరించిన అంచనాల ప్రకారం ఆర్అండ్ఆర్కు అవసరమైన నిధులు ఇవ్వాలని కోరామన్నారు. వీటికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని, కచ్చితంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘంతో సమన్వయం చేసుకొని ముందుకెళ్తామని చెప్పారన్నారు. పోలవరం ప్రాజెక్టు, ఆర్అండ్ఆర్ పనుల పరిశీలనకు రావాలని కోరగా.. 15 రోజుల్లోగా పోలవరం సందర్శిస్తానని షెకావత్ హామీ ఇచ్చారని అనిల్ తెలిపారు. సకాలంలో పూర్తి చేయడమే లక్ష్యం బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా పేర్కొన్న పోలవరంను సకాలంలో పూర్తి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. చంద్రబాబు హయాంలో ప్రత్యేక ప్యాకేజీ పేరుతో కుదుర్చుకున్న ఒప్పందం వల్ల వచ్చిన సమస్యలన్నింటినీ కేంద్రమంత్రికి వివరించామన్నారు. పోలవరానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలుమార్లు చెప్పడాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, కేంద్ర అధికారులు, రాష్ట్ర అధికారులు ఎస్ఎస్రావత్, ఆదిత్యనాథ్ దాస్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా తదితరులు పాల్గొన్నారు. -
పెన్నా బ్యారేజ్ క్రస్ట్ గేట్ల పనులు ప్రారంభం
నెల్లూరు (స్టోన్హౌస్పేట): నెల్లూరు నగరంలో పెన్నా నదిపై నిర్మిస్తున్న బ్యారేజ్కు సంబంధించిన క్రస్ట్గేట్ల పనులను జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ ఆదివారం ప్రారంభించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించగా.. క్రస్ట్గేట్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ.. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన బ్యారేజ్ పనులను వచ్చే జనవరికల్లా పూర్తి చేస్తామని చెప్పారు. జనవరి నెలాఖరులో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా బ్యారేజ్ను ప్రజలకు అంకితమిస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ వల్ల జిల్లాలోని 99,525 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లభిస్తుందన్నారు. అలాగే జిల్లాలో మరికొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్లకు కూడా ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారన్నారు. కోవూరు నియోజకవర్గ పరిధిలో ముదివర్తి సబ్మెర్జిబుల్ కాజ్ వే నిర్మాణానికి రూ.94 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. సర్వేపల్లి రిజర్వాయర్ ఆధునీకరణకు రూ.12 కోట్లు, కలిగిరి రిజర్వాయర్ ఆధునీకరణకు రూ.21 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. కండలేరు జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ చక్రధర్బాబు, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, డీసీఎంఎస్ చైర్మన్ చలపతి, విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి
సాక్షి ప్రతినిధి, ఏలూరు/ పోలవరం రూరల్: వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, ఖరీఫ్కు గ్రావిటీ ద్వారా నీరు విడుదల చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ప్రాజెక్టును సందర్శించారు. తొలుత గడ్డర్ల ఏర్పాటును పరిశీలించారు. అనంతరం స్పిల్ వే, కాఫర్ డ్యామ్ పనులు, ప్రాజెక్టులో గ్యాప్ 3 పనులను పరిశీలించారు. పనుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. అధికారులతో సమీక్ష తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ను, ఆయన తనయుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి చేస్తారని, ఇది భగవంతుని సంకల్పమని మంత్రి అన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం నిర్మాణ బాధ్యతలను మాత్రమే చూస్తోందని, నిర్మాణం, ఆర్అండ్ఆర్కు సంబంధించి నిధులు మంజూరు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని మంత్రి స్పష్టం చేశారు. జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి, నిధులు మంజూరు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ సహకరిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఉమా నువ్వు చెమ్మ చెక్క ఆడుతున్నావా? మేఘా సంస్థ వచ్చాక రూ.600 కోట్లు పైగా పనులు చేసిందని అనిల్కుమార్ యాదవ్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఎక్కడా డీవియేషన్ లేదని చెప్పారు. ‘పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు అంటున్నారు. నువ్వు అడిగితే నీకు సమాధానం చెబుతూ అనుమానం ఉంటే టేపుతో కొలుచుకోమని చెప్పాను. నువ్వు ప్రజలను అంటారా అంటున్నావు..’ అని మాజీ మంత్రి దేవినేని ఉమను ఉద్దేశించి మంత్రి వ్యాఖ్యానించారు. 194 టీఎంíసీలు నిల్వ చేసేందుకు అంగుళం కూడా తగ్గకుండా ప్రాజెక్టు కడుతున్నామని చెప్పారు. 2017లో కేంద్ర కేబినెట్ సందర్భంగా ఏయే అంశాలు అంగీకరించారో మీరు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘జగన్ పబ్జీ ఆడతారు, అనిల్ ఐపీఎల్ ఆడతారని అంటున్నారు. నువ్వు చెమ్మ చెక్క ఆడుతున్నావా? నీ గురించి కృష్ణా జిల్లాలో ఏం మాట్లాడుతున్నారో ముందు తెలుసుకో.. ఎవర్నో చంపావని అంటున్నారు..’ అని మంత్రి అన్నారు. కమీషన్లకు కక్కుర్తి పడింది మీరే.. ప్రాజెక్టు విషయంలో కమీషన్లకు కక్కుర్తి పడింది. 2017లో అన్నింటికీ ఒప్పుకుంది కూడా మీరేనని అనిల్కుమార్ అన్నారు. పోలవరంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ గురించి మాట్లాడే అర్హత తెలుగుదేశం వారికి లేదన్నారు. రూ.50 వేల కోట్ల ప్రాజెక్టు వ్యయంలో రూ.30 వేల కోట్లు ఉన్న ఆర్అండ్ఆర్ గురించి పట్టించుకోకుండా, 70 శాతం ప్రాజెక్టు పూర్తి చేసినట్లు ఎలా చెబుతున్నారని నిలదీశారు. ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతలు ఎందుకు. కేవలం గ్రావిటీ ద్వారా విశాఖకు నీళ్లు ఇవ్వాలనే పైపులైన్ వేయాలని అనుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పోలవరంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. విలేకరుల సమావేశంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, అధికారులు పాల్గొన్నారు. -
ఏ నిర్వాసితులకైనా ఒక్క పైసా ఇచ్చావా బాబూ!
నెల్లూరు (సెంట్రల్): ‘ప్రాజెక్టుల నిర్వాసితుల పునరావాసానికి ఒక్క పైసా ఇచ్చావా చంద్రబాబూ? పునరావాసానికి డబ్బివ్వకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయి? నీళ్లు ఎలా వస్తాయి? గండికోట, కండలేరు, వెలుగొండ, చిత్రావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్వాసితుల గురించి ఒక్కసారైనా ఆలోచించావా? కమీషన్ల కోసం కక్కుర్తిపడటమేతప్ప నిర్వాసితులను ఆదుకోవాలని ఆలోచించావా? అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు ఆర్అండ్ఆర్ అంటూ మాట్లాడతావా?..’ అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీద జలవనరులశాఖ మంత్రి అనిల్కుమార్యాదవ్ ధ్వజమెత్తారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేసేందుకు నిర్వాసితులకు పరిహారం చెల్లింపు, పునరావాస కల్పన (ఆర్అండ్ఆర్) విషయాల్లో ఎన్నో చర్యలు తీసుకున్నారని చెప్పారు. నెల్లూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గండికోట ప్రాజెక్టు కింద దాదాపు ఏడువేల కుటుంబాలు ఉంటే చంద్రబాబు హయాంలో ఒక్క కుటుంబాన్నీ తరలించలేదని చెప్పారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత గండికోట ముంపువాసుల కోసం రూ.900 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. వెలిగొండకు సంబంధించి ఆర్అండ్ఆర్ కింద రూ.1,200 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. చిత్రావతి రిజర్వాయర్ను పూర్తి సామర్థ్యానికి చేర్చేందుకు ఆర్అండ్ఆర్కు రూ.51 కోట్లు ఇచ్చారన్నారు. నెల్లూరు జిల్లాలోని కండలేరు ప్రాజెక్టు విషయంలో కూడా ఇదేవిధంగా చేయబోతున్నారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కింద వచ్చే మార్చి నాటికి మొదటిదశలో 20 వేల ఇళ్లను తరలించనున్నట్లు తెలిపారు. గండికోట, కండలేరు, వెలుగొండ, చిత్రావతి, పోలవరం మొత్తం ప్రాజెక్టులు వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే పూర్తిచేస్తామని చెప్పారు. చంద్రబాబుకు కేంద్ర కేబినెట్ నోట్ చెప్పే ధైర్యం ఉందా? చంద్రబాబుకు ధైర్యం ఉంటే పోలవరంపై 2017లో కేంద్ర కేబినెట్లో పెట్టిన నోట్ సారాంశాన్ని ప్రజలకు చెప్పాలన్నారు. అప్పట్లో కమీషన్ల కోసం కక్కుర్తిపడ్డారే తప్ప పోలవరం అభివృద్ధిపై ఆలోచించలేదని చెప్పారు. కనీసం ఒక్క ఇంటి కన్నా పరిహారం ఇచ్చి తరలించారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోనే ఉండలేని వాళ్లు కూడా పోలవరం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాష్ట్రానికి ఎప్పుడు వస్తారో ఆయనకే తెలియదని, కొడుకు లోకేశ్ చూస్తే టూరిస్ట్లాగా వచ్చి పోతుంటారని విమర్శించారు. అది ఒక దిక్కుమాలిన పేపర్ పోలవరంపై వరుసగా అసత్య కథనాలు రాస్తున్న చెత్తజ్యోతి ఒక దిక్కుమాలిన పేపర్ అన్నారు. పోలవరం తగ్గిస్తున్నామని అసత్య కథనాలు రాయడం, వెంటనే టీడీపీ నేతలు విలేకరుల సమావేశాలు పెట్టడం సిగ్గుచేటుగా ఉందన్నారు. ఆ పత్రికకు ధైర్యం ఉంటే 2017లో కేంద్ర కేబినెట్లో పెట్టిన నోట్ను ప్రచురించాలని సవాల్ విసిరారు. ఇప్పటికే ఆ పత్రికకు విలువలు పూర్తిగా పోయాయన్నారు. ఆ పేపర్ టిష్యూ పేపర్గా కూడా పనికి రాదని ఆయన పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాజీలేదు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఎక్కడా రాజీపడకుండా, ఒక్క అంగుళం కూడా తగ్గకుండా పూర్తిచేస్తామని అనిల్కుమార్యాదవ్ స్పష్టం చేశారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని కొందరు టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారన్నారు. ఎత్తు తగ్గిస్తున్నట్లు వీళ్లకు ఎవరైనా చెప్పారా అని ప్రశ్నించారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని, ఇప్పుడు ఆరోపణలు చేసే వాళ్లు టేపు తెచ్చుకుని కొలుచుకోవచ్చని పేర్కొన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పోలవరం ప్రారంభమైందని, ఆయన బిడ్డ వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అనుకున్న సమయానికి పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. -
సోమశిల హైలెవెల్ కెనాల్ ఫేజ్-2 శంకుస్థాపన
-
సోమశిల రెండో దశకు సీఎం జగన్ శంకుస్థాపన
సాక్షి, అమరావతి: సోమశిల హైలెవెల్ కెనాల్ ఫేజ్-2కు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. నెల్లూరు జిల్లాలోని దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసే దిశగా సోమశిల హైలెవెల్ కెనాల్ ఫేజ్-2కు వర్చువల్ విధానంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. కాగా.. సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్ -1 నిర్మాణ పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. తాజాగా.. 460 కోట్ల రూపాయల వ్యయంతో ఫేజ్-2 నిర్మాణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కాలువ పనులు పూర్తయితే మెట్ట ప్రాంతాలైన ఉదయగిరి, వింజమూరు, దుత్తల్లూరు, ఆత్మకూరుతో పాటు ప్రకాశం జిల్లాలోని పలు గ్రామాలకు నీరు పుష్కలంగా అందుతుంది. దశాబ్దాల కాలంగా మెట్ట ప్రాంత వాసులు కలలుగన్న సాగునీటి సమస్యకు పరిష్కారం దొరికినట్లేనని ఆ ప్రాంతవాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వ్యవసాయం, నీటి విలువ తెలిసిన ప్రభుత్వం మాది. సోమశిల రెండో దశ ద్వారా సాగు, తాగునీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. గతంలో సోమశిలను ఎన్నికల కోసం హడావుడిగా ప్రారంభించారు. అవినీతి లేకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే రివర్స్ టెండరింగ్కు వెళ్లాం. సోమశిల హైలెవల్ ప్రాజెక్ట్లో రివర్స్ టెండరింగ్ ద్వారా 68 కోట్ల రూపాయలు ఆదా చేసి.. గత ప్రభుత్వం అవినీతికి చెక్ పెట్టాం. సంగం బ్యారేజీ, పెన్నా బ్యారేజ్ పనులు ఈ ఏడాది పూర్తిచేసి, జనవరిలో నెల్లూరుకి అంకితం ఇస్తాం. కండలేరు కాలువ దుబ్లింగ్ పనులు, సోమశిల ఉత్తర కాలువ డబ్లింగ్ పనులు ప్రారంభిస్తాం. 2022 ఖరీఫ్ సీజన్కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. 2021లో ఆరు ప్రాజెక్ట్లను ప్రాధాన్యతగా తీసుకొని పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు వెళ్తున్నాం. కృష్ణా నది దిగువ బ్యారేజీలకు వేగవంతంగా అడుగులు వేస్తున్నాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు పూర్తి చేస్తాం. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రూ.40 వేల కోట్లతో కరువు నివారణ చర్యలు చేపడుతున్నాం అని సీఎం జగన్ తెలిపారు. మర్రిపాడు మండలం కృష్ణాపురం వద్ద సోమశిల హైలెవల్ కెనాల్ పేజ్-2 పనుల ప్రారంభంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. సోమశిల హైలెవల్ కెనాల్ ఈ ప్రాంత రైతుల కల. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి మనసుతో ఆలోచించి హైలెవల్ పేజ్ 2ను ప్రారంభిస్తున్నారు. వెలిగొండ కూడా పూర్తయితే కరువు ప్రాంతమైన ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయి. ముఖ్యమంత్రి పాదం పెట్టిన వేళా విశేషం రాష్ట్రం సుభిక్షంగా ఉంది. సోమశిల హైలెవల్ ఫేజ్- 2, వెలిగొండ ప్రాజెక్ట్స్ పూర్తయితే ఇక సస్యశ్యామలమే. త్వరలో చాగోలు రిజర్యాయర్ కూడా పూర్తి చేస్తాం. పదేళ్ల తరువాత నెల్లూరు జిల్లాలో వరదలు పోటెత్తాయి. పెన్నా నుంచి 100 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లింది' అని అన్నారు. ఈ దశలో దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి మండలాల్లో 46,453 ఎకరాలకు నీళ్లందించనున్నారు. నెల్లూరు జిల్లాలో వర్షాభావ ప్రాంతంలో ఉన్న అనంతసాగరం, మర్రిపాడు, వింజమూరు, దుత్తలూరు, ఉదయగిరి, ఆత్మకూరు మండలాల్లో సాగు, తాగునీటి కోసం ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమశిల జలాశయం నుంచి నీటిని ఎత్తిపోసి.. తాగునీటి కష్టాలను తీర్చడంతో పాటు ఈ మండలాల్లో 90 వేల ఎకరాలకు నీళ్లందించేందుకు ఎస్హెచ్ఎల్ఎల్సీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. తొలి దశ కింద 43,547 ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించింది. రూ.840.72 కోట్ల వ్యయం కాగల పనులను కాంట్రాక్టు సంస్థకు అప్పగించింది. ఇప్పటివరకు రూ.572.11 కోట్లను ఖర్చు చేసింది. అటవీ శాఖకు చెందిన 4.28 ఎకరాల భూమిని సేకరించే ప్రక్రియను పూర్తి చేసి.. మిగిలిన పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. -
వెలిగొండ పనుల వేగం పెంచండి
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేయాలని జలవనరుల శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ ఆదేశించారు. శుక్రవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్షించారు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్లో 237 మీటర్ల మేర పని చేయాల్సి ఉందని అధికారులు వివరించారు. ఫాల్ట్ జోన్ (మట్టి పొరలు) అడ్డురావడం వల్ల పనుల్లో జాప్యం చోటుచేసుకుంటోందన్నారు. టన్నెల్ తవ్వకం పనులు డిసెంబర్ నాటికి పూర్తవుతాయని, టన్నెల్ బోరింగ్ మెషీన్ తొలగించే పనులు ఫిబ్రవరికి పూర్తవుతాయని చెప్పారు. ఎట్టి పరిప్థితుల్లోనూ ఫిబ్రవరికి తొలి దశను ప్రారంభించడానికి సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రెండో టన్నెల్ ఆగస్టు నాటికి పూర్తవుతుందని అధికారులు వివరించారు. ఆలోగా ప్రాజెక్టు రెండో దశ ద్వారా నెల్లూరు, వైఎస్సార్ జిల్లాలకు నీటిని తరలించే పనులను వేగవంతం చేయాలని సూచించారు. నల్లమలసాగర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను దశలవారీగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖరారు చేసిన కార్యాచరణ మేరకు పోలవరం ప్రాజెక్టును డిసెంబర్, 2021 నాటికి పూర్తి చేసేలా పనులను వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. -
రైతుల్ని జైల్లో పెట్టించిన ఘనత బాబుది
నెల్లూరు (సెంట్రల్): అధికారంలో ఉన్నప్పుడు రైతుల్ని జైల్లో పెట్టించిన నీచ చరిత్ర చంద్రబాబుదని జల వనరుల శాఖ మంత్రి పి.అనిల్కుమార్ అన్నారు. నెల్లూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు అన్యాయం జరిగిపోతోందని లోకేశ్ మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రైతులను కొట్టించి జైల్లో పెట్టించిన విషయం గుర్తు చేసుకోవాలన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగా రైతులకు అన్నివిధాలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా ఉంటూ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారని వివరించారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో లోకేశ్కు కనీసం లెక్కలు కూడా రావని ఎద్దేవా చేశారు. పోలవరం నిర్మాణానికి రూ.50 వేల కోట్లు ఖర్చవుతుందని, అందులో రూ.18 వేల కోట్లను తమ ప్రభుత్వం ఖర్చు చేసి 75 శాతం పనులు పూర్తి చేసిందని లోకేశ్ చెబుతుండటం ఆయన మిడిమిడి జ్ఞానానికి అద్దం పడుతోందన్నారు. పోలవరం విషయంలో గత ప్రభుత్వం కేబినెట్లో పెట్టిన నోట్ను ఒకసారి చదివితే అందులో ఏముందో తెలుస్తుందని చురకలంటించారు. పోలవరం చిన్న డ్యామ్, కాలువ కాదనే విషయం తెలుసుకోవాలని తండ్రీకొడుకులకు సూచించారు. తమ ప్రభుత్వం చెప్పిన ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ను నిర్ణీత వ్యవధిలోనే పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. నెల్లూరు, సంగం బ్యారేజీ పనులు నీటి ప్రవాహం తగ్గిన తర్వాత చేపట్టి త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. కరోనా అదుపులోకి వచ్చాకే ఎన్నికలు రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. కరోనా అదుపులోకి వచ్చేవరకు ఇష్టానుసారంగా ఎన్నికలు నిర్వహిస్తామంటే కుదరదన్నారు. చంద్రబాబు డైరెక్షన్లో రాష్ట్ర ఎన్నికల అధికారి వ్యవహరిస్తామంటే ఎలా అన్నారు. ప్రభుత్వం అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఆలోచన చేస్తారన్నారు. -
చంద్రబాబు తప్పిదాల వల్లే పోలవరంపై కేంద్రం కొర్రీలు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు వ్యయంపై కేంద్రం వేస్తున్న కొర్రీలకు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాలే కారణమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని చంద్రబాబు నిస్సిగ్గుగా ఆమోదించడం వల్లే నేడు పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం వివాదంలో పడిందన్నారు. విభజన చట్ట ప్రకారం కేంద్రమే పోలవరం ప్రాజెక్టును నిరి్మంచాల్సి ఉండగా, దానిని కేంద్రం ప్యాకేజీ పరిధిలోకి తెచి్చనప్పుడు టీడీపీ ప్రభుత్వం స్వాగతించి పెద్ద తప్పు చేసిందని, ఇప్పుడదే పోలవరం పాలిట శాపంగా మారిందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని అంగీకరించదని, పోలవరంపై సీఎం వైఎస్ జగన్ ప్రధానికి లేఖ రాస్తున్నారని వెల్లడించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి అనిల్ మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► పోలవరం ప్రాజెక్టుకు తమ హయాంలో అద్భుతంగా నిధులను తెచ్చామని టీడీపీ నేతలు పచ్చి అబద్ధాలాడుతున్నారు. ► అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా నిర్వాకం వల్లనే ఇప్పుడు పోలవరానికి ఇబ్బందులెదురవుతున్నాయి. ఈ విషయాలను మేం పూర్తి ఆధారాలతో ప్రజల ముందుంచుతున్నాం. ► విభజన చట్ట ప్రకారం ఈ ప్రాజెక్టును కేంద్రమే నిరి్మంచాలని ఉంటే కేవలం కమీషన్ల కోసం తామే నిరి్మంచుకుంటామని చంద్రబాబు ముందుకొచ్చారు. గత ప్రభుత్వ పాలనలో ప్రాజెక్టుపై చేసిన వ్యయం రూ.265 కోట్లు మాత్రమే. ► టీడీపీ సర్కార్ 2016లో అప్పటి ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినప్పుడు సంబరాలు చేసుకోవడమే కాక అసెంబ్లీలోనూ తీర్మానం చేశారు. ప్యాకేజీ పరిధిలోకి ప్రాజెక్టును తీసుకురావడం కుదరదు. టీడీపీ ప్రభుత్వం కమీషన్ల కోసమే ప్యాకేజీని అంగీకరించింది. ► ఆరోజు కేంద్ర ఆరి్థక శాఖ జారీ చేసిన మెమోలో 2013–14 వరకూ పోలవరం నిర్మాణంలో ఇరిగేషన్ కాంపోనెంట్ వ్యయం మాత్రమే ఇస్తామని ప్రకటించింది. దీన్ని చంద్రబాబు అంగీకరించడం పెద్ద తప్పిదం. వైఎస్ జగన్ కూడా నాడు అసెంబ్లీలో ఇదే చెప్పారు. ► టెక్నికల్ అడ్వయిజరీ బోర్డు అంచనా ప్రకారం పోలవరం నిర్మాణ వ్యయం రూ.20 వేల కోట్ల నుంచి రూ. 55 వేల కోట్లకు పెరిగింది. నిర్మాణం ఖర్చు తగ్గినా, పెరిగినా చట్ట ప్రకారం భరించాల్సింది కేంద్ర ప్రభుత్వమే. రాష్ట్రం ప్రాజెక్టు నిర్మాణంలో సమన్వయకర్త పాత్ర మాత్రమే పోషిస్తోంది. ► 2017 మార్చిలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 2014 నాటి సవరించిన అంచనాల ప్రకారమే ఇరిగేషన్ కాంపోనెంట్ వ్యయాన్ని కేంద్రం ఇస్తుందని, 2014 తర్వాత అంచనా వ్యయాల పెరుగుదలను కేంద్రం భరించదని చాలా స్పష్టంగా తీర్మానించారు. 2010–14 వరకు భూసేకరణ కోసం ఇచ్చిన అంచనాల మేరకే నిధులు ఇస్తామని చెప్పారు. దానికన్నా వ్యయం పెరిగితే కేంద్రానికి సంబంధం లేదన్నారు. ఆ మంత్రివర్గంలో టీడీపీకి చెందిన అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి కూడా ఉన్నారు. అంటే దీని అర్థం టీడీపీ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందనే కదా..! అందుకు ఆనాడు చంద్రబాబు ఒప్పుకోవడం కన్నా మించిన దుర్మార్గం ఉందా..? రాష్ట్రమే పోలవరం కట్టేస్తుందని చంద్రబాబు ప్రకటనలు చేశారు. ► 2018లో ప్రధానికి చంద్రబాబు రాసిన లేఖలో 30.9.2016 మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ మెమో ప్రకారం పోలవరానికి తొందరగా నిధులు ఇవ్వాలని కోరడం వాస్తవం కాదా? సవరించిన సీడబ్ల్యూసీ అంచనా ప్రకారం రూ.48వేల కోట్లు అయితే ఇందులో రూ.29 వేల కోట్లు ఆర్ అండ్ ఆర్కే ఖర్చు చేయాల్సి ఉంది. ఇవన్నీ కాదని ఆనాడు చంద్రబాబు కేంద్రం ప్రతిపాదించిన రూ.20వేల కోట్లకు ఎలా అంగీకరించారు? చంద్రబాబు ప్రభుత్వం నాడు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్లే ఈ రోజు కేంద్రం దానిని ముందుకు తెచ్చింది. ► పోలవరంపై కేంద్రం ప్రకటించిన అంచనా వ్యయాలను మా ప్రభుత్వం అంగీకరించదు. సీఎం జగన్ ప్రధానికి లేఖ రాయబోతున్నారు. ప్రధానిని కలిసి అన్ని వివరాలను అందిస్తారు. ► చంద్రబాబు మాదిరిగా రాష్ట్రాన్ని అడ్డంగా ముంచి, ప్రజలను వెన్నుపోటు పొడిచే పనులు మేం చేయలేం. చంద్రబాబు, టీడీపీ నేతలు ఈ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టిన వారే ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. -
వరద నియంత్రణ భేష్
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి, పెన్నా నదుల వరదను సమర్థంగా నియంత్రించారని, వరద ముప్పు నుంచి తప్పించారని జలవనరుల శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ అభినందించారు. అల్పపీడన ప్రభావం వల్ల ఎగువ రాష్ట్రాల నుంచి కృష్ణా నదికి భారీగా వరద వస్తోందని.. ఆ వరదను నియంత్రించడంలో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. సోమవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి ఈఎన్సీ సి.నారాయణరెడ్డితో కలిసి వరదలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కరకట్టలకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందే అప్రమత్తం చేసి.. సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. -
వరద సహాయ చర్యలు చేపట్టండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం వల్ల వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని.. ఏ ఒక్కరూ ముంపు ముప్పు బారిన పడకుండా చూడాలని అధికారులను జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ ఆదేశించారు. సోమవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల జలవనరుల శాఖ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ► వర్షాలకు నదులు, కాలువల కరకట్టలకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి.. పునరావాసం కల్పించాలని సూచించారు. ► అవకాశం ఉన్న ప్రాంతాల్లో చెరువులు అన్నింటినీ వరద నీటితో నింపాలని ఆదేశించారు. వర్షాలు, వరదల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
నవంబర్ 20 నుంచి తుంగభద్ర పుష్కరాలు
సాక్షి, అమరావతి: తుంగభద్ర పుష్కరాలను నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1 దాకా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, అనిల్కుమార్ యాదవ్, గుమ్మనూరు జయరాం దిశానిర్దేశం చేశారు. విజయవాడలో 18 శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు పుష్కరాలకు వచ్చే యాత్రికులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. మంత్రులు ఏం చెప్పారంటే.. u పాత పుష్కర ఘాట్లకు అవసరమైన ప్రాంతాల్లో మరమ్మతులు చేయాలి. కొత్తగా నిర్మించే పుష్కర ఘాట్లను నాణ్యంగా, వేగంగా పూర్తి చేయాలి. భవిష్యత్లో వాటిని ఉపయోగించుకునేలా ఘాట్ల నిర్మాణాన్ని చేపట్టాలి. పుష్కర ఘాట్ల పనులు నవంబర్ 1లోగా పూర్తి కావాలి. u రహదారుల నిర్మాణం కోసం ఇప్పటికే రూ.117.02 కోట్లు మంజూరయ్యాయి. ఆ పనులను శరవేగంగా పూర్తి చేయాలి. u స్నాన ఘట్టాలను పరిశుభ్రంగా ఉంచాలి. తాగునీటి సరఫరా, రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండాలి. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకోవాలి. -
పోలవరానికి వారంలో రూ.2,300 కోట్లు!
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల్లో రూ.2,300 కోట్లను రీయింబర్స్మెంట్ చేసేందుకు కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. సోమవారం ఆయన సంబంధిత ఫైలుపై సంతకం చేసి ఆర్థిక శాఖకు పంపారు. బహిరంగ మార్కెట్లో బాండ్లద్వారా రుణాలను సేకరించి పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు విడుదల చేయాలని నాబార్డును కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించనుంది. వారంలోగా రూ.2,300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అందే అవకాశముందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ► పోలవరం కోసం 2014 ఏప్రిల్ 1వ తేదీకి ముందు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.5,177.62 కోట్లకు సంబంధించి లెక్కలు పక్కాగా ఉన్నట్లు నిర్ధారిస్తూ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఇచ్చిన ఆడిటెడ్ నివేదికను కేంద్ర జల్ శక్తి, ఆర్థిక శాఖలకు ఇప్పటికే అందచేశారు. కోరిన వివరాలన్నీ అందచేసిన నేపథ్యంలో పోలవరాన్ని 2021 నాటికి పూర్తి చేసేలా నిధులు విడుదల చేసి సహకరించాలని కోరుతూ గత నెల 25న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారు. ► సీఎం జగన్ ఆదేశాల మేరకు సోమవారం ఢిల్లీలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ వైఎస్సార్సీపీ లోక్సభాపక్ష నేత పీవీ మిథున్రెడ్డి, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, గోరంట్ల మాధవ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్లతో కలిసి కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్తో భేటీ అయ్యారు. పీపీఏ ప్రతిపాదించిన మేరకు రూ.2,300 కోట్లను తక్షణమే విడుదల చేస్తామని, మిగతా రూ.1,758.02 కోట్లను మలిదఫాలో ఇస్తామని షెకావత్ హామీ ఇచ్చారు. వేగంగా రీయింబర్స్: మంత్రి అనిల్కుమార్ కేంద్ర మంత్రితో సమావేశానంతరం అనిల్కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. పోలవరానికి సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన రూ.4 వేల కోట్ల రీయింబర్స్మెంట్ నిధులను త్వరితగతిన విడుదల చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఆర్థిక శాఖతో మాట్లాడి నిధులు త్వరగా విడుదలయ్యేలా చూస్తామని, రాష్ట్రానికి అన్నివిధాలా సహకారమందిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించాలని షెకావత్ను కోరామన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని త్వరలోనే నిర్వహిస్తామని షెకావత్ చెప్పారన్నారు. పునరావాసానికి సంబంధించి త్వరితగతిన నిధులిస్తే డిసెంబర్ 2021 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. -
దమ్ముంటే రాజీనామా చేయాలి
సాక్షి, అమరావతి: మూడు రాజధానుల ఏర్పాటును ఖండిస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల రాజీనామాలను చంద్రబాబు కోరుతున్నారని.. నిజంగా అమరావతిపై ఆయనకు ప్రేమ ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని జలవనరుల శాఖ మంత్రి అనిల్ యాదవ్ సవాల్ విసిరారు. ప్రభుత్వ నిర్ణయం తప్పు అంటున్న చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సీఎం వైఎస్ జగన్ అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబుకు కడుపుమంట ఎందుకో అర్థం కావడం లేదని అన్నారు. సోమవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అనిల్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇంకా ఆయన ఏమన్నారంటే.. అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తుంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చంద్రబాబు చెప్పాలి. అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం నాలుగు ప్రాంతీయ అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేస్తున్నాం. సీఎం వైఎస్ జగన్ 30 వేల ఎకరాలు రాజధానికి కావాలన్నది ప్రభుత్వ భూములు మాత్రమే. డీగ్రేడెడ్ ఫారెస్టు ల్యాండ్ తీసుకోవాలని వందసార్లు చెప్పినా బాబు బుర్రకెక్కలేదు. రైతుల మెడ మీద కత్తి పెట్టి ల్యాండ్ పూలింగ్ అంటూ చంద్రబాబు ఆడిన డ్రామాకు ఏనాడూ వైఎస్సార్సీపీ మద్దతు తెలపలేదు. అమరావతి అభివృద్ధికి ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేస్తే బాబుకు వచ్చిన నష్టం ఏమిటి? ఆయనకు భూములు, వాటి రేట్లు, బినామీ భూములపై లాభాలు తప్ప ప్రజలపై ప్రేమ లేదు. ఈ ప్రభుత్వానికి ప్రజలు 151 సీట్లు ఇచ్చారు. చంద్రబాబు సిగ్గుతో పార్టీని మూసుకోవాలి. -
రాష్ట్రంలో 3 పోర్టులు, 7 షిప్పింగ్ హార్బర్ల ఏర్పాటుకు చర్యలు
గుడ్లూరు: రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు మేజర్ పోర్టులు, ఏడు షిప్పింగ్ హార్బర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి చెప్పారు. ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. పోర్టు నిర్మాణంతో పాటు దానికి అనుబంధంగా పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన భూముల కోసం గౌతంరెడ్డితో పాటు జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్కుమార్యాదవ్ శనివారం ప్రకాశం జిల్లా గుడ్లూరు, ఉలవపాడు మండలాల్లో పర్యటించారు. రావూరు, చేవూరు గ్రామాల్లో కొన్ని భూములను, వాటికి సంబంధించిన మ్యాప్లను జిల్లా కలెక్టర్ పోల భాస్కర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గౌతంరెడ్డి ఇంకా ఏమన్నారంటే.. ► పోర్టు నిర్మాణానికి 3,200 ఎకరాలు, పరిశ్రమల ఏర్పాటుకు 2,000 ఎకరాలు మొత్తం 5,200 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించాం. ► రామాయపట్నం పోర్టు నిర్మించేందుకు జపాన్,నెదర్లాండ్ దేశాలకు చెందిన పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ► పోర్టుతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు మరికొంత భూమిని కేటాయిస్తే ఈ ప్రాంతాన్ని ముంబై, ఢిల్లీ నగరాల స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఆ కంపెనీలు చెబుతున్నాయి. ► త్వరలో డీపీఆర్లు సిద్ధం చేసి ఆగస్టు 15 నాటికి టెండర్లు పిలిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ► ఒకేసారి 5,200 ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్ ఇవ్వాలని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి మంత్రికి సూచించగా, ఆ మేరకు చర్యలు చేపట్టాలని మంత్రి కలెక్టర్కు సూచించారు. వారి వెంట ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డి తదితరులున్నారు. -
పాలన స్తంభనే టీడీపీ లక్ష్యం
సాక్షి, అమరావతి: శాసన మండలిలో బుధవారం తెలుగుదేశం సభ్యులు వ్యవహరించిన తీరుపై మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్కుమార్ యాదవ్, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులకు జీతాలు కూడా అందనివ్వకుండా పరిపాలనను స్తంభింపజేయాలన్న ఉద్దేశంతోనే టీడీపీ విధ్వంసం సృష్టించిందని వారు ఆరోపించారు. చంద్రబాబు తనయుడు లోకేశ్ ప్రోద్బలంతో ఈ దాడులు జరిగాయని ఆరోపించారు. బిల్లులు అడ్డుకున్న టీడీపీ ఎమ్మెల్సీలు చరిత్రహీనులుగా మిగిలిపోతారని వారన్నారు. వీరు గురువారం మీడియాతో వేర్వేరుగా మాట్లాడారు. వారేమన్నారంటే.. దుష్ట సంప్రదాయానికి టీడీపీ శ్రీకారం : బొత్స ► సభలో సంఖ్యాబలం ఉందని కీలకమైన బిల్లులను అడ్డుకోవడం ద్వారా టీడీపీ దుష్ట సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. ► దీనిని అడ్డుకోవాల్సిన డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం టీడీపీ అజెండాను అమలుచేయడం దారుణం. ► టీడీపీ సభ్యులను మా వాళ్లు అని ఆయన సంబోధించడం ద్వారా ఆ స్థానం విలువను దిగజార్చారు. ► ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకోవడం ద్వారా ఉద్యోగులకు టీడీపీ జీవితకాలం దూరమవుతుంది. ► చంద్రబాబు తన తనయుడు లోకేశ్తో సభలో ఫొటోలు తీయిస్తూ రెచ్చగొట్టించారు. ► లోకేశ్కు న్యూసెన్స్ చేయడమే తెలుసు. ఇతనితోపాటు ఇతర సభ్యుల తీరుపై ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేస్తాం. ► సభలోని దృశ్యాలను ఇవ్వాల్సిందిగా చైర్మన్కు లేఖ రాశాం. తప్పు నిరూపిస్తే రాజీనామా చేస్తా : అనిల్ ► శాసన మండలిలో నేను జిప్ విప్పానంటూ లోకేశ్, అశోక్బాబు, దీపక్రెడ్డి, బాబు రాజేంద్రప్రసాద్ దుష్ప్రచారం చేస్తున్నారు. ► నేను తప్పు చేసినట్లు తేలితే రాజీనామా చేస్తా.. లేకపోతే మీరు రాజీనామాకు సిద్ధమా!? ► సభలో ఫొటోలు తీయడం నిబంధనలకు విరుద్ధమని చెప్పిన మంత్రి వెలంపల్లిపై లోకేశ్ దాడిచేశాడు. ► అర్ధరాత్రి వరకు సమావేశాలు జరిగిన సందర్భాలున్నాయి. అయినా మండలిని నిరవధిక వాయిదా వేసి వెళ్లిపోయారు. ► మండలిలో ఎక్కడ బూతులు మాట్లాడామో టీడీపీ నిరూపించాలి. సభలో వారే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దాడిచేసిన వారిపై చర్యలు : గడికోట ► రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే ప్రతి బిల్లునూ టీడీపీ శాసన మండలిలో అడ్డుకుంటోంది. ► సభా సంప్రదాయాలను ఆ పార్టీ ఉల్లంఘిస్తోంది. ► మంత్రి వెలంపల్లి మీద దాడిచేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. ► శాసన మండలిలో లోకేశ్ ఫొటోలు తీయడం.. టీడీపీ నేత యనమల రామకృష్ణుడు, డిప్యూటీ చైర్మన్కు స్లిప్పులు పంపడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. ► డిప్యూటీ చైర్మన్ను యనమల సభలో నియంత్రించారు. ► మండలిలో టీడీపీ సభ్యులు అప్రజాస్వామికంగా వ్యవహరించి, చరిత్రహీనులుగా మిగిలిపోయారని.. లోకేశ్ను ప్రజలు క్షమించరని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. సీబీఎన్ స్కూల్ ప్రిన్పిపాల్ యనమల: కన్నబాబు ► టీడీపీ వారికి నారా చంద్రబాబు నాయుడు (సీబీఎన్) అనే స్కూల్ ఉంది. ఆ స్కూల్కు ప్రిన్సిపాల్ యనమల. ► ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకున్నారు. టీడీపీ రాష్ట్రం కోసం కాకుండా కేవలం అమరావతి కోసం పని చేస్తోంది. వీరికి గవర్నర్ ప్రసంగం వినే ఓపిక కూడా లేదు. లోకేశ్ ఫోన్లో ఫోటోలు తీస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు ఫొటోలు తీస్తున్నారని ప్రశ్నిస్తే దాడి చేస్తారా? ► వెలంపల్లి పై దాడి చేసి... కనీసం విచారణ వ్యక్తం చేయడం లేదు. టీడీపీ వాళ్లు వీడియోలు అడుగుతున్నారు.. లోకేశ్ తీసిన వీడియోలున్నాయిగా. ముందు ఆ వీడియోలు బయట పెట్టాలని ప్రశ్నిస్తే పొంతన లేకుండా అబద్ధాలు చెబుతున్నారు. -
స్థాయి తెలుసుకుని లోకేశ్ మాట్లాడాలి
సాక్షి, అమరావతి: తన స్థాయి ఏమిటో తెలుసుకొని దానికి తగ్గట్టుగా లోకేశ్ మాట్లాడటం నేర్చుకోవాలని మంత్రి అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతికి తావులేకుండా పరిపాలన అందిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు పాలనలో ప్రతీ స్కీమును.. స్కాముగా మార్చేశారని విమర్శించారు. ఆనాడే తాము చంద్రబాబు అవినీతిపై ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ పుస్తకం వేశామని, అవినీతి ఇప్పుడు బయటపడుతుంటే చంద్రబాబు, లోకేశ్ వెన్నులో వణుకు పుడుతోందని అన్నారు. సోమవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వారిరువురు విడివిడిగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్కుమార్, అంబటి ఏమన్నారంటే.. ► కార్మికుల సొమ్మును పందికొక్కులా తిన్న అచ్చెన్నాయుడిని ప్రభుత్వం అరెస్టు చేసింది. చట్టాలు అందరికీ సమానమే. బీసీలకు, అగ్రవర్ణాలకు విడిగా చట్టాలు ఉంటాయా?. అవినీతిపై ఆధారాలతోనే అరెస్టులు జరుగుతున్నాయి. ► రూ.150 కోట్ల స్కామ్ చేసిన వ్యక్తికి చంద్రబాబు మద్దతు తెలపడం సిగ్గుచేటు. అచ్చెన్నాయుడికి సంబంధం లేదు, ముఖ్యమంత్రిగా నేను చెబితేనే స్కాం చేశారని చంద్రబాబు ఒప్పుకోగలరా?. ► నకిలీ పత్రాలతో బస్సులు నడిపి ఎంతోమంది ప్రాణాలను బలిగొన్న జేసీ ప్రభాకర్రెడ్డికి అండగా నిలుస్తారా? ఇదేనా ప్రతిపక్ష నేత చేయాల్సిన పని. ► అవినీతిపరుల జాబితా ఇంకా ఉంది. తప్పు చేసిన వారెవరినీ వదిలిపెట్టబోం. ► తాడిపత్రిలో లోకేశ్ మాటలు హాస్యాస్పదం. వడ్డీతో సహా చెల్లిస్తామంటూ లోకేశ్ బీరాలు పలకడమేంటి. వడ్డీతో సహా చెల్లించడానికి ఇదేమన్నా హెరిటేజ్ సంస్థా. ► టీడీపీకి మళ్లీ అవకాశమొస్తుందనే భ్రమల్లో లోకేశ్ ఉన్నారు. రాజారెడ్డి మీసంలో వెంట్రుకకు కూడా లోకేశ్, చంద్రబాబు సరిపోరు. -
‘అవినీతిలో టీడీపీ నేతలు సిద్ధహస్తులు’
సాక్షి, కాకినాడ: గత ఐదేళ్ల టీడీపీ పాలనంతా అవినీతిమయంగా సాగిందని మంత్రి మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ధనాన్ని ఎలా కొల్లగొట్టాలన్న దాంట్లో టీడీపీ నేతలకు మించిన సిద్ధహస్తులు లేరన్నారు. కార్మికులకు మెరుగైన వైద్య సేవలందాల్సిన ఈఎస్ఐలో తవ్వేకొద్ది అవినీతి బయటపడుతున్నారు. అచ్చెంన్నాయుడు అవినీతిని ఆధారాలతో సహా సేకరించిన తర్వాతే ఏసీబీ అధికారులు తమ విధులు నిర్వహిస్తూ.. చట్ట ప్రకారం వెళ్తున్నారని మంత్రి మోపిదేవి తెలిపారు. (కళ్లు బైర్లు కమ్మే అవినీతి, అక్రమాలు) వాస్తవాలను కప్పిపుచ్చుకునేందుకు కులం కార్డును వాడుతున్నారని మోపిదేవి దుయ్యబట్టారు. ఇది టీడీపీ నైజమని.. కొత్త కాదన్నారు. అచ్చెన్నాయుడు తప్పు చేశారని నిర్ధారణ అయ్యింది కాబట్టే అరెస్ట్ చేశారని.. దానికి బీసీ కార్డును వాడాల్సిన అవసరమేముందని ఆయన ప్రశ్నించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. మధ్యలో కుల ప్రస్తావన తీసుకురావడం సరైనది కాదన్నారు. ఈ ఒక్క ఘటనతోనే అయిపోలేదని.. గత టీడీపీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాల పుట్టను బయటకు తీసేందుకు సీబీఐ విచారణ జరిపించాలని నిన్నటి క్యాబినెట్లో నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందన్నారు.(అచ్చెన్న అరెస్ట్కు, బీసీలకు ఏం సంబంధం?) తప్పుచేశారు కాబట్టే అరెస్ట్: అనిల్కుమార్ యాదవ్ అచ్చెన్నాయుడు అవినీతికి, బీసీలకు ఏం సంబంధం అని మంత్రి అనిల్కుమార్ యాదవ్ ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు తప్పు చేశారనే ఆధారాలతో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారన్నారు. అవినీతి,అక్రమాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తే టీడీపీ నేతలు ఎందుకు గగ్గోలు పెడుతున్నారని దుయ్యబట్టారు. బీసీలను 30 ఏళ్లుగా చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో జరిగిన ప్రతి పనిలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు,లోకేష్ అవినీతిపై సీబీఐ విచారణ జరిగితే వారికి శిక్ష తప్పదన్నారు. తండ్రి,కొడుకులు జైలుకెళ్లక తప్పదు: ఆర్కే రోజా విజయవాడ: అచ్చెన్నాయుడు అవినీతి ఆధారాలతో దొరికాడు కాబట్టే అరెస్ట్ అయ్యారని ఎమ్మెల్యే రోజా అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు సిగ్గులేకుండా తమపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈఎస్ఐలో భారీ స్కాం జరిగిందని విజిలెన్స్, ఏసీబీ విచారణలో తేలిందన్నారు. త్వరలోనే చంద్రబాబు,లోకేష్ అవినీతిపై సీబీఐ విచారణ జరుగుతుందన్నారు. అడ్డగోలుగా దోచుకున్న తండ్రి,కొడుకులు జైలుకెళ్లక తప్పదన్నారు. తన అవినీతి బయటపడుతుందనే కారణంతో చంద్రబాబు గతంలో సీబీఐని రాష్ట్రానికి రానివ్వలేదన్నారు. అరెస్ట్లు చేస్తే ఎందుకు ఉలిక్కిపడుతున్నారని రోజా ప్రశ్నించారు. టీడీపీ నేతలకు భయం పట్టుకుంది.. కర్నూలు: గత టీడీపీ ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు భారీ అవినీతికి పాల్పడ్డారని.. అందుకే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కార్మికుల ఆరోగ్యాలను చంద్రబాబు, అచ్చెన్నాయుడు పట్టించుకోలేదన్నారు. అచ్చెన్నాయుడు హయాంలో రూ.150 కోట్ల అక్రమాలు జరిగాయన్నారు. అవినీతిని బయటపెడితే టీడీపీ నేతలకు భయం పట్టుకుందన్నారు. అచ్చెన్నాయుడు టెలీ సర్వీస్, ఆర్సీ నాన్ ఆర్సీ ద్వారా అవినీతికి పాలడ్డారని తెలిపారు. అవినీతికి పాల్పడ్డారు కాబట్టే ఆయనను అరెస్ట్ చేశారని జయరాం పేర్కొన్నారు. చట్టం ముందు అంతా సమానమే: ఇక్బాల్ అనంతపురం: మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ను సమర్థిస్తున్నానని ఎమ్మెల్సీ ఇక్బాల్ అన్నారు. ఈఎస్ఐలో భారీ కుంభకోణం జరిగిందని.. కోట్ల రూపాయల అవినీతి పై విజిలెన్స్ ఆధారాలు సేకరించిందని పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని, చట్టానికి కులాలు, మతాలతో సంబంధంలేదని చెప్పారు. ఏసీబీ విచారణకు టీడీపీ సహకరించాలని ఇక్బాల్ కోరారు. అచ్చెన్న అరెస్ట్పై చంద్రబాబు విష ప్రచారం గుంటూరు: అచ్చెన్నాయుడు అరెస్ట్పై ప్రతిపక్ష నేత చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విడదల రజని మండిపడ్డారు. బీసీ కార్పొరేషన్కు ఏటా రూ.10 వేల కోట్లు చొప్పున కేటాయిస్తానని చెప్పి మోసం చేసింది చంద్రబాబేనని ధ్వజమెత్తారు. నాయీ బ్రాహ్మణుల తోక కత్తిరిస్తామని, మత్స్యకారులను తాట తీస్తామంటూ బీసీలను అవహేళన చేసిన చరిత్ర చంద్రబాబుది అని దుయ్యబట్టారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మొసలికన్నీరు కారిస్తే ప్రజలు నమ్మరని విడదల రజని అన్నారు. -
పోలవరంపై మాట్లాడే అర్హత బాబుకు లేదు: అనిల్కుమార్
-
తమ డప్పు కొట్టుకోవడం కోసమే మహానాడు
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు రాష్ట్రాన్ని రూ. 2 లక్షల కోట్ల అప్పుల పాల్జేశారని నీటిపారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఎవరు దివాలా తీయించారో ప్రజలకు తెలుసన్నారు. ఆయన మీడియాతో మట్లాడుతూ.. పచ్చ మీడియా రాతలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. దుర్మార్గంగా ప్రభుత్వంపై చంద్రబాబు బురద జల్లుతున్నారని దుయ్యబట్టారు. కరోనాపై సీఎం జగన్ ప్రతీరోజూ సమీక్ష చేస్తున్నారని తెలిపారు. కరోనా పరీక్షల్లో దేశంలోనే ఏపీ అగ్రగామిగా ఉందని పేర్కొన్నారు. ఎల్జీ పాలిమర్స్ బాధితులకు ఆర్థికసాయం అందిస్తే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు కులాలు అంటగట్టింది చంద్రబాబు అని విమర్శించారు. పోలవరానికి తన పాలనలో చంద్రబాబు ఎంత ఖర్చు చేశారని సూటిగా ప్రశ్నించారు. సీఎం జగన్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే రూ.10 వేల కోట్లకుపైగా సాయం చేశారని గుర్తు చేశారు. దివంగతనేత వైఎస్సార్ పోలవరాన్ని ప్రారంభించారని, సీఎం జగన్ పూర్తి చేస్తారని చెప్పారు. రాయలసీమ రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు బాబుకు లేదన్నారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి మహానాడు చంద్రబాబు జరుపుతున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఎన్టీఆర్ బతికి ఉంటే సీఎం జగన్.. చంద్రబాబును కొట్టిన దెబ్బకు సంతోష పడేవారన్నారు. ఇచ్చిన హామీల్లో 90 శాతం సీఎం జగన్ అమలు చేశారని తెలిపారు. వ్యవస్థలను మేనేజ్ చేసుకొనే బతికే వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. చంద్రబాబు జీరో అయితే సీఎం జగన్ ప్రజల గుండెల్లో హీరో అని చెప్పారు. తమ డప్పు తాము కొట్టుకోవడం కోసం మహానాడు పెట్టారని ఎద్దేవా చేశారు. పార్టీ నుంచి వలసలు అపుకోవడం కోసం మహానాడు పెట్టరని తెలిపారు. బాబు ఒక అబద్ధం మాట్లాడితే లోకేష్ పది అబద్దాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. దివంగత నేత ఎస్సార్ బాటలో నడుస్తూ.. సీఎం జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. -
వారంలో జిల్లా గ్రీన్జోన్
నెల్లూరు(అర్బన్): రానున్న వారంరోజుల్లో కరోనా కేసులు నియంత్రణలోకి వచ్చి జిల్లా సాధారణ స్థితికి వస్తుందని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ అన్నారు. శుక్రవారం రాత్రి కరోనా కేసులు, అధికారులు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై స్థానిక జెడ్పీ కార్యాలయంలోమంత్రి సమీక్ష నిర్వహించారు. సూళ్లూరుపేటలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులకు రెండోసారి కూడా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. క్వారంటైన్ కేంద్రాల్లో మంచి భోజనం, వసతి కల్పించాలన్నారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో మరో 90 కేసులు కోయంబేడు మార్కెట్ లింకులతో వచ్చాయన్నారు. వీటిలో 70 కేసుల వరకు సూళ్లూరుపేట పట్టణంలోనే ఉన్నాయన్నారు. అధికారులు తీసుకున్న చర్యలు, డాక్టర్లు చేస్తున్న నాణ్యమైన వైద్యం వల్ల రోగులు త్వరితగతిన కోరుకుంటున్నారని తెలిపారు. మార్గదర్శకాలు విడుదల లాక్డౌన్ నేపథ్యంలో దుకాణాలు తెరవడం, ఇతర వ్యాపారాలు చేసుకునేందుకు మున్సిపల్ కమిషనర్లు, పోలీసులు, రెవెన్యూ అధికారులు సమావేశమై మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారని మంత్రి తెలిపారు. ప్రజలు కూడా గుమిగూడకుండా, మాస్క్లు ధరించి, పరిశుభ్రత పాటిస్తూ కొనుగోళ్లు చేయాలని సూచించారు. ప్రభుత్వానికి సహకరించాలని, తద్వారా కరోనాను నియంత్రిద్దామని కోరారు. కలెక్టర్ శేషగిరిబాబు మాట్లాడుతూ వలస కార్మికులకు ఆశ్రయం కల్పించడంతోపాటు వారిని స్వస్థలాలకు పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్న మొదటి, ద్వితీయ కాంటాక్ట్ అయిన వ్యక్తులకు త్వరితగతిన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలని అధికారులకు సూచించారు. పరీక్షల్లో నెగటివ్ వచ్చిన వారిని ఇంటికి పంపాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ భాస్కర్భూషణ్, జేసీ వినోద్కుమార్, జేసీ–2 ప్రభాకర్రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరెడ్డి, జెడ్పీ సీఈఓ సుశీల, డీఆర్వో మల్లికార్జున, డీఎంహెచ్ఓ డాక్టర్ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
పోలవరం పనులు వేగవంతం
బుట్టాయగూడెం: చంద్రబాబు పాలనలో పడకవేసిన పోలవరం ప్రాజెక్టు పనులు సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో పరుగులు పెడుతున్నాయని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లో బుధవారం ఉపముఖ్యమంత్రి ఆళ్ల నానితో కలిసి ఆయన పర్యటించారు. ప్రాజెక్టు నిర్వాసితుల గృహ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం రౌతుగూడెంలో మీడియాతో మాట్లాడారు. జూన్ 30 నాటికి నిర్వాసితుల గృహ నిర్మాణం పనులను పూర్తి చేసి జూలై 15 నాటికి 17 వేల కుటుంబాలను తరలిస్తాం అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ► దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో నిర్మలమైన మనస్సుతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారు. ప్రాజెక్టు పూర్తి చేసే భాగ్యం ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రావడం పూర్వ జన్మసుకృతం. ► పోలవరం ప్రాజెక్టు అంటే గత పాలకులు భావించినట్లు ఒక డ్యామ్, రెండు కాల్వలు కాదు. రూ.50 వేల కోట్లు ప్రజాధనం, లక్ష 11 వేల పేద, గిరిజన, ఎస్సీ, బీసీ కుటుంబాల త్యాగం. ► 50–60 సంవత్సరాలుగా నివసిస్తున్న ప్రజలు తమ సొంత ఊళ్లను ప్రాజెక్టు కోసం త్యాగం చేయడం అభినందనీయం. ► ఈ ప్రాజెక్టులో సింహ భాగమైన రూ.30 వేల కోట్ల విలువైన ఆర్అండ్ఆర్ పనుల్లో ఇప్పటి వరకూ 15 శాతం మాత్రమే జరిగాయి. గత ప్రభుత్వం పనులు తక్కువ ప్రచారం ఎక్కువ అన్నట్లు సాగించడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. ► రూ.50 వేల కోట్ల ప్రాజెక్టులో 70 శాతం పనులు చేశామని గొప్పలు చెప్పుకున్నారు. వాస్తవానికి చేసిన ఖర్చు రూ.16 వేల కోట్లు అయితే 70 శాతం పనులు ఎలా పూర్తయ్యాయో వారే చెప్పాలి. -
పోల‘వరం’లో తొలి అడుగు
సాక్షి, రాజమహేంద్రవరం: జిల్లావాసుల కలల సౌధం పోలవరం ప్రాజెక్టు పరుగులు పెట్టే రోజులు వచ్చేశాయి. గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టు నిర్వాసితులకు స్వర్ణ యుగం వచ్చేసింది. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ప్యాకేజీకి ఎట్టకేలకు మోక్షం కలిగింది. సీఎంగా జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించి ఏడాది తిరగకుండానే నిర్వాసితులకు పునరవాస ప్యాకేజీ రూ.79 కోట్లు కేటాయించారు. నిర్వాసితులు సంతోషంగా ఉంటేనే ప్రాజెక్టు నిర్మాణం ముందుకు వెళుతుందనే ఉద్దేశంతో సీఎం తొలి విడత ప్యాకేజీ ప్రకటించి ... ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఏటా కడలిపాలవుతున్న వేల టీఎంసీలను ఒడిసిపట్టే బహుళార్థక సాధక ప్రాజెక్టును సాకారం చేయాలనే చిత్తశుద్ధి ఉండడడంతో సీఎం ముందుగా తమ గోడు పట్టించుకుంటున్నారని నిర్వాసితులు సంబరపడుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలు పరిష్కారానికి జలవనరులశాఖా మంత్రి అనిల్కుమార్ యాదవ్ బుధ, గురువారాల్లో జిల్లా పర్యటనకు వస్తున్నారు. (అన్ని వర్గాల ఆర్థిక ప్రగతికి..సంక్షేమ రథం) కమీషన్ల కోసం బాబు యావ గత పాలకుల నిర్లక్ష్యానికి సాక్షీభూతంగా నిర్వాసితులు మిగిలిపోయారు. వారి బాధలను గాలికొదిలేసి కమీషన్లు వచ్చే పనులను భుజానకెత్తుకున్నారు. పరిహారం ఇచ్చి ఇళ్లు నిర్మిస్తే ఖాళీచేసి వెళ్లిపోతామని మొత్తుకున్నా పట్టించుకోలేదు. పునరావాస చర్యలు తీసుకున్న తరువాతే ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టాలని నిర్వాసితులు, నిపుణులు కమిటీ సూచించినా చంద్రబాబు అండ్ కో పెడచెవిన పెట్టారు. ఫలితంగా ప్రతి ఏటా 69 వేల పైచిలుకు కుటుంబాలు గోదావరి వరదల్లో ముంపు బారిన పడుతున్నాయి. నష్టపరిహారం చెల్లించి, ప్రాజెక్టు పనులు చేపట్టాలని ఐదేళ్లు మొత్తుకున్నా కనీసం పట్టించుకోకుండా బాబు సర్కార్ అనాలోచితంగా పర్సంటేజీలకు కక్కుర్తిపడి కాఫర్ డ్యామ్ నిర్మాణం చేపట్టి గ్రామాలను ముంచేశారు. (కోవిడ్ పట్ల భయాందోళనలు పోవాలి) కాఫర్ డ్యామ్తో కొద్దిపాటి వరదకే గతేడాది మూడుసార్లు గిరిజన గ్రామాలు ముంపునకు గురై నిర్వాసితులు మూడు నెలలు ఇబ్బందులు పడ్డారు. భద్రాచలంలో గోదావరికి మూడో ప్రమాద హెచ్చరిక జారీచేస్తేనే దేవీపట్నంతోపాటు విలీన మండలాల్లో ముంపునకు గురవుతాయి. అటువంటిది కాఫర్ డ్యామ్ కారణంగా భద్రాచలంలో ఒకటో ప్రమాద హెచ్చరిక జారీచేసే సరికే ఏజెన్సీ మండలాలు ముంపునకు గురయ్యే పరిస్థితి. ఇంతా చేసి అధికారం కోల్పోయాక తగదునమ్మా అంటూ చంద్రబాబు తనయుడు, లోకేష్ ముంపు గ్రామాల పర్యటనకు వచ్చినప్పుడు బాధితుల ఆగ్రహానికి తోకముడిచి వెనుతిరగక తప్పింది కాదు. వైఎస్ హయాంలో... మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించినప్పుడు ముందుగా నిర్వాసితుల ప్రయోజనాలకే పెద్దపీట వేసేవారు. ముందు ముంపునకు గురయ్యే గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. హామీ ఇచ్చినట్టే ముంపు బాధితులకు ప్యాకేజీ ప్రకటించి పునరావాస కాలనీలకు తరలించేవారు. ఆ తరువాతే ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టేవారు. నాడు దేవీపట్నం మండలం వీరవరంలంక, గొందూరు, పరగసానిపాడు, అంగుళూరు, బోడిగూడెం గ్రామాల ప్రజలను ఇందుకూరిపేట–ఫజుల్లాబాద్కు మధ్య నిర్మించిన కాలనీలకు తరలించారు. భూమికి, భూమి, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, కాలనీలు నిర్మాణం పూర్తి చేశారు. ఈ రకంగా వైఎస్ హయాం 2004–2009 మధ్య సుమారు 1500 నిర్వాపిత కుటుంబాలకు మంచి చేశారు. ఆ బాటలోనే తనయుడు గతేడాది జూలైలో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సీఎం జగన్ మోహన్రెడ్డి వచ్చినప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో కాఫర్ డ్యామ్ కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాన్ని ఏరియల్ సర్వేలో వీక్షించారు. అనంతరం మంత్రులు, అ«ధికారులతో సమీక్షించిన సందర్భంలో నిర్వాసితులకు పునరావాసం ప్యాకేజీ, ఇల్లు ఖాళీ చేయించే ప్రక్రియను 2020 జూన్ నాటికి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. నాడు ఇచ్చిన మాట ప్రకారం నిర్వాసితులకు తొలి ప్రాధాన్యం ఇచ్చారు. అనాలోచితంగా చంద్రబాబు సర్కార్ నిర్మించిన కాఫర్ డ్యామ్ కారణంగా ముంపునకు గురవుతున్న గ్రామాలకు తొలి ప్రాధాన్యంగా ప్యాకేజీని విడుదల చేశారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, ఇళ్లకు నష్టపరిహారం కోసం ఇటీవలనే రూ.79 కోట్లు విడుదల చేశారు. మహానేత వైఎస్ తరువాత ఇంత కాలానికి మళ్లీ ప్యాకేజీని ప్రకటించి మనసున్న నాయకుడిగా సీఎం నిలిచారని నిర్వాసితులు ఆనందడోలికల్లో తేలియాడుతున్నారు. కాఫర్ డ్యామ్కు సమీపాన ఉన్న ఆరు గ్రామాలకు పూర్తి స్ధాయి ప్యాకేజీ, ఇళ్ల నష్టపరిహారం చెల్లించేందుకు నిధులు విడుదల చేయడంతో ప్రాజెక్టు పనులు ముందుకు వెళ్లడానికి మార్గం సుగమమైందని చెప్పొచ్చు. శరవేగంగా కాలనీలు... ప్రాజెక్టు నిర్మాణం కారణంగా తొలివిడతలో దేవీపట్నం మండలంలో ముంపునకు గురవుతున్న నిర్వాసితులకు యుద్ధ ప్రాతిపదికన కాలనీల నిర్మాణం జరుగుతున్నాయి. గిరిజనేతరులకు గోకవరం మండలం కృష్ణునిపాలెంలోను, గిరిజనులకు దేవీపట్నం మండలంలోని పలు గ్రామాల్లో నిర్మాణం చురుగ్గా జరుగుతున్నాయి. వాస్తవానికి గత చంద్రబాబు సర్కార్లోనే వీరికి ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ ఐదేళ్ల పాలనలో ఏనాడూ నిర్వాసితులను పట్టించుకున్న దాఖలాలు లేవు. వైఎస్ ఆలోచనే వేరు మాజీ ముఖ్యమంత్రి వెఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో ప్రాజెక్టు నిర్మాణ ఆలోచన రాగానే ముందుగా నిర్వాసితుల ప్రయోజనాలకే పెద్దపీట వేసేవారు. ముంపునకు గురయ్యే గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. బాధితులకు ప్యాకేజీ ప్రకటించి పునరావాస కాలనీలకు తరలించేవారు. ఆ తరువాతే ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టేవారు. కమీషన్లకే బాబు ప్రాధాన్యం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కమీషన్ల కోసమే పోలవరం పనులు చేపట్టేవారు. ఇందుకు ఉదాహరణ కాఫర్ డ్యాం నిర్మాణం. పరిహారం ఇచ్చి ఇళ్లు నిర్మిస్తే ఖాళీచేసి వెళ్లిపోతామని బాధితులు మొత్తుకున్నా అప్పటి సర్కారు పట్టించుకోలేదు. దీని ఫలితంగా ప్రతి ఏటా 69 వేల పైచిలుకు కుటుంబాలు గోదావరి వరదల్లో ముంపు బారిన పడుతున్నాయి. ఈ పాపం ఆయనదే. జగన్దీ తండ్రిబాటే... గత ఏడాది జూలైలో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సీఎం జగన్ మోహన్రెడ్డి వచ్చినప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో కాఫర్ డ్యామ్ కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాన్ని ఏరియల్ సర్వేలో వీక్షించారు. పునరావాసం ప్యాకేజీ, ఇల్లు ఖాళీ చేయించే ప్రక్రియను 2020 జూన్ నాటికి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. కాఫర్ డ్యామ్ కారణంగా ముంపునకు గురవుతున్న గ్రామాలకు తొలి ప్రాధాన్యంగా ప్యాకేజీని విడుదల చేసి మాట నిలబెట్టుకుంటున్నారు. ‘బాబు సర్కార్ పట్టించుకోలేదు’ నిర్వాసితులకు ముందుగా పునరావాసం కల్పించాలనే ఆలోచనే చంద్రబాబు సర్కార్కు రాలేదు. గ్రామాల నుంచి తరలించేందుకు అంత ప్యాకేజీ ప్రకటించడాన్ని ఎప్పుడూ పట్టించు కోలేదు. కాఫర్ డ్యామ్కు దగ్గరగా ఉన్న గ్రామాల్లో మాకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం కాళ్లరిగేలా తిరిగాం. టీడీపీ ప్రభుత్వం నిర్వాసితులను అసలు మనుషులుగా కూడా చూడ లేదు. కమీషన్ల కోసం కాఫర్ డ్యామ్ నిర్మాణం చూసుకున్నారు తప్ప వరదలు వస్తే నిర్వాసితులు ఇబ్బందులు పడతారనే విషయాన్ని పట్టించుకోలేదు. – పోలిశెట్టి శివరామకృష్ణనాయుడు, తొయ్యేరు ‘ప్యాకేజీ సంతోషంగా ఉంది’ ఈ ఏడాది వరదలు వచ్చినా నిర్వాసితులు ఎవరు ఇబ్బంది పడకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేస్తున్న ఏర్పాట్లు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. గత వరదలు వలన నిర్వాసితులు అష్ట కష్టాలు పడ్డారు. గత ప్రభుత్వం చేసిన తప్పులకు మేమంతా బలయ్యాం. ప్రస్తుతం అలాంటి పరిస్థితి రాకుండా ముందుగానే పునరావాస కాలనీలు పూర్తి చేసి నిర్వాసితులను తరలించే ఏర్పాటు చేయడం ఊరటనిస్తోంది. కాలనీలకు తరలించి వరద ముంపు నుంచి తప్పిస్తారని ఎదురుచూస్తున్నాం. – వెంకటరమణ, సీతారామం -
బాబు భయపెడుతుంటే.. జగన్ భరోసా కల్పిస్తున్నారు
సాక్షి,అమరావతి: విపత్కర సమయంలోనూ ప్రతిపక్షనేత చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. కరోనా సోకితే ప్రాణాలు పోయినట్లేనని చంద్రబాబు భయపెడుతుంటే బాధితుల్లో సీఎం జగన్ ధైర్యాన్ని నింపి భరోసా కల్పిస్తున్నారని చెప్పారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వారు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఇవీ.. ► కరోనా కట్టడి చర్యల్లో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రపదేశ్ మెరుగ్గా ఉంది. దేశంలో కరోనా పరీక్షలు చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ప్రథమ స్థానంలో ఉంది. జాతీయ సగటు కంటే అతి తక్కువగా రాష్ట్రంలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ► ఓ ఎంపీ కుటుంబానికి కరోనా వచ్చిందని టీడీపీ నేతలు అవహేళనగా మాట్లాడారు. ఆ కుటుంబంలో నలుగురు డాక్టర్లున్నారు. వారంతా కరోనాపై పోరాటంలో ముందు వరుసలో నిలిచి చికిత్స చేస్తుంటే డాక్టర్లను కించపరిచేలా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారు. ► టీడీపీ నేతలు కనీసం పదిశాతం మందైనా బయటకొచ్చి పేదలను ఆదుకున్నారా? సాయం చేయడం మాని తిన్నది అరక్క దీక్షలు చేస్తున్నారు. ► కరోనా నియంత్రణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. అధికార యంత్రాంగం నుంచి పోలీసులు, వలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులు, రెవెన్యూ సిబ్బంది, డాక్టర్లు 24 గంటలు పనిచేస్తున్నారు. ► చంద్రబాబు ప్రజలకు మంచి చేయకపోయినా ఫర్వాలేదు కానీ వారిని భయపెట్టొద్దు. ఆయన రాజకీయాలు చేయడానికి ఏపీ కావాలి, ఉండడానికి మాత్రం హైదరాబాద్ కావాలి. ► కరోనా నివారణలో ఏపీ మార్గదర్శకంగా నిలిచిందని ప్రధాని, కేంద్ర మంత్రులు, జాతీయ మీడియా చెబుతుంటే బాబుకు వినిపించదా? ► ప్రకాశం బ్యారేజి వద్ద 10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినపుడు ముఖ్యమంత్రి జగన్ అధికారులతో ఎలా పని చేయించారో అందరికీ తెలుసు. సంక్షోభ సమయంలో అయోమయం సృష్టించడం చంద్రబాబు అలవాటు. ► ఎస్ఈసీ కనగరాజ్ వల్ల రాజ్భవన్లో కరోనా వచ్చిందని ఒక దళిత రిటైర్డు జడ్జిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం దారుణం. రాష్ట్రపతి భవన్లో కూడా కరోనా ప్రధానమంత్రి వల్ల వచ్చిందని చంద్రబాబు చెప్పగలరా? -
2021 నాటికి పోలవరం పూర్తి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులను 2021 నాటికి పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని పోలవరం ప్రాజెక్టు అధికారులకు జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ అనిల్కుమార్ యాదవ్ దిశానిర్దేశం చేశారు. ఈ నెల 28న సీఎం వైఎస్ జగన్ పోలవరం పనులను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేయనున్న నేపథ్యంలో మంగళవారం విజయవాడలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఈఎన్సీ నారాయణరెడ్డి, పోలవరం ప్రాజెక్టు సీఈ సుధాకర్బాబు, సహాయ, పునరావాస శాఖ కమిషనర్ బాబూరావు తదితరులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వేలో 43 బ్లాకుల్లో పియర్స్ పనులు ఊపందుకున్నాయని సీఈ సుధాకర్బాబు వివరించారు. ఒక్కో పియర్ను 55 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని, ఒక పియర్లో ఒక మీటర్ ఎత్తు పనులు చేయడానికి నాలుగు రోజుల సమయం పడుతుందన్నారు. రోజుకు 1,500 క్యూబిక్ మీటర్ల చొప్పున స్పిల్ వేలో కాంక్రీట్ పనులు చేస్తున్నామని, జూన్ నాటికి స్పిల్ వేలో మొత్తం 2.05 లక్షల క్యూబిక్ మీటర్ల పనులను పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు వద్ద నాలుగు టీఎంసీల మేర వరద జలాలు నిల్వ ఉన్నాయని, వాటిని ఖాళీ చేసే పనులు వేగవంతం చేశామని తెలిపారు. జూలైలో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులను ప్రారంభించి, గడువులోగా పనులు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టామన్నారు. రోజువారీ పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఒక యాప్ను తయారు చేసి, వాటిలో పొందుపర్చాలని మంత్రి అనిల్కుమార్ ఆదేశించారు. జూన్లోగా 41.15 మీటర్ల పరిధిలోని ముంపు గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను వేగవంతం చేయాలన్నారు. పోలవరానికి రూ.1,400 కోట్లు పోలవరం పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.1,400 కోట్లను రీయింబర్స్ చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ పంపిన ప్రతిపాదనలను మంగళవారం కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ ఆమోదించారు. తక్షణమే నిధుల విడుదలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపారు. వాటిపై కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదముద్ర వేసి.. నిధులు విడుదల చేయాలని సిఫార్సు చేస్తే బహిరంగ మార్కెట్లో ఈ–ఆక్షన్ ద్వారా నాబార్డు నిధులు సేకరిస్తుంది. ఆ నిధులను జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ, పీపీఏ ద్వారా ప్రభుత్వానికి అందజేయనుంది. పోలవరానికి ఇటీవల కేంద్రం రూ.1,850 కోట్ల మేర రీయింబర్స్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం పోలవరానికి ఖర్చు చేసిన నిధుల్లో.. మిగిలిన రూ.3,283 కోట్లను రీయింబర్స్ చేసి, ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయడానికి సహకరించాలని ఇటీవల ప్రధానితో సమావేశమైనప్పుడు సీఎం జగన్ కోరారు. కేంద్ర జల్ శక్తి శాఖ ఆదేశాల మేరకు.. ఇటీవల పోలవరం పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన పీపీఏ సీఈవో చంద్రశేఖర్ సంతృప్తి వ్యక్తం చేశారు. 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ఆర్థిక సమస్యలు లేకుండా చూడాలని కేంద్రానికి నివేదిక ఇచ్చారు. -
నిర్ణీత సమయానికే పోలవరం పూర్తి చేస్తాం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును నిర్ణీత సమయానికే పూర్తి చేస్తామని, అందులో ఎలాంటి సందేహం లేదని మంత్రి అనిల్కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. పోలవరం ఆగిపోయిందని ఎవరు చెప్పారని పచ్చ మీడియాను నిలదీశారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చెదిరిన చక్రం పేరుతో రామోజీరావు పేపర్లో ఆటోనగర్ అతలాకుతలమని రాశారని, అసలు అమరావతి, పోలవరానికి ఆటోనగర్తో ఏం సంబంధమని ప్రశ్నించారు. మరో పత్రికలో రాష్ట్రానికి పెట్టుబడుల గండం అని, కియా కథ మళ్లీ మొదటికి అంటూ అవాస్తవాలు రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్, లోకేష్ సన్నిహితుల ఇళ్లల్లో జరుగుతున్న ఐటీ సోదాలను పక్కదారి పట్టించేందుకే ఎల్లో మీడియా ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. రామోజీకి బంధువైన నవయుగ కంపెనీకి పోలవరం ప్రాజెక్టు పనులు దక్కలేదని అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ ముందుకు దూసుకుపోతోందని, దీంతో ఓర్వలేక ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని విమర్శించారు. -
2021 నాటికి పోలవరం పూర్తి చేస్తాం
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు పనులు ప్రణాళికాబద్ధంగా చేపట్టి 2021కి పూర్తి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నారని, ఆ విధంగానే పనులు పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ తెలిపారు. ఆదివారం ఆయన పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుతో కలిసి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. స్పిల్వే గ్యాప్–3 పనులకు తూర్పుగోదావరి జిల్లా అంగులూరు వద్ద ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ గ్యాప్–1 పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో మేఘా క్యాంపు కార్యాలయంలో పోలవరం పనులు జరుగుతున్న తీరు, ఆర్అండ్ఆర్ అమలుకు సంబంధించిన పనులపై సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వరదల సమయానికి ముందుగా 18 వేల నిర్వాసిత కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియ చేపట్టామన్నారు. గత ప్రభుత్వం ఆర్అండ్ఆర్ పనులను విస్మరించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ బృందం 10 రోజుల క్రితం పోలవరం పనులపై సంతృప్తి వ్యక్తం చేసి అనుకున్న సమయంలో అధికారులు పనులు పూర్తి చేస్తారనే విషయంపై నివేదిక విడుదల చేసిందని మంత్రి అనిల్ తెలిపారు. నవంబర్ 1న పనులు ప్రారంభించామని, స్పిల్వే పనులు జరుగుతున్నాయన్నారు. స్పిల్వే కాంక్రీట్ పనులు 35 మీటర్ల ఎత్తులో జరుగుతున్నాయని, స్పిల్ చానల్లో నిలిచిపోయిన వరదనీటిని గోదావరి నదిలోకి మళ్లిస్తున్నారన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్రం, నాబార్డు విడుదల చేస్తుందని, ఇప్పటికే రూ.1,800 కోట్లు విడుదల చేసిందన్నారు. గత ప్రభుత్వం రూ.55 వేల కోట్లు ప్రాజెక్టు పనులకు రూ.17 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. ముఖ్యమంత్రి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులను ఐదేళ్లలో పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. పోలవరం నిర్వాసితుల నుంచి 10 వేల వినతులు అందాయని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
వచ్చే ఏడాదికి నంబర్ 1 సీఎం వైఎస్ జగన్
సాక్షి,అమరావతి: అతి తక్కువ కాలంలో దేశంలోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ సీఎంగా వైఎస్ జగన్ నాలుగో స్థానంలో నిలిచారని .. వచ్చే ఏడాది కచ్చితంగా దేశంలోనే బెస్ట్ సీఎంగా నంబర్ వన్ స్థానంలో ఉంటారని మంత్రి అనిల్కుమార్ యాదవ్ చెప్పారు. 40 ఏళ్ల ఇండ్రస్ట్రీ చంద్రబాబుకు ఇది సాధ్యం కాలేదన్నారు. అవినీతిలో బాబు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారని ఎద్దేవా చేశారు. అనిల్కుమార్ యాదవ్ శనివారం మీడియాతో మాటాడుతూ.. చంద్రబాబు ఎన్ని దేశాలు తిరిగినా ఏం లాభం.. సీఎం వైఎస్ జగన్ ఇక్కడే కూర్చొని ప్రపంచాన్ని మన రాష్ట్రానికి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. మంత్రులు మద్యం సేవించి, శాసన మండలికి వచ్చారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారని, తన బ్లడ్ శాంపిల్స్ ఇస్తానని, తనకు మద్యం అలవాటు ఉన్నట్లు నిరూపించాలని అనిల్కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. -
స్వగ్రామంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ
నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి శుక్రవారం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. తన స్వగ్రామమైన తాళ్లపూడిని మోడల్ గ్రామంగా తీర్చిదిద్ది.. సకల సదుపాయాలు కల్పించేందుకు రూ.15 కోట్లతో చేపట్టిన వివిధ పనులకు శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, మంత్రి అనిల్కుమార్, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దుర్గాప్రసాద్.. ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, కాకాణి గోవర్ధన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చదవండి: 8 నెలల్లోనే ఇంత పతనమయ్యావేమి బాబూ? -
మార్చి 23 నుంచి పదో తరగతి పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంత్రులు డాక్టర్ ఆదిమూలపు సురేశ్, అనిల్కుమార్ యాదవ్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
డీపీఆర్ ఇస్తే నిధులు!
సాక్షి, అమరావతి: సముద్రంలో కలుస్తున్న గోదావరి వరద జలాలను ఒడిసి పట్టి దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గోదావరి–కృష్ణా (బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్)– పెన్నా నదుల అనుసంధానానికి నిధులివ్వాలంటూ జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ చేసిన వి/æ్ఞప్తిపై కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పంపితే పరిశీలించి నిధులిస్తామని హామీ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్లో దక్షిణాది రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, అధికారులతో జల్ శక్తి అభియాన్, సాగు, తాగునీటి ప్రాజెక్టులు, స్వచ్ఛ భారత్ తదితర పథకాలపై గజేంద్రసింగ్ షెకావత్ సమావేశం నిర్వహించారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృష్ణారెడ్డి తదితరులు దీనికి హాజరయ్యారు. మూడు రాష్ట్రాలకు ప్రయోజనం గోదావరి నుంచి ఏటా సగటున 2,500 టీఎంసీలకుపైగా సముద్రంలో కలుస్తున్నాయని మంత్రి అనిల్కుమార్ యాదవ్ చెప్పారు. నీటి లభ్యత నానాటికీ తగ్గుతుండటం, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సాగు, తాగునీటి ఇబ్బందులు తీవ్రంగా ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం గోదావరి–కృష్ణా–పెన్నా అనుసంధానాన్ని చేపట్టాలని నిర్ణయించిందని చెప్పారు. డీపీఆర్ రూపకల్పన బాధ్యతను వ్యాప్కోస్కు అప్పగించామన్నారు. గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ(గ్రాండ్ ఆనకట్ట) అనుసంధానం వల్ల తెలంగాణ, ఏపీ, తమిళనాడుకు ప్రయోజనం చేకూరుతుందని, ఈ ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోందని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. వాటర్ గ్రిడ్కు సహకారం.. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికీ రోజూ పట్టణ ప్రాంతాల్లో 135 లీటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 100 లీటర్లు నీటిని అందచేసే వాటర్ గ్రిడ్ పథకానికి నిధులివ్వాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ కోరారు. అయితే 55 లీటర్ల నీటి సరఫరాకు అయ్యే వ్యయాన్ని మాత్రమే కేంద్రం ఇస్తుందని, అంతకంటే ఎక్కువ పరిమాణంలో నీటిని అందించడానికి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుందని గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారు. భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో శుద్ధి చేసి ఇళ్లకు సరఫరా చేయాలని వ్యయం తగ్గుతుందని సూచించారు. వాటర్ గ్రిడ్కు అవసరమైతే విదేశీ ఆరి్థక సంస్థల ద్వారా రుణం అందించేందుకు సహకరిస్తామని చెప్పారు. త్వరలో మిగతా నిధులు.. పోలవరానికి మిగతా రూ.3,222.75 కోట్లను కూడా రీయింబర్స్ చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ అదనపు కార్యదర్శి టి.రాజేశ్వరిని మంత్రి అనిల్కుమార్ యాదవ్, ఆదిత్యనాథ్ దాస్ కోరారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక శాఖకు పంపామని, త్వరలోనే నిధులు విడుదలయ్యేలా చూస్తామని టి.రాజేశ్వరి పేర్కొన్నారు. భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికి సంబంధించి రూ.రెండు వేల కోట్ల బిల్లులను మంజూరు చేయాలన్న విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు. -
పవన్.. ఇక సినిమాలు చేసుకో
నెల్లూరు (స్టోన్హౌస్పేట): జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ ఇక సినిమాలు చేసుకోవచ్చని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అనిల్కుమార్ యాదవ్ హితవు పలికారు. నెల్లూరు నగరంలోని కోనేటిమిట్టలో సోమవారం పర్యటించిన మంత్రి.. ఆదివారం విశాఖలో జరిగిన లాంగ్మార్చ్.. ఆ సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన బాగుంటే సినిమాలు ఒప్పుకుంటానని పవన్కల్యాణ్ చెప్పిన విషయాన్ని అనిల్కుమార్ గుర్తుచేశారు. ప్రస్తుతం పవన్ పింక్ అనే రీమేక్ చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయని.. దీనిని బట్టి చూస్తే వైఎస్ జగన్ పాలన బాగుందని ఆయన ఒప్పుకున్నట్లేనన్నారు. ఇసుకపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయడంపై మంత్రి మండిపడ్డారు. -
చంద్రబాబు పుత్రుడిది దీక్ష, దత్తపుత్రుడిది లాంగ్మార్చ్
సాక్షి, అమరావతి: వరదలు, వర్షాల వల్ల రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడితే దానిని సాకుగా చేసుకుని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురద జల్లేందుకు ఉబలాటపడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, జలవనరుల శాఖ మంత్రి పోలుబోయిన అనిల్కుమార్యాదవ్ విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం వారిద్దరూ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు వారు కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ఇసుకను రాజకీయం చేస్తూ చంద్రబాబు పుత్రుడు లోకేశ్ దీక్ష చేస్తే.. ఇపుడు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్తో లాంగ్మార్చ్ చేయిస్తున్నారని ఎద్దేవా చేశారు. వరదల వల్ల ఇసుక కొరత ఏర్పడిందనే విషయం అందరికీ తెలుసన్నారు. వరదలు తగ్గాక ఇసుక తవ్వకం దిశగా అధికారులు పని చేస్తున్నారని చెప్పారు. జనసేనతో గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన సీపీఐ, సీపీఎం ఇపుడు ఆ పార్టీతో కలిసి ప్రయాణించలేమని ప్రకటించాయని, తమ ఉద్యమాలేవో తాము చేసుకుంటామని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారని చెప్పారు. చంద్రబాబు, పవన్ చాలా కాలంగా కలిసే లాంగ్ మార్చ్ చేస్తున్నారని, వీరి ఆత్మీయానుబంధం ఏమిటో రాష్ట్ర ప్రజలు ఐదేళ్లుగా చూస్తున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలో ఇసుక తవ్వకాల్లో ఇష్టానుసారం దోపిడీ చేశారని, ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం అమలులోకి వచ్చే లోపు వరదలు వచ్చాయన్నారు. 267 రీచ్లలో అనుమతి ఇస్తే కేవలం 60 రీచ్లలో మాత్రమే ఇసుక తీయగలుగుతున్నారని మంత్రులు వివరించారు. వరదలు తగ్గగానే పుష్కలంగా ఇసుక అందుబాటులోకి వస్తుందన్నారు. బాబు హయాంలో జరిగిన ఇసుక దోపిడీ, అరాచకాలపై పవన్ ఏనాడూ ప్రశ్నించలేదని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికులకు చెందాల్సిన రూ.900 కోట్లను పక్కదారి పట్టించినపుడు కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద వారు ధర్నా చేస్తే పవన్ మద్దతు కూడా ప్రకటించలేదన్నారు. పవన్ది లాంగ్ మార్చ్ కాదని.. రాంగ్æ మార్చ్ అన్నారు. బాబు అజెండాను పవన్ అమలు చేస్తున్నారని, టీడీపీ నేతలు లాంగ్ మార్చ్కు హాజరవ్వాలనుకోవడాన్ని బట్టే వారి బంధం బయట పడిందన్నారు. -
‘రివర్స్’ సక్సెస్
సాక్షి, అమరావతి: అవినీతికి తావు లేకుండా, ప్రజా ధనాన్ని ఆదా చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న రివర్స్ టెండరింగ్ విధానం పూర్తిగా విజయవంతమైందని, సాగునీటి ప్రాజెక్టుల్లో ఇప్పటివరకు సుమారు రూ.1,000 కోట్లు ఆదా అయిందని జలవనరుల శాఖ మంత్రి పోలుబోయిన అనిల్కుమార్ యాదవ్ తెలిపారు. ఈ స్ఫూర్తితో మున్సిపల్, గృహ నిర్మాణ శాఖల్లో సైతం రివర్స్ టెండరింగ్కు వెళతామని చెప్పారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తన శాఖలో రివర్స్ టెండరింగ్ వల్ల మరో రూ.500 కోట్లు ఆదా అయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.62 కోట్లు ఆదా అయ్యాయన్నారు. బొగ్గు రవాణాలో కూడా రూ 25 కోట్లు ఆదా అయిందన్నారు. బాబు ముంచితే మేం ఆదా చేస్తున్నాం.. రివర్స్ టెండరింగ్కు వెళ్లకుండా టీడీపీ సర్కారు హయాంలో కేటాయించిన వారికే పనులు అప్పగిస్తే దాదాపు రూ.1,500 కోట్ల మేర ప్రజా ధనానికి గండిపడి ఐదుగురు లేదా పదిమంది జేబుల్లోకి వెళ్లేవని మంత్రి అనిల్ పేర్కొన్నారు. రివర్స్ టెండర్ల ద్వారా ఇప్పటికే రూ.వెయ్యి కోట్లు ఆదా చేయగా మరో రూ.500 కోట్ల దాకా ఆదా జరిగే అవకాశం ఉందని మంత్రి గుర్తు చేశారు. ఈ డబ్బులతో సంక్షేమ పథకాల అమలు చేపట్టవచ్చన్నారు. టీడీపీ 2014లో అధికారంలో చేపట్టాక రెండేళ్ల పాటు ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టకుండా కాలయాపన చేసిందని పేర్కొన్నారు. తాము కొద్ది నెలల్లోనే అన్నింటినీ సమీక్షించి పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు రూ 2.5 లక్షల కోట్లు అప్పు తెచ్చి రాష్ట్రాన్ని ముంచితే తాము రూ.వేల కోట్లు ఆదా చేస్తున్నామని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన హంద్రీ–నీవా రాయలసీమను సస్యశామలం చేసేందుకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన హంద్రీ–నీవా సుజల స్రవంతిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి సాగు, తాగునీటి కష్టాలను తీరుస్తామని అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలతో పథకంపై సమీక్ష సందర్భంగా మంత్రి అనిల్కుమార్ ప్రకటించారు. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు బీటీపీ, ఎగువ పెన్నార్ ఎత్తిపోతలకు రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శంకరనారాయణ, బొత్స సత్యనారాయణ, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘నదుల్లో విహార యాత్రలు వాయిదా వేసుకోండి’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో, ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కృష్ణా, గోదావరి, వంశధార నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, ఇలాంటి సమయంలో నదుల్లో విహారయాత్రలకు వెళ్లడం ఏ మాత్రం క్షేమకరం కాదని జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ అనిల్కుమార్ యాదవ్ చెప్పారు. కొంత కాలం నదుల్లో విహార యాత్రలను వాయిదా వేసుకోవాలని ప్రజలకు సూచించారు. శుక్రవారం విజయవాడలో నీటి పారుదల శాఖ కార్యాలయంలో ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, 13 జిల్లాల చీఫ్ ఇంజినీర్లతో వరద ఉధృతి, జలాశయాల్లో నీటి నిల్వలు, సాగునీటి ప్రాజెక్టుల పనులపై సమీక్ష నిర్వహించారు. దసరా పండుగ నేపథ్యంలో ప్రజలు పుణ్యస్నానాల కోసం గోదావరి, కృష్ణా నదుల్లోకి వెళ్తారని.. ఇలాంటి సమయంలో ప్రమాదం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఈలకు సూచించారు. అంతకుముందు చిత్తూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల ప్రగతిపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, తెలుగు గంగ, గాలేరు– నగరి, చిన్న నీటిపారుదల శాఖ ఇంజినీర్లుతో సమీక్షించారు. -
టీడీపీ హయాంలో ఒక్క కాంట్రాక్టు అయినా తక్కువకు ఇచ్చారా?
సాక్షి, అమరావతి: గత మూడేళ్లుగా టీడీపీ హయాంలో ఒక్క కాంట్రాక్టునైనా తక్కువకు ఇచ్చారా? అని జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్కుమార్ యాదవ్ అని సూటిగా ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరంలో పారదర్శకంగా నిర్వహించిన రివర్స్ టెండరింగ్ వల్ల ఇప్పటివరకు రూ. 841.33 కోట్ల మేరకు ఆదా అయిందని, నవంబర్ నుంచి పనులు మొదలు పెట్టి రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పోలవరం తమకు ప్రధాన అజెండా అని చెప్పారు. దివంగత వైఎస్సార్ మానస పుత్రిక అయిన పోలవరంపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భారీ వర్షాలు, వరదల వల్ల నవంబర్ వరకు పనులకు అంతరాయం కలిగితే పోలవరం ఆగిపోయిందంటూ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీలైనంత వేగంగా పోలవరాన్ని పూర్తి చేసి ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన రివర్స్ టెండరింగ్ విజయవంతం అయిందన్నారు. టీడీపీతో లోపాయికారీ ఒప్పందం వల్లే నవయుగ సంస్థ రివర్స్ టెండర్లలో పాల్గొన లేదని చెప్పారు. మంచి కాంట్రాక్టర్, పారదర్శకత ఉన్నవారైతే బిడ్డింగ్లో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. టీడీపీ నేతల్లో ఆందోళన.. నిధులను ఆదా చేస్తూ ప్రభుత్వం ముందుకెళ్తుంటే తమ బండారం బట్టబయలవుతోందని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారని అనిల్ పేర్కొ న్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తే టీడీపీని మూసివేసి రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అని సవాల్ విసిరారు. వెలిగొండకు కూడా రివర్స్ టెండర్లు పిలిచామని, ప్రతి పనికి ఇదే విధానంలో పారదర్శకంగా బిడ్లను ఆహ్వానిస్తామన్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నట్లు టీడీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని మంత్రి అనిల్ మండిపడ్డారు. అది పూర్తిగా అసత్యమని డిజైన్ ప్రకారమే నిర్మిస్తామని చెప్పారు. మాజీ మంత్రి దేవినేని కూర్చుని మాట్లాడుతున్న ప్రదేశం సాగునీటి శాఖకు చెందినదని మంత్రి అనిల్ కుమార్ పేర్కొన్నారు. -
రివర్స్ టెండరింగ్ సక్సెస్: దేశానికి ఆదర్శంగా సీఎం జగన్
సాక్షి, అమరావతి: దేశంలోనే మొట్టమొదటి రివర్స్ టెండరింగ్ సక్సెస్ అయిందని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆనందం వ్యక్తం చేశారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనుల్లో రివర్స్ టెండర్ల ద్వారా గతం కంటే 20.33 శాతం మిగులు లభించిందని, మొత్తం రూ. 290 కోట్ల పనుల్లో దాదాపు రూ. 58 కోట్లు ఖజానాకు ఆదా అయ్యాయని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి మరిన్ని టెండర్లలో రివర్స్ టెండరింగ్ అమలుచేస్తామని అనిల్ కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రివర్స్ టెండర్లలో విజయం సాధించి.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. మాజీ సీఎం చంద్రబాబు తన హయాంలో మాక్స్ ఇన్ఫ్రా కంపెనీకి ఈ పనులు కట్టబెట్టారని, ఇప్పుడు అదే కంపెనీ వాళ్లు 15.7 శాతం తక్కువ ధరకు టెండర్లు వేసి.. ఈ పనులను సొంతం చేసుకున్నారని మంత్రి వివరించారు. ప్రాజెక్టు పనులు అత్యంత పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో జ్యూడిషియల్ ప్రివ్యూ తీసుకువచ్చామని ఆయన తెలిపారు. నవంబర్లోపు టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. గత చంద్రబాబు సర్కారు ప్రాజెక్టు పనుల్లో కమీషన్లు తీసుకోవడంపై పెట్టిన శ్రద్ధ.. ముంపు బాధితులను ఆదుకోవడంపై చూపించలేదని, బాధితులుకు పరిహారం ఇవ్వలేదని తెలిపారు. పోలవరం నిర్వాసితులకు 20వేల ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. రూ. 300 కోట్ల పనుల్లో రూ. 60 కోట్లు ఆదా అయిందని, ఈ లెక్కన గత ప్రభుత్వం ఎంత దోపిడీ చేసిందో తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. టెండర్లలో ఎవరైనా పాల్గొనే అవకాశం ఉందని, కానీ ప్రభుత్వానికి కావాల్సిన వారికే టెండర్లు కట్టబెట్టారని చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పి నిజం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తప్పుబట్టారు. ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అవినీతిరహితంగా, అత్యంత పాదర్శకంగా పనులు చేపడుతున్నామని స్పష్టం చేశారు. గతంలో అడ్డంగా దోచున్నవాళ్లే.. ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేతలపై మంత్రి అనిల్కుమార్ మండిపడ్డారు. చంద్రబాబుకు వయసు పైబడుతోందని, ఆయన ఇకనైనా చిల్లర, చీప్ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు తన హయాంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, కానీ, ఉద్యోగాల విషయంలోనూ ఆయన చీప్గా ఆరోపిస్తున్నారని దుయ్యబట్టారు. ‘70 ఏళ్ళు వచ్చాయి.. గత 40 ఏళ్లలో ఎన్నో దుర్మాగాలు చేశావు.. ఇప్పటికీనా బుద్ధి మార్చుకో’ అని బాబుకు సూచించారు. ఇలాగే ప్రవర్తిస్తే.. భవిష్యత్తులో చంద్రబాబు రాజకీయ మనుగడ కూడా కోల్పోతారని హెచ్చరించారు. వేలకోట్ల రూపాయలు ఆదా చేసేందుకు అన్ని నిర్మాణాల్లోనూ రివర్స్ టెండర్లు అమలు చేస్తామని చెప్పారు. దేవుడు తమవైపు ఉన్నాడని, అందుకే రాష్ట్రమంతా వర్షాలతో పచ్చగా ఉందని, ప్రాజెక్టులన్నీ నిండుగా ఉన్నాయని పేర్కొన్నారు. -
పేపర్ లీక్ అని దరిద్రమైన ప్రచారం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకపోగా, అధికారంలోకొచ్చిన వంద రోజుల్లోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం 1.26 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం చూసి జీర్ణించుకోలేక పేపర్ లీక్ అంటూ దరిద్రమైన ప్రచారం మొదలుపెట్టడం సిగ్గుమాలిన చర్య అని మంత్రి అనిల్కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం నెల్లూరులో మాట్లాడుతూ.. మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నేతల జోక్యం లేకుండా పూర్తి పారదర్శకంగా గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్షలను తమ ప్రభుత్వం నిర్వహించిందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భవిష్యత్ తరాలకోసం చేస్తున్న మహాయజ్ఞాన్ని అధికారులు బాగా నిర్వహించినందుకు అభినందించాల్సిందిపోయి తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో చులకన భావం కలిగించే ప్రయత్నాలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. చంద్రబాబుకు వయస్సు పెరిగినా వంకర బుద్ధి మాత్రం పోలేదని, ప్రభుత్వంపై నిందలు మోపి రాజకీయం చేయాలని చూస్తున్నాడని ఆయన మండిపడ్డారు. -
రొట్టెల పండగలో రాష్ట్రమంత్రులు
రొట్టెల పండగలో కీలక ఘట్టమైన గంధోత్సవంతో బారాషహీద్ దర్గా ప్రాంగణం సుగంధ పరిమళమైంది. స్వర్ణాల తీరం పవిత్రమైంది. భక్త జనులతో రొట్టెల పండగ జన సంద్రంగా మారింది. రెండో రోజూ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. కోరిన కోరికలు నెరవేరిన వారు.. కోరికలతో వచ్చిన వారు భక్తితో సంప్రదాయబద్ధంగా రొట్టెలు ఇచ్చి పుచ్చుకున్నారు. తమ ఇచ్ఛలు నెరవేరాలని భక్తితో షహీదుల సమాధులను దర్శించుకుని ప్రార్థనలు చేశారు. అర్ధరాత్రి తర్వాత జరిగిన గంధోత్సవంలో గంధం కోసం భక్తులు పోటీపడ్డారు. సాక్షి, నెల్లూరు: నెల్లూరు బారాషహీద్ దర్గా ప్రాంగణంలో గంధ మహోత్సవంలో సుగంధపరిమళాలు వెదజల్లాయి. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఉత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. కులాలకు అతీతంగా, మత సామరస్యంగా జరుగుతున్న రొట్టెల పండగకు రెండో రోజు బుధవారం భారీగా భక్తులు పోటెత్తారు. స్వర్ణాల చెరువు తీరాన పవిత్ర స్నానమాచరించి తీరిన కోర్కెలతో భక్తులు రొట్టెలు వదలగా.. కోర్కెలతో వచ్చిన భక్తులు రొట్టెలు పట్టుకున్నారు. అనంతరం బారాషహీద్లను భక్తితో దర్శించుకున్నారు. దేశ, విదేశాల నుంచి వస్తున్న భక్తులు తమ మొక్కులు తీర్చుకుని వెళ్తున్నారు. భద్రత మరింత పటిష్టం రొట్టెల పండగలో ముఖ్య ఘట్టమైన గంధోత్సవం బుధవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో మధ్యాహ్నం నుంచి భక్తులు రాక ద్విగుణీకృతమైంది. దర్గా ప్రాంగణంలోని స్వర్ణాల చెరువు జనసంద్రంగా మారింది. భక్తజనంతో చెరువు కిటకిటలాడింది. ఇప్పటికే భక్తుల రాకను అంచనా వేసి నగర పాలక సంస్థ అధికారులు విస్తృతమైన వసతి ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ భక్తుల రద్దీ లేకుండా చర్యలు చేపట్టారు. దర్గా, స్వర్ణాల చెరువు ప్రాంతాలతో పాటు భక్తుల రద్దీగా ఉండే ప్రదేశాల్లో భద్రతను పోలీస్ కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షించారు. షహీదులను దర్శించుకున్న రాష్ట్రమంత్రులు బారాషహీద్ దర్గా ప్రాంగణంలో జరుగుతున్న రొట్టెల పండగ నేపథ్యంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి, ఇరిగేషన్ శాఖమంత్రి పోలుబోయిన అనిల్కుమార్యాదవ్తో పాటు నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి స్వర్ణాలచెరువులో సంప్రదాయబద్ధంగా కోరికల రొట్టెలను పట్టుకున్నారు. అనంతరం షహీదులను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా భక్తులను పలకరిస్తూ ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. రొట్టెల పండగ ఏర్పాట్లను పరిశీలించారు. వివిధ శాఖల అధికారులతో చర్చించి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ పార్టీ కార్యాలయం ఇన్చార్జి గిరిధర్రెడ్డి, వైఎస్సార్సీపీ యువజన నాయకుడు రూప్కుమార్యాదవ్, అధికారులు ఉన్నారు. కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు భక్తుల సౌకర్యార్థం దర్గా ప్రాంగణంలో పలు స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. భక్తులకు అన్నదానం, వాటర్ ప్యాకెట్లు అందజేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు మెడికల్ క్యాంప్లు నిర్వహిస్తున్నారు. వైభవంగా ‘గంధ’మహోత్సవం బుచ్చిరెడ్డిపాళెం: రొట్టెల పండగలో భాగంగా బుధవారం అర్ధరాత్రి గంధమహోత్సవం వైభవంగా జరిగింది. ప్రధాన ఘట్టమైన గంధమహోత్సవానికి ఏర్పాట్లు మందుస్తుగానే జరిగాయి. తొలుత కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన ప్రత్యేక గంధాన్ని కోటమిట్టలోని అమీనియా మసీదు వద్దకు చేర్చారు. ఖలీఫాలు, సూఫీ మత గురువులు తదితరులు అక్కడికి చేరారు. అప్పటికే సిద్ధం చేసిన ప్రత్యేక బిందెల్లో గంధాన్ని నింపారు. సుగంధ ద్రవ్యాలను అందులో కలిపారు. మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అప్పటికే సిద్ధం చేసిన ప్రత్యేక వాహనంలో గంధం బిందెలను చేర్చారు. బాణసంచా, భక్తి గీతాలాపనల నడుమ వాహనం ముందుకు సాగింది. పురవీధుల మీదుగా ఈద్గా వద్దకు చేరింది. అక్కడ ఉంచి వాటికి ప్రార్థనలు జరిపారు. ఫకీర్లు అబ్బుర పరిచే విన్యాసాలు చేశారు. అనంతరం ఒక బిందెను గుర్రంపై చేర్చి, మిగతా 11 బిందెలను 11 మంది తీసుకుని బారాషహీద్ దర్గాకు చేరారు. అక్కడ కడప పీఠాధిపతి ఖ్వాజా సయ్యద్షా అరీఫుల్లా హుస్సేని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గంధాన్ని షహీద్ల సమాధులకు లేపనం చేశారు. అనంతరం భక్తులకు పంచిపెట్టారు. అధిక సంఖ్యలో చేరుకున్న భక్తులు పరమపవిత్ర గంధాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మతపెద్దలు, మత గురువులు, సూఫీ మత గురువులు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
వాళ్లిద్దరు అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు
సాక్షి, హైదరాబాద్ : ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బివి శ్రీనివాస్కు గాంధీభవన్లో గ్రేటర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్కుమార్ యాదవ్, కాంగ్రెస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా బివి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మోదీ, కేసీఆర్లు అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారారని విమర్శించారు. ఈడీని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. పార్లెజి కంపెనీ మూసేయడంతో వేలమంది ఉద్యోగస్తులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని, ఇందుకు ఉదాహరణగా హర్యానాలో 640 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కథ ముగిసిపోయిన అధ్యాయమని అన్న వారందరికి మా తడాకా చూసిస్తామని , పార్టీలో సరిగా పనిచేయని వారిపై వేటు వేసి కొత్తవారిని తీసుకుంటామని తెలిపారు. సామాన్య కుటుంబంలో పుట్టి ఎటువంటి రాజకీయ అనుభవం లేని కుటుంబం నుంచి వచ్చిన శ్రీనివాస్ ఈ స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉందని అనిల్కుమార్ యాదవ్ వెల్లడించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇస్తానన్న ఉద్యోగాలు, నిరుద్యోగ భృత్తి ఏమైందని ప్రశ్నించారు. -
సీఎంను దూషించిన కేసులో ఐదుగురి అరెస్ట్
సత్యనారాయణపురం (విజయవాడ సెంట్రల్): ఇటీవల ఒక యూట్యూబ్ చానల్లో సీఎం వైఎస్ జగన్ను, మంత్రి పి.అనిల్ కుమార్యాదవ్ని దూషించిన ఐదుగుర్ని సత్యనారాయణపురం పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం తిప్పలకట్ట గ్రామానికి చెందిన కుడిపూడి సోమశేఖర్ (46) పెయిడ్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నాడు. ఇటీవల వరద వల్ల తన పంటకు నష్టం వాటిల్లిందంటూ శేఖర్తోపాటు అదే గ్రామానికి చెందిన బొంతలపాటి శివప్రసాద్ అలియాస్ ప్రసాద్ (46), కొండూరి సీతారామయ్య (34), నిడుమోలు శివయ్య (35), అనంతవరం గ్రామానికి చెందిన సత్యేంద్ర (39) కలసి ప్రభుత్వ ప్రతిష్టను భంగపరచాలన్న ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్, మంత్రి అనిల్లను దుర్భాషలాడారు. దీనిని తమ మొబైల్స్ ద్వారా వీడియో తీసి యూట్యూబ్, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. దీనిపై పలు సంఘాల నాయకులు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. నార్త్జోన్ ఏసీపీ షర్ఫుద్ధీన పర్యవేక్షణలో సత్యనారాయణపురం సీఐ బాలమురళీకృష్ణ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఆ ఐదుగురినీ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే బుకింగ్ సమీపంలో అరెస్ట్ చేసి, వీడియో తీసిన మొబైల్స్ను స్వాధీనం చేసుకున్నారు. వారిపై ఐపీసీ సెక్షన్లు 153, 153ఏ, 505(2) రెడ్విత్ 34, 120బీ కింద కేసు నమోదు చేశారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా వచ్చే నెల 7 వరకు రిమాండ్ విధించారు. -
పెయిడ్ ఆర్టిస్టులతో టీడీపీ తప్పుడు ప్రచారం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై, జల వనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్పై తెలుగుదేశం పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు అనుచిత వ్యాఖ్యలు చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తప్పుడు ప్రచారంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను ప్రజల్లో పలుచన చేయడమే కుట్రదారుల ఉద్దేశమని భావిస్తున్నారు. ఒకవైపు వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ యంత్రాంగం తలమునకలై ఉంటే మరోవైపు టీడీపీ పనిగట్టుకుని బురద రాజకీయం చేయడానికి పెయిడ్ ఆర్టిస్టులను వాడుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ప్రచారం కోసం వినియోగించిన జూనియర్ ఆర్టిస్టులను, పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దించి రాష్ట్ర ప్రభుత్వంపై విష ప్రచారం సాగించారు. టీడీపీ పెద్దల డైరెక్షన్లో రెచి్చపోయిన పెయిడ్ ఆర్టిస్టులు ఏకంగా మంత్రి అనిల్కుమార్ యాదవ్ను కులం పేరుతో దూషించారు. కుల వృత్తిని కించపరిచే వ్యాఖ్యలు చేశారు. వరద బాధితులం అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ సదరు వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. టీడీపీ పెయిడ్ ఆర్టిస్టుల తీరుపై యాదవ సంఘం ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. తొలుత విజయవాడ సత్యనారాయణపురం, కృష్ణా జిల్లా తిరువూరు, ఎ.కొండూరు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. గుంటూరు, ఉభయ గోదావరి, వైఎస్సార్, నెల్లూరు, చిత్తూరు తదితర జిల్లాల్లో ఫిర్యాదుల పరంపర కొనసాగింది. ఒక కులాన్ని, వృత్తిని కించపరచడంతోపాటు వ్యక్తిగత దూషణలు చేస్తూ పెట్టిన సోషల్ మీడియా పోస్టింగ్లపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. దీని వెనుక ఎవరున్నారన్న దానిపై తీగ లాగుతున్నారు. గుట్టు బయటపెట్టిన శేఖర్ చౌదరి టీడీపీ పెయిడ్ ఆర్టిస్టు కుడితిపూడి శేఖర్ చౌదరిని విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అతడు ఇచ్చిన సమాచారంతో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శివప్రసాద్, సీతారామయ్య, శివయ్య అనే మరో ముగ్గురు ఆర్టిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై పోలీసులు ఆరా తీయగా శేఖర్ చౌదరి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడానికి తాను ఒక్కడినే కాదని, తమ లాంటి టీమ్లు చాలా పనిచేస్తున్నాయని గుట్టు విప్పినట్టు ప్రచారం సాగుతోంది. తమలాంటి వారికి నెలవారీగా వేతనాలు ఇచ్చి, ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేయడానికి వాడుకుంటున్నారని వివరించినట్టు తెలిసింది. ప్రతి అంశంలోనూ ప్రభుత్వంపై లేనిపోని విమర్శలతో ఆడియోలు, వీడియోలు రూపొందిస్తున్నామని శేఖర్ చౌదరి అంగీకరించాడు. టీడీపీ నేతలే నిర్మాతలు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విష ప్రచారం చేయడానికి టీడీపీ నేతలే డబ్బులు సమకూరుస్తున్నారని శేఖర్ చౌదరి వెల్లడించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి తెరవెనుక భారీ కుట్ర జరుగుతోందని పోలీసులు అంచనాకు వచ్చారు. దీని వెనుక ఎంతటి బడా బాబులున్నా ఉపేక్షించేది లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. -
అనుచిత పోస్టింగ్లపై కేసు నమోదు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్లపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగ్లు పెట్టడంపై బుధవారం పోలీసులుకేసు నమోదు చేశారు. సీఎం, మంత్రిని కులం పేరుతో దూషిస్తూ అసభ్య పదజాలంతో కొంత మంది ఫేస్బుక్లో పోస్టింగులు పెట్టి వైరల్ చేశారు. వీటిపై కృష్ణా జిల్లా సత్యనారాయణపురం, తిరువూరు, ఏ కొండూరు పోలీసుస్టేషన్లలో అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో ఇందుకు కారణమైన వారిపై చర్య తీసుకోవాలంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు చేయాలి.. ఫిర్యాదుల వెల్లువ.. కుల వృత్తులను కించపరుస్తూ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులను వెంటనే అరెస్ట్ చేయాలని రాష్ట్ర యాదవ సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం గుంటూరు రూరల్ మండలం నల్లపాడు పోలీస్ స్టేషన్ సీఐ కె.వీరాస్వామికి ఫిర్యాదు చేశారు. యాదవుల గురించి సోషల్ మీడియాలో మాట్లాడిన వ్యక్తి గతంలో టీడీపీ ప్రచారకర్తగా పని చేశాడని, అనుచిత వ్యాఖ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా యాదవుల మనోభావాలను దెబ్బతీశాడన్నారు. కాగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రి అనిల్కుమార్ యాదవ్లపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని బీసీ నాయకుడు పడమటి జగదీష్కుమార్ బుధవారం గుంటూరు జిల్లా పెదకాకాని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శృతి మించిన విద్వేషం... పెదకాకాని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న వైఎస్సార్సీపీ బీసీ నేతలు పులివెందుల: తెలుగుదేశం పార్టీ నేతలకు యాదవులంటే ఎందుకంత అక్కసు? అని వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన కార్యనిర్వాహక అధ్యక్షుడు హరీష్కుమార్ యాదవ్ బుధవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. ఎన్నికల్లో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలినా.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రి అనిల్కుమార్ యాదవ్లను అసభ్య పదజాలంతో దూషించే స్క్రిప్టు వీడియోలను చంద్రబాబు, లోకేష్ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసి రాక్షాసానందం పొందుతున్నారని మండిపడ్డారు. వరద పరిస్థితులను అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఆదుకున్న ప్రభుత్వ యంత్రాంగాన్ని, మంత్రులను మెచ్చుకోవాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. యాదవ సామాజికవర్గంపై దుష్ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. -
మోసం చేయడం టీడీపీ నైజం
సాక్షి, నెల్లూరు: ఒకే అబద్దాన్ని పదేపదే చెప్పి ప్రజలను మోసం చేయడం టీడీపీ నైజమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్యాదవ్ విమర్శించారు. నగరంలోని 52వ డివిజన్ రంగనాయకులపేటలో గల రైల్వే గేట్ ప్రాంతం, 47వ డివిజన్ కుక్కలగుంట, మహాలక్ష్మమ్మ గుడి ప్రాంతాల్లో మంగళవారం పర్యటించిన ఆయన ప్రజా సమస్యలను ఆరాతీశారు. వెంటనే పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సోమశిలకు నీరు రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. నాలుగో తేదీనే వదిలి ఉంటే సోమశిల నిండేదంటూ ఓ టీడీపీ నేత మాట్లాడటం బాధాకరమన్నారు. నాలుగో తేదీన నీరొదిలితే సోమశిలకు చేరేందుకు 12 రోజులు పడుతుందని, 16 నాటికి సోమశిలకు నీరు చేరిందని చెప్పారు. ఈ విషయమై కనీస అవగాహన లేకుండా మాట్లాడటం సదరు నేతకే చెల్లిందని ఎద్దేవా చేశారు. అవగాహన లేకుండా విమర్శలు చేసే పద్ధతిని ఇప్పటికైనా విడనాడాలని హితవు పలికారు. ఆరు రోజుల పాటు 8 లక్షల క్యూసెక్కుల నీరొస్తే కొద్ది సమయంలోనే ఏడు లక్షల క్యూసెక్కులకు సర్దుబాటు చేయగలిగామని వివరించారు. 845 లెవల్లోనే 44 వేల క్యూసెక్కులు తీసుకోలేకపోయారని ఓ నాయకుడు పత్రికల్లో మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్మోహన్రెడ్డి సీఎం కాగానే రాష్ట్రంలో మూడు జలాశయాలు నిండాయని, సోమశిల, కండలేరులో సైతం నీటిని నింపుతామని, రైతులకు పూర్తిస్థాయిలో నీరందిస్తామని ప్రకటించారు. నీతి, నిజాయతీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. సీఎంగా చంద్రబాబు 14 ఏళ్లు పనిచేశారని, 1998లో వరద వచ్చిందన్నారు. ఆయన చేతగానితనంతో శ్రీశైలం పవర్ హౌస్ను ముంచేశారని మండిపడ్డారు. గోదావరి పుష్కరాల్లో 35 మంది, కృష్ణా నదిలో ఐదుగుర్ని బలిగొన్న మీ వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని టీడీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏ లెవల్ నుంచి ఎంత నీరు తీసుకోవాలో అంత సామర్థ్యం మేరే తీసుకెళ్తామని వివరించారు. పార్టీ నేతలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
రీ టెండరింగ్తో ప్రజాధనం ఆదా
సాక్షి, అమరావతి బ్యూరో: గోదావరి నదికి వరద తగ్గుముఖం పట్టగానే నవంబర్ 1వ తేదీ నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలు, అవకతవకలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి విడుదల చేస్తున్న నీటి ప్రవాహాన్ని శనివారం సాయంత్రం మంత్రులు అనిల్కుమార్ యాదవ్, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా అనిల్కుమార్ మాట్లాడుతూ... టీడీపీ ప్రభుత్వ హయాంలో నామినేషన్ పద్ధతిపైనే రూ.10,000 కోట్ల పనులను కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించారని, ఇందులో భారీగా అవినీతి చోటుచేసుకుందని చెప్పారు. పోలవరంపై రీ టెండరింగ్ నిర్వహించడం వల్ల ప్రజాధనం మిగులుతుంది తప్ప వృథా కాదని స్పష్టం చేశారు. రీ టెండరింగ్ వల్ల బేసిక్ ప్రైస్ తగ్గుతుందని వెల్లడించారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి 8 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. సీఎంతి వైఎస్ జగన్ అమెరికా నుంచి గంటగంటకూ వరద పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారని, ఆయన సూచన మేరకు మంత్రులు, అధికారులూ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందజేస్తామన్నారు. అంటు వ్యాధులు ప్రబల కుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. ఇదే వరద టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి ఉంటే.. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్కు మతి భ్రమించిందని అనిల్కుమార్ విమర్శించారు. వారిద్దరూ ఎక్కడో కూర్చొని వరద విషయంలో ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వరద నియంత్రణ చేతకాక 1998లో శ్రీశైలం పవర్ ప్రాజెక్టును ముంచేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. జలాశయాలు నిండి రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తుండడం చూసి టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ఇదే వరద టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చినట్లయితే శ్రీశైలం, సాగర్, పులిచింతల గేట్లను ఎత్తి జలహారతి పేరుతో రూ.100 కోట్లు దోచుకునేవారని దుయ్యబట్టారు. వరదను కూడా రాజకీయం చేస్తారా?:బొత్స వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. వరదల కారణంగా కృష్ణా జిల్లాలో బాలిక మృతి చెందిందని, ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వరదల విషయంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించగలిగామని తెలిపారు. ప్రకాశం బ్యారేజీ భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. వరదను కూడా రాజకీయం చేయడం చంద్రబాబుకు తగదని బొత్స సత్యనారాయణ హితవు పలికారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవీలత, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
అవి నరం లేని నాలుకలు
సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో/మంగళగిరి : ప్రతిపక్ష నేత చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా సహా టీడీపీ నేతలవి నరం లేని నాలుకలని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రభావాన్ని అంచనా వేసేందుకు డ్రోన్ కెమెరాతో చిత్రీకరిస్తే చంద్రబాబు భద్రతకు ముప్పు అంటూ గగ్గోలు పెడుతున్నారని దుయ్యబట్టారు. వరద ఉధృతికి ఒకవేళ చంద్రబాబు ఇల్లు మునిగిపోతే ప్రభుత్వం పట్టించుకోలేదని టీడీపీ నేతలు విమర్శలు చేసేవారన్నారు. శుక్రవారం సచివాలయంలో మంత్రులు అనిల్కుమార్, కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో వరద పరిస్థితిని తెలుసుకోవడానికి డ్రోన్ కెమెరా వినియోగిస్తే టీడీపీ నేతలకు వచ్చిన బాధ ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నట్టు శ్రీశైలంతో సహా మిగిలిన ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండిన తర్వాతే కిందకు నీళ్లు వదలడం మొదలుపెట్టి ఉంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకేసారి 12 లక్షల క్యూసెక్కులను కిందకు వదలాల్సి ఉంటుందని, అదెంత ప్రమాదకరమో తెలియదా అని నిలదీశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు తన ఇంట్లో అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నారా? వరద ప్రవాహాన్ని అంచనా వేసేందుకు డ్రోన్లతో చిత్రీకరిస్తే ఆయనకు ఎందుకు అంత ఉలికిపాటు అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. రాష్ట్రంలోని జలాశయాలు నిండుకుండల్లా మారడంతో రైతులు, ప్రజలు ఆనందంగా వేడుకలు చేసుకుంటుంటే, టీడీపీ నేతలు మాత్రం ఏడుపు మొహాలు వేసుకుని నిందలు వేస్తున్నారని విమర్శించారు. నలభై ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకుని, సామాజిక బాధ్యతతో వ్యవహరించి వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వానికి సహకరించాలని ఎమ్మెల్యే ఆర్కే హితవు పలికారు. -
రెండు పంటలకు ఢోకా లేనట్లే!
నాగార్జునసాగర్: కృష్ణా, గోదావరి బేసిన్లు కొత్తనీటితో కళకళ్లాడుతున్నాయి. రెండు రాష్ట్రాల రైతులకు.. రెండు పంటలకు సరిపోయేంతనీరు జలాశయాల్లోకి చేరుతోందని మంత్రి జి.జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం నాగార్జునసాగర్ ఎడమకాల్వకు ఆంధ్రప్రదేశ్ భారీనీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్తో కలిసి ఆయన నీటిని విడుదల చేశారు. అనంతరం కృష్ణమ్మకు సారెచీరలతోపాటు పూలమాలలు, పసుపు కుంకుమతో వాయినమిచ్చారు. సీఎం కేసీఆర్ కృష్ణా, గోదావరి నదుల్లోని ప్రతి చుక్క నీటిని ఒడిసిపట్టి తెలంగాణలోని బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నారని చెప్పారు. పక్కరాష్ట్రాలతో స్నేహపూర్వకంగా మెలిగి అభివృద్ధి చెందడం ఎలాగో సీఎం కేసీఆర్ ఆచరించి చూపారని పేర్కొన్నారు. కలిసిమెలిసి ఉంటూ.. సహజవనరులను సద్వినియోగం చేసుకుని ఇరురాష్ట్రాల రైతాంగాని కి లబి్ధచేకూరేలా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నా రు. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్లిద్దరు.. కలిసి ఉంటే కలదు సుఖం అని నిరూపించారని అనిల్కుమార్ యాదవ్ అన్నారు. ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వకు కూడా.. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం గణపు రం సమీపంలోని ఏఎమ్మార్పీ ప్రధాన గేటు నుంచి ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వకు మంత్రి జగదీశ్రెడ్డి నీటిని విడుదల చేశారు. పెద్దవూర మండలం పూల్యాతండా సమీపంలోని పంప్హౌజ్ ద్వారా ఏఎమ్మార్పీ లో–లెవల్ వరద కాల్వకు 320 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమాల్లో బండా నరేందర్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు నర్సింహయ్య, భాస్కర్రావు, భూపాల్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, రవీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. సాగర్కు భారీగా పెరిగిన వరద నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సాగర్ రిజర్వాయర్లో గంటకో అడుగు చొప్పున నీటిమట్టం పెరుగుతుండటంతో సోమవారం గేట్లు ఎత్తనున్నట్లు తెలిసింది. తెలం గాణ, ఏపీ మంత్రులు నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు సమాచారం. లక్ష్మి బ్యారేజీలో 65 గేట్ల ఎత్తివేత కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరికి వరద ఆదివారం నిలకడగా 9.39 మీటర్ల ఎత్తుతో ప్రవహిస్తోంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మి (మేడిగడ్డ) బ్యారేజీలో 65 గేట్లు ఎత్తిగా దిగువకు 3.26 లక్షల క్యూసెక్కుల వరద వెళ్తోంది. -
జిల్లా సమగ్రాభివృద్ధికి నా వంతు కృషి: హోంమంత్రి
సాక్షి, నెల్లూరు(అర్బన్): ‘ప్రజలకు పారదర్శక పాలన అందిస్తాం. జిల్లా సమగ్రాభివృద్ధికి నా వంతు కృషి చేస్తా’ అని రాష్ట్ర హోంమంత్రి, జిల్లా ఇన్చార్జి మేకతోటి సుచరిత తెలిపారు. జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశాన్ని నెల్లూరులోని దర్గామిట్టలో ఉన్న నూతన జెడ్పీ శనివారం నిర్వహించారు. సమావేశంలో ప్రధానంగా నీటి సమస్యను ఎమ్మెల్యేలు మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. తీవ్రంగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తానని జిల్లా ఇన్చార్జి మంత్రి, హోం మంత్రిమేకతోటి సుచరిత, హామీ ఇచ్చారు. తాగునీటి సమస్య పరిష్కారానికి బోర్లు వేయిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తామని తెలిపారు. ఈ విషయంలో సీఎం ఎంతో పట్టుదలతో ఉన్నారన్నారు. పేదలకు విద్య, వైద్యం అందాలన్నదే ఆయన ధ్యేయమని చెప్పారు. ఉగాది నాటికి అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు అందజేస్తామని, అభివృద్ధి – సంక్షేమాన్ని సమంగా చూస్తామని తెలిపారు. సచివాలయాలతో ప్రజలకు ఎంతో మంచి జరుగుతుందని చెప్పారు. పారదర్శకంగా పాలన అందిస్తామన్నారు.పాఠశాలలు, గ్రామాలు, వైద్యశాలల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పనిచేస్తామని పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా సైన్స్ సెంటర్ను సైతం అభివృద్ధి చేస్తామన్నారు.జిల్లాలోని ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్కుమార్ యాదవ్ పేర్కొన్నారు. కార్పొరేషన్లో భూగర్భ, తాగునీటి పథకాలకు హడ్కో లోన్ ఇచ్చిందని, దీనికి సంబంధించి ఈ సంవత్సరం రూ.180 కోట్లు చెల్లించాలన్నారు. ఇది కార్పొరేషన్కు మోయలేని భారమని చెప్పినా నాటి పాలకులు వినలేదని విమర్శించారు. కార్పొరేషన్ను అప్పుల నుంచి బయటపడేసే మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. సమావేశంలో తొలుత కలెక్టర్ శేషగిరిబాబు మాట్లాడుతూ తాగునీటి ఎద్దడిపై వివరణ ఇవ్వాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగజ్యోతిని కోరారు. దీంతో ఆమె మాట్లాడుతూ గత సంవత్సరం ఇదే కాలానికి 50 గ్రామాల్లో నీటిని టాంకర్ల ద్వారా సరఫరా చేశామన్నారు. ఈ సంవత్సరం తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 423 గ్రామాల్లో తాగునీటిని టాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నట్లుగా చెప్పారు. భూగర్భజలాలు అందుబాటులో లేవన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వరప్రసాద్రావు, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం తమ ప్రాంతాల్లో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యను వివరించారు. ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ అధికారులు తాగునీటి ఎద్దడిపై నివేదిక తయారుచేస్తూ కలువాయి, డక్కిలి తదితర మూడు మండలాలను ఏ ప్రాతిపాదికన విస్మరించారని నిలదీశారు. గత టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇప్పుడైనా సక్రమంగా ప్రణాళిక సిద్ధం చేయాలని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పుడు తయారుచేసే నివేదికలో అన్ని ప్రాంతాలు కవర్ చేసినట్టుగా తెలిపారు. తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం మంజూరుచేసిన నిధులను ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి రూ.కోటి నిధులు రానున్నందున ఈలోగా తాగునీటి బోర్లు, ఇతర మరమ్మతులకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలని కోరారు. 20 ఎకరాలను పోలంరెడ్డి కబ్జా చేశారు నా నియోజకవర్గంలోని బొడ్డువారిపాళెంలో బడుగు, బలహీనవర్గాలకు చెందిన నిషిద్ధ భూములు 20 ఎకరాలున్నాయి. వీటిని గతంలో ఎమ్మెల్యేగా ఉన్న పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కబ్జా చేశారు. తండ్రి, అత్తల పేరుతో పట్టాలు పుట్టించాడు. తహసీల్దారు అడంగళ్లో పేర్లు ఎక్కించి పోలంరెడ్డికి పట్టాలు ఇచ్చారు. ఇది సిగ్గు చేటు. ఆ భూములను తీసుకుని పేదలకు పంచాలి. పాఠశాలల్లో మధ్యాహ్నం పెడుతున్న భోజనంలో రాళ్లు, పురుగులు ఉంటున్నాయి. గత ప్రభుత్వం విద్యార్థుల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇలా జరిగేందుకు వీలు లేదు. వెంటనే మంచి బియ్యాన్ని సరఫరా చేయాలి. కబ్జా భూముల విషయమై జేసీ వెట్రిసెల్వి స్పందించి ఇచ్చిన పట్టాలను రద్దు చేయిస్తామన్నారు. – నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, ఎమ్మెల్యే, కోవూరు ఫీల్డ్ అసిస్టెంట్లుగా కొత్తవారిని నియమించాలి ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు అవినీతికి కేరాఫ్గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు దోచిపెట్టే విధంగా మారారు. మారారు. అందువల్ల ఈ వ్యవస్థను ప్రక్షాళన చేసి కొత్తవారిని నియమించాలి. ఇదే విషయమై ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ గత ప్రభుత్వం అసలైన ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేసి వారి స్థానంలో దోపిడీకి ఉపయోగపడే టీడీపీ కార్యకర్తలను నియమించుకుంది. వెంటనే ప్రక్షాళన చేయాలి. – ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే, వెంకటగిరి టౌన్ బస్సులు నడిచేలా చూడాలి ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరే పిల్ల ల సంఖ్య పెరిగింది. అయితే నెల్లూరు జిల్లాలోనే అతి తక్కువగా ఉంది. ఇక్కడ టీచర్లుండే చోట విద్యార్థులు లేరు. విద్యార్థులు ఎక్కువగా ఉండే చోటకు టీచర్లు వెళ్లడం లేదు. రెండు కిడ్నీలు బాగోలేనివారికి డెప్యుటేషన్ వేయమన్నా వేయని అ«ధికారులు బాగున్న వారికి ఎందుకు వేస్తున్నారు. డీఈఓ సమాధానం చెప్పాలి. ఈ పరిస్థితిని కలెక్టర్ చక్కదిద్దాలి. కేంద్రీయ విద్యాలయానికి టౌన్ బస్సులు నడిచే విధంగా చూడాలి. – వి.బాలసుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ తెలుగుగంగ ద్వారా నీరివ్వాలి సూళ్లూరుపేట ప్రాంతానికి స్వర్ణముఖి మినహా ఇక ఎలాంటి నీటి ఆధారం లేదు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు తెలుగుగంగ కాలువలను పొడిగించి తమ ప్రాంతవాసులను ఆదుకోవాలి. అలాగే చెరువులను పూడిక తీయించి నీటితో నింపాలి. – కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్యే, సూళ్లూరుపేట గూడూరును గ్రేడ్ –1 మున్సిపాలిటీగా మార్చాలి గూడూరును గ్రేడ్–1 మున్సిపాలిటీగా మార్చేందుకు ప్రతిపాదనలు పంపాలి. ఇందువల్ల గూడూరుకు రూ.100 కోట్లు నిధులు వస్తాయి. అభివృద్ధి జరుగుతుంది. తెలుగుగంగ ద్వారా నీరందించాలి. – వెలగపల్లి వరప్రసాద్రావు, ఎమ్మెల్యే, గూడూరు పనులు పూర్తయ్యేలా చూడాలి నెల్లూరు నగరంలో గత ప్రభుత్వం తాగునీటి పథకానికి, భూగర్భ డ్రెయినేజీకి రూ.1,100 కోట్ల నిధులతో పనులు ప్రారంభించింది. పనులు నాసిరకంగా జరిగాయి. రూ.300 కోట్ల సిప్ నిధులతో రోడ్లు ప్రారంభించారు. పనులు కూడా సుమారు 90 శాతం పూర్తయ్యాయి. బిల్లులు 80 శాతం వరకు ఇచ్చినా కొన్నిచోట్ల కాంట్రాక్టర్లు పనులు ఆపేశారు. పబ్లిక్హెల్త్ అధికారులు, కార్పొరేషన్ అధికారులు కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు 100 శాతం పూర్తయ్యేలా చూడాలి. – కోటంరెడ్డి, శ్రీధర్రెడ్డి, ఎమ్మెల్యే, నెల్లూరు రూరల్ లోపాలను సరిదిద్దాలి జిల్లాలో రైతులు పంటలు వేసుకునేందుకు విత్తన కొరత లేకుండా వ్యవసాయ అధికారులు చర్యలు చేపట్టాలి. రాయితీలు పొందేందుకు గత ప్రభుత్వం రైతులకు బయోమెట్రిక్ పద్ధతిని ప్రవేశపెట్టిందన్నారు. అన్ని గ్రామాల్లో పాస్పుస్తకాలతో అధికారుల వద్దకు వెళ్లలేని ముసలివారు ఉన్నారు. వారు బయోమెట్రిక్ వేద్దామన్నా వేలిముద్రలు పడడంలేదు. అధికారులు పాస్పుస్తకాల్లో బిడ్డల పేర్లు ఉండేలా మార్చుకుని రావాలని అంటున్నారు. ఇదేలా సాధ్యం?. ఈ లోపాలను సరిదిద్దాలి. అదేవిధంగా విద్యుత్ సంస్థలో ఏఈలు, ఇతర సిబ్బంది అతి తక్కువగా ఉన్నారు. నూతన ప్రభుత్వం పగటిపూట విద్యుత్ను సరఫరా చేయమన్నా కొన్నిచోట్ల అధికారులు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దాలి. – కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎమ్మెల్యే, సర్వేపల్లి -
పారదర్శకం.. శరవేగం..
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులను పారదర్శకంగా, శరవేగంగా పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే సంకల్పంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. టీడీపీ సర్కార్ హయాంలో పోలవరం పనుల్లో అంతులేని దోపిడీ జరిగిందని 2018 సెప్టెంబరు 19న కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) పార్లమెంట్కు నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల టీడీపీ పాలనలో ఇంజనీరింగ్ పనుల్లో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ కూడా ‘కాగ్’ నివేదికలో అంశాలు అక్షర సత్యమని తేల్చింది. ఈమేరకు జూలై 24న ప్రభుత్వానికి నివేదిక అందచేసింది. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు పోలవరంలో మిగిలిపోయిన పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. నిబంధనలకు విరుద్ధంగా హెడ్వర్క్స్ పనులను నామినేషన్పై దక్కించుకుని తీవ్ర జాప్యం చేస్తున్న నవయుగ, బీకెమ్ సంస్థలను ఒప్పందం నుంచి వైదొలగాలని సూచిస్తూ జూలై 29న పోలవరం సీఈ నోటీసులు కూడా ఇచ్చారు. మిగిలిన పనులకు రివర్స్ టెండరింగ్ ద్వారా అక్టోబర్ నాటికి కొత్త కాంట్రాక్టర్లను ఎంపిక చేయనున్నారు. భారీ ఎత్తున ప్రజాధనాన్ని ఆదా చేయడంతోపాటు నవంబర్ 1 నుంచి పనులు ప్రారంభించి 2020 నాటికి పూర్తి చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. కమీషన్ల దాహంతో.. పోలవరం హెడ్వర్క్స్ పనులను 2013లో ట్రాన్స్ట్రాయ్ దక్కించుకున్న సమయంలో సత్తా లేని సంస్థకు ఎలా అప్పగిస్తారని అభ్యంతరం తెలిపిన విపక్ష నేత చంద్రబాబు అనంతరం రాయపాటి సాంబశివరావు టీడీపీలో చేరడంతో మాట మార్చారు. విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వమే వంద శాతం పోలవరం వ్యయాన్ని భరించి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలి. ఈమేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)తో ఒప్పందం చేసుకోవాలన్న సూచనను కమీషన్ల దాహంతో చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యపెట్టలేదు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి పోలవరం నిర్మాణ బాధ్యతలను 2016 సెప్టెంబరు 7న చంద్రబాబు సర్కారు దక్కించుకుంది. ఆ మరుసటి రోజే నిబంధనలకు విరుద్ధంగా అంచనా వ్యయాన్ని రూ.1,331.91 కోట్లు పెంచేసి ట్రాన్స్ట్రాయ్కి లబ్ధి చేకూర్చారు. ఆ సంస్థను అడ్డుపెట్టుకుని పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారు. ఏటీఎంలా మార్చారంటూ బాబుపై ప్రధాని విమర్శలు పోలవరం జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులను 4.83 శాతం ఎక్సెస్ ధరకు అంటే రూ.3,220.22 కోట్లకు కోట్ చేసిన నవయుగకు 2017 డిసెంబర్ 30న గత సర్కారు కట్టబెట్టింది. పోలవరం హెడ్ వర్క్స్లో జలవిద్యుదుత్పత్తి కేంద్రం పునాది పనులు అంతర్భాగమే. ట్రాన్స్ట్రాయ్ దివాలా తీయడంతో ఆ పనులనూ నవయుగకే అప్పగించి అటు జలవిద్యుదుత్పత్తి కేంద్రం, ఇటు హెడ్వర్క్స్లో కమీషన్లు కాజేయడానికి స్కెచ్ వేశారు. ట్రాన్స్ట్రాయ్తో ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండానే 60సీ నిబంధన కింద వేటు వేసి పాత ధరల ముసుగులో రూ.2,914.66 కోట్ల పనులు నవయుగకు, రూ.387.56 కోట్ల విలువైన గేట్ల పనులు బీకెమ్కు అప్పగించారు. ఈ వ్యవహారంలో భారీఎత్తున ముడుపులు చేతులు మారాయి. దీన్నే ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రస్తావించిన ప్రధాని నరేంద్ర మోదీ.. పోలవరాన్ని చంద్రబాబు కమీషన్ల కోసం ఏటీఎంలా మార్చుకున్నారని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ ఆరోపణలు అక్షర సత్యమని పార్లమెంట్కు సమర్పించిన నివేదికలో కాగ్ కూడా తేల్చింది. ఈ పాపం ఎవరిది? పోలవరం హెడ్వర్క్స్లో రూ.2,914.66 కోట్ల విలువైన పనులను ఎల్ఎస్ (లంప్సమ్)–ఓపెన్ పద్ధతిలో నిబంధనలకు విరుద్ధంగా నవయుగకు నామినేషన్పై అప్పగిస్తూ గత సర్కారు మూడు ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇదే రీతిలో గేట్ల పనులను 60 సీ నిబంధన కింద విడదీసి రూ.387.56 కోట్లకు బీకెమ్కు నామినేషన్పై అప్పగిస్తూ మరో ఒప్పందాన్ని చేసుకుంది. కానీ ఒప్పందం మేరకు పనులు చేయడంలో నవయుగ, బీకెమ్ విఫలమయ్యాయి. స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులు పూర్తి చేయకుండానే, నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండానే గత ఎన్నికలకు ముందు చంద్రబాబు కాఫర్ డ్యామ్ పనులు ప్రారంభించారు. వరద ప్రారంభమయ్యేలోగా పునరావాసం, కాఫర్ డ్యామ్ల పనులు పూర్తి చేయాల్సి ఉన్నా సగం కూడా పూర్తి కాలేదు. గోదావరికి వరదలు వస్తే తీవ్ర ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేసిన పీపీఏ మే నెలలో ఈ పనులను నిలిపివేసింది. నవయుగ, బీకెమ్, గత సర్కార్ ప్రణాళికా లోపం కారణంగానే నవంబర్ వరకు పోలవరం పనులు చేయలేని దుస్థితి నెలకొంది. గత సర్కారు నిర్వాకంతో పోలవరం హెడ్వర్క్స్లో రూ.3,128.31 కోట్లకుపైగా దోచేశారని నిపుణుల కమిటీ నిర్ధారించింది. నిపుణుల కమిటీ నిగ్గు తేల్చింది ఇదీ.. - పోలవరంలో కాంట్రాక్టు ఒప్పందం గడువు ముగియకుండానే 2015–16 ధరలను వర్తింపజేస్తూ అంచనా వ్యయాన్ని రూ.5,535.91 కోట్లకు పెంచుతూ గత సర్కారు ఉత్తర్వులు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం. కాంట్రాక్టర్కు రూ.1,331.91 కోట్ల మేరకు ప్రయోజనం చేకూర్చారు. స్పెషల్ ఇంప్రెస్ట్ అమౌంట్, మొబిలైజేషన్లు అడ్వాన్సులు పూర్తిగా వసూలు చేయలేదు. మొత్తానికి హెడ్ వర్క్స్లోనే రూ.1,559.65 కోట్లను కాంట్రాక్టర్కు దోచిపెట్టారు. - హెడ్ వర్క్స్ నుంచి 60 సీ నిబంధన కింద ట్రాన్స్ట్రాయ్ని తొలగించి స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులను ఎల్ఎస్(లంప్సమ్)–ఓపెన్ విధానంలో రూ.2,914.66 కోట్లకు నవయుగకు నామినేషన్పై కట్టబెట్టేశారు. గేట్ల పనులను రూ.387.56 కోట్లకు బీకెమ్కు నామినేషన్పై అప్పగించేశారు. ట్రాన్స్ట్రాయ్తో ఈపీసీ ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండానే ఎల్ఎస్–ఓపెన్ విధానంలో మరో కాంట్రాక్టర్కు పనులు అప్పగించడం నిబంధనలకు విరుద్ధం. టీడీపీ సర్కారు నిర్వాకాలపై ‘కాగ్’ ఏమన్నదంటే..? - పోలవరం హెడ్వర్క్స్ను ఒప్పందం ప్రకారం పూర్తి చేయటంలో విఫలమైన కాంట్రాక్టర్కు నిబంధనల మేరకు జరిమానా విధించకుండా అంచనా వ్యయాన్ని రూ.1,331.91 కోట్లు పెంచడం ఆయాచితంగా లబ్ధి చేకూర్చడం కాదా? - హెడ్వర్క్స్ అంచనా వ్యయాన్ని పెంచిన నేపథ్యంలో కాంట్రాక్టర్ నుంచి ఫెర్ఫార్మెన్స్ సెక్యూరిటీ కింద రాబట్టాల్సిన రూ.66.59 కోట్లను వసూలు చేయలేదు. - నిబంధనలకు విరుద్ధంగా రూ.25.37 కోట్ల స్టీలును కొనుగోలు చేసి హెడ్ వర్క్స్ కాంట్రాక్టర్కు సరఫరా చేసింది. యంత్రాలపై రూ.5.72 కోట్ల దిగుమతి సుంకాన్ని కూడా కాంట్రాక్టర్కు బదులుగా ప్రభుత్వమే చెల్లించింది. నిబంధనలు ఉల్లంఘించి కాంట్రాక్టర్కు టీడీపీ సర్కార్ భారీ ప్రయోజనం చేకూర్చినా పనుల్లో ఏమాత్రం పురోగతి లేదు. 2017 జూన్ నాటికి 76 శాతం పనులు పూర్తి కావాల్సి ఉండగా కేవలం 31 శాతం పనులు మాత్రమే పురోగతిలో ఉన్నాయి. రెండేళ్లలో పూర్తి చేసే లక్ష్యంతో.. పోలవరాన్ని 2020 నాటికి పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించిన నేపథ్యంలో నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు పనులు చేయని బీకెమ్, నవయుగలకు కాంట్రాక్టుఒప్పందం 89.3 క్లాజ్ ప్రకారం వైదొలగాలంటూ ఇప్పటికే నోటీసులు జారీ అయ్యాయి. హెడ్ వర్క్స్లో మిగిలిన పనులతోపాటు జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద టెండర్ పిలిచేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందుకు పీపీఏ, కేంద్ర జల్ శక్తి శాఖల అనుమతి అవసరం. ఈ క్రమంలో కేంద్రం, పీపీఏ అనుమతి తీసుకుని ఆ పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. దీనివల్ల భారీగా ప్రజాధనం ఆదా కావడంతోపాటు రెండు పనులను ఒకే కాంట్రాక్టర్ చేయడం వల్ల సమన్వయం ఉంటుంది. రెండేళ్లలో పూర్తి కావడానికి దోహదపడుతుంది. నవంబర్ 1 నుంచి పోలవరం పనులు జలవనరుల మంత్రి పి.అనిల్కుమార్ యాదవ్ పోలవరం పనులు నవంబర్ 1వ తేదీ నుంచి పునఃప్రారంభమవుతాయని జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్కుమార్ యాదవ్ సృష్టం చేశారు. శనివారం నెల్లూరు స్టోన్హౌస్పేటలోని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిర్దేశించిన ప్రకారం సకాలంలోనే ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని చెప్పారు. గోదావరికి వరదల నేపథ్యంలో జూన్ నుంచి నవంబర్ వరకు పనులు నిలిపివేశామని తెలిపారు. కాంట్రాక్టర్ను మాత్రమే మారుస్తున్నామని, ఇదే విషయాన్ని తాము అనేక సార్లు చెప్పామని గుర్తు చేశారు. సెప్టెంబర్ నెలాఖరు నాటికి రివర్స్ టెండరింగ్ ప్రకియను పూర్తి చేసి కొత్త కాంట్రాక్టర్కు పనులు అప్పగిస్తామన్నారు. నవంబర్ 1న కొత్త కాంట్రాక్టర్తో పనులు కచ్చితంగా మొదలుపెట్టి 2021 చివరి నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గత సర్కారు హయాంలో చేపట్టిన పనుల్లో దాదాపు రూ.రెండు వేల కోట్ల మేర అవినీతి జరిగిందని నిపుణుల కమిటీ నిర్థారించిందన్నారు. అక్రమాలను నిర్మూలించి పారదర్శక విధానం ద్వారా పనులు అప్పగిస్తామని చెప్పారు. గత ఐదేళ్లుగా పనులు సక్రమంగా చేపడితే పోలవరం ఇప్పటికే పూర్తయ్యేదన్నారు. ఆందోళన అనవసరం.. పోలవరంపై కేంద్ర ప్రభుత్వం ఏమీ కంగారు, హడావుడి పడటం లేదని, తమ శాఖ ఉన్నతాధికారులు ప్రాజెక్టు స్థితిగతుల్ని వివరించారని చెప్పారు. పోలవరంపై ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. విపక్షాలు తమ అనుకూల మీడియా ద్వారా పోలవరంపై సందేహాలు రేకెత్తిస్తున్నాయని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం రెండు నెలల్లో పోలవరం అవకతవకలను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తుంటే అడ్డుపడుతున్నారని విమర్శించారు. -
విత్తన సమస్య పాపం బాబుదే!
సాక్షి, అమరావతి: ప్రస్తుతం విత్తనాల సమస్య తలెత్తడానికి చంద్రబాబు ప్రభుత్వం అనుసరించిన అనాలోచిత విధానాలే కారణమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ఖరీఫ్ ప్రణాళిక తయారీలో తీవ్ర అలసత్వంతో వ్యవహరించిందని దునుమాడారు. విత్తనాల సేకరణకు ఇవ్వాల్సిన నిధులను ఎన్నికల్లో ఓట్ల కోసం పసుపు కుంకుమ పథకానికి మళ్లించిందని ఆరోపించారు. ఏపీ సీడ్స్, ఆయిల్ఫెడ్కు ఇవ్వాల్సిన రూ.380 కోట్ల బకాయిలను కూడా దారిమళ్లించిందన్నారు. శాసనసభలో మంగళవారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్రెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి, డాక్టర్ ఎం.తిప్పేస్వామి, జ్యోతుల చంటిబాబు, గొర్లె కిరణ్కుమార్ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు మంత్రి కన్నబాబు సుదీర్ఘ సమాధానం ఇచ్చారు. కాకాణి గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ జూన్ 8 వరకు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పుకున్న చంద్రబాబు ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళిక తయారీని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. జగ్గిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇతర రాష్ట్రాల నుంచి విత్తనాలను సేకరించారన్నారు. కిరణ్కుమార్ మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లాలో రైతులు 1176 రకం వరి వంగడాన్ని కోరుతున్నారన్నారు. తిప్పేస్వామి మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో మడకశిర ప్రాంతాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించి ఆదుకోవాలని కోరారు. ఒక్క రూపాయికే 55 లక్షల మంది రైతులకు పంటల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీ కింద 4, 5 విడతల పెండింగ్ బకాయిల కోసం మొత్తం రూ.7,925 కోట్లు కావాల్సి ఉందని, 19,20,542 మంది రైతులు లబ్ధిదారులుగా ఉన్నారన్నారు. 2019 ఖరీఫ్ సీజన్ నుంచి రైతుల తరఫున పంటల బీమా, వాణిజ్య పంటల ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ‘కోర్స్’ టెక్నాలజీతో భూముల రీ సర్వే: డెప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ కంటిన్యూయస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్ నెట్వర్క్ (సీఓఆర్ఎస్ – కోర్స్) అనే స్టేట్ ఆఫ్ టెక్నాలజీతో రాష్ట్రంలో భూములను రీసర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్ తెలిపారు. శానససభలో టీడీపీ సభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి, తదితరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఎంత కష్టమైనప్పటికీ రాష్ట్రంలోని మొత్తం 17,460 రెవెన్యూ గ్రామాల్లో అటవీ భూములు మినహా మొత్తం భూములను రీసర్వే చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో అసైన్డ్ భూములను వేరేవాళ్లు దొంగ పట్టాలతో ఆక్రమించుకున్నారని, కబ్జా చేసి విక్రయాలు కూడా జరిపారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి సభ దృష్టికి తెచ్చారు. పట్టణ గృహనిర్మాణంలో అక్రమాలపై విచారణ: మంత్రి బొత్స రాష్ట్రంలో గత ఐదేళ్లలో పట్టణ గృహనిర్మాణ పథకంలో భారీ అవినీతి జరిగిందని, దీనిపై విచారణ జరిపిస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. పొరుగు రాష్ట్రాల్లో చదరపు అడుగు నిర్మాణానికి రూ.1,366 ఖర్చుచేయగా మన రాష్ట్రంలో రూ.2,311 వెచ్చించారని, దోపిడీకి ఇది నిదర్శనమని చెప్పారు. గోదావరి–కృష్ణ అనుసంధానంపై నాలుగైదు మార్గాలను పరిశీలిస్తున్నాం: మంత్రి అనిల్ గోదావరి జలాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్లోకి తరలించే అంశంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు చర్చిస్తున్నారని, ఇందులో ఎటువంటి చీకటి ఒప్పందాలు లేవని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ ప్రకటించారు. గోదావరి జలాల తరలింపుపై ప్రస్తుతం నాలుగైదు మార్గాలను అధికారులు పరిశీలిస్తున్నారని, రాష్ట్ర హక్కులకు ఎటువంటి భంగం లేకుండా ఆర్థిక భారం తక్కువగా ఉండే మార్గాన్ని ఎంచుకుంటామన్నారు. మంగళవారం శాసనమండలిలో గోదావరి జలాల తరలింపుపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడారు.