assebly elections
-
ముచ్చటగా మూడోసారి.. తేల్చేసిన కేజ్రీవాల్
ఢిల్లీ : ప్రతిపక్ష ఇండియా కూటమికి ఆమ్ ఆద్మీ (ఆప్) కన్వినర్ అర్వింద్ కేజ్రీవాల్ షాకిచ్చారు. వచ్చే ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని, ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకోనుందని, ప్రస్తుతం సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతూ వస్తుంది.ఈ నేపథ్యంలో బుధవారం పొత్తుపై జరుగుతున్న ప్రచారాన్ని కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా ఖండించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం లేదని, ఒంటరిగా తమ బలాన్ని నిరూపించుకుంటామని ట్వీట్లో పేర్కొన్నారు. గతంలో పొత్తు గురించి జరుగుతున్న ప్రచారంపై ఢిల్లీ మాజీ సీఎం స్పందించారు. తాము ఇండియా కూటమిలో భాగమే అయినప్పటికీ మూడోసారి సైతం పొత్తు లేకుండా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు.Aam aadmi party will be fighting this election on its own strength in Delhi. There is no possibility of any alliance with congress. https://t.co/NgDUgQ8RDo— Arvind Kejriwal (@ArvindKejriwal) December 11, 2024 లోక్సభ ఫలితాల ఎఫెక్ట్అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుకు ఆప్ దూరంగా ఉండటానికి కారణం ఈ ఏడాది జరిగిన ఢిల్లీ లోక్సభ ఎన్నికల ఫలితాలేనని తెలుస్తోంది.సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్- ఆప్ కలిసి పోటీ చేశాయి. ఏడు లోక్సభ స్థానాలకు గాను ఆప్ నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్ మూడు స్థానాల్లో బరిలోకి దిగాయి. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఘోర పరాభవం ఎదురైంది. అన్నీ స్థానాల్ని బీజేపీ కైవసం చేసుకుంది. కాబట్టే, అసెంబ్లీ ఎన్నికలలో పొత్తు విషయంలో రెండు పార్టీలు పునరాలోచనలో పడ్డాయనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇండియా కూటమిలో చీలికలు మరోవైపు 26 ప్రతిపక్ష పార్టీల ఇండియా కూటమి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని భావిస్తుంది. అయితే కేజ్రీవాల్ వైఖరితో ఇండియా కూటమిలో చీలిక దిశగా పయనిస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఆప్తో పొత్తు ‘పొరపాటే’ ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ సైతం ఆప్తో పొత్తు పెట్టుకుంటే పొరపాటే అవుతుందన్నారు. 70 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని నొక్కి చెప్పారు.‘లోక్సభ ఫలితాల తర్వాత ఒంటరిగా పోటీ చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వెల్లడించారు. త్రిముఖ పోటీలో గెలుపు ఎవరిదో ఈ నిర్ణయం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఏర్పడింది. అధికారం కోసం ఆప్, కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. 2015 ఢిల్లీ 70 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆప్ 67 స్థానాలు, బీజేపీ మూడు స్థానాల్ని సొంతం చేసుకుంది. 2020లో ఆప్ 62 స్థానాల్ని కైవసం చేసుకుంది. ఆ ఎన్నికల్లో బీజేపీ కాస్త పుంజుకుని ఎనిమిది స్థానాలను దక్కించుకుంది. -
ప్రధానిని కలిసిన హేమంత్ దంపతులు..
న్యూఢిల్లీ: జార్ఖండ్ తాత్కాలిక ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకుని సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు. నవంబర్ 28న రాంచీలోని మోర్హబడి మైదానంలో జార్ఖండ్ నూతన సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు హేమంత్ సోరెన్ అతని సతీమణి, గండే నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే కల్పనా సోరెన్ ఢిల్లీకి వెళ్లారు. కాగా రాజధాని రాంచీలోని సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి సన్నాహాలు ఘనంగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తేజస్వీ యాదవ్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలున్నాయి. आज दिल्ली में माननीय प्रधानमंत्री आदरणीय श्री @narendramodi जी से मुलाकात कर उन्हें 28 नवंबर को अबुआ सरकार के शपथ ग्रहण समारोह में शामिल होने हेतु आमंत्रित किया। pic.twitter.com/dPgWW6l7ir— Hemant Soren (@HemantSorenJMM) November 26, 2024మొన్నటి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్) మొత్తం 56 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నాయి. జేఎంఎం ఒక్కటే 34 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సీపీఐ(ఎంఎల్) రెండు స్థానాల్లో విజయం సాధించాయి. జార్ఖండ్లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. జార్ఖండ్ తాత్కాలిక ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన ఎమ్మెల్యే భార్య కల్పనా సోరెన్తో కలిసి న్యూఢిల్లీ చేరుకున్నారు. వారు ప్రధాని మోదీని కలుసుకుని ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు.ఇది కూడా చదవండి: ప్రియురాలిని హత్య చేసి.. రాత్రంతా మృతదేహంతోనే గడిపి.. -
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్.. ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే?
రాంచీ : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా తిరుగులేని విజయం సాధించింది. ఈ తరుణంలో సోమవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.అరెస్ట్లు,కేసులు, కోర్టులు, తిరుగుబాట్లు, అవినీతి ఆరోపణలు, ఇక చొరబాటుదారులదే రాజ్యం అవుతుందని స్వయాన ప్రధాని మోదీ చేసిన హెచ్చరికలు.. వీటన్నిటినీ ఎదుర్కొని హేమంత్ సోరెన్,కల్పనా సోరెన్ దంపతులు విజయం సాధించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా 88 స్థానాలకు గాను 56 స్తానాల్ని కైవసం చేసుకుంది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరుతూ హేమంత్ సోరెన్ ఆదివారం (నవంబర్24) జార్ఖండ్ గవర్నర్ సంతోష్ గాంగ్వార్తో భేటీ కానున్నారు. మనీ లాండరింగ్ కేసులో ఐదు నెలల జైలు జీవితం గడిపారు. అనంతరం.. బెయిల్ మీద బయటకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేశారు. బర్హైత్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన హేమంత్ సోరెన్ తన ప్రత్యర్థి, బీజేపీ నేత గామ్లియెల్ హెంబ్రోమ్ను 39,791 ఓట్ల తేడాతో ఓడించారు.ఇక భర్త జైలు జీవితంతో హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ తొలిసారి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తన భర్తపై కేంద్రం చేస్తున్న కుట్రను వివరిస్తూ ఎన్నికల బరిలోకి దిగారు. 200కు పైగా సభలతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గాండే నియోజకవర్గం నుంచి పోటీ చేసి 17,142 ఓట్ల తేడాతో విజయం సాధించారు. -
Uttar Pradesh: ఒక పార్టీకి మద్దతు పలికిందని దళిత యువతి హత్య
కర్హల్: ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి జిల్లా కర్హాల్ అసెంబ్లీ స్థానానికి నేడు (బుధవారం) పోలింగ్ కొనసాగుతుండగా, మరోవైపు దారుణం చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక దళిత యువతి హత్యకు గురైంది. ఆమెను సమాజ్వాదీ పార్టీ నేత ప్రశాంత్ యాదవ్ హత్య చేశారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఆ యువతి బీజేపీకి ఓటు వేయాలని పలువురు ఓటర్లుతో చెప్పిందని అందుకే ఆమెను హత్య చేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కర్హల్లో దళిత యువతి హత్యకు కారణకులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఎస్పీ నేతనే ఈ హత్యకు పాల్పడ్డారని బీజేపీ కర్హల్ అభ్యర్థి అనుజేష్ ప్రతాప్ ఆరోపించారు.పలు మీడియా కథనాల ప్రకారం బాలిక మృతదేహం నగ్న స్థితిలో లభ్యమయ్యింది. ఇటీవల ఆ యువతికి బెదిరింపులు వచ్చినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు ఆమెను బలవంతంగా బైక్పై తీసుకెళ్లారని, ఆ తరువాత యువతి మృతదేహం కర్హల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంజ్రా నది వంతెన సమీపంలో కనిపించిందన్నారు. పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.మృతురాలి తండ్రి మీడియాతో మాట్లాడుతూ ‘ఇటీవల ఒక నేత ఈ ప్రాంతంలో తిరుగుతూ సమాజ్వాదీ పార్టీకి ఓటు వేయాలని కోరాడన్నారు. అయితే తమ కుమార్తె మా ఓటు బీజేపీకేనని చెప్పింది. దీంతో ఆ నేత, అతని సహచరులు తమ కుమార్తెను బెదిరించారని, ఆ తరువాత ఈ దారుణం చోటుచేసుకుందని’ తెలిపాడు.ఈ రోజు(బుధవారం) కర్హల్ అసెంబ్లీ స్థానంలో ఓటింగ్ జరుగుతోంది. ఇదే సమయంలో దళిత యువతి హత్యకు గురికావడం గమనార్హం. ఈ స్థానం నుంచి సమాజ్ వాదీ పార్టీ తరపున తేజ్ ప్రతాప్ యాదవ్, బీజేపీ నుంచి అనుజేష్ ప్రతాప్ యాదవ్ పోటీ చేస్తున్నారు.ఇది కూడా చదవండి: UP By Election: అల్లరి మూకలకు అఖిలేష్ హెచ్చరిక -
UP By Election 2024: సెమీ ఫైనల్లో యూపీ ఓటర్లు ఎటువైపు?
లక్నో: ఉత్తరప్రదేశ్లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు నేడు (బుధవారం) ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ స్థానాల్లో యోగి(సమాజ్వాదీ), అఖిలేష్(బీజేపీ) మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. యూపీలో 2027లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఎన్నికలను సెమీ ఫైనల్గా పరిగణిస్తున్నారు.ఉప ఎన్నికల్లో బీజేపీ, ఎన్సీపీ రెండూ తమ సత్తామేరకు ప్రచారపర్వాన్ని నిర్వహించాయి. ఈ స్థానాల్లో జరుగుతున్న ఉపఎన్నికలు ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా నిలిచాయి. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు యూపీ అధికార సింహాసనానికి మార్గాన్ని నిర్ణయించేవిగా మారనున్నాయని విశ్లేషకులు అంటున్నారు. అటు యోగి ఆదిత్యనాథ్ ఇటు అఖిలేష్ యాదవ్లలో తదుపరి సీఎం ఎవరు అనే దానిపై ఈ ఎన్నికలు అంచనాలను వెలువరించనున్నాయి. అందుకే ఈ ఎన్నికలు యూపీకి అగ్నిపరీక్షగా నిలిచాయని పలువురు అభివర్ణిస్తున్నారు.అఖిలేష్ యాదవ్ లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ కంటే అధికంగా సీట్లు గెలుచుకున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో 90 మంది అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. మొత్తం తొమ్మిది స్థానాల్లో బీజేపీ-ఎస్పీ, బీఎస్పీ మధ్య ముక్కోణపు పోటీ ఉంది. అయితే ప్రత్యక్ష పోటీ మాత్రం బీజేపీ, ఎస్పీ మధ్యే ఉండనుందనే అంచనాలున్నాయి.ఈ తొమ్మిది స్థానాల్లో 2022లో జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తే సమాజ్ వాదీ పార్టీకి నాలుగు సీట్లు, ఎన్డీఏకు ఐదు సీట్లు, బీజేపీకి మూడు సీట్లు, మిత్రపక్షాలకు రెండు సీట్లు దక్కాయి. టిక్కెట్ల పంపిణీలో అఖిలేష్ ముస్లిం కార్డును ఉపయోగించుకోగా, బీజేపీ ఓబీసీలను రంగంలోకి దింపింది. బీజేపీ గరిష్టంగా ఐదుగురు ఓబీసీ అభ్యర్థులను నిలబెట్టగా, వీరిలో ఒకరు దళితుడు, ముగ్గురు అగ్రవర్ణాలకు చెందినవారు ఉన్నారు. ముస్లింలకు బీజేపీ టిక్కెట్టు ఇవ్వలేదు. కాగా, సమాజ్వాదీ పార్టీ అత్యధికంగా నలుగురు ముస్లిం అభ్యర్థులను నిలబెట్టింది. అలాగే ముగ్గురు ఓబీసీ అభ్యర్థులు, ఇదరు దళిత అభ్యర్థులకు టిక్కెట్ ఇచ్చింది. అగ్రవర్ణాలకు ఒక్క టిక్కెట్టు కూడా కేటాయించలేదు. ఈసారి ఓటర్లు ఎవరివైపు మొగ్గుచూపుతారో, ఎవరిని ఓడిస్తారో వేచి చూడాల్సిందే.ఇది కూడా చదవండి: హాంకాంగ్ జాతీయ భద్రతా కేసులో సంచలన తీర్పు -
మెహబూబా వారసురాలు...కంచుకోటను నిలబెట్టేనా?
కశ్మీర్లో పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ)కి కంచుకోటగా పేరుపడ్డ శ్రీగుఫ్వారా–బిజ్బెహరా నియోకజవర్గంపై ఇప్పుడందరి దృష్టి కేంద్రీకృతమైంది. జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి తొలిదశలో.. సెప్టెంబరు 18న పోలింగ్ జరగనున్న 24 నియోజకవర్గాల్లో బిజ్బెహరా ఒకటి. పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఈసారి పోటీకి దూరంగా ఉండటంతో బిజ్బెహరా నుంచి ఆమె కూతురు ఇల్తిజా బరిలోకి దిగారు. దక్షిణ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గంలో కేవలం ముగ్గురే పోటీపడుతున్నారు. మాజీ ఎమ్మెల్సీలు బషీర్ అహ్మద్ షా (నేషనల్ కాన్ఫరెన్స్), సోఫీ మొహమ్మద్ యూసుఫ్ (బీజేపీ)లతో రాజకీయాలకు కొత్తయిన ఇల్తిజా తలపడుతున్నారు. 37 ఏళ్ల ఇల్తిజా విజయం సాధిస్తే.. 1996 నుంచి పీడీపీకి కంచుకోటగా బిజ్బెహరాపై పీడీపీ, ముఫ్తీ కుటుంబం పట్టు మరింత పెరుగుతుంది. మాజీ సీఎం, పీడీపీ వ్యవస్థాపకుడు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ తన సుదీర్ఘ రాజకీయ ఇన్నింగ్స్కు బిజ్బెహరా నుంచే శ్రీకారం చుట్టారు. 1962లో గులామ్ సాధిక్ నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ చీలికవర్గం నుంచి 1962లో బిజ్బెహరా ఎమ్మెల్యేగా సయీద్ విజయం సాధించారు. ఇల్తిజా తల్లి మెహబూబా ముఫ్తీ కూడా బిజ్బెహరా నుంచే రాజకీయ అరంగేట్రం చేశారు. కాంగ్రెస్ పార్టీ టికెట్పై గెలిచారు. తండ్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కాంగ్రెస్ను వీడి పీడీపీని స్థాపించడంతో మెహబూబా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. సీనియర్ ముఫ్తీకి నమ్మకస్తుడైన అబ్దుల్ రెహమాన్ భట్ బిజ్బెహరా నుంచి వరుసగా నాలుగుసార్లు గెలిచారు. చివరిసారిగా జమ్మూకశ్మీర్కు 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ భట్ బిజ్బెహరాలో నెగ్గారు. ఈసారి సీనియర్ నాయకుడైన భట్పై నమ్మకంతో ఆయనకు షాంగుస్– అనంత్నాగ్ పశి్చమ సీటును పీడీపీ కేటాయించింది.ఎన్సీ ప్రత్యేక దృష్టి పీడీపీ కోటను బద్ధలు కొట్టాలని నేషనల్ కాన్ఫరెన్స్ పట్టుదలగా ఉంది. ఎన్సీ అభ్యర్థి బషీర్ అహ్మద్ షా తండ్రి అబ్దుల్గనీ షా 1977–1990 దాకా బిజ్బెహరాకు ప్రాతినిధ్యం వహించారు. పలుమార్లు ఓటమి పాలైనా ఎన్సీ ఇక్కడ బషీర్నే నమ్ముకుంటోంది. 2009–1014 మధ్య కాంగ్రెస్తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపినపుడు బషీర్ను ఎమ్మెల్సీని చేసింది. పీడీపీ– ఎన్సీ మధ్య సంకుల సమరంలో ఓట్లు చీలి తాము లాభపడతామని బీజేపీ అభ్యర్థి యూసుఫ్ భావిస్తున్నారు. బీజేపీలో చేరడం నిషిద్ధంగా పరిగణించే కాలంలో కమలదళం తీర్థం పుచ్చుకున్న యూసుఫ్ను పీడీపీ–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినపుడు ఎమ్మెల్సీని చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అలహాబాద్ టు అంబేడ్కర్నగర్... యూపీలో రసవత్తర పోరు!
ఉత్తరప్రదేశ్ సుదీర్ఘ ఎన్నికల షెడ్యూల్లో ఇప్పటిదాకా ఐదు విడతలకు 53 లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల జాతకాలు ఈవీఎంలలోకి చేరిపోయాయి. ఆరో విడతలో 14 స్థానాలకు ఈ నెల 25న పోలింగ్ జరగనుంది. వీటిలో 9 బీజేపీ సిట్టింగ్ స్థానాలు కాగా బీఎస్పీ 4, ఒకటి ఎస్పీ ఖాతాలో ఉన్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎస్పీ–కాంగ్రెస్, బీజేపీ నడుమ హోరాహోరీ సాగుతోంది. బీఎస్పీ ఒంటరి పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆరో విడతలో కీలక నియోజకవర్గాలపై ఫోకస్... – సాక్షి, నేషనల్ డెస్క్అలహాబాద్... త్రివేణి సంగమంలో హోరాహోరీ ఒకప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వంటి ఉద్దండులైన ప్రధానులను దేశానికి అందించిన కాంగ్రెస్ కంచుకోట ఈ స్థానం. కానీ దాదాపు 4 దశాబ్దాలుగా పార్టీ ఇక్కడ గెలుపు ముఖం చూడలేదు. చివరిగా 1984లో బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ కాంగ్రెస్ నుంచి అలహాబాద్లో గెలుపొందారు. తర్వాత బీజేపీ అగ్రనేత మురళీ మనోహర్ జోషీ ఇక్కడ హ్యాట్రిక్ కొట్టారు. అనంతరం రెండుసార్లు సమాజ్వాదీ గెలిచినా తిరిగి కమలనాథులు పట్టుబిగించారు.2016లో బీజేపీ గూటికి చేరిన యూపీసీసీ మాజీ చీఫ్ రీటా బహుగుణ జోషి గత ఎన్నికల్లో గెలిచారు. ఈసారి బీజేపీ ఆమెను పక్కనపెట్టి మాజీ గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి కుమారుడు నీరజ్ త్రిపాఠికి టికెటిచ్చింది. ఇండియా కూటమి తరఫున ఎస్పీ సీనియర్ నేత కున్వర్ రియోతీ రమణ్ సింగ్ కుమారుడు ఉజ్వల్ రమణ్ సింగ్ కాంగ్రెస్ టికెట్పై పోటీ చేస్తున్నారు. ఇక్కడ పూర్వవైభవం కోసం ఎస్పీ దన్నుతో కాంగ్రెస్ తీవ్రంగా చెమటోడుస్తుండటంతో పోటీ రసవత్తరంగా మారింది.సుల్తాన్పూర్... త్రిముఖ పోరు గోమతి నదీ తీరంలో కొలువుదీరిన ఈ నియోజకవర్గం కూడా ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటే. తర్వాత కమలనాథులు పాగా వేశారు. బీజేపీ నుంచి 2014లో వరుణ్ గాంధీ గెలిచారు. 2019లో వరుణ్ పిలిభిత్కు మారగా ఇక్కడ ఆయన తల్లి మేనకా గాంధీ పోటీ చేశారు. కానీ బీఎస్పీ అభ్యర్థి చంద్రభద్ర సింగ్ ఆమెను ఓడించినంత పని చేశారు. కేవలం 14,500 ఓట్లతో మేనక గట్టెక్కారు. ఈసారి కూడా బీజేపీ నుంచి మేనకే రేసులో ఉన్నారు.ఇండియా కూటమి తరఫున ఎస్పీ అభ్యర్థి రామ్ భువల్ నిషాద్ బరిలో ఉన్నారు. ఇక బీఎస్పీ బలమైన ఓటు బ్యాంకున్న ఉద్రజ్ వర్మకు టెకెటిచి్చంది. బీఎస్పీ ఇక్కడ 1999, 2004ల్లో విజయం సాధించింది. బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ మధ్య త్రిముఖ పోరు ఉత్కంఠ రేపుతోంది. అంబేడ్కర్నగర్... బీఎస్పీకి ప్రతిష్టాత్మకం! సోషలిస్ట్ దిగ్గజం రామ్ మనోహర్ లోహియా జన్మస్థలమిది. 2004 దాకా అక్బర్పూర్గా ఉండేది. బీఎస్పీ కంచుకోట అయిన ఈ స్థానం నుంచి పార్టీ చీఫ్ మాయవతి మూడుసార్లు గెలిచారు. 2008లో పునర్విభజన తర్వాత అంబేద్కర్నగర్గా మారింది. గత ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి రితేశ్ పాండే గెలిచారు. ఇక్కడ దళిత, కుర్మి, బ్రాహ్మణ, ముస్లిం ఓటర్లు కీలకం. బీఎస్పీ సిట్టింగ్ ఎంపీ రితేశ్ పాండే ఈసారి బీజేపీలో చేరి ఆ పార్టీ టికెట్పై పోటీ చేస్తున్నారు. దాంతో బీఎస్పీ కవార్ హయత్ అన్సారీకి టికెటిచ్చింది. ఎస్పీ నుంచి లాల్జీ వర్మ బరిలో ఉన్నారు. త్రిముఖ పోరులో బీఎస్పీ ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి.ప్రతాప్గఢ్... కుర్మి, బ్రాహ్మణ ఓట్లు కీలకం బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ సంగమ్ లాల్ గుప్తా, ఇండియా కూటమి నుంచి ఎస్పీ అభ్యర్థి ఎస్.పి.సింగ్ పటేల్ బరిలో ఉన్నారు. ఇక్కడ కురి్మ, బ్రాహ్మణ ఓట్లది కీలక పాత్ర. కుర్మి ఓటర్లు 11%, బ్రాహ్మణ ఓటర్లు 16 శాతం ఉంటారు. వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యే అయిన మాజీ మంత్రి రఘురాజ్ ప్రతాప్ సింగ్ (రాజా భయ్యా), సీనియర్ కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ కూడా ప్రభావం చూపుతారు. జనసత్తా దళ్ లోక్తాంత్రిక్ పేరుతో కొత్త పార్టీ పెట్టి తనతో పాటు మరో ఎమ్మెల్యేనూ గెలిపించుకున్న రాజా భయ్యా మద్దతు ఈసారి ఎవరికన్నది ఆసక్తికరం.ఆజంగఢ్... ఎస్పీకి సవాల్ యూపీలో అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఆజంగఢ్ ఒకటి. ఓటర్లలో 21 శాతం యాదవులు, 17 శాతం ముస్లింలు, 19 శాతం దళితులున్నారు. భూమిహార్, ఠాకూర్, బ్రాహ్మణ, కాయస్థ ఓటర్లూ ప్రభావం చూపుతారు. 2014లో ములాయం సింగ్ యాదవ్, 2019లో ఆయన తనయుడు అఖిలేశ్ యాదవ్ విక్టరీ కొట్టారు. గత ఎన్నికల్లో మోదీ వేవ్లో సైతం ఇక్కడ కాషాయ జెండా ఎగరలేదు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అఖిలేశ్ ఈ సీటును ఖాళీ చేయడంతో వచి్చన ఉప ఎన్నికలో ప్రముఖ భోజ్పురీ నటుడు దినేశ్ లాల్ యాదవ్ నిరాహువా ఇక్కడ బీజేపీకి తొలి విజయం అందించారు. ఈసారీ ఆయనే బరిలో ఉన్నారు. ఎస్పీ నుంచి ధర్మేంద్ర యాదవ్, బీఎస్పీ నుంచి భీమ్ రాజ్భర్ బరిలో ఉన్నారు.ఫూల్పూర్.. నెహ్రూ కోట ప్రయాగ్రాజ్ జిల్లాలో చరిత్రాత్మక నియోజకవర్గమిది. తొలి ప్రధాని నెహ్రూ తొలి ఎన్నికల్లో విజయం సాధించిన స్థానం. ఇక్కడి నుంచి హ్యట్రిక్ కొట్టారాయన. 1962 ఎన్నికల్లో సోషలిస్టు దిగ్గజం రామ్ మనోహర్ లోహియా గట్టి పోటీ ఇచ్చినా విజయం నెహ్రూనే వరించింది. ఆయన మరణానంతరం సోదరి విజయలక్ష్మీ పండింట్ ఇక్కడ గెలిచారు. 1975 ఎమర్జెన్సీతో ఫూల్పూర్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. 1971లో వీపీ సింగ్ చివరిసారిగా కాంగ్రెస్ నుంచి గెలిచారు. తర్వాత ఇప్పటిదాకా ఇక్కడ హస్తానికి చాన్సే లేకుండా పోయింది! ఏళ్లుగా ఇక్కడ సమాజ్వాదీ పాగా వేసింది.2004లో మాఫియా డాన్ అతీఖ్ అహ్మద్ సమాజ్వాదీ తరఫున గెలుపొందడం విశేషం. 2014లో కేశవ్ ప్రసాద్ మౌర్య తొలిసారి ఇక్కడ కాషాయ జెండాను ఎగరేశారు. ఆయన రాష్ట్ర రాజకీయాల్లోకి మారడంతో వచి్చన ఉప ఎన్నికలో మళ్లీ ఎస్పీ గెలిచింది. 2019లో బీజేపీ నేత కేసరీదేవి పటేల్ విజయం సాధించారు. ఈసారి బీజేపీ నుంచి ప్రవీణ్ పటేల్, ఎస్పీ నుంచి అమర్నాథ్ మౌర్య, బీఎస్పీ నుంచి జగన్నాథ్ పాల్ బరిలో ఉన్నారు. ముగ్గురూ తొలిసారి లోక్సభకు పోటీ చేస్తుండటం విశేషం! -
హైదరాబాద్లో ప్రధాని మోదీ రోడ్ షో
సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ రోడ్డు షోలో పాల్గొన్నారు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ వరకు ప్రధాని రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రధాని వెంట వాహనంపై కిషన్రెడ్డి, కె. లక్ష్మణ్లు ఉన్నారు. వారితో ర్యాలీలో 24మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు.చిక్కడపల్లి నారాయణగూడ మీదుగా ప్రధాని మోదీ రోడ్ షో సాగింది. రోడ్ షోలో ప్రజాలకు అభివాదం చేస్తూ మోదీ ముందుకు సాగారు. ప్రధాని మోదీపై పూల వర్షం కురిపిస్తూ అభిమానులు, కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. రోడ్ షో అనంతరం అమీర్పేట్ గురుద్వార్ను మోదీ సందర్శించారు. ఆపై కోటి దీపోత్సవం కార్యక్రమానికి మోదీ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ప్రధాని మోదీ రోడ్ షో నేపథ్యంలో భద్రతాపరమైన చర్యల్లో భాగంగా రెండు మెట్రో స్టేషన్లను ఈ రోజు( సోమవారం ) సాయంత్రం మూసివేశారు. రోడ్డు షో జరగనున్న చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను సాయంత్రం 4.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఈ సందర్బంగా నగరంలో భారీగా బలగాలను మోహరించారు. 5వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. 🚨 Important Update, Hyderabad! 🚨 For security reasons, in light of PM Shri Narendra Modi's Roadshow today (27/11/2023), Chikkadpally and Narayanaguda stations will be closed 15 minutes before and after the event, tentatively from 16:30 to 18:30 hrs. Arm-B of RTC X Roads… pic.twitter.com/3dps74NQvC — L&T Hyderabad Metro Rail (@ltmhyd) November 27, 2023 హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు.. సాయంత్రం 5గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుండి రోడ్ షో.. 2 కి.మీ మేర రోడ్ షో.. కాచిగూడలో ప్రధాని ప్రసంగం.. ర్యాలీలో పాల్గొననున్న గ్రేటర్ లోని 24మంది ఎమ్మెల్యే అభ్యర్థులు బేగంపేట్ ఎయిర్పోర్టు నుంచి బేగంపేట్, గ్రీన్లాండ్స్, పంజగుట్ట, మొనప్ప ఐలాండ్, రాజ్భవన్, వీవీ విగ్రహం, నిరంకారీ భవన్.. ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోటరీ, తెలుగు తల్లి జంక్షన్, కట్టమైసమ్మ ఆలయం, ఇందిరా పార్కు, అశోక్నగర్ ఆర్టీసి క్రాస్రోడ్స్కు చేరుకుంటారు. అక్కడి నుంచి నుంచి చిక్కడపల్లి, నారాయణగూడ, కాచిగూడ క్రాస్ రోడ్స్ వరకు రోడ్ షో ఉంటుంది. -
మొయినాబాద్లో రూ.7.5 కోట్లు పట్టివేత
మొయినాబాద్/సాక్షి, హైదరాబాద్: ఎన్నికల వేళ మొయినాబాద్లో భారీగా నగదు పట్టుబడటం కలకలం రేపింది. శనివారం సాయంత్రం అజీజ్నగర్ రెవెన్యూలోని ఓ మట్టి రోడ్డులో ఏకంగా ఆరు కార్లలో తరలిస్తున్న రూ.7.5 కోట్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. కార్లలో ఉన్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. డబ్బులు తరలిస్తున్న కార్ల నంబర్లు టీఎస్ 36 కె 3030, టీఎస్ 07 జేకే 4688, టీఎస్ 09 ఈడబ్ల్యూ 3747, ఏపీ 39 ఏఎం 4442, టీఎస్ 02 ఎఫ్ఈ 8332, టీఎస్ 09 జీబీ 5841. రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి, చేవెళ్ల ఏసీపీ ప్రశాంత్రెడ్డి, ఐటీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డబ్బులను ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు..? అనే విషయాలపై ఆరా తీస్తున్నామని.. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీసీపీ చెప్పారు. కార్లను మొయినాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఓ విద్యా సంస్థ చైర్మన్ ఇంట్లో నుంచి బయటకొచ్చిన కార్లు? మొయినాబాద్లో నగదు తరలిస్తూ పట్టుబడిన కార్లు ఓ విద్యా సంస్థ చైర్మన్ ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అజీజ్నగర్ రెవెన్యూలో విద్యా సంస్థ నిర్వహిస్తున్న ఆ సంస్థ చైర్మన్ హిమాయత్సాగర్ జలాశయం ఒడ్డునే నివాసముంటున్నట్లు సమాచారం. ఆ ఇంట్లో నుంచి కార్లు బయటకు రాగానే విశ్వసనీయ సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు కార్లను పట్టుకున్నట్లు తెలిసింది. కార్లలో డబ్బును ఎక్కడికి తరలిస్తున్నారనే విషయాలు మాత్రం తెలియలేదు. కార్లు పట్టుబడింది ఓ మంత్రి డెయిరీ ఫాం పక్కనే కావడం విశేషం. ఆ విద్యా సంస్థ చైర్మన్ ఇంట్లో ఐటీ సోదాలు? కాగా ఆ విద్యా సంస్థ చైర్మన్ ఇంట్లో ఐటీ అధికారులు శనివారం రాత్రి సోదాలు చేపట్టినట్టు సమాచారం. అక్కడి ఇంటితో పాటు ఐటీ అధికారులు, పోలీసులు సదరు చైర్మన్కు సంబంధించిన ఫుట్ బాల్ అకాడమీ, క్రికెట్ అకాడమీ కార్యాలయాల్లో సైతం సోదాలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కార్లలో పట్టుబడిన ఆ సొమ్ముతో సదరు సంస్థకు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్టు తెలిసింది. -
ఆరు గ్యారంటీలు.. నూరు సీట్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల కోసం లండన్ వేదికగా కాంగ్రెస్ పార్టీ కొత్త నినాదాన్ని అందుకుంది. ‘‘ఆరు గ్యారంటీలు–నూరు సీట్లు’ పేరు తో ప్రచారానికి శ్రీకారం చుట్టింది. టీపీసీసీ ఎన్నారై సెల్ (యూకే) ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని లండన్లో చేప ట్టారు. దీనిని గాంధీభవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రారంభించారు. ఆరు గ్యారంటీ పథకాలు, నూరు గ్యారంటీ సీట్లు లక్ష్యంగా తెలంగాణ ప్రజల్లోకి వెళ్లాలని.. విదేశాల్లో ఉన్న వారి బంధువులు, సన్నిహి తులు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేసే లా తోడ్పడాలని ఆయన మార్గ నిర్దేశం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలోని యువత, మహి ళలు, రైతులకు ప్రాధాన్యం ఉండేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. విద్యార్థుల కోసం రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, రూ.10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి గ్యారంటీ పథకాలను అమలు చేస్తామన్నారు. గల్ఫ్ సంక్షేమ బోర్డు, ఎన్నారై సెల్ ఏర్పాటు తదితర అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాన్ని పరిశీ లిస్తామని తెలిపారు. టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ నేతృత్వంలో జరిగిన కార్య క్రమంలో ఎన్నారై సెల్ నేతలు రంగుల సుధా కర్ గౌడ్, బిక్కుమండ్ల రాజేశ్, మంగళారపు శ్రీధర్, గంగసాని ప్రవీణ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘వారంలో బీజేపీ తొలి విడత అభ్యర్థుల జాబితా’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచింది. అభ్యర్థుల ఎంపిక, పార్టీ నాయకుల మధ్య ఐక్యత, ఎన్నికల ప్రచార వ్యూహంపై దృష్టి సారించింది. ఇందుకోసం కోసం ప్రణాళికలను రచిస్తోంది. ఈ క్రమంలో వారం రోజుల్లో బీజేపీ మొదటి విడత అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నట్లు రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇంచార్జ్ ప్రకాష్ జవదేకర్ తెలిపారు. అక్టోబర్ 1 నుంచి తెలంగాణలో బీజేపీ వరుస కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విస్తృత ప్రచారం చేయనున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు తమ దగ్గర అనేక అస్త్రాలు, వ్యూహాలు ఉన్నాయని అన్నారు. ఎంపీ బండి సంజయ్కు జాతీయ స్థాయిలో బాధ్యతలు అప్పగించామన్నారు ప్రకాష్ జవదేకర్. బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఏదో అవగాహన ఉందని కాంగ్రెస్ కుట్రపూరిత ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లోపాయకారిగా కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. చదవండి: తెలంగాణలో మాకు విజయావకాశాలు: రాహుల్ గాంధీ -
TS Election 2023: ‘గ్రేటర్’ పరిధిలో ఐదు సీట్ల కోసం గొడవ!
వరంగల్: ‘ఆలూ లేదు.. చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లుగా ఉంది కాంగ్రెస్ పార్టీలో కొందరు ఆశావహుల తీరు. ఆగస్టు 18 నుంచి 25 వరకు అసెంబ్లీ స్థానాల వారీగా ఆశావహుల నుంచి ఆ పార్టీ అధిష్టానం దరఖాస్తులు స్వీకరించింది. డీసీసీ, టీపీసీసీ, ఎన్నికల నిర్వహణ కమిటీలో పరిశీలన పూర్తయిన అనంతరం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) కూడా పరిశీలించి అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు అధిష్టానం ప్రకటించింది. ఇదంతా సుమారు 15–20 రోజుల పాటు జరిగే ప్రక్రియ. అయితే ఓ వైపు ఆ తంతు సాగుతుండగానే.. నియోజకవర్గస్థాయి సదస్సుల్లో చాలాచోట్ల ఆశావహ నేతలు బలప్రదర్శనకు దిగడం వివాదాస్పదం అవుతోంది. మీసాలు మెలేయడం.. తొడలు కొట్టుకోవడం క్యాడర్ను అయోమయంలో పడేస్తుండగా.. వర్గాల పోరు రోజురోజుకూ రాజుకుటోంది. ఇటీవల వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరకాల, వర్ధన్నపేట, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాల్లో ఆశావహ నేతలు పార్టీ కేంద్ర పరిశీలకుల ఎదుటే బలప్రదర్శనకు దిగారు. దీంతో రసాభాసగా ముగిసిన సమావేశాలపై టీపీసీసీ, ఏఐసీసీలు ఆరా తీస్తుండటం పార్టీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కుమ్ములాటలు.. కొట్లాటలు ఉమ్మడి వరంగల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మూడు కుమ్ములాటలు, ఆరు కొట్లాటలు అన్నట్టుగా తయారైంది. వరంగల్ జిల్లా కేంద్రంలోనే కాదు ఎనిమిది నియోజకవర్గాల్లో వర్గ విభేదాలు భగ్గుమంటున్నా యి. వరంగల్ పశ్చిమ నుంచి 2018లో ఆశించి భంగపడ్డ నాయిని రాజేందర్రెడ్డికి ఈసారి దాదాపు టికెట్ ఖాయమన్న అధిష్టానం సంకేతాలతో పని చేస్తున్నారు. గతంలో పశ్చిమ కోసం నాయిని రాజేందర్రెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ మధ్య పోటీ ఉండేది. దీంతో ఆ ఇద్దరి నేతల మధ్యన వర్గపోరు చాలానాళ్లు సాగగా స్వర్ణ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు కావడంతో ఆమె తూర్పు నియోజకవర్గంవైపు మారారు. కొత్తగా జనగామ డీసీసీ మాజీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి పశ్చిమ టికెట్పై గురి పెట్టడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఇటీవల హన్మకొండ డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పార్లమెంట్ ఇన్చార్జ్ దాల్వి సమక్షంలోనే పోటాపోటీ నినాదాలతో బలప్రదర్శనకు దిగ డం చర్చనీయాంశమైంది. తూర్పు నియోజకవర్గం కొండా సురేఖకు ఖాయమనుకున్న సమయంలో ఇక్కడి నుంచి ఎర్రబెల్లి స్వర్ణ కూడా దరఖాస్తు చేసుకున్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లందలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఢిల్లీ నుంచి హాజరైన పార్లమెంటు ఇన్చార్జ్ రవీంద్ర ఉత్తమ్రావు దాల్వి, రాష్ట్ర పార్టీ నుంచి శోభారాణి తదితరులు హాజరైన ఈ సమావేశంలో ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న కేఆర్.నాగరాజు, నమిండ్ల శ్రీనివాస్ అనుచరులు బల ప్రదర్శనకు దిగారు. కాగా వేదిక పైకి నాగరాజును పిలవడంతో నమిండ్ల శ్రీనివాస్ అనుచరులు ఆందోళనకు దిగారు. దీంతో అరగంట పాటు సమావేశం స్తంభించగా కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళానికి దారి తీసింది. ఇక్కడి నుంచి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యతో పాటు మొత్తం పది మంది దరఖాస్తు చేసుకున్నారు. పరాకాష్టకు పరకాల, స్టేషన్ఘన్పూర్.. పరకాల నియోజకవర్గం స్థాయి కార్యకర్తల సమావేశం కూడా రసాభాసగా జరిగింది. ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న ఇనుగాల వెంకట్రాంరెడ్డి, కొండా మురళీధర్రావులు పరిశీలకుల ముందే బాహాబాహీకి దిగారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఇది నా అడ్డా అంటూ మీసం తిప్పగా.. ఇనగాల వెంకట్రామిరెడ్డి ఇది నా అడ్డా అంటూ తొడ గొట్టడం వివాదాస్పదం అయ్యింది. ఈ సమావేశానికి హాజరైన పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు రెండుగా చీలిపోగా.. కొండా, ఇనుగాల వర్గీయులు పరస్పరం దుర్భాషలాడుకోవడం, తోపులాటకు దిగిన ఘటనలపై అధిష్టానం ఆరా తీస్తున్నది. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో సైలెంట్గా కొనసాగిన వర్గ రాజకీయాలు ఒక్కసారిగా పరాకాష్టకు చేరాయి. ఇటీవల నిర్వహించిన నియోజకవర్గం స్థాయి సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిర, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య అనుచరులు రెండు వర్గాలుగా ఏర్పడి నేతలకు అనుకూలంగా నినాదాలు చేయడం, ఒకరికొకరు నెట్టివేసుకోవడం, పరస్పరం దాడి చేసుకోవడం వరకు వెళ్లింది. వీరితోపాటు మరో ఆరుగురు ‘స్టేషన్’ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. జనగామ నియోజకవర్గంలో టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి వర్గాల మధ్య నెలకొన్న గ్రూపు రాజకీయాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న చందంగా మారింది. ఈ రెండు వర్గాల పంచాయితీ పలుమార్లు గాంధీభవన్కు కూడా చేరింది. -
అసమ్మతులకు ‘చేరికల’తో చెక్!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను దాదాపు సిద్ధం చేసిన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు.. అదే సమయంలో సొంత పార్టీని చక్కదిద్దే చర్యలపైనా దృష్టి పెట్టారు. సిట్టింగ్లకు ప్రాధాన్యత ఇస్తూనే.. ప్రజల్లో, స్థానిక పార్టీ శ్రేణుల్లో వ్యతిరేకత, ఆరోపణలున్నవారిని పక్కనపెడుతున్నారు. ఆయా చోట్ల సర్వేలు, నిఘా నివేదికల ఆధారంగా గెలవగలిగిన వారిని ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇతర ఆశావహుల నుంచి ఎదురయ్యే అసమ్మతికి చెక్ పెట్టేదిశగా పావులు కదుపుతున్నారు. ఆయా నేతలు పార్టీని వీడినా, అంతర్గతంగా సహకరించకపోయినా నెలకొనే నష్టాన్ని అంచనా వేస్తూ.. దానికి విరుగుడుగా ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రభావం చూపగల వారిని ఇప్పటికే గుర్తించినట్టు సమాచారం. అసమ్మతి నేతలకే గెలుపు బాధ్యతలు రాష్ట్రవ్యాప్తంగా 40కిపైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ టికెట్ కోసం గట్టిపోటీ ఉండగా.. అందులో కొన్నిచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బదులు ఇతరులకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. అభ్యర్థుల జాబితా విడుదల చేశాక టికెట్ దక్కని నేతల నుంచి ఎదురయ్యే ఒత్తిడిని అంచనా వేస్తున్నారు. పార్టీ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసే నేతల వివరాలను నిఘా సంస్థల ద్వారా సేకరిస్తున్నారు. టికెట్ ఆశించి, భంగపడిన నేతలను కూడా కలుపుకొనిపోవాలని భావిస్తున్న కేసీఆర్.. పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థుల గెలుపు బాధ్యతల్లో వారిని భాగస్వాములను చేయాలని భావిస్తున్నారు. ప్రత్యేకంగా చేరికలతో.. మరోవైపు గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల సొంత పార్టీ నేతలు, విపక్షాల నాయకుల వివరాలను బీఆర్ఎస్ ఇప్పటికే సేకరించింది. అసమ్మతులతో పడే ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు.. క్షేత్రస్థాయిలో బలం కలిగిన ఇతర పార్టీల నాయకులను బీఆర్ఎస్లో చేర్చుకునే పని మొదలుపెట్టింది. గతంలో స్వతంత్ర అభ్యర్థులుగా లేదా ఇతర చిన్న పార్టీల నుంచి పోటీచేసి గణనీయంగా ఓట్లు సాధించిన నాయకుల డేటాపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే స్థానికంగా బలం కలిగిన కౌశిక్ హరి (రామగుండం), ఉప్పుల వెంకటేశ్ (కల్వకుర్తి) వంటి నేతలను బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. ఇలాంటి చేరికల ద్వారా అంతర్గత అసమ్మతికి చెక్ పడుతుందని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఇతర పార్టీల్లో టికెట్ దక్కని నేతలను కూడా చివరి నిమిషంలో బీఆర్ఎస్లో చేర్చుకోవడం ద్వారా కూడా.. విపక్షాల ఎత్తుగడలను దెబ్బకొట్టవచ్చని పార్టీ పెద్దలు భావిస్తున్నారని అంటున్నాయి. ఇతర పార్టీల నుంచి చేరికలకు సంబంధించి జిల్లా మంత్రులు, నమ్మకస్తులైన నేతలకు కేసీఆర్ ఇప్పటికే దిశా నిర్దేశం చేశారని వివరిస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో ఈ చేరికల ఆపరేషన్ను సమన్వయం చేసే బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మంత్రి హరీశ్రావు సమన్వయం చేస్తున్నారు. -
మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా సునీల్
భోపాల్: ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు గెలుపు వ్యూహాన్ని రూపొందించేందుకు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మాజీ సహచరుడు సునీల్ కనుగొలును కాంగ్రెస్ రంగంలోకి దించింది. ఆయన ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ తరఫున పనిచేస్తున్నారు. సునీల్ గతంలో ఈయన ప్రధాని మోదీతో కలిసి బీజేపీ ప్రచార వ్యూహాన్ని రచించారు. 2017లో యూపీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో బీజేపీ గెలుపునకు బాటలు వేశారు. అనంతరం కాంగ్రెస్ తరఫున పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం కావడం వెనుక సునీల్ కృషి ఉంది. సునీల్ కనుగొలు(39) తండ్రి కర్ణాటక, తల్లి తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు. ఈయన విద్యాభ్యాసం తమిళనాడులో సాగింది. ఎంబీఏ, ఎంఎస్ అమెరికాలో పూర్తి చేశారు. -
కావాలనే స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి మిస్ చేశారు..
-
'ఒక్కొక్కరికి రూ.6,000 ఇస్తాం.. డబ్బులు అందితేనే ఓటెయ్యండి'
బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రమేష్ జర్కిహోలి ఓటర్లకు బంపరాఫర్ ఇచ్చారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికే ఓటు వేయాలని, ఇందు కోసం ఒక్కొక్కరికి రూ.6,000 ఇస్తామని హామీ ఇచ్చారు. డబ్బు అందితేనే ఓటు వెయ్యాలని లేకపోతే వేయొద్దని స్పష్టం చేశారు. బెలగావి రూరల్లోని సులేబావి గ్రామంలో రమేష్ జర్కిహోలి అభిమానులు శుక్రవారం ఓ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జర్కిహోలి.. ఇక్కడ ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాల్కర్ను ఎలాగైనా ఓడించాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో ఆమె తన వల్లే గెలిచిందని, ఈసారి మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవనివ్వొద్దని తేల్చి చెప్పారు. నియోజకవర్గంలోని ఓటర్లకు లక్ష్మీ హెబ్బాల్కర్ మిక్సీలు, కిచెన్ సామాన్లు కానుకగా ఇస్తోందని, వాటి విలువ రూ.3,000 ఉంటుందని రమేశ్ పేర్కొన్నారు. అందుకు రెండింతల డబ్బు తాము ఇస్తామని, బీజేపీకే ఓటు వేయాలని సూచించారు. అయితే ఈ డబ్బులు తాను ఇవ్వనని, తన అభిమానులే సమీకరించి ఓటర్లకు పంపిణీ చేస్తారని జర్కిహోలి పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అందుకు రూ.10 కోట్లు అదనంగా తాము ఖర్చు చేస్తామన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే స్పందన.. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ తోసిపుచ్చారు. మహిళలంటే రమేశ్ జర్కిహోలికి చులకన అని, ఎలాగైనా ఓడించాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎవరికీ కానుకలు, డబ్బు పంచలేదన్నారు. బహిరంగంగా ఓటర్లకు డబ్బు ఇస్తానని చెప్పిన రమేశ్పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. గత ఎన్నికల సమయంలో రమేష్ జర్కిహోలి కూడా కాంగ్రెస్లోనే ఉన్నారు. ఆ తర్వాత బీజేపీలోకి మారారు. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కూలిపోవడంతో ఉపఎన్నికలు వచ్చి బీజేపీ గెలిచి అధికారం చేపట్టింది. చదవండి: మోదీ, దీదీ మధ్య 'మో-మో' ఒప్పందం.. కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు.. -
గుజరాత్లో బీజేపీ పాలనపై తీవ్ర వ్యతిరేకత.. ఈసారి కాంగ్రెస్దే విజయం..
అహ్మదాబాద్: గుజరాత్లో బీజేపీ పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని తెలిపారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు విజయావకాశాలు చాలా మెండుగా ఉన్నాయని అంచనా వేశారు. చాలా ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీ పాలన చూసి ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులతో 12 గంటల మారథాన్ సమావేశంలో మాట్లాడుతూ కేసీ వేణుగోపాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి, గుజరాత్ ఎన్నికల పరిశీలకుడు అశోక్ గహ్లోత్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గుజరాత్లో ఇటీవల కల్తీమద్యం కారణంగా చాలా మంది చనిపోయిన విషయాన్ని కూడా వేణుగోపాల్ ప్రస్తావించారు. డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులు కూడా ఎక్కువయ్యాయని ఆరోపించారు. గజరాత్ ప్రభుత్వం అవినీతి, అసమర్థంగా మారిందని ధ్వజమెత్తారు. అందుకే గతేడాది మంత్రివర్గం మొత్తాన్ని మార్చారని పేర్కొన్నారు. ఇటీవలే ఇద్దరు బీజేపీ నేతలను మంత్రి పదవుల నుంచి తప్పించిన విషయాన్ని గుర్తు చేశారు. గుజరాత్లో 90 రోజుల ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ బుధవారం ప్రారంభించింది. ఈ సారి ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకున్నామని, అందరం ఐకమత్యంతో పోరాడుతామని వేణుగోపాల్ తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏమాత్రం ప్రభావం చూపదని అంతా అనుకున్నారని కానీ కొద్ది సీట్ల తేడాతోనే బీజేపీ గెలిచిందని చెప్పారు. ఈసారి బీజేపీపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నందున కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు. చదవండి: జార్ఖండ్ సీఎం సన్నిహితుడి ఇంట్లో ఏకే 47 తుపాకులు -
ఒక్క ఛాన్స్ - ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఆప్ ఫోకస్
-
ఆ 5 రాష్ట్రాల్లో ఎన్నికలైతే, ఢిల్లీలో పార్టీల ప్రచారమెందుకు? కారణం ఇదే..
More than half of Delhi’s assembly seats are dominated by migrants from other states న్యూఢిల్లీ: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఐతే ఈ ఎన్నికల జాబితాలో ఢిల్లీ లేనప్పటికీ అక్కడ ఎన్నికల జాతర జరుగుతోంది. ఢిల్లీ నలుమూలలా పోస్టర్లు వెలిశాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ పోస్టర్లు ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి. ఢిల్లీలో ఎన్నికల జాతర.. ఆ మూడు రాష్ట్రాల వలసదారుల ఓట్లే కీలకం కాగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్లలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు 2022 జరగనున్నవిషయం తెలిసిందే. ఐతే వీటిలో యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన పోస్టర్లు రాజధాని ఢిల్లీలో ఎక్కపడితే అక్కడ కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వాలు చేస్తున్న పనులు ఏకరువు పెడుతున్న పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఐతే ఢిల్లీలో మొత్తం 70 విధానసభలు ఉన్నాయి. ఇక్కడ అధిక శాతం ప్రజలు యుపీ, బీహార్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానాకు చెందిన వలసదారులు ఉంటున్నారు. అందువల్ల ఈ రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినప్పుడల్లా ఢిల్లీలోని వలసవాసుల దృష్టిని ఏదో ఒక విధంగా ఆకర్షించేందుకు ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. అంతేకాకుండా ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాల్లో 27 స్థానాల్లో మెజార్టీ ప్రజలు పూర్వాంచలికి చెందిన వారే ఉన్నారని సమాచారం. అందుకేనేమో యోగి ప్రభుత్వం ఢిల్లీలో పోస్టర్లు వేసి అక్కడి వలసదారుల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. ప్రజలవద్దకే పోస్టర్లు అలాగే ఢిల్లీ, వికాస్పురి, రాజౌరీ గార్డెన్, హరి నగర్, తిలక్ నగర్, జనక్పురి, మోతీ నగర్, రాజేంద్ర నగర్, గ్రేటర్ కైలాష్, జంగ్పురా, గాంధీ నగర్, మోడల్ టౌన్, లక్ష్మీ నగర్, రోహిణిలోని 13 స్థానాల్లో పంజాబీ ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల చన్నీ ప్రభుత్వం ఇక్కడ పోస్టర్లు వేసి పంజాబీలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఢిల్లీలో కొండ ప్రాంత వలసదారుల సంఖ్య దాదాపు 30 లక్షలు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు సీఎం ధామి పోస్టర్ల ద్వారా బీజేపీ ప్రచారం సాగిస్తోంది. కాగా ఢిల్లీ అసెంబ్లీ స్థానాల్లో సగానికి పైగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలసదారులే ఆధికం. ఈ కారణంగానే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు పోస్టర్లు ద్వారా ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నాయి. చదవండి: మోదీ Vs దీదీ: ప్రధానిపై మమత అసహనం.. మళ్లీ రాజుకున్న రాజకీయ రగడ! -
వివాదాల సుడిగుండం లో కమల్ హాసన్
-
దీదీ ముహూర్తం ఫిక్స్ చేసింది..!
కోల్కతా: కరోనా ఎఫెక్ట్తో బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు బంద్ అయ్యాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు పార్టీలు ర్యాలీలను, ప్లీనరీలను కూడా వర్చవల్గా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా చేరారు. ఈ నెల 21న అమరవీరుల దినోత్సవం సందర్భంగా దీదీ ఒక వర్చువల్ ర్యాలీని నిర్వహించనున్నారు. 1988 నుంచి టీఎంసీ ప్రతి ఏడాది అమరవీరుల దినోత్సవాన్ని జరుపుతుంది. ఇదే రోజున మమత త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నారు. జూలై 21న మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మమత ర్యాలీని ఉద్దేశించి ఫేస్బుక్ ద్వారా ప్రసంగించి.. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని సమాచారం. ఈ క్రమంలో 21 నాటి ర్యాలీ గురించి మమత పార్టీ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు.(కరోనా ఎక్స్ప్రెస్ వ్యాఖ్యలపై దీదీ స్పందన) ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘ఈసారి జూలై 21ని బహిరంగ ప్రదేశంలో జరుపుకోలేకపోతున్నాము. కాని ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు నేను పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తాను. ప్రజలు బూత్ స్థాయిలో గుమి గూడాలి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రతి బూత్లో సుమారు 30 మంది హాజరుకావాలి. తర్వాత జెండా ఎగరవేసి అమరవీరులకు నివాళులు అర్పించాలి. మధ్యాహ్నం 2గంటల నుంచి 3గంటల వరకు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి నేను ప్రసంగిస్తాను’ అని తెలిపారు. బెంగాల్లో సుమారు 80,000 బూత్లు ఉన్నాయి. ప్రతి బూత్లో 30 మంది సమావేశమైతే, సుమారు 2.5 లక్షల మంది పాల్గొనవచ్చు. (కరోనా : బెంగాలీలకు గుడ్న్యూస్) ర్యాలీని ఉద్దేశించి తృణమూల్ చీఫ్ వర్చువల్ మాధ్యమాన్ని ఉపయోగించడం ఇదే మొదటిసారి. బీజేపీ ఇప్పటికే ఇలాంటి ర్యాలీలు ఆరు నిర్వహించింది. మొదటి దానిని అమిత్ షా నిర్వహించారు. దీనిలో ప్రజలు పాల్గొనడానికి బెంగాల్ అంతటా 70,000 టెలివిజన్ సెట్లను ఏర్పాటు చేశామని బీజేపీ పేర్కొన్నది. దీనిపై మమతా బెనర్జీ స్పందిస్తూ.. తృణమూల్ వద్ద ఆ రకమైన డబ్బు లేదు అన్నారు. -
ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: రజినీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని ‘రజనీ మక్కల్ మన్రం(ఆర్ఎంఎం)’ శ్రేణులకు ప్రముఖ నటుడు రజనీకాంత్ పిలుపునిచ్చారు. రాజకీయ రంగప్రవేశానికి సహకరించే ఉద్దేశంతో రజినీకాంత్ ‘రజినీ మక్కల్ మన్రం(ఆర్ఎంఎం)’ అనే సంస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చెన్నైలో గురువారం ఆర్ఎంఎం జిల్లా కార్యదర్శులతో ఆయన సమావేశమయ్యారు. కమల్తో కలిసి వెళ్తే లాభమా..నష్టమా? ఒంటరిగా పోటీ చేస్తే విజయావకాశాలు ఎలా ఉంటాయి? అని చర్చించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం ఆ వివరాలను రజినీ మీడియాతో పంచుకున్నారు. ‘చాలా విషయాలు చర్చించుకున్నాం. వాళ్లంతా సంతృప్తి చెందారు. నాకే ఒక విషయంలో మోసపోయానన్న భావన ఉంది. సమయం వచ్చినప్పుడు దాని గురించి వివరిస్తా’ అని రజినీ వ్యాఖ్యానించారు. -
జార్ఖండ్ మూడో దశలో 62 శాతం పోలింగ్
రాంచి: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మూడో దశ పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఎనిమిది జిల్లాల్లో 17 సీట్లకు జరుగుతోన్న ఈ ఎన్నికల్లో 56 లక్షల మంది (62.6 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని జార్ఖండ్ ప్రధాన ఎన్నికల అధికారి వినయ్ కుమార్ చౌబే వెల్లడించారు. వీరిలో 26 లక్షల మంది మహిళలు, 86 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారని తెలిపారు. పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. రాంచి, హటియా, కాంకే, బర్ఖాతా, రామ్గర్లలో సాయంత్రం 5 గంటల వరకు.. మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 3 గంటల వరకు పోలింగ్ జరిగింది. -
నితీశ్ సారథ్యంలోనే ముందుకెళ్తాం: అమిత్షా
న్యూఢిల్లీ/పాట్నా: ‘జేడీ (యూ)తో మా బంధం బలంగా ఉందని, వచ్చే బీహార్ ఎన్నికలను ముఖ్యమంత్రి నితీశ్కుమార్ నేతృత్వంలోనే ఎదుర్కొంటామని హోం మంత్రి అమిత్షా వ్యాఖ్యానించారు. గత కొన్ని రోజులుగా జేడీ (యూ), బీజేపీ సంబంధాలపై వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. రెండు పార్టీల మధ్య సంకీర్ణ బంధం బలంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. బిహార్లో నితీశ్కుమార్ నాయకత్వంలోనే ఎన్నికలలో పోటీచేస్తాం, జాతీయ స్థాయిలో తమ కూటమికి ప్రధాని మోదీ నాయకత్వం వహిస్తారని షా వెల్లడించారు. ‘కలహాలు సంకీర్ణం ఆరోగ్యకరంగా ఉందనడానికి సంకేతం. విభేదాలు ఉండడం సహజం, వాటిని మనసులోకి తీసుకుంటేనే కష్టం’అని షా అన్నారు. త్రిపుల్ తలాక్ చట్టం, 370 రద్దుపై కేంద్రానికి నితీశ్ కుమార్ మద్దతు ప్రకటించని విషయం తెలిసిందే. -
ఈవీఎంలపై దర్యాప్తు చేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్పై వ్యక్తమైన అనుమానాలపై ఈసీ దర్యాప్తు నిర్వహించాలని సీపీఎం, బీఎల్ఎఫ్ డిమాండ్ చేశాయి. ఫలితాలపై బీఎల్ఎఫ్ అభ్యర్థులతో నిర్వహించిన సమీక్షలో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తమయ్యాయని తెలిపాయి. బుధవారం బీఎల్ఎఫ్ కార్యాలయంలో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విలేకరులతో మాట్లాడుతూ, కొన్ని స్థానాల్లో ఈవీఎంలలో నమోదైన ఓట్లలో గోల్మాల్ జరిగిందని ఆరోపించారు. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు. కొన్ని పోలింగ్ బూత్లలో బీఎల్ఎఫ్ అభ్యర్థులకు తాము వేసిన ఓట్లు వీవీప్యాట్లలో నమోదైనట్టు పలువురు ఓటర్లు తమ దృష్టికి తెచ్చారని, అయితే ఆయా బూత్లలో లెక్కింపు సందర్భంగా తమ అభ్యర్థులకు సున్నా ఓట్లు రావడంతో గోల్మాల్ జరిగిందని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. ఈవీఎంలలో జరిగిన గందరగోళం కారణంగా రికార్డయిన ఓటింగ్కు ప్రిసైడింగ్ అధికారులు ఇచ్చిన వివరాల్లో తేడాలున్నాయన్నారు. ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీల అమలుకు కొంత సమయమిస్తామని, అప్పటికీ వాటి అమల్లో విఫలమైతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. విద్య, వైద్యం, సేద్యం విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఎల్ఎఫ్ను ప్రారంభించిన కొన్ని నెలల్లోనే ఎన్నికలు రావడంతో నిర్మాణం పూర్తిస్థాయిలో జరగలేదన్నారు. సామాజిక న్యాయ ఉద్యమాన్ని తుదివరకూ తీసుకెళ్లాలని సమావేశంలో తీర్మానించినట్టు పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లు తగ్గించొద్దు... గతంలో బీసీలకు ఉన్న రిజర్వేషన్లు ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో తగ్గించడం సరికాదని తమ్మినేని అన్నారు. రిజర్వేషన్లను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను కూడా ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరిస్తేనే ఆయా వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అన్ని సీట్లకు పోటీ... పంచాయతీ ఎన్నికల్లో అన్ని సీట్లకు పోటీ చేస్తామని బీఎల్ఎఫ్ చైర్మన్ నల్లా సూర్యప్రకాశ్ ప్రకటించారు. రాష్ట్రంలో బీసీల జనాభాకు అనుగుణంగా 52 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జనరల్ సీట్లలో కూడా బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పోటీ చేసేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. -
ఒపీనియన్ పోల్స్ : మూడు రాష్ట్రాల్లో బీజేపీకి బిగ్ షాక్
సాక్షి, న్యూఢిల్లీ : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే మూడు కీలక రాష్ట్రాలు మధ్యప్రదేశ్, రాజస్ధాన్, చత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాలతో సత్తా చాటనుందని తాజా ఒపీనియన్ పోల్స్ వెల్లడించాయి. ఏబీపీ న్యూస్-సీ ఓటర్ నిర్వహించిన ఒపీనియన్ పోల్స్లో నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీకి కీలక రాష్ట్రాల్లో ఓటమి తప్పదని స్పష్టమైంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో దీర్ఘకాలంగా ఆయా రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతున్న బీజేపీని రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓడిస్తుందని ఈ సర్వే అంచనా. వేసింది. రాజస్ధాన్లో ఓటర్లు సీఎం పదవికి కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ సచిన్ పైలట్ వైపు అత్యధికంగా మొగ్గు చూపారు. కాగా 15 సంవత్సరాల తర్వాత మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ తిరిగి అధికార పగ్గాలు చేపట్టే స్ధితిలో ఉందని ఒపీనియన్ పోల్స్ వెల్లడించాయి. రాజస్ధాన్లో సీఎం వసుంధరా రాజే నేతృత్వంలోని బీజేపీ సర్కార్పై ప్రజా వ్యతిరేకత తీవ్రస్ధాయిలో నెలకొనడంతో అక్కడ కాంగ్రెస్ సులభంగా విజయం సాధించనుందని సర్వే అంచనా వేసింది. ఇక మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్లో ఇరు ప్రధాన పార్టీల మధ్య ఓట్ల శాతంలో కొద్దిపాటి తేడా ఉన్నా కాంగ్రెస్కు స్వల్ప మొగ్గు ఉండటంతో అధికార పగ్గాలు ఆ పార్టీకి దక్కే అవకాశం ఉందన్నది సర్వే అంచనా. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాజస్ధాన్లో కాంగ్రెస్కు 142 స్ధానాలు దక్కుతాయని, బీజేపీ కేవలం 56 స్ధానాలకు పరిమితమవుతుందని సర్వే పేర్కొంది. యువనేత సచిన్ పైలట్ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్న ఓటర్లు 36 శాతం కాగా, ప్రస్తుత సీఎం వసుంధరా రాజేకు 27 శాతం ఓటర్లు సానుకూలంగా ఉన్నారు. కాంగ్రెస్ నేత, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ను సీఎంగా 24 శాతం మంది కోరుకుంటున్నారు. మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో.. 230 స్ధానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్కు122 స్ధానాలు దక్కుతాయని ఒపీనియన్ పోల్స్ అంచనా వేశాయి. 90 మంది సభ్యులు కలిగిన చత్తీస్గఢ్ అసెంబ్లీలో కాంగ్రెస్కు మేజిక్కు ఫిగర్ను దాటి 47 స్ధానాలు లభిస్తాయని సర్వే అంచనా వేసింది. ఇక ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ వరుసగా 108, 40 స్ధానాలకు పరిమితమవుతుంది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలపై ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, చత్తీస్గఢ్ సీఎం రమణ్ సింగ్లనే తదుపరి సీఎంలుగా ఎక్కువ మంది ఓటర్లు కోరుకోవడం గమనార్హః. కాంగ్రెస్, బీజేపీలకు మధ్యప్రదేశ్లో వరుసగా 42.2 శాతం 41.5 శాతం ఓట్లు దక్కువచ్చని, చత్తీస్గఢ్లో కాంగ్రెస్కు 38.9 శాతం, బీజేపీకి 38.2 శాతం ఓట్లు లభిస్తాయని సర్వే అంచనా వేసింది. రాజస్ధాన్లో మాత్రం కాంగ్రెస్, బీజేపీల మధ్య ఓట్ల శాతంలో భారీ వ్యత్యాసం ఉంటుందని సర్వే అంచనా వేసింది. రాజస్ధాన్లో కాంగ్రెస్కు 49.9 శాతం, బీజేపీకి 34.3 శాతం ఓట్లు పోలవుతాయని పేర్కొంది. చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్ధాన్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాల్లో నవంబర్ 12 నుంచి డిసెంబర్ 7 మధ్య ఎన్నికలు జరుగుతాయని ఈసీ శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నియంతృత్వ పోకడలకు ఓటమి తప్పదు
మొత్తం మీద తెలుగుదేశం పాలనలో దళితులు, బహుజనులు, మైనార్టీలు, రైతులు–ఇలా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యార్థులు తమ చదువులకు ఉద్యోగం రాదనే నిరాశతో వ్యసనాలకు బానిసలౌతున్నారు. బాబు తమ సమస్యలు పరిష్కరించలేరనీ, ఆయన వైఖరిలో మార్పు తీసుకురాలేమని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బాబు నేతృత్వంలోని తెలుగు దేశం ప్రభుత్వాన్ని ఓడించడమే తెలుగు ప్రజలకు ఏకైక మార్గంగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో నియంతృత్వ పోకడలకు తావు లేదు. అప్రజాస్వామిక విధానాలతో పేద, బలహీన వర్గాల క్షేమం పట్టించుకోని నేతలను ఎన్నికల్లో ఓడించిన చరిత్ర మనది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన వ్యాఖ్యల వల్ల దళిత, బహుజన, మైనార్టీ వ్యతిరేకిగా ముద్రపడింది. జూన్ రెండు నుంచి ప్రారంభమయ్యే నవనిర్మాణ దీక్షలకు ఆంధ్రప్రదేశ్ విధ్వంసక దీక్షలని పేరు పెడితే బాగుండేది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యవసాయ, పారి శ్రామిక, సేవా రంగాలను ఇతర దేశాలకు తాకట్టు పెడుతూ వచ్చారు. పది లక్షల మంది యువకులకు వెయ్యి రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని ఆయన కుమారుడు, రాష్ట్ర మంత్రి లోకేష్తో ప్రకటన చేయించారు. రాష్ట్రానికి కోట్లాది రూపాయల పెట్టుబడులు వచ్చినట్టు, కొత్త ఉద్యోగాలు కల్పించినట్టు చంద్రబాబు చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో భూములు, మౌలిక వనరులను విదేశీ పెట్టుబడి దారులకు అమ్ముతున్నారు. ముఖ్యమంత్రికి ఓడ రేవుల నిర్మాణం మీద దృష్టి లేదు. విపరీతంగా అడవులు నరకడం, ఇసుక తవ్వ కాల వల్ల కోస్తా ప్రాంతంలో పర్యావరణ సమతుల్యత లోపిం చింది. తెలుగుదేశం మహాసభల్లో దళితులకు సబ్ప్లాన్ నిధుల పరిరక్షణపై తీర్మానం చేయలేదు. దళిత భూముల్ని నీరు, చెట్టు పేరుతో ఆక్రమించి భూస్వాముల అధీనంలోకి వెళ్లేలా చేస్తు న్నారు. నాలుగేళ్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో తెలుగు దేశం భాగస్వామిగా కొనసాగింది. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ప్యాకేజీ చాలని గతంలో ప్రకటించిన సీఎం ఇప్పుడు తన అనుయా యులతో మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్షాలను హిట్లర్, ముసో లిని అంటూ తిట్టిస్తున్నారు. రాజధాని నిర్మాణానికి వేలాది ఎకరాల భూములను చంద్ర బాబు సర్కారు సేకరించింది. వీటన్నిటినీ విదేశీ, స్వదేశీ పెట్టుబడి దారులకు పారిశ్రామిక ప్రోత్సాహం పేరిట కేవలం రూ.100 కోట్లకే ఇస్తున్నారు. రాష్ట్రానికి 90 శాతం కేంద్రం గ్రాంటుగా ఇస్తే ఆంధ్రప్రదేశ్కి వచ్చేది రు.25,000 కోట్లు మాత్రమే. ఇందులో రు.13,000 కోట్లు ఇప్పటికే ఇచ్చినట్టు కేంద్రం చెబుతోంది. విదేశీ బ్యాంకుల నుంచే ఎక్కువ రుణాలు తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. రాష్ట్రంలో చిన్న పిల్లల మీద అత్యాచారాలు పెరగ డానికి విపరీతంగా పెరుగుతున్న మద్యం దుకాణాలే కారణం. గుంటూరు జిల్లాలోని అనేక పట్టణాల్లో తెలుగుదేశం నాయకులు మద్యం దుకాణాలు నడుపుతున్నారు. రాష్ట్రంలో తాగుడువల్ల మర ణించిన వారి సంఖ్య పెరుగుతోంది. వారి పిల్లలు అనాథలవుతు న్నారు. అత్యాచారానికి గురయ్యే పిల్లల్లో కూడా తండ్రిలేని పిల్లలే ఎక్కువ. తెలుగుదేశం స్థాపకుడు, చంద్రబాబు మామ ఎన్టీ రామా రావు ప్రజల కోరిక మేరకు 1995లో మద్యపాన నిషేధం ప్రవేశపె ట్టారు. ఎన్టీఆర్ తర్వాత సీఎం పదవి చేపట్టిన బాబు నెమ్మదిగా నిషేధం సడలించి తర్వాత పూర్తిగా ఎత్తి వేశారు. బిహార్లో రెండేళ్ల క్రితం మద్య నిషేధం ప్రకటించాక ఉత్పాదకత, ప్రజల ఆదా యాలు పెరిగాయి. ఫలితంగా పెట్టుబడిదారులు పరిశ్రమలు పెట్టడానికి బిహార్ పరిగెత్తుతున్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం ఏపీకి అత్యవసరం. తెలుగుదేశం పాలనలో నదులు, చెరు వులు మురికి కూపాలుగా మారుతున్నాయి. రాష్ట్రంలో దళితుల కష్టాలు పెరిగిపోతున్నాయి. వారిలో 80 శాతం వ్యవసాయ కూలీలే.. వ్యవసాయంలో యంత్రాల విని యోగం పెరగడంతో కూలి దినాలు తగ్గిపోతున్నాయి. దళితులు వలస బాట పట్టాల్సి వస్తోంది. ఈ వలసల వల్ల వృద్ధులు, చదువుకునే పిల్లలకు ఆసరా లేకుండా పోయింది. దళితులకు ఇతర ఉపాధి అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి. దళితులకు ప్రధాన ఉపాధి వనరు భూమి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఎకరం భూమి కూడా దళితులకు ఇవ్వలేదు. భూమి దళి తుల ఆత్మగౌరవానికి హామీ ఇస్తుంది. గ్రామం పునాదులు గట్టి పడాలంటే దళితులకు భూమి ఇవ్వాలని బీఆర్ అంబేడ్కర్ చెప్పారు. భారతదేశం మొదటి ప్రణాళికలోనే దళితులకు భూమి కొనుగోలు పథకాన్ని ప్రవేశపెట్టారు అంబేడ్కర్. వ్యవసాయ ఆధా రిత పరిశ్రమల వృద్ధి, నదులు, సముద్రాలను ఉత్పత్తికేంద్రాలుగా మార్చడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. బాబు పాల నలో గనుల తవ్వకాల వల్ల ఈ మూడు పనులు ఆగిపోయాయి. రాష్ట్రంలో భవన నిర్మాణం, ఉపాధి పనుల్లో, ముఖ్యంగా సామా జిక, సాంస్కృతిక, ఆర్థిక కార్యకలాపాల్లో దళితులే కీలక పాత్ర పోషిస్తున్నారు. దళితుల జీవన వ్యవస్థల్ని బలహీన పరచడం వల్ల రాష్ట్రం ముందుకు సాగదని పాలకులు గుర్తించడం లేదు. ముఖ్యమంత్రి ప్రభుత్వ రంగాన్ని బాగా దెబ్బతీస్తూ, ప్రైవేటు రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దానివల్ల దళి తులు, బహుజనులు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు దూరమౌ తున్నారు. 2018–19లో దళితులకు రూ.11,228 కోట్లు ఉప ప్రణా ళిక కింద, రూ.4,278 కోట్లు బడ్జెట్ కింద చూపారు. అదే విధంగా ఆదివాసీలకు (గిరిజనులకు) రూ.27,566 కోట్లు బడ్జెట్ ఉప ప్రణాళిక కింద కేటాయించారు. దళితులు, ఆదివాసీలకు కేటా యించిన నిధుల్లో కనీసం 70 శాతం ఖర్చు చేసినా కొంత సమాజిక మార్పు జరిగేది. మొత్తంమీద తెలుగుదేశం పాలనలో దళితులు, బహుజనులు, మైనార్టీలు, రైతులు–ఇలా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యార్థులు తమ చదు వులకు ఉద్యోగం రాదనే నిరాశతో వ్యసనాలకు బానిసలౌతు న్నారు. బాబు తమ సమస్యలు పరిష్కరించలేరనీ, ఆయన వైఖ రిలో మార్పు తీసుకురాలేమని అన్ని వర్గాల ప్రజలు భావిస్తు న్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బాబు నేతృత్వంలోని తెలుగు దేశం ప్రభుత్వాన్ని ఓడించడమే తెలుగు ప్రజలకు ఏకైక మార్గంగా కనిపిస్తోంది. ఉపాధి కల్పనలో, ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలం కావడం, పెట్రోలు, డీజిల్ ధరలు అదుపుచేయలేకపో వడం వంటి కారణాల వల్ల కేంద్రంలో పాలకపక్షమైన బీజేపీ, దాని మిత్రపక్షాలు మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన లోక్సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పరాజయం పాలయ్యాయి. అనేక రాష్ట్రాల్లో దళితులు, వెనుకబడిన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, పేదలు పాలకపక్షాలకు వ్యతిరేకంగా ఏక మౌతున్నారు. అదే మార్గంలో ఏపీలో కూడా ప్రజలు పాలక పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడే రాజకీయ సమీకరణలకు మద్దతు పలకాలి. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం పట్టించుకోకుండా ధనికులకే దోచిపెట్టే పార్టీలను ఓడించడానికి సామాజిక సమీకరణలు తోడ్ప డతాయి. సామాజిక విప్లవకారులు బి.ఆర్. అంబేడ్కర్, మహాత్మా ఫూలే ఆలోచనలు ప్రతిపక్షాల వాక్కుల్లో, ఆచరణలో ప్రతిబింబిం చాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో నియంతృత్వ పోకడలకు తావు లేదు. అప్రజాస్వామిక విధానాలతో పేద, బలహీన వర్గాల క్షేమం పట్టించుకోని నేతలను ఎన్నికల్లో ఓడించిన చరిత్ర మనది. - డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, నవ్యాంధ్రపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ‘ 98497 41695 -
బీజేపీలోకి హిమాచల్ మంత్రి
సిమ్లా: వచ్చే నెల 9న హిమాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ ప్రభుత్వం నుంచి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అనిల్ శర్మ తప్పుకుని బీజేపీలో చేరారు. కేంద్ర కమ్యునికేషన్ శాఖ మాజీ మంత్రి సుఖ్రాం కుమారుడే ఈ అనిల్ శర్మ. తాను కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగి బీజేపీ తీర్థం పుచ్చుకున్నట్లు ఆదివారం అనిల్ శర్మ ప్రకటించారు. మండీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా తనకు బీజేపీ టికెట్ ఇచ్చిందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 7న మండీలో రాహుల్ గాంధీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి హాజరవ్వాల్సిందిగా ఏఐసీసీ నుంచి తన తండ్రికి తొలుత ఆహ్వానం అందిందని, తీరా అక్కడికి వెళ్లేసరికి ర్యాలీకి రావాల్సిన అవసరం లేదంటూ అవమానించి పంపించారని విచారం వ్యక్తంచేశారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన ఏ కమిటీల్లోనూ తనను భాగం చేయలేదని, దీనిపై తాను హెచ్పీసీసీ అధ్యక్షుడిని సంప్రదిస్తే అధిష్టానం తన పేరును తొలగించాల్సిందిగా ఆదేశించినట్లు ఆయన చెప్పారని వెల్లడించారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ చెల్లెలు అర్పితాఖాన్ శర్మ మామే అనిల్శర్మ. నేడు నోటిఫికేషన్ జారీ: హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ నేడు నోటిఫికేషన్ జారీచేయనుంది. దీంతో సోమవారం నుంచి నామినేషన్లు మొదలు కానున్నాయి. అక్టోబర్ 23 వరకు నామినేషన్ల పర్వం కొనసాగనుంది. ఈ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేదు. -
డిసెంబర్లో గుజరాత్ ఎన్నికలు!
అహ్మదాబాద్: ఈ ఏడాది డిసెంబర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం సంకేతాలిచ్చింది. ‘జనవరి మూడో వారంలో రాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం ముగుస్తుంది. ఇందుకోసం డిసెంబర్లో ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉంది’ అని ప్రధాన ఎన్నికల అధికారి ఏకే జోతి వెల్లడించారు. అయితే ఎన్నికలకు సంబంధించిన ఇతర విషయాలు వెల్లడించేందుకు నిరాకరించారు. తొలిసారిగా గుజరాత్ వ్యాప్తంగా ఓటరు ధ్రువీకరణ పత్రాలున్న ఓటింగ్ యంత్రాలతోపాటుగా నియోజకవర్గానికి కనీసం ఒక్కటైనా పూర్తి మహిళా ఓటర్లున్న పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై యోచిస్తున్నట్లు చెప్పారు. గుజరాత్లో ఎన్నికల సంసిద్ధతను పరీక్షించేందుకు ఎన్నికల సంఘం అధికారులు ఇటీవలే రాష్ట్రమంతా పర్యటించారు. -
ఓటు వేయవద్దని డబ్బు పంపిణీ!
గుంటూరు: ఎన్నికల వేళ అభ్యర్థులు దారుణాతిదారుణాలన్నింటినీ రెండు రోజుల్లో చూపిస్తారు. నమ్మలేనివిధంగా ప్రవర్తిస్తుంటారు. ఎన్నికలలో గెలవడం కోసం డబ్బు - కులం - మద్యం - మతం - ప్రాదేయపడటం - బెదిరింపు...ఇలా ఏది వీలైతే అది, దేని ద్వారా పని అవుతుందనుకుంటే దానిని అనుసరిస్తుంటారు. చిత్రవిచిత్రాలు అన్ని చూపిస్తారు. విలువలకు తిలోదకాలు ఇచ్చేస్తారు. ఎన్నికల సంఘం ఎన్ని నిబంధనలు ప్రకటించినా పట్టించుకునేవారులేరు. ఆ నిబందనలు అన్నింటినీ తుంగలోతొక్కి వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు. సాదారణంగా అభ్యర్థులు తమకు ఓటు వేయమని డబ్బులు ఇస్తుంటారు. కానీ గుంటూరు జిల్లా నరసరావుపేటలో మాత్రం అసలు ఓటు వేయవద్దని డబ్బులు పంచుతున్నారు. బిజెపి అంటే ముస్లీంలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. వారు ఓటు వేస్తే బిజెపియేతర పార్టీకి ఓటు వేస్తారు. అందువల్ల వారిని ఓటింగ్కు రావద్దని డబ్బు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. సాలెంనగర్, ఇస్లాంపేటలలో విచ్చలవిడిగా డబ్బుపంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. -
సారీ.... అన్నా..!
ఉపసంహరణకు ముందుకు రాని అభ్యర్థులు పార్టీ నేతలతో మొదలైన టెన్షన్ పనిచేయని ఆఫర్లు, ప్యాకేజీలు నేడు మధ్యాహ్నం 3గంటల వరకే గడువు కలెక్టరేట్, న్యూస్లైన్: రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు, 14అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేసిన స్వతంత్ర అభ్యర్థులకు ప్రధాన పార్టీల నేతలు జరిపిన మంతనాలకు వారెవ్వరు ఒప్పుకోకపోగా, సారీ అంటూ చేతల్లో చూపించారు. నామినేషన్ల ఉపసంహరణ మొదటి రోజైనా శుక్రవారం ఏఒక్క అభ్యర్థి అయినా ఉపసంహరించుకొనేందుకు ముందుకు రాలేదు. దీంతో ప్రధాన పార్టీల నేతల గుండెల్లో బరిలో ఉన్నా స్వతంత్ర అభ్యర్థులు రైళ్లు పరుగెత్తిస్తున్నారు. నామినేషన్లు దాఖలు చేసినప్పటినుంచి వారితో రెగ్యులర్గా మంతనాల్ని జరుపుతున్నా, తొలి రోజు ఉపయోగం లేకపోయింది. ఇక కొంత మంది స్వతంత్ర అభ్యర్థులకైతే అడిగినంతా ఇస్తాం, లేదంటే మంచి ప్యాకేజీలను ఇస్తామని ప్రకటించినా, బరిలో ఉన్న వారు అసక్తి కనపర్చడంలేదని తెలుస్తోంది. వీరికి ఇంకేం చేస్తే ఉపసంహరించుకుంటారని ప్రధాన పార్టీల నేతలు సమాలోచనలో పడ్డారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో: మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో 16మంది అభ్యర్థులు బరిలో ఉండగా, ఏఒక్కరు ఉపసంహరించుకోలేదు. ఇక నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో 8మంది అభ్యర్థులు బరిలో ఉండగా, ఎవ్వరు ముందుకు రాకపోవడంతో వీరంతా బరిలో ఉంటారనే తెలుస్తోంది. ఇక రాత్రి రాత్రి చర్చల్లో ఎంత మందికి ముందుకు వస్తారానేది వేచి చూడాలి. అసెంబ్లీ బరిలో... 14అసెంబ్లీ నియోజకవర్గాల్లో 213మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో అచ్చంపేట్లో గువ్వల అమల, నారాయణపేట్ విఠల్ రావు ఆర్యాలు ఉపసంహరణకు దరఖాస్తు చేసుకొన్నట్లు అధికారులు చెబుతున్నారు. అధికారికంగా అమోదించలేదని అధికారులు పేర్కొన్నారు. ఇక అన్నింటికంటే ఎక్కువగా మహబూబ్నగర్ నియోజకవర్గంలోనే 24మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరంతా ఎవరికి వారే గెలుస్తామనే ధీమాలో ఉండడంతో, ప్రధాన పార్టీ అభ్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు. వీరిచే ఉపసంహరించేందుకు ప్రధాన పార్టీల నేతలు చేయని ప్రయత్నమంటూ ఏమీ లేదు, అయినా ఫలితం కనిపించలేదు. దీంతో ఓనేత ఏకంగా స్వతంత్ర అభ్యర్థిని బెదిరించడంతో, అతను గడువు ముగిసేంత వరకు అండర్ గ్రౌండ్ల్లోకి వెళ్లినట్లు సమాచారం. నేటితో ముగింపు...ఉపసంహరణకు విధించిన గడువు నేడు మధ్యాహ్నం 3గంటలతో ముగియనుంది. ఇందుకుగాను స్వతంత్ర అభ్యర్థులచే ఉపసంహరింపజేసేందుకు ప్రధాన పార్టీలైతే ఏకంగా రాష్ట్ర నేతల్ని రంగంలోకి దింపారు. వీరి ప్రయత్నాలు, ప్యాకేజీలు, ఆఫర్లు ఎంత వరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే. -
ఈవీఎంలపై అవగాహనేదీ?
నూతనంగా రెండు ఆప్షన్లు నోటా, వీవీపాట్పై ప్రచారం కరువు కలెక్టరేట్, న్యూస్లైన్ : ఓటర్ల కోసం ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన నూతన ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లపై ప్రచారం కరువైంది. నూతన ఆప్షన్లతో ప్రవేశపెట్టిన ఈవీఎంలపై ఓటర్లు, రాజకీయ నాయకులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అవగాహన పొందలేకపోయారు. మరోవైపు ఈవీఎంలలో మరో రెండు ఆప్షన్లను చేర్చారు. ఒకటి ఁనోటా* (నన్ ఆఫ్ ది ఎబో), రెండో వీవీపాట్ (ఓటర్ వెరిఫైయబుల్ ప్రింట్ ఆడిట్ ట్రయల్). నచ్చిన వ్యక్తికి ఓటేయడంతో పాటు బరిలో నిలిచిన అభ్యర్థులు నచ్చకుంటే నోటా అనే బటన్ను నొక్కి తిరస్కరించవచ్చు. అలాగే తమ ఓటు సక్రమంగా నమోదైందా? లేదా? అనే విషయం తెలుసుకునేందుకు (వీవీపాట్) రశీదు అందుతుంది. అవగాహన కరువు.. నూతనంగా ప్రవేశపెట్టిన ఈ వెసులుబాట్లపై ఎంతమందికి అవగాహన ఉందనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఇన్ని రోజులు ఈవీఎంలో ఏదో ఒక మీటను నొక్కి.. నచ్చిన వ్యక్తికి ఓటేయడం మాత్రమే ఓటర్లకు తెలుసు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో తొలిసారిగా అమలవుతున్న తిరస్కరణ ఓటు (నోటా), ఓటు రశీదు (వీవీపాట్)పై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. జిల్లాలో ఇటీవల నిర్వహించిన మున్సిపల్, నగరపాలక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించినా అందులో నోటా, వీవీపాట్ ప్రవేశపెట్టలేదు. మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. దీంతో ఈవీఎంలపై ఓటర్లకు అవగాహన లేకుండాపోయింది. ఈవీఎంల పనితీరుపై గతంలో రాజకీయ పార్టీలు అనేక అనుమానాలు వెలిబుచ్చాయి. ఈ క్రమంలో నాయకుల సమక్షంలో ఈవీఎంల పనితీరుపై అవగాహన కల్పించాల్సి ఉన్నా.. చర్యలు తీసుకోవడంలో అధికారులు జాప్యం చేస్తున్నారు. ఓటు రశీదు జిల్లాలో 13 అసెంబ్లీ, రెండు ఎంపీ నియోజకవర్గాలున్నాయి. వీటి పరిధిలో 3,390 పోలింగ్ బూతులున్నాయి. 9500 బ్యాలెట్ యూనిట్లు, 7500 కంట్రోల్ యూనిట్లు జిల్లాకు వచ్చాయి. ఇంకా 100 కంట్రోల్ యూనిట్లు, దాదాపు 500 బ్యాలెట్ యూనిట్లు రావాల్సి ఉంది. ప్రతి ఈవీఎంలలో బ్యాలెట్ యూనిట్లు పేరుతో రెండు విడివిడి బాగాలుంటాయి. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం వచ్చిన ఈ సరికొత్త ఈవీఎంల పనితీరును ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంజినీర్లు పరిశీలిస్తారు. నోటా మీట నొక్కి అభ్యర్థులను తిరస్కరించే వెసులుబాటుతో పాటు ఓటు వేసిన అనంతరం ఓటరు చేతికి రశీదు అందజేస్తారు. అయితే ఓటరు రశీదు పొందే విధానాన్ని ఈసారి జిల్లాలో ప్రవేశపెట్టే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. -
కార్యకర్తల ఆగ్రహం...నేతల్లో ఓటమి భయం
-
47 నామినేషన్లు తిరస్కరణ..!
అసెంబ్లీ బరిలో 227 మంది లోక్సభకు 37 మంది పోటీ సాక్షి, కరీంనగర్ : జిల్లాలోని 13 అసెంబ్లీ, రెండు లోక్సభ స్థానాల ఎన్నికలకు సంబంధించి ఈనెల 2 నుంచి 9 వరకు నామినేషన్లు స్వీకరించారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 270 మంది 500 నామినేషన్ల సెట్లు దాఖలు చేశారు. గురువారం పరిశీలనలో 43 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 227 మంది బరిలో నిలిచారు. రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో 41 మంది 70 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులోంచి నాలుగు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 37 మంది బరిలో ఉన్నారు. ఈనెల 12న నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశముంది. హుస్నాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి గట్టి దెబ్బతగిలింది. నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ విజయేందర్రెడ్డిని ఆ పార్టీ ముందుగానే ప్రకటించింది. దీంతో టికెట్టు విజయేందర్రెడ్డికే వస్తుందని అందరూ భావించారు. నాటకీయ పరిణామాల మధ్య పార్టీ బీ ఫామ్ తెచ్చుకున్న దేవిశెట్టి శ్రీనివాసరావు ఈనెల 9న నామినేషన్ వేశారు. అయితే ఏ ఫాం సమర్పించకపోవడంతో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది. హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ప్యాట రమేశ్ బీఫాం సమర్పించకపోవడంతో తిరస్కరణకు గురైంది. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్రెడ్డి పెద్దపల్లి అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశారు. బీఫాం రాకపోవడంతో నామినేషన్ తిరస్కరణకు గురైంది. టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా కోరుట్ల నియోజకవర్గం బీజేపీకి కేటాయించా రు. అక్కడ టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి సాంబరి ప్రభాకర్ పార్టీ తరఫున నామినేషన్ వేశారు. బీఫాం లేకపోవడంతో తిరస్కరణకు గురైంది. రామగుండంలో కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేసిన కోలేటి దామోదర్ బీ ఫారం సమర్పించకపోవడంతో తిరస్కరించారు. పెద్దపల్లి పార్లమెంట్ కునామినేషన్ వేసిన సిరిపురం మాణిక్యం బీ ఫాం ఇవ్వకపోవడంతో తిరస్కరణకు గురైంది. వేములవాడలో కాంగ్రెస్ టికెట్ బొమ్మ వెంకటేశ్వర్లుకు కేటాయించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగు మనోహర్రెడ్డి నామినేషన్ వేశారు. బీఫాం లేకపోవడంతో నామినేషన్ను తిరస్కరించారు. టీఆర్ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు సతీమణి కల్వకుంట్ల సరోజ, మంథనిలో పుట్ట శైలజ నామినేషన్లు తిరస్కరించారు. -
ఉద్యమాల గడ్డనుంచే శంఖారావం
13న కేసీఆర్.. 16న సోనియా.. పోటాపోటీగా టీఆర్ఎస్, కాంగ్రెస్ బహిరంగ సభలు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి పదునుపెట్టాయి. తెలంగాణలో గెలుపే ధ్యేయంగా రెండు పార్టీలు పావులు కదుపుతున్నాయి. రాష్ట్ర సాధన తమ ఘనతేనని చెప్పుకుంటూ ఓట్లు రాబట్టుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ తరుణంలో రెండు పార్టీల అధినేతలు జిల్లా నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించనుండటం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డగా పేరొందిన కరీంనగర్ నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు. - న్యూస్లైన్, కరీంనగర్ సిటీ 16న సోనియా సభ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈ నెల 16వ తేదీన జిల్లాకు రానున్నారు. నగరంలో జరిగే భారీ బహిరంగసభలో ఆమె పాల్గొంటారు. 2004 ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్లో జరిగిన బహిరంగ సభలో సోనియాగాంధీ పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల మనసులో ఉన్న కోరికను నెరవేరుస్తామని ఆమె ప్రకటించారు. కరీంనగర్లో ఇచ్చిన మాటకు కట్టుబడే ఎన్ని అవాంతరాలు ఎదురైనా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని కాంగ్రెస్ నేతలు పదేపదే చెబుతున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల నినాదంగా ప్రజల్లోకి తీసుకె ళ్లడం ద్వారా లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో సోనియా బహిరంగసభను నిర్వహించడం ద్వారా తెలంగాణ క్రెడిట్ను తమ ఖాతాలో వేసుకొనేందుకు కాంగ్రెస్ నాయకులు వ్యూహరచన చేస్తున్నారు. సోనియా కృతజ్ఞత సభ గతంలో మూడుసార్లు వాయిదాపడగా, ఏకంగా సోనియాతోనే సభనిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. 13న కేసీఆర్ శంఖారావం కేసీఆర్ తన సెంటిమెంట్ ప్రకారం ఎన్నికల శంఖారావం ఇక్కడే పూరించనున్నా రు. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా జరుగుతున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం 7నుంచి.. 11వ తేదీకి సభను వాయిదా వేశారు. అదే రోజు ఎంపీటీసీ, జెడ్పీటీసీ రెండో విడత ఎన్నికలు ఉన్నందున ఈ నెల 12న నిర్వహిస్తామన్నారు. చివరకు 13న ఖరారు చేశారు. ఎస్సారార్ కళాశాల మైదానంలో సభ నిర్వహిస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. పదమూడేళ్ల తమ పోరాటాలతోనే తెలంగాణ వచ్చిందని, రాష్ట్ర వికాసం సైతం తమతోనే సాధ్యమనే సందేశాన్ని కేసీఆర్ ఈ సభ ద్వారా ప్రజలకు ఇవ్వనున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత 2001లో ఎస్సారార్ కళాశాల మైదానంలో జరిగిన సంహరగ్జన సభ తరహాలోనే దీనిని విజయవంతం చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. -
పేదల సంక్షేమం వైఎస్సార్సీపీ లక్ష్యం
ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి అనంతపురం అర్బన్, న్యూస్లైన్ : పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం వైఎస్సార్సీపీ లక్ష్యమని ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి అన్నారు. నగరంలోని నీరుగంటి వీధిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముస్లిం మైనార్టీలు షఫీమహ్మద్, సమబేగం, సతాజ్ బేగం, అమానుల్లా, మస్తాన్వలి, షాషావలి, సమీర్ఖాన్, సఖిల్ అహ్మద్ తదితరులు గురువారం వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న విధానాలతో ప్రజలు విసిగిపోయారన్నారు. బాబు తన తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపారని గుర్తు చేశారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బడుగు, బలహీన వర్గాలను అక్కున చేర్చుకుని వారి అభ్యున్నతికి కృషి చేశారన్నారు. ఆయన మరణానంతరం రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు పరాకాష్టకు చేరాయన్నారు. ఈ రెండు పార్టీలే రాష్ట్ర విభ జనకు ప్రధాన కారణమన్నారు. టీడీపీ మొదటి నుంచి మైనార్టీలను మోసం చేస్తోందన్నారు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహానుభావుడు వైఎస్సార్ అని గుర్తు చేశారు. రాష్ట్రంలో సమర్థ నాయకుడైన జగన్ నాయకత్వం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. తన తండ్రిలాగా ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలకు మేలు చేస్తారన్నారు. వైఎస్సార్సీపీ నేత బి.ఎర్రిస్వామిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్లను ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయం తథ్యమన్నారు. పార్టీలో చేరిన షఫీమహ్మద్ మాట్లాడుతూ మైనార్టీలకు న్యాయం చేసే ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీ అని అన్నారు. సీపీఐ నుంచి 200 మంది వైఎస్సార్సీపీలోకి బిందెల కాలనీలో సీపీఐ నుంచి 200 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. చేరిన వారిలో నారాయణస్వామి, యల్లప్ప, ఆదెప్ప, సుంకన్న, పెద్దమారెన్న, ఆంజినేయులు, కుళ్లాయప్ప, వీరయ్య, ఎం స్వామి, చిన్నమారెన్న, సీ మల్లిక, కుళ్లాయప్ప, శంకరయ్య, మిద్దె లింగరాజు, బీబీపాతిమా, మారెక్క, సరస్వతి తదితరులు ఉన్నారు. వీరికి ఎమ్మెల్యే గురునాథరెడ్డి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. -
నామినేషన్ల జాతర
వరంగల్, న్యూస్లైన్: సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్లకు చివరి రోజు అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్ల వేశారు. బుధవారం ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ, వైఎస్సార్సీపీతో పాటు రెబల్స్, స్వతంత్రులు, ఇతర పక్షాల అభ్యర్థులు పోటీపడి నామినేషన్లు వేయడంతో నామినేషన్ల కేంద్రాల వద్ద జాతరను తలపించింది. జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాలలో వరంగల్కు 14, మహబూబాద్కు 16 నామినేషన్లు దాఖలయ్యాయి. 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు 314 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా పాలకుర్తిలో 43, వర్ధన్నపేటల్లో 42 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. డోర్నకల్ నియోజకవర్గంలో తక్కువగా 14 నామినేషన్లు దాఖలయ్యాయి. స్క్రూట్నీ, ఉపసంహరణ తర్వాత బరిలో ఎంత మంది ఉంటారో వేచి చూడాలి. బలప్రదర్శనలు నామినేషన్ దాఖలు సందర్భంగా అభ్యర్థులు బలప్రదర్శనకు యత్నించారు. అభ్యర్ధులు చేపట్టిన ర్యాలీలు హోరెత్తారు. ఉదయం నుంచి నామినేషన్ల సమయం ముగిసే వరకు ఒకరి తర్వాత ఒకరు సెంటర్లకు బృందాలుగా వచ్చారు. తమ కార్యకర్తలు, అనుచరులతో భారీ ర్యాలీలు నిర్వహించారు. తొలి ప్రచారంలో ఏ మాత్రం వెనుకంజ వేయకుండా భారీగా జనాన్ని సమీకరించేందుకు యత్నించారు. ఎన్నికల అధికారులకు, పోలీసులకు ఇది పెద్ద పరీక్షగా మారింది. -
టీఆర్ఎస్తోనే బంగారు తెలంగాణ సాధ్యం
పాలకుర్తి టౌన్, న్యూస్లైన్ : తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించిన టీఆర్ఎస్తోనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమవుతుంది.. కేసీఆర్తోనే బంగారు తెలంగా ణ కల సాకారమవుతుందని టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు, వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ ఎన్.సుధాకర్రావు నామినేషన్ వేసే సందర్భా న్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన బహిరంగ సభలో శ్రీహరి మాట్లాడారు. కేసీఆర్ పోరా టం వల్లే తెలంగాణ ఏర్పడిందన్నారు. చంద్రబాబు అడుగులకు ముడగులొత్తుతున్న తెలంగాణ ద్రోహి ఎర్రబెల్లి దయాకర్రావును పాల కుర్తి సోమన్న సాక్షిగా డిపాడిట్ రాకుండా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 1969, 2004లో జరిగిన ఉద్యమంలో 1200 మంది అమరుల ఆత్మబాలిదానాలకు కాంగ్రెస్ పార్టీ కారణం కాదా..? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే పొన్నాల లక్ష్మయ్య అమెరికా పారిపోయాడని గుర్తు చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ పునర్మిర్మాణంతో పాటు జిల్లా, గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. నా హయాంలోనే అభివృద్ధి జరిగింది : సుధాకర్రావు నియోజకవర్గంలో తన హయంలోనే అభివృద్ధి జరిగిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఎన్.సుధాకర్రావు అన్నారు. తన తండ్రి యతి రాజారావు, తల్లి విమలాదేవి 40 ఏళ్లు ప్రజలకు సేవా చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ద్రోహులకు పాలకుర్తిలో స్థానం లేదని, వచ్చే ఎన్నికల్లో ఎర్రబెల్లి, దుగ్యాలను డిపాటిట్ రాకుండా ఓడించి నియోజకవర్గం నుంచి తరిమి కొట్టాల ని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీ గా కడియం శ్రీహరిని గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. సమావేశంలో నియోజకవర్గం లోని అన్ని మండలాల జెడ్పీటీసీ అభ్యర్థులు, మాడ్గుల నట్వర్, దైద ప్రియాంక, చిలుక దేవేంద్ర, జాటోతు కమలాకర్, చిర్ర ఉపేంద్ర, అల్లంనేని కమలాకర్రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు ముస్కు రాంబాబు, మూల వెంకటేశ్వర్లు, మొల్గూరి రమేష్, పాలకుర్తి యాదగిరి రావు, కేతిరెడ్డి సోమనర్సింహారెడ్డి, తాళ్లపెల్లి నర్సయ్య, పుస్కూరి శ్రీనివాస్రావు, ఎండీ.అప్రోజ్, ముత్తినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ను చిత్తుగా ఓడించాలి
హుజూర్నగర్, న్యూస్లైన్,అధికారాన్ని అడ్డం పెట్టుకొని నియంతృత్వ పాలన కొనసాగిస్తూ అవినీతికి ఊతమిచ్చిన కాంగ్రెస్ పార్టీని సాధారణ ఎన్నికలలో చిత్తుగా ఓడించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గట్టు శ్రీకాంత్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వేలాది మంది కార్యకర్తలు, నాయకులతో కలిసి మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పబ్లిక్ క్లబ్లో నిర్వహించిన సభలో మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అనర్హులకు అమ్ముకొని సొమ్ము చేసుకున్న అధికార పార్టీ నాయకులను నిలదీయాలన్నారు. పేదవాడికి గూడు కల్పించాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యాపారంగా మార్చేశారన్నారు. ఇల్లు మంజూరు చేయిస్తే ఒక రేటు, బిల్లులు ఇప్పిస్తే మరో రేటు అంటూ హౌసింగ్ కార్యాల యాలను పైరవీకారులకు అడ్డాలుగా మార్చారన్నారు. మరుగుదొడ్ల నిర్మాణంలో కూడా రాజకీ యం చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కిందన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా పేకాటక్లబ్లు, ఇసుక దందాలు నిర్వహించి అక్రమంగా సొమ్ము సం పాదించి ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని చెప్పారు. నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక, భవిష్యత్లో ఇబ్బంది అవుతుందని తనపై అనేక అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు. అయినా ప్రజలు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు తనను ఆదరించారని, వారి ఆదరణ ఫలితంగానే గడిచిన నాలుగేళ్లుగా నియోజకవర్గంలో నిలబడగలిగామని శ్రీకాంత్రెడ్డి చెప్పారు. వైఎస్సార్ సీపీని గెలిపించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లాగా పని చేయాలని కోరారు. ఈ ఎన్నికలలో వైఎస్సార్ సీపీని గెలిపిస్తే మీలో ఒకడిగా, మీ కుటుంబ సభ్యునిగా నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేస్తానన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సంక్షేమ రాజ్యం మళ్లీ రావాలంటే వైఎస్సార్ సీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ వివిధ మండలాల అధ్యక్షులు అయిల వెంకన్నగౌడ్, వేములశేఖర్రెడ్డి, బొల్లగాని సైదులు, పోరెడ్డి నర్సిరెడ్డి, చిలకల శ్రీనివాసరెడ్డి, జాల కిరణ్యాదవ్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కోడి మల్లయ్యయాదవ్, పోతుల జ్ఞానయ్య, గాదె లూర్థుమర్రెడ్డి, పెదప్రోలు సైదులు, నాయకులు దొంతిరెడ్డి సంజీవరెడ్డి, చింతరెడ్డి కృష్ణారెడ్డి, కుందూరు సత్యనారా యణరెడ్డి, ఆదెర్ల శ్రీనివాసరెడ్డి,గుర్రం వెంకటరెడ్డి,పులిచింతల వెంకట రెడ్డి, మర్రి రవీందర్రెడ్డి, శంభిరెడ్డి, పెండెం ముత్యాలుగౌడ్, గుండు రామాంజి గౌడ్, మర్ల శ్రీనివాస్యాదవ్ పాల్గొన్నారు. -
మోడల్ జిల్లాగా అభివృద్ధి చేస్తా
నల్లగొండ, న్యూస్లైన్, నల్లగొండ జిల్లాను మోడల్ జిల్లాగా అభివృద్ధి చేస్తాం..హైదరాబాద్ నగరానికి తలమానికంగా ఉండేలా అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నల్లగొండలో మేకల అభినవ్స్టేడియంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ జయభేరి సభలో ప్రసగించారు. సభకు భువనగిరి, నల్లగొండ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సమావేశానికి ముందు బ్రదర్స్ ఇద్దరు వారి స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభకు హాజరైన ప్రజలనుద్దేశించి వారు ప్రసగించారు. ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా పాటుపతానని కోమటిరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ, ఐటీ పార్కు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిం చేందుకు కృషిచేస్తామన్నారు. అదే విధంగా బ్రాహ్మణవెల్లెంల, ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనులు పూర్తి చేయించి 4 లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీరందేలా చేయడమే తన ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు. పదవులు ముఖ్యం కాదని, తెలంగాణ ప్రాంత అభివృద్ధే ప్రధాన ధ్యేయమన్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలి చి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని సైతం త్యాగం చేశానని గుర్తు చేశారు. ప్రజా సేవయే పరమావధిగా భావించి రేయింబవళ్లు వారి శ్రే యస్సు కోసం పాటుపడుతున్నానన్నారు. ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గ ప్రజలు తెలంగాణలోనే అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశా రు. డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్రెడ్డికి తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ పదవి ఇప్పిం చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు : ఎంపీ గుత్తా ఈ ఎన్నికల్లో జిల్లా నుంచి టీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని ఎంపీ సుఖేందర్రెడ్డి తెలిపా రు. అభ్యర్థులు ఎవరో తెలియని వారికి కేసీఆర్ పార్టీ టికెట్లు ఇచ్చాడన్నారు. ఉద్యమకారులకు కాకుండా తెలంగాణ ద్రోహులకు పార్టీ టికెట్లు ఇచ్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్య, సీపీఐ మునుగోడు అభ్యర్థి పల్లావెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీం దర్, డీసీసీ ధ్యక్షడు తూడి దేవేందర్రెడ్డి తదితరులు కోరారు. సమావేశానికి వీరితో పాటు భువనగిరి, తుంగతుర్తి అభ్యర్థులు పోతంశెట్టి వెంకటేశ్వర్లు, అద్దంకి దయాకర్, తండు శ్రీని వాస్గౌడ్, కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు ముంగి చంద్రకళ,మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్, గుమ్ముల మోహన్రెడ్డి, బుర్రి శ్రీనివాస్రెడ్డి, గుత్తా తనయుడు అమిత్రెడ్డి, బొడ్డుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘దేశంలో’నెరాశ్యం
సాక్షి, ఒంగోలు,జిల్లా టీడీపీ శ్రేణులను నైరాశ్యం ఆవరించింది. మొన్నటి మున్సిపల్, నిన్నటి తొలివిడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొన్న ఆ పార్టీ కార్యకర్తల్లో నాటి ఉత్సాహం మచ్చుకైనా కనిపించడం లేదు. పార్టీ ఉనికిని కాపాడుకోవాలనే ప్రయత్నాల్లో భాగంగా అక్కడక్కడా కొందరు మాత్రమే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మెజార్టీ శ్రేణులు మాత్రం చంద్రబాబు నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రధానంగా ఆ పార్టీ బీజేపీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకున్న దగ్గర్నుంచి జిల్లా శ్రేణుల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. సంతనూతలపాడు నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడంతో స్థానిక నాయకత్వం కాస్త అసమ్మతి వర్గంగా మారింది. దీంతో తిరిగి ఆ నిర్ణయాన్ని మార్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. సంతనూతలపాడుకు బదులు కొండపి నియోజకవర్గాన్ని కేటాయించనున్నట్టు సమాచారం. అయితే కొండపితో పాటు గిద్దలూరు స్థానాన్ని కూడా కేటాయించాలని, రాజంపేట బదులు ఒంగోలు లోక్సభ ఇవ్వాలని బీజేపీ పట్టుపడుతోంది. వీటిపై టీడీపీ శ్రేణులు మాత్రం గెలిచినా ఓడినా అన్ని నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాలని కోరుతున్నారు. ఇద్దరిపైనే అంత ప్రేమేంటి..? నియోజకవర్గాలను బీజేపీకి వదులుకుంటున్నామనే బాధ టీడీపీ శ్రేణులను తొలుస్తోంది. ఇప్పటికే జిల్లా పార్టీని నడిపిస్తున్న తెలుగు రైతు అధ్యక్షుడు కరణం బలరాం, జిల్లాపార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతూనే ఉంది. వీరిద్దరూ తమ అనుయాయులైన ఎమ్మెల్యే బీఎన్ విజయ్కుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామికి ఎట్టిపరిస్థితుల్లో సీట్లు ఖరారుచేసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. మారిన పొత్తు పరిణామాల ప్రకారం సంతనూతలపాడులో బీఎన్ విజయ్కుమార్ స్థానం పదిలమని భావిస్తే బీజేపీ కోరుతున్న కొండపి నియోజకవర్గాన్ని దారా సాంబయ్యకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. అలాంటప్పుడు బాలవీరాంజనేయస్వామి పరిస్థితి ఏమిటనేది తెలియాలి. ఇవే అంశాలు ప్రస్తుతం మలివిడత స్థానిక ఎన్నికలకు టీడీపీ శ్రేణులను దూరం చేస్తున్నాయి. దీంతో కొండపిని కూడా టీడీపీకే ఉంచేలా దామచర్ల మంత్రాంగం చేస్తున్నట్లు తెలిసింది. ఇక గిద్దలూరు నియోజకవర్గాన్ని అటు కరణం బలరాం, ఇటు జనార్దన్ పట్టించుకోకుండా ఉండటంపై పార్టీశ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి. బీజేపీ నేతలు సైతం గిద్దలూరులో అభ్యర్థి ఎంపిక అంశాన్ని కర్నూలు జిల్లా విభాగానికి అప్పగించినట్లు తెలిసింది. మొత్తానికి పార్టీ అధినేత నిర్ణయాలతో టీడీపీ కేడర్ పూర్తిగా నీరసపడి అయోమయానికి గురవుతున్నారు. -
అభ్యర్థులు - ఆస్తిపాస్తులు
ఎమ్మెల్సీ షబ్బీర్అలీ కుటుంబ ఆస్తులు *16 కోట్లు సొంత వాహనం లేని మాజీ స్పీకర్ సురేశ్రెడ్డి పోచారం శ్రీనివాస్కు బండి లేదు..! కాసుల బాల్రాజుకు ఇల్లు లేదు..! సార్వత్రిక సమరానికి సై.. అంటూ బరిలో నిలిచేందుకు నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఈ సందర్భంగా తమ ఆస్తిపాస్తులను ప్రకటించారు. ఇళ్లు, స్థలాలు, వ్యవసాయ భూములు, షేర్లు, డిపాజిట్లు, బంగారు అభరణాలు తదితర ఆస్తుల వివరాలను వారు చూపారు. జిల్లాలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్ల అభ్యర్థుల ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. - ఆర్మూర్/బాల్కొండ/బోధన్/బాన్సువాడ/కామారెడ్డి/ఎల్లారెడ్డిటౌన్/నిజామాబాద్సిటీ కామారెడ్డి కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ మహ్మద్అలీ షబ్బీర్ తన పేరిట, భార్య, కుమారుడి పేరిట కలిపి 16 కోట్ల 80లక్షలు ఉన్నట్టు చూపారు. ఇందులో బ్యాంకు డిపాజిట్లు, వాహనాలు, భూములు, ఇండ్లు, ఫ్లాట్లు ఉన్నాయి. మాచారెడ్డి, కామారెడ్డి మండలం లింగాపూర్, మెదక్ జిల్లా శంకరంపేట్ మండలం శివనూర్, కామారెడ్డి, రంగారెడ్డి జిల్లా కిస్మత్పుర, హైదరాబాద్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లలో స్థిర ఆస్తులున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ రూరల్ నుంచి టీఆర్ఎస్ తరపున నామినేషన్ వేసిన బాజిరెడ్డి గోవర్ధన్ *67 లక్షల 25వేల 82, తన భార్య వినోదా పేరిట 10 లక్షల ఆస్తులు ఉన్నట్లు చూపారు. 15 లక్షల విలువ గల వాహనం ఉన్నట్లు పేర్కొన్నారు. బీజేపీ నుంచి నామినేషన్ వేసిన గడ్డం ఆనంద్రెడ్డి తన పేరిట 3 కోట్ల 49లక్షల 82వేల 648 విలువ గల ఆస్తులున్నట్లు చూపారు. తన భార్య ఇందిరాదేవి పేరిటా 96 లక్షల 16వేల 882 వేలు ఆస్తులు ఉన్నాయని చెప్పారు. 15 లక్షల విలువగల వాహనం ఉన్నట్లు పేర్కొన్నారు. బాల్కొండ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పాలెం మురళి 3 లక్షల విలువైన కారు, 1.50 లక్షలు విలువైన బంగారం, 8.50 లక్షల వ్యవసాయ భూమి, భార్య పేరున 8.50 లక్షల భూమి ఉన్నట్లు చూపారు. ఇన్కంటాక్స్ చెల్లింపులు 2.80 లక్షలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి ఈరవత్రి అనిల్ నగదు 6,12,800 ఉన్నట్లు చూపారు. ఆదాయపు పన్ను చెల్లింపులు 16,65,055, బ్యాంకు డిపాజిట్లు *32.60 లక్షలు(కుటుంబ సభ్యులను కలిపి), తపాలా శాఖ డిపాజిట్లు 10.36 లక్షలు, 10 లక్షల ఇన్నోవా ఉన్నాయి. భార్య పేరున 30తులాల బంగారం, మెదక్, రంగారెడి, నిజామాబాద్జిల్లాల్లో భూములు ఉన్నాయి. హైదరాబాద్లో *8 లక్షల ఫ్లాట్ ఉంది. తల్లి పేరిట కిసాన్నగర్లో 3.50 లక్షల విలువ చేసే ఇల్లు ఉన్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్రెడ్డి తన వద్ద నగదు 7,48,458 ఉన్నట్లు చూపారు. ఆదాయపు పన్ను చెల్లింపు 11,41,540, భార్య నీరజ పేర చెల్లింపు 12,88,410 ఉన్నట్లు తెలిపారు. భార్య చేతిలో నగదు *65,733 ఉంది. డిపాజిట్లు 12 లక్షలు, 10లక్షల ఇన్నోవా ఉన్నాయి. టీడీపీ అభ్యర్థి మల్లికార్జున్రెడ్డి నగదు *6లక్షలు ఉన్నట్లు తెలిపారు. ఆదాయపు పన్ను చెల్లింపు 5,35,932, భార్య పేర 5,26,056 ఉన్నట్లు చూపారు. తన వాహనం 2.05 లక్షలుగా పేర్కొన్నారు. హైదరాబాద్లో 41.69 లక్షల స్థిరాస్తి, డిపాజిట్లు 20 లక్షలు ఉన్నట్లు తెలిపారు. బోధన్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాజీమంత్రి సుదర్శన్రెడ్డి తన పేరిట బ్యాంకు ఖాతా నిల్వలు 10,162,60 ఉన్నట్లు చూపారు. కంపెనీల్లో పెట్టుబడులు 37,879,306, ఇతరులకు ఇచ్చిన అడ్వాన్సులు 13,370,882, బంగారు అభరణాలు 8,75,000 ఉన్నాయి. 66లక్షలు విలువైన వ్యవసాయ భూములు సిరాన్పల్లిలో ఉన్నాయి. *కోటి 80లక్షల విలువైన ఇతర భూములు, కోటి ఇరవై లక్షల భవనాలు ఉన్నాయి. ఇచ్చిన అప్పులు 14,137.116, బ్యాంక్ డిపాజిట్లు 8,77,143, వివిధ కంపెనీల షేర్లు 35,853,829, కమర్షియల్ బిల్డింగ్లు 80లక్షలు, నిజామాబాద్లో 25లక్షలు విలువైన ఇల్లు, హైదరాబాద్లో 11కోట్ల 54లక్షల 12వేల విలువైన భూములు ఉన్నట్లు చూపారు. ఎల్లారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్రెడ్డి తన పేరిట 9లక్షల 7 వేలు నగదు ఉన్నట్లు చూపారు. భార్య పేరిట 4 లక్షల 33 వేలు ఉన్నట్లు తెలిపారు. అలాగే బీఎండబ్ల్యూ(35 లక్షలు), మారుతీ స్విఫ్ట్(8లక్షల 50 వేలు) కార్లు ఉన్నాయి. ల క్ష 80వేల విలువ గల బంగారం, భార్య వద్ద 32లక్షల 45 వేలు ఉన్నట్లు పేర్కొన్నారు. భూములు, భవనాలు, స్థలాలు కలిపి 10కోట్ల 33 లక్షలు విలువ చూపారు. ఇక 72 లక్షలు అప్పు ఉన్నట్లు తెలిపారు. బీజేపీ అభ్యర్థి బాణాల లక్ష్మారెడ్డి లక్ష 27 వేలు నగదు ఉన్నట్లు తెలిపారు. ఎల్ఐసీ పాలసీల విలువ 59లక్షల 70 వేలు, 21లక్షా 70 వేలు విలుగల వాహనాలు, 4లక్షల 50 వేలు విలువైన బంగారు అభరణాలు చూపారు. 4కోట్ల 61లక్షల 50వేలు ఆస్తులున్నాయని,95 లక్షలు ప్రైవేటు వ్యక్తులకు, 4లక్షల 75 వేలు ప్రభుత్వ రుణం ఉన్నట్లు చూపారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెద్దపట్లోళ్ల సిద్దార్థరెడ్డి నగదు 2లక్షల 19 వేలు, బ్యాంకుల్లో *2లక్షల 75 వేలు ఉన్నట్లు చూపారు. ఫార్చునర్(*10 లక్షలు), ఇన్నోవా( 6లక్షలు), స్విఫ్ట్కారు(2లక్షలు) వాహనాలున్నాయని తెలిపారు. 12లక్షలు విలువగల బంగారు అభరణాలు, *కోటి విలువైన భూములు,స్థలాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నల్లమడుగు(జాజాల) సురేందర్ తనవద్ద నగదు, బ్యాంకుల్లో 2లక్షల 21 వేలు, ఇన్నోవా(10 లక్షలు), మారుతీ(7 లక్షలు), ట్యాంకర్( 3లక్షలు) వాహనాలున్నట్లు తెలిపారు. 15లక్షలు విలువైన అభరణాలు, 72లక్షల విలువ గల భూములు, భవనాలున్నట్లు పేర్కొన్నారు. అప్పులు 9లక్షల 50 వేలు చూపారు. బాన్సువాడ టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పోచారం శ్రీనివాస్రెడ్డి నగదు 45,500, డిపాజిట్లు 4,02,121, 96వేల షేర్, 30 గ్రా ముల బంగారం, 10 గ్రాముల ఉంగరం(1.20లక్షలు) మొత్తం కలిపి 5,93,621 ఉన్నట్లు చూపారు. భార్య పేరిట *20,550, డిపాజిట్లు 66,047, 10,85,000ల బంగారం ఉన్నాయి. సింగరాయిపల్లిలో *8లక్షల భూములు, పోచారంలో 3,22,728 విలువైన ఇల్లు, 11.50లక్షల విలువ చేసే ఇతర భూములు ఉన్నట్లు పేర్కొన్నారు. వరంగల్లో తనపై కే సు ఉన్నట్లు పేర్కొన్నారు. తన పేరిట వాహనాన్ని పేర్కొనక పోవడం గమనార్హం. కాంగ్రెస్ అభ్యర్థి కాసుల బాల్రాజ్ వద్ద నగదు రూపంలో 8వేలు, 17లక్షల విలువ చేసే ఇన్నోవా వాహనం ఉన్నాయి. 3లక్షల విలువ చేసే ట్రాక్టర్, లక్ష విలువ చేసే ట్రాలీ, 25వేల విలువ చేసే మోటర్ బైక్, *90వేల విలువ చేసే 30గ్రాముల బంగారం ఉన్నట్లు చూపారు. భార్య, తల్లి పేరిట 60వేల విలువ చేసే బంగారం ఉంది. *20 లక్షలు విలువ చేసే భూములు ఉన్నాయి. సుమారు 16లక్షల రుణాలు పొందారు. టీడీపీ అభ్యర్థి బద్యానాయక్ వద్ద నగదు రూపంలో 10వేలు, 11లక్షల విలువ చేసే స్కార్పియో వాహనం, 40 గ్రాముల బంగారం ఉంది. 7లక్షల విలువ చేసే 13 ఎకరాల భూమి, *లక్ష విలువ చేసే ఇల్లు ఉంది. బ్యాంకు ద్వారా 8,31,000 రుణాన్ని పొందారు. ఆర్మూర్ శానససభ మాజీ స్పీకర్, ఆర్మూర్ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి కేఆర్ సురేశ్రెడ్డి వద్ద అప్పులు పోను మిగిలిన ఆస్తులన్నింటినీ కలిపి ప్రస్తుత బహిరంగ మార్కెట్లో స్థిర, చరాస్థులు, బాండ్లు, షేర్లు, నేషనల్ సేవింగ్స్ రూపంలో తన పేరిట 5 కోట్ల 48 లక్షల 93 వేలు ఉన్నట్లు చూపారు. భార్య పద్మజ రెడ్డి పేరిట ఐదు కోట్ల 85 లక్షల 95 వేలు, కుమారుని పేరిట రెండు కోట్ల ఆస్థులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇతరత్రా ఆస్తులు తన పేరిట 40 లక్షల 31 వేలు, భార్య పేరిట 47 లక్షల 56 వేలు ఉన్నట్లు చూపారు. టీఆర్ఎస్ అభ్యర్థి జీవన్రెడ్డి కుటుంబ ఆస్తుల వివరాలు స్థిర చరాస్థులన్నీ కలిపి.. తన పేరిట మూడు కోట్ల 62 లక్షల 32 వేలు, భార్య పేరిట మూడు కోట్ల 50 లక్షల విలువైన ఆస్తులున్నట్లు చూపారు. -
జిల్లాకు ఎన్నికల పరిశీలకులు
కలెక్టరేట్, న్యూస్లైన్ : ఎన్నికల ఏర్పాట్లను, స రళిని పరిశీలించడానికి సాధారణ పరిశీలకులు జిల్లాకు చేరుకున్నారు. జిల్లాలో ఎన్నికల సరళిని, అభ్యర్థుల ప్రచారాలను, ఏర్పాట్లను పరిశీ లించి నివేదికలివ్వడానికి ఎన్నికల సంఘం ప లువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ని యమించింది. వీరిలో సాధారణ పరిశీలకులు గా ఎల్.ఎన్.సోని (9491860465) రాజస్థాన్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి ఈనెల 8 నుంచి ఆర్అండ్బీ అతిథి గృహంలో బస చేస్తున్నారు. ఈయనకు లైజన్ అధికారిగా హార్టికల్చర్ ఎ.డి.శామ్యూల్ (8374449355), మరో సాధారణ పరిశీలకులు అశోకానంద హెచ్.ఎ స్.(9491835308) కర్ణాటక క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి, ఈయనకు లైజన్ అధికారి గా వ్యవసాయ శాఖ ఏడీ వాజిద్హుస్సేన్ (సెల్ నం.8886612706) లను నియమించా రు. జహీరాబాద్ పార్లమెంట్ సాధారణ పరి శీలకులుగా ఐఏఎస్ అధికారి ఎం.తన్నారసన్ (9491860413)ను నియమించారు. ఈయన కు లైజన్ అధికారిగా డిప్యూటీ ఈఈ సురేష్బా బు (9701375988)ను నియమించారు. పోలీ సు పరిశీలకురాలుగా జార్ఖండ్ రాష్ట్రానికి చెం దిన ఐపీఎస్ అధికారిణి(9491833017), ఈ మెకు లైజన్ అధికారిగా సబ్ఇన్స్పెక్టర్ అశోక్ (9440055690)ను నియమించారు. మరోసాధారణ పరిశీలకులుగా బషరత్ సలీంను నియమించారు. ఈయన జమ్మూ కాశ్మీర్కు చెందిన ఐఏఎస్ అధికారి, ఈయనకు రామారావునాయక్, ఏడీఏను లైజర్ అధికారిగా నియమించారు. (సెల్నం.8886612724). మహా రాష్ట్ర క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి ఎస్.ఎం.కేంద్రీకర్ (9491860441)ను మరో పరి శీలకులుగా నియమించారు. ఈయనకు లైజ న్ అధికారిగా డిప్యూటీ ఈఈ టి.భూంరెడ్డి(9701367491)ను నియమించారు. -
గెలుపే లక్ష్యం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధన, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యం గా ఆవిర్భవించిన వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులను ‘సార్వత్రిక’ బరిలోదింపింది. జిల్లాలోని రెండు లోక్సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఆ పార్టీ అధిష్టానం అభ్యర్థులను మంగళవారం రాత్రి ప్రకటించ గా, వారు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. నిజామాబాద్ ఎంపీ స్థానానికి సింగిరెడ్డి రవీందర్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ స్థానానికి మహమూద్ మొహియొద్దీన్ నామినేషన్లు వేశారు. రవీందర్రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నకు తన నామినేషన్ పత్రాలను అందజేయగా, మొహియొద్దీన్ జహీరాబాద్లో దాఖలు చేశారు. తొమ్మిది శాసనసభ స్థానాలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు కొం దరు ఇప్పటికే మొదటి సెట్ను దాఖలు చేసినప్పటికీంచి ముహూర్తంగా భా వించిన పలువురు బుధ వారం కార్యకర్తల కోలాహలం మధ్యన నామినేషన్లు వేశారు. భారీ ఊరేగింపుతో నిజామాబాద్ అర్బన్ నుంచి అంతిరెడ్డి శ్రీధర్రెడ్డి భారీ ర్యాలీతో వెళ్లి కలెక్టరేట్లో తన నామినేషన్ వేశారు. ఎల్లారెడ్డిలో పెద్దపట్లోళ్ల సిద్దార్థ రెడ్డి నాయకులు, కార్యక ర్తలు, అభిమానులతో తరలి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. జుక్కల్ అభ్యర్థి నాయుడు ప్రకాశ్ కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. బోధన్లో కాటి పెల్లి సుదీప్రెడ్డి, కామారెడ్డిలో పైల కృష్ణారెడ్డి, బాల్కొండ అభ్యర్థి పాలేపు మురళి, బాన్సువాడ కు రావుట్ల శోభన మహేందర్గౌడ్, నిజామాబాద్ రూరల్కు బొడ్డు(సి ర్పూరు) గంగారెడ్డి, ఆర్మూరుకు ఎస్కే మహబూబ్ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. దివంగత నేత పథకాలతో జనంలోకి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి సువర్ణ పాలనను గుర్తు చేస్తూ, ఆ పాలన తిరిగి తెస్తామని హామీ ఇస్తూ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు జనంలోకి దూసుకు వెళ్తున్నారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలలో ప్రచారాన్ని ముమ్మరం చేసిన వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వస్తే చేపట్టే అ భివృద్ధి, సం క్షేమ పథకాలు, వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యాలను ప్రజలకు వివరిస్తున్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల తరపున అనేక ఉద్యమాలు నిర్వహించిన వైఎస్ఆర్ సీపీ జిల్లా ప్రజలకు చేరువయ్యింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్మూరులో నిర్వహించిన రైతు దీక్షకు మద్దతు పలికిన జిల్లా ప్రజలు వైఎస్ఆర్ సీపీని ఇంతకాలం ఆదరిస్తూ వస్తున్నారు. ‘గడప గడపకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ’ అన్న నినాదంతో నిర్వహించిన కార్యక్రమాలకు ప్రజలు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్తున్నారు. -
టీడీపీలో బిగ్ డీల్స్!
సాక్షి ప్రతినిధి, గుంటూరు, ఎన్నికల సందర్భంగా టీడీపీలో పెద్ద డీల్స్ జరుగుతున్నాయి. సీటు ఆశిస్తున్న జూనియర్లను సీనియర్లు బుట్టలో వేసుకుంటున్నారు. అధినేత నారా చంద్రబాబు నాయుడు, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, సుజనా చౌదరి, యువనేత నారా లోకేష్ల వద్ద తమకు పలుకుబడి ఉందని నమ్మబలుకుతున్నారు. పార్టీకి రాష్ట్రంలో సానుకూల పరిస్థితులు ఉన్నాయని, వచ్చేది మన ప్రభుత్వమేనంటూ వారిని ఊహాలోకాల్లో తేలుస్తున్నారు. రాజధానిలో ముఖ్యనేతలతో భేటీకి అపాయింట్మెంట్ ఇప్పిస్తామంటున్నారు. ఒకరిద్దరు ముఖ్యనేతలైతే నా ఎన్నికల ఖర్చు మొత్తం భరిస్తే సీటు గ్యారంటీగా ఇప్పిస్తానంటున్నారు. ముఖ్యనేతల భేటీకి, రాజధాని చుట్టూ ప్రదక్షణలు చేయడానికి ఇప్పటికే లక్షలు ఖర్చయ్యాయని కొందరు జూనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాగా డబ్బు ఉండి రాజకీయాల్లోకి రావాలని చూస్తున్న పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, వ్యాపారవేత్తలు, రియల్ఎస్టేట్ వ్యాపారులు వీరి మాటల గారడీలో సులభంగా పడిపోతున్నారు. గుంటూరు తూర్పులో రెండు సామాజిక వర్గాల నేతలు సీటు మోజులో రాజధాని చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. సౌదీలో ఇంజినీరుగా పనిచేసిన ఒక మైనార్టీ నేత, మరో సామాజికవర్గానికి చెందిన వ్యాపారి సీటు కోసం డబ్బును మంచినీళ్లలా ఖర్చుచేస్తున్నారు. సీటు ఇస్తే పార్టీకి ఫండ్ ఇస్తామని, ఎన్నికలకు ఎంతైనా ఖర్చు చేస్తామంటున్నారు. రాజకీయాలతో వీరికి ప్రత్యక్ష సంబంధాలు లేకపోయినా నేతల మాయలో పడి ఎన్టీఆర్ భవన్, ఇతర ముఖ్యనేతల నివాసాల వద్ద పడిగాపులు పడుతున్నారు. మైనార్టీనేతకు తెరవెనుక ఒక మాజీ మంత్రి ఉన్నారని, మరో సామాజికవర్గం నేతకు జిల్లా పార్టీలో ముఖ్య భూమిక వహిస్తున్న నేత ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి పీఆర్పీ తరఫున పోటీ చేసిన ఒక నేతకు సత్తెనపల్లి సీటు ఇప్పిస్తానని జిల్లా పార్టీలో ముఖ్య భూమిక వహిస్తున్న నేత హామీ ఇచ్చారు. ఆ మేరకు అతని నుంచి సేవలు పొందారు. అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ సీటును మాజీ మంత్రి కోడెల శివప్రసాద్కు కేటాయిస్తున్నట్టు ప్రకటించడంతో జిల్లా నేత మౌనందాల్చారు. మరో సీనియర్ నేత నిన్న మొన్నటివరకు తాను వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, ఇక్కడ నీకు టిక్కెట్ ఇప్పిస్తానంటూ ఓ బీసీ నాయకునికి చెబుతూ ఐదేళ్లపాటు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు అతనితో ఖర్చు పెట్టించారు. ఎన్నికలు దగ్గరపడగానే ప్రముఖ పారిశ్రామిక వేత్తలను పట్టుకుని వారికి టిక్కెట్ ఇప్పించేందుకు అధిష్టానం వద్ద పావులు కదుపుతున్నారు. టిక్కెట్ ఇప్పిస్తే తనకు అసెంబ్లీ ఎన్నికలకు అయ్యే ఖర్చును ఆయన భరించేలా మాట్లాడుకుని ఒక పారిశ్రామిక వేత్తను తెరపైకి తెచ్చారు. మరోవైపు పల్నాడు ప్రాంతంలోని ఒక నియోజకవర్గం టిక్కెట్ ఇప్పిస్తానంటూ బీసీ వర్గానికి చెందిన ఓ ఉన్నతాధికారి వద్ద భారీ మొత్తంలో డబ్బు మాట్లాడుకుని అధినేత వద్ద పావులు కదుపుతున్నట్టు పార్టీలో వినపడుతోంది. ఇటీవల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలనే ఆసక్తితో జిల్లాకు వచ్చిన ఓ ఎన్ఆర్ఐ వైద్యుని వద్ద సీనియర్లు డబ్బు గుంజినట్టు అధినేతకు ఫిర్యాదులు అందాయి. ఆ వైద్యునికి న్యాయం జరగకపోగా సీనియర్ నేతకు డబ్బు ఇచ్చిన పాపానికి టీడీపీ హైకమాండ్ ఆయనకు టిక్కెట్ను నిరాకరించింది. సీట్ల కేటాయింపు త్వరగా తేల్చాలని, లేకపోతే నేతల మాయలో పడి మరికొంత నష్టపోతామని కొత్తతరం నేతలంటున్నారు. -
రఘురాజుకు డౌటే
తమకే కావాలంటున్న కృష్ణంరాజు, గంగరాజు చంద్రబాబుపైనే రఘురాజు ఆశలు సాక్షి ప్రతినిధి, ఏలూరు : బీజేపీలో తనకు ఎదురే లేదని చెప్పుకున్న బీజేపీ నేత, పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామకృష్ణంరాజు (రఘురాజు)కు నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ సీటు ఇవ్వడం ప్రశ్నార్థకంగా మారింది. ఐదు నెలల క్రితమే రాజకీయ అరంగేట్రం చేసి.. అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులను నిర్ణయించే స్థాయిలో పావులు కదుపుతున్నట్లు హడావుడి చేసిన ఆయన ఇప్పుడు తన సీటు కోసం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. నరసాపురం ఎంపీ సీటు కోసం టీడీపీ అధినేత చంద్రబాబుతో లోపారుకారీ ఒప్పందం చేసుకున్న రఘురాజు కొద్దినెలల క్రితం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. బీజేపీ అధిష్టానాన్ని కూడా మచ్చిక చేసుకుని ఎంపీ స్థానాన్ని దక్కించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తన సీటుకు ఢోకా లేదనుకున్న ఆయన తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లోనూ వేలు పెట్టారు. పలువురు నేతలను చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి టీడీపీలో చేర్పించి వారికి సీట్లివ్వాలని సూచిం చారు. దీంతో ఆయా నియోజకవర్గాల తెలుగుదేశం నేతలు రఘురాజు తీరుపై కారాలు మిరియాలు నూరారు. ఈ తంతు ఇలా నడుస్తుండగానే బీజేపీ, తెలుగుదేశం మధ్య పొత్తు వ్యవహారం రసకందాయంలో పడినా ఎట్టకేలకు కుదిరింది. అనుకున్నట్లుగానే చంద్రబాబు నరసాపురం సీటును బీజేపీకి వదిలేశారు. కానీ అక్కడ రఘురాజు అభ్యర్థిత్వానికి మాత్రం భరోసా ఇవ్వలేకపోతున్నారు. రెబల్స్టార్ ఒత్తిడి నరసాపురం ఎంపీ సీటు కోసం రఘురామకృష్ణంరాజుతోపాటు సినీ ప్రముఖుడు, మాజీ కేంద్ర మంత్రి యూవీ కృష్ణంరాజు తొలినుంచీ పోటీ పడుతున్నారు. రఘురాజు కంటే ముందే ఆయన బీజేపీలో చేరి తనకున్న విస్తృత పరిచయాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్టీఏ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆయనకు బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని నరసాపురం సీటును చేజిక్కించుకునేందుకు కృష్ణం రాజు పావులు కదుపుతున్నారు. జిల్లా బీజేపీలోని ఒక వర్గం ఆయనకే సీటివ్వాలని అగ్ర నేతలను కోరుతోంది. తాజాగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, లైలా గ్రూపు కంపెనీల అధినేత గోకరాజు గంగరాజు (గంగతాతరాజు) అదే సీటు కోసం ప్రయత్నిస్తుండటంతో రఘురాజు అవకాశాలకు గండిపడ్డాయి. వీహెచ్పీ నాయకుడైన ఆయనకు ఆర్ఎస్ఎస్ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నారుు. వాటిని ఆధారం చేసుకుని గంగరాజు ఆ దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబుపై ఆశలు దీంతో రఘురాజు పరిస్థితి గందరగోళంగా మారింది. చంద్రబాబుపైనే ఆయన పూర్తిగా ఆధారపడినట్లు ప్రచారం జరుగుతోంది. చివరి నిమిషంలో అయినా చంద్రబాబుతో బీజేపీ పెద్దలకు రికమండ్ చేయించుకుని నరసాపురాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. అయితే బీజేపీలోని ఒకవర్గం రఘురాజును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. తన వ్యా పారాలను కాపాడుకోవడానికే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని, అలాం టి వ్యక్తికి ఎలా సీటిస్తారని ఆ వర్గం బీజేపీ జాతీయ నేతలను ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. అదీగాక చంద్రబాబు వ్యూహంలో భాగంగానే రఘురాజు బీజేపీలోకి వచ్చారని.. ఈ దృష్ట్యా ఆయనకు సీటు ఇచ్చినా పేరుకు బీజేపీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తారని ప్రత్యర్థులు వాదిస్తున్నారు. దీంతో నరసాపురం సీటు విషయంలో బీజేపీ అధిష్టానం సతమతం అవుతోంది. బీజేపీ రాష్ట్ర శాఖ తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ ఎంపీ స్థానం కోసం పట్టుబడుతోంది. ఒకవేళ ఆ దిశగా చర్చలు సఫలమై కాకినాడ సీటును బీజేపీకి ఇస్తే కృష్ణంరాజును అక్కడి నుంచి పోటీ చేయించే యోచనలో బీజేపీలో నేతలు ఉన్నారు. అది జరగని పక్షంలో నరసాపురం సీటు ఎవరికివ్వాలనే దానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. దీంతో రఘురాజు పరిస్థితి ఇరకాటంలో పడింది. -
హస్తం... నిస్తేజం
సాక్షి, రాజమండ్రి : కాంగ్రెస్ శ్రేణులను నిరాశానిస్పృహలు అలముకున్నా యి. ‘పండగపూటా.. ముగ్గుకు నోచని వాకిలి’లా.. ఎన్నికల వేళా వారిలో స్తబ్దత తాండవిస్తోంది. పేరుకు జాతీయ పార్టీ అయినా.. ఏ వాడకు వెళ్లినా పన్నెత్తి పలకరించే వారే కరువయ్యారు. రాష్ట్ర విభజనకు ఒడిగట్టిన కాంగ్రెస్ అధిష్టానంపై జనంలో రగులుతున్న ఆగ్రహం ఆ పార్టీ స్థానిక నేతలను రోహిణీ కార్తెలో ఎండలా దహిస్తోంది. ‘ఇలాంటి పరిస్థితి పగవారికి సైతం వద్దురా బాబూ!’ అనుకునేంతగా ఆ పార్టీ శ్రేణులు నిర్వేదం చెందుతున్నారు. గత ఎన్నికలప్పుడు ఇదే నెలలో ప్రతి కార్యకర్తలో రెట్టించిన ఉత్తేజం, దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి నాయకత్వంలో ఇనుమడించిన సమరోత్సాహం గుర్తుకు వచ్చి ‘ఇంతలోనే ఎంత మార్పు! నాడు పెళ్లింట్లోలా కోలాహలం.. నేడు పాడె లేచిన కొంపలోలా కమ్ముకున్న వైరాగ్యం!’ అంటూ బరువెక్కిన గుండెలతో నిట్టూరుస్తున్నారు. అనేకులు అసలు ఉందో, లేదోనన్న సందేహం కలిగే స్థితిలో ఉన్న పార్టీకి ఇంకా అంటి పెట్టుకుని ఉండాలా, విడిచిపెట్టి వెళ్లాలా? అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే ఆయువుపట్టు. పునాదిప్రాయం. విభజన నిర్ణయంతో కాంగ్రెస్ ఆయువుపట్టు కదిలిపోయింది. పునాది కుదుపునకు లోనైంది. తాము చెమటోడ్చి, కష్టిస్తే పదవులను అధిష్టించిన నేతలు జనానికి కల్లబొల్లి కబుర్లు చెప్పి రాష్ట్రాన్ని ముక్కలు చేసి పారేశారని, ఈ పరిణామం అనంతరం ఇక జనంలోకి ఏ ముఖం పెట్టుకుని వెళ్లగలమని కాంగ్రెస్ కార్యకర్తలు తల పట్టుకుంటున్నారు. జిల్లాలో పలువురు ముఖ్యనేతలు పార్టీని వదిలి, తలో పార్టీ దిక్కుకూ పయనించడం కార్యకర్తలకు జీర్ణం కావడం లేదు. ‘రాష్ట్రాన్ని తుంచింది మీరు. మమ్మల్ని నట్టేట ముంచింది మీరు. పార్టీని మనుగడ కోల్పోయేలా చేసి మీరు మాత్రం మీ రాజకీయ భవిష్యత్తుకు కొత్త ఆలంబనం వెతుక్కుంటున్నారా?’ అంటూ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. తలోదారీ పడుతున్న ఎమ్మెల్యేలు జిల్లాలో ఇప్పటికే పదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తలోదారి వెతుక్కున్నారు. ఇక అనపర్తి, ముమ్మిడివరం, రాజోలు, రంపచోడవరం, తుని ఎమ్మెల్యేలు నల్లమిల్లి శేషారెడ్డి, పొన్నాడ సతీష్, పాముల రాజేశ్వరీదేవి, కోసూరి కాశీ విశ్వనాథ్, రాజా అశోక్బాబుల్లో ఒకరిద్దరు తప్ప మిగిలినవారు కొత్త గూళ్ల కోసం అన్వేషిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్లో మిగిలిన ద్వితీయశ్రేణి నాయకుల పరిస్థితీ అగమ్యగోచరంగా ఉంది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి నాయకత్వంలోని ‘జై సమైక్యాంధ్ర’ పార్టీ నుంచి ఆహ్వానం అందుతున్నా వెళ్లేందుకు సాహసం చేయలేకపోతున్నారు. అలా చేస్తే తమ ‘చెప్పు’తో తాము కొట్టుకోవడమే అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రథాలున్నా.. సారథులు లేరు మరోవైపు.. జై సమైక్యాంధ్ర పార్టీ వాలకం చూస్తే ‘గేదె ను కొనకుండా పలుపుతాడు సిద్ధం చేసిన’ చందంగా ఉంది. ‘ఓటి కుండకు చప్పుడె క్కువ’ అన్నట్టు..ఆ పార్టీ ముందుగానే ప్రచార రథాలు సిద్ధం చేసుకుంది. అయితే ఆ రథాలకు సారథులు లేక ఏం చేయాలో తోచని స్థితిలో చిక్కుకుంది. ఒకరిద్దరు మాత్రమే ఉన్న ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ కార్యకర్తలకు, ద్వితీయశ్రేణి నేతలకు గాలం వేసి ‘చెప్పు’ల్లో కాళ్లు దూర్చమని బతిమాలుతున్నారు. కానీ ఎవరూ ముందుకు రాకపోవడంతో రాజమండ్రి జాంపేటలోని జై సమైక్యాంధ్ర పార్టీ కార్యాలయం ముందు ఆ రథాలు సారథుల కోసం ఎదురు చూస్తున్నాయి. -
కాషాయానికి పచ్చకామెర్లు
సాక్షి ప్రతినిధి,కాకినాడ : పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ.. జిల్లాలో రాజమండ్రి సిటీ, రాజోలు అసెంబ్లీ స్థానాలను బీజేపీకి వదులుకుంటోంది. టీడీపీ పలు చోట్ల వలస నేతలకు పెద్ద పీట వేస్తున్నట్టుగానే రాజోలులో బీజేపీ వ్యవహరిస్తుండడంపై కమలదళం కస్సుమంటోంది. కాంగ్రెస్ నుంచి ఎన్నికైన రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు బుధవారం బీజేపీ సీమాంధ్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. పొత్తులో భాగంగా దక్కిన రాజోలు సీటును రాపాకకు అట్టిపెట్టారని, అది కూడా చంద్రబాబు ప్రమేయంతోనే జరుగుతోందని కమలదళం ఆగ్రహోదగ్రమవుతోంది. రాజోలు నుంచి పోటీ చేయాలని బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా గంపెడాశలు పెట్టుకున్నారు. పార్టీ క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన వేమాను పక్కనబెట్టి.. బీజేపీలో చేరీచేరగానే రాపాక అభ్యర్థిత్వానికి నాయకత్వం తలూపిందని సమాచారం ఆ పార్టీ నాయకులే పేర్కొంటున్నారు. వాస్తవానికి రాపాక తొలుత టీడీపీలోకి వెళ్లాలనుకున్నారు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, తోట త్రిమూర్తులు టీడీపీలోకి వెళ్లిన సందర్భంలోనే రాపాక కూడా వెళ్లేందుకు సిద్ధపడుతున్నారరని ప్రచారం జరిగింది. అప్పటికే బీజేపీతో పొత్తు చర్చలు ప్రారంభమై చాప కింద నీరులా సాగుతున్నాయి. టీడీపీలోకి వస్తే రాజోలు నుంచి టిక్కెట్టు ఇచ్చే అవకాశాలు ఉండవని ముందుగా ఊహించబట్టే రాపాకను బాబు వ్యూహాత్మకంగానే బీజేపీలోకి పంపి, ఇప్పుడు టిక్కెట్టు ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. బాబు ఎత్తుగడలపై బీజేపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీతో సంబంధం లేని వారికి వచ్చీరాగానే సీటు ఎలా ఇచ్చేస్తారని ఆక్రోశిస్తున్నారు. రాపాక ఆర్థికంగా స్థితిమంతుడైనంత మాత్రాన పార్టీ కోసం కష్టపడ్డ వారిని పరిగణనలోకి తీసుకోరా అని ప్రశ్నిస్తున్నారు. తమ పార్టీ తరఫున వేమా కాక.. రాపాక బరిలోకి ఎలా దిగుతారో చూస్తామని హుంకరిస్తున్నారు. 12న బత్తుల భవిష్యత్ నిర్ణయం గత ఎన్నికల అనంతరం టీడీపీ జెండా భుజాన మోస్తున్న ఆ పార్టీ రాజోలు ఇన్చార్జి బత్తుల రాముకు ద్రోహం చేసిన చంద్రబాబు ఇప్పుడు తమ పార్టీ వ్యవహారాల్లో వేలు పెడుతూ రాపాక సీటు కట్టబెట్టాలనే ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ పరిణామాలపై రాము ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ నిర్ణయం తీవ్రంగా బాధించినా, తనను నమ్ముకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు బరిలో దిగినందున ఆ ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఆగి, 12న పార్టీ కేడర్తో సమావేశమై భవిష్యత్ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. ‘గోరంట్ల’ కోసం ‘చందన’కు పొగ కాగా రాజమండ్రి సిటీ బీజేపీకి కేటాయిస్తున్నందున అవకాశం కోల్పోతున్న గోరంట్ల రాజమండ్రి రూరల్లో పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే చందన రమేష్కు పొగబెట్టే పనిలో హైదరాబాద్లోనే మకాం చేశారు. బుధవారం ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాలో జిల్లా నుంచి ఉన్న ఏడుగురిలో ముగ్గురు సిట్టింగ్లకు మరోసారి అవకాశం కల్పించిన బాబు చందనకు మాత్రమే మొండిచేయి చూపించారు. దీనిపై చందన సామాజికవర్గీయులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ‘గోరంట్లకు స్థానం కల్పించేందుకు బలహీనవర్గాలకు చెందిన చందనకు అన్యాయం చేస్తారా?’ అని తీవ్రంగా మండిపడుతున్నారు. బీసీలకు ఉన్న ఒక్కగానొక్క స్థానాన్ని కాకుండాచేసేందుకు టీడీపీలో కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. అదే జరిగితే జిల్లావ్యాప్తంగా బీసీల సత్తా ఏమిటో చంద్రబాబుకు తెలిసొచ్చేలా చేస్తామని హెచ్చరిస్తున్నారు. -
టీడీపీ, బీజేపీ మధ్య పొత్తుల కుంపటి
సాక్షి ప్రతినిధి, కర్నూలు : పొత్తు కుదిరింది కానీ.. టికెట్ల పంచాయితీ ఓ పట్టాన తేలడం లేదు. బీజేపీ ప్రతిపాదించిన మూడు అసెంబ్లీ స్థానాలను ఇచ్చేందుకు టీడీపీ ససేమిరా అంటోంది. ఇదే సమయంలో బీజేపీ కూడా పట్టువిడవని ధోరణి అవలంబిస్తోంది. ఆదోని, నంద్యాల, పాణ్యం అసెంబ్లీ సీట్లివ్వాల్సిందేనంటూ ఆ పార్టీ నేతలు భీష్మించారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు జిల్లా నాయకులను విజయవాడకు రావాలని కబురు పెట్టడం చర్చనీయాంశమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడంపై ఇప్పటికే తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. జిల్లాలో మైనార్టీ ఓటర్లు అత్యధికంగా ఉండటంతో పొత్తు తమ పుట్టి ముంచుతుందేమోనని వారిలో కలవరం మొదలైంది. రెండు కళ్ల సిద్ధాంతంతో ఓటమికి చేరువైన కారణంగా కనీసం మోడీని ముందుంచుకునైనా పరువు కాపాడుకునేందుకు బాబు ఈ పొత్తుకు తెర తీసినట్లు చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే పొత్తులో భాగంగా పాణ్యం అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి ఇచ్చేందుకు బాబు మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ స్థానంలో టీడీపీ గెలిచే పరిస్థితి లేకపోవడం.. అక్కడ తమ్ముళ్ల మధ్య పోటీ ఉండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ అక్కడ ప్రముఖ రియల్టర్ కేజే రెడ్డి ప్రచారం చేస్తున్నారు. అదే విధంగా కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్రెడ్డి కూడా పాణ్యం టికెట్ ఆశిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలో తేల్చుకోలేక బాబు పాణ్యం ను వదులుకునేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదే ఖరారైతే ఎమ్మెల్యే కాట సాని రాంభూపాల్రెడ్డి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా.. బీజేపీ కోరుతున్న ఆదోని, నంద్యాల స్థానాల విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది. మొత్తంగా పొత్తు ‘పంచాయితీ’ తమ్ముళ్లను అయోమయానికి గురి చేస్తోంది. అధినేత ఎవరి సీటుకు ఎసరు పెడతారోననే బెంగ వారిని వెంటాడుతోంది. ఆదోని, నంద్యాల, పాణ్యం అసెంబ్లీ స్థానాలను ఆశిస్తున్న నాయకులు టిక్కెట్ తమకే ఖరారనే భావనతో ప్రచారం చేసుకుంటున్నారు. ఇదే సమయంలో బీజేపీ ఈ సీట్లపై కన్నేయడంతో ఆయా ప్రాంతాల్లోని టీడీపీ అభ్యర్థులు వేచిచూసే ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఈనెల 11న ఆదోని డివిజన్లో ప్రాదేశిక ఎన్నికలపైనా పొత్తు ప్రభావం చూపవచ్చని తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. -
11మంది పాతకాపులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:వుంథని నుంచి వూజీ వుంత్రి శ్రీధర్బాబు, వూనకొండూరు నుంచి వూజీ విప్ అరెపల్లి మోహన్, హుస్నాబాద్ నుంచి అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డికి టిక్కెట్టు కేటారుుంచింది. ఇటీవలే టీడీపీ నుంచి పార్టీలో చేరిన చొప్పదండి ఎమ్మెల్యే సుద్దాల దేవయ్యుకు అదే బెర్త్ ఖరారు చేసింది. గత ఎన్నికల్లో చేదు అనుభవం చూసిన పార్టీ అభ్యర్థులు నలుగురికి వురోసారి అవకాశం ఇచ్చింది. జగిత్యాల నుంచి వూజీ వుంత్రి జీవన్రెడ్డి, ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్కువూర్, కరీంనగర్ నుంచి చెల్మెడ లక్ష్మీనరసింహారావు, రావుగుండం నుంచి బాబర్సలీం పాషాకు టిక్కెట్లు కేటారుంచింది. సిరిసిల్ల టిక్కెట్టు అందుకున్న కొండూరి రవీందర్రావు, పెద్దపల్లి నుంచి పార్టీ అభ్యర్థిత్వం పొందిన టి.భానుప్రసాద్రావు తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. మిగతా వారందరూ గతంలో పోటీ చేసిన అనుభవవున్న నేతలే. అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణాలకే పెద్దపీట వేసింది. వుూడు ఎస్సీ రిజర్వుడు స్థానాలు వదిలిస్తే... ఏడు సీట్లను ఓసీలకు, వుూడు చోట్ల బీసీలను అవకాశం కల్పించింది. రావుగుండం సీటును మైనారిటీలకు కేటారుంచింది. అగ్రవర్ణాల్లో వుూడు వెలవు, వుూడు రెడ్డి, ఒకటి బ్రాహ్మణకు కేటారుుంచింది. పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల సీట్లను వెలవు సావూజిక వర్గానికి, జగిత్యాల, హుజూరాబాద్, హుస్నాబాద్ స్థానాలను రెడ్డిలకు, వుంథని బ్రాహ్మణులకు కేటారుుంచగా.. వేవులవాడ, కోరుట్ల సీట్ల నుంచి వుున్నూరు కాపు అభ్యర్థులను బరిలోకి దింపింది.సుదీర్ఘంగా చర్చల అనంతరం పొత్తు పెట్టుకున్న సీపీఐకి కాంగ్రెస్ మొండిచేరుు చూపింది. పొత్తులో భాగంగా హుస్నాబాద్ లేదా రావుగుండం స్థానాలకు సీపీఐకి కేటారుుస్తారని అనుకున్నా, అందుకు విరుద్ధంగా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. రెండు పార్టీల పొత్తుల చర్చల్లోనూ హుస్నాబాద్పై పీటవుుడి పడగా... హుస్నాబాద్కు బదులు రావుగుండం ఇవ్వడానికి కాంగ్రెస్ ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. అందుకే పార్టీ ఆదేశిస్తే రావుగుండం నుంచి పోటీలో ఉంటానని సీపీఐ వూజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ప్రకటించారు. తీరా రావుగుండం నుంచి కాంగ్రెస్ పార్టీ బాబర్సలీం పాషాకు టిక్కెట్టు ఇవ్వటంతో పొత్తు ఉల్లంఘించినట్లరుుంది. వుంథని నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, వూజీ వుంత్రి శ్రీధర్బాబు వరుసగా నాలుగోసారి సొంత సెగ్మెంట్ నుంచి పోటీకి దిగుతున్నారు. శ్రీధర్బాబు కంటే వుుందు ఆయున తండ్రి శ్రీపాదరావు సైతం ఇక్కణ్నుంచి వరుసగా నాలుగుసార్లు పోటీ చేశారు. వారసత్వంగా ఆయున తనయుుడు శ్రీధర్బాబు వరుసగా నాలుగోసారి ఇక్కడే తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. జగిత్యాల నుంచి వూజీ వుంత్రి జీవన్రెడ్డి అభ్యర్థిత్వం ఖరారైంది. వరుసగా తొమ్మిది ఎన్నికల్లో ఒకే చోటు నుంచి పోటీ చేసిన రికార్డును ఆయున సొంతం చేసుకున్నారు. 1983 నుంచి వరుసగా వచ్చిన ఎన్నికలన్నింటా ఆయున ప్రధాన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రవుణపై ఓడిపోరుున జీవన్రెడ్డి ఈసారి అక్కడ త్రివుఖ పోటీ ఎదుర్కోనున్నారు. వూనకొండూరు నుంచి ప్రాతినిథ్యం వహించిన సిట్టింగ్ ఎమ్మెల్యే, వూజీ విప్ అరెపల్లి మోహన్కు వురోసారి సీటు ఖరారైంది. తన సొంత సెగ్మెంట్ నుంచి ఆయున వరుసగా రెండోసారి బరిలోకి దిగుతున్నారు. హుస్నాబాద్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డికి వురోసారి అవకాశం కల్పించారు. పొత్తులో భాగంగా ఈ సీటును తవుకు ఇవ్వాలని సీపీఐ చివరి వరకు పట్టుబట్టినా.. సిట్టింగ్ సీటు కావటంతో కాంగ్రెస్ ఇచ్చేందుకు వివుఖత చూపింది. హుజూరాబాద్ నుంచి కేతిరి సుదర్శన్రెడ్డికి టిక్కెట్టు దక్కింది. 2008 ఉప ఎన్నికల్లో అప్పటి పాత సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగి ఓడిపోయూరు. పునర్విభజన తర్వాత సుదర్శన్రెడ్డికి పోటీ చేసే అవకాశం దక్కటం ఇదే మొదటిసారి. కరీంనగర్ నుంచి చెల్మెడ లక్ష్మీనరసింహారావుకు వరుసగా రెండోసారి పోటీ చేసే అవకాశం వచ్చింది. గత ఎన్నికల్లోనూ ఆయున ఇదే సీటు నుంచి పోటీకి దిగారు. చొప్పదండి నుంచి ఇటీవలే టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే సుద్దాల దేవయ్యుకు అవకాశం లభించింది. వరుసగా రెండోసారి ఆయున పోటీకి సిద్ధవువుతున్నారు. సిరిసిల్ల నుంచి డీసీసీ అధ్యక్షుడు కొండూరి రవీందర్రావు అభ్యర్థిత్వం ఖరారైంది. నిరుడు సహకార ఎన్నికల్లో కేడీసీసీ బ్యాంకు అధ్యక్షునిగా గెలుపొందిన కొండూరి తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటున్నారు.వూజీ ఎమ్మెల్యే, సీనియుర్ నాయుకుడు బొవ్ము వెంకటేశ్వర్లుకు వేవుులవాడ టిక్కెట్టు ఇచ్చారు. పాత ఇందుర్తి నియోజకవర్గంలో నాలుగుసార్లు పోటీ చేసి ఒకసారి గెలిచిన బొవ్ము వెంకటేశ్వర్లు ప్రస్తుతం వేవుులవాడ ఆలయు కమిటీ ఛైర్మన్గా ఉన్నారు. తొలిసారిగా వేవుులవాడ నుంచి బరిలోకి దిగుతున్నారు. ధర్మపురి నుంచి వరుసగా వుూడోసారి అడ్లూరి లక్ష్మణ్కువూర్ పోటీకి దిగుతుండటం రికార్డు. ఈ నియోజకవర్గం ఏర్పడ్డప్పటి నుంచి 2009, 2010 ఉప ఎన్నికల్లో ఆయునే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి నిలిచారు.అనూహ్యంగా రాజకీయూల్లోకి వచ్చి, అరుుదేళ్ల కిందట స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన భానుప్రసాదరావు ఇప్పుడు ఎమ్మెల్యే బరిలోకి దిగుతున్నారు. పెద్దపల్లి నుంచి ఆయున అభ్యర్థిత్వం ఖరారైంది. కోరుట్ల నుంచి వూజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రావుులును కాంగ్రెస్ పోటీకి దింపింది. పాత మెట్పల్లి నియోజకవర్గంలో గతంలో నాలుగుసార్లు పోటీ చేసి ఒకసారి గెలిచిన కొమిరెడ్డి.. కొత్తగా ఏర్పడ్డ కోరుట్ల నుంచి పోటీకి దిగటం ఇదే మొదటిసారి. రావుగుండం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన బాబర్సలీం పాషాకు కాంగ్రెస్ పార్టీ వురోసారి టిక్కెట్టు కేటారుంచింది. -
పొత్తుల కత్తులు
కరీంనగర్ కార్పొరేషన్, న్యూస్లైన్ : బీజేపీ, టీడీపీ పొత్తు జిల్లాలో పొసగడం లేదు. టీడీపీతో దోస్తీని వుందునుంచి వ్యతిరేకిస్తున్న బీజేపీ నాయుకులు ఆ పార్టీకి సహకరించడం అనువూనంగానే కనిపిస్తోంది. ఏకపక్షంగా పొత్తును తవుపై రుద్దారనే భావన కవులనాథుల్లో బలంగా నాటుకుపోరుంది. దీనికితోడు గతంలో ప్రాతినిథ్యం వహించిన పెద్దపల్లి సీటును టీడీపీకి కేటారుుంచాల్సి రావడం కూడా బీజేపీ నాయుకుల అసంతృప్తికి ప్రధాన కారణమైంది. పొత్తులో భాగంగా పెద్దపల్లి నుంచి బరిలోకి దిగాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రావుకృష్ణారెడ్డి ఆశించినప్పటికీ, అక్కడ టీడీపీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయురవుణారావు పోటీలో ఉండటంతో సహజంగానే టికెట్ టీడీపీ ఖాతాలోకి వెళ్లింది. దీనిపై బీజేపీ నేతలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి సహకరించేది అనువూనమే కాగా, అవసరమైతే రెబెల్గా పోటీకి దిగాలనే ఆలోచనలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. పొత్తుపై విముఖత... తెలంగాణ ఉద్యమంలో బీజేపీ ముఖ్యభూమిక పోషించడం, పార్టీ నాయకులు చురుకుగా పాల్గొనడంతో జిల్లాలో పార్టీకి పట్టు పెరిగింది. దీంతో మొదటి నుంచి ఒంటరిగా పోటీచేసే అవకాశాలున్నట్లు పార్టీ నుంచి సంకేతాలు రావడంతో నియోజకవర్గ ఇన్చార్జీలు, ఆ స్థాయి నాయకులు పోటీకి సిద్ధమయ్యారు. తీరా నామినేషన్లపర్వం మొదలయ్యాక బీజేపీ-టీడీపీ పొత్తులు తెరపైకి వచ్చాయి. తెలంగాణ ఉద్యమంతో జిల్లాలో పట్టుకోల్పోయిన టీడీపీతో పొత్తువల్ల తమకే నష్టం వాటిల్లుతుందని భావించిన స్థానిక నేతలు అసంతృప్తితో రగులుతున్నారు. టీడీపీతో పొత్తు తవుకు నష్టవుని ఏకంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్రావు మీడియూ సవూవేశం ఏర్పాటు చేసి వురీ ఆక్రోశం వెల్లగక్కారు. గెలిచే స్థానాలను బీజేపీకి కాకుండా టీడీపీకి కేటాయించడంపై మండిపడ్డారు. పొత్తు ఉన్నప్పటికీ పట్టున్న స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలోకి దిగుతామని పలువురు నేతలు కుండబద్దలు కొట్టినట్లు చెబుతుండడంతో టీడీపీ, బీజేపీ పొత్తుపై నీలినీడలు కవు్మకున్నారు. టీడీపీ స్థానాల్లో అసంతృప్తి... పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించిన నియోజకవర్గాల్లో బీజేపీ నేతలు అసంతృప్తి సెగలు రగుల్చుతున్నారు. పెద్దపల్లి, జగిత్యాల, మంథని, మానకొండూర్, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీకి పట్టు ఉందని, ఆ స్థానాల్లో పోటీకి దిగుతామని బహిరంగంగానే చెబుతున్నారు. పార్టీ పునరాలోచించకపోతే స్వతంత్రులుగా బరిలో నిలిచేందుకు సిద్దమవుతున్నారు. అసమ్మతులు, అసంతృప్తులతో బీజేపీ నేతలు అన్ని స్థానాల్లో పోటీ చేసే అవకాశాలే కనబడుతున్నాయి. దీంతో టీడీపీ-బీజేపీ పొత్తు కొసదాకా కొనసాగడం అనుమానమే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. -
హైడ్రామా!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : పరిటాల సునీత రాజీనామాస్త్రం.. జేసీ దివాకర్రెడ్డి అల్టిమేటం.. బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు రంగప్రవేశంతో జిల్లాలో బీజేపీ-టీడీపీల మధ్య సీట్ల కేటాయింపు మళ్లీ మొదటికొచ్చింది. పొత్తులో భాగంగా కదిరిని బీజేపీకి కేటాయించాలని చంద్రబాబు భావించగా తన వర్గీయుడు, కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్కు అన్యాయం చేస్తే రాజీనామా చేస్తానంటూ చంద్రబాబుకు పరిటాల సునీత స్పష్టీకరించారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన బాబు.. అనంతపురం శాసనసభ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తూ ఆదివారం నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై జేసీ దివాకర్రెడ్డి భగ్గుమన్నారు. బీజేపీ ఉనికే లేని అనంతపురం శాసనసభ స్థానాన్ని ఆ పార్టీకి కేటాయిస్తే.. లోక్సభ స్థానం నుంచి తాను పోటీచేయనని అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో బీజేపీ జాతీయ నేత ఎం.వెంకయ్యనాయుడు జోక్యం చేసుకుని టీడీపీ ఎటూ ఓడిపోయే అనంతపురం స్థానాన్ని మాకు అంటగడితే ఎలా.. కదిరి స్థానాన్ని కచ్చితంగా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడంతో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారు. అనంతపురం జిల్లాలో సీట్ల కేటాయింపుపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. వివరాల్లోకి వెళితే.. సీమాంధ్రలో 15 శాసనసభ, 5 లోక్సభ స్థానాలను బీజేపీకి ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది. జిల్లాలో కదిరి, అనంతపురం శాసనసభ స్థానాలను తమకు కేటాయించాలని బీజేపీ నేతలు తొలి నుంచి పట్టుబడుతూ వస్తున్న విషయం విదితమే. కానీ.. జిల్లాలో ఒకే శాసనసభ స్థానం కేటాయించనున్న నేపథ్యంలో కదిరి ఒక్కటీ ఇస్తే చాలని తాజాగా బీజేపీ నేతలు పట్టుపట్టారు. కదిరి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ ప్రాతినిథ్యం వహిస్తున్నారని.. అందువల్ల ఆ సీటు ఇవ్వలేమని, అనంతపురం సీటు ఇచ్చేందుకు సిద్ధమని బీజేపీ నేతలకు చంద్రబాబు ప్రతిపాదించారు. కానీ.. ఆ ప్రతిపాదనలను బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ ప్రకాష్ జవదేకర్ తోసిపుచ్చారు. 2009 ఎన్నికల్లో సీపీఐతో పొత్తు పెట్టుకున్నప్పుడు సిటింగ్ ఎమ్మెల్యే ఉన్న ధర్మవరం స్థానాన్ని ఆ పార్టీకి ఎలా కేటాయించారంటూ నిలదీశారు. ఇప్పుడు అదే తరహాలోనే కదిరి కచ్చితంగా తమకు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. పరిటాల సునీత రాజీనామాస్త్రం కదిరిలో కందికుంట ప్రసాద్కు అన్యాయం చేస్తే పార్టీని వీడటానికి వెనుకాడబోమంటూ చంద్రబాబుకు పరిటాల సునీత ఆదివారం మరోసారి స్పష్టీకరించారు. పరిటాల సునీతను అనునయించేందుకు చంద్రబాబు విఫలయత్నం చేశారు. తాము వారించినా జేసీ దివాకర్రెడ్డిని తీసుకున్నారని.. ఇప్పుడు కందికుంటకు అన్యాయం చేస్తే సహించమని పరిటాల సునీత హెచ్చరించడంతో చంద్రబాబు చేసేదిలేక అనంతపురం స్థానాన్నే కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇది పసిగట్టిన జేసీ దివాకర్రెడ్డి ‘2009 ఎన్నికల్లో అనంతపురంలో బీజేపీ పోటీ చేస్తే కేవలం 800 ఓట్లు వచ్చాయి. అప్పటితో పోలిస్తే ఆ పార్టీ బలం పెరిగిన దాఖలాలు లేవు.. ఈ నేపథ్యంలో ఆ సీటును బీజేపీకి కేటాయించవద్ద’ని చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచారు. అనంతపురం అసెంబ్లీ సీటును కేటాయిస్తే.. ఆ ప్రభావం లోక్సభ స్థానంపై పడుతుందని జేసీ వివరించారు. టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా 1999 ఎన్నికల్లో కదిరిని ఆపార్టీకి కేటాయించారని.. అప్పట్లో బీజేపీ అభ్యర్థి ఎంఎస్ పార్థసారధి 7,236 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారని చంద్రబాబుకు జేసీ వివరించారు. 2004 ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థిగా ఎంఎస్ పార్థసారధి పోటీ చేశారని.. కందికుంట ప్రసాద్ టీడీపీ రెబెల్ అభ్యర్థిగా బరిలోకి దిగడం వల్లే ఎంఎస్ పార్థసారధి విజయం సాధించలేకపోయారని గణాంకాలతో సహా చంద్రబాబుకు వివరించినట్లు సమాచారం. బీజేపీ నేతలు కోరినట్లుగా కదిరిని ఆపార్టీకే కేటాయించడం సముచితమంటూ జేసీ స్పష్టీకరించారు. కాదూ కూడదని అనంతపురం అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తే.. తాను లోక్సభ స్థానానికి పోటీచేసే ప్రశ్నే లేదని జేసీ దివాకర్రెడ్డి అల్టిమేటం జారీచేసినట్లు టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. వెంకయ్య రంగ ప్రవేశం టీడీపీ గెలవలేని అనంతపురం శాసనసభ స్థానాన్ని బీజేపీకి కేటాయించిందనే అంశాన్ని బీజేవైం రాష్ట్ర అధ్యక్షులు విష్ణువర్దన్రెడ్డి ఆ పార్టీ జాతీయ నేత వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకెళ్లారు. అనంతపురంలో విజయావకాశాలు తక్కువగా ఉంటాయని.. కదిరి శాసనసభ స్థానం ఇస్తే కచ్చితంగా విజయం సాధిస్తామని విష్ణువర్దన్రెడ్డి వివరించారు. ఈ వాదనతో ఏకీభవించిన వెంకయ్యనాయుడు ఆదివారం రాత్రి నేరుగా చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు. అనంతపురం అసెంబ్లీ స్థానం తమకు వద్దని.. కదిరి సీటును కేటాయించాలని తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. జేసీ దివాకర్రెడ్డి, వెంకయ్యనాయుడు ఒత్తిడితో చంద్రబాబు వెనక్కి తగ్గారు. జిల్లాలో సీట్ల కేటాయింపుపై ప్రత్యేక సమావేశం నిర్వహించి.. నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం. -
‘పొత్తు’ చిక్కులు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రాన్ని రెండుగా చీల్చిన బీజేపీ, టీడీపీలు ఎట్టకేలకు జతకట్టాయి. ఈ పొత్తు తమ్ముళ్లకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. మైనార్టీలు వ్యతిరేకిస్తున్న బీజేపీతో టీడీపీ కలిసి నడిచేందుకు నిర్ణయించుకోవడం మొదటికే మోసం తీసుకొస్తుందనే చర్చ జరుగుతోంది. ఓటమి భయంతో అధినేత చంద్రబాబు ముందూ వెనుక ఆలోచించకుండా తీసుకుంటున్న నిర్ణయాలు జిల్లా టీడీపీ శిబిరానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జిల్లాలో జయాపజయాలను శాసించే ముస్లిం మైనారిటీలు ఇకపై టీడీపీకి ఓట్లేసే పరిస్థితి లేదని ఈ పొత్తుతో స్పష్టమైపోయింది. జిల్లాలోని కర్నూలు, నంద్యాల, ఆదోని, ఆత్మకూరు, బనగానపల్లె, పాణ్యం, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల్లో ఆ ప్రభావం ఉంటుందని తెలుస్తోంది. రాష్ట్రాన్ని విభజించటంలో ప్రధాన భూమిక పోషించిన బీజేపీతో టీడీపీ జతకట్టడంతో విభజన వాదులంతా ఒకే గూటికి చేరినట్లయింది. బీజేపీతో పొత్తు ఖరారైనప్పటికీ జిల్లాలో ఆ పార్టీకి ఏ సీట్లు కేటాయిస్తారనే విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అయితే బీజేపీ నేతలు మాత్రం మూడు అసెంబ్లీ స్థానాలు ఆశిస్తున్నారు. ఇందులో పాణ్యం, ఆదోని, నంద్యాల అసెంబ్లీ స్థానాలు ఉన్నట్లు సమాచారం. టీడీపీ నేతలు మాత్రం అభ్యర్థే లేని కోడుమూరు అసెంబ్లీని కేటాయిస్తామని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను కమల దళం వ్యతిరేకిస్తోంది. ఆ మూడు బీజేపీకి కేటాయిస్తే... కమల దళం కోరినట్లు నంద్యాల, ఆదోని, పాణ్యం అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తే టీడీపీ పుట్టి మునిగినట్లేననేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. విభజన భయంతో కాంగ్రెస్ను వీడి టీడీపీలో చేరిన నంద్యాల ఎమ్మెల్యే శిల్పా మోహన్రెడ్డి, ఆదోని టీడీపీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, పాణ్యాన్నే నమ్ముకుని పచ్చకండువా కప్పుకున్న మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్రెడ్డికి బీజేపీ డిమాండ్లు మింగుడు పడటం లేదు. పాణ్యం సీటు తనదేనని.. అధినేత హామీ ఇచ్చాడంటూ కోట్లు ఖర్చు చేస్తూ ప్రచారంలో తలమునకలవుతున్న కేజే రెడ్డి పరిస్థితి ఎటూ తేలడం లేదు. బీజేపీ నేతలు అడిగిన డిమాండ్కు తలొగ్గితే ఆ ముగ్గురు నేతల ఆశలపై నీళ్లు చల్లినట్లేనని తెలుస్తోంది. ఒక వేళ్ల ఆ మూడు సీట్లు కేటాయిస్తే అధిష్టానాన్ని ధిక్కరించేందుకైనా సిద్ధమవుతామని తమ్ముళ్లు తెగేసి చెబుతున్నారు. సమైక్యవాదుల ఆగ్రహం: విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు పలుమార్లు ప్రత్యేక తెలంగాణకు తమ పార్టీ అనుకూలమని ప్రకటించారు. అదేవిధంగా పార్లమెంట్లో విభజన బిల్లు ఆమోదం పొందేందుకు పూర్తి స్థాయిలో సహకరించిన పార్టీ బీజేపీ. ఈ రెండు పార్టీలు అధికారం కోసం చేతలు కలపటాన్ని సమైక్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. -
‘రెడ్జోన్’ ఊసేదీ?
ఎన్నికల ప్రచారంలో ఏ పార్టీకి చెందిన నాయకుడు కూడా రెడ్జోన్ అంశాన్ని ప్రస్తావించకపోవడంపై బాధితులు మండిపడుతున్నారు. దీని పరిధిలో అనేకమంది తెలుగువారు కూడా నివసిస్తున్నారు. ఇళ్లను నిర్మించి 12 ఏళ్లు గడిచిపోయిన తర్వాత ఖాళీ చేయాలంటూ రక్షణ విభాగం నోటీసులు ఇచ్చిందని, ఈ విషయాన్ని రక్షణ శాఖ మంత్రి ఆంటోనీ దృష్టికి తీసుకుపోయినా ఫలితం లేకపోయిందని వారు వాపోతున్నారు. పింప్రి, న్యూస్లైన్: మావల్ లోక్సభ పరిధిలో ఎన్నికల ప్రచారంలో ఏ ఒక్క నాయకుడూ రెడ్జోన్ అంశాన్ని ప్రస్తావించడం లేదు. ఈ నియోజకవర్గం పరిధిలో సుమా రు ఐదు లక్షలమందికిపైగా రెడ్జోన్ బాధితులున్నారు. అయినప్పటికీ ఏ ఒక్క రాజకీయ నాయకు డు తమకు భరోసా ఇవ్వడం లేదని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. ఈ జోన్ పరిధిలో వేలాదిమంది తెలుగు కుటుంబాలు కూడా నివసిస్తున్నాయి. డిసెంబర్ 2002లో కేంద్ర ప్రభుత్వం దేహూరోడ్లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆ ప్రాంతాన్ని రెడ్జోన్గా ప్రకటిం చింది. అయితే రెడ్జోన్ పరిధి ఎంత అనే విషయం తెలియకపోవడం తో అప్పట్లో అనేకమంది ఆ పరిసరాల్లో గృహనిర్మాణాలను చేపట్టారు. సరిగ్గా 12 ఏళ్ల తర్వాత రక్షణ విభాగం ఇళ్లు ఖాళీ చేయాలంటూ ఆయా కుటుం బాలకు నోటీసులు జారీ చేసింది. ఈ ఫ్యాక్టరీకి 2,000 గజాల పరిధిని సంబంధిత అధికారులు రెడ్జోన్గా ప్రకటించారు. ఇందులో మామ డి, వికాస్నగర్, దేహూరోడ్ బజార్, చించోలి, కిన్హాయి, తలవడే, దేహూ, జెండా మలా, రావత్లోని కొన్ని ప్రాంతాలతోపాటు, నిగిడి ప్రాధికరణ్, రూపీ నగర్లు కూడా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో వేలాదిమంది తెలుగు ప్రజలు స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యం లో రెడ్జోన్ను రద్దు చేయాలని లేదా దాని హద్దును తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం స్థానికులంతా ఏకతాటిపైకి వచ్చి ఇటీవల రెడ్జోన్ సంఘర్షణ సమితిని ఏర్పా టు చేసుకున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం పలుమార్లు నిరసన ప్రదర్శనలు కూడా చేశారు. అంతేకాకుండా రక్షణ శాఖ మంత్రి ఎ.కె. ఆంటోనీని కలసి చర్చలు జరిపారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి ప్రయోజన మూ కలగలేదు. మావల్ నియోజక వర్గంలోని ఆరు శాసనసభ నియోజక వర్గాల్లో వేలాది మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. ఇందులో భాగమైన చించ్వాడ్ అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో ఉంటున్న తెలుగువారు ఎన్నికలపై తమ తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. -
నామినేషన్ల కోలాహలం
నాలుగో రోజు 29 నామినేషన్లు లోక్సభకు 4, అసెంబ్లీ స్థానాలకు 25 దాఖలు నల్లగొండకు ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి మిర్యాలగూడ అసెంబ్లీకి తూడి సాక్షి, నల్లగొండ, జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నాలుగో రోజు శనివారం మొత్తం 29 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో నల్లగొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు రెండుచొప్పున, 8 అసెంబ్లీ స్థానాలకు 25 చొప్పున ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. భువనగిరి, నాగార్జునసాగర్, దేవరకొండ, తుంగతుర్తి నియోజకవర్గాల నుంచి ఒక్క నామినేషన్ కూడా రాలేదు. అత్యధికంగా నల్లగొండ అసెంబ్లీ స్థానానికి 6 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నుంచి 7, టీడీపీ, టీఆర్ఎస్ నుంచి 3 చొప్పున, వైఎస్సార్ కాంగ్రెస్, భారత పిరమిడ్ పార్టీల నుంచి ఒక్కొక్కటి చొప్పున, స్వతంత్రులు 10మంది నామినేషన్లు వేశారు. ఎంపీ గుత్తా, డీసీసీ అధ్యక్షుడు తూడి.. నల్లగొండ లోక్సభ స్థానానికి సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి రెండు సెట్ల నామినేషన్లను సమర్పిం చారు. అదేవిధంగా భువనగిరి లోక్సభ స్థానానికి బీఎస్పీ అభ్యర్థిగా అర్వపల్లి అంబటి రెండు సెట్ల నా మినేషన్లు వేశారు. మిర్యాలగూడ అసెంబ్లీ స్థానానికి డీసీసీ జిల్లా అధ్యక్షుడు తూడి దేవేందర్రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా నకిరేకల్ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రెండుసెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. -
ప్రచారం బంద్
సాక్షి,నెల్లూరు: తొలివిడత పరిషత్ ఎన్నికలు జరుగుతున్న పంచాయతీల్లో ప్రచారానికి శుక్రవారంతో తెరపడింది. మరోవైపు ఓటర్లను ప్రలోభ పెట్టే కార్యక్రమానికి తెరలేచింది. మద్యం, డబ్బు పంపిణీ ఊపందుకుంది. విజయమే లక్ష్యంగా అభ్యర్థులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలతో అడ్డదారులు తొక్కుతున్నాయి. మొత్తంగా పరిషత్ ఎన్నికల ఘట్టం కీలక దశకు చేరుకుంది. తొలివిడతలో భాగంగా జిల్లాలోని 21 మండలాల్లో ఎన్నికలు ఈ నెల 6న జరగనున్నాయి. 911 పోలింగ్ కేంద్రాల పరిధిలో 7,04,671 మంది గ్రామీణ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. విజయమే లక్ష్యంగా.. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి తెరలేపారు. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచే మద్యం పంపిణీ షురూ చేశారు. ఓటు కు రూ.500 నుంచి రూ.2 వేల వరకూ వెచ్చిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కుటుంబాలనే పెద్ద మొత్తంలో వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. కనీసం 10 నుంచి ఆ పైన ఓటర్లను ప్రభావితం చేయగలిగే నేతలను మరింత మచ్చిక చేసుకుని పెద్ద మొత్తం వెచ్చించి వారిని కొనుగోలు చేస్తున్నారు. ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో ఈ మొత్తం రెండు మూడు రె ట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. యువకులకు క్రికెట్ కిట్లు, మహిళలకు చీరలు, తదితర వస్తువులను సైతం పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రానికి అధికారికంగా ప్రచారం ముగియడంతో పల్లెల్లో చీకటి రాజకీయాలు జోరందుకున్నాయి. రాత్రి పొద్దుపోయాక గుట్టు చప్పుడు కాకుండా డబ్బు పంపిణీ కార్యక్రమాన్ని కానిచ్చేస్తున్నారు. అభ్యర్థులు ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకాడడంలేదు. సరాసరి ఒక్కొక ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి రూ.25 లక్షలు తగ్గకుండా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జనరల్ కేటగిరీకి కేటాయించిన జెడ్పీటీసీ స్థానాల్లో కోట్లలోనే ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. ప్రధాన పార్టీల నేతలు పల్లెల్లో మకాం వేసి ఓటర్లను ప్రభావితం చేసే పనిలో నిమగ్నమయ్యారు. శనివారం సాయంత్రానికి ప్రలోభాల పర్వం మరింత జోరందుకోనుంది. మద్యం ఏరులై పారుతోంది. నిబంధనలను ఎక్కడా పాటిస్తున్న దాఖలాలు కానరావడంలేదు. ఇక జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పారీ అభ్యర్థ్టుల విజయాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్, టీడీపీలు కుట్రలు పన్ని అందుకు అవసరమైన అడ్డదారులన్నీ తొక్కుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారింది. ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులెవరూ ముందుకు రాని పరిస్థితి. దీంతో టీడీపీతో కుమ్మక్కై వైఎస్సార్సీపీకి అడ్డుకట్ట వేయాలని ఆ పార్టీ నేతలు టీడీపీతో చీకటి ఒప్పందాలకు దిగారు. చాలా ప్రాంతాల్లో ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు. కాంగ్రెస్,టీడీపీలకు బుద్ధి చెప్పేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారన్నది పరిశీలకుల అభిప్రాయం. -
అమీ తుమీ
సాక్షి ప్రతినిధి, అనంతపురం : తెలుగుదేశం పార్టీలో తన చేరికను వ్యతిరేకించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతకు చెక్ పెట్టేందుకు ఆ పార్టీ నేత జేసీ దివాకర్రెడ్డి ఎత్తులు వేస్తున్నారా? పరిటాల సునీతను వ్యతిరేకిస్తోన్న వారందరినీ చేరదీస్తున్నారా? టీడీపీలో పరిటాల సునీతను సమర్థిస్తోన్న ఏకైక ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ సీటును బీజేపీకి ఇచ్చేలా ఆపార్టీ అధిష్టానాన్ని జేసీనే ప్రభావితం చేస్తున్నారా? ఈప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. వివరాల్లోకి వెళితే.. పరిటాల రవి, జేసీ దివాకర్రెడ్డిలు రాజకీయాల్లో ఉప్పూనిప్పుగా ఉన్న విషయం విదితమే. జేసీ దివాకర్రెడ్డితో రాజకీయంగా పరిటాల రవి తీవ్రంగా విభేదించారు. ఈ క్రమంలోనే జనవరి 24, 2005న పరిటాల రవి అనంతపురంలో ప్రత్యర్థుల చేతిలో హతమయ్యారు. ఆ హత్య కేసులో జేసీ దివాకర్రెడ్డి కూడా నిందితుడని పరిటాల సునీత అప్పట్లో ఆరోపించారు. 2009 ఎన్నికల్లో రాప్తాడు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పరిటాల సునీత.. ప్రొటెం స్పీకర్గా ఉన్న జేసీ దివాకర్రెడ్డి ఎదుట ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడా ఆసక్తి చూపలేదంటే ఆయనపై ఆమెకు ఉన్న వ్యతిరేకత ఏ స్థాయో విశదం చేసుకోవచ్చు. ఇప్పటికీ జేసీని అదే స్థాయిలో ఆమె వ్యతిరేకిస్తున్నారు. ఆ క్రమంలోనే జేసీ బ్రదర్స్ను టీడీపీలో చేర్చుకోవద్దని చంద్రబాబును పదే పదే డిమాండ్ చేశారు. ‘బేర’సారాలు కుదరడంతో.. పరిటాల సునీత అభ్యంతరాలను చంద్రబాబు లెక్కచేయలేదు. జేసీ బ్రదర్స్కు రెడ్కార్పెట్ వేసి టీడీపీలోకి ఆహ్వానించారు. టీడీపీలోకి జేసీ ప్రవేశించిన తర్వాత పరిటాల సునీత పలు సందర్భాల్లో మాట్లాడుతూ జేసీతో కలిసి పనిచేసే ప్రశ్నే లేదని స్పష్టీకరించారు. కానీ.. పరిటాల సునీత తన సోదరి అని జేసీ పైకి చెబుతూ వస్తున్నారు. అయితే అంతర్గతంగా మాత్రం తనను వ్యతిరేకించిన పరిటాల సునీతను రాజకీయంగా దెబ్బతీసేందుకు జేసీ దివాకర్రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. రాప్తాడు నియోజకవర్గంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పరిటాల సునీత పెనుకొండ నియోజకవర్గంపై కన్నేశారు. సార్వత్రిక ఎన్నికల్లో పెనుకొండ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని చంద్రబాబును కోరారు. ఇందుకు చంద్రబాబు అంగీకరించలేదు. కానీ.. ఆమె తన ప్రయత్నాలను మాత్రం ఆపలేదు. ఈ క్రమంలోనే పరిటాల సునీతకు పెనుకొండ సీటు దక్కకుండా చేసేందుకు జేసీ దివాకర్రెడ్డి ప్రణాళిక రచించారు. పరిటాల సునీతను వ్యతిరేకిస్తోన్న నేతలను దగ్గరికి తీసేయత్నంలో భాగంగానే గురువారం పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలంలో ఎంపీ నిమ్మల, ఎమ్మెల్యే బీకేతో కలిసి పర్యటించారు. పెనుకొండ టికెట్ బీకే పార్థసారధికే వస్తుందని జేసీ దివాకర్రెడ్డి టీడీపీ శ్రేణులతో స్పష్టీకరించారు. ఇది పరిటాల సునీత వర్గీయులను ఆగ్రహానికి గురిచేసింది. పరిటాల సునీతకు చెక్పెట్టే క్రమంలోనే ఆమె వర్గీయుడైన కందికుంట ప్రసాద్ సీటుకు టీడీపీ అధిష్టానం ఎసరు పెట్టడంలో జేసీ ప్రధాన భూమిక పోషిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కదిరి సీటు కోసం బీజేపీ తీవ్రంగా పట్టుబడుతోన్న నేపథ్యంలో ఆ సీటు ఇవ్వడమే మంచిదని సీఎం రమేష్ ద్వారా చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారు. జిల్లాలో ఆ ఒక్క సీటు ఇచ్చినా బీజేపీ సర్దుకుంటుందని చంద్రబాబుకు జేసీ దివాకర్రెడ్డి చెప్పడంతో ఆ మేరకు కదిరిని వదులుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. కదిరి శాసనసభ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తోన్న నేపథ్యంలో.. ఎమ్మెల్సీ ఇస్తామని కందికుంట ప్రసాద్ వద్దకు సీఎం రమేష్ను చంద్రబాబు రాయబారం పంపడం అందులో భాగమేననే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. -
రేపే తొలి విడత
కరీంనగర్ సిటీ, న్యూస్లైన్ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ తొలి విడత ఎన్నికల ప్రచారానికి శుక్రవారం తెరపడింది. పెద్దపల్లి, మంథని, జగిత్యాల డివిజన్లలోని 30 జెడ్పీటీసీ, 409 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 6న పోలింగ్ జరగనుంది. ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటలకు పోలింగ్ జరగనుంది. శుక్రవారం సాయంత్రమే ప్రచారానికి తెరపడడంతో ఓటర్లకు గాలం వేయడంలో అభ్యర్థులు బిజీ అయ్యారు. యువజన సంఘాలు, మహిళా సంఘాలు, కుల సంఘాల వారీగా రాత్రి నుంచే ప్రత్యేక సమావేశాలు గుట్టుగా నిర్వహిస్తున్నారు. పార్టీల అభ్యర్థుల తరఫున ఇప్పటికే ప్రధాన నాయకులు జిల్లా అంతటా ప్రచారం సాగించారు. ఎక్కడి ఎమ్మెల్యేలు అక్కడే తమ అభ్యర్థుల తరఫున ఊరూరూ తిరిగారు. టీఆర్ఎస్ అభ్యర్థుల పక్షాన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మంథని, వెల్గటూరు, కథలాపూర్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ను ఎండగడుతూ ఆమె ప్రచారం సాగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్తో పాటు స్థానికంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్తోనే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందనే అంశానికే ప్రచారంలో వారు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు. సీట్ల అవగాహనతో పోటీ చేసిన బీజేపీ, టీడీపీ నేతలు ప్రాదేశిక ఎన్నికలను పెద్దగా పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల తరపున ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్రెడ్డి ప్రచారం చేపట్టారు. కీలకస్థానాలు ఇక్కడే.. తొలివిడత ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం పై గురిపెట్టిన అభ్యర్థుల స్థానాలే ఎక్కువగా ఉన్నాయి. తొలిసారి జెడ్పీ చైర్పర్సన్ పదవి మహిళకు రిజర్వ్ కావడంతో, కాంగ్రెస్, టీఆర్ఎస్ల నుంచి మహిళా నాయకులు, నేతల భార్యలు బరిలోకి దిగారు. ఆయా పార్టీలు అధికారికంగా చైర్పర్సన్ అభ్యర్థులను ప్రకటించకున్నా, టీఆర్ఎస్ తరపున ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తుల ఉమ, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీర్ల వెంకటేశ్వర్రావు భార్య వీర్ల కవిత, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కొడూరి సత్యనారాయణగౌడ్ భార్య కోడూరి అరుణ ప్రచారంలో ఉన్నారు. తుల ఉమ కథలాపూర్ నుంచి పోటీలో ఉండగా, వీర్ల కవిత రామడుగు నుంచి పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ ముఖ్యనేతల ఆశీస్సులు తమకే ఉన్నాయనే భరోసాతో ఇద్దరూ ప్రచార బరిలో దూసుకుపోతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్ భార్య కోడూరి అరుణ గంగాధర స్థానం నుంచి పోటీలో ఉన్నారు. గతంలో కరీంనగర్ మేయర్ విషయంలో తనకు అన్యాయం జరిగినందున ఈ సారి జెడ్పీ చైర్పర్సన్ స్థానం తమకే దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. పార్టీ ప్రధాన నాయకుల హామీతోనే పోటీకి దిగినట్లు శ్రేణులు చెబుతున్నాయి. చైర్పర్సన్ అభ్యర్థులు సొంత పార్టీలతోపాటు ఇతర పార్టీల నేతలను, ఇండిపెండెంట్ అభ్యర్థులను కూడా మచ్చిక చేసుకొనే పనిలో పడ్డారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో అవసరం పడతారనే ముందుచూపుతో ఇప్పటినుంచే మంతనాలు సాగిస్తున్నారు. -
ముహూర్తబలం
41 మంది.. 56 సెట్లు మూడోరోజు.. నామినేషన్ల జోరు అందుబాటులో లేని అభ్యర్థులు.. కుటుంబసభ్యుల చేత దాఖలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ముహూర్తం బాగుందని జిల్లాలో ఎక్కువ మంది శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటివరకు రెండు రోజుల్లో 5 నామినేషన్లు మాత్రమే దాఖలు కాగా శుక్రవారం 13 అసెంబ్లీ నియోజకవర్గాలనుంచి 41 మంది అభ్యర్థులు 56 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ మినహా ఏ పార్టీ అభ్యర్థులను ప్రకటించకున్నా ఆశావహులు టికెట్ ఆశిస్తూ పార్టీ పరంగా నామినేషన్లు దాఖలు చేశారు. సాక్షి, కరీంనగర్ : చొప్పదండి మినహా.. 12 నియోజకవర్గాలకు టీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు కావడంతో బీ ఫారం కోసం అభ్యర్థులు హైదరాబాద్ వెళితే.. ముహూర్తం బాగుందని ఎనిమిది నియోజకవర్గాల్లో అభ్యర్థుల తరఫున వారి సతీమణులు.. కుటుంబసభ్యులు నామినేషన్లు వేయడం విశేషం. వైఎస్సార్సీపీ అధికారికంగా అభ్యర్థులను ఖరారు చేయకపోయినప్పటికీ కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి కండెన్ ప్రభాకర్ కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్యకు నామినేషన్ సమర్పించారు. మానకొండూరు అసెంబ్లీ స్థానం నుంచి సొల్లు అజయ్వర్మ, పెద్దపల్లి అసెంబ్లీ స్థానానికి ఎంఏ ముస్తాఖ్పాషా నామినేషన్ వేశారు. శనివారం బాబుజగ్జీవన్రాం జయంతి సెలవుదినం అయినప్పటికీ నామినేషన్లు స్వీకరిస్తామని అధికారులు ప్రకటించారు. ఆదివారం తొలి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కావడంతో సోమవారం అధికంగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. టీఆర్ఎస్ నుంచి.. కరీంనగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తరఫున ఆయన సతీమణి రజిని నామినేషన్ దాఖలు చేశారు. రామగుండంలో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తరఫున ఆయన కుమారుడు అరుణ్కుమార్తోపాటు పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు గుంపుల ఓదెలు, ధర్మపురిలో ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ తరఫున ఆయన సతీమణి స్నేహలత, మంథనిలో పుట్ట మధు సతీమణి పుట్ట శైలజ తనతోపాటు తన భర్త తరఫున నామినేషన్ పత్రాలు సమర్పించారు. వేములవాడలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు తరఫున ఆయన ముఖ్య అనుచరుడు ఎర్రం మహేశ్, పెద్దపల్లిలో దాసరి మనోహర్రెడ్డి తరఫున ఆయన కుమారుడు ప్రశాంత్రెడ్డి, జగిత్యాలలో డాక్టర్ సంజయ్కుమార్ తరఫున తండ్రి హన్మంతరావు, చిన్నాన జితేందర్ , హుస్నాబాద్లో వొడితల సతీశ్బాబు తరఫున ఆయన మరదలు వర్ష నామినేషన్ వేశారు. మంథనిలో చందుపట్ల సునీల్రెడ్డి నామినేషన్ వేశారు. కాంగ్రెస్ నుంచి : మానకొండూరులో ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, కరీంనగర్ అసెంబ్లీకి చల్మెడ లక్ష్మీనర్సింహారావు, జగిత్యాలకు మాజీ మంత్రి జీవన్రెడ్డి తరఫున మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, గట్టు సతీశ్ నామినేషన్లు దాఖలు చేశారు. హుజూరాబాద్ నుంచి కేతిరి సుదర్శన్రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి, పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి కోడలు సవితారెడ్డి, రామగుండంలో పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి కోలేటి దామోదర్, కౌశిక్హరి తరఫున ఆయన సతీమణి లత, కోరుట్లలో బెజ్జారపు శ్రీనివాస్ నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ నుంచి : పెద్దపల్లిలో ఎమ్మెల్యే విజయరమణారావు, కరీంనగర్ నుంచి కల్యాడపు ఆగయ్య, సిరిసిల్ల నుంచి కోడి అంతయ్య, మానకొండూరులో కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండిలో మ్యాక లక్ష్మయ్య, జానపట్ల స్వామి, రామగుండంలో సిరిపురం మాణిక్యం, షేక్అఫ్జల్ నామినేషన్ దాఖలు చేశారు. వేములవాడలో గండ్ర నళిని, కోరుట్లలో సాంబరి ప్రభాకర్, మానకొండూరులో ఎడ్ల వెంకటయ్య నామినేషన్ వేశారు. బీజేపీ నుంచి : పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, కోరుట్లలో ఆర్మూరు పోచయ్య రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులు : రామగుండంలో శాప్ మాజీ చైర్మన్ రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ తరఫున ఆయన సతీమణి ప్రసూన మనాలి, కౌశిక్హరి అనుచరుడు రాజు, గోపు ఐలయ్య యాదవ్, పాతిపల్లి ఎల్లయ్య, పెంట రాజేశ్, మానకొండూరు నుంచి ఎడ్ల వెంకటయ్య, కోరుట్లలో గడ్డం మధు, మంథనిలో చందుపట్ల సునీల్రెడ్డి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. బీఎస్పీ నుంచి వేములవాడలో గడ్డం రవీందర్రెడ్డి నామినేషన్ వేశారు. -
గులాబీ దళం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : పొత్తుల ఊహాగానాలకు తెరదించుతూ టీఆర్ఎస్ పార్టీ తవు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మిగతా పార్టీల కంటే వుందుగా అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 69 మందితో ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు జాబితాను విడుదల చేశారు. అందులో జిల్లాకు సంబంధించి చొప్పదండి మినహా 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించటం గవునార్హం. వీరిలో ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు. ఒకరికి గత ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవవుండగా.. మిగిలిన నలుగురు కొత్త అభ్యర్థులు. తెలంగాణలోనే అత్యధికంగా ఏడుగురు పార్టీ ఎమ్మెల్యేలున్న జిల్లాలో... సిట్టింగ్లందరికీ టీఆర్ఎస్ తొలి ప్రాధాన్యమిచ్చింది. ఎక్కడివాళ్లకు అక్కడే వురోసారి పోటీ చేసే అవకాశం కల్పించింది. ధర్మపురి నుంచి కొప్పుల ఈశ్వర్, హుజూరాబాద్ నుంచి ఈటెల రాజేందర్, కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్, సిరిసిల్ల నుంచి కె.తారకరామారావు, కోరుట్ల నుంచి కల్వకుంట్ల విద్యాసాగర్రావు, వేములవాడ నుంచి చెన్నవునేని రమేష్బాబు, రామగుండం నుంచి సోవూరపు సత్యనారాయుణకు టిక్కెట్లు కేటారుంచింది. సిట్టింగ్ల్లో అరుదుగురు ఎమ్మెల్యేలు గడిచిన అరుదేళ్ల వ్యవధిలో వూడోసారి ఎన్నికలు ఎదుర్కోనుండటం విశేషం. 2009లో ఎమ్మె ల్యేలుగా గెలిచిన ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, కల్వకంట్ల విద్యాసాగర్రావు, కేటీఆర్, రమేశ్బాబు 2010 ఉప ఎన్నికల్లోనూ పోటీ చేశా రు. మరోసారి అక్కడే విజేతలుగా నిలిచారు. కేసీఆర్ తనయుుడు కేటీఆర్కు ఈసారి కూడా సిరిసిల్ల నుంచి పోటీకి దిగుతున్నారు. ఆయన ఎంపీగా పోటీ చేస్తారని, ఎమ్మెల్యేగా పోటీ చేసి నా.. వేరే చోటికి వలస వెళ్తాతారని కొంతకాలంగా జరిగిన ప్రచారానికి తెర పడింది. 2009 ఎన్నికల్లో సిరిసిల్ల బరిలో అడుగుపెట్టిన కేటీఆర్ అక్కడే 2010 ఉప ఎన్నికలను ఎదుర్కొన్నారు. వరుసగా వూడోసారి కార్మిక క్షేత్రం నుంచే పోటీకి సిద్ధవువుతున్నారు. గత ఎన్నికల్లో వుహాకూటమిలో టీఆర్ఎస్ వుద్ధతుతో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గంగుల కవులాకర్, ఇండిపెండెంట్గా పోటీ చేసిన సోవూరపు సత్యనారాయుణ ఈసారి గులాబీ గుర్రాలుగా బరిలోకి దిగుతున్నారు. పౌరసత్వానికి సంబంధించిన కేసు వెంటాడుతున్న రమేశ్బాబు అభ్యర్థిత్వంపై ఉన్న సందిగ్ధత జాబితా వెల్లడితో తొలగిపోయింది. వూజీ వుంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు తనయుుడు వొడితెల సతీష్బాబును హుస్నాబాద్ నుంచి బరిలోకి దింపారు. గత ఎన్నికల్లో సీపీఐతో పొత్తు ఒప్పందాన్ని ఉల్లంఘించి లక్ష్మీకాంతారావును పోటీకి దింపిన చోటునుంచే ఈసారి ఆయున తనయుడిని పోటీకి దింపటం గవునార్హం. సతీష్బాబు తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. ఇటీవలే పార్టీలో చేరిన పుట్ట మధుకు అంద రూ ఊహించినట్లుగానే మంథని టిక్కెట్టు ఖరా రు చేసింది. గత ఎన్నికల్లో పీఆర్పీ తరఫున పోటీ చేసిన వుధు కొంతకాలం వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్గా ఉన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా టీఆర్ఎస్ జగిత్యాల నుంచి పోటీకి దిగుతుండటం విశేషం. పొత్తులో భాగంగా 2004లో కాంగ్రెస్కు, 2009లో టీడీపీకి ఈ సీటును వదిలేసిన టీఆర్ఎస్ ఈసారి ఒంటరిగా పోటీకి దిగుతోంది. ఇటీవలే పార్టీలో చేరిన నేత్ర వైద్యుడు డాక్టర్ ఎం.సంజయ్కుమార్కు టిక్కెట్టు కేటారుంచింది. కొత్తగా రాజకీయూల్లోకి వచ్చిన సంజయ్ తొలి ప్రయుత్నంలోనే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. రెండు నెలల కిందట టీఆర్ఎస్ నేత హరీష్రావు ప్రకటించిన విధంగానే ట్రినిటీ విద్యాసంస్థల నిర్వాహకుడు దాసరి మనోహర్రెడ్డికి పెద్దపల్లి నుంచి టిక్కెట్టు కేటారుంచారు. రెండేళ్ల కిందట పార్టీలో చేరిన వునోహర్రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయుటం ఇదే తొలిసారి. మెదక్ జిల్లాకు చెందిన తెలంగాణ ధూం ధాం గాయుకుడు రసవురుు బాలకిషన్ను వూనకొండూరు అభ్యర్థిగా ప్రకటించారు. గత ఎన్నికల్లోనూ ఇదే సీటును ఆశించిన రసవురుు టిక్కెట్ల రేసులోనే భంగపడ్డారు. అరుదేళ్ల తర్వాత ఆయునకు ఈ అవకాశం దక్కినట్లరుంది. ఇటీవలే ఎంపీ వివేక్ పార్టీ వూరటంతో పెద్దపల్లి ఎంపీ స్థానానికి ఈయున అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్లు జరిగిన ప్రచారానికి తెరపడింది. గజ్జెకట్టి పాట పాడిన రసవురుు తొలిసారిగా అసెంబ్లీ బరిలోకి దిగుతున్నారు. అగ్రవర్ణాలకే అగ్రపీఠం సామాజిక సమీకరణాలను విశ్లేషిస్తే టిక్కెట్ల కేటారుుంపులో జిల్లాలో అగ్రవర్ణాలకే టీఆర్ఎస్ పెద్దపీట వేసినట్లు స్పష్టమవుతోంది. జిల్లాలోని 13 నియోజకవర్గాలకు మూడు ఎస్సీ స్థానాలు మినహాయించగా.. మిగిలిన పది నియోజకవర్గాల్లో ఆరు అగ్రవర్ణాలకు, నాలుగు బీసీలకు కేటాయించారు. స్థానికంగా రాజకీయ ఆధిపత్యం కొనసాగించే వెలమ సామాజిక వర్గానికి సిరిసిల్ల, కోరుట్ల, జగిత్యాల, వేవుులవాడ సీట్లు కేటాయించారు. మున్నూరు కాపు కులస్థులకు మూడు సీట్లు దక్కాయి. కరీంనగర్, రావుగుండం, వుంథని ఈ జాబితాలో ఉన్నాయి. ముదిరాజ్కు ఒకటి, కరణంకు ఒకటి, రెడ్డికి ఒక సీటు కేటారుంచారు. చొప్పదండిపై ఉత్కంఠ 12 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ ఎస్సీ రిజర్వ్డ్ అయిన చొప్పదండి సీటును పెండింగ్లో పెట్టింది. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జీ బొడిగె శోభ, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు బాల్క సుమన్ ఈ సీటుపై పట్టుబడుతున్నందున పెండింగ్లో పెట్టినట్లు తెలుస్తోంది. -
నామినేషన్ల జాతర
సాక్షి, నల్లగొండ,సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి శుక్రవారం పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి, రెండు రోజుల్లో ఒకే నామినేషన్ దాఖలు కాగా... మూడో రోజు అనూహ్యంగా మొత్తం 32 నామినేషన్లు పడ్డాయి. నల్లగొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు ఒక్కొక్కటి చొప్పున, 12 అసెంబ్లీ స్థానాలకు 30 నామినేషన్లను ఆయా పార్టీల అభ్యర్థులు వేశారు. భువనగిరి లోక్సభ స్థానానికి సిట్టింగ్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, నల్లగొండ లోక్సభ స్థానానికి సీపీఎం అభ్యర్థిగా అనంతరామశర్మ నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల దాఖలుకు 9వ తేదీ మధ్యాహ్నం 3 గంటల దాకా గడువుంది. పార్టీల వారీగా అభ్యర్థిత్వాలు తేలితే నామినేషన్ల సంఖ్య అంతకంత పెరిగే అవకాశం ఉంది. అసెంబ్లీకి... జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి 7, వైఎస్సార్సీపీ నుంచి 6, టీడీపీ నుంచి 4, టీఆర్ఎస్ నుంచి 3, సీపీఐ, ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) నుంచి 2 చొప్పున, సీపీఎం, బీజేపీ ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లు దాఖలు చేశాయి. మరో నలుగురు స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. ముగ్గురు అభ్యర్థులు రెండు సెట్ల చొప్పున నామినేషన్లు సమర్పించారు. నామినేషన్లు వేసిన ప్రముఖులు... నల్లగొండ అసెంబ్లీ స్థానానికి మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నాగార్జునసాగర్ స్థానానికి మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే కుందూరు జానారెడ్డి తరఫున ఆయన అనుచరులు నామినేషన్ వేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కేతావత్ బిల్యానాయక్ దేవరకొండ నుంచి నామినేషన్ వేయగా, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు వంగాల స్వామిగౌడ్ హుజూర్నగర్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. అలాగే భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉమా మాధవరెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్ తరఫున వారి అనుచరులు నామినేషన్లు సమర్పించారు. -
ఇక.. మాటల్లేవ్! తొలివిడతకు సన్నద్ధం
ముగిసిన ప్రాదేశిక ప్రచారం నల్లగొండ, న్యూస్లైన్,ప్రాదేశిక ఎన్నికల తొలి విడత ప్రచారానికి శుక్రవారంతో తెరపడింది. ఇక.. ఓటర్లను ప్రభావితం చేసేందుకు అభ్యర్థులు, వివిధ పార్టీల నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. సార్వత్రిక సమరానికి ముందు జరుగుతున్న ఈ ఎన్నికలను అన్ని పార్టీలూప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.అత్యధిక స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు నాయకులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. గ్రామాల్లో ఓటర్లను ఆకర్షించేందుకు భారీగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు. సూర్యాపేట, మిర్యాల గూడ, దేవరకొండ డివిజన్ల పరిధిలో ఎన్నికలు జరుగుతుండడంతో మాజీ మంత్రులు కె.జానారెడ్డి, ఉత్తమ్ కుమార్రెడ్డిలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. అదే విధంగా ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్రెడ్డి మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ నియోజకవర్గాల్లో పార్టీ గెలుపునకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇక సీపీఎం శాసనసభ పక్ష నేత జూలకంటి రంగారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరావు తమ పార్టీ అభ్యర్థులను గెలిపిం చాలని ఓటర్లను ప్రాధేయపడుతున్నారు. ఈ మూడు డివిజన్లలో కాంగ్రెస్ ఒంటిరిగానే పోటీచేస్తుండగా, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐలు అవగాహన మేరకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. తొలిసారిగా ప్రాదేశిక బరిలో దిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోదాడ, హుజూర్నగర్, సూర్యాపేట నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలను సాధించే దిశగా ఇప్పటికే పల్లెలో విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. ఈ నియోజక వర్గాల్లో అధికార కాంగ్రెస్కు వైఎస్సార్ కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వబోతుంది. 33 మండలాల్లో ఎన్నికలు... మూడు డివిజన్లలో 33 మండలాల పరిధిలో ఎంపీటీసీ 473, జెడ్పీటీసీ 33 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఎంపీటీసీ 14 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 459 ఎంపీటీసీ స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత పోరులో మొత్తం 11,94,433 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 5,96,704, మహిళలు 5,97,729 మంది ఉన్నారు. ఎంపీటీసీ 459 స్థానాలకు 1,699 మంది అభ్యర్థులు, జెడ్పీటీసీ 33 స్థానాలకు 213 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ ఏర్పాట్లు పూర్తి.. ఈ ఎన్నికల నిర్వహణకు మొత్తం 3,292 బ్యాలెట్ బాక్సులను వినియోగించనున్నారు. 908 ప్రాంతాల్లో 1554 పోలింగ్స్టేషన్లను ఏర్పాటు చేశారు. జెడ్పీటీసీకి గులాబీ, ఎంపీటీసీ సభ్యులకు తెల్ల రంగు బ్యాలెట్ పత్రాలను వినియోగిస్తారు. మూడు డివిజన్లను 164 జోన్లుగా విభజించి 164 రూట్లను గుర్తించారు. ఎన్నికల విధుల్లో 7,770 మంది సిబ్బంది పాల్గొననున్నారు. మైక్రో అబ్జర్వర్స్ -175, వీడియోగ్రాఫర్స్-317, వెబ్ కాస్టింగ్ సిబ్బంది-52 మందిని నియమించారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక నిఘా.. మూడు డివిజన్లలో 381 గ్రామాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. అతి సున్నితమైన గ్రామాలు 383 ఉన్నట్లు పోలీస్ శాఖ గుర్తించింది. మావోయిస్టుల ప్రభావితం ఉండే గ్రామాలు 61గా గుర్తించారు. వీటిలో 52 గ్రామాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని వీక్షించనున్నారు. మరో 317 గ్రామాల్లో ఎన్నికల ప్రక్రియను వీడియో ద్వారా చిత్రీకరిస్తారు. సమస్యాత్మక గ్రామాల్లో ఎన్నికలను సజావుగా పూర్తిచేసేందుకు ప్రత్యేకంగా 175 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు. -
సిట్టింగ్.. షిఫ్టింగ్ !
జిల్లాలోని సిట్టింగ్ ఎంపీలకు స్థానచలనం కేంద్ర మంత్రులిరువురూ మహబూబ్నగర్కు అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం కసరత్తు తాజా పరిణామాలతో ఆశావహుల్లో కొత్త ఆశలు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలో కాంగ్రెస్ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. లోక్సభ సీట్ల అభ్యర్థుల వ్యవహారం ఆ పార్టీలో సరికొత్త మలుపులకు దారితీస్తోంది. చేవెళ్ల, మల్కాజ్గిరి పార్లమెంట రీ స్థానాలకు ప్రాతినిధ్యం విహ స్తున్న కేంద్ర మంత్రులు సూదిని జైపాల్రెడ్డి, సర్వే సత్యనారాయణ ఇరువురికీ ఈసారి స్థానమార్పిడి తప్పదనే ప్రచారం జరుగుతోంది. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ జైపాల్రెడ్డి ఈ ఎన్నికల్లో సొంత జిల్లా (మహబూబ్నగర్) నుంచి పోటీ చేస్తానని సంకేతాలివ్వడంతో అధిష్టానం.. కొత్త అభ్యర్థిపై కసరత్తు చేస్తోంది. ఇదే క్రమంలో 2009 ఎన్నికల్లో మల్కాజ్గిరి జనరల్ సీటు నుంచి బరిలోకి దిగి ఘన విజయం సాధించిన సర్వేను కూడా ఈ సారి నాగర్కర్నూలు నుంచి పోటీ చేయమని అధిష్టానం ఒత్తిడి చేస్తోంది. ఈ పరిణామాలను పరిశీలిస్తే సిట్టింగ్ ఎంపీలు.. అందులోనూ కేంద్ర మంతుల్రిరువురూ కాకతాళీయంగా మహబూబ్నగర్ జిల్లాకు షిఫ్ట్ కావడం అనివార్యంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీ టికెట్ అనూహ్యంగా దక్కించుకున్న జైపాల్రెడ్డి 18,362 సమీప ప్రత్యర్థి ఏపీ జితేందర్రెడ్డిపై విజయం సాధించారు. ఆ తర్వాత యూపీఏ-2 సర్కారులో కొలువుదీరారు. అయితే, గత ఎన్నికల వేళ కేవలం ఒకసారి మాత్రమే ఇక్కడి నుంచి బరిలో దిగుతానని, వచ్చే ఎన్నికలో పోటీచేయనని అప్పట్లో జైపాల్ సెలవిచ్చారు. ఈ క్రమంలోనే ఈ సీటుపై పలువురు ఆశావహులు గంపెడాశలు పెట్టుకున్నారు. జైపాల్రెడ్డి సైతం చెప్పినట్లుగానే ఈసారి పాలమూరుకు మారేందుకు సన్నాహాలు చేసుకుంటుండడంతో టికెట్ రేసులో ఉన్న నేతలు తాజాగా దూకుడును మరింత పెంచారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్రెడ్డి, రాగం సుజాతయాదవ్, మర్రి శశిధర్రెడ్డి పేర్లు ప్రముఖంగా ఇక్కడి నుంచి వినిపిస్తున్నాయి. మరోవైపు మల్కాజ్గిరి నియోజకవర్గంలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సర్వేను నాగర్కర్నూలుకు మార్చాలని ఏఐసీసీ భావిస్తోంది. స్థానిక ఎమ్మెల్యేలతో పొసగకపోవడం, ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నట్లు అంతరంగిక సర్వేల్లో తేలడంతో సర్వే స్థానే కొత్తవారిని రంగంలోకి దించాలని యోచిస్తోంది. ఈ క్రమంలో ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన నాగర్కర్నూలుకు షిఫ్ట్ చేయాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని చేవెళ్ల, మల్కాజ్గిరి ఎంపీలిద్దరు వేరే నియోజకవర్గాలకు మారడం తథ్యంగా కనిపిస్తోంది. ఇదిలావుండగా, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్న భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అభ్యర్థిత్వంపైనా అనుమానాలు తలెత్తుతుండడం గమనార్హం. ఈ స్థానాన్ని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఆశిస్తున్నట్లు ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి స్పష్టం చేయడం, తాను కాకపోతే కోడలు వైశాలి పేరును పరిశీలించాలని సిఫార్సు చేయడం చూస్తే కోమటిరెడ్డికి చెక్ పెడుతున్నట్లు అర్థమవుతోంది. ఇదే జరిగితే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు స్థానంలో కొత్త అభ్యర్థులు తెరమీదకు వచ్చే అవకాశముంది.