avinash reddy
-
ఒంటిమిట్ట రథోత్సవానికి జగన్... అవినాష్ రెడ్డి కారిటీ
-
భక్తుల మనోభావాలతో రాజకీయాలొద్దు: ఎంపీ అవినాష్ రెడ్డి
-
కూటమి కుట్రలు భయంతో బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యేలు డుమ్మా
-
మోసకారి బాబు.. మళ్లీ ఫెయిల్
-
ఇదే మీ చేతగానితనానికి నిదర్శనం: అవినాష్రెడ్డి
వైఎస్ఆర్ జిల్లా: సాగునీటి సంఘాల ఎన్నికలను పోలీసుల్ని అడ్డుపెట్టుకుని నిర్వహించడం కూటమి ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శమని కడప ఎంపీ అవినాష్రెడ్డి విమర్శించారు. సాగునీటి సంఘాల ఎన్నికల సందర్భంగా బీటెక్ రవి చేసిన వ్యాఖ్యలపై అవినాష్రెడ్డి మండిపడ్డారు.‘బీటెక్ రవి మాటలు సినిమాను తలపిస్తున్నాయి. సినిమా డైరెక్టర్ నిర్మాత, ప్రేక్షకుడు అన్నీ ఆయనే, ఇది చేతగాని దద్దమ్మ ప్రభుత్వం. అప్రజాస్వామికంగా సాగునీటి ఎన్నికలు జరిగాయి. పోలీసులను అడ్డుపెట్టుకొని ఎన్నికలు చేయడం చేతకానితనం. ఎన్నికల్లో రైతులు పోటీ చేయాలంటే, నో డ్యూస్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఎన్నికలు కోరుకునే వారైతే.. ప్రతి రైతుకు నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉండేది. వీఆర్ఓలను అందుబాటులో పెట్టకుండా అందరిని ఎమ్మార్వో కార్యాలయంలో దాచారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగి ఉంటే బీటెక్ రవి చొక్కా విప్పేవారు రైతులు. ఖైదీలను బంధించినట్లు వీఆర్ఓలను ఎమ్మార్వో కార్యాలయంలో ఎందుకు బంధించారు. రైతులు మీకు ఎందుకు ఓటేస్తారు?, ఈ క్రాఫ్ విధానం రద్దు చేస్తామన్నారు మరి ఎందుకు రద్దు చేయలేదు?, రైతులకు నో డ్యూస్ ఇవ్వకుండా అడ్డుకున్న దద్దమ్మవి నీవు. జమ్మలమడుగులో వీఆర్ఓలను దేవగుడిలో బంధించినది వాస్తవం కాదా?.’అని విమర్శల వర్షం కురిపించారు. -
YS Avinash: టీడీపీ పిరికిపంద రాజకీయం..
-
అదంతా.. ఐ–టీడీపీ పైశాచికమే
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా కార్యకర్తలపై సీఎం చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులతో విరుచుకుపడుతోంది. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ అక్రమ అరెస్టులు, థర్డ్ డిగ్రీ చిత్రహింసలతో దమనకాండకు తెగబడుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను ఉక్కుపాదంతో అణచివేస్తోంది. వారం రోజుల్లోనే ఏకంగా 147 కేసులు... 49 మంది అరెస్టులు...680 మందికి నోటీసులతో రాష్ట్రంలో అరాచకాలకు తెర తీసింది. తన దమననీతిని సమరి్థంచుకునేందుకు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ ప్రభుత్వ పెద్దలు శ్రీరంగ నీతులు చెబుతుండటం పచ్చ కుట్రలకు పరాకాష్ట. కానీ వాస్తవం ఏమిటంటే... ఐ–టీడీపీ.. ఆది గురువు! పైశాచికత్వానికి నాంది పలికింది... విశృంఖలత్వాన్ని పెంచి పోషించింది... మారి్ఫంగ్ ఫొటోలతో మహిళలు, పిల్లలపై జుగుప్సాకర పోస్టులు పెట్టే విష సంస్కృతిని వ్యవస్థీకృతం చేసింది టీడీపీనే అన్నది అక్షర సత్యం. అందుకోసం చంద్రబాబు బృందం వేలాది మందితో తయారు చేసిన సోషల్ మీడియా పిశాచ గణ విభాగమే ‘ఐ–టీడీపీ’. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు నెలకొల్పిన ఆ విష వృక్షం దశాబ్దకాలంలో వేళ్లూనుకుని పచ్చ రాక్షస మూకతో విశృంఖలత్వాన్ని సృష్టిస్తూ విరుచుకుపడుతోంది. అసభ్య పదజాలం... పచ్చి బూతులు... జుగుప్సాకర పోస్టులు... మహిళలను కించపరుస్తూ మార్ఫింగ్ ఫొటోలను వైరల్ చేస్తూ ఐ–టీడీపీ వెగటు రాజకీయాలకు బరి తెగిస్తోంది.ఫేక్ ఐడీలతో దేశ, విదేశాల నుంచి సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టుల వరద పారిస్తూ పైశాచికానందాన్ని పొందుతోంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల పేర్లతో ఫేక్ ఖాతాలను సృష్టించి ఏకంగా మహానేత వైఎస్సార్ కుటుంబ సభ్యులనే కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం టీడీపీ రాజకీయ కుట్రలకు పరాకాష్ట. ఈ కుట్రలను ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పోలీసులు ఛేదించినా సరే... ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో కొందరు ఖాకీలు పచ్చ ముఠా కుట్రకు కొమ్ముకాస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. దశాబ్దకాలంగా సోషల్ మీడియా వేదికగా జుగుప్సాకర విష సంస్కృతిని పెంచి పోషిస్తున్న ఐ–టీడీపీ తాజాగా కూటమి అధికారంలోకి వచి్చనప్పటి నుంచి మరింతగా పేట్రేగిపోతోంది. సోషల్ మీడియా పిశాచ గణం... టీడీపీ సోషల్ మీడియా విభాగం ‘ఐ–టీడీపీ’ వికృత రాజకీయానికి, జుగుప్సాకర సంస్కృతికి తెరతీసింది. 2014 ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీపై దు్రష్పచారం కోసం ఓ వేదికగా టీడీపీ ప్రారంభించిన ఈ ఐ–టీడీపీ పదేళ్లుగా విశృంఖలత్వాన్ని పెంచి పోషించి వ్యవస్థీకృతం చేసింది. హైదరాబాద్లోని టీడీపీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కేంద్రగా ఈ పిశాచాల ముఠా సోషల్ మీడియా ద్వారాదుష్ప్రచారనికి, వ్యక్తిత్వ హననానికి తెగబడుతోంది. ఫేక్ ఐడీలతో సోషల్ మీడియా ఖాతాలు ఏర్పాటు చేసుకుని పుంఖాను పుంఖాలుగా అసభ్య పదజాలం, బూతులు, దూషణలతో కూడిన పోస్టులను వైరల్ చేయడమే పనిగా పెట్టుకుంది. ప్రధానంగా వైఎస్సార్సీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులనే లక్ష్యంగా చేసుకుని పని చేస్తోంది. 2019 ఎన్నికల తరువాత ఐ–టీడీపీ సోషల్ మీడియా అరాచకాలు మరింత పేట్రేగిపోయాయి. ఏకంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేంతగా బరితెగించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మహిళా మంత్రులతోపాటు మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పారీ్టలో క్రియాశీలంగా వ్యవహరించే మహిళలు, వారి కుటుంబ సభ్యులను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. నాడు మంత్రులుగా ఉన్న అంబటి రాంబాబు, పేర్ని నాని, కొడాలి నాని తదితరులను కించపరుస్తూ... వారి కుటుంబ సభ్యులను అవమానిస్తూ పోస్టులు పెట్టారు. ఫొటోలను మారి్ఫంగ్ చేస్తూ యూట్యూబ్ చానళ్లలో వీడియోలు వైరల్ చేశారు. నాడు ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వైఎస్ జగన్ ఫొటోలను మారి్ఫంగ్ చేస్తూ పోస్టులు పెట్టడం పచ్చ పిశాచాల బరి తెగింపునకు నిదర్శనం. ఇక 2024 ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచి ఐ–టీడీపీ విశృంఖలత్వం వెర్రి తలలు వేసింది.ఈసారి ఏకంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరుల పేరుతో ఫేక్ ఐడీలు సృష్టించి సోషల్ మీడియా ఖాతాలు తెరిచింది. ఆ ఐడీల నుంచే జుగుప్సాకరమైన పోస్టులతో బరితెగించింది. దాంతో చూసేవారికి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులే ఆ అసభ్యకర పోస్టులు పెడుతున్నారని నమ్మించడమే లక్ష్యంగా ఈ కుట్రను కొనసాగించింది. తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ నేతల ఫొటోలను మారి్ఫంగ్ చేస్తూ... వారి కుటుంబ సభ్యులను కించపరుస్తూ ఐ–టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తోంది. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా పోలీసులు కనీస చర్యలు కూడా చేపట్టకపోవడం గమనార్హం. ఫిర్యాదు చేసిన బాధితుడినే.. తాజాగా నిందితుడిగా చూపిస్తూ..! తాజాగా చంద్రబాబు ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరిస్తూ అక్రమ కేసులతో వేధింపులకు పాల్పడుతోంది. వర్రా రవీంద్రారెడ్డి పేరుతో అసభ్యకర పోస్టులు పెట్టడంపై వైఎస్సార్ కడప జిల్లా పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే అవే పోస్టుల పేరుతో వైఎస్సార్ కడప జిల్లా పోలీసులే ప్రస్తుతం వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేయడం విస్మయం కలిగిస్తోంది. మరి అలాంటప్పుడు ఈ ఏడాది ఫిబ్రవరిలో దర్యాప్తు చేసి నిగ్గు తేల్చిన కేసు సంగతి ఏమైనట్లు..? టీడీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై అక్రమ కేసులు నమోదు చేస్తోందని ఈ ఉదంతం ద్వారా మరోసారి రుజువవుతోంది. ఎంపీ అవినాశ్రెడ్డిని ఇరికించే కుట్ర...! టీడీపీ పెద్దల ఆదేశాలతో పోలీసులు వర్రా రవీంద్రారెడ్డిని చిత్రహింసలకు గురి చేసి వేధించారు. ఆయన చెప్పని విషయాలను కూడా చెప్పినట్టుగా వాంగ్మూలాన్ని నమోదు చేశారు. దాదాపు 40 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లు, యూట్యూబ్ చానళ్ల ద్వారా తాము అసభక్యకర పోస్టులను వైరల్ చేసినట్టు వర్రా రవీంద్రారెడ్డి తన దర్యాప్తులో అంగీకరించారని పోలీసులు ఏకపక్షంగా వాంగ్మూలం నమోదు చేయడం గమనార్హం. ఈ అక్రమ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డిని ఇరికించేందుకు కూడా పోలీసులు పన్నాగం పన్నడం గమనార్హం. ఎంపీ అవినాశ్రెడ్డి ఆదేశాల మేరకు ఆయన పీఏ రాఘవరెడ్డి రాసిన పోస్టులను తాము సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు వర్రా రవీంద్రారెడ్డి వెల్లడించారని డీఐజీ కోయ ప్రవీణ్ మీడియాతో పేర్కొనడం ప్రభుత్వ కుట్రకు పరాకాష్ట. వైఎస్ భారతి పీఏ కాదు... ఇక వర్రా రవీంద్రారెడ్డి వైఎస్ భారతి పీఏ అంటూ టీడీపీ అవాస్తవాలను ప్రచారం చేస్తోంది. ఆయన ఏనాడూ ఆమె వద్ద పీఏగా పని చేయలేదు. అయితే టీడీపీ దురుద్దేశపూరితంగానే ఈ అవాస్తవ ప్రచారాన్ని వ్యాప్తిలోకి తెచ్చింది. ఎందుకంటే వర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఐ–టీడీపీ అప్పటికే ఫేక్ సోషల్ మీడియా ఖాతాను సృష్టించింది. ఆ ఖాతా నుంచి అసభ్యకర పోస్టులను వైరల్ చేస్తోంది. షరి్మల, నర్రెడ్డి సునీతను కూడా కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం టీడీపీ కుట్రకు పరాకాష్ట. దీన్ని వైఎస్సార్ కుటుంబ సభ్యులపైనే నెట్టివేసేందుకే టీడీపీ ఈ అవాస్తవ ప్రచారాన్ని వ్యాప్తిలోకి తెచ్చింది. వాస్తవం ఏమిటంటే వర్రా రవీంద్రారెడ్డి ఏనాడూ వైఎస్ భారతి వద్ద పీఏగా పని చేయలేదు. ఆయన కూడా తాను పీఏనని ఏనాడూ చెప్పుకోలేదు కూడా!ఐ–టీడీపీ అరాచక పోస్టుల్లో కొన్ని...⇒ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగానే ఆయన కుటుంబ సభ్యులను కించపరుస్తూ వారి ఫొటోలను ఐ–టీడీపీ ముఠాలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాయి. ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆత్మలతో మాట్లాడతారని చంద్రబాబు, లోకేశ్ దారుణంగా దు్రష్పచారం చేయడం... దాన్ని ఐ–టీడీపీ మారి్ఫంగ్ ఫొటోలతో సోషల్ మీడియాలో వైరల్ చేసి కించపరిచింది. ⇒ ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి ఫొటోలను మారి్ఫంగ్ చేసి అసభ్యకరమైన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా ఆయన కుటుంబ సభ్యులను తీవ్ర ఆవేదనకు గురి చేశారు. ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మహిళా మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, విడదల రజని, ఉషాశ్రీ చరణ్, పాముల పుష్పశ్రీవాణితోపాటు పార్టీ మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.⇒ అంబటి రాంబాబు, ఆయన సతీమణి, కుమార్తెలతో ఉన్న ఫొటోను అసభ్యకరమైన పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ⇒ వైఎస్సార్సీపీ హయాంలో మంత్రిగా ఉన్న కొడాలి నాని, ఆయన కుటుంబ సభ్యులను కించపరుస్తూ మారి్ఫంగ్ ఫొటోలతో వేధించారు. ⇒ హీరో అల్లు అర్జున్, ఆయన సతీమణిని కించపరుస్తూ.. వారి ఫొటోలను మారి్ఫంగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులను వైరల్ చేశారు. ఫేక్ ఐడీలతో వైఎస్సార్ కుటుంబంపై పోస్టులుపోలీస్ విచారణలో ఐ–టీడీపీ దారుణాలు బహిర్గతం ఈ వికృత క్రీడకు టీడీపీ ఎంతగా బరితెగించిందంటే... వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల పేరుతో సృష్టించిన ఫేక్ ఐడీలతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యులను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే కుట్రలకు దిగజారింది. షర్మిల, సునీత తదితరులను కించపరుస్తూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల వెనుక ఐ–టీడీపీ కుట్ర దాగి ఉందని పోలీసుల దర్యాప్తులో ఆధారాలతో సహా వెల్లడి కావడమే దీనికి నిదర్శనం. వైఎస్సార్సీపీ కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఐ–టీడీపీ ఫేక్ సోషల్ మీడియా ఖాతాలను సృష్టించింది.ఆ ఖాతాల నుంచి వైఎస్సార్ కుటుంబ సభ్యులను, ప్రధానంగా మహిళలను కించపరుస్తూ పోస్టుల వరద పారించింది. దీనిపై అప్పట్లోనే వైఎస్సార్సీపీ తక్షణమే స్పందించి పోలీసులను ఆశ్రయించడం గమనార్హం. తన పేరుతో ఫేక్ ఐడీ సృష్టించి సోషల్ మీడియాలో జుగుప్సాకర పోస్టులు పెడుతున్నారంటూ వర్రా రవీంద్రారెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానిపై పోలీసులు దర్యాప్తు చేయడంతో ఐ–టీడీపీ దారుణాలు బట్టబయలయ్యాయి. ఈక్రమంలో విశాఖపటా్ననికి చెందిన ఐ–టీడీపీ కార్యకర్త ఉదయ్ భూషణ్ను అరెస్ట్ చేశారు. వర్రా రవీంద్రరెడ్డి పేరుతో సృష్టించిన ఫేక్ ఐడీ నుంచే షరి్మల, నర్రెడ్డి సునీతలను కించపరుస్తూ అతడు పోస్టులు పెట్టినట్లు ఆధారాలతోసహా వెల్లడైంది. న్యాయమూర్తి దృష్టికి పోలీస్ అరాచకాలు వర్రా రవీంద్రారెడ్డి న్యాయమూర్తి ఎదుట వాస్తవాలను వెల్లడించడంతో పోలీసుల కుట్ర బెడిసికొట్టింది. పోలీసులు తనను తీవ్రంగా హింసించారని... తాము చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వాలని తీవ్రంగా కొట్టారని... తాను చెప్పని విషయాలను కూడా చెప్పినట్టుగా వాంగ్మూలంగా నమోదు చేశారని వర్రా రవీంద్రారెడ్డి న్యాయమూర్తి వద్ద మొర పెట్టుకోవడంతో పోలీసుల కుట్ర బట్టబయలైంది. -
మా పీఏను భయపెట్టారు.. వర్రా రవిని వేధించారు: అవినాష్రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అక్రమ అరెస్టులు, కూటమి ప్రభుత్వ తీరుపై వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ కార్యకర్తలను, నాయకులను పగలు రాత్రి తేడా లేకుండా పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.మా పీఏ రాఘవరెడ్డి నిత్యం పోలీసులతో మాట్లాడే వ్యక్తి. కానీ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆయన ఇంటికి రాత్రులు వెళ్లి ఇంట్లో వారిని భయభ్రాంతులకు గురి చేశారు. లాఠీలతో డోర్లు కొట్టి ఇంట్లో వస్తువులను చిందరవందర చేసి భయపెట్టారు. భయాందోళన గురి చేయకుండా స్టేషన్కు రావాలని పిలిచినా రాఘవ వెళ్లేవారు. అలాంటిది ఇంటికి వెళ్లి భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం పోలీసులకు ఏముంది?’’ అంటూ అవినాష్రెడ్డి ప్రశ్నించారు.వర్రా రవీంద్రారెడ్డిని నిన్న మహబూబ్నగర్ జిల్లాలో అరెస్టు చేసినట్లు ఎల్లో మీడియానే రాసింది. కానీ పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతున్నారు. వర్రా రవిని పోలీసులు అరెస్టు చేయలేదని.. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా అంతా తప్పుడు ప్రచారం చేస్తోందంటూ మాట్లాడుతున్నారు. వర్రా రవి అరెస్టుకు పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని... వర్రా రవికి ఏదైనా జరిగితే వైఎస్సార్సీపీదే బాధ్యత అంటూ బీటెక్ రవి మాట్లాడారు. వాస్తవాలు తెలియకుండా బీటెక్ రవి ఇలా అబద్ధాలు మాట్లాడటం సరికాదు. నిన్న రాత్రి అంతా కడప డీటీసీలో వర్రా రవిని వేధించారు. పోలీసుల చర్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. తక్షణమే వర్రా రవిని కోర్టులో హాజరు పరచాలి’’ అని అవినాష్రెడ్డి డిమాండ్ చేశారు. -
నేషనల్ హైవే కమిటీ సభ్యులుగా ఎంపీలు బోస్, అవినాష్రెడ్డి
సాక్షి, కోనసీమ జిల్లా: నేషనల్ హైవే కన్సల్టింగ్ కమిటీ సభ్యులుగా రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, లోక్సభ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నియమితులయ్యారు.ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర రోడ్డు రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చైర్మన్గా వ్యవహరించే ఈ కమిటీలో లోక్సభ నుంచి 20 మంది, రాజ్యసభ నుంచి ఏడుగురు సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమించింది. -
జవాన్ కుటుంబాన్ని ఆదుకోండి.. చంద్రబాబుకు అవినాష్ రెడ్డి లేఖ
-
భద్రతపై హోమ్ మంత్రి అనిత వెటకారం.. ఎంపీ అవినాష్ స్ట్రాంగ్ కౌంటర్
-
బద్వేల్ బాధిత కుటుంబానికి వైఎస్సార్సీపీ నేతల పరామర్శ
సాక్షి, వైఎస్సార్: ఏపీలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా? అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. మహిళల రక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అఘాయిత్యాల కారణంగా ఆడపిల్లలున్న ప్రతీ తల్లిదండ్రులు బాధపడుతున్నారని అన్నారు.బద్వేల్లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి సోమవారం ఉదయం పరామర్శించారు. ఈ క్రమంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటామని నేతలు భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా ఎంపీ అనినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఘటన మాటల్లో చెప్పలేని అమానుషం. ఈ దారుణంపై ఆడ పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు బాధపడుతున్నారు. 2021లో ఇలాంటి ఘటన గుంటూరులో జరిగినప్పుడు కొద్ది రోజుల్లోనే కన్విక్ట్ చేశారు. ఈ నాలుగు మాసాల్లో ఇలాంటి 74 ఘటనలు జరిగితే ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది?.ఏపీలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా?. రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నీ చోట్ల సెక్యూరిటీ ఇవ్వలేం కదా అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారు. ఈ విద్యార్థిని 10వ తరగతిలో స్కూల్ ఫస్ట్.. అలాంటి అమ్మాయి చనిపోవడం బాధాకరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి మేల్కోవాలి. దిశా చట్టం, యాప్ అమలు చేసి ఉంటే పది నిమిషాల్లో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లేవారు. ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. మహిళల రక్షణ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించింది. సమాజం భయపడేలా కఠిన శిక్ష ఉండాలని ఆ తల్లి కోరుతోంది’ అని చెప్పారు. బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ మాట్లాడుతూ..‘మన రాష్ట్రంలో మహిళలపై ఇంత దారుణాలు జరుగుతుంటే మహిళా హోం మంత్రి ఏం చేస్తున్నారు?. దీంట్లో రాజకీయాలకు తావు లేదు.. గట్టి చర్యలు తీసుకోవాలి. నా బిడ్డ చనిపోయినట్లు మరొకరు చనిపోరని నమ్మకం ఏంటి అని ఆ తల్లి ప్రశ్నిస్తోంది. ఆమెకు ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం’ అని కామెంట్స్ చేశారు. -
దేవుడిని అడ్డు పెట్టుకుని.
-
పులివెందులలో లా అండ్ ఆర్డర్ తప్పింది: వైఎస్ అవినాష్ రెడ్డి
-
బాబుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఫైర్
-
వైఎస్ జగన్ ఆశీస్సులు.. ప్రజల కోసం పోరాటం
-
బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!
-
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
-
వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట
-
కడపలో దుమ్ములేపుతున్న అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
-
వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..!
-
యాదవుల కోసం ప్రత్యేక జీవో..!
-
సుజనా చౌదరి వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టారు
-
కడప YSRCP ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి నామినేషన్
-
నిజం దాచి పెట్టింది సునీతే.. అసత్య ప్రచారం చేస్తోంది సునీతే
-
షర్మిల, సునీత చంద్రబాబు అడుగుజాడల్లో.. ప్రజలు ఎలా నమ్ముతారు
-
డబ్బులు లేక చివరి రెండేళ్లు పెదనాన్న నరకం చూశాడు..!
-
వివేకా కేసులో సంచలన నిజాలు బయటపడ్డ సునీత అబద్దాలు
-
ఎర్ర గంగిరెడ్డి తో అవినాష్ రెడ్డి వాట్సాప్ చాట్?
-
Watch Live: మీడియాతో ఎంపీ అవినాష్రెడ్డి
-
ఆ లెటర్ ఎందుకు దాచారు ? పోలీసులకు ఎందుకు చెప్పలేదు ?
-
ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు: అవినాష్ రెడ్డి
-
మర్డర్ చేసిన దస్తగిరి అరెస్ట్ కాకపోవడానికి కారణం ఇదే..!
-
చీకటి ఒప్పందం వల్లే నాపై కుట్రలు సునీత బండారం బయటపెట్టిన అవినాష్ రెడ్డి
-
Watch Live: మీడియాతో ఎంపీ అవినాష్రెడ్డి
-
రైతుల మంచికోసం సరికొత్త ఆలోచనతో ఎంపీ అవినాష్ రెడ్డి..
-
రూ.266 కోట్లతో కడప విమానాశ్రయం అభివృద్ధి
కడప కోటిరెడ్డిసర్కిల్/కడప కార్పొరేషన్: వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలోని విమానాశ్రయంలో రూ.266 కోట్లతో నిర్మించనున్న నూతన టెర్మినల్ భవనానికి ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ విమానాశ్రయం 25 లక్షల మంది ప్రయాణికుల వార్షిక సామర్థ్యం మేరకు ఆధునిక సొబగులద్దుకుంటోంది. ఇక్కడి రన్వేని 45 మీటర్ల వెడల్పున 2,515 మీటర్ల పొడవున విస్తరించనున్నారు. పనులు పూర్తయిన తరువాత ఈ విమానాశ్రయం పీక్ అవర్ సరి్వంగ్ కెపాసిటీ 1,800 మంది ప్రయాణికులుగా ఉంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషితో విమానాశ్రయం విస్తరణకు రూ.75 కోట్లతో స్థలం సేకరించారు. దీంతో రన్వే పొడిగిస్తున్న నేపథ్యంలో విమానాల నైట్ ల్యాండింగ్కు కూడా అవకాశం లభిస్తుంది. ఇప్పటికే ఇక్కడి నుంచి నిరంతరాయ సర్విసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కూడా భరించింది. 2015లో ప్రారంభమైన ఈ విమానాశ్రయం నుంచి 2017లో ట్రూ జెట్ సంస్థ ఉడాన్ స్కీమ్ కింద ఆర్సీఎస్ (రీజినల్ కనెక్టివిటీ స్కీమ్) అమలు చేసింది. 2021లో ఆ సంస్థ తన విమానాలను ఉపసంహరించుకుంది. 2022 మార్చి నుంచి ఇండిగోసంస్థ విమానాలను ప్రారంభించింది. ప్రధాని వర్చువల్గా శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజద్బాషా, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ విమానాశ్రయంలో అభివృద్ధి పనులతోపాటు టెర్మినల్ నిర్మాణంతో రూపురేఖలు మారిపోయి మహర్దశ పట్టనుందని చెప్పారు. ఈ విమానాశ్రయం ఏర్పాటుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కృషిచేయగా, ఎయిర్పోర్టు అభివృద్ధికి ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. ఎయిర్పోర్టు సుందరీకరణలోను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందన్నారు. ఎయిర్పోర్టుకు అతి సమీపంలో అటవీప్రాంతం ఉండడంతో అటవీశాఖ అనుమతులు తీసుకుని భూసేకరణ చేసినట్లు తెలిపారు. ఎయిర్పోర్టు అభివృద్ధి పనులు చేపట్టిన ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్ర విమానయానశాఖ మంత్రి జ్యోతిరావు సిందియాకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయరామరాజు, ఎయిర్పోర్టు డైరెక్టర్ సుజిత్కుమార్ పోదార్, ›ప్రొటోకాల్ ఆఫీసర్ సురేష్బాబు, టెర్మినల్ మేనేజర్ జోసెఫ్ పాల్గొన్నారు. ముసుగు తొలగించారంతే: ఎంపీ అవినాశ్రెడ్డి అనంతరం ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎప్పటినుంచో పొత్తులో ఉన్న టీడీపీ, పవన్కళ్యాణ్, బీజేపీ ఇప్పుడు ముసుగు తొలగించారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు పొత్తులు కొత్తేమీ కాదని, ఎన్నికలు వచ్చాయంటే ఆయనకు పొత్తులు గుర్తొస్తాయని చెప్పారు. 2019లో టీడీపీ ఓటమి పాలుకాగానే చంద్రబాబు తన అనుచరులైన సుజనాచౌదరి, సీఎం రమేశ్లను బీజేపీలోకి పంపారని గుర్తుచేశారు. అప్పటి నుంచి ప్రత్యక్షంగా పొత్తులో ఉన్న టీడీపీ, వవన్కళ్యాణ్, బీజేపీ.. పరోక్షంగా కాంగ్రెస్, ఇతర పార్టీలతో కూడా కలిసే ఉన్నట్లు చెప్పారు. ఎంతమంది కలిసొచి్చనా, ఎల్లో మీడియా వారికి ఎంత మద్దతు ఇచ్చినా గెలిచేది వైఎస్సార్సీపీయేనని ఆయన తెలిపారు. కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ బీజేపీతో పొత్తుకోసం టీడీపీ వెంపర్లాడిందని ఎద్దేవా చేశారు. సింహం సింగిల్గానే వస్తుందని, జగన్ సింగిల్గా పోటీచేసి మళ్లీ సీఎం కావడం తథ్యమని చెప్పారు. -
కడప ఎయిర్పోర్టు కొత్త టెర్మినల్కు ప్రధాని మోదీ శంకుస్థాపన
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప ఎయిర్పోర్టు కొత్త టెర్మినల్కు ప్రధాని మోదీ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. రూ.265 కోట్ల రూపాయల వ్యయంతో నూతన టర్మీనల్ భవన నిర్మాణం చేపట్టారు. ఢిల్లీ నుండి వర్చువల్ విధానంలో ప్రధాని పాల్గొన్నారు. కడప నుంచి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అవినాష్రెడ్డి మాట్లాడుతూ, కడప ప్రజల కల నెరవేరుతున్న వేళ సంతోషంగా ఉందన్నారు. కడప విమానాశ్రయ అభివృద్ధి కోసం దివంగత మహానేత వైఎస్సార్ చేసిన కృషి అందరికి తెలిసిందే.. రూ. 75 కోట్ల రూపాయలతో స్థల సేకరణ పూర్తి చేశామని తెలిపారు. ఉడాన్ పథకం ద్వారా హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్, చెన్నైకు తక్కువ ధరకు విమాన సర్వీసులు నడపడం జరిగిందన్నారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో నైట్ ల్యాండింగ్, రన్ వే పొడిగింపు, పెద్ద విమానాలు ల్యాండ్ అయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరావు సిందియా, ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇదీ చదవండి: స్నేహం కాదు, దాసోహం! -
జగనన్న హామీలన్నీ నెరవేర్చారు.. : ఎంపీ అవినాష్రెడ్డి
వైఎస్సార్ కడప: రాష్ట్ర ప్రజలకు 2019 ఎన్నికలప్పుడు ఇచ్చిన ప్రతి హామీని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చారని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సింహాద్రిపురంలో మండలానికి సంబంధించిన వైఎస్సార్ ఆసరా సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలానికి సంబంధించి 524 డ్వాక్రా సంఘాలకు చెందిన 5078మంది డ్వాక్రా మహిళలకు రూ.5,24,92,136ల మెగా చెక్కును ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, పాడా ఓఎస్డీ అనిల్కుమార్రెడ్డిలు అందజేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకు సంబంధించిన ప్రార్థన చాలా మోటివేటివ్గా ఉంటుందన్నారు. ఈ మధ్యకాలంలో అనేక సమావేశాల్లో డ్వాక్రా మహిళలు ఆ ప్రార్థనతోనే మొదలుపెడతారన్నారు. జీవితంలో వెలుగులు నింపాలని.. చీకటిని పారదోలాలని.. స్వర్గం అనేది ఎక్కడ ఉన్నా నేలపైకి తీసుకొద్దాం.. అంటూ ఎంతో ప్రేరణగా ప్రార్థన ఉంటుందన్నారు. ఒక్కసారి ఆలోచిస్తే 2019లో జగనన్న ఎన్నికలకు వచ్చినప్పుడు 2019 ఏప్రిల్ నాటికి డ్వాక్రా రుణం రూ.26వేల కోట్లు ఉండేదన్నారు. ఆ రుణ మొత్తాన్ని నాలుగు విడతల్లో తీరుస్తానని.. ఆ డబ్బులు మీకు తిరిగి ఇస్తానని జగనన్న ఆనాడు హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన విధంగా ఇప్పటికే మూడు విడతలుగా ఒక్కో విడత రూ.6,500కోట్లు చెల్లించారన్నారు. ఇప్పుడు నాలుగో విడతగా రూ.6,500కోట్లు చెల్లిస్తున్నారన్నారు. నిజంగా ఇది చాలా గర్వకారణమైన విషయమని అన్నారు. ఒక్క వైఎస్సార్ ఆసరానే కాదు.. వైఎస్సార్ చేయూత కావచ్చు, ఈబీసీ నేస్తం కావచ్చు, అమ్మఒడి కావచ్చు, రూ.3వేల పింఛన్ కావచ్చు చెప్పుకుంటూ పోతే ఎన్నికలప్పుడు ఇచ్చిన ప్రతి హామీని జగనన్న నెరవేర్చారని తెలిపారు. ప్రతి ఒక్క లబ్ధిదారునికి మేలు కలిగేలా చేయడమే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్దేశమన్నారు. కరోనా విపత్తు సమయంలో కూడా సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. చంద్రబాబు 2014 ఎన్నికలప్పుడు ఒకవైపు పవన్ కళ్యాణ్ సంతకం, మరోవైపు చంద్రబాబు సంతకాలతో ఇంటింటికి కరపత్రాలు పంచారన్నారు. అందులో రైతుల రుణాలు, బ్యాంకు రుణాలు మాఫీ చేస్తాం, బ్యాంకులో బంగారు ఇంటికి రావాలంటే బాబు రావాలి, నిరుద్యోగ భృతి రూ.3వేలు, ఇలా అనేక హామీలతో కరపత్రాలు పంపిణీ చేశారన్నారు. అందులో చంద్రబాబు ఏ ఒక్క హామీనైనా అమలుపరిచారా అని ప్రశ్నించారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు మేనిఫెస్టోలో ఉన్న ప్రధాన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. అలాంటి చంద్రబాబు మరలా ఇప్పుడు మరోసారి ష్యూరిటీ, గ్యారంటీ, వారంటీ అంటూ మరోసారి మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారన్నారు. దయచేసి ప్రజలందరూ చంద్రబాబు చెప్పే మాయ మాటలు నమ్మవద్దని హితవు పలికారు. అనంతరం ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి డ్వాక్రా మహిళలతో కలిసి సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు తమ జీవితాంతం జగనన్నకు రుణపడి ఉంటామన్నారు. అంతకముందు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ రామ్మోహన్రెడ్డి, జెడ్పీటీసీ ఝాన్సీరాణి, ఎంపీపీ అరుణ, మండల ఉపాధ్యక్షురాలు సుభాషిణి, సింగిల్ విండో ప్రెసిడెంట్ శేఖరరెడ్డి, ఎంపీటీసీ జాఫర్, సర్పంచ్ రామ్మోహన్, వైఎస్సార్సీపీ నాయకులు బ్రహ్మానందరెడ్డి, అరవిందనాథరెడ్డి, రాజగోపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీడీఓ సాల్మన్ రాజు, డీఆర్డీఏ పీడీ ఆనంద నాయక్, కో.ఆర్డినేటర్ నీలకంఠారెడ్డి, ఏపీఎంలు మంజునాథ్, గురురాజ్, ఆంజనేయులు, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు ప్రతి కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమాన్ని అందించారు.డీవీటీ ద్వారా రూ.203కోట్లు మండలానికి అందించగా.. ప్రత్యక్షంగా, పరోక్షంగా రూ.64కోట్లు సింహాద్రిపురం మండలానికి అందించారు. చంద్రబాబు ఏ ఒక్క హామీని అమలు చేయకుండా చేతులేత్తేశారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం వైఎస్ జగన్ నాలు విడత వైఎస్సార్ ఆసరా డబ్బులు విడుదల చేశారు. – శ్రీకాంత్రెడ్డి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు, సింహాద్రిపురం మహిళలు ఆర్థికంగా ఎదగాలి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళాసంక్షేమమే ధ్యేయంగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. ప్రతి పల్లెలో ఏర్పాటు చేసి న పాల కేంద్రాల ద్వారా మహిళలు నెలకు రూ. 4వేలు పొందుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం యా నిమేటర్లకు రూ.8వేలకు జీతం పెంచారు. ప్రభు త్వ పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి. – హేమావతి, వైఎస్సార్ ఆసరా లబ్ధిదారురాలు, సింహాద్రిపురం మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు.. మహిళల ఆర్థికాభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కరోనా విపత్తు సమయంలో కూడా అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు. ప్రజలకు అండగా ఉంటూ ఆదుకున్నారు. – ఝాన్సీరాణి, జెడ్పీటీసీ, సింహాద్రిపురం దోచుకోవడం.. దాచుకోవడం టీడీపీ నైజం! టీడీపీ హయాంలో దోచుకోవడం.. దాచుకోవడం తప్ప.. ప్రజలకు ఎటువంటి ప్రయోజనాలు చేకూరలేదు.సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కరోనా విపత్తు సమయంలో కూడా సీఎం వైఎస్ జగన్ పలు సంక్షేమ పథకాలను అమలు చేశారు. – రామ్మోహన్రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్, సింహాద్రిపురం ఇవి చదవండి: ఒక్క ఓటుతో ఏడుగురం పనిచేస్తాం! : మంత్రి వేణు -
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
-
కమలాపురం.. జనసంద్రం
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఆదివారం నిర్వహించిన సామాజిక సాధికార యాత్రకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పోటెత్తారు. చెన్నూరులో నిర్వహించిన బహిరంగ సభకు జనం వెల్లువలా తరలివచ్చారు. వివిధ గ్రామాల నుంచి డప్పుల దరువులు, ఆటపాటలతో ప్రజానీకం ర్యాలీగా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. ఇలా వేలాది మంది తరలి రావడంతో సభాస్థలిలో అందరూ కూర్చునే పరిస్థితి లేకుండా పోయింది. వెరసి చెన్నూరులో ఎటు చూసినా, ఏ వీధిలో చూసినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వైఎస్సార్సీపీ జెండాలను రెపరెపలాడిస్తూ కనిపించారు. కమలాపురం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు తమ ప్రసంగాల్లో సీఎం జగన్ పేరును ఉచ్ఛరించగా.. సభికులు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. అంబేడ్కర్ ఆలోచన విధానాలు అమలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావ్ పూలే, కొమురం బీమ్ వంటి మహానీయుల ఆలోచనలను అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డేనని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. అణగారిన వర్గాలకు అండగా, భావి తరాల ఉన్నతికి దూరదృష్టితో పెద్దపీట వేస్తున్న వైఎస్ జగన్ను మరోమారు మన కోసం ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కామెడీ యాక్టర్ పవన్, నయవంచకుడు చంద్రబాబు కలిసికట్టుగా వస్తున్నారని, వారి మాయమాటలు నమ్మొద్దని సూచించారు. సామాజిక సాధికారత మా విధానం : డిప్యూటీ సీఎం అంజద్బాషా స్వతంత్ర భారతదేశంలో సామాజిక సాధికారత అనేది ఒక నినాదంగానే మిగిలిపోయిందని, అయితే వైఎస్సార్సీపీ సామాజిక సాధికారతను తన విధానంగా మార్చుకుందని ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్బీ అంజాద్బాషా చెప్పారు. 2014–19 వరకు సాగిన టీడీపీ ప్రభుత్వంలో ఒక్క మైనార్టీకి కూడా మంత్రివర్గంలో స్థానం లభించలేదని, వైఎస్సార్సీపీ.. నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా చేసిందని, మరో నలుగురికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించిందన్నారు. తనకు ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారని చెప్పారు. ఏపీలోనే సామాజిక విప్లవం: మంత్రి మేరుగు సామాజిక న్యాయం అనేది ఏపీలోనే, వైఎస్ జగన్ నాయకత్వంలోనే సాకారమైందని సాంఘిన సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. రాజ్యాంగ బద్ధంగా బడుగులకు రావాల్సిన హక్కులు సంక్రమిస్తున్నాయని తెలిపారు. చంద్రబాబు హయాంలో దళితులపై, బీసీలపై దాడులు చూశామని, దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అన్న నాడే చంద్రబాబు దళితద్రోహి అని తేలిపోయిందని, బీసీల తోకలు కత్తిరిస్తానన్న నాడే బీసీ వ్యతిరేకి అని వారు పసిగట్టారని చెప్పారు. సన్నిధి గొల్ల కొనసాగింపు: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తిరుమల సన్నిధి గొల్లను తిరిగి కొనసాగించి రాష్ట్రంలోని యాదవుల ఆత్మగౌరవాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలిపారని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. రాయలసీమలో తొలిసారి యాదవులకు ఎమ్మెల్సీ దక్కిందని, మేయర్ పదవులను యాదవులకు అప్పగించి గౌరవించిన చరిత్ర సీఎం జగన్దేనన్నారు. ఆచరణలో చూపిన సీఎం: ఎంపీ అవినాష్రెడ్డి సామాజిక సాధికారిత కాగితాలకే పరిమితమయ్యేదని.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే దానిని ఆచరణలో చూపారని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి చెప్పారు. కేబినెట్ కూర్పు నుంచి నామినేటెడ్ పదవులు.. చివరకు ఆలయాల పాలక మండళ్లలో సైతం చిత్తశుద్ధి ప్రదర్శించారని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం పాటించిన చరిత్ర జగనన్నదేనని మాజీ ఎంపీ బుట్టా రేణుకా అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు రమేష్యాదవ్, రామచంద్రారెడ్డి, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్ యానాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
తండ్రీకొడుకుల పాద మహిమకు వర్షం పరార్
ప్రస్తుతం నారా లోకేష్ పాదయాత్ర పేరుతో ఏపీలో తిరుగుతుండటంతోనే రాష్ట్రంలో వర్షాలు కురువడం లేదని ఎద్దేవా చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్రెడ్డి. ఒకవైపు లోకేష్ పాదయాత్ర, చంద్రబాబు ఇటీవ సాగునీటి ప్రాజెక్టుల సందర్శన కారణంగా వరుణుడు కరుణించడం లేదన్నారు. ఏపీలో వైఎస్సార్సీపీ పాలనలో మొదటి నాలుగేళ్లు బాగా వర్షాలు పడగా, ఇప్పుడు పడటం లేదని గ్రామాల్లో ప్రజలే అనుకుంటున్నారని, దానికి కారణం కూడా లోకేష్, చంద్రబాబులు ఏపీలో పర్యటించడమేనన్నారు. ఆ నాలుగేళ్లు చంద్రబాబు, నారా లోకేష్లు హైదరాబాద్కే పరిమితం కావడంతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడ్డాయన్నారు 1999-2004 మధ్య ఆంధ్రప్రదేశ్ కరువుకు కేరాఫ్ అడ్రస్లా ఉండేదని, ఆ తర్వాత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో పుష్కలంగా వర్షాలు కురిసి, రాష్ట్రం సుభిక్షంగా మారిందన్నారు. మళ్ళీ 2014-19 మధ్య అవే పరిస్థితులు నెలకొంటే వైఎస్ సీఎం అయ్యాక మొదటి నాలుగేళ్లు సకాలంలో వర్షాలు కురిశాయన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ ఏపీలో తమ పాదాలు మోపడంతో వారి పాదాల ప్రభావం వల్ల మళ్ళీ వర్షాలు పడడం లేదని, ప్రజలు అభిప్రాయపడుతున్నరనే సంగతిని అవినాష్రెడ్డి గుర్తు చేశారు. -
బాబుకు అవినాశ్ కౌంటర్
-
చంద్రబాబుకు ఎంపీ అవినాష్రెడ్డి కౌంటర్
సాక్షి, పులివెందుల: రాష్ట్రంలో ఆర్టీసీ బస్టాండ్ల అభివృద్ధికి సీఎం జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. పులివెందుల బస్టాండ్ నిర్మాణ పనులకు ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జునరెడ్డితో కలిసి ఎంపీ అవినాష్రెడ్డి గురువారం భూమిపూజ చేశారు. అనంతరం అవినాష్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులపై బాబు మాటలన్నీ పచ్చి అబద్ధాలే. ఏది మాట్లాడిన ప్రజలు నమ్మేస్తారు అన్న ధోరణితోనే చంద్రబాబు పులివెందులలో ప్రసంగించారు. సాగునీటి ప్రాజెక్టులను నిర్మించిన ఘనత వైఎస్కే దక్కుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు. చదవండి: ఢిల్లీలో టీడీపీ ఎంపీలకు మళ్లీ భంగపాటు -
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ కు ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ
-
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్కు ఎంపీ అవినాష్రెడ్డి లేఖ
సాక్షి, అమరావతి: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్కు ఎంపీ అవినాష్రెడ్డి లేఖ రాశారు. వివేకా హత్య కేసు విచారణకు సంబంధించి రాంసింగ్ పక్షపాతంగా వ్యవహరించారంటూ.. గతంలో సీబీఐ దాఖలు చేసిన చార్జ్షీట్లను విశ్లేషిస్తూ ఆయన లేఖ రాశారు. సీబీఐ విచారణను పున:సమీక్షించుకోవాలని అవినాష్రెడ్డి కోరారు. ‘‘విచారణ అధికారిగా బాధ్యతలు తీసుకోకముందే రాంసింగ్ నిబంధనలకు వ్యతిరేకంగా విచారణ జరిపారు. నాతో పాటు మా తండ్రి భాస్కర్రెడ్డి, శివశంకర్రెడ్డిని ఇరికించేందుకు సాక్ష్యులను రాంసింగ్ బెదిరించారు. నా పేరు చెప్పమని పీఏ కృష్ణారెడ్డిని థర్డ్ డిగ్రీతో రాంసింగ్ టార్చర్ చేశారు. రాంసింగ్ వేధింపులు భరించలేక పీఏ కృష్ణారెడ్డి, కడప ఎస్పీ పులివెందుల కోర్టులో ఫిర్యాదు చేశారు. పలువురు సాక్ష్యుల స్టేట్మెంట్లను రాసింగ్ పూర్తిగా మార్చేశారు.’’ అని అవినాష్రెడ్డి లేఖలో పేర్కొన్నారు. చదవండి: నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి చెబుతున్నది తప్పు: వివేకా పీఏ కృష్ణారెడ్డి ‘‘వరుసగా అబద్ధాలు చెప్పిన ఏ4 దస్తగిరి మాటల ఆధారంగా సీబీఐ విచారణ చేసింది. హత్య చేశానని ఒప్పుకున్న దస్తగిరిని అరెస్ట్ చేయకుండా సీబీఐ ఆలస్యం చేసింది. వివేకాను హత్య చేసిన దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్ను సీబీఐ కానీ, సునీత కానీ వ్యతిరేకించలేదు’’ అని అవినాష్ లేఖలో తెలిపారు. ‘‘సీఐ శంకరయ్య చెప్పని మాటలను రాంసింగ్ సాక్ష్యాలుగా చూపారు. సీఐ శంకరయ్య దీనిపై కడప జిల్లా ఎస్పీ, కడప కోర్టులో ఫిర్యాదు చేశారు. సీబీఐ ఎస్పీ రాంసింగ్ తనను చిత్రహింసలకు గురి చేశారని ఉదయ్ కుమార్రెడ్డి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో రాంసింగ్పై క్రిమినల్ కేసు నమోదైంది. వివేకా హత్య కేసులో తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని రాంసింగ్ వక్రీకరించారని డాక్టర్ అభిషేక్రెడ్డి మీడియా ముందు చెప్పారు. హత్య జరిగిన రోజు మా నాన్న భాస్కర్రెడ్డి ఇంటికి ఏ2 సునీల్ యాదవ్ వచ్చారని సీబీఐ చెప్పింది అబద్ధం’’ అని అవినాష్రెడ్డి స్పష్టం చేశారు. చదవండి: దారి తప్పిన 'సీబీఐ దర్యాప్తు' ‘‘గూగుల్ టేక్ అవుట్కు సంబంధించి తొలి చార్జిషీట్లో ఎలాంటి ప్రస్తావన లేదు. రాంసింగ్ వచ్చిన తర్వాతనే కావాలనే ఈ అబద్ధాన్ని సృష్టించారు. వివేకా హత్య కేసులో కీలకమైన రెండో వివాహం అంశాన్ని సీబీఐ కావాలనే పక్కనపెట్టింది. తన భర్త హత్యకు ఆయన మొదటి భార్య కుటుంబ సభ్యులే కారణమని వివేకా రెండో భార్య షమీమ్ అనుమానం వ్యక్తం చేశారు. అయినా సీబీఐ ఈ విషయంలో ఎటువంటి విచారణ జరపలేదు. వివేకా హత్య కేసులో గత విచారణ అధికారి రాంసింగ్ చేసిన తప్పులను సవరించాలి’’ అని ఎంపీ అవినాష్రెడ్డి కోరారు. -
కిడ్నాప్ కేసు.. పెళ్లి చేసుకుంటానని చెప్పి.. మరొకరితో వివాహం
హైదరాబాద్: తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో డబ్బులిచ్చిన వ్యక్తిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన కేసులో నింధితులను c పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఘట్కేసర్ పీఎస్లో మల్కాజ్గిరి డీసీపీ జానకీ, ఏసీపీ నరేశ్రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. మేడిపల్లి, బుద్దానగర్కు చెందిన అవినాశ్రెడ్డికి అదే ప్రాంతంలో ఉంటున్న అరోషికారెడ్డితో 2015 నుంచి పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో పలుమార్లు ఆమె అతడి నుంచి డబ్బులు అప్పుగా తీసుకుంది. డబ్బులు తిరిగి ఇవ్వాలని అవినాశ్రెడ్డి కోరగా పెళ్లి చేసుకుంటానని చెప్పిన అరోషికారెడ్డి ఈ విషయమై అతడి కుటుంబ సభ్యులతో కూడా చర్చించింది. అయితే 2018లో ఆమె పొరుగున ఉన్న చక్రధర్గౌడ్ను పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందే అవినాశ్రెడ్డి వద్ద రూ. 25 లక్షలు చేతిరుణం తీసుకున్న ఆమె 2023లో రూ. 9 లక్షలు తిరిగి ఇచ్చేసింది. 20 రోజులుగా మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని అవినాశ్రెడ్డి ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలో తన భార్య తీసుకున్న డబ్బును ఇచ్చేస్తానని చక్రధర్గౌడ్ అవినాశ్రెడ్డికి ఫోన్ చేసి చెప్పాడు. ఆదివారం ఘట్కేసర్ బైపాస్ రోడ్డులో జాతీయ రహదారి సమీపంలోని వందన హోటల్ వద్దకు రావాలని సూచించాడు. మేడ్చల్ ఇందిరానగర్కు చెందిన ఎలిగేటి నర్సింగ్రావ్, సికింద్రాబాద్కు చెందిన బౌత్ వినోద్, అడిక్మెట్కు చెందిన మామిళ్ల గౌతమ్రాజ్ కూడా అక్కడికి వచ్చారు. చక్రధర్ గౌడ్, అవినాశ్ రెడ్డి కారులో కూర్చుని మాట్లాడుకుంటుండగా కారులోకి వచ్చిన మిగతా ముగ్గురు అవినాశ్రెడ్డిపై దాడి చేసి అతడి మొబైల్ లాక్కొని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. వారి నుంచి తప్పించుకున్న అవినాశ్రెడ్డి ఘట్కేస్ పీఎస్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కాగా ప్రధాన నిందితుడు చక్రధర్గౌడ్కు చెర్లపల్లి జైలులో నర్సింగరావుతో పరిచయం ఏర్పడింది. నర్సింగరావును బెయిల్పై బయటికి తీసుకువచ్చేందుకు చక్రధర్ సహకరించినట్లు పోలీసులు తెలిపారు. చక్రధర్గౌడ్పై సైబరాబాద్, హైదరాబాద్ కమిషనేరేట్లలో 9 కేసులు ఉండగా, నర్సింగ్రావు ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. గంటల వ్యవధిలో కేసును చేధించిన సీఐ మహేందర్రెడ్డి, ఎస్సైలు సుధాకర్, అశోక్, శ్రీకాంత్, ఇతర సిబ్బందిని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ అభినందించారు. నిందితుల అరెస్ట్ -
తండ్రి వారసత్వం పుణికి పుచ్చుకుని అధికార పార్టీపై అబద్దాలు చెబుతున్నారు: వైఎస్ అవినాష్ రెడ్డి
-
నారా లోకేష్కు ఎంపీ అవినాష్రెడ్డి కౌంటర్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: లోకేశ్ యువగళం పాదయాత్రపై ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాయలసీమలో పాదయాత్ర చేస్తే తప్ప లోకేశ్కు ఈ ప్రాంత వాసినని తెలియలేదని మండిపడ్డారు. ‘‘తండ్రి వారసత్వం పుణికి పుచ్చుకుని అధికార పార్టీపై అబద్ధాలు చెబుతున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ గుర్తే లేదు. అబద్ధాలకోరులను ప్రజలు ఎవరూ నమ్మరు’’ అని అవినాష్రెడ్డి అన్నారు. చదవండి: YS Viveka Case: మీ తీరు పంతాలకు పోయినట్టుంది.. సునీతతో సుప్రీంకోర్టు -
YS Viveka Case: మీ తీరు పంతాలకు పోయినట్టుంది.. సునీతతో సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీ అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ను రద్దు చేయాలంటూ సునీతారెడ్డి వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. సునీత రెడ్డి వేసిన పిటిషన్పై సీబీఐకి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరించింది సుప్రీం కోర్టు. కేసును ఈ నెల 19కి వాయిదా వేసింది సర్వోన్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ A.అమానుల్లా నేతృత్వంలోని బెంచ్ ముందుకు ఈ పిటిషన్ విచారణకు రాగా కేసులో తానే వాదనలు వినిపిస్తానంటూ సునీతారెడ్డి ముందుకు వచ్చింది. దీనిపై స్పందించిన జస్టిస్ విక్రమ్ నాథ్ ఎవరైనా లాయర్ ను పెట్టుకోవాలని సూచించింది. సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ లుథ్రాను సునీతకు సాయం చేయాలని కోరింది. సునీత : సీబీఐ దర్యాప్తునకు అవినాష్ ఏ మాత్రం సహకరించడం లేదు. ఏప్రిల్ 24 తర్వాత 3 సార్లు నోటీసులిచ్చినా విచారణకు రాలేదు జస్టిస్ విక్రమ్ నాథ్ : ఈ కేసులో అంత అత్యవసరమైన పరిస్థితి ఏముంది? వెకేషన్ ముందున్న బెంచ్కు రావాల్సిన పరిస్థితి ఉందా? జస్టిస్ A.అమానుల్లా : ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలా? లేదా అన్నది దర్యాప్తు సంస్థ చూసుకుంటుంది. ఎవరిని ఎప్పుడు అరెస్టు చేయాలో, ఎవరిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలో CBIకి తెలుసు. ఈ కేసులో చాలా సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నాయి. సునీత : ఇతర నిందితులతో కలిసి అవినాష్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారు. ఇదే కేసులో సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు ఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు : అవినాష్ రెడ్డి CBI ముందు హాజరవుతున్నారు కదా, అలాగే దర్యాప్తుకు సహకరిస్తున్నప్పుడు CBIకి కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం ఏముంది? ఈ కేసులో మీరు తొందరపడి వ్యక్తిగతంగా వాదనలు వినిపించాలనుకుంటే నష్టపోతారు, మీరు (సునీతను ఉద్దేశించి) న్యాయశాస్త్రంలో నిష్ణాతులు కాకపోవచ్చు. మీ పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేస్తే.. తర్వాత వచ్చే లాయర్ కు సమస్య ఎదురవుతుంది. సెలవుల తర్వాత ఈ కేసును పరిశీలిద్దామా? సీనియర్ లాయర్ లుథ్రా: ఈ నెలాఖరులోగా సిబిఐకి ఇచ్చిన దర్యాప్తు గడువు ముగుస్తుంది సుప్రీంకోర్టు : మిస్టర్ లుథ్రా.. మీరు సమస్యలు సృష్టిస్తున్నారు. వాదనలు వద్దంటున్నా.. మీరు తలదూర్చాలనుకుంటున్నారు. ఈ కోర్టులోనే ఒక బెంచ్ విధించిన గడువుపై మేం మళ్లీ ఉత్తర్వులు ఇవ్వాలా? సునీత : ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సిబిఐని ఆదేశించండి సుప్రీంకోర్టు : అలాంటి ఉత్తర్వులు మేమేలా ఇస్తాం? ఈ పిటిషన్ లో విచారణకు రావాలా లేదా అన్నది CBI ఇష్టం. జులై 3న రండి సునీత : హైకోర్టు అనేక అంశాలను పరిగణలోకి తీసుకోలేదు. సీబీఐ సేకరించిన సాక్ష్యాలను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను సమీక్షించే తుది అధికారం సుప్రీంకోర్టుకు ఉందని గతంలో మీరు చెప్పారు కదా జస్టిస్ A.అమానుల్లా : మీరు ఆరోపణలు చేస్తున్న నిందితుడు మీ కజినా? సునీత : అవును, అవినాష్ రెడ్డి నాకు సెకండ్ కజిన్ సీనియర్ లాయర్ లుథ్రా: ఈ కేసును రేపు పరిశీలించండి. రేపు అడ్వొకేట్ ఆన్ రికార్డును కోర్టు ముందుంచుతాం. నేను వాదనలు వినిపిస్తాను సుప్రీంకోర్టు : మీరు అడిగినట్టు CBIకి నోటీసులు ఇవ్వలేం. కేసును జూన్ 19వ తేదీకి (వచ్చే సోమవారం) వాయిదా వేస్తున్నాం తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ జారీ చేసిన బెయిల్ను సవాల్ చేస్తూ సునీతా రెడ్డి వేసిన పిటిషన్లో సిబిఐకి నోటీసులు జారీ చేయాలని కోరినా.. సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఈ కేసులో సునీత తీరు పంతాలకు పోయి వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందని అభిప్రాయపడింది. కేవలం అవినాష్ రెడ్డిని జైల్లో వేయించడమే లక్ష్యంగా సునీత తీరు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. కేసుకు సంబంధించి అదనపు పత్రాలు సమర్పించేందుకు సునీతకు అవకాశమిచ్చింది సుప్రీంకోర్టు. ఈ కేసును జూన్ 19న పరిశీలిస్తానని తెలిపింది. -
ఎల్లో మీడియాకు హైకోర్టు దిమ్మదిరిగే గుణపాఠం.. ఆ కుట్రకు గండి పడిందా?
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎమ్ లక్ష్మీణ్ ఇచ్చిన తీర్పు మీడియాకు ఒక గుణపాఠం అని చెప్పాలి. జస్టిస్ను ఈ సందర్భంగా అభినందించాలి. అవినాష్కు బెయిల్ ఇవ్వడం, ఇవ్వకపోవడం కాదు ఇక్కడ ఇష్యూ. తనను ప్రభావితం చేయాలని ప్రయత్నించిన మీడియాకు ఆయన దిమ్మదిరిగే సమాధానం ఇచ్చారు. తనను భయపెట్టాలని అనుకున్న మీడియాకు ఆయన తనేమిటో తెలియచెప్పారని అనుకోవచ్చు. న్యాయ వ్యవస్థకు సంబంధించి కొంత సంయమనం అవసరం. అలాగనీ న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులపై విశ్లేషణ చేయరాదని కాదు. జనాన్ని నమ్మించాలని చూశారు.. కానీ.. అందులో తప్పుఒప్పుల గురించి మాట్లాడుకోరాదని కాదు. కాని గౌరవ న్యాయమూర్తిపై దురుద్దేశాలు ఆపాదించకూడదు. అభియోగాలు చేయరాదు. అవినాష్ రెడ్డిని సీబిఐ అరెస్టు చేయడానికి యత్నించిందన్న సన్నివేశం సమయంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 వంటి మీడియా సంస్థలు చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. ఏకంగా అవినాశ్ ను హెలికాప్టర్లో ఈ మీడియా తరలించేసింది. ఈ మీడియా సీఆర్ పిఎఫ్ దళాలను కూడా తెచ్చేసింది. అవినాష్ తల్లి చికిత్స పొందుతున్న ఆస్పత్రిలో ఏమి జరుగుతుందో శోధించడానికి వీరు చేయని అకృత్యాలు లేవు. ఇంకేముంది అవినాశ్ అరెస్టు ఖాయం అని వారు నమ్మారో లేదో కాని, జనాన్ని నమ్మించాలని చూశారు. కాని వారు అనుకున్నదానికి రివర్స్లో కేసు సాగడంతో ఏకంగా న్యాయమూర్తిపై దాడికి దిగారు. అలా చేయకుండా.. అదేదో.. ఒక సస్పెండెడ్ మెజిస్ట్రేట్ను కూర్చోబెట్టి చండాలపు ఆరోపణలు చేయించారు. ఆ టివీలో చర్చ చూస్తే అదంతా మాచ్ ఫిక్సింగ్ ప్రకారమే హైకోర్టు న్యాయమూర్తిపై ఆరోపణలు చేయించినట్లు కనిపిస్తుంది. నిజానికి అలాంటి అభ్యంతర వ్యాఖ్యలు చేస్తే వెంటనే సంబంధిత చానల్ వారు వెంటనే నిలుపుదల చేయడం, క్షమాపణ చెప్పించడం, తాము కూడా క్షమాపణ చెప్పడం చేయాలి. అలా చేయకుండా, అదేదో తమ చానల్కు సంబంధం లేని వ్యవహారంగా వదలివేశారు. చట్టం ప్రకారం న్యాయమూర్తులపై సంచులు వెళ్లాయి అంటూ ఆరోపణలు చేయడం ఎంత తప్పో, వాటిని ప్రచారం చేయడం కూడా అంతే తప్పు అవుతుంది. ఎవరూ చట్టానికి అతీతులు కారు.. కాని గత నాలుగేళ్లుగా న్యాయ వ్యవస్థతో తమ ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటున్న ఈ మీడియా సంస్థలు అహంకారానికి ప్రతిరూపంగా మారిపోయాయి. తాము ఏమి చేసినా ఎదురులేదన్న చందంగా మారాయి. తమకు న్యాయ వ్యవస్థలో ఎవరో పెద్ద స్థాయిలో ఉన్నవారితో పరిచయం ఉందన్న అతిశయంతో వారు చెలరేగిపోయారు. నిజానికి ఈ మీడియావారికి పరిచయం ఉన్నంతమాత్రాన గౌరవ జడ్జిలు వారికి అనుకూలంగా ఉంటారని అనుకోజాలం. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉండకుండా ఎందుకు ఉంటారు?. మార్గదర్శి కేసు కూడా ఇందుకు ఒక ఉదాహరణే అవుతుంది. ఆ కంపెనీ డిపాజిట్ల వివరాలన్నిటిని సమర్పించాలని గౌరవ న్యాయస్థానం స్పష్టం చేయడం ద్వారా ఎవరూ చట్టానికి అతీతులు కారని తేల్చింది. ఆ టీవీ సైలెంట్ అయిపోయింది.. గతంలో ఒక కేసులో కొందరికి జైలు శిక్ష పడింది. అలా శిక్ష పడినవారి మహిళా బంధువు ఒకరు సంబంధిత న్యాయాధికారిపై ఆరోపణలు చేస్తూ ఒక టీవీ ముందు మాట్లాడారు. ఆ టీవీవారు తెలిసో, తెలియకో ఒకటికి రెండుసార్లు ప్రసారం చేశారు. దాంతో ఆ న్యాయాధికారి ఆ టీవీవారికి, ఆరోపణ చేసిన మహిళకు నోటీసు జారీ చేసి కేసు చేపట్టారు. ఆ తర్వాత ఆ టీవీ సైలెంట్ అయిపోయింది. ఈ నాలుగేళ్లలో ఏపీలో న్యాయ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రెచ్చిపోయిన మాట నిజమే కావచ్చు. ప్రతిదానికి పిల్ రూపంలో కేసులు వేయించడం, వాటిని తమ మీడియాలో ప్రచారం చేయడం, ఎవరైనా గౌరవ న్యాయమూర్తి ప్రభుత్వంపై ఏదైనా కామెంట్ చేస్తే దానిని బ్యానర్ కథనాలుగా చేసి జనంలో పలచన చేయాలని యత్నించారు. ఇటీవల ఏపీ నుంచి సుప్రీంకోర్టు జ్జడి అయిన ఛీప్ జస్టిస్ పి.కె.మిశ్ర ఈ పరిణామాలపై విసుగు చెందారు. సీబీఐ డొల్లతనం.. ప్రశ్నల రూపంలో అసలు ప్రభుత్వం పనిచేసుకోవాలా? వద్దా? ప్రతిదానికి పిల్ వేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశంకు మద్దతు ఇచ్చే మీడియా సీబిఐలో ఎవరితోనో రహస్య సంబంధాలు పెట్టుకుని ఉన్నవి, లేనివి రాయడం అలవాటు చేసుకున్నారు. ఆ దర్యాప్తు సంస్థకు చెందిన కొందరు అధికారులు తమ చెప్పుచేతలలో ఉన్నట్లుగా ప్రవర్తించిన ఈ మీడియా న్యాయ వ్యవస్థను కూడా అలాగే లొంగదీసుకోవాలని యత్నించి విఫలం అయింది. గౌరవ న్యాయమూర్తి లక్ష్మణ్ మొత్తం కేసును క్షుణ్ణంగా పరిశీలించి అనేక అబ్జర్వేషన్లు చేశారు. కేసు దర్యాప్తు తీరులో సిబిఐ డొల్లతనాన్ని ఆయన ప్రశ్నల రూపంలో బహిర్గతం చేశారు. అలాగని అవినాశ్కు ఏమీ పూర్తి స్థాయి రిలీఫ్ ఇవ్వలేదు. ముందస్తు బెయిల్ ఇచ్చారు తప్ప, ఒకవేళ అవినాశ్ను అరెస్టు చేయదలిస్తే ఐదు లక్షల పూచీకత్తు తీసుకుని బెయిల్ ఇవ్వాలని ఆదేశించారు. మరికొన్ని కండిషన్లు పెట్టారు. అదే టైమ్లో తనపై ముడుపుల ఆరోపణ చేసిన ఏబిఎన్, మహా టీవీలపై చర్య తీసుకునే విషయాన్ని ఛీఫ్ జస్టిస్కు నివేదించారు. ఇంత బేలెన్స్డ్గా వ్యవహరించడం ఆ న్యాయమూర్తి విశిష్టత అని చెప్పాలి. ఆయన కావాలనుకుంటే ఏబిఎన్, మహా టీవీల వారికి వెంటనే నోటీసు ఇచ్చి చర్య తీసుకోవచ్చు. అయినా ఆ పని చేయలేదు. కాని ఈ సందర్భంగా ఆయన కలత పడిన తీరును వివరించారు. ఒక దశలో కేసు నుంచి తప్పుకుందామని అనుకున్న విషయాన్ని కూడా చెప్పారు. ఒకవేళ అలా చేసి ఉంటే ఈ ఎల్లో మీడియా లక్ష్యం నెరవేరినట్లయ్యేది. ఒక చిన్న లాజిక్.. చాలా పెద్ద విషయం.. అందుకే ఆయన పూర్తి స్థాయిలో విచారణ చేశారు. ముందస్తు బెయిల్ కేసులలో ఇంతగా పరిశీలించరట. కాని తనపై టీవీలలో చర్చలు ఇష్టారీతిగా జరిపిన కారణంగా ఆయనకు బాధ్యత ఏర్పడింది. కేసుకు సంబంధించి ఆయన లేవనెత్తిన ఒక చిన్న లాజిక్ చాలా పెద్ద విషయాన్నే తెలియచెప్పింది. సీబిఐ దర్యాప్తులో సహేతుకత కొరవడిన విషయం తేటతెల్లమైంది. వైఎస్ వివేకా హత్య జరిగినట్లు నిందితుడు ఒప్పుకున్నాక, ఆయన శరీరంపై గాయాలు స్పష్టంగా కనబడుతున్న తరుణంలో రక్తం తుడిస్తే ఆధారాలు ఏలా మాయమవుతాయని ఆయన ప్రశ్నించారు. అలాగే వైఎస్ వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి కొన్ని ఆధారాలను దాచిన వైనం గురించి ప్రశ్నించారు. ఒక జర్నలిస్టు ఆసక్తికర విశ్లేషణ.. వివేకాకు ఇంతర మహిళలతో ఉన్న సంబంధాలపై కూడా అడిగారు. వీటిలో అనేకం అవినాశ్ కూడా ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయినా సిబిఐ వాటిని పట్టించుకోకుండా దూకుడుగా ఎవరో ఎజెండా ప్రకారం అవినాశ్ ను ఇబ్బంది పెట్టడానికే అన్నట్లు విచారణ సాగించిందన్న విమర్శలు వచ్చాయి. ఎల్లో మీడియాకు ఈ విషయంలో చాలా పవర్ ఉందన్నది వాస్తవమే. ఎందుకంటే సిబిఐలో చీమ చిటుక్కుమన్నా ఈ మీడియాకు ముందుగానే తెలిసిపోతుండడమే ఇందుకు ఉదాహరణ అవుతుంది. గతంలో సీబిఐ నుంచి సమాచారం రాబట్టాలంటే చాలా కష్టంగా ఉండేది. అలాంటిది వీరికి అంత తేలికగా సమాచారం ఎలా వస్తుందా అన్న సంశయం వస్తుంది. ఇంకో విశేషం ఉంది. సోషల్ మీడియాలో ఒక జర్నలిస్టు ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. టీడీపీ తన పుస్తకంలో ఏమి చెప్పిందో.. సీబీఐ కూడా.. టీడీపీ వివేకా హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్ను లాగాలన్న దురుద్దేశంతో వేసిన ఒక పుస్తకంలో ఉన్న అంశాలనే సీబిఐ తన దర్యాప్తులో కొన్ని భాగాలుగా చేసిందని ఆయన చెబుతున్నారు. ప్రత్యేకించి గుండెపోటు, రక్తం తుడువడం మొదలైన విషయాలలో టీడీపీ తన పుస్తకంలో ఏమి చెప్పిందో సిబిఐ తన అభియోగాలలో అదే చెప్పిందట. అందులో నిజం ఉండవచ్చు. లేకపోవచ్చు. కాని అలాంటి అనుమానాలకు ఆస్కారం ఇచ్చి ఉండాల్సిందికాదు. వివేకా కుమార్తె చేస్తున్న ఆరోపణలను విచారించడంతో పాటు అవినాశ్ తదితర వ్యక్తులు చెబుతున్న కోణాలపై కూడా దర్యాప్తు చేసి ఉంటే సీబిఐపై ఇంతగా విమర్శలు వచ్చేవి కావు. చదవండి: Fact Check: పోలవరం పూర్తవుతున్నందుకా.. ఈనాడు ‘రంకెలు’ ఇప్పుడు బ్రేక్ పడిందా? ఈ కేసులో తానే వివేకాను చంపానని చెప్పిన వ్యక్తి అప్రూవర్ అవడం, అతనికి బెయిల్ ఇవ్వడానికి సీబీఐతో పాటు వివేకా కుమార్తె సహకరించడం వంటివి చూస్తే ఇందులో ఏదో మతలబు ఉందన్న అభిప్రాయం కలుగుతుంది. అలాగే హత్య జరిగిన తొలి రోజులలో సునీత మాట్లాడిన తీరుకు, ఇప్పుడు చేస్తున్న ఆరోపణలకు సంబంధం లేకపోవడం కూడా గమనించదగ్గ సంగతే. ఈ కేసును రాజకీయ కుట్రగా చేసేసి చేతులు దులుపుకోవాలని సీబిఐ చేసిన యత్నానికి ఇప్పుడు బ్రేక్ పడిందని అనుకోవచ్చు. నేర్చుకోవలసిన పాఠం ఇదే.. ఈ కేసు ద్వారా నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే సీబిఐ తన ఇష్టం వచ్చినట్లు విచారణ చేస్తే అన్నిసార్లు కుదరదన్నది ఒకటైతే, మీడియా తనతోచిన విధంగా, తాము కోరిన విధంగా ట్రయల్ చేసే తీర్పులు ఇచ్చేస్తే ప్రభావం అవడానికి న్యాయ వ్యవస్థ సిద్దంగా ఉండదని తెలుసుకోవాలి. జస్టిస్ లక్ష్మణ్ న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టారని చెప్పవచ్చు. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
ఆలస్యమైనా..న్యాయమే గెలిచింది
-
ఏబీఎన్, మహా టీవీ వీడియోలను కోర్డుకు ఇవ్వండి
-
నిందితులు ఇచ్చిన స్టేట్ మెంట్ లో అవినాష్ రెడ్డి పేరు లేదు: లాయర్లు
-
అవినాష్ రెడ్డికి ఊరట
-
అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
-
అవినాష్ రెడ్డిని బుధవారం వరకు అరెస్ట్ చేయొద్దన్న హైకోర్టు
-
లోక్ సభ అభ్యర్ధిత్వం కోసమే వివేకా హత్య జరిగిందని ఎలా చెప్తున్నారు ?
-
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్...సీబీఐ న్యాయవాదికి హైకోర్టు సూటి ప్రశ్నలు
-
31వరకు అవినాష్ అరెస్ట్ వద్దు, CBIకి హైకోర్టు సూచన
హైదరాబాద్: అవినాష్రెడ్డిని ఈ నెల 31 వరకు (బుధవారం) అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు సిబిఐకి సూచించింది. ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్ పై సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు ఈ సూచనలు చేసింది. 31న తుది ఉత్తర్వులు ఇస్తామని, అప్పటివరకు ఎలాంటి కఠిన చర్య తీసుకోవద్దని సూచించింది. నిన్నటికి కొనసాగింపుగా ఇవ్వాళ కూడా అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు సుదీర్ఘ విచారణ జరిగింది. నిన్న అవినాష్ రెడ్డి, సునీత వాదనలు పూర్తి కాగా, ఇవ్వాళ సీబీఐ తరఫు న్యాయవాది ప్రభుత్వ ప్రత్యేక ప్రాసిక్యూటర్ అనిల్ వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా CBI SP వికాస్ సింగ్, ASP ముఖేష్ శర్మతో పాటు సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి కోర్టు హాల్ కు వచ్చారు. కేసు దర్యాప్తులో అవినాష్ రెడ్డి ఆటంకాలు కలిగిస్తున్నారని, విచారణకు సహకరించడం లేదని సిబిఐ లాయర్ అనిల్ ఆరోపించారు. హత్యకు రాజకీయ కారణాలున్నాయని తెలిపింది. దీనిపై హైకోర్టు వెకేషన్ బెంచ్ కొన్ని ప్రశ్నలు అడిగింది. మీ పద్ధతి సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కాదా? అవినాష్రెడ్డిపై ఏ ఆధారాల మేరకు అభియోగాలు మోపుతున్నారని హైకోర్టు ప్రశ్నించగా.. దానికి కొందరు సాక్షుల వాంగ్మూలాల మేరకేనని సిబిఐ తెలిపింది. ఒక సీల్డ్ కవర్లో సాక్షుల వాంగ్మూలాలు కోర్టుకు సమర్పిస్తామని సిబిఐ తెలిపింది. దీనిపై స్పందించిన హైకోర్టు.. సాక్షుల వాంగ్మూలాల వివరాలను పిటిషనర్ అయిన అవినాష్ రెడ్డికి కూడా ఇస్తారా అని ప్రశ్నించింది. దీనిపై సిబిఐ వివరణ ఇచ్చింది. సాక్షుల వివరాలను కేవలం కోర్టుకు మాత్రమే ఇస్తామని, ప్రస్తుత దశలో బయటపెట్టలేమని తెలిపింది. సిబిఐ స్పందనపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. సాక్షుల వాంగ్మూలాలపై అవినాష్ రెడ్డి వాదనలు వినకుండా ఎలా పరిగణనలోకి తీసుకున్నారు? వాటిని కోర్టు ఎలా పరిగణించాలి అని ప్రశ్నించింది. ఏ కేసులోనయినా,.. ఏ ఆధారంపైనయినా.. ఇరుపక్షాల వాదనలు వినాలని సూచించింది. సిబిఐ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కాదా అని హైకోర్టు ప్రశ్నించింది. అ అవసరం అవినాష్కు ఏముంది? ‘అవినాష్ ఇంట్లో ఎ-2 నిందితుడు ఉన్నారని ఎలా చెబుతున్నారు?, ఆధారాల సేకరణకు ఎందుకు ఆలస్యమైంది? లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిత్వం కోసమే వివేకా హత్య జరిగిందని ఎలా చెప్తున్నారు? లోక్సభ అభ్యర్ధిగా అవినాష్ను అనధికారికంగా ముందే ప్రకటించారని మీ చార్జ్షీట్లో చాలామంది స్టేట్మెంట్లు ఉన్నాయి కదా? అవినాష్ అభ్యర్థిత్వాన్ని అందరూ సమర్ధించిన స్టేట్మెంట్లు ఉన్నాయి కదా?, అవినాష్ చాలా బలమైన కుటుంబ నేపథ్యమని మీరే అంటున్నారు. అలా అయితే 2017 ఎమ్మెల్సీ ఎన్నికలను మేనేజ్ చేసి ఉండొచ్చు కదా?, వివేకాను హత్య చేయాల్సిన అవసరం అవినాష్కు ఏముంది?. వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్కుమార్ రెడ్డి అరెస్ట్కు కారణాలేంటి?. కస్టడీలో వారిద్దరి నుంచి ఏం తెలుసుకున్నారు?’ అని సీబీఐ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై రిప్లై వాదనల్లో తమ వాదన వినిపించారు అవినాష్ తరపు న్యాయవాది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి అవినాష్ కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఓటర్లు ఓట్లు వేయకపోవడం వల్లే వివేకా ఓడిపోయారు తప్ప.. దాన్ని అవినాష్ కు ఎలా అంటగడతారని ప్రశ్నించారు. అది ఎవిడెన్స్ ట్యాంపర్ ఎలా అవుతుంది? ‘గదిలో రక్తం మరకలు తుడిచేస్తే ఏమవుతుంది.. శరీరంపై గాయాలు ఉంటాయి కదా? ఒక లీడర్ హత్య జరిగిందంటే ప్రజలు ఊరుకుంటారా? వివేకా మృతదేహం చూడగానే గాయాలు కనిపించాయా?, హత్య అని తెలుస్తున్నప్పుడు గదిలో రక్తపు మరకలతో అవసరం ఏముంది?’, అని సీబీఐ న్యాయవాదికి ప్రశ్నలు సంధించింది హైకోర్టు. గంగిరెడ్డిని whatsapp చాట్ గురించి అడిగారా? వాట్సాప్ ద్వారా అవినాష్ సంభాషించాడంటూ సిబిఐ చేసిన వాదనలపై హైకోర్టు పలు ప్రశ్నలు లేవనెత్తింది. అవినాష్ డేటా వినియోగించాడంటున్నారు.. అది వాట్సాప్ కాల్ అని ఎలా చెప్పగలరు? ఒక వేళ అవినాష్ వాట్సాప్ కాల్ చేశాడని చెబుతున్నారు? ఎవరెవరితో మాట్లాడారు? అవినాష్ IPDR డాటా ఎప్పుడు సేకరించారు? అవినాష్ డాటా తీసుకున్నప్పుడు.. ఇతర నిందితుల వాట్సాప్ డేటా కూడా తీసుకున్నారా? A1 ఉన్న గంగిరెడ్డిని వాట్సాప్ చాట్ గురించి అడిగారా? అని హైకోర్టు ప్రశ్నలు సంధించింది దీనికి సీబీఐ సమాధానం చెబుతూ.. విచారణలో అవినాష్తో చాట్ చేయలేదని గంగిరెడ్డి చెప్పాడని తెలిపింది. మరి తెల్లవారుజామున అవినాష్రెడ్డి ఎవరితో చాట్ చేశారు’ అని హైకోర్టు అడగ్గా.. వాట్సాప్ కాల్ చేసినట్లు మాత్రమే భావిస్తున్నామని సీబీఐ తెలిపింది. వాట్సాప్ కాల్ ఎవరితో మాట్లాడారో ఇంటర్నెట్ ద్వారా గుర్తించలేమని స్పష్టం చేసింది. మరి అవినాష్ వాట్సాప్ లో ఉన్న సమయంలో గంగిరెడ్డి వాట్పాప్ బిజిగా ఉందా? అని ప్రశ్నించింది హైకోర్టు. ఇంత నత్త నడక దర్యాప్తు ఏమిటి? కేసు దర్యాప్తు విషయంలో CBI తీరును ప్రశ్నించింది హైకోర్టు. అసలు అవినాష్ రెడ్డి డేటాను ఎప్పుడు సేకరించారని హైకోర్టు ప్రశ్నించగా.. ఈ నెల 12నే సేకరించామని తెలిపింది. CBI సమాధానంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. వివేకా హత్య వెనక భారీ కుట్ర జరిగిందని, అందులో అవినాష్ పాత్ర ఉన్నట్టు ఎప్పటినుంచో అనుమానిస్తున్నామని చెబుతున్న CBI దర్యాప్తులో ఇంత ఆలస్యం ఎందుకు చేసినట్టని హైకోర్టు ప్రశ్నించింది. హత్య జరిగి ఇన్నాళ్లయిన తర్వాత అవినాష్ పాత్ర కోసం CBI చేస్తున్న ప్రయత్నంపై అసహనం వ్యక్తం చేసింది. నిజంగా మీకు ముందు నుంచే అనుమానం ఉండి ఉంటే.. అవినాష్ రెడ్డి మొబైల్ ఫోన్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? కీలక అంశాలపై ఇంత నత్త నడక దర్యాప్తు ఏమిటి? అని నిలదీసింది హైకోర్టు. వివేక హత్య జరిగిన కరెక్ట్ సమయం చెప్పమని సీబీఐని హైకోర్టు ప్రశ్నించగా, మే 15 తెల్లవారు జామున 1:10 గంటల నుంచి 1:30 గంటల మధ్య వివేక హత్య జరిగినట్లు భావిస్తున్నామని సీబీఐ తెలిపింది. -
అవినాశ్ లక్ష్యంగా సీబీఐ దర్యాప్తు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి లక్ష్యంగా సీబీఐ విచారణ చేస్తోందని.. ఆయనను ఇందులో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని తెలంగాణ హైకోర్టులో ఆయన తరఫు న్యాయవాది ఉమామహేశ్వరరావు సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఇప్పటికే పలుమార్లు అవినాశ్ విచారణకు హాజరైనా మళ్లీ రావాలంటూ తీవ్రంగా వేధిస్తోందని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. హత్య చేసిన నలుగురికి వివేకాతో విభేదాలున్నాయన్నారు. ప్రత్యక్ష సాక్షి అయిన రంగన్న స్టేట్మెంట్ను సీబీఐ రికార్డు చేయలేదని తెలిపారు. ప్రధాన నిందితుడు దస్తగిరి విషయంలోనూ సీబీఐ తీరు ఇలాగే ఉందన్నారు. దస్తగిరి దర్జాగా బయట తిరుగుతున్నా వివేకా కుమార్తె సునీత పట్టించుకోవడం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని మాత్రం సుప్రీంకోర్టు వరకు వెళ్లారని గుర్తు చేశారు. కిరాయి హంతకుడు దస్తగిరికి పూర్తి సహకారం అందిస్తున్న సీబీఐ.. అవినాశ్రెడ్డి లక్ష్యంగా దర్యాప్తు జరుపుతోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. అవినాశ్ తన తల్లికి అనారోగ్యంగా ఉండటంతో ఆస్పత్రిలో ఉన్నారని.. అయినా విచారణకు రావాలంటూ వేధిస్తోందని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఆధారాలు లేకుండా అవినాశ్ను అరెస్టు చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ముందస్తు బెయిల్ కోరుతూ వైఎస్ అవినాశ్రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ను శుక్రవారం ఉదయం హైకోర్టు విచారించింది. న్యాయమూర్తి జస్టిస్ ఎం.లక్ష్మణ్ ధర్మాసనం ముందు.. అవినాశ్ తరఫున న్యాయవాది ఉమామహేశ్వరరావు సుదీర్ఘ వాదనలు వినిపించారు. అనంతరం సునీత తరఫు సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ తన వాదనలు వినిపించారు. అప్పటికే సాయంత్రం 6 గంటలు దాటడంతో విచారణను ధర్మాసనం శనివారం (నేడు) ఉదయం 10.30 గంటలకు వాయిదా వేసింది. నేడు సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించాల్సి ఉంది. కాగా అవినాశ్ రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు ఇలా సాగాయి.. నాలుగేళ్లుగా సీబీఐ దర్యాప్తు.. ‘2019, మార్చి 14న వివేకా హత్య జరిగింది. తొలుత నాటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగింది. ఈ క్రమంలో వివేకా కుమార్తె సునీత ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో 2020లో కేసు సీబీఐకి బదిలీ అయ్యింది. కేసు విచారణ చేపట్టిన సీబీఐ దాదాపు నాలుగేళ్లు అవుతున్నా ఇప్పటివరకు దర్యాప్తులో ఎలాంటి పురోగతి సాధించలేదు. 2021, అక్టోబర్ 26న ఒక చార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో ఎర్ర గంగిరెడ్డి(ఏ–1), సునీల్ యాదవ్ (ఏ–2), ఉమాశంకర్రెడ్డి (ఏ–3), దస్తగిరి (ఏ–4)లను నిందితులుగా పేర్కొంది. గంగిరెడ్డిని 2019, మార్చి 28న సిట్ అరెస్టు చేసింది. గంగిరెడ్డి వివేకాకు అత్యంత సన్నిహితుడు. వీరి మధ్య భూవివాదాలు ఉన్నాయి. బెంగళూరుకు చెందిన ఓ భూవివాదంలో రావాల్సిన కమిషన్ గురించి ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి తర్వాత బెయిల్పై విడుదలయ్యాడు. ఇక రెండో నిందితుడు సునీల్ను 2021, ఆగస్టు 28న అరెస్టు చేశారు. వివేకా అతడితో వజ్రాల వ్యాపారం చేసేవారు. అంతేకాదు.. సునీల్ తల్లిని వివేకా లైంగికంగా వేధించినట్లు అతడే తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. మూడో నిందితుడు ఉమాశంకర్రెడ్డిని 2021, సెపె్టంబర్ 9న అరెస్టు చేశారు. ఇతడితోనూ వివేకా వజ్రాల వ్యాపారం చేశారు. అంతేకాకుండా ఉమాశంకర్రెడ్డి భార్యను కూడా వివేకా లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలున్నాయి. ఇక నాలుగో నిందితుడు దస్తగిరిని ఇప్పటివరకు సీబీఐ అరెస్టు చేయలేదు. వివేకా వద్ద దస్తగిరి డ్రైవర్గా పనిచేసేవాడు. 2018 డిసెంబర్లో అతడిని తొలగించిన వివేకా.. ప్రసాద్ (ఎల్డబ్ల్యూ–16)ను డ్రైవర్గా పెట్టుకున్నారు. దస్తగిరి సూచన మేరకే.. హత్యకు ముందు వివేకాతో నిందితులు ప్రసాదే ఈ హత్యకు కారణం అన్నట్లు లేఖ రాయించారు. తానే ఆయుధం తెచ్చానని, హత్య చేశానని చెప్పిన ఓ కిరాయి హంతకుడు (దస్తగిరి) యథేచ్ఛగా బయట తిరగడం, అతడిని సీబీఐ అరెస్టు చేయకపోవడం ఇదే తొలిసారి కావొచ్చు. 2021, నవంబర్ 17న సీబీఐ మరో చార్జిషీట్ దాఖలు చేశారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే చార్జిషీట్ వేయాల్సి ఉండగా, సీబీఐ చట్టాన్ని పాటించలేదు’ అని అవినాశ్ న్యాయవాది తన వాదనలు వినిపించారు. టీడీపీ కుట్రలో భాగంగానే వివేకా ఓటమి ‘2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. దీనికి దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి, మనోహర్రెడ్డి కారణమని.. వారి అంతుచూస్తానని బెదిరించారని సీబీఐ పేర్కొంటున్నా.. అందులో వాస్తవం లేదు. స్థానిక సంస్థల కోటాలో ఆ ఎన్నికలు జరగడం, నాటి అధికార టీడీపీ ఓటర్లను కొనుగోలు చేయడం కారణంగానే వివేకా ఎన్నికల్లో ఓడిపోయినట్టు కొందరు సాక్షులు వెల్లడించారు. వివేకా ఓటమితో భాస్కర్రెడ్డి, శివశంకర్రెడ్డిలకు సంబంధం లేదు. వివేకా.. విజయమ్మ, షర్మిలల్లో ఒకరికి కడప ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరినట్లు కూడా ఎవరూ చెప్పలేదు. సీబీఐ మాత్రం ఓ కథ అల్లుకుని.. ఆ మేరకు దర్యాప్తు చేస్తోంది’ అని అవినాశ్ న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. డబ్బు, ఆయుధం రికవరీ ఏదీ? ‘గంగిరెడ్డి ఇచ్చాడని చెప్పి తనకు సునీల్ రూ.కోటి ఇచ్చినట్లు దస్తగిరి వాంగ్మూలంలో పేర్కొన్నాడు. అందులో రూ.25 లక్షలను మళ్లీ సునీల్ తీసుకున్నాడని చెప్పాడు. కేసు నమోదు చేసిన సీబీఐ మిగిలిన రూ.75 లక్షల్లో రూ.46 లక్షలు మాత్రమే రికవరీ చేసింది. మరి మిగతా డబ్బు ఎక్కడికి పోయింది. దస్తగిరి ఆయుధాన్ని నాలాలో వేశానని చెప్పాడు. నాలాలో వేసిన ఆయుధాన్ని కూడా సీబీఐ రికవరీ చేయలేకపోయింది. ఈ డబ్బు, ఆయుధం ఎక్కడికి పోయాయి. దీనికి సీబీఐ వద్ద సమాధానం లేదు. దస్తగిరి.. సీబీఐ పెంపుడు చిలుక(పెట్)లా మారాడు. వారు ఏం చెబితే అదే చెబుతున్నాడు. అందుకే గిఫ్ట్ కింద మిగిలిన డబ్బు రికవరీ చేయలేదేమో. సీబీఐ కేసు స్వీకరించిన తర్వాత దర్యాప్తు అధికారి ఆదేశాల మేరకు ఢిల్లీ వెళ్లిన దస్తగిరి అక్కడే నెలన్నర ఉన్నాడు. ఈ క్రమంలోనే వారి మధ్య ఒప్పందం కుదిరింది. విచారణ అనుమానాస్పదంగా ఉండటంతో దర్యాప్తు అధికారిపై ఓ ప్రైవేట్ కేసు నమోదు కావడమే కాకుండా ఏకంగా అత్యున్నత న్యాయస్థానం అతడిని పక్కకు పెట్టింది. నిందితుడి నుంచి ఒకసారి వాంగ్మూలం తీసుకుంటారు. కానీ, ఆగస్టు 25, 2021 నుంచి 30 వరకు దస్తగిరి నుంచి మూడుసార్లు వాంగ్మూలం తీసుకున్నారు.. అతడిని అరెస్టు కూడా చేయలేదు. అదే ఏడాది అక్టోబర్ 7న దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. బెయిల్కు అభ్యంతరం లేదని, ఇవ్వొచ్చంటూ సీబీఐ పేర్కొంది. దీంతో దస్తగిరికి అక్టోబర్ 22న ముందస్తు బెయిల్ వచ్చింది. అనంతరం దస్తగిరిని సీబీఐ అప్రూవర్గా పేర్కొంది’ అని అవినాశ్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. సెక్షన్ 201 మిస్సింగ్.. ‘పోలీసు దర్యాప్తుపై సీబీఐ ఆరోపణలు చేసింది. పాత ఎఫ్ఐఆర్లోని అంశాలతోనే కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ముందు గుండెపోటు అనుకున్నా.. తర్వాత అదే రోజు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అందులో ఐపీసీ 201 (సాక్ష్యాలను ధ్వంసం చేయడం) కేసు నమోదు చేశారు. అయితే సీబీఐ ఎఫ్ఐఆర్లో మాత్రం 201 సెక్షనే లేదు. ఏప్రిల్ చివరి నాటికి దర్యాప్తు ముగించాలని కోర్టు చెప్పినా ఆ పని చేయలేదు’ అని తెలిపారు. ముందస్తు బెయిల్ ఇవ్వండి ‘ఇప్పటికే పలుమార్లు విచారణకు అవినాశ్ హాజరయ్యారు. ఈ నెల 16న మరోసారి రావాలంటూ సీబీఐ 15వ తేదీ సాయంత్రం నోటీసులు ఇచ్చింది. తాను 19న వస్తానని అవినాశ్ లేఖ రాశారు. ఈ క్రమంలో 19న హైదరాబాద్ బయలుదేరిన ఎంపీ.. తల్లి అనారోగ్యం విషయం తెలియడంతో మళ్లీ పులివెందుల వెళ్లారు. అక్కడి నుంచి ఆయన తల్లిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని అవినాశ్కు ముందస్తు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని న్యాయవాది వెల్లడించారు. కాగా, సుదీర్ఘ వాదనలు జరుగుతున్న సమయంలో సునీత జోక్యం చేసుకొని వైఎస్ అవినాశ్రెడ్డి న్యాయవాదికిచ్చినంత సమయం తమ న్యాయవాదులకు వాదనలు వినిపించేందుకు ఇవ్వాలని పేర్కొనడంతో హైకోర్టు మందలించింది. కోర్టు హాల్లో పరిధి దాటి వ్యవహరించవద్దని హెచ్చరించింది. అవినాశ్ను ఇరికించే యత్న ‘నిందితుల్లో కొందరు అవినాశ్ పార్టీకి చెందిన వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫోన్ మాట్లాడుకోవడం సాధారణం. దాని ఆధారంగా అవినాశ్ను ఇరికించాలని చూస్తున్నారు. హత్య జరిగిన రోజు ప్రచారం కోసం జమ్మలమడుగు వెళ్తున్న అవినాశ్.. హత్య విషయం తెలిసి నేరుగా వివేకా ఇంటికే చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న చాలామంది రక్తపు వాంతులతో, గుండెపోటు వచ్చి వివేకా మృతి చెందినట్లు చెప్పడంతో అవినాశ్ కూడా అలాగే భావించారు. సాక్ష్యాలను ధ్వంసం చేశారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. వివేకా ఇంట్లో ఆయన లాన్లోనే పలువురికి ఫోన్ చేసి విషయం చెబుతూ ఉండిపోయారు. ఇన్నాళ్లయినా సీబీఐ అవినాశ్ ప్రమేయం ఉంది అని చెప్పేందుకు ఒక్క ప్రాథమిక ఆధారాన్ని కూడా చూపలేదు. ప్రత్యక్ష సాక్షి రంగన్న స్టేట్మెంట్ను పరిగణనలోకి తీసుకోని సీబీఐ హత్య వెనుక భాస్కర్రెడ్డి, అవినాశ్లు ఉన్నారని తనకు గంగిరెడ్డి చెప్పాడని దస్తగిరి చెప్పిన వాంగ్మూలాన్ని మాత్రం విశ్వసించడం.. విచారణ ఏ లక్ష్యంగా సాగుతోందో తెలియజేస్తోంది. హంతకుడిని బయట తిరగమని చెప్పి.. ఓ ప్రజాప్రతినిధిని అరెస్టు చేయాలని సీబీఐ చూస్తోంది. కోర్టులో పిటిషన్ వేస్తేగానీ వీడియో, ఆడియో రికార్డింగ్ గురించి వివరాలు చెప్పలేదు’ అని కోర్టు దృష్టికి తెచ్చారు. సునీత తీరు అనుమానాస్పదం.. ‘కేసు ట్రయల్ను మరో రాష్ట్రానికి మార్చమని వివేకా కుమార్తె సునీత పిటిషన్ వేయడంతో సుప్రీంకోర్టు తెలంగాణకు బదిలీ చేసింది. ప్రతి పిటిషన్లో ఇంప్లీడ్ అవుతున్న సునీత.. కిరాయి హంతకుడు (దస్తగిరి) బయట తిరగడంపై మాత్రం ఎలాంటి పిటిషన్ వేయలేదు. దస్తగిరికి బెయిల్ ఇవ్వొద్దని గానీ, ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని గానీ కోరలేదు. వివేకా హత్య తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ తన తండ్రి.. వైఎస్ అవినాశ్ గెలుపు కోసం చనిపోయే ముందు వరకు తీవ్రంగా కృషి చేశారని చెప్పారు. జగనన్నను సీఎంగా చూడటమే తన లక్ష్యంగా పనిచేశారని పేర్కొన్నారు. ఎప్పుడైతే ఆమె టీడీపీ నేతలను కలిశారో.. నాటి నుంచి సునీత తీరులో మార్పు వచ్చింది. టీడీపీ నేతలు సూచించినట్లు ఆమె వ్యవహరిస్తున్నారు’ అని అవినాశ్ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. -
నాలుగేళ్ల తర్వాత.. సీబీఐ చిలుక ‘కొత్త పలుకు’
సాక్షి, అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ ముసుగు పూర్తిగా తొలగిపోయింది. లోపల ఉన్నదంతా పచ్చ కుట్రేనని వెల్లడైంది. టీడీపీ పాడుతున్న పాత పాటనే సీబీఐ న్యాయస్థానంలో తన అఫిడవిట్లో శుక్రవారం వినిపించింది. సీబీఐలో కొందరు అధికారులు పదవీ విరమణ, స్థాన చలనానికి ముందు టీడీపీ ముఖ్య నేతల ప్రలోభాలకు గురై వారు చెప్పినట్టుగా అఫిడవిట్ పేరుతో కుట్రకు తెరతీసింది. వైఎస్ వివేకానందరెడ్డి మృతి చెందారని ఆయన పీఏ కృష్ణారెడ్డి అందరికంటే ముందు గుర్తించారన్నది నాలుగేళ్లుగా ముక్తకంఠంతో చెబుతున్న మాట. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం నియమించిన సిట్ కూడా అదే విషయం చెప్పింది. కానీ టీడీపీ ఆరు నెలలుగా కుట్రపూరితంగా ఓ వాదనను తెరపైకి తెచ్చింది. వివేకా మృతి చెందిన విషయం ఆయన పీఏ కంటే ముందే ఎంపీ అవినాశ్ రెడ్డి.. వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెప్పారని దు్రష్పచారం చేస్తోంది. సరిగ్గా అదే అసంబద్ధ ఆరోపణను సీబీఐ శుక్రవారం తన అఫిడవిట్లో పేర్కొనడం విస్మయ పరుస్తోంది. పైగా ఏమాత్రం సాంకేతికంగా చెల్లుబాటుగాని ఐపీడీఆర్ (ఇంటర్నెట్ ప్రొటోకాల్ డీటైల్ రికార్డ్) నివేదిక అంటూ ప్రజల కళ్లకు గంతలు కట్టేందుకు యత్నించింది. ఐపీడీఆర్ నివేదిక అంటూ సీబీఐ చెప్పడమే ఆ అఫిడవిట్ పూర్తిగా కట్టు కథ అని... అభూతకల్పనలు, నిరాధార అభియోగాలేనని నిపుణులే స్పష్టం చేస్తున్నారు. 2019 మార్చి 14 రాత్రే కాదు... అంతకు 20 రోజుల ముందు 20 రోజుల తర్వాత కూడా ఎంపీ అవినాశ్ రెడ్డి ఫోన్ ఐపీడీఆర్ డేటా అదేరీతిలో చూపిస్తోంది. అర్ధరాత్రి వేళల్లో కూడా ఆయన ఫోన్కు సంబంధించి ఐపీడీఆర్ డేటా పనిచేస్తునే ఉన్నట్టుగా వెల్లడిస్తోంది. రోజూ ఎక్కువ సేపు ఫోన్ మాట్లాడేవారి ఐపీడీఆర్ డేటా అలానే చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఫోన్కు సంబంధించి బైట్స్ అప్లోడ్, డౌన్లోడ్లకు ఆ సమయం తీసుకుంటూ ఉంటుంది. మరి సీబీఐ ఆ ముందు 20 రోజులు, తర్వాత 20 రోజులు ఐపీడీఆర్ డేటాను ఎందుకు ప్రస్తావించ లేదు? ఎందుకంటే అది చాలా సాధారణమైన విషయం కాబట్టి ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. సునీత, నర్రెడ్డి, బీటెక్ రవిల ఐపీడీఆర్ డేటా కూడా అంతే.. ఎంపీ అవినాశ్ రెడ్డి ఫోన్ ఐపీడీఆర్ డేటానే కాదు.. వివేకానందరెడ్డి కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, టీడీపీ నేత బీటెక్ రవి, ఆయన స్నేహితుడు ఎర్ర గంగిరెడ్డి ఫోన్ల ఐపీడీఆర్ డేటా కూడా అలానే చూపించింది. 2019 మార్చి 14న రాత్రి కూడా వారి ఫోన్లు పని చేస్తున్నట్టుగానే ఐపీడీఆర్ వెల్లడిస్తోంది. అంటే వివేకా హత్యకు వారు కుట్ర పన్నినట్టు భావించ వచ్చు కదా. అందులోనూ వివేకానందరెడ్డి రెండో వివాహంతో ఆ కుటుంబంలో ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. బీటెక్ రవితో రాజకీయ విభేదాలు, ఎర్ర గంగిరెడ్డితో భూవివాదాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. వారంతా సన్నిహితులు కూడా. మరి సీబీఐ అధికారులు సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, బీటెక్ రవి, ఎర్ర గంగిరెడ్డిల ఫోన్ల ఐపీడీఆర్ డేటా గురించి ఎందుకు ప్రస్తావించ లేదు? ఆ డేటా ఆధారంగా వారే వివేకా హత్య చేయించి ఉంటారని ఎందుకు భావించడం లేదు? అంటే సీబీఐ అధికారులు ఏవో అదృశ్య శక్తుల ప్రభావానికి లోనై కేసు విచారణ కంటే ముందే ఓ నిర్ణయానికి వచ్చి ఆ దిశగానే ఎంపీ అవినాశ్కి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్నది స్పష్టమైంది. ఫోన్ చేశారా.. మెసేజ్ చేశారా అన్నది కూడా నిర్ధారించలేం.. ఫోన్లో వాడిన మొబైల్ డేటాను బట్టి ఒక ఫోన్ నుంచి మరొకరికి ఫోన్ చేశారా? మెసేజ్ చేశారా అన్నది కూడా నిర్ధారించడం సాధ్యం కాదు. మొబైల్ డేటా ఆధారంగా ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు, వాట్సాప్ మెసేజ్లు, ఫేస్బుక్ డేటాను విభజించి, విశ్లేషిం చే పరిజ్ఞానం 2020 వరకు లేనే లేదు. ఇప్పటికీ సాధికారికంగా లేదు. మరి సీబీఐ ఫోన్ మొబైల్ డేటాను బట్టి ఎంపీ అవినాశ్ రెడ్డి.. వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫోన్ చేసినట్టు ఎలా నిర్ధారణకు వచ్చింది? సీబీఐ ఫోన్ నంబర్లు ఎందుకు చెప్పలేకపోయింది? 2019 మార్చి 15 తెల్లవారు జామున ఎంపీ అవినాశ్ రెడ్డి ఏ మొబైల్ నంబర్ నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంబంధించిన ఏ మొబైల్ నంబర్కు ఫోన్ చేశారో సీబీఐ ఎందుకు వెల్లడించ లేకపోయింది? ఫోన్ చేసి ఉంటే ఆ రెండు నంబర్లు చెప్పాలి కదా? ఆ నంబర్లు చెబితే వాటి కాల్ రికార్డ్ డేటా ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. అందులో పరిశీలిస్తే వాస్తవాలు వెల్లడవుతాయి. దీన్నిబట్టి ఆ రోజు తెల్లవారుజామున ఎంపీ అవినాశ్.. వైఎస్ జగన్కు ఫోన్ చేయలేదన్న వాస్తవం వెల్లడవుతుంది. అందుకే సీబీఐ ఆ ఫోన్ నంబర్లను తన అఫిడవిట్లో ప్రస్తావించలేకపోయింది. ఆధారాలు ధ్వంసం చేయాలంటే అర్ధరాత్రే చేసేవారు కదా.. వైఎస్ వివేకా హత్యా స్థలంలో సాక్ష్యాధారాలను ఉదయ్కుమార్ రెడ్డి ద్వారా ఎంపీ అవినాశ్ రెడ్డి 2019 మార్చి 15న ఉదయం 7.30 గంటల సమయంలో ధ్వంసం చేయించారంటూ సీబీఐ మరో నిరాధార అభియోగాలు మోపింది. వివేకా హత్య తర్వాత తెల్లవారు జామున 4గంటలకు ఉదయ్కుమార్ రెడ్డి.. ఎంపీ అవినాశ్రెడ్డిని కలిశారని సీబీఐ పేర్కొంది. ఐపీడీఆర్ డేటా ద్వారా ఆ విషయాన్ని నిర్ధారించామని చెప్పింది. పరస్పర విరుద్ధంగా ఉన్న ఈ రెండు అంశాలను పరిశీలిస్తే సీబీఐ అభియోగాలు పూర్తి అవాస్తవం అన్నది తేటతెల్లమవుతోంది. సీబీఐ చెప్పేదే నిజమైతే అప్పుడే ఆధారాలు ధ్వంసం చేయమని అవినాశ్ చెప్పేవారు కదా.. అసలు ఉదయ్కుమార్ రెడ్డి ఆరోజు తెల్లవారుజామున అవినాశ్ని కలవనే లేదు. తీవ్రంగా పరిగణిస్తున్న వైఎస్సార్సీపీ టీడీపీ కుట్రలో భాగస్వాములై కొందరు సీబీఐ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్సార్సీపీ తీవ్రంగా స్పందించింది. ఏమాత్రం హేతుబద్ధంగాని ఐపీడీఆర్ నివేదిక పేరిట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విషం చిమ్మేందుకు బరితెగించిన అధికారులపై.. సాంకేతికంగా ఐపీడీఆర్ హేతుబద్ధత, టెలికాం మార్గదర్శకాలు వెల్లడిస్తున్న అంశాల ఆధారంగా న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతోంది. ఐపీడీఆర్ ఎలా పనిచేస్తుందో తెలియదా? వివేకానందరెడ్డి హత్యకు ముందు, ఆ తర్వాత అవినాశ్ రెడ్డి ఫోన్ కాల్స్ ఉన్నాయంటూ సీబీఐ చేసిన అభియోగాలు పూర్తి అహేతుకం. ఫోన్ కాల్స్ ఉన్నాయంటూ ఐపీడీఆర్ డేటా పేరిట సీబీఐ ఏకంగా న్యాయస్థానాన్ని పక్కదారి పట్టించేందుకు యత్నించడం విస్మయ పరుస్తోంది. అసలు ఐపీడీఆర్ ఎలా పని చేస్తుందనే కనీస సాంకేతిక అవగాహన కూడా సీబీఐకి లేదా అనే సందేహం కలుగుతోంది. ఐపీడీఆర్ ఫోన్ బైట్స్ను నిరంతరం అప్లోడ్, డౌన్లోడ్ చేస్తూనే ఉంటుంది. ఫోన్ ఆన్లో ఉన్నంతసేపు మనం ఫోన్ మాట్లాడుతున్నా లేకపోయినా సరే అది బైట్స్ను అప్లోడ్, డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటుంది. అంటే మనం మొబైల్ యాప్లు వాడకపోయినాసరే అవి నిరంతరం పని చేస్తునే ఉంటాయి. సర్వర్ ఆ డాటాను తీసుకుంటూనే ఉంటుంది. సాధారణంగా రాత్రి వేళల్లో సర్వర్ డాటాను తీసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో ఫోన్లు వాడరు కాబట్టి, ఆ ఫోన్లకు సంబంధించిన బ్యాకప్ తీసుకుంటూ ఉంటుంది. రోజూ ఎక్కువ సేపు ఫోన్లు మాట్లాడేవారు, వాట్సాప్, ఫేస్బుక్ ఎక్కువుగా వాడేవారి ఫోన్ డాటాను అర్ధరాత్రి వేళల్లో మరింత ఎక్కువసేపు ఐపీడీఆర్ అప్లోడ్, డౌన్లోడ్ చేస్తూ ఉంటుంది. అది నిరంతరం జరిగే ప్రక్రియ. కాబట్టి డాటా బర్న్ అవుతునే ఉంటుంది. ఆ సమయంలో ఐపీడీఆర్ నివేదిక తీసుకుంటే ఫోన్లో మొబైల్ డాటా బర్న్ అవుతున్నట్టుగానే కనిపిస్తుంది. అంత మాత్రాన ఫోన్ మాట్లాడినట్టు కాదు. కాబట్టి ఐపీడీఆర్ డాటాను బట్టి ఒక ఫోన్ను ఓ నిర్ణీత సమయంలో ఉపయోగించినట్టుగాని, ఆ సమయంలో వారు ఫోన్ మాట్లాడారని చెప్పడంగానీ సాధ్యం కాదు. ఇది టెలీకమ్యూనికేషన్ల ప్రొటోకాల్ వెల్లడిస్తున్న వాస్తవం. అటువంటిది ఎంపీ అవినాశ్ రెడ్డి 2019 మార్చి 14 రాత్రి వివేకా హత్యకు ముందు.. ఆ తర్వాత కూడా ఫోన్లో మాట్లాడారని ఐపీడీఆర్ డేటా ఆధారంగా సీబీఐ చెప్పడం విడ్డూరం. 2019 మార్చి 15 తెల్లవారుజామునే వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాట్లాడారని ఐపీడీఆర్ నివేదిక ద్వారా తెలుసుకున్నామని చెప్పడం అహేతుకం. ఇది అసంబద్ధమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఐపీడీఆర్ డేటాను బట్టి ఒకరు ఆ సమయంలో ఫోన్ మాట్లాడారని చెప్పడం సాధ్యం కాదని, కేవలం సీబీఐ దురుద్దేశ పూరితంగానే ఈ విషయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును ప్రస్తావించిందన్నది స్పష్టమవుతోంది. కమిట్మెంట్కు కట్టుబడి కట్టు కథ! వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభావితం చేసేందుకు టీడీపీ మొదటి నుంచీ పన్నాగం పన్నుతూనే ఉంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయనకు వంతపాడే బీజేపీలోని టీడీపీ నేతలు, ఆ పారీ్టకి కొమ్ముకాసే పచ్చ మీడియా అందులో ప్రధాన పాత్రధారులుగా మారారన్నది సుస్పష్టం. రిటైర్ అవ్వబోతున్న కొందరు సీబీఐ అధికారులను ప్రలోభాలకు గురి చేశారన్నది సర్వత్రా బహిరంగ రహస్యంగా మారింది. ఆ ప్రకారం ఎంపీ అవినాశ్ రెడ్డిని ఎలాగైనా అరెస్టు చేయించాలన్నది ఒప్పందం. అందుకోసం టీడీపీ భారీగా నిధులు వెదజల్లినట్టు సమాచారం. అందుకే సీబీఐ ఇటీవల హఠాత్తుగా దూకుడు పెంచింది. ఎంపీ అవినాశ్ రెడ్డి దర్యాప్తునకు ఎంతగా సహకరిస్తున్నాసరే ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికి ఆయన ఏడుసార్లు సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. అయినా సరే ఆయన విచారణకు సహకరించడం లేదంటూ సీబీఐ అధికారులు అసంబద్ధ అభియోగాలు చేస్తూ న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు యతి్నస్తున్నారు. గత మూడు రోజుల్లో ఎలాగైనా సరే ఎంపీ అవినాశ్ను అరెస్టు చేయాలని కొందరు సీబీఐ ఉన్నతాధికారులు ప్రయతి్నంచారు. అందుకు తగ్గట్టుగానే టీడీపీ అనుకూల పచ్చ మీడియా చానళ్లు రోజుల తరబడి టీవీలలో చర్చలు నిర్వహిస్తూ వస్తున్నాయి. కానీ ఎంపీ అవినాశ్రెడ్డిని అరెస్టు చేయలేమని ఓ ఉన్నతాధికారి గుర్తించారు. కానీ టీడీపీతో కుదుర్చుకున్న కమిట్మెంట్కు న్యాయం చేసేందుకు ఆయన కొత్తకుట్రకు తెరతీశారు. ‘మీరు ఉండగా ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయలేకపోతే... కమిట్మెంట్కు లోబడి మరొకటి చేయండి’ అని టీడీపీ పెద్దల నుంచి ఆయనకు సందేశం అందినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వివేకా మృతి గురించి ఎంపీ అవినాశ్ రెడ్డికి.. ఆయన ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలిసి ఉంటుందని సీబీఐ తన అఫిడవిట్లో పేర్కొంది. ఒప్పందంలో భాగంగా రాజధానిలో పేదలకు ప్రభుత్వ ఇళ్ల స్థలాల పంపిణీ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు, టీడీపీ మహానాడులో ప్రభుత్వంపై విషం చిమ్మేందుకు ఓ అంశాన్ని అందించేందుకే సీబీఐ అధికారి ఇంతటి దుర్మార్గానికి పాల్పడినట్టు స్పష్టమవుతోంది. దీనిని వైఎస్సార్సీపీ తీవ్రంగా పరిగణిస్తూ న్యాయపరమైన చర్యలకు ఉపక్రమిస్తోంది. అది హత్య అని డాక్టరైన సునీతకు తొలుత తెలీదా? స్వయంగా డాక్టర్ అయిన సునీత వివేకానందరెడ్డి మృతదేహం ఫొటోలతో న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించడం విస్మయ పరుస్తోంది. ఆమె తరఫు న్యాయవాదులు వివేకానందరెడ్డి మృతదేహం ఫొటోలను న్యాయస్థానానికి చూపిస్తూ వాటిని చూస్తే ఎవరికైనా అది హత్య అని తెలుస్తుంది కదా.. అని చెప్పుకొచ్చారు. కానీ వాస్తవం ఏమిటంటే.. వివేకానందరెడ్డి మృతదేహాన్ని ఆయన టైపిస్ట్ ఇనయతుల్లా ఫొటోలు తీశారు. ఆ ఫొటోలను పీఏ కృష్ణారెడ్డి.. సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డిలకు పంపారు. ఆ ఫొటోలు చూసిన తర్వాత కూడా వారు అది హత్య అని చెప్పనే లేదు. పైగా తాము వచ్చే వరకు వివేకా రాసిన లేఖ, ఆయన సెల్ఫోన్ దాచిపెట్టమని చెప్పారు. మరి డాక్టర్ అయిన సునీత తన తండ్రి మృతదేహం ఫొటోలను చూసి అది హత్యేనని వెంటనే ఎందుకు చెప్పలేదు? సునీత తరఫు న్యాయవాదులు న్యాయస్థానానికి శుక్రవారం చూపిన ఫొటోలు మృతదేహం పోస్టుమార్టం టేబుల్పై ఉన్నప్పటి ఫొటోలు. ఆ ఫొటోలను టీడీపీ బాగా రిజల్యూషన్ పెంచి ఒక బుక్లెట్లో ప్రచురించింది. ఈ ఫొటోలు చూపుతూ.. ఎవరికైనా అది హత్య అని తెలీదా అని ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. అవినాశ్ రెడ్డి వెళ్లేసరికి వివేకా మృతదేహం బాత్రూమ్లో కమోడ్ వద్ద గోడకు చేరబడి ఉంది. ఆ కోణంలో గాయాలు ఏవీ కనిపించనే లేదు. ఆయన వెంటనే బయటకు వచ్చేశారు. వివేకా మృతి విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పేందుకు ఫోన్లు చేశారు. అవినాశ్ ఫోన్ చేసింది 2019 మార్చి 15 ఉదయం 6.30కే.. వైఎస్ వివేకానందరెడ్డి మృతి చెందారనే విషయాన్ని చెప్పేందుకు ఎంపీ అవినాశ్ రెడ్డి 2019 మార్చి 15న ఉదయం 6.30 గంటలకే తొలిసారిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి సహాయకుడి నంబరుకు ఫోన్ చేసి చెప్పారు. ఆ కాల్ రికార్డులు ఉన్నాయి కూడా. ఆ రోజు ఉదయం 6.10 గంటలకి పీఏ కృష్ణారెడ్డి తొలిసారిగా వివేకానందరెడ్డి మరణించారన్న విషయాన్ని గుర్తించారు. ఆ వెంటనే ఆయన భార్య సౌభాగ్యమ్మ, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డిలకు ఫోన్ చేసి సమాచారం తెలిపారు. అనంతరం నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డి ఉదయం 6.20 గంటల సమయంలో ఎంపీ అవినాశ్ రెడ్డికి ఫోన్ చేసి వివేకానందరెడ్డి మృతి చెందారనే విషయాన్ని చెప్పారు. వెంటనే వివేకా నివాసానికి వెళ్లిన అవినాశ్ రెడ్డి ఆయన మృతదేహాన్ని చూసి వెంటనే బయటకు వచ్చారు. ఆ తర్వాత 6.30 గంటల సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సహాయకుడి ఫోన్కు కాల్ చేసి వివేకా మృతి చెందిన విషయాన్ని తెలిపారు. అంటే వివేకా మృతి చెందారనే విషయం ఆయన కుటుంబ సభ్యులకు తెలిసిన తర్వాతే ఎంపీ అవినాశ్ రెడ్డికి.. ఆ తర్వాతే ఎంపీ ద్వారా వైఎస్జగన్మోహన్రెడ్డికి తెలిసింది. ఈ విషయాన్ని పీఏ కృష్ణారెడ్డి, అవినాశ్ రెడ్డి కాల్ రికార్డులు వెల్లడిస్తున్నాయి. వాస్తవం ఇలా ఉంటే.. వివేకా మృతి చెందిన విషయం పీఏ కృష్ణారెడ్డి కంటే ముందే వైఎస్ అవినాశ్రెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డిలకు తెలుసంటూ సీబీఐ అభూతకల్పనలు సృష్టించి దు్రష్పచారానికి పాల్పడటం వెనుక టీడీపీ ప్రలోభాలు, కుట్ర ఉన్నాయన్నది స్పష్టమవుతోంది. -
మెరుగుపడిన ఆరోగ్యం..‘విశ్వభారతి’ నుంచి శ్రీలక్షి డిశ్చార్జి
సాక్షి ప్రతినిధి కర్నూలు : ఎంపీ అవినాశ్రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యం మెరుగుపడటంతో ఆమెను విశ్వభారతి ఆస్పత్రి నుంచి శుక్రవారం ఉదయం డిశ్చార్జ్ చేశారు. తదుపరి చికిత్స కోసం ఆమెను హైదరాబాద్కు తరలించారు. తల్లి వెంట అవినాశ్ కూడా హైదరాబాద్కు వెళ్లారు. ఆయనతో పాటు పలు వురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ఆస్పత్రి నుంచి అవినాశ్ బయటకు రాగానే వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు కలిసి ఆయనకు ధైర్యం చెప్పారు. మరోవైపు.. డిశ్చార్జ్ అయ్యే రోజు కూడా ఎల్లో మీడియా శుక్రవారం ఉదయం నుంచి అవినాశ్ లక్ష్యంగా తప్పుడు కథనాలే ప్రసారం చేసింది. శ్రీలక్ష్మి డిశ్చార్జ్ కాగానే సీబీఐ అధికారులు అవినాశ్ను అరెస్టుచేస్తారని బ్రేకింగ్లు, డిబేట్లు నిర్వహించింది. వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీలక్ష్మిపై, ఆమె బాగోగులు చూసుకుంటున్న అవినాశ్పై కనీస మానవత్వం లేకుండా చికిత్సపై, అవినాశ్ అరెస్టుపై ఇష్టారాజ్యంగా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తూనే ఉంది. ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన అవినాశ్ అక్కడ కార్యకర్తలు, మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘అమ్మ ఆరోగ్యం బాగుంది. గుండెలో రక్తనాళాలు బ్లాక్ కావడంతో తదుపరి చికిత్స కోసం హైదరాబాద్కు తీసుకెళ్తున్నాం. అమ్మను పరామర్శించేందుకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మీడియాకు ఏదైనా ఇబ్బందులు జరిగి ఉంటే మనసులో పెట్టుకోవద్దు’.. అని ఆయన చెప్పారు. చేరిక నుంచి డిశ్చార్జ్ వరకూ తప్పుడు కథనాలే! అనారోగ్యంతో పులివెందుల ఆస్పత్రిలో చేరిన శ్రీలక్ష్మిని చూసేందుకు ఈ నెల 19న హైదరాబాద్ నుంచి అవినాశ్ పులివెందులకు బయల్దేరారు. పుల్లూరు టోల్గేట్ వద్ద సీబీఐ అధికారులు ఉన్నారని, అవినాశ్ను అరెస్టుచేయబోతున్నారని ‘పచ్చ’ చానళ్లు తప్పుడు కథనాలు ప్రసారం చేశాయి. నిజానికి ఆ రోజు సీబీఐ అధికారులే రాలేదు. 20న కూడా సీబీఐ అధికారులు అరెస్టు చేయబోతున్నారని ప్రచారం చేశారు. 22న సీబీఐ అధికారులు ఎస్పీని కలిశారని.. ఇక్కడి పోలీసుల సహకారం లేకపోవడంతో మధ్యాహ్నానికి కేంద్ర బలగాలు రానున్నాయని, కాసేపట్లో కర్నూలుకు చేరుకుంటాయని, అవినాశ్ అరెస్టు తప్పదని రోజంతా ఏబీఎన్, టీవీ5లో గంటల తరబడి డిబేట్లు నడిపించారు. కానీ, కేంద్ర బలగాలు కర్నూలుకు రాలేదు. అవినాశ్ ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులూ ‘ఈరోజు అరెస్టు తప్పదు’ అనే కోణంలోనే ప్రసారం చేశారు. చివరకు శ్రీలక్ష్మి శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని విశ్వభారతి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. దీంతో సీబీఐ అధికారులు కర్నూలులో రహస్య ప్రాంతాల్లో ఉన్నారని, డిశ్చార్జ్ కాగానే అరెస్టుచేస్తారని కథనాలు ప్రసారం చేశారు. ఇలా వారం రోజులుగా ఎల్లో మీడియా చెప్పిన ఏ ఒక్కటి జరగలేదు. ఒక్క వార్తలోనూ వాస్తవంలేదు. దీంతో ఎల్లో మీడియా అవినాశ్ లక్ష్యంగా ఎలాంటి తప్పుడు వార్తలు రాసిందో ప్రజలకు స్పష్టమైంది. శ్రీలక్ష్మి ఆరోగ్యంపైనా తప్పుడు వార్తలే.. పులివెందులలో శ్రీలక్ష్మి ఇంట్లో బీపీ వచ్చి పడిపోవడంతో ఉన్నత వైద్యం కోసం ఆమెను హైదరాబాద్కు తరలించారు. మార్గమధ్యంలో ఆందోళనకరంగా ఉండటంతో కర్నూలులో విశ్వభారతి సూపర్స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్చారు. కార్డియాక్ ఎంజైమ్లో మార్పులు వచ్చాయని, ఈసీజీ తీశామని, రెండు రక్తనాళాలు కూడా బ్లాక్ అయ్యాయని డాక్టర్ హితేశ్రెడ్డి మీడియాకు చెప్పారు. కానీ, శ్రీలక్ష్మి ఆరోగ్యం బాగానే ఉందని, సీబీఐ నుంచి తప్పించుకునేందుకు అవినాశ్ తల్లిని పావుగా చేసుకున్నారనే కోణంలో కనీస మానవత్వం లేకుండా తప్పుడు వార్తలు ప్రసారం చేశారు. టీడీపీ వ్యక్తులు, మద్దతుదారులతో డిబేట్లు నడిపించారు. చివరకు.. ఆవిడకు బీపీ ఎక్కువై అయానోట్రోపిక్ సపోర్ట్తో ఉన్నారని వైద్యులు చెప్పినా తప్పుడు వార్తలకు ఫుల్స్టాప్ పెట్టలేదు. బుధవారం రాత్రి నుంచి శ్రీలక్ష్మి ఆరోగ్యం మెరుగవుతూ రావడంతో శుక్రవారం డిశ్చార్జ్ చేశారు. రెండు రక్తనాశాలు బ్లాక్ కావడంతో చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. దీంతో పచ్చ చానళ్ల ప్రసారాల్లో ఏమాత్రం నిజంలేదని అందరికీ తేటతెల్లమైంది. -
అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ
-
లక్ష్మమ్మ ఆరోగ్యం నిలకడగా ఉంది: వైద్యులు
-
అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై TS హైకోర్టులో విచారణ
హైదరాబాద్: కడప ఎంపీ అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ జస్టిస్ లక్ష్మణ్ ముందు ఇరు పక్షాలు తమ వాదనలు వినిపించాయి. హంతకులకు, వివేకాకు వ్యక్తిగత విభేదాలున్నాయి వివేకా హత్యకు సంబంధించి అవినాష్ రెడ్డిని ఇరికించేలా కుట్ర జరుగుతోందని ఆయన తరపు న్యాయవాది ఉమామహేశ్వరరావు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో మొదటి నిందితుడిగా ఉన్న A1 గంగిరెడ్డికి వివేకాతో భూవివాదాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. అలాగే నిందితుల్లో మరో ఇద్దరు సునీల్ యాదవ్, ఉమాశంకర్ లతో వివేకాకు విభేదాలు తలెత్తాయని, వజ్రాల వ్యాపారం చేస్తామంటూ వాళ్లిద్దరూ వివేకాను మోసగించడంతో సంబంధాలు చెడిపోయాయని తెలిపారు. అలాగే తమ కుటుంబ మహిళల విషయంలోనూ వివేకానందరెడ్డి తలదూర్చడంతో వారిద్దరికి వివేకాపై కోపం ఉందని తెలిపారు. ఇప్పటివరకు నిందితుడని ఎక్కడా చెప్పలేదు వివేకా హత్యకు సంబంధించి అవినాష్ రెడ్డిని సిబిఐ ఇప్పటివరకు ఎక్కడా నిందితుడని చెప్పలేదని లాయర్ ఉమా మహేశ్వరరావు తెలిపారు. అవినాష్ రెడ్డి గుండెపోటు అన్నారని చెబుతున్నారు, కానీ అవినాష్ రెడ్డి డాక్టరో, పోలీసు అధికారో కాదు కదా. CBI వేసిన రెండు ఛార్జ్ షీట్లలో అవినాష్ రెడ్డిని నిందితుడని పేర్కొనలేదు. రెండు ఛార్జ్ షీట్లు వేసేవరకు కనీసం విచారణ కూడా జరపలేదు. అనుబంధ ఛార్జ్ షీట్ వేసిన ఏడాది తర్వాత 160 కింద నోటీసులు ఇచ్చారు. ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగానే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. విచారణకు పిలిచిన ఏడు సార్లు హాజరయ్యారు. విచారణకు సహకరించడం అంటే CBI వాళ్లు రాసిచ్చింది చెప్పడమా? అసలు ఇప్పటివరకు జరిగిన విచారణకు సంబంధించిన ఆడియో, వీడియోలను హైకోర్టు ముందుంచాలని ఉమా మహేశ్వరరావు కోరారు. తల్లి అస్వస్థత వల్లే విచారణకు రాలేకపోయారు అవినాష్ రెడ్డి విచారణ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన తల్లి లక్ష్మమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తల్లి బాగోగులు చూసుకునేందుకు అవినాష్ హుటాహుటిన వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. దీనికి సంబంధించి లిఖితపూర్వకంగా CBI అధికారులకు సమాచారం అందించారు. చికిత్స కోసం కర్నూలు తరలించి బాగయ్యేవరకు అక్కడే ఉన్నారు. మరింత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని AIG ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ విషయం కూడా ఎప్పటికప్పుడు CBI డైరెక్టర్ కు లేఖ ద్వారా సమాచారం అందించారు. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడెందుకు CBI అరెస్ట్ అంటూ ఒత్తిడి తెస్తోంది? అంటూ ఉమా మహేశ్వరరావు ప్రశ్నించారు. రాజకీయ కారణాలు.. కుట్రకు అస్త్రాలు తన వద్ద డ్రైవర్ గా ఉన్న దస్తగిరిని తొలగించి వివేకా.. కొత్త డ్రైవర్ గా ప్రసాద్ ను పెట్టుకున్నాడని తెలిపారు. వివేకా హత్యకు రాజకీయ కారణాలేమీ లేవని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక నేతలు సహకరించకే ఓడిపోయారని సాక్షులు వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు. నిందితుడు దస్తగిరి తీసుకున్న రూ.కోటిలో రూ.46.70 లక్షలే రికవరీ అయ్యాయని, మిగతా సొమ్ము ఏమైందో సీబీఐ చెప్పడం లేదని కోర్టుకు విన్నవించారు. కేవలం ఎంపీ టికెట్ కు పోటీ ఉన్నాడంటూ అవినాష్ రెడ్డిని అనుమానించడం సరికాదన్నారు అవినాష్ లాయర్ ఉమా మహేశ్వరరావు. FIR సెక్షన్లలో ఇంత తేడాలెందుకు? సీబీఐ నమోదు చేసిన FIRలో 201 సెక్షన్ లేదని, మొదట లోకల్ పోలీసులు 174 కింద FIR చేశారన్నారు అవినాష్ తరఫు న్యాయవాది. సీబీఐ ఒక కేసు నమోదు చేసే ముందు పాత FIR రిజస్టర్ చేయాలని, కానీ సీబీఐ FIRలో ఎక్కడా 174 సెక్షన్ లేదని కోర్టుకు తెలిపారు. ఎఫ్ఐఆర్ లో IPC 302 మాత్రమే నమోదు చేశారని, 201 సెక్షన్ లేదని కోర్టుకు తెలిపారు అవినాష్ తరపు న్యాయవాది. దస్తగిరి విషయంలో లోపాయికారి ఒప్పందాలెందుకు? హత్య చేసిన దస్తగిరిని సీబీఐ వెనకేసుకొస్తోందని, దస్తగిరి ముందస్తు బెయిల్ ను కూడా సీబీఐ వ్యతిరేకించలేదని కోర్టుకు తెలిపారు అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది. గంగిరెడ్డి ఢీఫాల్ట్ బెయిల్ పై ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లిన సునీత.. A1గా ఉన్న దస్తగిరి బయట తిరుగుతుంటే మాత్రం స్పందించట్లేదని తెలిపారు. ప్రత్యక్ష సాక్షి రంగన్న స్టేట్ మెంట్ ఎందుకు తీసుకోలేదు? ప్రత్యక్ష సాక్షి రంగన్న స్టేట్ మెంట్ రికార్డు అంశంపై 15 నిమిషాలకు పైగా జరిగిన వాద ప్రతివాదనలు జరిగాయి. 2020 జులై 9న సీబీఐ FIR నమోదు చేసి 2021 జులై 21న రంగన్నను విచారించిందని, రంగన్న స్టేట్మెంట్ రికార్డు చేసి సంవత్సరం పాటు వదిలేశారని తెలిపారు. రంగన్న తన స్టేట్మెంట్ లో స్పష్టంగా నలుగురి వివరాలు చెప్పాడని, అయినా సీబీఐ మాత్రం నెల రోజుల పాటు దస్తగిరిని కనీసం విచారణకు పిలువలేదని, ఒక్కసారి కూడా అరెస్ట్ చేయలేదని తెలిపారు. ఈ క్రమంలోనే దీనిపై స్పందించిన హైకోర్టు.. సీబీఐకి పలు ప్రశ్నలు సంధించింది. హైకోర్టు ప్రశ్న: వివేకా హత్య సాక్ష్యాలను చెరిపేస్తున్న సమయంలో పోలీసులు అక్కడే ఉన్నారని చెబుతున్నారు, వారిపై సీబీఐ ఏమైనా చర్యలు తీసుకుందా? సీబీఐ జవాబు : ఇంకా దర్యాప్తు చేస్తున్నాం హైకోర్టు ప్రశ్న: కీలక సాక్షి వాచ్మెన్ రంగన్న స్టేట్మెంట్ రికార్డ్ చేశారా? : హైకోర్టు సీబీఐ జవాబు : లోకల్ పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు...మేం చేయలేదు హైకోర్టు : రంగన్న స్టేట్మెంట్ కాపీని కోర్టుకు సమర్పించండి హైకోర్టు ప్రశ్న: మున్నా వద్ద డబ్బు ఎప్పుడు రికవరీ చేశారు?....మున్నా స్టేట్మెంట్ రికార్డ్ చేశారా? సీబీఐ జవాబు : మున్నా లాకర్ నుంచి రూ.46 లక్షల డబ్బు రికవరీ చేశాం, మున్నా స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు హైకోర్టు ప్రశ్న: దస్తగిరికి ఎప్పుడు బెయిల్ వచ్చింది? అవినాష్ రెడ్డి తరపు లాయర్ : దస్తగిరి స్టేట్మెంట్లను సీబీఐ రికార్డ్ చేస్తూనే ఉంది, నెలన్నర రోజులు దస్తగిరి సీబీఐ కస్టడీలో ఉన్న తర్వాత అప్రూవర్ అంటూ ప్రకటించారు. అప్రూవర్ గా మారిన తర్వాత దస్తగిరికి ముందస్తు బెయిల్ కు సీబీఐ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు, దస్తగిరికి బెయిల్ వచ్చిన 4 రోజులకే సీబీఐ ఛార్జ్షీట్ వేసింది. హైకోర్టు ప్రశ్న: దస్తగిరి స్టేట్మెంట్ లో అవినాష్ పేరు ఎక్కడైనా చెప్పాడా? అవినాష్ రెడ్డి తరపు లాయర్ : దస్తగిరి దగ్గర 3 సార్లు 161 కింద సీబీఐ స్టేట్మెంట్ తీసుకుంది. మొదటి స్టేట్మెంట్ లో ఎక్కడా అవినాష్ గురించి చెప్పలేదు. చివరి స్టేట్మెంట్ లో మాత్రం అవినాష్ పేరును చేర్చారు. అది కూడా అవినాష్ మన వెనకాల ఉన్నాడని గంగిరెడ్డి తనతో చెప్పాడని దస్తగరి స్టేట్ మెంట్ ఇచ్చినట్టు CBI చెబుతోంది. హైకోర్టు : వివేకా హత్య కేసుకు సంబంధించి ఈరోజు సునీత తరపు లాయర్ వాదనలు వింటాం, రేపు సిబిఐ వాదనలు వింటాం సునీత తరపు లాయర్ : అవినాష్ న్యాయవాది కి ఎంత సమయం ఇచ్చారో మాకు అంతే సమయం ఇవ్వాలి (మధ్యలో కలుగజేసుకున్న సునీతా రెడ్డి తరపు లాయర్ రవి చంద్ పై హైకోర్టు బెంచ్ అసహనం) హైకోర్టు : ఎవరి లిమిట్స్ లో వారుండాలి సునీతా రెడ్డి తరపు లాయర్ రవి చంద్ వాదనలకు అనుమతిచ్చింది హైకోర్టు. CBI వాదనలు శనివారం వింటామని తెలిపింది. సునీత తరపు లాయర్ రవి చంద్ : అవినాష్ రెడ్డి నోటీసులు ఇచినప్పుడల్లా ఏదో ఒకటి చెబుతున్నారు, మొదట పార్లమెంటు సమావేశాలు ఉన్నందున విచారణకు రాలేనన్నారు. రెండో నోటీసుకు హైకోర్టులో పిటిషన్ వేశారు, ఇప్పుడు మిగతా నిందితులను అరెస్టు చేసినప్పుడు తననెందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు తల్లి అనారోగ్యం అంటున్నారు. విశ్వ భారతి హాస్పిటల్ లోకి ఎవరినీ వెళ్లనివ్వకుండ హాస్పిటల్ ముందు అవినాష్ అనుచరులు అడ్డుకున్నారు. సునీత తరపు లాయర్ వాదనలు ముగియడంతో విచారణను ముగించారు. శనివారం CBI తరపు వాదనలు విననుంది హైకోర్టు. -
ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ హెల్త్ బులిటెన్ విడుదల
-
ఎంపీ అవినాష్రెడ్డి తల్లి లక్ష్మమ్మ హెల్త్ బులిటెన్ విడుదల
సాక్షి, కర్నూలు: ఎంపీ అవినాష్రెడ్డి తల్లి లక్ష్మమ్మ హెల్త్ బులిటెన్ను విశ్వభారతి ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో లక్ష్మమ్మకు చికిత్స అందిస్తున్నారు. లక్ష్మమ్మ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆమెకు సీసీయూలో చికిత్స కొనసాగుతుందన్నారు. అల్ట్రా స్కాన్లో పరీక్షలో పురోగతి కనిపించింది. లక్ష్మమ్మను సాధారణ రూమ్కు షిఫ్ట్ చేస్తామని వైద్యులు వెల్లడించారు. కాగా, పులివెందుల భాకరాపురంలోని తమ నివాసంలో ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి మాతృమూర్తి లక్ష్మమ్మ ఛాతీలో నొప్పి రావడంతో సొమ్మసిల్లి పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో స్థానికంగా ఉన్న దినేశ్ నర్సింగ్ హోంలో చేర్పించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో ప్రత్యేక అంబులెన్స్లో బయలుదేరగా పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చేర్పించారు. కార్డియాక్ నిపుణుడు హితేశ్రెడ్డి, జనరల్ ఫిజీషియన్ రవికళాధర్రెడ్డి పర్యవేక్షణలో లక్ష్మమ్మకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. చదవండి: ఓవరాక్షన్ సరే!.. అప్పుడేమైంది గురివింద బాబు? -
సునీత వెనుక కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి: విమలమ్మ
-
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశం
-
ఆందోళనకరంగానే అవినాశ్రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యం!
సాక్షి ప్రతినిధి కర్నూలు: ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి మాతృమూర్తి శ్రీలక్ష్మి ఆరోగ్యం విషమంగానే ఉంది. కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రి వైద్యుల బృందం క్రిటికల్ కేర్ యూనిట్(సీసీయూ)లో ఆమె ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. ఎంపీ అవినాశ్ నిరంతరం అక్కడే ఉంటూ తల్లి బాగోగులు ఎప్పటికప్పుడు స్వయంగా చూసుకుంటున్నారు. వారిని పరామర్శించేందుకు రాయలసీమ జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆస్పత్రికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎంపీ అవినాశ్ను సీబీఐ అరెస్టు చేస్తోందంటూ తప్పుడు వార్తలకు తెర తీసిన ఎల్లో మీడియా తన విష ప్రచారాన్ని కొనసాగిస్తోంది. శ్రీలక్ష్మి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు బులెటిన్ విడుదల చేయడం, ఓ వర్గం మీడియా తప్పుడు వార్తల నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రి ఎదుట రోడ్డుపైనే సోమవారం రాత్రంతా గడిపారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీగా బలగాలను తరలించారు. సీబీఐ అధికారులు ఆస్పత్రిలోకి వెళ్లారంటూ.. పోలీస్ గెస్ట్హౌస్లో ఉంటున్న సీబీఐ అధికారులు అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయానికి మాత్రమే వెళ్లారు. అయితే ఎల్లో మీడియా మాత్రం సీబీఐ అధికారులు విశ్వభారతి ఆస్పత్రిలోకి వెళ్లారని, అక్కడ పరిస్థితి, శ్రీలక్ష్మి ఆరోగ్యం గురించి వాకబు చేశారని దుష్ప్రచారం చేస్తూ డిబేట్లు నిర్వహించింది. విశ్వభారతి ప్రాంగణం, గాయత్రి ఎస్టేట్లో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెదరగొట్టి ఉద్రిక్తతకు దారితీసేలా కథనాలు ప్రసారం చేసింది. రోప్ పార్టీ పోలీసులు భోజనం చేసేందుకు వెళుతుంటే వైఎస్సార్సీపీ కార్యకర్తలు వారిపై ఆందోళనకు దిగినట్లు ఎల్లో మీడియా తప్పుడు వార్తలకు తెగబడింది. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం మంగళవారం సాయంత్రం వరకూ అంతా ప్రశాంతంగా ఉండటంతో ఇక రాత్రికి అవినాశ్ను అరెస్టు చేసే అవకాశం ఉందంటూ మళ్లీ ప్రచారానికి తెరతీసింది. శాంతియుతంగా నిరసన.. శ్రీలక్ష్మి, అవినాశ్ను పరామర్శించేందుకు ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్రెడ్డి, సుధీర్రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రమేశ్, మేయర్లు సురేశ్బాబు, బీవై రామయ్య కడప, కర్నూలు కార్పొరేషన్ల కార్పొరేటర్లు ఆస్పత్రి వద్దకు వచ్చారు. ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్రెడ్డి, హఫీజ్ఖాన్, సుధాకర్, ఆర్థర్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి నాలుగు రోజులుగా రాత్రింబవళ్లు ఆస్పత్రి వద్దే ఉంటున్నారు. ఎల్లో మీడియా దుష్ప్రచారాలను నిరసిస్తూ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు మంగళవారం రాత్రి 7 గంటలకు ఆస్పత్రి ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపారు. తన తల్లి ఆరోగ్యం కుదుట పడగానే 27 తర్వాత తానే స్వయంగా వస్తానని ఎంపీ అవినాశ్రెడ్డి ప్రకటించారని, మానవత్వంతో వ్యవహరించాలని సీబీఐ అధికారులకు సూచించారు. -
అనారోగ్యంపై విష కథనాలా?
సాక్షి,అమరావతి: ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి విచారణపై ఎల్లో మీడియా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) మండిపడ్డారు. గుండె జబ్బుతో విషమ పరిస్థితుల్లో ఆస్పత్రిలో ఉన్న తల్లిని జాగ్రత్తగా చూసుకునేందుకు ఆయన వెళ్లడం పారిపోవడమా? అని నిలదీశారు. పదేపదే అసత్యాలు ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అవినాష్ అరెస్టుకు రాష్ట్ర పోలీసులు సహకరించడం లేదని, కేంద్ర బలగాలను తరలిస్తున్నారని, హెలికాప్టర్లు కూడా రప్పిస్తున్నారంటూ పిచ్చి ప్రచారాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు రాష్ట్రంలోకి సీబీఐని అడుగు పెట్టనివ్వబోనని చంద్రబాబు జీవో తీసుకొస్తే వంత పాడిన ఎల్లో మీడియా ఇప్పుడు అవినాష్ను సీబీఐ అరెస్టు చేసి అర్జంటుగా విచారించాలంటూ రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. పేర్ని నాని మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జీవో 176లో ఏముందంటే.. చంద్రబాబు అధికారంలో ఉండగా రాధాకృష్ణ, రామోజీ సలహా మేరకు ప్రధాని మోదీతో గొడవ పెట్టుకున్నారు. దీంతో తమ పాపాలన్నీ వెలికి తీసి పాత కేసులను తిరగ తోడతారన్న భయంతో రాష్ట్రంలో సీబీఐని నిషేధిస్తూ 2018 నవంబరు 8న ఏకంగా జీవో 176 జారీ చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రాష్ట్రంలో కూడా పని చేయవచ్చంటూ అంతకు ముందు ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను ఉపసంహరిస్తూ చంద్రబాబు ఆ జీవో ఇచ్చారు. రాష్ట్రంలో ఏ కేసునూ సీబీఐ దర్యాప్తు చేయకూడదని, ఏ కేసులోనూ ఎవరినీ విచారించవద్దని, అదుపులోకి తీసుకోవద్దని, అరెస్టు చేయకూడదంటూ ఆ జీవోలో పేర్కొన్నారు. దీనికి ఎల్లో మీడియా ప్రజలకు ఏం సమాధానం చెబుతుంది? బాబు బతుకంతా స్టేలే కదా? చంద్రబాబుపై నమోదైన కేసుల్లో ఒక్కదానిపై అయినా విచారణ జరిగిందా? ప్రతి కేసులోనూ ఆయన స్టే లేదా బెయిల్ పొందుతూ రాజకీయాలు చేస్తున్నారు కదా? గతి తప్పిన ఎల్లో మీడియా సీఎం జగన్పై విషం చిమ్ముతూ తమకు అనుకూలమైన వారితో చర్చలు పెట్టడం నిత్యకృత్యంగా మారింది. టీడీపీ, ఎల్లో మీడియా వికృత విన్యాసాలను ప్రజలంతా గమనిసూ్తనే ఉన్నారు. నిజంగా ఏ తప్పూ చేయకుంటే చంద్రబాబు, రామోజీరావు కోర్టులకు వెళ్లి స్టేలు, బెయిళ్లు ఎందుకు తెచ్చుకున్నారు? అభియోగాలు నమోదైన ప్రతిసారీ వారు కోర్టులను ఆశ్రయించడం, స్టే లేదా బెయిల్ బెయిల్ తెచ్చుకోవడం అందరికీ తెలిసిన విషయమే కదా? వారికే ఆ హక్కులుంటాయా? ఏనాడైనా నిజాల్ని నిరూపించుకునేందుకు సిద్ధం, విచారణకు వస్తానని చంద్రబాబు చెప్పారా? రామోజీ డ్రామాలు సీఐడీ విచారణ కోసం వెళ్తే నడుముకు బెల్టుతో, పక్కన వెంటిలేటర్ పెట్టుకుని బెడ్పై పడుకున్న రామోజీరావు ఎంత డ్రామా చేశారో అందరూ చూశారు. కోర్టులకు వెళ్లడం, స్టేలు, బెయిళ్లు తెచ్చుకునే హక్కులు చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణకు మాత్రమే ఉంటాయా? ఎల్లో మీడియాకి కనీసం మానవత్వం అనేది ఉందా? నిధులు తెచ్చినా ఏడుపేనా? రాష్ట్ర విభజన సమయంలో 2014 –15 రెవెన్యూ లోటు గ్రాంటు కింద చంద్రబాబు తేవాల్సిన డబ్బును తీసుకురాలేక విఫలమైతే ఇప్పడు సీఎం జగన్ కేంద్రంతో మాట్లాడి రూ.10,461 కోట్లు సాధించారు. దాన్ని జీర్ణించుకోలేక నిధుల వరద అంటూ కథనాలు ప్రచురించారు. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి ఎల్లో మీడియా, చంద్రబాబు అభాండాలు వేశారు. ఇప్పుడు నిధులు సాధించినా ఏడుపేనా? పాజిటివ్గా ఎందుకు రాయడం లేదు? మచిలీపట్నంలో సీఎం జగన్ సభ బ్రహ్మాండంగా జరిగితే దానిపైనా తప్పుడు రాతలు రాశారు. నాడు వ్యతిరేకించి నేడు స్వాగతం చంద్రబాబు ఆస్థాన సలహాదారులైన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, రాజకీయ ఆక్టోపస్ రామోజీరావు అంతా కలిసి గూడుపుఠాణి చేసి నాడు సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా చేశారు. సీబీఐకి ఎర్రజెండా అంటూ ఈనాడులో వార్తలు ప్రచురించగా, రాష్ట్రంలో సీబీఐకి ప్రవేశం లేదంటూ రాధాకృష్ణ రాసుకొచ్చారు. సీబీఐకి అవకాశం కల్పిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై కూడా ఏసీబీతో సోదాలు చేసే అవకాశం ఉందని, అందుకే చంద్రబాబు సర్కారు సంచలన నిర్ణయం తీసుకుందంటూ సమర్థించారు. ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వివేకా హత్యకు సంబంధించి ఎంపీ అవినాష్పై విషపురాతలు రాస్తూ, అసత్యాలు ప్రచారం చేస్తూ సీబీఐని స్వాగతిస్తూ బ్రహ్మరథం పడుతూ అత్యవసరంగా విచారించాలంటున్నారు. -
దృష్టి మళ్లించేందుకే దుష్ప్రచారం
సాక్షి, అమరావతి: రాష్ట్ర అభివృద్ధికి తలమానికంగా నిలిచే మచిలీపట్నం పోర్టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేసిన నేపథ్యంలో జనరంజక పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఎంపీ అవినాశ్రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తోందంటూ ఎల్లో మీడియా దుష్ఫ్రచారాలకు తెగబడుతోందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఎంపీ అవినాశ్రెడ్డి ఇప్పటికే ఆరేడు సార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారని, విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని గుర్తు చేశారు. ఆయన మాతృమూర్తి ఆరోగ్యం విషమంగా ఉండటం, తండ్రి జైల్లో ఉన్నందున తల్లిని చూసుకునేందుకు సమయం కావాలని కోరుతూ సీబీఐకి లేఖ రాశారన్నారు. అవినాశ్ను అరెస్టు చేసేందుకు సీఐబీ అధికారులు కర్నూలుకు చేరుకున్నారని, ఎస్పీతో చర్చించారని, సీబీఐకి సహకరించడం లేదంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 దుష్ప్రచారం చేశాయని మండిపడ్డారు. కర్నూలు ఎస్పీ సహకరించలేదని సీబీఐ అధికారులు ఎవరైనా చెప్పారా? అని నిలదీశారు. ఒకవైపు కర్నూలుకు కేంద్ర బలగాలు దిగుతున్నాయంటూ ప్రచారం చేస్తూ మరోవైపు ప్రభుత్వం నిరోధించిందంటూ బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకూ ఈటీవీ, ఏబీఎన్, టీవీ 5 ఛానళ్లు ఇదే అంశంపై ఇష్టారీతిన చర్చలు నిర్వహించి అవినాశ్రెడ్డి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాయని మండిపడ్డారు. ‘ఆ చర్చల్లో ఒకాయన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి అంటాడు. వాళ్లని చూస్తుంటే ప్రపంచ యుద్ధాన్ని కూడా సృష్టించగల శక్తి ఉన్నట్లుగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. ‘తల్లి ఆరోగ్యం బాగోలేదని, నాటకాలు ఆడుతున్నారంటూ తప్పుడు రాతలు రాస్తే ఎవరికైనా కడుపు మండదా? వైఎస్సార్సీపీని, అవినాశ్రెడ్డిని అభిమానించే వారికి బాధ కలగదా?’ అని నిలదీశారు. ఆ ఆక్రోశంతోనే ఒకరో ఇద్దరో ఎల్లో మీడియాపై దాడి చేశారని, నిజమైన మీడియాపై ఎవరిమీదైనా దాడి జరిగిందా? అని ప్రశ్నించారు. ఎల్లో మీడియాపై దాడి జరిగినా తాము ఖండిస్తామని, అదేవిధంగా ఎల్లో మీడియా రోత రాతలను కూడా ఖండించాలని సూచించారు. మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సజ్జల మీడియాతో మాట్లాడారు. రామోజీ, అవినాశ్కు చెరో న్యాయమా? ఎంపీ అవినాశ్రెడ్డి తనకున్న హక్కు ప్రకారం సీబీఐ విచారణకు మరికొద్ది సమయం కోరారు. ఆయనకు ఉన్న హక్కుల ప్రకారం కోర్టులకు వెళ్లవచ్చు. రామోజీరావు మార్గదర్శి కేసు విచారణను ఆపేందుకు తట్టని కోర్టు తలుపులు లేవు. ఆయన చేస్తే న్యాయం? అవినాశ్రెడ్డి కోర్టుకు వెళితే అన్యాయమా? చంద్రబాబు అధికారంలో ఉండగా సీబీఐ రాష్ట్రంలో అడుగు పెట్టకుండా జీవో ఇచ్చారు. ఈనాడులో అప్పుడు కుక్క తోక కత్తిరించినట్లు పెద్ద కార్టూన్ కూడా వేశారు. మళ్లీ ఇప్పుడు వారికి అదే సీబీఐపై ప్రేమ పుట్టుకొచ్చింది. రాష్ట్రాన్ని దిక్సూచిలా నిలిపారు వైఎస్సార్సీపీని స్థాపించిన 8 ఏళ్లలోనే సరిగ్గా నాలుగేళ్ల క్రితం 151 స్థానాల్లో ఘన విజయం సాధించాం. ముందుగా తయారు చేసుకున్న బ్లూ ప్రింట్ ప్రకారం సీఎం జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తూ వస్తున్నారు. నాలుగేళ్లలో 98.5 శాతానికిపైగా హామీలను నెరవేర్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజలతో మమేకం అయిన పార్టీ పనితీరు ఎలా ఉంటుంది? అలాంటి పార్టీపై ఆశలు పెట్టుకుంటే ఎంత సక్రమంగా అమలు చేసి చూపుతారనేది ఈ నాలుగేళ్లలో ప్రస్ఫుటంగా కనిపించింది. ఏపీని దేశానికి దిక్సూచిలా నిలిపిన ఘనత సీఎం జగన్కే దక్కుతుంది. ఇప్పటికే రూ.2.10 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా ప్రజలకు అందించాం. వైఎస్ జగన్ సీఎంగా ఉంటేనే సంక్షేమం, అభివృద్ధి కొనసాగుతాయని ప్రజలు గ్రహించారు. 2019 ఎన్నికల కంటే అద్భుత విజయాన్ని 2024లో సాధిస్తాం. సీఎం జగన్ కేంద్రంతో చర్చించి రాబట్టారు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యతతో పనిచేస్తోంది. రెవెన్యూ లోటు కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులను హక్కుగా రాబట్టుకుంది. రాష్ట్రానికి నిధులు రావడాన్ని ఎల్లో మీడియా ఓర్చుకోలేక పోతోంది. రామోజీరావు కడుపు మంటతో ఈనాడులో విషప్రచారం చేస్తున్నారు. ఎల్లో మీడియా కడుపు మంటకు మందు లేదని మరోసారి స్పష్టమైంది. టీడీపీ హయాంలో నిధులు తేలేకపోవడం చంద్రబాబు అసమర్థతకు నిదర్శనం. కేంద్రంలో భాగస్వామిగా కొనసాగి కూడా నిధులు సాధించకుండా చంద్రబాబు సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారు. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులను కేంద్రంతో చర్చించి రాబట్టుకుంటున్నారు. ఆ క్రమంలోనే 2014–15 రెవెన్యూ లోటు కింద రూ.10,461 కోట్లను కేంద్రం విడుదల చేసింది. రాష్ట్రానికి మంచి జరిగితే ఓర్చుకోలేని ఎల్లో మీడియా నాన్ రెసిడెంట్ ఆంధ్రా మాదిరిగా వ్యవహరిస్తూ విషం చిమ్ముతున్నాయి. -
యెల్లో మీడియాకే స్వేచ్ఛ ఉంటుందా..విలువలు లేకుండా ఇంతలా దిగజారాలా?
‘‘కడప లోక్ సభ సభ్యుడు అవినాశ్ రెడ్డిని మరో గంటలో అరెస్టు చేస్తున్నారు.. ఆయనను హైదరాబాద్ తరలించడానికి హెలికాఫ్టర్ పెడుతున్నారు. కేంద్ర బలగాలను రప్పించి అవినాశ్ ను పట్టుకువెళతారు..’’ ఇవి తెలుగుదేశం చానళ్లు తమ ఇష్టానుసారంగా ప్రసారం చేసిన కొన్ని వార్తలు. ఆ దురదృష్టవశాత్తు ఆ చానళ్లను చూసినవారికి ఏదో జరిగిపోతోందేమోనన్న అభిప్రాయం కలుగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే గోలతో హోరెత్తించారు. అవినాశ్ ను అరెస్టు చేయకపోతే.. ఇంకా అరెస్టు చేయరా?.. అంటూ చర్చలు!. నిజానికి ఇంతవరకు అవినాష్ను సీబీఐ నిందితుడిగా పేర్కొనలేదు. కేవలం సాక్షిగానే విచారణ చేస్తూ వస్తున్నారు. తర్వాత రోజులలోసీబీఐ ఏమి చేస్తుందన్నది వేరే విషయం. కాని టీడీపీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లు కసితో , కక్షతో ,దుర్మార్గపు ఆలోచనలతో ఉన్నవి,లేనివి కలిపి అబద్దపు ప్రచారాలు చేశాయి. సోమవారం అంతా ఇదే గోల. దీనికి కారణం ఏమిటంటే 22 వ తేదీన సీబీఐ విచారణకు అవినాశ్ వెళ్లవలసి ఉంది. కాని తన తల్లి అనారోగ్యం కారణంగా వారం రోజులు టైమ్ ఇవ్వాలని కోరారు.సీబీఐ అక్రమంగా తనపై కేసు పెట్టేలా ఉందన్నది ఆయన అనుమానం. అందుకే ముందస్తు బెయిల్ కోసం సుప్రింకోర్టుకు కూడా వెళ్లారు. ఈ పరిణామాలను ఏ మీడియా అయినా వార్తలుగా ఇవ్వడం తప్పు కాదు. కాని టీడీపీ మీడియా చేసిన అల్లరి , అరాచకం చూస్తే జర్నలిజం ఇంత నీచంగా మారిందా?.. జర్నలిస్టుల ముసుగులో కొందరు ఇంత నగ్నంగా తమ రాక్షసత్వాన్ని బయటపెట్టుకుంటారా? అన్న ఆవేదన కలుగుతుంది. టీడీపీ మీడియాకు మాత్రమే స్వేచ్చ ఉంటుందని, గౌరవ ఎమ్.పికి మాత్రం స్వేచ్చ ఉండదని, ఆయనకు ప్రైవసీ ఉండదని వీరు భావిస్తున్నారు. ఆయన తన తల్లి లక్ష్మమ్మ ఉన్న కర్నూలు ఆస్పత్రికి వెళుతుంటే, ఆయనేదో విదేశాలకు పారిపోతున్నట్లుగా ఈ మీడియా దుర్మార్గంగా వ్యవహరించింది. ఆయన వెంటబడింది. వేటాడింది. అవినాశ్ అనుచరులు అడ్డుకోపోతే దౌర్జన్యం అని ప్రచారం చేసింది. 👉 నిజానికి టీడీపీ మీడియానే సిగ్గు వదలి పచ్చి అసత్యాలను ప్రచారం చేస్తూ అవినాశ్ పై మాటల దాడి చేస్తూ దౌర్జన్యంగా ప్రవర్తించింది. ఒకప్పుడు బ్రిటన్ లో ఆ దేశ యువరాణి డయానా ఒక కారులో ప్రయాణిస్తుండగా, కొందరు పాపరాజీలు అంటే జర్నలిస్టు ముసుగులో ఉన్న వ్యక్తులు ఆమెను వెంబడించారు. వారి బారినుంచి బయటపడేందుకు డయానా కారు డ్రైవర్ వేగంగా వాహనం ప్రమాదానికి గురి కావడం , డయానా మరణించడం జరిగిపోయాయి. అప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మీడియాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. జర్నలిస్టులు అతిగా వ్యవహరిస్తున్నారని అంతా వ్యాఖ్యానించారు. సరిగ్గా ఇప్పుడు అవినాశ్ పై కూడా అలాంటి ప్రయత్నమే చేశారు. పోనీ ఇలానే ఇతర కేసులలో కూడా ఈ మీడియా స్పందిస్తోందా? అంటే అదేమీ లేదు.టీడీపీకి చెందినవారు అయితే అంతా గుప్ చుప్ గా ఉంటున్నారు. 👉 మార్గదర్శి స్కామ్ లో రామోజీని సీఐడీవిచారిస్తే ఈ మీడియా ఎందుకు ఆయన ఇంటి ముందు గుమి కూడలేదు?హడావుడి చేయలేదు. సీఐడీ సైతం ఆయనను చాలా గౌరవంగా విచారించిందే. రామోజీ సీఐడీవిచారణకు ముందుగా నడుంకు పట్టి పెట్టించుకున్నవైనం, సహాయకులతో పడుకున్నట్లు నటించిన వైనంపై ఎందుకు కధనాలు ఇవ్వలేదు? రామోజీ వందల కోట్ల బ్లాక్ మనీని సర్కులేట్ చేశారన్నది అభియోగం. అది నేరమా? కాదా? మరికొన్ని ఇతర కేసులు చూద్దాం. గతంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు భవంతిలో నాటుబాంబులు పేలి నలుగురు మరణించారు.అయినా ఆయనకు ఏమీ కాలేదు. అప్పుడు ఈ మీడియా అసలు ఏమీ జరగనట్లు వ్యవహరించింది. ఆ రోజుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయన డిల్లీ వచ్చినప్పుడల్లా కోడెల కూడా వచ్చి కేంద్రంలోని పెద్దలను కలిసి తనపైసీబీఐ విచారణ రాకుండా చూసుకునేవారు. చివరికి ఆనాటి కేంద్ర హోం మంత్రి అద్వానీని మేనేజ్ చేసి ,అసలుసీబీఐ కి అనుమతి ఇవ్వకుండా చేయగలిగారు. 👉 ప్రముఖ సినీ నటుడు, చంద్రబాబు బావమరిది బాలకృష్ణ తన ఇంటిలో కాల్పులు జరిపితే ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయినా ఏమీ కాలేదు.పైగా ఎన్.టి.ఆర్.కుమారుడిని అరెస్టు చేస్తారా అంటూ అదేదో తప్పు అన్నట్లు కధనాలు ఇచ్చారు. బాలకృష్ణకు ఆనాటి నిమ్స్ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు సాయం చేసి మెంటల్ అని ఒక సర్టిఫికెట్ ఇచ్చి కేసు నుంచి రక్షించారు. ఆ రోజుల్లోనే బాలకృష్ణ ఇంటి వద్ద ఒక సెక్యూరిటీ గార్డు అనుమానాస్పద స్థితిలో మరణించారు. అయినా ఈ మీడియా దానిని సీరియస్ గా భావించలేదు. చంద్రబాబు అధికారంలో ఉండగా తిరుమల శేషాచలం అడవులలో ఇరవై మందిని ఎన్ కౌంటర్ చేస్తే కూడా ఎవరిపైన కేసు రాలేదు. పైగా ఎర్రచందనం స్మగ్లర్లను చూస్తూ ఊరుకుంటామా అని ఎదురు ఇదే మీడియా ప్రశ్నించింది. అప్పుడు మానవహక్కుల గురించి మర్చిపోవాలన్నమాట. 👉 అదే టీడీపీకి మద్దతు ఇస్తున్న ఒక ఎమ్.పి ఎపిలో కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ ఉపన్యాసాలు ఇస్తే కేసు పెట్టారు. కాని ఆయనను కొట్టారన్న ఒక ఎలిబి సృష్టించి కేసును పక్కదారి పట్టించారు. సుప్రింకోర్టు సైతం అప్పట్లో సరైన నిర్ణయం చేయలేదేమోననిపిస్తుంది. ఆ ఎంపీని ని ఆర్మి ఆస్పత్రికి పంపి నివేదిక కోరారు. కాని ఆ విషయం ఏమైందో కాని చెప్పాపెట్టుకుండా ఆయన ఆర్మి ఆస్పత్రి నుంచి వెళ్లిపోతే ఎవరూ ఏమీ చేయలేకపోయారు. చంద్రబాబు పాల్గొన్న సభలలో తొక్కిసలాటలు జరిగి పదకుండు మంది మరణిస్తే, కేసులు పెట్టి కొందరిని అరెస్టు చేస్తే న్యాయ వ్యవస్థ వారికి రిమాండ్ ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించింది. వివేకానందరెడ్డి హత్య కేసును పరిశీలిస్తే తానే చంపానని, నరికానని సగర్వంగా చెప్పుకున్న వ్యక్తికి బెయిల్ ఇవ్వడానికి వివేకా కుమార్తె సునీత,సీబీఐ సహకరించడం బహుశా దేశంలో మరెక్కడా జరగదేమో! మరో వైపు కుట్రదారులు అన్న అనుమానంతో వైఎస్ భాస్కరరెడ్డిని అరెస్టు చేయడం, తదుపరి అవసరమైతే అవినాష్ను అరెస్టు చేస్తామని సీబీఐ అధికారులు చెప్పడం కూడా చర్చనీయాంశం అయింది. 👉 నిజంగా వారికి ఏదైనా సంబందం ఉందని తేలితే చర్య తీసుకోవచ్చు. కాని అసలు హత్య చేసినవారిని వదలివేసిన తీరు కచ్చితంగా సందేహాలను లేవనెత్తుతుంది. వివేకా రెండో భార్య, వారికి కలిగిన సంతానం, ఆస్తిలో వారసత్వం, కూతురు, అల్లుడుతో తగాదా మొదలైన కోణాలనుసీబీఐ ఎంతవరకు విచారించిందన్నదానిపై ఇంకా క్లారిటీ రావల్సి ఉంది. ఈ విషయాలు ఎలా ఉన్నా, తల్లికి చికిత్స జరుగుతున్నప్పుడు కొడుకుగా అవినాశ్ అక్కడ ఉండవలసిన అవసరం లేదా? వారం రోజుల తర్వాత విచారణకు వస్తానని అవినాశ్ చెబితే, అలా కుదరదని,సీబీఐకన్నా ముందుగా ఎల్లో మీడియా గొడవ చేయడం ఏమిటో అర్దం కాదు. కర్నూలు ఆస్పత్రి వద్ద ఈ మీడియా దొంగ ఐడి కార్డులతో లోపలికి వెళ్లి వీడియోలు తీసే యత్నంచేయడం సహజంగానే వైసిపి కార్యకర్తలకు ఆవేశం తెప్పిస్తుంది. సరిగ్గా అదే తెలుగుదేశం కు కావాలి. వైసిపి కార్యకర్తలను రెచ్చగొట్టి , ఆ తర్వాత వారిపై ఆరోపణలు చేస్తూ శాంతిభద్రతల సమస్య సృష్టించడమే ఇందులో లక్ష్యం అన్నది తెలుస్తూనే ఉంది. ఒకవేళ అవినాశ్ ను అరెస్టు చేయదలిస్తేసీబీఐకి ఎవరైనా చెప్పాలా? సుప్రింకోర్టులో ఏమి జరుగుతుందో తెలియదు. కాని ఈలోగానే టీడీపీ మీడియా ట్రయల్ చేసేస్తోంది. ఇక్కడ మరో సంగతి చెప్పాలి. మచిలీపట్నంలో ఓడరేవు నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టారు. అది బ్రహ్మాండమైన కార్యక్రమం .దానికి అసలు కవరేజీ ఇవ్వకుండా, అవినాశ్ అరెస్టు అంటూ జరగని దానిని విస్తారంగా ఈ మీడియా ప్రచారం చేయడం దుర్మార్గంగా ఉంటుంది. అవినాశ్ ను అరెస్టు చేస్తే దాని ప్రభావం వైసిపి పై పడుతుందన్నది వారి ఆశ కావచ్చు. వచ్చే ఎన్నికలలో ఈ అంశాన్ని వాడుకోవాలన్నది వారి ఉద్దేశం. కాని అది సాధ్యం కాదు. ఇద్దరిపై స్వయంగా కాల్పులు జరిపిన బాలకృష్ణ రెండుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన వివిధ స్కీమ్ ల గురించి కాకుండా ఇలాంటి కేసులపైన ఆధారపడి ప్రజలు నిర్ణయం తీసుకుంటారని టీడీపీ నేతలుకాని, టీడీపీ మీడియా కాని ఆశలు పెడితే అవి అడియాశలు అవుతాయని నిర్దద్వంగా చెప్పవచ్చు. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
సుప్రీంకోర్టులో నేడు అవినాష్ పిటిషన్ విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: ముందస్తు బెయిలు కోరుతూ ఎంపీ అవినాష్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించనుంది. అవినాష్కు ముందస్తు బెయిలు ఇవ్వొద్దంటూ మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్తో కలిపి ఈ పిటిషన్ను జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహాలుతో కూడిన వెకేషన్ బెంచ్ విచారించనుంది. ఇదిలా ఉంటే, తమ పిటిషన్ విచారించాలంటూ అవినాష్ తరఫు న్యాయవాది సోమవారం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహాలతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించారు. మరో వెకేషన్ బెంచ్కు వెళ్లాలని ధర్మాసనం సూచించడంతో జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ సంజయ్కరోల్లతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించారు. తాను సభ్యుడిగా లేని ధర్మాసనం జాబితాలో చేర్చాలని జస్టిస్ సంజయ్ కరోల్ రిజిస్ట్రీకి సూచించారు. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది. సంఖ్య విషయం సంబంధిత సమాచారం 1 డైరీ నెంబర్ 20416/2023 2 కేసు నెంబర్ MA 00 1285 3 విచారణ తేదీ 23 మే 2023 4 CL నెంబర్ 36 5 కేటగిరీ క్రిమినల్ మ్యాటర్స్ 6 సబ్జెక్ట్ బెయిల్ 7 బెంచ్ 1. జస్టిస్ J.K.మహేశ్వరీ 8 2. జస్టిస్ పమిడిగంఠం శ్రీ నరసింహా పిటిషనర్ సునీత నర్రెడ్డి 09 రెస్పాండెంట్స్ 1. Y.S.అవినాష్ రెడ్డి 2. డైరెక్టర్, CBI 10 సునీత తరపు న్యాయవాది జెసల్ వాహి 11 అవినాష్ తరపు న్యాయవాది ముకుంద్ P.ఉన్నీ -
రేపే సుప్రీంకోర్టు ముందుకు అవినాష్ రెడ్డి మ్యాటర్
ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను రేపు సుప్రీంకోర్టు విచారించనుంది. జస్టిస్ జె కే మహేశ్వరి, జస్టిస్ పి. నరసింహ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ రానుంది. సంఖ్య విషయం సంబంధిత సమాచారం 1 డైరీ నెంబర్ 20416/2023 2 కేసు నెంబర్ MA 00 1285 3 విచారణ తేదీ 23 మే 2023 4 CL నెంబర్ 36 5 కేటగిరీ క్రిమినల్ మ్యాటర్స్ 6 సబ్జెక్ట్ బెయిల్ 7 బెంచ్ 1. జస్టిస్ J.K.మహేశ్వరీ 2. జస్టిస్ పమిడిగంఠం శ్రీ నరసింహా 8 పిటిషనర్ సునీత నర్రెడ్డి 9 రెస్పాండెంట్స్ 1. Y.S.అవినాష్ రెడ్డి 2. డైరెక్టర్, CBI 10 సునీత తరపు న్యాయవాది జెసల్ వాహి 11 అవినాష్ తరపు న్యాయవాది ముకుంద్ P.ఉన్నీ ఈ పిటిషన్ ను సునీత నర్రెడ్డి గతంలో దాఖలు చేశారు. మరో వైపు ఇదే వ్యవహారంపై అవినాష్ రెడ్డి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ విచారించేలా హైకోర్టు వెకేషన్ బెంచ్ను ఆదేశించాలని విజ్ఙప్తి చేశారు. తల్లి అనారోగ్యం వల్ల వారంపాటు సిబిఐ విచారణకు రాలేనని, సిబిఐ విచారణకు హాజరుపై మినహాయింపు కావాలని కోరారు. తన తల్లికి చికిత్స జరుగుతున్న దృష్ట్యా ఈ నెల 27 వరకు మినహాయింపు ఇవ్వాలని సుప్రీం కోర్టును కోరారు అవినాష్ రెడ్డి. ఇదే విషయాన్ని సిబిఐకి కూడా లిఖిత పూర్వకంగా తెలిపారు. (చదవండి : అమ్మ పరిస్థితి సీరియస్, 7 రోజులు గడువివ్వండి : సీబీఐకి అవినాష్ విజ్ఞప్తి) -
సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ
-
అవినాష్ తల్లి లక్ష్మమ్మ హెల్త్ బులెటిన్ విడుదల
-
ఆసుపత్రిలో చేరటంపైనా రోగిష్టి రాతలేనా ?
వ్యక్తిత్వాన్ని చంపేయాలంటే రామోజీరావు తరవా తేఎవరైనా!!. తన ప్రయోజనాలకు అడ్డంగా ఉంటే ఎవరి పరిస్థితైనా అంతే!. అది ఎన్టీ రామారావయినా... లక్ష్మీ పార్వతయినా... సొంత పార్టీవారైనా.. ఇంకెవ్వరైనా అంతే!. తన ప్రయోజనాలు కాపాడినన్నాళ్లూ మహోన్నతుడిగా కీర్తించిన ఎన్టీఆర్ను... చంద్రబాబు డైరెక్షన్లో పనిచేయలేదన్న ఒకే ఒక కారణంతో చివరి రోజుల్లో ‘ఈనాడు’ ఎలా బ్రాండ్ చేసిందో ఈ రాష్ట్రంలో తెలియనిదెవరూ లేరు. అలాగే లక్ష్మీ పార్వతిని కూడా!. ఇక టీడీపీ నేతలు కాని వారి పరిస్థితి చెప్పక్కర్లేదు. చంద్రబాబుతో పొత్తులో లేనప్పుడు నరేంద్ర మోదీ వ్యక్తిత్వాన్ని సైతం వక్రీకరించి రాసిన కలం అది. ఇప్పుడు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి విషయంలోనూ రామోజీరావు అదే చేస్తున్నారు. ఆయనకు సంబంధించిన ప్రతి అంశాన్నీ వక్రీకరిస్తూ... మెల్లగా జనం మెదళ్లలో విషం నింపుతున్నారు. ఆఖరికి ఆయన తన తల్లిని ఆసుపత్రిలో చేర్చడాన్ని సైతం రాజకీయం చేస్తున్నారు. ఆమెను చూడటానికి కడప నుంచి వ్యక్తులొస్తే అది కూడా రాజకీయమే. ఆసుపత్రిలో పరిచయం ఉన్న వైద్యుడున్నారంటూ... దానికీ విషం పులిమారు. మరీ ఇంత సిగ్గుమాలిన రాతలా రామోజీరావు గారూ? ఇంతటి మీ విషపూరిత మనస్తత్వాన్ని తట్టుకోలేకే... మీ తనయుడు సుమన్ సైతం మిమ్మల్ని ఇంట్లో ఉన్న క్యాన్సర్గా అభివర్ణించారని మరిచిపోయారా?అయినా చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తీసుకురావాలంటే ఇంతలా దిగజారిపోవాలా? ‘ఈనాడు’ కరపత్రానికన్నా ఘోరమైన స్థాయికి దిగజార్చేయాలా? బాబుఅధికారంలో లేక... మీ అవినీతి సామ్రాజ్యం చిన్నబోతోందనా? అక్రమాలతో, చట్టవిరుద్ధంగా నిర్మించుకుని విస్తరించిన మీ ఆర్థిక సామ్రాజ్యానికి బీటలు పడుతున్నాయనా? కనీస మానవతా విలువలు లేకపోవటం దుర్మార్గం కాదా రామోజీరావు గారూ? ఏ ఆసుపత్రిలో చేర్చాలో మీరే చెబుతారా? ఎంపీ అవినాశ్రెడ్డి తల్లి లక్ష్మమ్మ హఠాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను పులివెందుల నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకు వెళదామనుకున్నారు. కానీ మార్గం మధ్యలోనే పరిస్థితి ఆందోళనకరంగా మారటంతో... కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. అందులో తప్పుబట్టాల్సిందేముంటుంది? అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా దగ్గర్లోని మెరుగైన ఆసుపత్రికి తీసుకెళతారు. అది సహజమేగా! కానీ.. ‘ఈనాడు’ చూసే కోణం వేరు కదా. ప్రతి అక్షరాన్నీ చంద్రబాబు సంక్షేమం కోసం తాకట్టు పెట్టడం ఆ పత్రిక బాధ్యత మరి!. అందుకనే ఈ విషయాన్ని కూడా వక్రీకరించారు. తన పత్రికలో పెద్ద పెద్ద అక్షరాలతో అచ్చు వేస్తూ... దానికి తన సొంత పైత్యాన్ని కూడా కొంత జోడించారు. పులివెందులలో ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోయినా బెంగళూరుకో, హైదరాబాద్కో తీసుకెళ్లాలని... మరెక్కడికీ తీసుకెళ్లకూడదని పెద రాయుడి తీర్పునిచ్చేశారు. ఆ రెండు ప్రాంతాలకూ కాకుండా మరెక్కడికి తీసుకెళ్లినా ఏదో మతలబు ఉన్నట్టేనంటూ పైత్యాన్ని తారస్థాయిలో చూపించారు. ఊహాజనితమైన కారణాలను జోడించేశారు. కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో ఓ వైద్యుడికి ముఖ్యమంత్రి కార్యాలయంతో సంబంధాలు ఉన్నాయంటూ... వైద్యం చేసిన కార్డియాలజిస్టు అవినాశ్ రెడ్డికి స్నేహితుడంటూ నీచపు రాతలకు దిగారు. కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రి కార్డియాలజీకి పేరున్న ఆసుపత్రి అని... డాక్టర్ హితేష్ కార్డియాలజీలో విశేషమైన ప్రఖ్యాతులున్న వైద్యుడనే వాస్తవాలను మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. అయినా సీఎంఓ నిజంగా జోక్యం చేసుకుని ఉంటే... సూచనలు చేసి ఉంటే.. కర్నూలులోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేర్పిస్తారు కదా? ప్రయివేటు ఆసుపత్రిలో ఎందుకు చేర్పిస్తారు? ప్రయివేటు ఆసుపత్రులను కూడా ప్రభుత్వం నియంత్రించగలదా? ఇదెక్కడి తలకాయ లేని ఆరోపణ రామోజీ రావుగారూ? మంచి వైద్యం కావాలనుకున్నపుడు మంచి ఆసుపత్రిలో చేరుస్తారు. ఆ విభాగంలో నిపుణుడైన వైద్యుడికి చూపిస్తారు. ఇక్కడ జరిగింది అదే. దీనిక్కూడా విషపూరిత వక్రభాష్యాలేల? వైద్యుడి ఊరుపైనా విష ప్రచారమేనా? డాక్టర్ హితేష్ది పులివెందుల కనక... ఆయన అవినాశ్కు మిత్రుడు కనక చేర్పించారనటం వెనక కనీస ఇంగితమైనా ఉందా? పులివెందుల వాసులెవరూ బాగా చదువుకుని నిపుణులైన డాక్టర్లుగా, ఉన్నతాధికారులుగా ఉండకూడదా? ఇవెక్కడి రాతలు? ‘ఈనాడు’, దాని మిత్ర ఎల్లో మీడియా... ఇదే తరహాలో పులివెందులపై, రాయలసీమపై మూడు దశాబ్దాలుగా దుష్ప్రచారం చేయటం తెలియని విషయం కాదు. దీనికి కారణమల్లా ఒక్కటే. తెలుగుదేశం పార్టీ లేనప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నవారిని రామోజీరావు తన రాతలతో భయపెట్టి తన దారికి తెచ్చుకోగలిగారు. ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డిని తప్ప. వైఎస్సార్ది పులివెందుల కనక. అంతే!. సీఐడీ అంటే మంచమెక్కింది మీరేగా? దర్యాప్తును తప్పించుకునేందుకు అనారోగ్యం అంటూ హఠాత్తుగా మంచం ఎక్కేయడం మీ మాదిరి ఎవరికి తెలుస్తుంది రామోజీరావు గారూ? అక్రమంగా చిట్స్ నడుపుతూ... చట్టాలన్నీ ఉల్లంఘిస్తున్న ‘మార్గదర్శి’పై మిమ్మల్ని ప్రశ్నించడానికి సీఐడీ అధికారులు మీ చిత్రపురి కోటకు వచ్చినపుడు జరిగిందేమిటో రాష్ట్రమంతా చూసింది కదా?. అప్పటికప్పుడు యశోద ఆసుపత్రి నుంచి అంబులెన్స్ రామోజీ నివాసానికి వచ్చింది. ఓ డాక్టర్, ఇతర సిబ్బంది కూడా వచ్చారు. అప్పటికప్పుడు ఆయన నడుముకు ఓ బెల్ట్ కట్టారు. ముక్కుకు మాస్కు పెట్టారు. చేతికి సెలైన్ తగిలించారు. మంచం పక్కనే ఆక్సిజన్ సిలిండర్ పెట్టారు. సినిమా సెట్టింగ్ను తలపిస్తూ ‘అనారోగ్యం’ కథను రక్తికట్టించేందుకు నానా తంటాలూ పడ్డారు. మార్గదర్శి చిట్స్ అక్రమాలపై సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ అనారోగ్యం నటిస్తూ మాట్లాడలేనన్న రీతిలోనే సమాధానాలు చెప్పారు రామోజీరావు. కానీ ప్రశ్నల వీడియో షూటింగ్ ఆగినపుడల్లా మామూలు రామోజీలా తన అహాన్ని ప్రదర్శిస్తూనే వచ్చారు. అంటే.. ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా తప్పించుకోవటానికే ఇంతటి డ్రామా నడిపారని తెలియటం లేదా? తాను అలా చేశాను కనక అంతా తనలానే ఉంటారనుకుంటే ఎలా? బాలకృష్ణ ఇంట్లో కాల్పులపై పెన్ను మూసిన రామోజీబాలయ్యకు మతిస్థిమితం లేదని ఎందుకు రాయలేదు? తిరుగులేని ప్రజాభిమానాన్ని పొందిన వైఎస్సార్ కుటుంబమంటే... రామోజీరావుకు ఏమాత్రం పడదు. అందుకే హద్దుల్లేని విష ప్రచారానికి దిగుతారు. ఇదే రామోజీరావు... తనవాడు కాబట్టి అడ్డదారిలో వచ్చిన చంద్రబాబుకు భజన చేస్తూనే ఉంటారు. చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిపితే ... నిర్మాత బెల్లంకొండ సురేశ్, జ్యోతిష్యుడు సత్యనారాయణ చౌదరి తీవ్రంగా గాయపడ్డారు. ఆ తరవాత ఆ ఇంట్లో ఒక వాచ్మేన్ అనుమానాస్పదంగా మరణించాడు. దీనిపై రామోజీ అక్షరం ముక్క కూడా రాయలేదు. అరెస్టును తప్పించుకునేందుకు అప్పటికప్పుడు బాలకృష్ణ ఆసుపత్రిలో చేరినా... ఎన్టీఆర్ కుటుంబానికి సన్నిహితుడైన కాకర్ల సుబ్బారావు డైరెక్టర్గా ఉన్న నిమ్స్లోనే చేర్చినా... కేసు నుంచి బయటపడడానికి తనకు మతిస్థిమితం లేదని బాలకృష్ణ సర్టిఫికెట్ తెచ్చుకున్నా... ‘ఈనాడు’ పెన్ను కదిపితే ఒట్టు. ఎందుకంటే బాలకృష్ణ తమవాడు. కాబట్టి కాల్పులు జరపొచ్చు. అరెస్టు కాకుండా ఆసుపత్రిలో చేరొచ్చు. కేసు నుంచి బయటపడటానికి మతి స్థిమితంలేదని సర్టిఫికెట్ తెచ్చుకోవచ్చు. అదే ప్రత్యర్థులైతే... వారి చర్యల్లో ఎలాంటి తప్పూ లేకున్నా ‘ఈనాడు’ సందేహాలు వ్యక్తంచేస్తూనే ఉంటుంది. లేని దురుద్దేశాలు ఆపాదిస్తుంది. ఎందుకంటే ఆ పత్రికది జగమెరిగిన దౌర్భాగ్యపు పాత్రికేయం మరి!. పరామర్శించేవారి కులాలూ రాస్తారా? వైఎస్ కుటుంబంపై అక్కసు కొద్దీ రామోజీరావు నానాటికీ మరింత దిగజారిపోతున్నారు. వైఎస్సార్ జిల్లా ఎంపీ కనక ఆసుపత్రిలో ఉన్న అవినాశ్ రెడ్డి తల్లిని పరామర్శించేందుకు పులివెందులతో పాటు వైఎస్సార్ జిల్లాకు చెందిన చాలామంది కర్నూలు ఆసుపత్రికి వచ్చారు. అది సహజం. దాన్ని కూడా ‘ఈనాడు’ తనదైన కోణంలో వక్రీకరించింది. పైగా పరామర్శించిన వారి కులాలను ప్రస్తావిస్తూ సరికొత్త స్థాయికి దిగజారింది. పులివెందులకు చెందిన దంతలూరి కృష్ణ కర్నూలు ఆసుపత్రికి రాగా... ఆయన పేరును దంతులూరి కృష్ణ అని కాకుండా... ఆయన కులాన్ని ప్రస్తావిస్తూ ‘మంగలి కృష్ణ’అని రాయటమెందుకు? మరి రామోజీరావును పరామర్శించేందుకు చంద్రబాబు వచ్చినప్పుడు ‘కమ్మ చంద్రబాబు’అని రాయలేదే...! తనను పరామర్శించేందుకు వచ్చిన మురళీమోహన్, రాఘవేంద్రరావు తదితరుల పేర్ల ముందు ‘కమ్మ’ అని చేర్చలేదే? ఎందుకీ విపరీతపు రాతలు? సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేసేందుకే కుట్ర వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు తాము నిర్దేశించినట్టే జరగాలన్నది చంద్రబాబు కుట్ర. దానికి అనుగుణంగా రామోజీరావు చేస్తున్న దుష్ప్రచారమే ఇది. నిజానికి కోర్టులో ఏదైనా పిటిషన్ దాఖలు చేస్తే ప్రతివాదులకు కోర్టే నోటీసులు పంపుతుంది. దానిపై కౌంటర్ వేయమని చెబుతుంది. అంతేగానీ పిటిషన్ వేసినవారే ఆ నోటీసులను తీసుకువెళ్లి ప్రతివాదులకు అందించరు కదా?. న్యాయ ప్రక్రియలోనే ఎక్కడా లేని ఈ వింత ఆచారానికి వివేకానందరెడ్డి కేసులో ఆయన కుమార్తె సునీత ఎందుకు ప్రయత్నిస్తున్నారు? దానికి ‘ఈనాడు’ ఎందుకు వత్తాసు పలుకుతోంది? ఇదంతా కుట్ర కాదా? ఇదంతా చంద్రబాబు డైరెక్షన్లో జరుగుతోందనటానికి ఇంకా ఏం కావాలి? వివేకా హత్య కేసు దర్యాప్తును జూన్ నెలాఖరుకు పూర్తి చేసి జులై 1న ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డిని బెయిల్పై విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై సుప్రీంకోర్టు ఎర్ర గంగిరెడ్డికి నోటీసులిచ్చింది. అవి కోర్టు ద్వారా ఆయనకు అందుతాయి. కానీ సునీత ఆ నోటీసులను తన లాయర్ ద్వారా ఎర్ర గంగిరెడ్డికి అందించేందుకు హైదరాబాద్లోని చంచల్గూడ జైలుకు వెళ్లారని ‘ఈనాడు’ రాసింది. ఇంత కవరేజీ అవసరమా రామోజీ? ఇదీ... అసలు వాస్తవం వాస్తవమేంటంటే... ఎర్ర గంగిరెడ్డిని కలవాలని సునీత ప్రయత్నించారు. తాను చెప్పినట్లుగా నడుచుకుంటే కేసు నుంచి తప్పించటంతో పాటు అదనపు లాభాలుంటాయని ప్రలోభపెట్టడానికి ఆమె ఎర్ర గంగిరెడ్డిని కలవాలనుకున్నారు. దస్తగిరి మాదిరే గంగిరెడ్డినీ ప్రలోభపెట్టి కుట్రలో కొత్త అంకానికి తెర లేపాలనుకున్నారు. జైలు అధికారులు అంగీకరించలేదు. కలవాలని ప్రయత్నించిన విషయం మాత్రం బయటకు పొక్కింది. ప్లాను బెడిసికొట్టడంతో దీంతో చంద్రబాబు డైరెక్షన్లో ‘ఈనాడు’ కవరేజీ మొదలుపెట్టింది. కోర్టు నోటీసులను అందించడానికే సునీత వెళ్లబోయారని చెత్త రాతలు రాసేసింది. సునీతకు అసలు అంత అవసరం ఏమొచ్చిందో చెప్పాలి కదా? కోర్టులు చేయాల్సిన పనిని ఆమే ‘వ్యయప్రయాసల కోర్చి’ చేస్తున్నారంటే దాని పరమార్థమేంటి? వివేకాను హత్య చేశానని అంగీకరించిన దస్తగిరికి ఇప్పటికే సునీత పూర్తి స్థాయిలో అండదండలిస్తున్నారు. అదే రీతిలో ఎర్ర గంగిరెడ్డినీ ప్రలోభపెట్టి ఈ కేసు నుంచి తన భర్త రాజశేఖరరెడ్డిని, బావ శివప్రకాశ్ రెడ్డిని పూర్తిగా తప్పించాలన్నది ఆమె ఉద్దేశం. అది బయటపడకుండా ‘ఈనాడు’ నోటీసుల రాగం అందుకోవటమే కుట్రకు నిదర్శనం. -
ఎంపీ అవినాష్రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఎంపీ అవినాష్రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది. కాగా, తల్లి అనారోగ్యం కారణంగా అవినాష్రెడ్డి.. ఆసుపత్రిలోనే ఉన్న సంగతి తెలిసిందే. అవినాశ్రెడ్డి మాతృమూర్తి తీవ్ర అనారోగ్యంతో కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కార్డియాక్ ఎంజైమ్స్ సాధారణం కంటే ఎక్కువ ఉండటంతో ఆమె ఆరోగ్యం విషమించింది. వైద్యులు ఆమె ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అవినాశ్ దగ్గరుండి తల్లి బాగోగులు చూసుకుంటున్నారు. మరో వైపు ఈ వ్యవహారంపై ఎల్లో మీడియా శుక్రవారం మధ్యాహ్నం నుంచి తప్పుడు కథనాలను ప్రసారం చేసింది. చదవండి: అవినాశ్ తల్లికి తీవ్ర అస్వస్థత.. మానవత్వం లేకుండా ఎల్లో మీడియా దుష్ప్రచారం -
అవినాష్ తల్లి లక్ష్మమ్మ హెల్త్ బులెటిన్ విడుదల
కర్నూలు: ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఆమె హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఛాతీలో నొప్పి రావడంతో లక్ష్మమ్మను ఆస్పత్రికి తీసుకొచ్చారని, ఆమె కార్డియో సమస్యతో బాధపడుతున్నారని డా. రితేష్ బులెటిన్లో పేర్కొన్నారు. యాంజియోగ్రామ్ చేయాల్సిన అవసరం ఉందని, లక్ష్మమ్మకు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు విశ్వభారతి ఆస్పత్రి డాక్టర్ రితేష్ స్పష్టం చేశారు. -
హైదరాబాద్ నుంచి పులివెందులకు బయల్దేరిన ఎంపీ అవినాష్ రెడ్డి
-
అవినాశ్ తల్లికి తీవ్ర అస్వస్థత.. మానవత్వం లేకుండా ఎల్లో మీడియా దుష్ప్రచారం
సాక్షి ప్రతినిధి కర్నూలు, పులివెందుల: ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి మాతృమూర్తి తీవ్ర అనారోగ్యంతో కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కార్డియాక్ ఎంజైమ్స్ సాధారణం కంటే ఎక్కువ ఉండటంతో ఆమె ఆరోగ్యం విషమించింది. వైద్యులు ఆమె ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అవినాశ్ దగ్గరుండి తల్లి బాగోగులు చూసుకుంటున్నారు. కాగా ఈ వ్యవహారంపై ఎల్లో మీడియా శుక్రవారం మధ్యాహ్నం నుంచి తప్పుడు కథనాలను ప్రసారం చేసింది. పులివెందుల భాకరాపురంలోని తమ నివాసంలో ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి మాతృమూర్తి శ్రీలక్ష్మికి ఉదయం ఛాతీలో నొప్పి రావడంతో సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో స్థానికంగా ఉన్న దినేశ్ నర్సింగ్ హోంలో చేర్పించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో ప్రత్యేక అంబులెన్స్లో బయలుదేరగా పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చేర్పించారు. కార్డియాక్ నిపుణుడు హితేశ్రెడ్డి, జనరల్ ఫిజీషియన్ రవికళాధర్రెడ్డి పర్యవేక్షణలో శ్రీలక్ష్మికి చికిత్స అందిస్తున్నారు. రక్త పరీక్షలతో పాటు గుండెకు సంబంధించిన పరీక్షలు చేశారు. మరిన్ని పరీక్షలు చేయాల్సి రావడంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. పాణ్యం, కర్నూలు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్రెడ్డి, హఫీజ్ఖాన్, మేయర్ బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి తదితరులు ఆస్పత్రికి చేరుకుని పరామర్శించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆస్పత్రికి తరలి వచ్చారు. మానవత్వం లేకుండా వెంటాడిన వైనం శుక్రవారం సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు హైదరాబాద్లోని నివాసం నుంచి బయల్దేరిన ఎంపీ అవినాశ్రెడ్డి తన తల్లి శ్రీలక్ష్మి అనారోగ్యం గురించి తెలియడంతో దర్యాప్తు అధికారులకు న్యాయవాది ద్వారా సమాచారం అందచేసి హుటాహుటిన ప్రయాణమయ్యారు. అవినాశ్ను అదుపులోకి తీసుకునేందుకు సీబీఐ అధికారులు కర్నూలు పంచలింగాల చెక్పోస్టు వద్ద నిరీక్షిస్తున్నట్లు టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేసింది. ఎల్లో మీడియా ప్రతినిధులు చెక్పోస్టు వద్దే కాపుకాసి అవినాశ్ కాన్వాయ్ను వెంటాడారు. మధ్యాహ్నం 1.12 గంటల సమయంలో అవినాశ్ చెక్పోస్టు దాటి పులివెందుల మార్గంలో వెళ్లారు. అనంతరం తాడిపత్రి సమీపంలోని చుక్కలూరు వద్ద అంబులెన్స్లో తల్లిని చూసి అవినాశ్ కంటతడి పెట్టారు. పులివెందుల వెళ్లకుండా తిరిగి తల్లితో పాటు హైదరాబాద్ వచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే శ్రీలక్ష్మి పరిస్థితి విషమించడంతో కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రికి తరలించారు. దీంతో ఎల్లో మీడియా మరో దుష్ప్రచారానికి తెర తీసింది. శ్రీలక్ష్మి ఆరోగ్యంగానే ఉన్నారని, సీబీఐ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు అవినాశ్ ప్రయత్నిస్తున్నారంటూ మానవత్వం లేకుండా చానళ్లలో చర్చలు నిర్వహించింది. పరిస్థితి ఆందోళనకరం శ్రీలక్ష్మి అనారోగ్యంపై భిన్న కథనాల నేపథ్యంలో విశ్వభారతి ఆస్పత్రి గుండె వైద్య నిపుణుడు హితేశ్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఛాతీలో నొప్పి వచ్చి శ్రీలక్ష్మి కిందపడిపోయారు. లో బీపీ అని భావించి పులివెందుల ఆస్పత్రిలో చేర్పించారు. తరువాత కర్నూలు తీసుకొచ్చారు. ఈసీజీ చేస్తే మార్పులు కనిపించాయి. కొన్ని పరీక్షలు చేశాం. రిపోర్టులు రాలేదు. కార్డియాక్ ఎంజైమ్స్లో మార్పులు వచ్చాయి. సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇది ఆందోళనకర పరిస్థితి. మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉంది. యాంజియోగ్రామ్ కూడా చేస్తాం. ఎంజైమ్స్ పెరుగుతూ ఉన్నందున ప్రతి రెండు గంటలకు ఒకసారి పరీక్షలు చేయాలి. ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది’ అని పేర్కొన్నారు. చదవండి: ‘రాష్ట్ర ప్రజలే చంద్రబాబుకు, టీడీపీకి సమాధి కడతారు’ -
లేఖను ఎందుకు దాచారు?
సాక్షి, హైదరాబాద్/పులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ఆయన కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డిలను మంగళవారం ప్రశ్నించారు. వివేకా మరణించే ముందు రాసినట్టుగా చెబుతున్న లేఖ గురించే వారిద్దరి నుంచి ఎక్కువగా వివరాలు రాబట్టినట్టు సమాచారం. సీబీఐ నోటీసుల మేరకు సునీత, రాజశేఖరరెడ్డి హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో హాజరయ్యారు. వివేకా హత్య తర్వాత జరిగిన పరిణామాలతోపాటు లేఖను ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చింది?, తర్వాత పోలీసులకు అందించడం, వివేకా పీఏ కృష్ణారెడ్డికి హత్య జరిగిన రోజు ఎన్నిసార్లు ఫోన్లు చేశారు? ఆయన నుంచి ఎన్ని ఫోన్ కాల్స్ అందుకున్నారు? హత్య జరిగిన సమాచారం అందిన తర్వాత ఎవరెవరితో మాట్లాడారు? ఇలా పలు అంశాలపై సునీత, రాజశేఖరరెడ్డిలను సీబీఐ అధికారులు మరోమారు సుదీర్ఘంగా ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంపై ఇద్దరి స్టేట్మెంట్లను సీబీఐ అధికారులు నమోదు చేశారు. విచారణకు హాజరుకాని అవినాష్ కాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 16న మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయంలో హాజరు కావాలని 15వ తేదీన ఆయనకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం తాను ముందుగా నిర్ణయించుకున్న పలు కార్యక్రమాల కారణంగా విచారణకు హాజరు కాలేనని.. నాలుగు రోజుల గడువు కావాలని లేఖ ద్వారా అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం వైఎస్సార్ జిల్లా పులివెందులలోని ఆయన ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. అక్కడ ఎంపీ కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో వారి డ్రైవర్కు నోటీసులు అందజేసి అతడి సంతకం తీసుకున్నారు. అవినా‹Ùరెడ్డి ఈ నెల 19న ఉదయం 11గంటలకు హైదరాబాద్లో సీబీఐ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రత్యేక కేటగిరీగా పరిగణించి వసతులు కల్పించండి: భాస్కరరెడ్డి పిటిషన్ జైలులో తనకు ప్రత్యేక కేటగిరీ కింద సదుపాయాలు కల్పించాలని కోరుతూ వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు (ఏ–7) వైఎస్ భాస్కరరెడ్డి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆయనను గత నెలలో సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఉన్నారు. ఈ క్రమంలో తన అనారోగ్యాన్ని, వయసును దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కేటగిరీగా పరిగణించి సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ భాస్కరరెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న కోర్టు తన ఉత్తర్వులను జూన్ 2కు వాయిదా వేసింది. -
వివేకాతో రాజకీయ విభేదాలున్నాయని సీబీఐ ఆరోపణలు అవాస్తవం: ఎంపీ అవినాష్ రెడ్డి
-
అవినాష్రెడ్డి పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: అవినాష్రెడ్డి పిటిషన్పై ఈ సమయంలో వాదనలు వినలేమని తెలంగాణ హైకోర్టు తెలిపింది. హైకోర్టుకు రేపటి నుంచి వేసవి సెలవులు ఉన్నాయని, ఈ రోజు వాదనలు వినిపించినా తీర్పు ఇవ్వడం కుదరదని న్యాయమూర్తి తెలిపారు. ఈ రోజు విచారణ సందర్భంగా హైకోర్టుకు ఇంప్లీడ్ పిటిషనర్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డితో పాటు సీబీఐ ఎస్పీ వికాస్ కుమార్ వచ్చారు. ఇప్పటికే అవినాష్ రెడ్డి తరపు వాదనలు విన్న జస్టిస్ సురేంద్ర .. ఇవ్వాళ విచారణ మొదలు కాగానే.. కొన్ని వ్యాఖ్యలు చేశారు. రేపటి నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు ఉన్నాయని, ఈ దృష్ట్యా జూన్ 5కు ఈ పిటిషన్ ను వాయిదా వేస్తున్నామని తెలిపారు. బెయిల్ పై తీర్పు అన్ని రోజులు రిజర్వ్ లో పెట్టలేమని చెప్పారు. తెలంగాణ హైకోర్టుకు మే 1 నుంచి జూన్ 2వరకు సెలవులు ఇప్పటికే ప్రకటించారు. ప్రతి గురువారం మాత్రం అత్యవసర కేసుల విచారణ చేపడతారు. దాన్ని బట్టి మే 4,11,18,25, జూన్ 1న ప్రత్యేక కోర్టు నిర్వహణ ఉంటుంది. దీనిపై స్పందించిన అవినాష్ తరపు న్యాయవాది, తన క్లయింట్ ను సిబిఐ అరెస్టు చేసే అవకాశం ఉందని, ఆ దృష్ట్యా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. సిబిఐ కావాలనుకుంటే కస్టోడియల్ ఇంటరాగేషన్ కు సహకరిస్తామని తెలిపారు అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాది. సమయం తక్కువగా ఉంది కాబట్టి.. అత్యవసరంగా ఉత్తర్వులు కావాలంటే వెకేషన్ బెంచ్కు పిటిషన్ మార్చుకుంటారా అని జస్టిస్ సురేంద్ర పార్టీలను అడిగారు. మీ విజ్ఞప్తి అత్యవసరమయితే ప్రధాన న్యాయమూర్తి ఎదుట మెన్షన్ చేసి అర్జెన్సీ ఉందని చెప్పాలని, దాన్ని బట్టి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారని జస్టిస్ సురేంద్ర స్పష్టం చేశారు. -
వివేకా కేసులో ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..
-
సీబీఐకి అవినాష్ రెడ్డి ప్రశ్నలు
-
వివేకా కేసు: వీడియో రిలీజ్ చేసిన ఎంపీ అవినాష్
-
వివేకా కేసు: ఎంపీ అవినాష్ రెడ్డి ఫుల్ వీడియో
సాక్షి, వైఎస్సార్: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. కాగా, వివేకా హత్యకు సంబంధించి తన దగ్గరున్న సమాచారంతో ఎంపీ అవినాష్ రెడ్డి ఓ వీడియో రిలీజ్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇస్తూ అవినాష్ రెడ్డి వీడియోను విడుదల చేశారు. వివేకా లెటర్ విషయంపై సీబీఐ ఎందుకు ఫోకస్ పెట్టడం లేదు? సీబీఐ అధికారి రాంసింగ్ ఎవరిని కాపాడుతున్నారు? ఎవరిని కాపాడేందుకు ఇదంతా చేస్తున్నారు? అన్న వివరాలను అవినాష్ రెడ్డి ఇందులో వివరించారు. "వివేకా హత్య తర్వాత శివప్రకాష్ రెడ్డి నాకు ఫోన్ చేశారు. నేను పులివెందుల రింగ్ రోడ్ దగ్గర ఉన్నప్పుడు నాకు కాల్ వచ్చింది. వివేకా మరణించినట్టు శివప్రకాష్ రెడ్డే నాకు చెప్పారు. ఏమైనా అనుమానాస్పదంగా ఉందా అని వివేకా పీఏ కృష్ణారెడ్డిని అడిగాను. ఎలాంటి అనుమానాలు లేవని వివేకా పీఏ చెప్పారు. మేము వెళ్లకముందే వివేకా రాసిన లేఖ, మొబైల్ దాచిపెట్టమని హైదరాబాద్ నుంచి సునీత భర్త ఫోన్ లో ఆదేశించారు. డ్రైవర్ ప్రసాద్ను వదిలిపెట్టవద్దని వివేకా లెటర్లో రాశారు. హత్య అని తేల్చే లేఖను ఎలా దాచిపెడతారు? లెటర్ దాచిపెట్టమని నేనే చెప్పానని సునీత పోలీసులకు ఎందుకు చెప్పలేదు? వివేకా చనిపోయారు, చాలా బ్లడ్ ఉందని మాత్రమే నేను సీబీఐకి చెప్పాను. సీబీఐ విచారణ తీరు ప్రజలకు తెలియాలి. వివేకా హత్య కేసు చుట్టూ ఎన్నో రాజకీయాలు నడుస్తున్నాయి. చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడవద్దనే.. ఎన్ని విమర్శలు వచ్చినా మౌనంగా ఉన్నామని" అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: సీబీఐ స్టేట్మెంట్లో వివేకా రెండో భార్య షమీమ్ సంచలన విషయాలు వివేకా కుటుంబానికి హత్య విషయం తెలిసినా చాలా సేపటివరకు మౌనంగా ఉన్నారని, హత్య విషయం తెలిసినా వెంటనే ఎందుకు పోలీసులకు చెప్పలేదని ప్రశ్నించారు అవినాష్ రెడ్డి. వివేకా కుటుంబం మౌనంగా ఉండడం.. పోలీసులకు చెప్పకపోవడం వెనక అనుమానాలున్నాయని అన్నారు. ఆ కోణంలో సిబిఐ అధికారులు ఎందుకు దర్యాప్తు చేయట్లేదని, తనను ఇరికించేందుకే సిబిఐ కుట్ర పన్నినట్లు తెలుస్తోందని, ఈ కేసులో అన్ని విషయాలు నిజాయతీగా నిగ్గుతేలాల్సిన అవసరం ఉందని అన్నారు అవినాష్ రెడ్డి. -
అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. బెయిల్ పిటిషన్పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు(బుధవారం) వాదనలు వింటామని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. కాగా, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు కాల పరిమితిని సుప్రీంకోర్టు పొడిగించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల 30వ తేదీతో గడువు ముగియనుండగా తాజాగా జూన్ 30 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు వెలువరించింది. -
వివేకా హత్య కేసు: కుట్రదారులతో కుమ్మక్కు
తండ్రిని హత్య చేసినవానిపై పగ తీర్చుకునే కథతో తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. హత్యకు కుట్ర చేసినవారిని జైలుకు పంపించేవరకు చేసిన న్యాయ పోరాటాలూ చూశాం. కానీ తండ్రిని హత్య చేసిన హంతకుడిని ఆప్తుడిగా భావిస్తూ సఖ్యతగా ఉండటం ఏ సినిమా కథలోనూ లేదు. తండ్రి రాజకీయ ప్రత్యర్థులతో జట్టు కట్టడం ఎక్కడా వినలేదు. అందుకే వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, అల్లుడు, పెద్ద బావమరిది తీరు విస్మయం కలిగిస్తోంది. వివేకా రాజకీయ ప్రత్యర్థులు చంద్రబాబు, ఆది నారాయణ రెడ్డి, బీటెక్ రవిలతో ఆయన కుటుంబ సభ్యులు జట్టు కట్టారు. హతుడైన వివేకా కుటుంబ సభ్యులు హంతకుడైన దస్తగిరితో చేతులు కలిపారు. ఈ కుట్ర కథలో సూత్రధారులు, పాత్రధారులూ ఒక్కటయ్యారు. ఆస్తి, రాజకీయ వారసత్వం కోసం కక్షగట్టిన కుటుంబ సభ్యులు కూడబలుక్కుని వాస్తవాలు దాచిపెడుతున్నారు. రాజకీయ ఆధిపత్యం కోసం కాచుకుని కూచున్న ప్రత్యర్థి పార్టీ నేతలు ఆడించినట్టు ఆడుతున్నారు. వెరసి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిజాలకు పాతరేసేందుకు ఆయన సొంత కుటుంబ సభ్యులే యత్నిస్తున్నారు. ఆర్థిక, రాజకీయ వారసత్వ విభేదాలతో వివేకా హత్య దర్యాప్తును తప్పుదారి పట్టిస్తున్న ఈ ముఠా పన్నాగం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. వివేకా శత్రువులతో జట్టుకట్టిన ఆయన కుటుంబ సభ్యులు వైఎస్ వివేకానందరెడ్డికి బయట శత్రువులు, ప్రత్యర్థులతో ఆయన కుటుంబ సభ్యులే జట్టు కట్టడం విభ్రాంతి కలిగిస్తోంది. ఆయనకు రాజకీయంగా శత్రువులు, ప్రత్యర్థులు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి కాగా... ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలతో అల్లుడు–చిన బావమరిది నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి ఆయనకు ఇంట్లోనే శత్రువులుగా మారారన్నది బహిరంగ రహస్యం. అలాంటి నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్ రెడ్డితో పాటు వివేకానందరెడ్డి కుమార్తె సునీత కూడా ప్రస్తుతం ఆ టీడీపీ నేతలతో అత్యంత సన్నిహితంగా ఉంటుండటం విస్మయపరిచేదే. వాస్తవానికి ఒకప్పుడు వివేకా వద్ద డ్రైవర్గా ఉన్న దస్తగిరిని సునీతే పన్లోంచి తొలగించారు. అదే దస్తగిరి వివేకాను నరికి హత్య చేస్తే... అతనితో సునీత, అమె భర్త సఖ్యతగా ఉంటున్నారు. ఈ పరిణామాలను పరిశీలిస్తే ఓ కీలకమైన అంశం చర్చించాల్సిన అవసరం ఏర్పడుతోంది. వివేకానందరెడ్డి మరణిస్తే ఎవరికి ప్రయోజనం అన్నది ఈ కేసులో కీలకంగా మారుతోంది. కడప జిల్లాలో కనీసం ఉనికి చాటుకోవాలంటే వివేకానందరెడ్డి ఉండకూడదన్నది టీడీపీకి రాజకీయ అవసరం. తాను కడప ఎంపీగా పోటీ చేస్తున్నందున వివేకానందరెడ్డి అడ్డుతొలగించుకోవడం అప్పటి టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి ప్రయోజనకరం. పులివెందులలో పట్టు సాధించడానికి వివేకానే అడ్డున్నారన్నది బీటెక్ రవి ఉద్దేశం. అందుకే 2017లో ఎమ్మెల్సీ ఎన్నికల్లోఆయన్ని దొంగదెబ్బతీసిన ఈ ముఠానే 2019లో ఏకంగా భౌతికంగా అడ్డుతొలగించుకునేందుకు కుట్ర పన్నారనటానికే ఎక్కువ అవకాశాలున్నాయని చెప్పాలి. మరి వారితో వివేకా కుమార్తె, అల్లుడు, పెద్ద బావమరిది సఖ్యతగా ఉండటం వెనుక అసలు కోణం ఏమిటన్నదే ఈ కేసులో కీలకం. అసలు టీడీపీ మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి... వివేకా పెద్ద బావమరిది శివ ప్రకాశ్ రెడ్డికి ఎలా సన్నిహితుడయ్యారు? అదీ ఆదినారాయణ రెడ్డిని ఎంపీ ఎన్నికల్లో ఓడించి సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డిని గెలిపించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న నేపథ్యంలో...! దీని వెనుకే అసలు గూడు పుఠాణీ ఉంది. వివేకానందరెడ్డి మరణించిన విషయాన్ని ఆయన పీఏ కృష్ణారెడ్డి చెబితే శివ ప్రకాశ్ రెడ్డి వెంటనే ఎవరికి సమాచారం ఇవ్వాలి... సాధారణంగా సమీప బంధువులకు ముందు చెప్పాలి. కానీ వివేకానందరెడ్డి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న అప్పటి టీడీపీ మంత్రి ఆది నారాయణ రెడ్డికి మొదట ఫోన్ చేసి సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయనేమీ వివేకాకు బంధువు కాదు... మిత్రుడు అంతకన్నా కాదు. పైపెచ్చు రాజకీయ ప్రత్యర్థి. ఏదో విషయాన్ని గోప్యంగా ఉంచాలన్న ఉద్దేశంతోనో... విషయాన్ని పక్కదారి పట్టించే ఎత్తుగడతోనో వారిద్దరి మధ్య ఫోన్ సంభాషణ జరిగి ఉంటుందన్నది తేలిగ్గానే అర్థమవుతుంది. వివేకా ఇంట్లో ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలు వివేకానందరెడ్డి రెండో వివాహం అనంతరం ఆయన కుటుంబంలో తలెత్తిన పరిణామాలు ఈ కేసులో అత్యంత కీలకం. తన రెండో భార్య షమీమ్కు ఆస్తిలో వాటా ఇస్తానని... ఆమెతో తనకు పుట్టిన కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రకటిస్తానని వివేకా చెప్పడమే ఆ కుటుంబంలో విభేదాలకు ఆజ్యం పోసింది. ఎందుకంటే ఆయన ఆస్తికి ఏకైక వారసుడిని కావాలని అల్లుడు–చిన బావమరిది నర్రెడ్డి రాజశేఖర రెడ్డి పట్టుదలతో ఉన్నారు. అందుకే ఆస్తిలో షమీమ్కు వాటా ఇవ్వడాన్ని ఆయన వ్యతిరేకించారు. ఇక రాజకీయంగా వివేకా వారసత్వాన్ని అందుకోవాలని పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డి భావిస్తున్నారు. అందుకు వివేకా సమ్మతించకపోవడంతో పాటు తన రెండో భార్య కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రకటిస్తాననేసరికి కక్ష గట్టారు. అందుకే వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె, అల్లుడు ఆయన్ని విడిచిపెట్టి హైదరాబాద్లో ఉంటుండగా... షమీమ్తో సునీత ఘర్షణ పడ్డారు. జుగుప్సాకరమైన భాషలో వాట్సప్ మెసేజుల ద్వారా దూషించుకున్నారు. షమీమ్ను వివేకా బావమరుదులిద్దరూ తీవ్రంగా బెదిరించారు. 2012లో రోడ్డు ప్రమాదానికి గురైన వివేకాను చూసేందుకు వెళ్లిన షమీమ్ను శివప్రకాశ్ రెడ్డి ఇంట్లోకి రానివ్వలేదు. ఆయన హెచ్చరించడంతో... ప్రాణభయంతో షమీమ్ అన్నయ్య, వదిన కుటుంబం పులివెందుల విడిచిపెట్టి వెళ్లిపోయింది. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివ ప్రకాశ్ రెడ్డిలతో ముప్పు ఉన్నందునే షమీమ్ హైదరాబాద్లో తన చిరునామా కూడా గోప్యంగా ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. షమీమ్కు ఓ ఇల్లు ఇవ్వాలని... ఆమె కుమారుడిని హైదరాబాద్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివించాలని అనుకుంటున్నా గానీ తన కుటుంబ సభ్యులు అడ్డుపడుతుండటంతో సాధ్యం కావడం లేదని వివేకా సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు కూడా. ఎందుకంటే అప్పటికే కుటుంబ వ్యాపార సంస్థలకు సంబంధించి ఆయనకు ఉన్న చెక్ పవర్ను ఆయన కుటుంబ సభ్యులు తొలగించారు. వివేకా ఇద్దరు బావమరుదులు తనను తీవ్రంగా బెదిరించారని వారితో తనకు తన కుమారుడికి ముప్పు ఉందని షమీమ్ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలోనూ స్పష్టం చేశారు. వివేకాకు కూడా ఆయన ఇద్దరు బావమరుదుల నుంచే ముప్పు ఉండేదని చెప్పారామె. ఈ నేపథ్యంలో కుటుంబంలో ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలు ఆయన హత్య వెనక ఎంత బలంగా ఉండవచ్చో తెలియకమానదు. రక్తపు మరకల లేఖపై గప్చుప్..!! వివేకానందరెడ్డికి ఇంటా, బయటా ఉన్న శత్రువులందరూ అన్ని విషయాలపైనా మాట్లాడుతున్నారు కానీ... రక్తపు మరకలతో ఉన్న లేఖపై మాత్రం మౌనం వహిస్తున్నారు. అదే వివేకా రాసిన లేఖ. వివేకా రక్తపు మరకలతో తడిసిన లేఖపై... అంతా కూడబలుక్కుని నిర్ణయించుకున్నట్టు ఒక్క మాటా మాట్లాడటం లేదు. ఎందుకంటే ఈ హత్య కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు, ఆయన బృందం పన్నిన వ్యూహంలో భాగమే ఆ లేఖపై మౌనం!!. విచిత్రమేంటంటే తరచూ టీడీపీ వేదికల మీద ఈ కేసు గురించి మాట్లాడే చంద్రబాబు ఒక్క రోజు కూడా వివేకా రాసిన లేఖ గురించి ప్రస్తావించ లేదు. సునీత, ఆమె భర్త కూడా అసలు అలాంటి లేఖ ఒకటి ఉన్నట్టుగా కూడా మాట్లాడటం లేదు. ఎందుకంటే వివేకా గుండె పోటుతో మరణించారనే కట్టు కథను ప్రచారంలోకి తెచ్చేందుకే ఆ లేఖను ఆ ముఠా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేసింది. వివేకాపై తీవ్రంగా దాడిచేసిన తరువాత హంతకులు ఆయన చేత బలవంతంగా లేఖ రాయించారు. వాళ్లు బెదిరించడంతో... డ్రైవర్ ప్రసాద్ తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరచినట్టు ఆ లేఖలో వివేకా రాశారు. ఆ లేఖను మొదట.. అంటే 2019, మార్చి 15న ఉదయం 6.10 గంటలలోపే చూసిన ఆయన పీఏ కృష్ణారెడ్డి... ఆ విషయాన్ని సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి చెప్పారు. తాము వచ్చే వరకు ఆ లేఖను, సెల్ఫోన్ను ఎవరికి ఇవ్వకుండా దాచి ఉంచాలని నర్రెడ్డి రాజశేఖరరెడ్డి పీఏ కృష్ణారెడ్డితో చెప్పారు. వారు అలా చెప్పకపోయి ఉంటే కృష్ణారెడ్డి ఆ లేఖ విషయాన్ని వెంటనే బయటపెట్టేవారు. దాంతో వివేకాది హత్యేనని అందరికీ వెంటనే స్పష్టత వచ్చేది. గుండెపోటో మరొకటో కాదని వెంటనే తెలిసిపోయేది. అలా తెలిసి ఉంటే... ఎవ్వరూ మృతదేహాన్ని తాకే ప్రయత్నం చేసి ఉండేవారు కాదు. అప్పుడసలు ‘‘రక్తపు మరకలు కడిగిందెవరు? గాయాలకు కట్లు కట్టిందెవరు?’’ అని పదేపదే ప్రశ్నించే అవకాశం చంద్రబాబు నాయుడికి వచ్చి ఉండేదే కాదు. కానీ వారు అలా చేయలేదు. వివేకా గుండెపోటుతో మరణించారని ప్రచారం చేయాలన్న ఉద్దేశంతోనే ఆ లేఖను బయటపెట్టకూడదని సునీత, ఆమెభర్త రాజశేఖరరెడ్డి, బావ శివప్రకాశ్ రెడ్డి నిర్ణయించినట్టు స్పష్టమవుతోంది. అనంతరం టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ద్వారా గుండె పోటు కథను ప్రచారంలోకి తెచ్చారు. గుండె పోటు కథ ప్రచారంలోకి రావడంతో తమ లక్ష్యం నెరవేరిందని వారు భావించారు. ఆ రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి పులివెందుల చేరుకోవటంతో ఆ లేఖతోపాటు వివేకా సెల్ఫోన్ను కృష్ణారెడ్డి వారికి ఇచ్చారు. ఆ లేఖను చదివాక కూడా వెంటనే దాన్ని పోలీసులకు అప్పగించనే లేదు. ఆ సెల్ఫోన్లోని మెస్సేజులు, డేటాను డిలీట్ చేశారు. అనంతరం సునీత ఆదేశాలతో సాయంత్రం 5గంటలకు కృష్ణారెడ్డి ఆ లేఖను, సెల్ఫోన్ను పోలీసులకు ఇచ్చారు. ఆ లేఖను సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఎందుకు గోప్యంగా ఉంచారన్నది ఈ హత్య కేసులో కీలకాంశం. ముందస్తు పన్నాగం ప్రకారమే ఆ లేఖపై మాత్రం ఇటు సునీత, ఆమె భర్త గానీ అటు చంద్రబాబు, టీడీపీ నేతలుగానీ మాట్లాడటం లేదు. అవినాశ్ను వివేకా ఇంటికి వెళ్లమని చెప్పింది శివప్రకాశ్రెడ్డే వివేకా హత్య కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు టీమ్ పక్కా పన్నాగంతో వ్యవహరించింది. వాస్తవాలు వెలుగులోకి రాకుండా...కేవలం ఊహాగానాలు, అభూతకల్పనల చుట్టూనే దర్యాప్తు కేంద్రీకృతం అయ్యేలా చేసేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే టీడీపీ అనుకూల పచ్చ మీడియాలో రోజుకో కట్టుకథను ప్రచారంలోకి తీసుకువస్తూ అటు సీబీఐ దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తూ... ఇటు ప్రజలనూ తప్పుదారి పట్టిస్తోంది. ఎంపీ అవినాశ్ రెడ్డినే లక్ష్యంగా చేసుకుని విషం చిమ్ముతోంది. ఎంపీ అవినాశ్ రెడ్డి వివేకా నివాసానికి ఏ సమయానికి వెళ్లారు... అక్కడ ఏం చూశారు అన్నదే ప్రధానాంశంగా చేసుకుని... వివేకా మృతదేహానికి కుట్లు వేశారని, కట్లు కట్టారనే అవాస్తవాలను ప్రచారంలోకి తీసుకువస్తోంది. వివేకానందరెడ్డి పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డి 2019 మార్చి 15న ఉదయం 6.20 గంటల సమయంలో ఫోన్ చేసి చెబితేనే ఎంపీ అవినాశ్ రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లారు. అప్పటికే ఎన్నికల ప్రచారం కోసం తన అనుచరులతో జమ్మలమడుగు వెళుతున్న ఆయనకు శివ ప్రకాశ్రెడ్డి నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ రాకపోయి ఉంటే ఆయన జమ్మలమడుగు వెళ్లి ఉండేవారు. వివేకా మరణించారని చెప్పి... వెంటనే వెళ్లమంటేనే అవినాశ్ అక్కడికి వెళ్లారు. ఆయన అక్కడకు వెళ్లినా పీఏ కృష్ణా రెడ్డి మాత్రం వివేకా రాసిన లేఖ గురించి చెప్పలేదు. ఎందుకంటే ఆ లేఖ విషయం గోప్యంగా ఉంచమని సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఆయన్ని ఆదేశించారు. ఆ లేఖ విషయాన్ని శివ ప్రకాశ్ రెడ్డి ఎంపీ అవినాశ్కు ఫోన్ చేసినప్పుడు చెప్పినా... లేక ఆయన వివేకా ఇంటికి రాగానే పీఏ కృష్ణా రెడ్డి చెప్పినా ఎవ్వరూ భౌతిక కాయాన్ని తాకే ఉండేవారే కాదు. ఆ లేఖ విషయాన్ని అవినాశ్ వెంటనే పోలీసులకు చెప్పి ఉండేవారు. వివేకా హత్యకు గురయ్యారని అందరికీ వెంటనే తెలిసిపోయేది. అప్పటికే భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు, సాధారణ ప్రజల్ని ఆ మృతదేహం దగ్గరకు ఎవరూ వెళ్లకుండా అవినాశే కట్టడి చేసేవారు. దాంతో ఈ కేసులో కీలక ఆధారాలు పోలీసులకు దొరికేవి. కానీ అలా జరగడం నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదని వాళ్లు పన్నిన వ్యూహమే చెబుతోంది. అందుకే ఆయన లేఖ విషయాన్ని ఎంపీ అవినాశ్కు చెప్పలేదు. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరించి వివేకా హత్య కేసును తప్పుదారి పట్టించారని చెప్పటానికి ఇంతకన్నా ఆధారాలేం కావాలి? ‘కట్టు’కథలో ఇరికించడానికేనా? వివేకానందరెడ్డిని హత్య చేసి.. గుండెపోటుతో మరణించారన్న కట్టు కథను తెరపైకి తేవడానికే శివప్రకాశ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి ఫోన్లో మాట్లాడుకుని ఉంటారన్నది కాస్త లోతుగా పరిశీలిస్తే అర్థమయ్యే విషయం. వారిద్దరి ఫోన్ సంభాషణ అనంతరమే గుండె పోటు కథ తెరపైకి వచ్చింది. వివేకా గుండె పోటుతో మరణించారని శివప్రకాశ్ రెడ్డి తనతో చెప్పారని ఆది నారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఎక్కువగా సిగరెట్లు తాగడంతోనే అలా అయ్యి ఉంటుందని తాను ఆయనతో చెప్పినట్లు కూడా వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి ఎంత కుట్రపూరితంగా గుండె పోటు కథను తెరపైకి తెచ్చారో తెలియటం లేదా? మరోవైపు వివేకాను కుట్రపూరితంగా ఓడించిన బీటెక్ రవి, వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి సన్నిహితుడయ్యారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలకు డబ్బులు ఇచ్చి ప్రలోభాలకు గురిచేసి తాను ఎమ్మెల్సీగా గెలిచానని బీటెక్ రవి తాజాగా పచ్చ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం అంగీకరించారు. అదే ఇంటర్వ్యూలో వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, తాను ఇప్పటికీ అత్యంత సన్నిహితులమని కూడా చెప్పడం గమనార్హం. అంటే వివేకా మరణంతో రాజకీయంగా, ఆర్థికంగా లబ్ధి పొందుతామని భావిస్తున్న వారంతా అప్పుడు ఇప్పుడూ ఒకే జట్టుగా ఉంటున్నారన్నది అర్థం కావటం లేదా? అమరావతి నుంచి కథ నడిపిన బాబు.. వైఎస్ వివేకా హత్యకు గురైన రోజు అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు అమరావతి నుంచి పెద్ద కథే నడిపారు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు కడప ఎస్పీతోనూ టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డితోను, అప్పట్లో ఎమ్మెల్సీగా ఉన్న బీటెక్ రవితోను ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ కేసు దర్యాప్తును ప్రభావితం చేశారు. వివరాలు ఎప్పటికప్పుడు చంద్రబాబుకు అప్డేట్ చేశారు. కడప ఎస్పీకి సైతం ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు దర్యాప్తును ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించేందుకు ఏబీవీ ఎందుకు అంతగా తాపత్రయ పడ్డారన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ... తాను జరిపిన దర్యాప్తులో అసలు లేఖ విషయమే పట్టించుకోలేదు. -
24 వరకు అవినాష్రెడ్డిని అరెస్ట్ చేయొద్దు.. సీబీఐకి సుప్రీం ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో అవినాష్రెడ్డికి ఊరట లభించింది. వివేకా కుమార్తె సునీత పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఈ నెల 24 వరకు అవినాష్రెడ్డిని అరెస్ట్ చేయొద్దని సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న ఉదయం 9.30కి కేసు వివరాలు వింటామని సుప్రీంకోర్టు తెలిపింది. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇస్తే సీబీఐ అరెస్ట్ చేస్తుందని అవినాష్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. తదుపరి విచారణను ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది. చదవండి: ఏది నిజం?: వివేకా హంతకుల్ని నడిపిస్తున్నదెవరు? -
ఇంటింటికెళ్లి సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆరా తీసిన ఎంపీ అవినాష్ రెడ్డి
-
వైఎస్ వివేకా హత్య కేసులో హైకోర్టులో వాదనలు
-
పులివెందులలో వైయస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ
-
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ఎంపీ అవినాష్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ఎంపీ అవినాష్రెడ్డి కలిశారు. ముద్దనూరు నుంచి బి.కొత్తపల్లి జాతీయ రహదారి పనులకు టెండర్ పిలిచి ఆరు నెలలు అయ్యిందని, వీలైనంత త్వరగా పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని కోరారు. బాకరపేట నుంచి బెస్తవారిపేట వయా బద్వేల్, పోరుమామిళ్ల రహదారిని జాతీయ రహదారిగా అప్గ్రేడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని అవినాష్రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
అవినాశ్ను ఇరికించేందుకే గూగుల్ టేకౌట్ కథ
కడప కార్పొరేషన్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాశ్రెడ్డిని ఇరికించేందుకే గూగుల్ టేకౌట్ కథ అల్లుతున్నారని కడప మేయర్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు చెప్పారు. అందుకే తాము కోర్టును ఆశ్రయించామే తప్ప సీబీఐకి భయపడి కాదన్నారు. వైఎస్ కుటుంబం ఇలాంటి ఎన్నో కుట్రలను ఎదుర్కొని నిలబడిందన్నారు. వారిది పదిమందికి సాయం చేసే గుణమే తప్ప ద్రోహం చేసే ఆలోచన లేదన్నారు. సురేష్బాబు శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సీబీఐపై ఉన్న నమ్మకం పోయేలా కేసు దర్యాప్తు సాగుతోందని అన్నారు. తాము లేవనెత్తుతున్న అనుమానాలపై దృష్టి పెట్టకుండా సీబీఐ ఒక కోణంలోనే దర్యాప్తు చేస్తోందని తెలిపారు. అవినాశ్రెడ్డి ఆయనకున్న అనుమానాలన్నీ లిఖితపూర్వకంగా ఇచ్చినా సీబీఐ అధికారులు పట్టించుకోలేదన్నారు. న్యాయవాది సమక్షంలో విచారించాలని, వీడియో తీయాలని కోరినా పట్టించుకోలేదన్నారు. వివేకా చనిపోయినప్పుడు మొదట ఫోన్చేసి చెప్పిన శివప్రకాశ్రెడ్డిని ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. దస్తగిరి అప్రూవర్గా మారడంతో అతడిని స్వేచ్ఛగా వదిలేశారన్నారు. హత్యకు ముందు సునీల్యాదవ్ అవినాశ్రెడ్డి ఇంట్లో ఉన్నాడని చెప్పడం దారుణమన్నారు. సీబీఐ అధికారులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని, ఎల్లో మీడియాకు లీకులిస్తూ అభూత కల్పనలకు తావిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా సీబీఐ అధికారులు వాస్తవాలను వెలికితీసి, నిజమైన దోషులను శిక్షించాలని కోరారు. దస్తగిరి ఎవరి పేరు చెబితే వారిని విచారిస్తున్నారు: వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్ఖాన్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డిని ఇరికించే కుట్ర జరుగుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్ఖాన్ చెప్పారు. ఆయన శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. అప్రూవర్గా మారిన దస్తగిరి ఎవరి పేరు చెబితే వారిని చార్జిషీట్లో పెట్టి విచారణకు పిలవడం సరికాదన్నారు. ఎంపీ అవినాశ్రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా విచారణ పేరిట వేధించి, ఆయన రాజకీయ భవిష్యత్ను నాశనం చేయాలనే కుట్ర కనిపిస్తోందన్నారు. సీబీఐ విచారణను బీజేపీలోని టీడీపీ కోవర్టులు ప్రభావితం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయని చెప్పారు. -
అవినాశ్పై తొందరపాటు చర్యలొద్దు: తెలంగాణ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి అన్ని విచారణ ఫైళ్లను, రికార్డులను న్యాయస్థానం ముందు ఉంచాలని సీబీఐ దర్యాప్తు అధికారిని హైకోర్టు ఆదేశించింది. విచారణ వివరాలను పెన్డ్రైవ్ లేదా హార్డ్ డిస్క్లో పూర్తిగా సీల్డ్ కవర్లో సోమవారం కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. వివేకా హత్య జరిగిన చోట లభించిన లేఖ, దానికి సంబంధించిన ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నివేదికను కూడా సమర్పించాలని సూచించింది. అప్పటి వరకు అరెస్టు సహా ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టవద్దని దర్యాప్తు అధికారి (ఐవో)ని ఆదేశించింది. పిటిషనర్ (కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి) 14న ఉదయం 11 గంటలకు సీబీఐ ముందు హాజరు కావాలని సూచించింది. ఆయన వెంట న్యాయవాది వెళ్లొచ్చని చెప్పింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, తదుపరి విచారణను 13వ తేదీకి వాయిదా వేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తనను శుక్రవారం విచారణకు హాజరు కావాలనడంపై స్టే విధించాలని కోరుతూ కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఒకవేళ విచారణ చేపట్టినా.. అదంతా ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా సీబీఐని ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు. ఎంపీ అవినాశ్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి, సీబీఐ తరఫున అనిల్ కొంపెల్లి వాదనలు వినిపించారు. పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు.. ‘వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ నిమిత్తం సీఆర్పీసీ 160 కింద జనవరి 24న హాజరు కావాలని ఒకరోజు ముందు కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. 24న ఎంపీ విచారణకు హాజరయ్యారు. తన విచారణ వీడియో, ఆడియో రికార్డింగ్ చేయాలని, విచారణ సమయంలో తన న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ జనవరి 27న దర్యాప్తు అధికారులకు అవినాశ్రెడ్డి వినతిపత్రం సమర్పించారు. దీన్ని దర్యాప్తు అధికారి అనుమతించలేదు. మళ్లీ ఫిబ్రవరి 24న హాజరు కావాలంటూ ఫిబ్రవరి 16న నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 22న కూడా అవినాశ్రెడ్డి వీడియో, ఆడియో రికార్డింగ్పై విన్నవించారు. అప్పుడు కూడా అనుమతించలేదు. మరోసారి మార్చి 10న విచారణకు రావాలని మార్చి 5న సీఆర్పీసీ 160 కింద మరో నోటీసు ఇచ్చారు. ఈ క్రమంలో విచారణ పారదర్శకంగా సాగడం లేదని, నిష్పక్షపాతంగా సాగేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషనర్ హైకోర్టు ను ఆశ్రయించారు’ అని నిరంజన్రెడ్డి వివరించారు. విచారణ పేరుతో వేధిస్తున్నారు.. ‘వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ ముందు పిటిషనర్ విచారణ ముగియగానే, మీడియా ఇష్టం వచ్చినట్లు కథనాలు రాస్తూ, ఆయన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగిస్తోంది. వాస్తవాలను పట్టించుకోవడం లేదు. అందువల్లే వీడియో, ఆడియో రికార్డు చేయాలని దర్యాప్తు అధికారులను ఎంపీ కోరారు. అయినా దర్యాప్తు అధికారి దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. విచారణ సమయంలో పిటిషనర్ చెబుతున్న అంశాలను టైపిస్ట్ టైప్ చేస్తుండగా, దర్యాప్తు అధికారి కంప్యూటర్ మౌస్ను పలుమార్లు తన చేతుల్లోకి తీసుకుని కొన్ని లైన్లు తీసివేయాలంటూ టైపిస్ట్కు సూచించారు. కంప్యూటర్ స్క్రీన్ దర్యాప్తు అధికారికి, టైపిస్ట్కు మాత్రమే కనిపించేలా ఉండటంతో ఏం డెలీట్ చేస్తున్నారో పిటిషనర్ చూడలేకపోయారు. అవినాశ్ను విచారణ చేసే సమయంలో నలుగురైదుగురు అధికారులు ఉన్నారు. విచారణ ముగిశాక దీనికి సంబంధించిన ఓ ప్రతిని ఇవ్వమని కోరినా, దర్యాప్తు అధికారి నిరాకరించారు. నిబంధనలు అంగీకరించవని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో పిటిషనర్ వెంట న్యాయవాదిని అనుమతించేలా ఆదేశాలివ్వాలి. ఎఫ్ఐఆర్ సహా ఎక్కడా అవినాశ్ పేరు లేదు. అయినా పలుమార్లు విచారణ పేరుతో వేధిస్తున్నారు. దర్యాప్తు అధికారి.. ముందే ఓ ఊహాజనిత స్క్రిప్ట్ను సిద్ధం చేసుకుని, ఆ మేరకు కావాల్సిన విధంగా సాక్షులను సిద్ధం చేస్తున్నారు. అవినాశ్రెడ్డితోపాటు భాస్కర్రెడ్డిని కూడా దోషిగా చూపించే ప్రయత్నం జరుగుతోంది. దస్తగిరిని వారికి అనుకూలంగా మలచుకుని, ఆ మేరకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు’ అని వాదనలు వినిపించారు. వీడియో రికార్డింగ్తోనే విచారణ వీడియో, ఆడియో రికార్డింగ్పై దర్యాప్తు అధికారి వివరణ తీసుకుని కోర్టుకు తెలియజేయాలని న్యాయమూర్తి.. సీబీఐ న్యాయవాదిని ఆదేశించారు. భోజన విరామం అనంతరం వాదనలు పునః ప్రారంభం కాగా, వీడియో, ఆడియో రికార్డింగ్లతోనే పిటిషనర్ విచారణ సాగుతోందని సీబీఐ న్యాయవాది కోర్టుకు నివేదించారు. వివేకా హత్య జరిగిన చోట దొరికిన లేఖను ఫోరెన్సిక్కు పంపినట్లు చెప్పారు. లేఖ విషయాన్ని 2021 జనవరి 31 నాటి అనుబంధ చార్జీషీట్లో పేర్కొన్నట్లు చెప్పారు. అవినాశ్రెడ్డి.. సాక్షినా? లేక నిందితుడా? అని న్యాయమూర్తి ప్రశ్నించగా, అవినాశ్రెడ్డికి సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చామని.. అవసరమైతే ఆయన్ను, ఆయన తండ్రి భాస్కర్రెడ్డిని అదుపులోకి తీసుకొనే అవకాశం ఉందని సీబీఐ న్యాయవాది చెప్పారు. ఈ సందర్భంగా కోర్టుకు హాజరైన సీబీఐ ఎస్పీ.. ఆడియో, వీడియో రికార్డుల హార్డ్డిస్క్, కేసు ఫైళ్లను ఇప్పుడే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సోమవారం సీల్డ్ కవర్లో సమర్పించాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. కాగా, ఈ పిటిషన్లో వైఎస్ వివేకా కుమార్తె సునీత ఇంప్లీడ్ అయ్యారు. పిటిషన్లో తన పేరు ప్రస్తావించినందున తన వాదనలు కూడా వినాలని కోరారు. వివేకా లేఖను తొక్కిపెట్టారు.. ‘వివేకా హత్య జరిగిన చోట దొరికిన లేఖను దర్యాప్తు అధికారులు తొక్కిపెడుతున్నా రు. వైఎస్ వివేకా అల్లుడే ఆయన్ను హత్య చేశాడని నిందితుడు శివశంకర్రెడ్డి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయితే ఈ కేసు అంశాలను మాత్రం సీబీఐ అధికారులు ఇప్పటివరకు పట్టించుకోలేదు. సీఆర్పీసీలో పేర్కొన్న నిబంధనల మేరకు దర్యాప్తు పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరగడం లేదు. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పాటించడం లేదు. ఈ నేపథ్యంలో పిటిషనర్ వీడియో, ఆడియో రికార్డు చేసేలా, న్యాయవాదిని విచారణ సమయంలో అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలి’ అని పిటిషనర్ న్యాయవాది నివేదించారు. -
వివేకాది ఆస్తి కోసం జరిగిన హత్య: ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : వైఎస్ వివేకానందరెడ్డిది మర్డర్ ఫర్ గెయిన్ (ఆస్తి, సొమ్ము కోసం జరిగిన హత్య) అని కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి స్పష్టం చేశారు. సీబీఐ విచారణ తప్పుదోవలో వెళ్తోందని తాను మొదటి నుంచీ చెబుతూనే ఉన్నానని, అది గూగుల్ టేకౌట్ కాదు టీడీపీ టేకౌట్ అని అన్నారు. తప్పుడు సాక్ష్యాలతో అన్యాయంగా అమాయకులను ఇరికించేలా కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దర్యాప్తులో చాలా కీలక అంశాలను పక్కన పెట్టి, సిల్లీ అంశాలను తెరపైకి తెచ్చి తనకు అంటగట్టే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. సీబీఐ విచారణకు మూడోసారి శుక్రవారం హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. వివేకాకు రెండో పెళ్లి.. వారికి ఓ కుమారుడు.. ♦ వివేకం సార్కు 2006 నుంచి ఒక యువతితో సంబంధం ఉంది. 2011లో ఆమెను పెళ్లి చేసుకున్నారు. దానికి ఇస్లాం లా ప్రకారం తన పేరు షేక్ మహ్మద్ అక్బర్గా మార్చుకున్నారు. పెళ్లి తర్వాత వారికి షేక్ షెహన్షా అనే అబ్బాయి కూడా పుట్టాడు. ఆ అబ్బాయినే వారసుడిగా ప్రకటించాలనే తపన, ఆలోచన ఆయనలో ఉండింది. ♦ హత్య జరగడానికి ముందు ఇల్లంతా డాక్యుమెంట్ల కోసం వెతికారని అప్రూవర్ స్టేట్మెంట్లోనే ఉంది. హత్య తర్వాత కూడా డాక్యుమెంట్లు వెరిఫై చేసుకుని వెళ్లారని చెప్పారు. నా అనుమానం ఏమిటంటే.. నోటరైజ్డ్ విల్లు అది. ఆమె (వివేకా రెండో భార్య) పేరుతోనో, వారి అబ్బాయి పేరుతోనో ఆస్తిని ఇవ్వాలనుకోవడం.. దీన్ని అడ్డుకోవాలనుకోవడం.. ఇందులో ఆసక్తి ఎవరికి ఉందో తెలియాలి. ♦ నా అనుమానం ప్రకారం ఇది మర్డర్ ఫర్ గెయిన్. అందులో భాగంగానే వాళ్లు వివేకానంద రెడ్డి గారిని ఇలా చేశారు. రాబోయే రోజుల్లోనూ న్యాయ పోరాటం చేస్తా. ఆ లేఖ ఎందుకు దాచారు? ♦ నేను గాలి మాటలు మాట్లాడట్లేదు. సొంత కవిత్వాలు చెప్పట్లేదు. రికార్డుల్లో ఉన్నవి, వాటి ద్వారా తెలిసినవే మాట్లాడుతున్నా. నేను వెళ్లే లోపలే సీన్ ఆఫ్ క్రైమ్లో ఉన్న లేఖను సునీతమ్మ భర్త రాజశేఖర్ దాచి పెట్టారు. పీఏ కృష్ణారెడ్డికి ఆ లెటర్ విషయం కానీ, అందులో ఉన్న అంశాలు కానీ ఎవరికీ చెప్పద్దని చెప్పారు. దీంతో పాటు సెల్ఫోన్ను దాచిపెట్టడం తప్పు కాదా? ♦ నన్ను వెళ్లమని చెప్తేనే అక్కడకు వెళ్లాను. లెటర్ ఉన్న విషయం నాకు కూడా చెప్పలేదు. ఆ లెటర్ చాలా కీలక ఆధారం. సరైన సమయానికి దాని విషయం బయటకు చెప్పకపోవడం ఈ కేసులో పెద్ద తప్పు. ♦ నేను ఏ ఒక్కరికీ గుండెపోటని (వివేకా మరణానికి కారణం) చెప్పలేదు. కావాలంటే ఆ రోజు మార్చురీ దగ్గర, మార్చ్ 17న మాట్లాడిన మాటలు చూడండి. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం నేను అలా చెప్పినట్లు చిత్రీకరించింది. ♦ నేను చూసి బయటకు వచ్చి పోలీసులు, కుటుంబీకులు, దగ్గర బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పా. ఇవన్నీ చేయకుంటే తప్పంటారనుకున్నా. చేస్తే తప్పంటారని ఊహించలేదు. ముమ్మాటికీ అది కట్టుకథే ♦ అప్రూవర్ థీయరీనే ఓ కట్టుకథ. ప్రారంభంలోనే గొడవ ప్రస్తావన. రూ.8 కోట్ల డబ్బు రావాల్సి ఉందో, వచ్చిందో వాటి గురించి గొడవ మొదలైందని చెప్తారు. ఆ షేర్ల పంపకం మీద వివేకం సారేమో మొత్తం నాకే కావాలని అన్నట్లు, వీళ్లేమో నువ్వు సగం తీసుకో, నేను సగం తీసుకుంటా అన్నట్లు గొడవ మొదలై ఉండొచ్చంటారు. ♦ ఇదే సీబీఐ విచారణలో ఆ బెంగళూరు సెటిల్మెంట్కు సంబంధించి ఎనిమిది మంది సాక్షులు (ఎల్డబ్ల్యూ 10 నుంచి మొదలై) చాలా స్పష్టంగా చెప్పారు. ఆ సెటిల్మెంట్ ఫెయిల్ అయింది.. ఒక్క రూపాయి డబ్బు కూడా వచ్చే అవకాశం లేదు.. ఆ డాక్యుమెంట్లు అన్నీ ఫోర్జరీ అని చెప్తారు. అంటే రాని, వచ్చే అవకాశమే లేని డబ్బు కోసం ఎవరైనా గొడవ పెట్టుకుని కొట్టి చంపుకుంటారా? ఇది కట్టు కథ అనడానికి ఇది చాలదా? ఇది కుమ్మక్కు కాదా? ♦ సుప్రీంకోర్టులో మా సోదరి (సునీత) వైల్డ్ అలిగేషన్స్తో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ను సమర్థిస్తూ సీబీఐ వాళ్లు కౌంటర్ అఫిడవిట్ వేస్తారు. గురువారం లంచ్ మోషన్ మూవ్ చేస్తూ రెస్పాండెంట్స్గా సీబీఐ డైరెక్టర్, దర్యాప్తు అధికారిని పెట్టాం. మధ్యాహ్నం 2 గంటల కల్లా సీబీఐ వారి కంటే ముందు మా సోదరి తరఫు అడ్వకేట్లు వచ్చారు. అంటే వారికి ఎవరు సమాచారం ఇచ్చారు? ♦ సీబీఐ వాళ్లకు నోటీసు వచ్చిన వెంటనే చిటికలో సమాచారం ఇస్తున్నారు. ఆ రోజు సుప్రీంకోర్టులో కుమ్మక్కై పిటిషనర్కు అనుకూలంగా కౌంటర్ వేసి కోర్టులను తప్పుదోవ పట్టించారు. లంచ్ మోషన్లోనూ ఆమెకు సమాచారం ఇచ్చి ఇంప్లీడ్ చేయిస్తున్నారు. ఇది కుమ్మక్కు కాదా? దీని వెనుక పెద్ద కుట్రలు ఉన్నాయి. ఈ రాజకీయ కుట్రలను తప్పకుండా చేదిస్తాం. న్యాయ పోరాటం చేస్తాం. కంచే చేను మేస్తే.. సీబీఐ ఈ రకంగా కుమ్మక్కై విచారణ చేస్తే మాకు ఎవరు దిక్కు?. అందుకే నోరు విప్పాల్సి వస్తోంది.. ♦ కేవలం కుట్రలకు ఉపయోగపడే వాంగ్మూలాలు తప్ప నిజాలను వెల్లడించే వాంగ్మూలాలు తీసుకోవట్లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను సరిగ్గా మద్దతు ఇవ్వలేదని ప్రచారం చేశారు. అభియోగాలు మోపారు. దాదాపు 800 పైచిలుకు ఎమ్మెల్సీ ఓటర్లు.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు ఉన్నారు. వారిని పిలిచి అడగండి. అదీ చేయరు. అప్రూవర్ థియరీ.. కట్టుకథను అడ్డం పెట్టుకుని విచారణను ఓ వ్యక్తి టార్గెట్గా ముందుకు తీసుకువెళ్తున్నారు. ♦ దీన్ని ఎవరూ హర్షించరు. దీంతో గళమెత్తడం మొదలుపెట్టాం. ఇప్పటి వరకు ఎన్ని విమర్శలు వచ్చినా, మీడియా ఎన్ని విమర్శలు చేసినా, మా సోదరి సునీతమ్మ సుప్రీంకోర్టులో, ఆంధ్ర హైకోర్టులో నాపై ఎన్ని ఆరోపణలు చేసినా మౌనంగానే ఉన్నా. ఎందుకంటే వివేకం సార్ చనిపోయారు.. ఈమె ఆయన కూతురు అని.. విచారణ జరుగుతున్నప్పుడు విచారణ సంస్థపై నమ్మకం ఉండాలని మౌనంగా ఉన్నాను. అయితే విచారణ తప్పుడుదోవలో వెళ్తోందని స్పష్టం కావడంతో నోరు విప్పుతున్నాను. నేను ఎటువంటి తప్పు చేయలేదని ప్రతి ఒక్కరికీ గట్టిగా చెబుతున్నా. చదవండి: వివేకా హత్య కేసులో ఈ విషయాలు ఎందుకు పరిశీలించలేదు? తప్పుదోవలో విచారణ ♦ ఉదయం 10.40–10.45 గంటల మధ్య ఇక్కడికి వచ్చాను. 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విచారించారు. ఆ తర్వాత కోర్టు నుంచి పిలుపు వచ్చిందని దర్యాప్తు అధికారి వెళ్లారు. అయినప్పటికీ 3.30 గంటల వరకు అక్కడే కూర్చోమన్నారు. ఆపై సీబీఐ వాళ్లు వచ్చి మీరు వెళ్లండి.. మళ్లీ మేము పిలిచినప్పుడు రండని చెప్పారు. ♦ విచారణ మొత్తం ఆడియో, వీడియో రికార్డింగ్ కావాలని దర్యాప్తు అధికారిని మొదటి నుంచీ అడుగుతూనే ఉన్నాం. రెండోసారి ఇదే అంశాన్ని సీబీఐ డైరెక్టర్నే అడిగాం. ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో మూడోసారి హైకోర్టును ఆశ్రయించాం. విచారణ తప్పుదోవలో వెళ్తుండటంతో ఇలా చేయక తప్పలేదు. ♦ ఎంపీ టిక్కెట్టే ఈ హత్యకు కారణం అంటే మా జిల్లా వాళ్లు నవ్వుతారు. వివేకం సర్ చనిపోయే రోజు కూడా మైదుకూరు నియోజకవర్గంలోని చాపాడు మండలంలో దాదాపు 300 ఇళ్లు డోర్ టు డోర్ ప్రచారం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామిరెడ్డికి.. ఎంపీ అభ్యర్థిగా అవినాశ్కు ఓటెయ్యండని ప్రచారం చేశారు. కావాలంటే ఆ ఇళ్లకు వెళ్లి అడగచ్చు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని అడగచ్చు.. వాంగ్మూలం తీసుకోవచ్చు. కానీ వీళ్లు (సీబీఐ) అలా అడగరు. వాంగ్మూలం తీసుకోరు. -
ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టులో విచారణ
-
సీబీఐ విచారణపై స్టే విధించాలని హైకోర్ట్ ను కోరిన అవినాష్ రెడ్డి
-
తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు
-
విచారణ రికార్డ్ చేయాలని ఆదేశించండి: ఎంపీ అవినాశ్రెడ్డి పిటిషన్
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తనను శుక్రవారం విచారణకు హాజరు కావాలనడంపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి గురువారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు తాను సహకరిస్తున్నప్పటికీ విచారణ అధికారి సరైన విధానాలు అనుసరించడం లేదని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని హైకోర్టును కోరారు. కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ‘నన్ను మొదటిసారి విచారించినప్పటి నుంచి సీబీఐ అధికారులు అడిగినవి, అడగనివి కూడా చిలువలు పలువులు చేస్తూ దుష్ప్రచారం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలకు కొమ్ముకాసే పత్రికలు, టీవీ చానళ్లు, సోషల్ మీడియా వేదికలు ప్రజల్లో అపోహలు కలిగించేలా అవాస్తవాలను వ్యాప్తిలోకి తీసుకొచ్చాయి. ప్రజల్లో అపోహలు తొలగించేందుకే సీబీఐ విచారణను రికార్డు చేయాలని విచారణ అధికారిని లిఖితపూర్వకంగా కోరాను. రెండోసారి విచారణకు పిలిచినప్పుడు కూడా రికార్డు చేయాలని సీబీఐ డైరెక్టర్ను, విచారణ అధికారి రామ్సింగ్ను లిఖితపూర్వకంగా కోరాను. అయినా పట్టించుకోలేదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించాను’ అని పిటిషన్లో పేర్కొన్నారు. నేడు విచారణ అవినాశ్ రెడ్డి పిటిషన్ను పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ విజయ్సేన్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సంబంధించిన కేసులు విచారించే బెంచ్కు పంపారు. ఈ పిటిషన్ను జస్టిస్. కె.లక్ష్మణ్ బెంచ్ శుక్రవారం విచారించనుంది. చదవండి: జగనన్న విద్యా కానుకపై ‘ఈనాడు’ ఏడుపు -
సీబీఐ ప్రశ్నలకు నాకు తెలిసిన సమాధానాలు చెప్పా
-
విచారణ జరుగుతుండగానే మీడియానే ట్రయల్ చేసి దోషులు ఎవరో తేల్చేస్తున్నారు: అవినాష్ రెడ్డి
-
ముగిసిన ఎంపీ అవినాష్రెడ్డి సీబీఐ విచారణ
హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. సీబీఐ విచారణలో భాగంగా ఈరోజు(శుక్రవారం) హైదరాబాద్కు వచ్చిన అవినాష్రెడ్డి.. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. తనకు తెలిసిన వాస్తవాలే సీబీఐకి చెప్పానని ఈ సందర్భంగా అవినాష్రెడ్డి పేర్కొన్నారు. సరైన దిశలో విచారణ జరగాలనే తాను చెబుతున్నానని, వాస్తవాన్ని టార్గెట్ చేయకుండా వ్యక్తిని టార్గెట్ చేసి విచారణ జరుగుతోందని అవినాష్రెడ్డి పేర్కొన్నారు. ‘సీబీఐ ప్రశ్నలకు నాకు తెలిసిన సమాధానాలు చెప్పా. సీబీఐ కౌంటర్కు సంబంధించిన ప్రశ్నలు అడిగారు..అన్నింటికీ సమాధానాలు చెప్పా. విచారణపై ఎవరికైనా సందేహాలు వస్తాయి. వివేకా చనిపోయిన రోజున మార్చురీ దగ్గర ఏం మాట్లాడానో ఇప్పుడు కూడా అదే చెబుతున్నా. అదే వాస్తవం. నేను వెళ్లే సమయానికి లెటర్ను దాచిపెట్టారు. ఆ లెటర్లో అనేక విషయాలు ఉన్నాయి. విచారణ జరుగుతుండగానే మీడియానే ట్రయల్ చేసి దోషులు ఎవరో తేల్చేస్తున్నారు. విజయమ్మ దగ్గరకు వెళ్లి వస్తే బెదిరించడానికి వెళ్లానని ప్రచారం చేశారు. తెల్లవారజామున మూడు గంటలకు ఫోన్లు చేశానంటూ డిబేట్లు పెట్టారు. తప్పుడు వార్తలు వేయకుండా నిజాలను నిజాలుగా వేయండి. మీడియా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. టీడీపీ చేసిన విమర్శలే సీబీఐ కౌంటర్లో వస్తున్నాయంటే.. గూగుల్ టేకౌటా లేక టీడీపీ టేకౌటా అనేది భవిష్యత్లో తేలుతుంది.విచారణ సందర్భంగా ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని కోరాం. ఎక్కడ ఆడియో, వీడియో రికార్డు చేసినట్లు కనిపించలేదు. నేను సీబీఐకి లేఖ ఇచ్చాను. నేను సీబీఐ దృష్టికి తీసుకెళ్లిన అంశాలపై పూర్తి విచారణ చేయాలని కోరాను. మరోసారి విచారణకు రావాలని సీబీఐ నాకు చెప్పలేదు’ అని అవినాష్రెడ్డి పేర్కొన్నారు. -
స్టీల్ ప్లాంట్ ను జగనన్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది: ఎంపీ అవినాష్ రెడ్డి
-
భానుకోటలో పార్వతి సమేత సోమేశ్వరస్వామి పునరావర్తనం.. పాల్గొన్న వైఎస్ అవినాష్ రెడ్డి
-
ఆ కాల్ రికార్డుల్లో సంచలనం ఏమీ లేదు: సజ్జల
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్రెడ్డి కాల్ రికార్డులో సంచలనం ఏమీ లేదని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహా రాలు) సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ విష యంపై నాలుగు రోజుల నుంచి పచ్చ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, ఏదో జరిగిపోయిందంటూ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మరణించిన అంశాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి తెలియజేసేందుకు, ఆయన ఇంట్లో పనిచేసే (అటెండర్) నవీన్కు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫోన్ చేశారని తెలిపారు. ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. వైఎస్ వివేకా హత్య కేసులో నవీన్, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డిలను సీబీఐ విచారించడంపై పచ్చ మీడియా దుష్ప్రచారం చేస్తుండటం దారుణం అని ధ్వజమెత్తారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే.. ఇందులో కొత్త కోణం ఏముంది? ∙వైఎస్ జగన్కు సమాచారమిచ్చేందుకు ఫోన్ చేయడం తప్పా? వైఎస్ అవినాష్రెడ్డి ఫోన్ను ఆ రోజే పోలీసులు చెక్ చేశారు. వైఎస్ జగన్తో మాట్లాడేందుకే అవినాష్రెడ్డి నవీన్కు ఫోన్ చేశారు. ఈ విషయంపై ఎల్లోమీడియా రాద్ధాంతం చేయడం ఎంత వరకు సబబు? ఇందులో సంచలనం ఏముంది? విచారణకు పిలిస్తే నవీన్, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డిలు హాజరయ్యారు. దీంట్లో కొత్త కోణం ఏముంది? - వైఎస్ అవినాష్రెడ్డి జమ్మలమడుగుకు వెళ్తుండగా వివేకానందరెడ్డి బావమరిది శివప్రసాద్రెడ్డి ఫోన్ చేస్తే ఆయన వెనుతిరిగివచ్చాడు. ఒకవేళ ఈయన ఫోన్ చేయకపోతే అవినాష్రెడ్డి వెనక్కి వచ్చేవారు కాదేమో? ఇందులో ఆయన హస్తం ఉందని ఒక కేస్ బిల్డ్ చేసి, దాన్ని బేస్ చేసుకొని ఇన్నేళ్ల తర్వాత విచారణకు పిలిచినప్పుడు దానికి ముందు, వెనుక కొత్త కోణం ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. - ఇందులో ఫ్యామిలీతో సహా అందరూ ఉన్నట్లు ప్రచారం చేయడం రాజకీయం కాక మరేమవుతుంది? టీడీపీ, చంద్రబాబు చేసే నీచ రాజకీయంలో ఇదొక పార్ట్. రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని డ్రామాలు చేస్తారో చూడాలి. లెటర్ విషయం ఎందుకు దాచిపెట్టారు? వివేకానందరెడ్డి మరణించిన వార్త తొలుత వెళ్లింది ఆయన అల్లుడు, ఇంకో బావమరిదికే. అక్కడ ఓ లెటర్ ఉందని, ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయని ఎందుకు దాచిపెట్టారు? అప్పుడే వివేకా అల్లుడు రాజశేఖరరెడ్డి పోలీసులకు ఫోన్ చేసి ఉండవచ్చు కదా? లెటర్ దొరికిందట.. జాగ్రత్తగా ఉండమని శివప్రసాద్రెడ్డి చెప్పాలి కదా? ఎందుకు చెప్పలేదు? అసలు ప్రశ్న అక్కడ వేయాలి. ఆయన ఫోన్ చేస్తే అవినాష్రెడ్డి వెళ్లారు. దానిపై కథలు కథలు అల్లుతున్నారు. మొత్తంగా వైఎస్ జగన్ వద్దకు తీసుకువచ్చేందుకు నవీన్కు ఫోన్ చేశారని, కృష్ణమోహన్రెడ్డికి ఫోన్ చేశారని లింకులు కలిపే దుర్బుద్ధితో రాజకీయాలు చేస్తున్నారు. ఇందులో ఎవరెవరు సూత్రధారులు ఉన్నారో ప్రజలకు తెలుసు. ఈ కేసు నిలబడదు. ఈ అంశంపై మేం ప్రతిసారి వివరణ ఇవ్వాల్సి వస్తోంది. వైఎస్ జగన్పై అక్రమ కేసులు పెట్టినప్పుడు ఆ రోజు సీబీఐ ధోరణి ఎలా ఉందో చూశాం. విచారణకు ఎవరిని పిలవాలో కూడా ఎల్లో మీడియాలో ముందే వచ్చేది. విచారణ చేసే సమయంలో ఏం జరుగుతుందో కూడా కథలు, కథలుగా వచ్చేవి. కుట్ర పూరితంగా సీఎంపై బురద ఇప్పుడు కూడా సీబీఐకి, ఎల్లో మీడియాకు, చంద్రబాబుకు అవే లింకులు ఉన్నాయి. అందుకే దుష్ప్రచారం చేస్తున్నారు. లేనిదాన్నిలాగి కుట్రపూరితంగా బురద చల్లుతున్నారు. ఈ కేసును అడ్డుపెట్టుకుని 2024 ఎన్నికల్లో జగన్ క్యారెక్టర్పై బురద చల్లడానికి కుదురుతుందేమో.. ప్రజల్లో అనుమానాలు తీసుకురావడానికి కుదురుతుందేమో అనే దుర్బుద్ధితో కుట్రలు చేస్తున్నారు. - ఆకాశంపై ఉమ్మితే వారి ముఖాలపైనే పడుతుంది. గతంలో ఇంతకంటే పెద్దవే చెప్పారు. వాళ్ల ధోరణి, కుట్ర బుద్ధి తెలుసు కాబట్టి ప్రజలు విశ్వసించలేదు. చంద్రబాబు, బీజేపీలోని స్లిపర్ సెల్స్పైనే అనుమానాలు ఉన్నాయి. - ఎల్లో మీడియానే చంద్రబాబుకు అజెండా ఫిక్స్ చేస్తుంటే ఆయన నటిస్తున్నారు. వ్యవస్థను ప్రభావితం చేయడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు ఏవైనా చేయగలరు. అందుకే ఇవాళ్టికీ ఆయనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు. చదవండి: ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం సన్నాహకాలపై సీఎం జగన్ సమీక్ష -
సీబీఐ విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
హైదరాబాద్: కడప ఎంపీ అవినాష్రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. వివేకానందరెడ్డి కేసులో ఎంపీ అవినాష్రెడ్డిని సాక్షిగా విచారించే క్రమంలో సీబీఐ నోటీసులు ఇచ్చింది. సీబీఐ ఎస్పీ రామ్సింగ్ ఆదేశాల్లో భాగంగా నోటీసులు అందుకున్న అవినాష్రెడ్డి శనివారం విచారణకు హాజరయ్యారు. వివేకానందరెడ్డి కేసును సీబీఐ విచారిస్తున్న క్రమంలో విచారణ పారదర్శకంగా జరగాలని అవినాష్రెడ్డి కోరుతున్నారు. ఈ మేరకు అవినాష్రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఇదిలా ఉంచితే, సీబీఐకి ఎంపీ అవినాష్రెడ్డి ఓ లేఖ రాశారు. ఈ లేఖలో తాను విచారణకు హాజరవుతున్న విషయాన్ని స్పష్టం చేస్తూనే.. ఓ వర్గం మీడియా తనపై అసత్య కథనాలు ప్రసారం చేయడాన్ని కూడా ప్రస్తావించారు. ‘వివేకానందరెడ్డి కేసు ప్రారంభమైన దగ్గరనుంచి నా ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. పనిగట్టుకుని ఓ వర్గం మీడియా లేనిపోని కథనాలను ప్రసారం చేస్తోంది. తప్పు దోవపట్టించేలా వార్తలను ప్రసారం చేస్తున్నారు. అందుకే విచారణ పారదర్శకంగా సాగాలని కోరుతున్నా’’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు. ‘‘విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డింగుకు అనుమతించాలి. తనతోపాటు ఒక న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలి. ఈ విజ్ఞప్తులను సీబీఐ పరిగణలోకి తీసుకోవాలి’’ అని సీబీఐని ఎంపీ అవినాష్రెడ్డి కోరారు. -
సీబీఐకి కడప ఎంపీ అవినాష్రెడ్డి లేఖ
సాక్షి, వైఎస్సార్ జిల్లా: సీబీఐకి కడప ఎంపీ అవినాష్రెడ్డి లేఖ రాశారు. ఈ నెల 28న జరిగే విచారణకు హాజరవుతున్నానని తెలిపారు. ‘‘వివేకానందరెడ్డి కేసు ప్రారంభమైన దగ్గరనుంచి నా ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. పనిగట్టుకుని ఓ వర్గం మీడియా లేనిపోని కథనాలను ప్రసారం చేస్తోంది. తప్పు దోవపట్టించేలా వార్తలను ప్రసారం చేస్తున్నారు. అందుకే విచారణ పారదర్శకంగా సాగాలని కోరుతున్నా’’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు. ‘‘ఆడియో, వీడియో రికార్డింగుకు అనుమతించాలి. తనతోపాటు ఒక న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలి. ఈ విజ్ఞప్తులను సీబీఐ పరిగణలోకి తీసుకోవాలి’’ అని సీబీఐని ఎంపీ అవినాష్రెడ్డి కోరారు. -
వైఎస్ఆర్ జిల్లాలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు
-
పథకం ప్రకారమే సీఎం జగన్, ఎంపీ అవినాష్పై నిందలు
రాజమహేంద్రవరం రూరల్: వైఎస్ వివేకాందరెడ్డి హత్య కేసులో ఎల్లో మీడియా స్క్రిప్ట్ ప్రకారమే టీడీపీ నేతలు తొలుత ఎంపీ అవినాష్రెడ్డి పైన, ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పైన నిందలు మోపుతున్నారని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్ చెప్పారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వివేకా హత్య కేసులో టీడీపీ, ఎల్లో మీడియా ఒక పథకం ప్రకారం రోజుకోరకంగా కథనం రచించి, రోజుకో టీడీపీ నాయకుడితో మాట్లాడిస్తున్నాయని అన్నారు. ఈ కేసులో బీటెక్ రవి, రాజశేఖర్, టీడీపీ ప్రోద్బలంతో బీజేపీలో చేరిన ఆదినారాయణరెడ్డిపై ఎందుకు నిందలు మోపడంలేదని ప్రశ్నించారు. రాజకీయాల్లో సొంత బావను, మేనల్లుడిని, తోడల్లుడిని, తమ్ముడిని అందరినీ వాడుకుని వదిలేసింది చంద్రబాబేనని అన్నారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగిన సమయంలో చంద్రబాబు సీఎంగా ఉండి ఉంటే ఆయన్ని వదిలిపెట్టే వారు కాదని అన్నారు. చంద్రబాబు సొంత మామనే వెన్నుపోటు పొడిచారని, వంగవీటి రంగా, పింగళి దశరథరామ్ ఉదంతాలను రాష్ట్ర ప్రజలు మరచిపోలేదని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ను రాజకీయ అవసరాలకు వాడుకుని కరివేపాకులా పక్కన పడేశారన్నారు. ఇప్పుడు సీఎం జగన్మోహన్రెడ్డి కుటుంబంపై పడ్డారని దుయ్యబట్టారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో వైఎస్సార్సీపీకి మైలేజ్ వస్తుందన్న కక్షతోనే ఇలాంటి నిందలు వేస్తున్నారని అన్నారు. ఒంటరిగా ఢిల్లీ కోటలు బద్దలుకొట్టిన సీఎం జగన్ను అంగుళం కూడా కదిలించలేరని చెప్పారు. ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తదితరులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. -
రైతులను కూలీలుగా మార్చేందుకు కుట్ర
సాక్షి, మహబూబాబాద్: రైతులను కూలీలుగా మార్చడమే లక్ష్యంగా బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అవినాష్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని మహబూబాబాద్ జిల్లా ఈదులపూసపల్లి గ్రామంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తాము ఎదుర్కొంటున్న కష్టాలను వివరించారు. తామర పురుగు ఆశించిన మిర్చి పంటను చూపించి రైతులు విలపించారు. అనంతరం అవినాష్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి రైతును రాజుగా చూసేందుకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులపై కపట ప్రేమ చూపిస్తోందని విమర్శించారు. రైతుల కోసమే ప్రాజెక్టులు కట్టామని చెబుతూ వరి సాగు చేయొద్దని చెప్పడం శోచనీయమన్నారు. రైతుల భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కుట్రలో భాగంగానే.. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయబోమని చెబుతోందని, విత్తనాల తయారీ కంపెనీలతో కుమ్మక్కై పంటలకు చీడపీడలు ఆశించేలా చేస్తోందని దుయ్యబట్టారు. రైతు వ్యతిరేక చట్టాలు సైతం అందులో భాగమేనన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రైతులు పండించిన ప్రతి గింజను గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని, నష్టపోయిన మిర్చి రైతులకు ఎకరానికి రూ.లక్ష పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎల్హెచ్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు తేజావత్ బెల్లయ్యనాయక్, కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు అండగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్రెడ్డి
వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరులోని వైఎస్సార్ విగ్రహం వద్ద బుధవారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి బహిరంగ సభ నిర్వహించారు. దీనికి ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్టారెడ్డి, మంత్రి కన్న బాబు, ఎంపీ అవినాష్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సభలో.. రైతాంగానికి అండగా నిలుస్తున్నామని నిరూపిస్తూ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి రూ.2 కోట్లతో నియోజకవర్గ రైతులకు 23 ట్రాక్టర్లు పంపిణీ చేశారు. వీటిని 23 రైతు భరోసా కేంద్రాలకు అప్పగించనున్నారు. ఈ సందర్భంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గొప్ప కార్యక్రమం చేపట్టారని అన్నారు. ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచి తన నియోజక ప్రజలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారని కొనియాడారు. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం విద్య , వైద్యం , వ్యవసాయ రంగంలో అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టిందని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తరహాలో తండ్రికి తగ్గ తనయుడిగా నిర్ణయాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నారన్నారు. రైతాంగానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని, వారి కోసం డ్రిప్ ఇరిగేషన్ త్వరగా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. లోకేష్ రాబందులాగా శవాల కోసం ఏడురుచూస్తున్నాడని, రాష్ట్రంలో ఎక్కడ శవం కనిపించినా అక్కడ వాలిపోయి ప్రభుత్వాన్ని నిందించడమే పనిగా పెట్టుకున్నాడంటూ విమర్శించారు. చదవండి: మహిళలు, బాలికల పరిశుభ్రతే ‘స్వేచ్ఛ’ లక్ష్యం -
ఓపెన్జిమ్ను ప్రారంభించిన MP అవినాష్ రెడ్డి
-
తెలంగాణ ప్రభుత్వం పై చర్యలు తీసుకోవాలి
-
పులివెందుల అభివృద్ధికి సీఎం జగన్ అండగా నిలబడ్డారు
-
ఆక్సిజన్ కొరతపై ప్రధాని మోదీకి ఎంపీ అవినాష్రెడ్డి లేఖ
సాక్షి, వైఎస్సార్ జిల్లా : ఆక్సిజన్ కొరతపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్కు ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో ఆక్సిజన్ కొరత వల్ల జరగబోయే నష్ట తీవ్రతను వివరించారు. ఆక్సిజన్ డిమాండ్, సరఫరా విశ్లేషణపై వివరాణాత్మక నివేదికనిచ్చారు. కరోనా బాధితుల ప్రాణాలు కాపాడేందుకు వైఎస్సార్ జిల్లాకు రోజుకు.. 54 కేఎల్ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కేటాయింపులు పెంచాలని కోరారు. -
కేపీ ఉల్లికి అంతర్జాతీయ ఖ్యాతి
ఎన్నో ఏళ్లుగా విదేశాలకు ఎగుమతి అవుతూ, ప్రత్యేకతను సంతరించుకున్నా అభివృద్ధిలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్న కృష్ణాపురం (కేపీ) ఉల్లి పంటకు మహర్దశ పట్టనుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే భౌగోళిక గుర్తింపు లభించింది. దీంతో పంట అభివృద్ధికి బంగారుబాట ఏర్పడింది. రైతులకు కూడా మేలు చేకూరనుంది. కడప అగ్రికల్చర్/మైదుకూరు: కృష్ణాపురం (కేపీ) ఉల్లి పంటకు అరబ్ దేశాల్లో గిరాకీ ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ పంటకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ కల్పించింది. దీంతో రైతులు, రైతు సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కడప పార్లమెంటు సభ్యు లు వైఎస్ అవినాష్రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే ఎస్. రఘురామిరెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలుసార్లు కేపీ ఉల్లికి గుర్తింపు ఇవ్వాలని విన్నవించడంతోనే ఇది సాధ్యమైందని రైతులు అంటున్నారు. బ్రిటీష్ వైశ్రాయ్ల పరిపాలనా కాలంలో కేపీ ఉల్లి విదేశాలకు ఎగుమతి అవుతూ వస్తోంది. మద్దతు ధర కల్పించాలని, పంట కనుమరుగై పోకుండా కాపాడాలని రైతు సంఘాలు పోరాటాలు చేశాయి. అయినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్రలో రైతుల కష్టాలను దగ్గ రగా చూశారు. కుదేలైన వ్యవసాయానికి జవసత్వాలు తీసుకురావాలని కంకణం కట్టుకున్నారు. కేపీ ఉల్లి పంటకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్) వచ్చేలా సహాయ సహకారాలు అందించారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక విదేశీ ఎగుమతులకు ఢోకా ఉండదని, పంట పండినట్లేనని రైతులు అంటున్నారు. ►మైదుకూరు ప్రాంతం నుంచి కడపకు వచ్చే కేసీ కెనాల్ ద్వారా ఉల్లిగడ్డలు కడప సమీపంలోని కృష్ణాపురం రైల్వేస్టేషన్ వరకు పడవల ద్వారా రవాణా అయ్యేవని పెద్దలు సాహితీ వేత్త విద్వాన్ కట్టా నరసింహులు చెప్పారు. అక్కడి నుంచి నాటి మద్రాసు నేటి చెన్నై ఓడరేవు వరకు రైలులో వెళ్లేదన్నారు.అక్కడి నుంచి బ్రిటీషు వాళ్లు వారి దేశానికి ఎగుమతి చేసుకునే వారన్నారు. కేపీ ఉల్లిగడ్డలను మందులలో ముడి పదార్థంగా వాడతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.గత టీడీపీ ప్రభుత్వం పంట సాగు చేసిన రైతులను ఛీకొడుతూ వచ్చింది. ఎగుమతులు లేని పంటను ఎందుకు సాగు చేయాలని నాటి సీఎం, నేటి ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు అప్పట్లో తెగేసి చెప్పినట్లు రైతులు చర్చించుకుంటున్నారు. బ్రిటీష్ కాలం నాటి నుంచి పంట సాగు.....: బ్రిటీష్ వారి పరిపాలనా కాలం నుంచి కర్ణాటకలో మొదలై అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, ప్రకాశం జిల్లా మార్కాపురం వరకు ఈ పంట సాగవుతూ చిట్టిబళ్లారి, చిన్న బళ్లారి, రెడ్లేడీ, అగ్రిబ్రౌన్ రోజ్గా రూపాంతరం చెందింది. కేపీ ఉల్లిగా పేరు తెచ్చుకుని విస్తరించింది. రాయలసీమ జిల్లాల్లోని అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో లక్షల హెక్టార్లలో ఏటా సాగవుతూ ఉండేది. అయితే మన ప్రభుత్వాలు పంట దిగుబడిని ఎగుమతులు ఇవ్వకుండా మొండికేస్తూ వచ్చాయి. ధరలు పతనమవుతూ రావడంతో రైతులు పంట సాగు చేయడం తగ్గిస్తూ వచ్చారు. అయితే వైఎస్సార్ జిల్లాలోని మైదుకూరు కేంద్రంగా మైదుకూరు, ఖాజీపేట, దువ్వూరు, బ్రహ్మంగారి మఠం, సింహాద్రిపురం, వీరపునాయునిపల్లె, కలసపాడు, పోరుమావిళ్ల, కాశినాయన మండలాలు, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని మండలాలు, ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని మండలాల్లో మాత్రమే సాగవుతోంది. సంతోషకరం కేపీ ఉల్లి చారిత్రక పంట. బ్రిటిష్ కాలం కంటే ముందే ఈ పంటను రైతులు సాగు చేశారు. అయితే ఎన్నో ఏళ్లు ప్రభుత్వాలు కేపీ ఉల్లి రైతులను పట్టించుకోలేదు. ఇప్పటికైనా ఈ పంటకు భౌగోళిక గుర్తింపు రావడం సంతోషకరం. – లెక్కల వెంకటరెడ్డి, కేపీ ఉల్లి రైతుల సంఘం నాయకుడు, మైదుకూరు రైతు సంఘాల కృషి వల్లే రైతు సంఘాలు ఉద్యమాలు చేయడం వల్లే కేపీ ఉల్లి రైతులకు మేలు జరుగుతూ వచ్చింది. ఇప్పుడు భౌగోళిక గుర్తింపు వల్ల పంటను అభివృద్ధి చేయాలి. – రాజమోహన్రెడ్డి, కేపీ ఉల్లి ఉత్పత్తిదారుల సంఘం నాయకుడు, మైదుకూరు. -
వైద్యుల సేవలు వెల కట్టలేనివి: అవినాష్రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కరోనా వ్యాప్తి నివారణలో వైద్యుల సేవలు వెల కట్టలేనివని కడప ఎంపీ అవినాష్రెడ్డి అన్నారు. మంగళవారం లీగల్ అవేర్నెస్ డవలప్మెంట్ సొసైటీ ప్రతినిధి పెనుబాల విజయ్కుమార్ ఆధ్వర్యంలో కడప రిమ్స్ ఆసుపత్రిలో వైద్యులకు, సిబ్బందికి పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్క్లు పంపిణీ చేశారు. సుమారు 11 లక్షల విలువైన సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మాజీ మేయర్ సురేష్బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థ సేవాభావంతో ముందుకొచ్చి వైద్యులకు కిట్లను అందజేయడం శుభపరిణామం అన్నారు. రాష్ట్రంలో నూతనంగా 16 మెడికల్ కళాశాలల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆసుపత్రుల్లో అవసరమైన అన్ని పరికరాలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. -
ఆందోళనకు గురికావొద్దు : ఎంపీ అవినాష్రెడ్డి
సాక్షి, కడప : లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న పేదలకు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి నిత్యావసరాలు పంపిణీ చేశారు. వైఎస్సార్జిల్లా జమ్మలమడుగు మండలం గొరిగెనూరు, ధర్మాపురం గ్రామాల్లో ఇంటింటికి 13వస్తువులతో కూడిన ప్యాకెట్లను ఎమ్మెల్యే సుధీర్రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. మండలంలోని 14 గ్రామాల్లో 14వేల కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నట్టు ఎంపీ అవినాష్రెడ్డి తెలిపారు. గొరిగెనూరు గ్రామానికి చెందిన రామయ్య అనే వ్యక్తి గ్రామంలోని పేదలు ఇబ్బంది పడుతున్నారని సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించిన ఎంపీ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్రెడ్డి గ్రామానికి వచ్చి నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఎవరూ ఆందోళనకు గురికావొద్దని, ప్రతిఒక్కరూ భౌతిక దూరం పాటించి వైరస్ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. -
పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎంపీ
-
ఎంపీ లాడ్స్ కింద రూ. 2 కోట్లు ఇచ్చిన వైఎస్ అవినాష్ రెడ్డి
-
పేదలకు తోడుగా సీఎం వైఎస్ జగన్
-
నేటితో వైఎస్సార్ జిల్లా వాసుల కల నెరవేరింది..
-
‘ఆయనవి ఉత్తుత్తి దీక్షలే’
సాక్షి, జమ్మలమడుగు: వైఎస్సార్ జిల్లా వాసుల కల నేటితో నెరవేరిందని ఎంపీ అవినాష్ రెడ్డి తెలిపారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి బహిరంగ సభలో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాతో పాటు స్టీల్ప్లాంట్ ఇస్తామని మోసం చేశారని.. గత ప్రభుత్వం స్టీల్ప్లాంట్కు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ స్టీల్ప్లాంట్ శంకుస్థాపనకు ముందే ముడిసరుకు కేటాయించారన్నారు. స్టీల్ప్లాంట్ ద్వారా 25 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. మడం తిప్పని నాయకుడు.. ప్రతిపక్ష నేత చంద్రబాబువి ఉత్తుత్తి దీక్షలేనని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విమర్శించారు. మాట ఇస్తే మడం తిప్పని నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని అన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించారన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే.. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే స్టీల్ప్లాంట్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. మూడేళ్లలో స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేసి 25 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. పాదయాత్రలో సీఎం జగన్ మాట ఇచ్చిన ప్రకారమే ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారని తెలిపారు. వైఎస్సార్ జిల్లా వాసుల కల నేడు నెరవేరిందన్నారు. -
ఎంపీ చొరవతో బీమాకు కదలిక
సాక్షి, కడప: పంట బీమా సొమ్ము కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న రైతుకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించబోతోంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి చొరవతో ఇది సాధ్యపడనుంది. 2012 రబీ సీజన్లో చాలామంది బుడ్డశనగ సాగు చేశారు. చీడపీడలు, తీవ్ర వర్షాభావం, అకాల వర్షాల కారణంగా పంట దిగుబడి రాకుండా పోయింది. ఫలితంగా రైతులకు నష్టం వాటిల్లింది. పంట నష్టంపై బీమా చెల్లించలేదు. నాటి నుంచి నేటి వరకూ ఎంపీ అవినాష్రెడ్డి ఈ సమస్యపై సుదర్ఘ పోరాటం చేస్తూనే ఉన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, వ్యవసాయ బీమా కంపెనీ డైరెక్టర్ బూటానీలను పలుపర్యాయాలు కలిసి విన్నవించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర వాటా చెల్లించనందున, సాగు తేదీలు తప్పుగా రాసినందున బీమా చెల్లించలేక పోయామని అప్పట్లో అవినాష్రెడ్డికి బీమా కంపెనీ డైరెక్టర్ చెప్పారు. రాష్ట్ర వాటా చెల్లించాలని టీడీపీ ప్రభుత్వంపై ఆయన పలు సందర్భాల్లో ఒత్తిడి చేశారు. అయినా గత ప్రభుత్వం స్పందించలేదు. ఎంపీ వినతిని పెడచెవిన పెట్టింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఎంపీ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఒత్తిడి పెంచారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని, రాష్ట్ర వ్యవసాయశాఖ ఉన్నతాధికారులను ఆయన ఇటీవల కలిశారు. ప్రీమియం చెల్లింపుపై కేంద్ర వ్యవసాయ బీమా కంపెనీతో చర్చించారు. ఆ చర్చలు ఫలప్రదమయ్యాయి. ఎంపీ చిరకాల ప్రయత్నాలు కొలిక్కి రానున్నాయి. త్వరలోనే ప్రభుత్వం బీమాకు సంబంధించి రాష్ట్ర వాటా చెల్లించనుందని సమాచారం. 2012నాటి బుడ్డశనగ బీమా చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం, బీమా కంపెనీ కూడా ముందుకు వచ్చాయి. జిల్లాలోని 20,655 మంది రైతులకు బుడ్డశనగ బీమా చెల్లింపు వల్ల లబ్ధి చేకూరుతుందని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి సాక్షికి చెప్పారు. త్వరలోనే సుదీర్ఘ ప్రయత్నానికి తెరపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. -
‘ఆది’ నుంచి పార్టీ అంతం వరకూ...
సాక్షి ప్రతినిధి కడప : టీడీపీ నేలవిడిచి సాము చేసింది. ప్రజా శ్రేయస్సును విస్మరించి పాలకపక్షం స్వార్ధానికి అగ్రాసనమేసింది. పోల్ మేనేజ్మెంట్ నేర్పుంటే గెలుపొందుతామనే ధీమాతో వ్యవహరించింది. ఇదే? దిశగా టీడీపీ అధినేత పావులు కదిపారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆదినారాయణరెడ్డి పార్టీలో చేర్చుకున్నారు. చంద్రబాబు అంచనాలకు తగ్గట్లుగా ఆ తర్వాత వచ్చిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆదినారాయణ వ్యూహం పన్నారు. జిల్లాలోని 831 మంది సభ్యులున్న ఎన్నికల్లో సామ దాన దండోపాయాలను ప్రదర్శించారు. ఫలితంగా ఆ ఫలితాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ప్రత్యక్షంగా పోలీసుల ద్వారా బెదిరింపులకు పాల్పడి, దాదాపు రూ.100కోట్లు పైగా ఖర్చు చేసి ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుంది. అప్పట్లో 38ఏళ్లు రాజకీయ చరిత్రను 38ఓట్లతో కూల్చామని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి విర్రవీగేవారు. టీడీపీ నేతలు ‘వాపు చూసి బలుపు’అని భ్రమించారు. ఆపై నిస్సిగ్గుగా ప్రతిపక్ష ఎమ్మెల్యే అయిన్ప్పటికీ ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టారు. అమాత్య పదవి రాగానే అంతా తానై టీడీపీలో చక్రం తిప్పారు. అదే ఇప్పుడు పార్టీని నాశనం చేసిందని ఆ పార్టీ సీనియర్లు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఆది తీరుకు తీర్పు... పులివెందుల వేదికగా వైఎస్ కుటుంబాన్ని దూషిస్తే టీడీపీ అధినేత చంద్రబాబు తనకు అగ్రపీఠం వేస్తారని ఆదినారాయణ రెడ్డి భావించారు. అధికారానికి ఆయనలోని అహంకారం జత కలిసింది. అప్పటినుంచి వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. 2017 జనవరి 12న సింహాద్రిపురం మండలం పైడిపాళెం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా అధికారులు, ప్రజలు సాక్షిగా వైఎస్ కుటుంబసభ్యుల్ని చెప్పుతో కొట్టాలని మంత్రి బాహాటంగా వ్యాఖ్యానించారు. ఈ మాటలకు యావత్తు ప్రజానీకం విస్తుపోయారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఎంపికై ఆ పార్టీ పదవి అనుభవిస్తూ ఆదిరించిన కుటుంబాన్ని దూషించడాన్ని జిల్లా వాసులు తట్టుకోలేకపోయారు. కలత చెందారు. తర్వాత కూడా ఆది మరింతగా రెచ్చిపోయారు. తాను మాత్రమే వైఎస్ కుటుంబానికి దీటుగా నిలవగలనే స్థాయిలో ప్రతిసందర్భంలోనూ విపరీత వ్యాఖ్యానాలు చే?సేవారు. సమయం కోసం జనం నిరీక్షించారు. తాజా ఎన్నికల్లో ప్రజలు తీర్పుతో బదులిచ్చారు. ఆదితో టీడీపీ అభ్యర్థులందరినీ దారుణంగా ఓడించారు. 2014 ఎన్నికల్లో వరకూ ప్రత్యక్ష రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని శ్రీనివాసులరెడ్డి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్రెడ్డి చేతిలో 1,90,323 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తాజా ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి స్వయంగా పోటీచేసి అవినాష్రెడ్డి చేతిలో 3,80,976 ఓట్లు తేడాతో ఓడిపోయారు. జమ్మలమడుగులోనూ ఇలాంటి అనుభవం ఎదురైంది. టీడీపీ అభ్యర్థి 51,641 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీనిని బట్టి ఆది పట్ల ప్రజలు ఏ స్థాయిలో కసితో ఉన్నారో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులంటున్నారు. ఆదినారాయణరెడ్డి చెప్పినట్లుగా ప్రజలు వైఎస్ కుటుంబ సభ్యుల్ని కాకుండా దేవగుడి కుటుంబసభ్యుల్ని ఓట్ల ద్వారా తొమ్మిదిన్నర్ర చెప్పుతో కొట్టారని వారు విశ్లేషిస్తున్నారు. ఆదికి ఆరు గురు సోదరులు, ఇరువురు రాజకీయ వారసులు, బావ.. మొత్తం తొమ్మిది మంది ఒక్కో ప్రాంతానికి ఇన్ఛార్జిగా వ్యవహరించి రాజకీయాలు చేశారు. ఆదినారాయణరెడ్డి చెప్పినట్లే 9మందికి తొమ్మిది చెప్పులు, వీరినే నమ్ముకొని రాజకీయాలు చేసిన రామసుబ్బారెడ్డికి అరచెప్పు గుర్తుంచుకునేలా ప్రజలు తీర్పు చెప్పారని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. కడపయాసలో చెప్పాలంటే టీడీపీ దిబ్బలమీద కోడిని తీసుకువచ్చి 2014లో పోటీచేయిస్తే రెండు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయింది. రాజకీయాల్లో తనకే చతురత ఉందని, వరుసగా మూడుసార్లు తాను కాబట్టే జమ్మలమడుగులో గెలిచానని భావించే ఆదినారాయణరెడ్డికి ఈసారి ఎంపీ ఎన్నికల్లో 3.80లక్షల ఓట్ల తేడా చిత్తుగా ఓడిపోయారు. దీనికి కారణం ఆయన వ్యవహారశైలేనని అభిప్రాయం పార్టీలో ఉంది. మదనపడుతున్న పీఆర్ వర్గీయులు... తొలినాళ్ల నుంచి టీడీపీని నమ్ముకొని రాజకీయాలు చేసిన కుటుంబాన్ని కాదనీ, వైరిపక్ష నేతను అధినేత చంద్రబాబు దరికి చేర్చుకున్నప్పుడే ధిక్కరించాల్సిందని సీనియర్లు ఇప్పుడు మదనపడుతున్నారు. ఎమ్మెల్యే సీటు కావాలంటే ఎమ్మెల్సీ పదవీత్యాగం చేయాలని షరతు పెట్టినప్పుడైనా ధిక్కరించి, పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తే మర్యాద దక్కేదని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వర్గీయులు మదనపడుతోన్నారు. ఆదినారాయణరెడ్డి కుటుంబసభ్యులతో కలిసి పీఆర్ కుటుంబసభ్యులు ప్రచారం చేయడంతోనే తమ కొంపమునిగిందంటున్నారు. వైఎస్ కుటుంబానికి జమ్మలమడుగులో అపారమైన అభిమానులున్నారు. వైఎస్ కుటుంబాన్ని ఆదినారాయణరెడ్డి టార్గెట్ చేస్తూ దూషించిన ఫలితం తమపై పడిందని వారు చెబుతున్నారు. జిల్లాలో టీడీపీ భారీ ఓటమికి ఆది ప్రధాన కారకుడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
శభాష్.. అవినాష్
సాక్షి, కడప : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, యువ నాయకుడు వైఎస్ అవినాష్రెడ్డికి 2019 ఎన్నికల్లో జిల్లా ప్రజలు భారీ మెజార్టీని అందించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి 2011 ఉప ఎన్నికల్లో అందించిన మెజార్టీ తర్వాత ఇదే రెండవది కావడం విశేషం. 2014 ఎన్నికల్లో అవినాష్ 1.91 లక్షల మెజార్టీ సాధించారు. ప్రభుత్వ, ప్రజా వ్యతిరేక వి«ధానాలపై ఎప్పటికప్పుడు ఉద్యమిస్తూ....మరోప్రక్క ప్రత్యేక హోదా కోసం పదవిని సైతం తృణ ప్రాయంగా వదిలేసిన వైఎస్ అవినాష్రెడ్డిపై ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. జిల్లా సమస్యలపై అనునిత్యం పోరాడుతూ వచ్చారు. ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రజా నేతను గుర్తించిన ప్రజలు తమకున్న మమకారాన్ని ఓట్ల రూపంలో చూపించారు. ప్రతి రౌండులోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కడప పార్లమెంటు అభ్యర్థికి మెజార్టీ పెరుగుతూనే ఉంది. తాజా ఎన్నికల్లో సుమారు 3.55 లక్షల మెజార్టీని జిల్లా ఓటర్లు అందించారు. ఒక్క పులివెందులలోనే 84,631 ఓట్ల మెజార్టీని పొందారు. ఆయనపై టీడీపీ పక్షాన నిలిచిన ఆదినారాయణరెడ్డికి సొంత నియోజకవర్గమైన జమ్మలమడుగులో కూడా మెజార్టీ రాలేదు. బద్వేలులో 1,55,152 ఓట్లు పోల్ కాగా వైఎస్ అవినాష్రెడ్డికి 1,02,845 ఓట్లు వచ్చాయి. కడపలో ఆయన 1,03,202 ఓట్లు తెచ్చుకుని ప్రత్యర్థిపై 50,690 ఓట్ల మెజార్టీని సాధించారు. ప్రొద్దుటూరులో1,08,712 ఓట్లు రాగా 43,471 ఓట్ల మెజార్టీని సా«ధించారు. కమలాపురం సెగ్మెంట్లో అవినాష్రెడ్డి టీడీపీ అభ్యర్థిపై 37,268 ఓట్ల మెజార్టీ దక్కించుకున్నారు. జమ్మలమడుగులో టీడీపీ అభ్యర్థిపై 51,641 మెజార్టీని సాధించి రికార్డు సృష్టించారు. మైదుకూరులోనూ 28,800 ఓట్లకు పైగా మెజార్టీతో భారీ విజయాన్ని నమోదు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వైఎస్ అవినాష్రెడ్డికి వచ్చిన ఓట్లు కలుపుకుంటే భారీ మెజార్టీ రికార్డు నమోదైంది ఎన్నికలు జరిగిన ప్రతిసారి వైఎస్ అవినాష్రెడ్డి మెజార్టీలో రికార్డులు సృష్టిస్తూ వస్తున్నారు. పెద్దిరెడ్డి మిథున్రెడ్డికి భారీ మెజార్టీ జిల్లాలోని రాజంపేట పార్లమెంటు స్థానానికి సంబంధించి పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని అఖండ మెజార్టీతో ఓటర్లు గెలిపించారు. 2014లో 1.77 లక్షల పైచిలుకు ఓట్లతో గెలిచిన పెద్దిరెడ్డి మిథున్రెడ్డి ఈసారి 2.64 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీని అందించారు. జిల్లాలోని రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలతోపాటు చిత్తూరుజిల్లాలోని పలు నియోజకవర్గాలు రాజంపేట పరిధిలోకి వస్తాయి. ప్రజా సమస్యలతోపాటు ప్రత్యేక హోదా విషయంలో పదవిని కూడా త్యాగం చేసిన పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పట్ల ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. టీడీపీ అభ్యర్థిపై భారీ మెజార్టీతో తిరుగులేని విజయాన్ని నమోదు చేశారు. రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటిలలో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్రెడ్డికి భారీ మెజార్టీ లభించింది. ఏది ఏమైనా జిల్లాలోని ఇరువురు ఎంపీలకు భారీ మెజార్టీ అందించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. -
లోక్సభ అభ్యర్ధిగా వైఎస్ అనినాష్రెడ్డి నామినేషన్
-
నవరత్నాలతో అన్ని వర్గాల ప్రజలకు మేలు
-
ఎన్నాళ్లీ ‘ఆది’పత్యం?
టీడీపీ సర్కారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. అధికారం చేతిలో పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. ప్రాథమిక హక్కులను కాలరాస్తోంది. తన నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులను పర్యటించకుండా గృహ నిర్బంధం చేసిన సంఘటన మంత్రి ఆదినారాయణరెడ్డి దురహంకారానికి దర్పణం పడుతోంది. పులివెందులలో వైఎస్ అవినాష్రెడ్డిని.. జమ్మలమడుగు నియోజకవర్గంలోని నిడుజివ్విలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఎం. సుధీర్రెడ్డిని శనివారం తెల్లవారుజామునే గృహ నిర్బంధం చేసిన సంఘటన ప్రజాస్వామిక వాదులను కలవర పరుస్తోంది. ప్రచారానికి ముందస్తు అనుమతి తీసుకున్నా జిల్లా మంత్రి ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు ఈ చర్యలకు పాల్పడి చట్టానికి తూట్లు పొడిచారు. –పులివెందుల / ఎర్రగుంట్ల పులివెందుల/ఎర్రగుంట్ల : జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లె, సుగుమంచిపల్లెలలో మాజీ ఎంపీ అవినాష్రెడ్డి.. నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్రెడ్డితో కలిసి శనివారం ‘రావాలి జగన్ – కావాలి జగన్’ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. మూడు రోజుల క్రితమే వారు పోలీసుల అనుమతి కోరారు. అయినా ఆకస్మికంగా మంత్రి కూడా ఆ గ్రామాల్లో పర్యటిస్తారనే సాకు చూపుతూ పోలీసులు ప్లేటు ఫిరాయించారు. శనివారం ఉదయం 5గంటలకే పులివెందుల స్వగృహంలో ఉన్న అవినాష్రెడ్డిని డీఎస్పీ నాగరాజ, సీఐలు శంకరయ్య, రామకృష్ణుడు, ఎస్ఐలు పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో వెళ్లి హౌస్ అరెస్టు చేశారు. అదే సమయంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టరు ఎం సుధీర్రెడ్డిని కూడా గృహ నిర్బంధం చేశారు. ఇద్దరు సీఐలు, ఎస్ఐల నేతృత్వంలో ప్రత్యేక పోలీస్ బలగాలు ఆయన ఇంటిని చుట్టుముట్టాయి. గతంలో కూడా వైఎస్ అవినాష్రెడ్డి, డాక్టర్ ఎం.సుధీర్రెడ్డిని, ఎం.హర్షవర్దన్రెడ్డిలను గృహ నిర్బంధం చేశారు. కాగా ప్రస్తుతం అవినాష్ రెడ్డి, సుధీర్రెడ్డిలతో పాటు జమ్మలమడుగుకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు పోరెడ్డి మహేశ్వరరెడ్డి, రాష్ట్ర యువజన కార్యదర్శి హనుమంతరెడ్డిలను కూడా ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజాభిమానం చూసి ఓర్వలేక.. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జమ్మలమడుగు నియోజకవర్గంలో వైఎస్ అవినాష్రెడ్డి, సుధీర్రెడ్డిల రాకను సాదరంగా ఆహ్వానించేందుకు వైఎస్సార్ అభిమానులు సిద్ధమయ్యారు. ఓర్వలేని మంత్రి ఆదినారాయణరెడ్డితోపాటు ఆయన సోదరులు శుక్రవారం రాత్రి ఆయా గ్రామాల ప్రజలను ప్రలోభాలకు గురి చేసినట్లు తెలిసింది. వారి మాటలను స్థానికులు లెక్క చేయలేదు. వైఎస్సార్సీపీ నాయకులు గ్రామాల్లో పర్యటిస్తే తమ పట్టు కోల్పోతామోనన్న భయంతో అడ్డుకోవాలని ఆదినారాయణరెడ్డి కుటిల రాజకీయానికి తెర లేపారు. శుక్రవారం అర్ధరాత్రి 12గంటలకు తాము కూడా ఆ గ్రామాల్లో పర్యటిస్తామని పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. దీంతో పోలీసులు శాంతి భద్రతలు సాకు చూపుతూ అవినాష్రెడ్డిని, సుధీర్రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. నేతల పర్యటన అడ్డుకునేందుకు మంత్రి పోలీసులను అడ్డుపెట్టుకున్నట్లుగా ఈ విధంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అవినాష్రెడ్డిని హౌస్ అరెస్టు చేశారని తెలియగానే పులివెందుల నియోజకవర్గంలోని పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన స్వగృహానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులతో వైఎస్ అవినాష్రెడ్డి వాగ్వాదానికి దిగారు. అనుమతి ఇచ్చి అడ్డుకోవడం మంచి పద్దతి కాదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడికైనా పర్యటించే హక్కు ఉంటుందన్నారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. సాయంత్రం 5గంటల వరకు గృహ నిర్బంధం చేశారు. మధ్యలో ఆయన పట్టణంలో వివాహ కార్యక్రమాలు, వాటర్ ప్లాంట్ల ప్రారంభోత్సవాలకు హాజరయ్యారు. ఆయన వెంట పోలీసు బలగాలు అనుసరించారు. దమ్ముంటే తిరగనివ్వండి మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలకు 30 ఏళ్ల రాజకీయ జీవితం ఉంది.. నాకు మూడేళ్ల రాజకీయ జీవితం మాత్రమే ఉంది.. అయినా ఆ ఇద్దరు భయపడుతున్నారెందుకో అర్థం కావడం లేదు.. దమ్మూ, ధైర్యం ఉంటే æతనను స్వేచ్ఛగా తిరగనివ్వాలని సమన్వయకర్త డాక్టర్ ఎం సుధీర్రెడ్డి సవాలు విసిరారు. గృహ నిర్బంధం చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పదవుల కోసం రామసుబ్బారెడ్డి మాదిరిగా దిగజారుడు రాజకీయాలు చేయనన్నారు. 2004, 2009, 2014లలో ఆ గ్రామాలలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోలేదు. సున్నపురాళ్లపల్లె గ్రామంలో ప్రచారానికి డీఎస్పీ షరతులతో కూడిన అనుమతి ఇచ్చారన్నారు. తర్వాత అదే ఊరిలో మంత్రి ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలు కూడా ప్రచారం చేస్తారంటూ తమ అనుమతులను డీఎస్పీ రద్దు చేయడం కక్షపూరిత చర్య అన్నారు. నియోజకవర్గంలో మంత్రి ఆది, మాజీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్సీ శివనాధ్రెడ్డి, రాజ్యసభ సభ్యులున్నారు. ఇంతమంది ఉన్నా భయపడుతూ తనను ప్రచారం చేయకుండా అడ్డుకున్నారని ఎద్దేవా చేశారు. తమ గ్రామమైన సిర్రాజుపల్లెకు మంత్రి ఆదినారాయణరెడ్డి వచ్చినా ఏం కాలేదని గుర్తు చేశారు. గుండ్లకుంటలోకి కూడా పోతాం.. నమ్మకం లేక భయపడుతున్నావని రామసుబ్బారెడ్డిని దృష్టిలో పెట్టుకుని సుధీర్ వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి వైపు పార్టీ నాయకులు.. కార్యకర్తలు.. ప్రజలు ఉన్నారనే భయంతో ఇలా వ్యవహరిస్తున్నారన్నారు. ఇద్దరూ ఫిఫ్టీ ఫిఫ్టీ తరహాలో లాభాలు పంచుకుని చెట్టపట్టాలు వేసుకోని తిరుగుతున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి హర్షవర్దన్రెడ్డితో పాటు నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హైకోర్టుకు వెళ్లయినా గ్రామాల్లో పర్యటిస్తాం వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గతంలో గొనిగెనూరు వెళ్లాలనుకున్నప్పుడు ఇదేవిధంగా అడ్డంకులు సృష్టిస్తే హైకోర్టును ఆశ్రయించి పర్యటించామని చెప్పారు. హైకోర్టు సూచలను పాటిస్తూ పర్యటించామన్నారు. అప్పుడు ఆ గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికి తమకు, వైఎస్సార్సీపీకి అండగా ఉంటామని చెప్పడం జరిగిందన్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డికి ప్రజాబలంపై, ఓటర్ల బలంపై నమ్మకంలేదన్నారు. అందువల్లే ఈ విధంగా పోలీసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆదినారాయణరెడ్డి అనేకసార్లు పులివెందులకు వస్తే ఏరోజు కూడా తాము గానీ, కార్యకర్తలు గానీ అడ్డుకోలేదనే సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ఆదినారాయణరెడ్డి వచ్చినా, రాకున్నా పులివెందుల ప్రాంత ప్రజలు వైఎస్సార్సీపీకి పూర్తి అండగా ఉన్నారన్న విశ్వాసం తమకు ఉండటమేనన్నారు. ఆ నమ్మకం ఆదినారాయణరెడ్డికి జమ్మలమడుగు ప్రజలపై లేదన్నారు. ఆదినారాయణరెడ్డికి నిజంగా ఆయా గ్రామాల్లో బలంలేదన్నారు. కేవలం భయపెట్టి రాజకీయం చేస్తున్నారన్నారు. జమ్మలమడుగు ప్రజలు వైఎస్సార్సీపీని గెలిపించాలని కోరుకుంటున్నారని.. ఈ నేపథ్యంలో తాము అక్కడ పర్యటించి మద్దతు కూడగడితే ఆయనకున్న దేవగుడి పరిసరాలలోని రిగ్గింగ్ బూత్లు పూర్తిగా వైఎస్సార్సీపీ వశమవుతాయని భయపడి పోలీసులను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారన్నారు. ఏదీ ఏమైనా ఆయా గ్రామాల్లో పర్యటించి తీరుతామన్నారు. సమన్వయం కోల్పోకుండా, లాఅండ్ఆర్డర్ సమస్య లేకుండా ముందుకు వెళతామన్నారు. అవసరమైతే హైకోర్టును ఆశ్రయించి ఆ గ్రామాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిపిస్తామని మాజీ ఎంపీ స్పష్టం చేశారు. -
నవ‘రత్నాలని’ తెలియజెప్పాలి
ప్రొద్దుటూరు : వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ ప్రకటించిన నవరత్నాల పథకాలు అమలైతే అవి ప్రజలకు నవరత్నాల్లాంటివి అవుతాయని, ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరు గ్రామంలో ఆదివారం రావాలిజగన్–కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు నాగేంద్రారెడ్డి, కల్లూరు గ్రామంలోని 726 ఇళ్లకు సంబంధించి నవరత్నాలపై చేసిన సర్వే వివరాలను వెల్లడించారు. ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ రైతు భరోసా, పేదలందిరికి ఇళ్లు, వైఎస్సార్ ఆసరా, అ మ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, పింఛన్ల పెంపు, జలయజ్ఞం, మద్యపాన నిషేధం, ఇతర పథకాలను వివరించడంతోపాటు ఏపథకం, ఏ ఇంటికి వర్తిస్తుం ది, ఎంత మేర లబ్ది పొందవచ్చు అనే విషయంపై ఇంటింటా పేర్లు నమోదు చేసి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్లెక్సీలను వీరు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అవినాష్రెడ్డి మాట్లాడుతూ గత 9 ఏళ్లుగా వైఎస్సార్కాంగ్రెస్పార్టీ కార్యకర్తలు పార్టీ అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేశారన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం చెప్పుకోలేరని, మన పార్టీ మాటలనే జనం విశ్వసిస్తారన్నారు. ఇచ్చిన మాట కోసం ఎంత కష్టమైనా, నష్టమైనా జగన్మోహన్రెడ్డి నిలబడుతారన్న నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నారన్నారు. గత ఎన్నికలకం టే ఈ మారు అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేను గె లిపించాలని కోరారు. వైఎస్సార్సీపీ కడప పార్లమె ంట్ కన్వీనర్ సురేష్బాబు మాట్లాడుతూ కల్లూరు గ్రామంలో బూత్ కన్వీనర్లు, బూత్ కమిటీ మెంబర్లు చేసిన సర్వేను అభినందించారు. ఇలాంటి సర్వే నిర్వహించడం వలన ఆయా గ్రామాల్లో మెజారిటీని మనం అంచనా వేసుకోవచ్చని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే ఇప్పటిలా కాకుండా ఆయా ఇంజినీరింగ్ కాలేజిలు నిర్దేశించిన పూర్తి ఫీజును చెల్లిస్తామని ప్రకటించారన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తే వైఎస్ అవినాష్రెడ్డికి ఎప్పటికీ ఓటమి ఉండదని, భవిష్యత్తులో కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయని అన్నారు. పార్టీకి నాయకులు, కార్యకర్తలు ఆక్సిజన్లాంటివారన్నారు. గత ఎన్నికల్లో కూడా నియోజకవర్గానికి సంబంధించి ప్రొద్దుటూరు మండలంలో కల్లూరు గ్రామంలో 1950 ఓట్లలో 650 ఓట్లు తనకు మెజారిటీ రాగా వెలువలి గ్రామంలో 616 ఓట్లు నారాయణరెడ్డి అన్న ద్వారా వచ్చాయన్నారు. -
‘వైఎస్సార్ కుటుంబాన్ని నమ్మినవారికి అండగా ఉంటాం’
సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను జమ్మలమడుగు మండలం గొరిగెనూర్లో అడుగుపెట్టకుండా మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన కుట్రలు విఫలమయ్యాయి. హైకోర్టు ఉత్తర్వులతో వైఎస్సార్ సీపీ నేతలు శుక్రవారం గొరిగెనూరులో అడుగుపెట్టారు. గ్రామానికి చెందిన పలువురు నేతలు నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ అవినాశ్రెడ్డి సమక్షంలో ఓబులేసు, భాస్కర్రెడ్డి, నీలకంఠ అనుచర వర్గం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జమ్మలమడుగు ఇంచార్జ్ సుధీర్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాశ్రెడ్డి మాట్లాడుతూ.. ఓబులేసుతో సహా పలువురు నేతలు తమ పార్టీలో చేరినట్టు వెల్లడించారు. తమను ఇక్కడికి రాకుండా అడ్డుకోవడానికి ఎన్ని అడ్డంకులు సృష్టించారో ప్రజలు అంత చూశారని అన్నారు. వైఎస్సార్ కుటుంబాన్ని నమ్మే ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సుధీర్రెడ్డి మాట్లాడుతూ.. స్థానికంగా ఏం జరిగిన మంత్రి ఆదినారాయణ రెడ్డి బాధ్యత వహించాలని అన్నారు. ప్రతి గ్రామంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగరాలని అన్నారు. గత కొద్ది రోజులుగా వైఎస్సార్ సీపీ జిల్లా నేతలు గొరిగెనూరుకు వెళ్లకుండా పోలీసులు నియంత్రించిన సంగతి తెలిసిందే. దీనిపై వైఎస్సార్ సీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. గురువారం వైఎస్సార్ సీపీ నేతల రిట్ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్య దేశంలో ఒక గ్రామానికి వెళ్లకుండా వ్యక్తుల అంక్షలు విధించడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. -
పోలీసుల అత్యుత్సాహం: వైఎస్సార్సీపీ నేతల హౌజ్ అరెస్ట్
సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్ కడప జిల్లాలో పోలీసులు అత్యుత్యాహం ప్రదర్శిస్తున్నారు. పార్టీ కార్యక్రమానికి హాజరు కావాల్సిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలను పోలీసులు బుధవారం హౌజ్ అరెస్ట్ చేశారు. పులివెందులలో వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ అవినాశ్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్రెడ్డిలను, కడపలో మేయర్ సురేశ్ బాబును, ఎర్రగుంటలో జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త సుధీర్రెడ్డిలను పోలీసులు వారి ఇళ్ల నుంచి బయటకు రాకుండా నిర్భంధించారు. వివరాల్లోకి వెళితే.. జమ్మలమడుగు మండలం గొరిగేనూర్కు చెందిన చాలా మంది కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరేందుకు బుధవారం కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం వైఎస్సార్ సీపీ నాయకులు అవినాశ్రెడ్డి, సుధీర్రెడ్డి, సురేశ్బాబు, శంకర్రెడ్డిలను తమ గ్రామానికి ఆహ్వానించారు. ముందుగా అనుకున్న ప్రకారం నేతలు నేడు ఆ గ్రామంలో పర్యాటించాల్సి ఉంది. కాగా, పోలీసులు మాత్రం మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రాబల్యం ఉన్న గ్రామం అంటూ వైఎస్సార్ సీపీ నేతలను హౌజ్ అరెస్ట్ చేశారు. నేతలు మాత్రం చట్టానికి లోబడి శాంతియుతంగా తమ పర్యటన కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం తమకు దేశంలో ఎక్కడికైన వెళ్లే హక్కు ఉందని గుర్తుచేస్తున్నారు. అధికార పార్టీ నేతల ఆదేశాలతో.. హౌజ్ అరెస్ట్ల పేరుతో ప్రతిపక్ష నేతల హక్కులను కాలరాయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
‘చంద్రబాబుది అధర్మపోరాట దీక్ష’
సాక్షి, వైఎస్సార్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిది అధర్మపోరాట దీక్షని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ అవినాశ్రెడ్డి ఆరోపించారు. అధర్మపాలన సాగిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ధర్మం, న్యాయం, చట్టం నీతిని చంద్రబాబు తుంగలో తొక్కేశారని విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లు బీజేపీతో కలిసివుండి టీడీపీ నేతలు కడప ఉక్కుఫ్యాక్టరీని మరిచిపోయారని మండిపడ్డారు. మంత్రివర్గ భేటీలో భుములను పంచుకోవడం తప్ప రాష్ట్రంలో నెలకొన్న కరుపుపై ఏనాడైనా చర్చించారా అని ప్రశ్నించారు. సీమవాసులు కేడీలని చెప్పిన చంద్రబాబుకు ఈప్రాంతంలో తిరిగే హక్కులేదని అవిశేష్ రెడ్డి అన్నారు. -
సీకే దిన్నె పీఎస్ వద్ద ఊద్రిక్తత
-
యోగివేమన వర్సిటీలో ఉద్రిక్తత
సాక్షి, వైఎస్ఆర్ కడప: యోగివేమన విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. జిల్లా పర్యటనలో భాగంగా వర్సిటీకి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడిని విద్యార్థులు అడ్డుకున్నారు. సీఎం గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులు ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేసి సీకే దిన్నె పోలీస్ స్టేషన్కు తరిలించారు. అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేయాలని కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డిలు స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. దీంతో పీఎస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇక సీఎం వనం-మనం కార్యక్రమంలో భాగంగా యూనివర్సిటీలో మొక్కలు నాటారు. -
టీడీపీ నేతల బెదిరింపులకు భయపడొద్దు
మైదుకూరు(చాపాడు): టీడీపీ నేతల బెదిరింపులకు ఎవరూ భయపడొద్దని.. ప్రతి కార్యకర్తకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని.. భవిష్యత్తు మన పార్టీదేనని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎ మ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డిలు పేర్కొన్నారు. మై దుకూరు పట్టణంలోని 14 వార్డు మూలబాటకు చెం దిన టీడీపీ నాయకులు బ్యాటరీ ఖాదర్బాషా ఆధ్వర్యంలో 100 కుటుంబాలు, 8వ వార్డుకు చెందిన పల్లపోతుల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో 80 కుటుంబా లు ఆదివారం వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మాట్లాడుతూ నాలుగేళ్లుగా టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదన్నారు. టీడీపీ ప్రభుత్వానికి కాలం చెల్లించని, ప్రజల సమస్యల పట్ల అలుపెరుగని పోరాటం చేస్తున్న జగన్మోహన్రెడ్డి సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్సీపీలో చేరిన వారిని బెదిరించటం, భయపెట్టడం లాంటివి మానుకోవాలని, బ్లాక్మేల్ రాజకీయాలు చేస్తే ఊరుకోమన్నారు. కడప మేయర్ సురేష్బాబు మాట్లాడుతూ నాలుగేళ్ల కాలంలో ఏ ఒక్కరికైనా ఇంటి స్థలం మంజూరు చేశారా, పింఛన్ ఇచ్చారా, రోడ్డు వేశారా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా కన్వీనర్ ప్రసాద్రెడ్డి, జెడ్పీటీసీ బాలనరసింహారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మదీనా దస్తగిరి, పట్టణ అధ్యక్షులు కేపీ లింగన్న, చాపాడు ఎంపీపీ నరసింహారెడ్డి, నాయకులు లక్షుమయ్య, కానాల జయచంద్రారెడ్డి, గోశెట్టి లక్షుమయ్య, సొక్కం శివ, దువ్వూరు జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఈ నాలుగేళ్లలో చంద్రబాబు ఏం చేశారు?
చిత్తూరు: సంక్షేమ పథకాల్ని గాలికొదిలేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. అత్యధికాలం సీఎంగా పని చేశాననే ఎప్పుడూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు.. అసలు ఈ నాలుగేళ్లలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలంటూ ప్రశ్నించారు. రూ. 2వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి విద్యావంతలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదేనని ఆయన విమర్శించారు. నాలుగేళ్లలో రాష్ట్రానికి లక్షా 60 వేల కోట్ల అప్పులు మిగల్చడం తప్ప చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. కుప్పుం నుంచి వేలాది మంది కూలీలు బెంగళూరుకు వలస వెళ్లిపోతున్న సంగతిని చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసుంటే కూలీలు వలస వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది కాదంటూ హితవు పలికారు. -
ప్రజలకు అండగా నిలవండి
వేంపల్లె: చిన్న, పెద్దా తేడా లేదు..వీళ్లు వాళ్లు అన్న బేధాలు వద్దు..ఐక్యంగా ప్రజలతో మమేకం కండి..వారి కష్టనష్టాల్లో అండగా నిలవండి..చంద్రబాబు, టీడీపీ నాయకులు ప్రజలను ఏవిధంగా మభ్యపెడుతున్నారో ప్రతి ఇంటా వివరించండి.. ప్రజాకర్షక పథకాలతో టీడీపీ జనాలను ఎలా మోసం చేస్తున్నది తెలియజేయండని కడప మాజీ వైఎస్ అవినాష్రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి బూత్ కమిటీ కన్వీనర్లు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం వేంపల్లెలోని ఎంఎంఆర్ ఫంక్షన్ ప్యాలెస్లో మండలస్థాయి బూత్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ బలోపేతానికి బూత్ కన్వీనర్లు కీలకపాత్ర పోషించాలని తెలిపారు. అందరూ కలిసికట్టుగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలను ప్రజలకు తెలియజేయాలని అన్నారు. మండలంలో 2014 నాటి ఎన్నికల కన్నా భారీ మెజార్టీని తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గ్రామాల్లో ఏ చిన్న సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకరావాలని తెలిపారు. వ్యక్తిగత ద్వేషాలతో పార్టీకి నష్టం కలిగేలా ఏ ఒక్కరు వ్యవహరించ రాదన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటింటికి తిరిగి కొత్త ఓటర్లను చేర్పించాలని..దొంగ ఓట్లను గుర్తించి వాటిని తమ దృష్టికి తీసుకురావాలన్నారు. పార్టీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు మాట్లాడుతూ బూత్ లెవెల్ కమిటీని ముందుగా బలోపేతం చేసుకుని ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని కోరారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన 108, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్, రుణమాఫీ తదితర అనే అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తు చేయాలన్నారు. చంద్రబాబు వంచన తప్ప ఎటువంటి హామీని నెరవేర్చలేదని తెలిపారు. పులివెందులకు కృష్ణా జలాలు తెచ్చిన ఘనత వైఎస్ఆర్దేనన్నారు. ఆయన హయాంలో 95శాతం ప్రాజెక్టుల పనులు పూర్తి చేశారని.. ఆయన మరణానంతరం ప్రభుత్వాలు పట్టించుకోలేదని తెలిపారు. చంద్రబాబు 5శాతం పనులు పూర్తి చేసి గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటు అన్నారు. చంద్రబాబు మోసాలను వివరించండి 40ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటూ ఈ నాలుగేళ్ల వ్యవధిలో చంద్రబాబు చేసిన మోసాలను, ఆయన చేస్తున్న అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు మాజీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి సూచించారు.రైతులకు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ అంటూ అన్ని వర్గాల వారిని ఎలా మోసం చేసింది వివరించాలన్నారు. ప్రత్యేక హోదా అన్నందుకు మనమందరిపైన చంద్రబాబు కేసులు పెట్టించి ప్యాకేజీ చాలని కేంద్ర మంత్రులకు సన్మానం చేసి ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ ఎలా డ్రామాలాడుతోంది వివరించాలన్నారు. ఇక్కడి నాయకులు ఇళ్లు కట్టిస్తాం.. కార్పొరేషన్ రుణాలు ఇప్పిస్తామంటూ మభ్యపెట్టి హామిలతో గ్రామాల్లోకి వస్తున్నారని వారిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. నవరత్నాల గురించి ప్రజలకు తెలపండి.. రాష్ట్రంలో రైతులను ఆదుకున్న మహానుభావుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని, ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాడుతున్నారని మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేపడుతున్నారని తెలిపారు. భావి తరాలకు దిశ దశ చూపించాలని వైఎస్ జగన్ ఆరాటపడుతున్నారని పేర్కొన్నారు. నవరత్నాల గురించి ప్రజలకు తెలియజేయాలని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా బూత్ కమిటీ మేనేజర్ మధుసూదన్రెడ్డి, మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి, ఎంపీపీ రవికుమార్రెడ్డి, జెడ్పీటీసీ షబ్బీర్వల్లి, నియోజకవర్గ బూత్ కమిటీ మేనేజర్ బెల్లం ప్రవీణ్కుమార్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ డాక్టర్ ఎస్ఎఫ్ బాషా, బూత్ కమిటీ కన్వీనర్లు, కమిటీ సభ్యులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
కేసీ కెనాల్కు నీళ్లిచ్చే ఆలోచన చంద్రబాబుకు ఉందా?
-
ఫ్యాక్షన్కు చరమగీతం పాడాలి
జమ్మలమడుగువ(వైఎస్సార్ కడప): నియోజకవర్గంలో ఫ్యాక్షనిస్టుల పరిపాలన సాగుతోందని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. ఫ్యాక్షన్కు చరమగీతం పాడాలని, తిరిగి వైఎస్ కాలం నాటి పరిపాలన రావాలన్నారు. సోమవారం జమ్మలమడుగులో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నిరుపేదల కోసం సీఎం చంద్రబాబునాయుడు ఎన్టీఆర్గృహ కల్ప పేరుతో మూడువందల చదరపు అడుగుల ఇంటిని నిర్మించి నిరుపేదలకు ఇస్తామని చెబుతున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిపి మూడు లక్షలరూపాయలతో ఇంటికోసం నిరుపేదలకు ఇస్తున్నారు. అదనంగా లబ్ధిదారుని పేరుతో బ్యాంకుల్లో మూడున్నర లక్షల అప్పుగా ఇచ్చి దానికి నెలకు 3వేల రూపాయలతో 20 సంవత్సరాల పాటు చెల్లించాలి. అంటే నెలకు మూడు వేల రూపాయలు ఇంటికి బాడుగగా బ్యాంకులకు చెల్లించాలని, ఇదెక్కడి న్యాయమని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ప్రశ్నించారు. కనీసం రెండు సెంట్లు కూడా లేకుండా అపార్టుమెంట్లు కట్టి ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారు. ఆ ఇంట్లో ఇద్దరు వ్యక్తులు కూడా ఉండలేరు. అలాంటి ఇళ్లను నిరుపేదలకు ఆరు లక్షల రూపాయలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయితే నిరుపేదలు బ్యాంకులకు కట్టాల్సిన మూడున్నర లక్షల రూపాయలను మాఫీ చేసి వారిపేరుమీద ఇంటికి సంబంధించిన పత్రాలను ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర కార్యదర్శి హర్షవర్థన్రెడ్డి, శింకర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేశ్వరరెడ్డి పట్టణ అధ్యక్షుడు పోరెడ్డి మహేశ్వరరెడ్డి,మైనార్టీ నాయకులు కులాయ్భాష, ఇస్మాయిల్, ఎర్రగుడి భాష ఖాదర్ఖాన్, తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నేతల రాస్తారోకో
సాక్షి, వైఎస్సార్ : కేసీ కెనాల్ నుంచి సాగునీరు విడుదల చేయాలంటూ మైదుకూరు నేషనల్ హైవేపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, రైతులపై ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని రఘరామిరెడ్డి విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, రాచమల్లు ప్రసాద్ రెడ్డి, అంజాద్ బాషా పాల్గొన్నారు. ధర్నాలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. -
పోలీసుల అదుపులో హత్య కేసు నిందితులు?
పులివెందుల : పులివెందుల పట్టణంలో సోమవారం రాత్రి సంచలనం సృష్టించిన రంగేశ్వరరెడ్డి హత్య కేసు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు హతుడు రంగేశ్వరరెడ్డి స్వయాన చిన్నాన్న కొడుకు చంద్రశేఖరరెడ్డిగా తెలుస్తోంది. చంద్రశేఖరరెడ్డికి, రంగేశ్వరరెడ్డికి గత కొన్నేళ్లుగా ఆస్తి తగాదాలు, ఇతర లావాదేవీలకు సంబంధించి గొడవలు ఉండేవి. దీనిపై రంగేశ్వరరెడ్డిపై కక్ష పెంచుకుని చంద్రశేఖరరెడ్డి మరికొంతమంది అనుచరులతో కలిసి హత్య చేసినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం రాత్రి చంద్రశేఖరరెడ్డితోపాటు పట్టణంలోని ఇస్లాంపురం ప్రాంతానికి చెందిన ఇమాం బాషా, ఎస్బీఐ కాలనీకి చెందిన హరికృష్ణారెడ్డి, నగరిగుట్టకు చెందిన రవిశంకర్రెడ్డి, కదిరి పట్టణానికి చెందిన చెక్క డిపో నవీన్లు హత్యలో పాలు పంచుకున్నట్లు తెలుస్తోంది. వీరికి ముర్తుజా అనే వ్యక్తి రంగేశ్వరరెడ్డి ఇంటి వద్ద రెక్కీ నిర్వహించి సమాచారం చేర వేసినట్లు సమాచారం. గత 10రోజులనుంచి వీరు రంగేశ్వరరెడ్డిని హత్య చేసేందుకు ప్రయత్నించారు. ప్రతిరోజు రంగేశ్వరరెడ్డి పక్కన ఇతర వ్యక్తులు ఉండటంతో సాధ్యపడలేదు. అయితే సోమవారం రాత్రి 9గంటల ప్రాంతంలో రంగేశ్వరరెడ్డి తన ఇంటి పక్కనే ఉన్న పునాదులపై కూర్చొని సెల్ఫోన్లో మాట్లాడుతుండగా రెక్కీ నిర్వహిస్తున్న వ్యక్తి నిందితులకు సమాచారం చేరవేశాడు. దీంతో చంద్రశేఖరరెడ్డితోపాటు మిగిలిన నలుగురు నిందితులు అక్కడికి చేరుకుని వేట కొడవళ్లతో విచక్షణారహితంగా రంగేశ్వరరెడ్డిని నరికి హత్య చేశారు. హత్య జరిగిన విషయం స్థానికుల సమాచారంతో తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితులు హత్య చేసి స్కార్పియో వాహనంలో పారిపోతున్నారని గుర్తించిన పోలీసులు వారిని వెంబడించారు. ఎట్టకేలకు లక్కిరెడ్డిపల్లె సమీపంంలోని రామాపురం వద్ద నిందితులు ప్రయాణిస్తున్న వాహనాన్ని పట్టుకుని వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రంగేశ్వరరెడ్డి భార్య వెంకటలక్షుమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎంపీ : సోమవారం రాత్రి హత్యకు గురైన రంగేశ్వరరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మంగళవారం ఉదయం కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి స్థానిక ప్రభుత్వాసుపత్రికి చేరుకుని మృతుని కుటుంబ సభ్యులను, ఇతర బంధువులను పరామర్శించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులకు సూచించారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్రెడ్డితోపాటు వైఎస్సార్సీపీ నాయకులు ఉన్నారు. -
అన్నం పెట్టే రైతుకే అన్యాయం చేస్తారా?
హైదరాబాద్: ‘భార్య మెడలోని పుస్తెల్ని తాకట్టు పెట్టి మరీ పంటకు పెట్టుబడి పెట్టాం. కానీ వివిధ కారణాల వల్ల చేతికొచ్చిన పంటను కూడా నష్టపోయాం. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని మా పంటకు నష్టపరిహారం చెల్లిస్తుందని ఏళ్ల తరబడి ఎదురు చూస్తునే ఉన్నాం. కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి ఇవ్వకపోగా.. పదే పదే కార్యాలయాల చుట్టూ తిప్పిస్తున్నారు. అన్నం పెట్టే రైతుకే ఇలా అన్యాయం చేస్తారా? ఇక మాకు చావే దిక్కు. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ బిల్డింగ్ పైకి ఎక్కి దూకి చస్తాం..’ అంటూ వైఎస్సార్ జిల్లాకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట బీమా బకాయిలు వెంటనే చెల్లించాలంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి నేతృత్వంలో రైతులు మంగళవారం హైదరాబాద్లోని అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ముందు ఆందోళనకు దిగారు. తమ బతుకులతో ప్రభుత్వం, ఇన్సూరెన్స్ కంపెనీ ఆడుకుంటున్నాయని వాపోయారు. అనంతరం ఇన్సూరెన్స్ కంపెనీ సౌత్ ఇండియా ఇన్చార్జి ఎం.రాజేశ్వరి సింగ్ను కలసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తెలంగాణ మంత్రి ఇదే కార్యాలయంలో కూర్చొని వాళ్ల రాష్ట్రానికి చెందిన రైతుల బకాయిలు వెంటనే బ్యాంకుల్లో పడేలా చర్యలు తీసుకున్నారని.. తమను మాత్రం పట్టించుకునే నాథుడు లేకుండా పోయారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పదేపదే తమను హైదరాబాద్ చుట్టూ తిప్పంచడం దారుణమన్నారు. రైతులతో కలసి ఆందోళన చేస్తాం..: మాజీ ఎంపీ అవినాష్రెడ్డి మాట్లాడుతూ.. 2011–12 రబీ, 2013 ఖరీఫ్, 2014 రబీ పంటలకు సంబంధించిన బీమా సొమ్ము ఇప్పటికి కూడా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయలేకపోయారని మండిపడ్డారు. 2015–16కు సంబంధించిన పంటల బీమా కూడా ఇంకా పెండింగ్లోనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీమా చెల్లించిన రైతు ఒకవేళ పంట నష్టపోతే ఆరు నెలల్లోగా అతనికి బీమా చెల్లించాల్సి ఉంటుందన్నారు. కానీ ఐదారేళ్లు అవుతున్నా.. ఇంకా బీమా సొమ్ము ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు చెల్లించకపోవడం వల్లే తాము రైతులకు బకాయిలు చెల్లించలేకపోతున్నట్లు రాజేశ్వరీ సింగ్ తెలిపారని వివరించారు. రైతులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోందన్నారు. 2012కు సంబంధించి దాదాపు 20 వేల మంది రైతుల అప్లికేషన్లను చిన్న చిన్న తప్పిదాలతో తిరస్కరించారని మండిపడ్డారు. 2016 ఏప్రిల్లో లయబులిటీ షేర్ కింద వీరి గురించి రివ్యూ తెలపాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరిందని చెప్పారు. కానీ.. ఈరోజుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని దుయ్యబట్టారు. కేంద్రం అడిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి ఉంటే వారికి న్యాయం జరిగేదన్నారు. ఇక నాన్ ఫార్మర్మ్కు సంబంధించిన రూ.14 కోట్లు బీమా సొమ్ము కూడా చెల్లించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రాజేశ్వరీ సింగ్ను ప్రశ్నిస్తే.. ‘రాష్ట్రం నుంచి రూ.7 కోట్లు రావాలి. కేంద్రం నుంచి మరో రూ.7 కోట్లు రావాలి. వాళ్లు ఇస్తే గానీ రైతులకు సొమ్ము చెల్లించలేం’ అంటూ జవాబిచ్చారన్నారు. తక్షణమే రైతులకు తగిన న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆందోళనలో ప్రసాద్రెడ్డి, గురజాల కృష్ణారెడ్డి, రామచంద్రారెడ్డి, శేఖర్రెడ్డి, కిషోర్రెడ్డి తదితర రైతులు పాల్గొన్నారు. -
ఇకపై ప్రజాక్షేత్రంలోకి..
రాజీనామాల ఆమోదంతో ప్రత్యేకహోదా పోరాటంలో తమ చిత్తశుద్ధి మరోసారి రుజువైందని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీలు చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షను దేశవ్యాప్తంగా తెలిపామన్నారు. ఉప ఎన్నికలు ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. హోదా, విభజన హామీల కోసం ఇకపై ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామన్నారు. ఇకనైనా టీడీపీ నేతలకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ల ఎంపీలు రాజీనామాలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సవాల్ చేశారు. రాజీలేని పోరాటం చేశాం: మేకపాటి ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో నాలుగేళ్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని నెల్లూరు పార్లమెంట్ మాజీ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ చెందిన ఐదుగురు ఎంపీల రాజీనామాలను స్పీకర్ ఆమోదించారని చెప్పారు. రాష్ట్ర ప్రజల హక్కు అయిన హోదా ఉద్యమాన్ని దేశప్రజలందరికీ తెలిసేలా ఢిల్లీ వేదికగా పోరు సాగించామని చెప్పారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, హోదాతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. హోదా కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజీలేని పోరాటం చేశామన్నారు. హోదా ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాజీనామాలు చేశామని తెలిపారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని దేశ ప్రజలందరికీ వివరించామని, ఢిల్లీలో ఆమరణ దీక్షలు కూడా నిర్వహించామని చెప్పారు. స్పీకర్ ధర్మాన్ని నెరవేర్చారని, రెండు మూడు సార్లు తమతో మాట్లాడి రాజీనామాలు ఉపసంహరించే ప్రయత్నం చేశారని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతోందని వివరించి తమ రాజీనామాలు ఆమోదించాల్సిందిగా కోరామన్నారు. మార్చి 15న అవిశ్వాసానికి నోటీసు ఇచ్చామని, దానిపై చర్చ జరగకపోవటంతో వరుసగా 13 సార్లు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చామని తెలిపారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పనిచేసే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం మనందరి ఖర్మ అని మేకపాటి ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా విషయంలో రోజుకో రకంగా మాట్లాడి, డ్రామాలాడిన చంద్రబాబుకు ప్రజలే గట్టిగా బుద్ధి చెబుతారన్నారు. టీడీపీ ఎంపీలు డ్రామాలు వేయకుండా చిత్తశుద్ధితో రాజీనామాలు చేసుంటే కచ్చితంగా కేంద్రం దిగి వచ్చేదన్నారు. తమకు ఉప ఎన్నికలను ఎదుర్కొంటామని సృష్టం చేశారు. నిత్యం ప్రగల్భాలు పలికే చంద్రబాబుకు అందరు కలిసి బుద్ధి చెప్పాలన్నారు. నీత్ ఆయోగ్ సమావేశానికి వెళ్లిన చంద్రబాబు.. మోదీ ఎడమచేతి కరచాలనం కోసం ఎంతగానో తపించిపోయి వంగివంగి మరీ కరచాలనం చేశారన్నారు. ఉప ఎన్నికల్లో ప్రత్యేక హోదానే ప్రధానాంశం..: వైవీ ఉప ఎన్నికల్లో ప్రత్యేక హోదానే ప్రధాన అంశమని వైఎస్సార్ కాంగ్రెస్ నేత వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఎంపీల రాజీనామా ఆమోదిస్తున్నట్టు లోక్సభ సచివాలయం నుంచి ప్రకటన వెలువడిన కొద్దిసేపటికి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ రోజైనా మా రాజీనామాలు ఆమోదించడాన్ని స్వాగతి స్తున్నాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించడం కోసం ఏప్రిల్ 6న రాజీనామాలు చేశాం. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశాం. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా స్పందించకుండా కేంద్రం, స్పీకర్ రాష్ట్రానికి అన్యాయం చేశారు. వీటన్నింటికీ నిరసనగా మేం మా పార్లమెంటు సభ్యత్వానికి ఏప్రిల్ 6న అంటే లోక్సభకు ఇంకా 14 నెలల సమయం ఉందనగా రాజీనామాలు చేశాం. త్వరలోనే ఈ ఐదు పార్లమెంటు స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయి. ప్రత్యేక హోదాయే మా ప్రధాన అంశం. ప్రజలు తమ ఆకాంక్షలను ఈ ఎన్నిక ద్వారా కేంద్రానికి తెలియపరుస్తారు. మేం ఇక ప్రజల్లోకి వెళతాం. రాష్ట్రానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవిధంగా అన్యాయం చేశాయో వివరిస్తాం. వాళ్ల మద్దతు కూడగడతాం..’ అని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామాలు డ్రామాలని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా.. ‘‘మావి కాదు డ్రామాలు.. టీడీపీ వాళ్లవి డ్రామాలు’ అని ధ్వజమెత్తారు. బీజేపీతో కుమ్మక్కయ్యారని వస్తున్న విమర్శలను వైవీ ఖండించారు. ‘‘13సార్లు అవిశ్వాస తీర్మానం ఎవరు పెట్టారు? మీరు పెట్టారా? మేమా? కుమ్మక్కయ్యేవాళ్లమయితే అవిశ్వాస తీర్మానం పెడతామా? కలసి కాపురం చేసి ఇప్పుడొచ్చి మేం కుమ్మక్కయ్యామని అంటావు? అమరావతిలో ఉన్నప్పుడేమో మోదీ దాడి చేస్తున్నాడని అంటావు. ఢిల్లీ వచ్చి కాళ్లూ గడ్డాలు పట్టుకుంటావు. నిజంగా రాష్ట్రప్రయోజనాలపై చిత్తశుద్ధి ఉంటే నీతిఆయోగ్ సమావేశంలో మన వాదన వినిపించి వాకౌట్ చేసి ఉండాల్సింది. నువ్వు ఆ పనిచేశావా? ’’ అంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఎన్నికలు కావాలని తాము ఆశిస్తున్నామని, ఎన్నికలు వద్దని చంద్రబాబు అనుకుంటున్నారని చెప్పారు. ఎన్నికలు వస్తేనే మా రాజీనామాలకు సార్థకత వస్తుందన్నారు. మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం: వరప్రసాదరావు ప్రత్యేకహోదా సాధన కోసం రాజీనామా చేసి చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని తిరుపతి మాజీ ఎంపీ వి.వరప్రసాదరావు అన్నారు. రాజీనామాలు ఆమోదించటం సంతోషంగా ఉందన్నారు. దమ్ము ధైర్యం ఉంటే టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. రాజీనామాలు ఆమోదం పొందిన సందర్భంగా ఎంపీ వరప్రసాద్ సాక్షితో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రత్యేకహోదాను హేళన చేశారని, హోదా సంజీవిని కాదన్నారని చెప్పారు. ధైర్యముంటే, మనస్సాక్షి ఉంటే టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలన్నారు. వైఎస్సార్ సీపీ ప్రత్యేక హోదా కోసం పోరాడుతూ ముందుకు వెళ్తోందని, రాబోయే ఎన్నికల్లో పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతారని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఏదోరకంగా ప్రజల్ని మోసం చేసి తాము కూడా పోరాడుతున్నామని చెప్పుకునేందుకు టీడీపీ డ్రామాలాడుతోందని మండిపడ్డారు. టీడీపీ ఎంపీల డ్రామాలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. లోక్సభ మూసివేశాక లోపలకు వెళ్లి ఫొటోలు, వీడియోలు తీసి.. ప్రత్యేక హోదా కోసం ఏదో చేశామని చెప్పుకునేందుకు హడావుడి చేశారని, రాబోయే రోజుల్లో మరిన్ని డ్రామాలు ఆడబోతున్నారని చెప్పారు. తాము ఎన్నికలను సవాల్గా తీసుకుంటున్నామన్నారు. ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డికి పెద్దఎత్తున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటే.. ఆయన ప్రత్యేకహోదా కోసం చూపిస్తున్న ప్రాధాన్యతను బట్టే అని చెప్పారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లి ఏమీ తీసుకురాలేని అసమర్థుడు చంద్రబాబు అని విమర్శించారు. రాష్ట్రం కోసం పదవీత్యాగం సంతోషదాయకం రాష్ట్రం కోసం పదవులు వదులుకోవడం సంతోషదా యకంగా ఉందని కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి అన్నారు. రాష్ట్రానికి పదేళ్లు కాదు, పదిహేనేళ్లు ప్రత్యేక హోదా కావాలంటూ బీజేపీ, టీడీపీ కలసి కోరాయని, అదే నినాదంతో 2014 ఎన్నికలకు వెళ్లారని, అధికారంలోకి వచ్చిన ఆ రెండు పార్టీలు హోదా మాటే మరిచాయని విమర్శించారు. ప్రత్యేక హోదా సంజీవిని కాదు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అంటూ సీఎం ప్రకటనలు చేశారని, ఇలాంటి తరుణంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ప్రత్యక్ష పోరాటం చేశామని చెప్పారు. అన్నీ ప్రయత్నాలు చేసి తుదకు పదవులకు రాజీనామాలు చేశామని వివరించారు. రాజీనామాలు ఆమోదించడంలో కూడా ఆలస్యం చేశారని చెప్పారు. ఇకపై ప్రజల మధ్యనే ఉంటూ ప్రత్యక్ష పోరాటం చేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలుపుకోవడంలో రెండు పార్టీలు విస్మరించిన వైనాన్ని దేశవ్యాప్తం చేశామన్నారు. బీజేపీ, టీడీపీలకు బుద్ధిచెప్పేలా అడుగులు ఇక బీజేపీ, టీడీపీలకు బుద్ధిచెప్పేలా తమ అడుగులు ఉంటాయని మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి తెలిపారు. రాజీనామా ఆమోదం పొందిన నేపథ్యంలో ‘సాక్షి’తో మిథున్రెడ్డి మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటాలను మరింత ఉధృతం చేస్తామన్నారు. హోదా కోసం తాము చేసిన రాజీనామాలను ఆమోదించేందుకు కూడా ఇంతో సమయం తీసుకున్నారంటే ప్రత్యేక హోదా ఆకాంక్ష ప్రజల్లో ఎంత బలీయంగా ఉందో అర్థమవుతుందన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రత్యేక హోదాను సాధించి తీరుతామన్నారు. ఇక ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు రెండు నాల్కల ధోరణి వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. ఎన్నికలంటే బాబుకు ఫీవర్ వస్తుందన్నారు. ప్రత్యేక హోదాను సాధించేందుకు రాజీలేని పోరాటం చేస్తామని తెలిపారు. – సాక్షి, నెట్వర్క్ -
కడపలో వైఎస్ఆర్సీపీ అధ్వర్యంలో ఉక్కు పోరాటం