bad loans
-
మొండి రుణాలపై బ్యాడ్ బ్యాంక్ దృష్టి
కేంద్ర ప్రభుత్వం ప్రమోట్ చేసిన జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ(ఎన్ఏఆర్సీఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24)లో మరిన్ని మొండి రుణాల కొనుగోలుకి ప్రణాళికలు వేస్తోంది. ఇందుకు సుమారు 300 కంపెనీల నుంచి రూ. 3 లక్షల కోట్ల రుణాల జాబితా సిద్ధంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బ్యాడ్ బ్యాంక్గా పిలిచే ఎన్ఏఆర్సీఎల్ గతేడాది(2022–23) రూ. 50,000 కోట్ల మొండి రుణాలను సొంతం చేసుకోవాలనే లక్ష్యం విధించుకున్నప్పటికీ రూ. 10,378 కోట్ల రుణాలను మాత్రమే కొనుగోలు చేయగలిగింది. వివరాలు చూద్దాం.. ముంబై: గత ఆర్థిక సంవత్సరంలో బ్యాడ్ బ్యాంక్ తొలుత పెట్టుకున్న భారీ లక్ష్య సాధనలో విఫలమైనప్పటికీ ఈ ఏడాది మరింత వేగంగా ముందుకు సాగాలని భావిస్తోంది. కొన్ని ప్రాథమిక అవాంతారాలు లక్ష్య సాధనలో అడ్డు తగిలినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది మరింత పటిష్టంగా రుణ కొనుగోలు చేపట్టాలని చూస్తోంది. నిజానికి 300 కంపెనీల నుంచి మొత్తం రూ. 3 లక్షల కోట్ల మొండి రుణాలు నమోదైనట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ముందుగా విక్రయించాల్సిన మొండి ఖాతాలను గుర్తించమంటూ ఈ నెల మొదట్లో ఆర్థిక శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పీఎస్యూ బ్యాంకులు ఎన్ఏఆర్సీఎల్కు పలు మొండి ఖాతాలను ఆఫర్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. వీటి ప్రకారం విక్రయానికి సిద్ధమైన జాబితా నుంచి 20–25 శాతం ఖాతాలను బ్యాడ్ బ్యాంక్ కొనుగోలు చేయనుంది. జాబితా పెద్దదే.. ఈ ఏడాది విక్రయానికి సిద్ధంకానున్న మొండి ఖాతాల జాబితాలో వీడియోకాన్ ఇండస్ట్రీస్, ఫ్యూచర్ రిటైల్, ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్, జీటీఎల్, వీసా స్టీల్, క్వాలిటీ, గాయత్రి ప్రాజెక్ట్స్, ఎరా ఇన్ఫ్రా, రీడ్ అండ్ టేలర్ ఇండియా, కోస్టల్ ఎనర్జెన్ తదితరాలున్నాయి. కాగా.. ఇటీవల విదర్భ ఇండస్ట్రీస్(రూ. 1,150 కోట్లు), రోల్టా(రూ. 600 కోట్లు), వీవోవీఎల్(రూ. 1,100 కోట్లు) ఖాతాలను ప్రభుత్వ బ్యాంకులు బ్యాడ్ బ్యాంకుకు ఆఫర్ చేశాయి. ఈ బాటలో ధరణి షుగర్స్ ఖాతా(రూ. 619 కోట్లు)ను దాదాపు రూ. 223 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదేవిధంగా రెయిన్బో పేపర్స్ రూ. 1,136 కోట్ల రుణాలకుగాను ఎన్ఏఆర్సీఎల్ రూ. 87 కోట్ల యాంకర్ ఆఫర్ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గతేడాది ఇలా.. 2022–23లో జేపీ ఇన్ఫ్రాటెక్, ఎస్ఎస్ఏ ఇంటర్నేషనల్, హీలియోస్ ఫొటో వోల్టాయిక్కు చెందిన మొత్తం రూ. 10,378 కోట్ల రుణాలను ఎన్ఏఆర్సీఎల్ చేజిక్కించుకుంది. ఇందుకు నగదు, సెక్యూరిటీల జారీ ద్వారా రూ. 3,636 కోట్లు ఆఫర్ చేసింది. కాగా.. కొన్ని రుణాల విషయంలో ఎన్ఏఆర్సీఎల్ ఆఫర్లను రుణదాతలు తిరస్కరిస్తున్నాయి. మరికొన్ని కేసుల్లో మరింత మెరుగైన ఆఫర్లు లభిస్తున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు వివరించాయి. జీటీఎల్కు బ్యాడ్ బ్యాంకు ప్రతిపాదిత రూ. 360 కోట్ల ఆఫర్ అంచనాలను చేరకపోవడంతో తిరస్కరణకు గురైంది. రుణదాతలు రూ. 550 కోట్లు ఆశించడం గమనార్హం! ఇక మెక్నల్లీ భారత్ విషయంలో నాల్వా స్టీల్ రూ. 424 కోట్లకుపైగా ఆఫర్ చేసింది. ఇదేవిధంగా మిట్టల్ కార్ప్నకు ఎన్ఏఆర్సీఎల్ రూ. 228 కోట్లు ఆఫర్ చేయగా.. రూ. 405 కోట్ల బిడ్తో ఖాతాను ఫీనిక్స్ ఏఆర్సీ గెలుచుకుంది. కాగా.. బ్యాడ్ బ్యాంక్ మొండి రుణాల కొనుగో లుని 15–85 నిష్పత్తిలో ఆఫర్ చేస్తుంది. అంటే 15 శాతం ముందస్తు చెల్లింపు, మిగిలిన 85% బకాయిల నుంచి రికవరీ ద్వారా చెల్లిస్తుంది. -
ఏయూ స్మాల్ బ్యాంక్ లాభం రూ.393 కోట్లు
ముంబై: ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ డిసెంబర్ త్రైమాసికానికి ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 30 శాతం పెరిగి రూ.393 కోట్లుగా నమోదైంది. ఆస్తుల నాణ్యత మెరుగుపడ డం, మొండి బకాయిలకు (ఎన్పీఏలు) కేటాయింపులు తగ్గడం లాభాల వృద్ధికి కలిసొచ్చింది. మొ త్తం ఆదాయం 36 శాతం పెరిగి రూ.2,413 కోట్లు గా నమోదైంది. ప్రధానంగా నికర వడ్డీ ఆదాయం 41 శాతం జంప్ చేసి రూ.1,153 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ 6.3 శాతంగా నమోదైంది. ఆస్తుల నాణ్యత మెరుగు మొత్తం రుణాల్లో స్థూల ఎన్పీఏలు 1.81 శాతంగా (రూ.1,019 కోట్లు) ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 2.60 శాతం (రూ.1,058 కోట్లుగా) ఉండడం గమనార్హం. నికర ఎన్పీఏలు 1.29 శాతం (రూ.520 కోట్లు) నుంచి 0.51 శాతానికి (రూ.285 కోట్లు) పరిమితమయ్యాయి. డిసెంబర్ త్రైమాసికంలో రూ.176 కోట్ల కేటాయింపులు చేసింది. రుణ వ్యాపారంలో బలహీన వృద్ధిని చూపించింది. పరిశ్రమ వ్యాప్తంగా రుణాల మంజూరు జోరుగా ఉంటే, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు డిసెంబర్ త్రైమాసికంలో 7 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం రుణాలు రూ.56,335 కోట్లుగా, డిపాజిట్లు 5 శాతం పెరిగి రూ.61,101 కోట్ల చొప్పున ఉన్నాయి. కాసా రేషియో 38 శాతానికి చేరింది. నిధులపై వ్యయాలు 6 శాతంగా ఉన్నాయి. మొత్తం రుణాల్లో 90 శాతం రిటైల్ విభాగంలో ఉంటే, 93 శాతం రుణాలు సెక్యూర్డ్గా బ్యాంక్ తెలిపింది. -
ప్రభుత్వరంగ బ్యాంక్ల లాభాల పంట
న్యూఢిల్లీ: వసూలు కాని మొండి బకాయిల ఫలితంగా భారీ నష్టాల్లోకి కూరుకుపోయిన ప్రభుత్వరంగ బ్యాంక్లు (పీఎస్బీలు) ఇక కోలుకుంటాయా?.. ఐదేళ్ల క్రితం ఎదురైన ప్రశ్న ఇది. కానీ, ఈ అనుమానాలన్నింటినీ తొలగిస్తూ ఐదేళ్లలోనే భారీ లాభాలను నమోదు చేసే స్థితికి తమ బ్యాలన్స్ షీట్లను పీఎస్బీలు పటిష్టం చేసుకున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2021–22) రూ.66,539 కోట్ల లాభాలను సొంతం చేసుకోగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి రూ.లక్ష కోట్ల లాభాల మార్క్ను చేరుకుంటాయని అంచనా. బ్యాలన్స్ షీట్లలో నిరర్థక రుణాలు (వసూలు కానివి/ఎన్పీఏలు) భారీగా పెరిగిపోవడంతో ఒక దశలో 11 పీఎస్బీలను ఆర్బీఐ తన దిద్దుబాటు కార్యాచరణ పరిధిలోకి తీసుకొచ్చి ఆంక్షలు విధించింది. బ్యాలన్స్ షీట్లను చక్కదిద్దుకున్న తర్వాత వాటిపై ఆంక్షలను ఆర్బీఐ తొలగించడం గమనార్హం. మరోవైపు పీఎస్బీల బ్యాలన్స్ షీట్ల పటిష్టతకు కేంద్ర సర్కారు సైతం పెద్ద ఎత్తున నిధులను బడ్జెట్లో భాగంగా కేటాయిస్తూ వచ్చింది. లేదంటే బ్యాంకులు చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చి ఉండేది. ఇంకోవైపు దివాలా పరిష్కార ప్రక్రియల రూపంలోనూ మొండి బకాయిలను బ్యాంక్లు కొంత వరకు వసూలు చేసుకోగలిగాయి. ఐదేళ్లలో భారీ నష్టాలు పీఎస్బీలు 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి 2019–20 వరకు రూ.2,07,329 కోట్ల నష్టాలను నమోదు చేశాయి. ఇందులో అత్యధిక నష్టాలు 2017–18లో రూ.85,370 కోట్లుగా ఉన్నాయి. 2015–16లో రూ.17,993 కోట్ల నష్టాలు రాగా, 2016–17లో రూ.11,389 కోట్లు, 2018–19లో రూ.66,636 కోట్లు, 2019–20లో రూ.25,941 కోట్ల చొప్పున నష్టాలు వచ్చాయి. సంస్కరణల ఫలితం ప్రభుత్వరంగ బ్యాంకులను బలోపేతం చేసేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు తీసుకున్న సంస్కరణలు మేలు చేశాయని చెప్పుకోవచ్చు. ప్రధాని మోదీ, నాటి ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ చేపట్టిన వ్యూహాత్మక విధానంలో భాగంగా.. 2016–17 నుంచి 2020–21 మధ్య పీఎస్బీలకు రూ.3,10,997 కోట్ల నిధులను (రీక్యాపిటలైజేషన్లో భాగంగా) కేంద్ర సర్కారు సమకూర్చింది. ఈ రీక్యాపిటలైజేషన్ కార్యక్రమం అండతో పీఎస్బీలు కూలిపోయే ప్రమాదం నుంచి బలంగా లేచి నిలబడ్డాయి. రీక్యాపిటలైజేషన్ బాండ్ల రూపంలో నిధులు అందించడం వల్ల కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటుపై ప్రభావం పడకుండా జాగ్రత్తపడింది. వేటికవి చిన్న బ్యాంక్లుగా కార్యకలాపాల నిర్వహణతో ఉండే రిస్క్ను అర్థం చేసుకుని, దాన్ని అధిగమించేందుకు, బలమైన బ్యాంకుల రూపకల్పనకు వీలుగా పీఎస్బీల మధ్యపెద్ద ఎత్తున వీలీనాలను కూడా కేంద్రం చేపట్టింది. 2017 నాటికి 27 పీఎస్బీలు ఉండగా.. వాటి సంఖ్యను 12కు కుదించింది. చిన్న వాటిని పెద్ద బ్యాంకుల్లో కలిపేసింది. ఇతర చర్యలు మరోవైపు 3.38 లక్షల షెల్ కంపెనీల బ్యాంక్ ఖాతాలను (నిధులు మళ్లించేందుకు వినియోగిస్తున్నవి) కేంద్రం స్తంభింపజేయడం కూడా కీలకమైన నిర్ణయంగా చెప్పుకోవాలి. దీనివల్ల బ్యాంక్ల నుంచి రుణాల రూపంలో నిధులను కాజేసే చర్యలకు బ్రేక్ పడింది. 2018–19లో రికార్డు స్థాయి నిరర్థక రుణ వసూళ్లు కావడంతో పీఎస్బీల స్థూల రుణాల్లో క్రెడిట్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ నిష్పత్తి 80.3 శాతం నుంచి 63.9 శాతానికి దిగొచ్చింది. గాడిన పడకపోతే ప్రైవేటీకరించేందుకు సైతం వెనుకాడేది లేదన్న సంకేతాన్ని కూడా కేంద్రం పంపించింది. ఐడీబీఐ బ్యాంక్లో 51 శాతం వాటాను ఎల్ఐసీకి విక్రయించడం ద్వారా సెమీ ప్రైవేటీకరణ చేసింది. బ్యాంకులను భారీగా ముంచిన భూషణ్ స్టీల్, ఎస్సార్ స్టీల్, డీహెచ్ఎఫ్ఎల్, ఐఎల్ఎఫ్ఎస్, నీరవద్ మోదీ తదితర కేసుల్లో బ్యాంక్లు కఠిన చర్యలకు దిగాయి. మోసపూరిత రుణ వ్యవహారాలతో సంక్షోభంలో పడిన యస్ బ్యాంక్ను సైతం ఆర్బీఐతో సమన్వయం చేసుకుని కేంద్రం గట్టెక్కించింది. టర్న్ అరౌండ్ ఈ చర్యల ఫలితాలు ఒక్కోటి తోడయ్యి పీఎస్బీలు గాడిన పడి, తిరిగి బలంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే స్థాయికి పటిష్టమయ్యాయి. దీని ఫలితమే గతేడాది రూ.5,66,539 కోట్ల లాభాలు రావడం అని చెప్పుకోవాలి. అంతకుముందు వరకు కేంద్రం నుంచి నిధుల సహకారాన్ని అర్థించే స్థితిలో ఉన్నవి కాస్తా, మార్కెట్ నుంచి స్వయంగా నిధులు సమీకరించుకునే స్థాయికి బలపడ్డాయి. ప్రైవేటు బ్యాంక్లతో పోటీ పడే స్థితికి వచ్చాయి. అంతేకాదు గత ఆర్థిక సంవత్సరానికి చాలా పీఎస్బీలు వాటాదారులకు డివిడెండ్లను సైతం పంపిణీ చేశాయి. ఎస్బీఐ సహా తొమ్మిది పీఎస్బీలు ప్రకటించిన డివిడెండ్ రూ.7,867 కోట్లుగా ఉంది. పీఎస్బీలు బలమైన పునాదులపై పనిచేస్తున్నాయని, నికర లాభాల్లో అనూహ్యమైన వృద్ధిని చూస్తాయని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎండీ ఏస్ రాజీవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పీఎస్బీల ఉమ్మడి లాభాలు ప్రసత్తు ఆర్థిక సంవత్సరంలో ఎంత లేదన్నా రూ.80,000–1,00,000 కోట్ల మధ్య ఉండొచ్చన్నారు. రుణ ఎగవేతలను కట్టడి చేశామని, ఆస్తుల నాణ్యత మరింత మెరుగుపడుతున్నట్టు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఎండీ స్వరూప్కుమార్ మెహతా సైతం చెప్పారు. -
బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన ప్రబుద్ధుల్లో ఈయనే నెంబర్ వన్!
పార్లమెంటు శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో బ్యాంకు రుణాల ఎగవేతదారులపై చర్చి జరిగింది. సభలోని ఓ సభ్యుడు లేవనెత్తిన ప్రశ్నపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. మార్చి 31,2022 నాటికి మనదేశంలో సుమారు 50 మంది బ్యాంకులకు రూ.92,570 కోట్లు బాకీ పడినట్లు తెలిపారు. వారిలో వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.ఛోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ కంపెనీ నుంచి బ్యాంకులకు రావాల్సిన మొత్తం రూ.7,848 కోట్లని వివరించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సేకరించిన రిపోర్ట్ ఆధారంగా కరాద్ బ్యాంకు రుణాలు ఎవరు? ఎంతంత? రుణ ఎగవేతకు పాల్పడ్డారో స్పష్టం చేశారు.రుణ ఎగవేత దారుల్లో ఛోక్సీ తర్వాత ఎరా ఇన్ఫ్రా (రూ.5879 కోట్లు),రేగో ఆగ్రో (రూ.4803), కాస్ట్ స్టీల్ అండ్ పవర్ (రూ.4,596 కోట్లు), ఎబిజి షిప్యార్డ్ (రూ.3,708 కోట్లు), ఫ్రాస్ట్ ఇంటర్నేషనల్ (రూ.2,893కోట్లు),విన్సమ్ డైమండ్స్ అండ్ జ్యువెలరీ (రూ.2,931కోట్లు), రోటోమాక్ గ్లోబల్ (రూ.2,893 కోట్లు), కోస్టల్ ప్రాజెక్ట్ రూ.2,311కోట్లు, జూమ్ డెవలపర్లు (రూ.2,147 కోట్లు) జాబితాలో ఉన్నట్లు తెలిపారు. తగ్గిన ఎన్పీఏలు ప్రభుత్వరంగ బ్యాంకుల నిరర్ధక ఆస్తులు లేదా నాన్ ఫర్మామెన్స్ అసెట్స్ (NPA)రూ.8.9లక్షల కోట్లుకు చేరాయి. అయితే మొండి బకాయిల్ని తగ్గించేందుకు కేంద్రం కృషి చేయడంతో అవికాస్త రూ.3లక్షల కోట్లు తగ్గాయి. రైట్ - ఆఫ్లో ఎస్బీఐ అగ్రస్థానం దేశీయ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ మొండి బకాయిల్ని రైట్ ఆఫ్ చేయడంలో రూ.2లక్షల కోట్లతో ముందంజలో ఉంది. ఆ తర్వాత రూ.67,214 కోట్లతో పంజాబ్ నేషనల్ బ్యాంక్లు ఉన్నాయి.ప్రైవేట్ బ్యాంకుల్లో ఐసీఐసీఐ బ్యాంక్ రూ.50,514 కోట్లు,హెచ్డీఎఫ్సీ రూ.34,517కోట్లు ఉన్నాయని కరాద్ పార్లమెంట్లో రుణాల ఎగవేతపై మాట్లాడారు. ఈ సందర్భంగా రుణ ఎగవేత దారులపై చర్యలు తీసుకునేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. మెహుల్ చోక్సీపై మూడు కొత్త ఎఫ్ఐఆర్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫిర్యాదు మేరకు పరారీలో ఉన్న మెహుల్ చోక్సీపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గత వారం మూడు కొత్త ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలోని మూడు సభ్య బ్యాంకుల కన్సార్టియంకు చోక్సీ మరియు ఇతరులు ₹ 375.71 కోట్ల తప్పుడు నష్టం కలిగించారని ఈ తాజా ఎఫ్ఐఆర్లో మూడవది ఆరోపించింది . వీల్ చైర్లో కోర్టుకు కాగా,పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి గతేడాది కరేబియన్ దేశం డొమినికా న్యాయస్థానం బెయిల్ మంజూరుకు నిరాకరించింది. అంటిగ్వా నుంచి తమ దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన చోక్సికి బెయిల్ ఇవ్వలేమని పిటిషన్ను కొట్టివేసింది. చోక్సీ(62) వీల్ చైర్లో కోర్టుకు హాజరయ్యారు. చోక్సీ అక్రమంగా డొమినికాకు రాలేదని, ఆయనని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువచ్చారని అందుకే బెయిల్ ఇవ్వాలంటూ చోక్సీ తరఫు లాయర్ వాదించారు. చివరిగా ::::: రైట్ - ఆఫ్ అంటే ఏమిటి? ప్రతి ఏడాది ఆర్ధిక సంవత్సరం(మార్చి ముగిసే) నాటికి అన్నీ బ్యాంకులు బ్యాలెన్స్ షీట్లను బహిరంగంగా ప్రకటిస్తాయి. అంటే బ్యాంకుకు ఎంత లాభం వచ్చింది. నష్టం ఎంత వచ్చింది. మొండి బకాయిలు ఎంత ఉన్నాయని చెబుతాయి. అయితే ఆ సమయంలో బ్యాలెన్స్ షీట్లో మొండి బకాయిలు కనిపించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాయి. ఉదాహరణకు సురేష్ అనే వ్యక్తి ఎక్స్ అనే బ్యాంకు నుంచి రూ.10వేల కోట్లు రుణం తీసుకున్నాడు. ఆ రుణాన్ని చెల్లించకుండా ఎగవేతకు (మొండి బకాయిలు) పాల్పడ్డాడు. అప్పుడు ఆ ఎక్స్ బ్యాంక్ యాజమాన్యం తనకు వచ్చిన లాభాల్ని మొడి బకాయిల స్థానంలో చూపిస్తారు. అంటే సురేష్ ఎగొట్టిన రూ.10వేల కోట్లు మనకు కనిపించవు. దీన్నే రైట్ - ఆఫ్ అని పిలుస్తారు. మొండి బకాయిలు అంటే ఏమిటి? బ్యాంకులు అనేక విధాలుగా లోన్లు ఇస్తూ ఉంటాయి.పెద్ద మొత్తంలో లోన్లు తీసుకుని అవి ఎగొట్టి కొందరు, బకాయిలు తీర్చే స్థోమత లేక కొందరు.ఇలా చాలామంది బ్యాంకులకు మోత మోగిస్తున్నారు.వీటినే మొండి బకాయిలు,నిరర్థక ఆస్తులు అంటారు.ఆర్ధిక పరిభాషలో వీటిని ఏన్పీఏ(non-performing assets)అని పిలుస్తారు. -
ఆరేళ్లలో బ్యాంకింగ్ రుణ మాఫీ ఎన్ని లక్షల కోట్లు తెలుసా?
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ 2021–22 ఆర్థిక సంవత్సరం వరకు గడచిన ఆరేళ్లలో రూ. 11.17 లక్షల కోట్ల మొండి బకాయిలను (ఎన్పీఏ) మాఫీ చేసిందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరద్ ఒక లిఖిత పూర్వక సమాధానంలో పార్లమెంటుకు తెలియజేశారు. నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాత పూర్తి ప్రొవిజనింగ్ (మొండిబకాయిలకు కేటాయింపులు) జరిగిన ఖాతాలుసహా సహా నిరర్థక ఆస్తులను (ఎన్పీఏలు) సంబంధిత బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ నుండి రైట్–ఆఫ్ ద్వారా తొలగించడం జరుగుతుందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి తెలిపారు. బ్యాలెన్స్ షీట్ను పటిష్టం చేయడం, పన్ను ప్రయోజనాలను పొందడం, మూలధనాన్ని పటిష్టం చేసుకోవడం వంటి తన సాధారణ కసరత్తులో భాగంగా బ్యాంకులు ఎన్పీఏలను రద్దు చేస్తాయి. ఆర్బీఐ మార్గదర్శకాలు, బోర్డులు ఆమోదించిన విధానాలకు అనుగుణంగా బ్యాంకులు ఈ రైట్–ఆఫ్ నిర్వహిస్తాయని మంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించి మంత్రి తెలిపిన సమాచారం వివరాల్లోకి వెళితే.. ► ఆర్బీఐ గణాంకాల ప్రకారం, గత ఆరు ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీలు) రూ. 8,16,421 కోట్ల రుణ మాఫీ చేశాయి. మొత్తం షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల (ఎస్సీబీలు) విషయంలో ఈ విలువ రూ. 11,17,883 కోట్లుగా ఉంది. ► గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు మొత్తం 6,59,596 కోట్ల రూపాయల రికవరీ జరిపాయి. ఇందులో రైటాఫ్ లోన్ ఖాతాల నుండి జరిగిన రికవరీల విలువ 1,32,036 కోట్లు. ► ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 1 కోటి కంటే ఎక్కువ ఎగవేసిన రైటాఫ్లు/డిఫాల్టర్ల పేర్లతో సహా ఈ జాబితాకు సంబంధించి, రుణ గ్రహీతల వారీగా రైట్ ఆఫ్ లోన్ ఖాతాల సమాచారాన్ని నిర్వహించడం లేదని ఆర్బీఐ తెలియజేసింది. ► ఆర్బీఐ తెలిపిన సమాచారం ప్రకారం, జూన్ 30, 2017 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ. 25 లక్షలు, అంతకంటే ఎక్కువ మొత్తంలో బకాయి ఉన్న ఉద్దేశపూర్వక ఎగవేతదారుల సంఖ్య 8,045. 2022 జూన్ 30వ తేదీ నాటికి ఈ సంఖ్య 12,439కు చేరింది. ఇదే కాలంలో ప్రైవేట్ రంగ బ్యాంకులకు సంబంధించి ఈ సంఖ్య 1,616 నుంచి 2,447కు ఎగసింది. ► 2017 జూన్ 30వ తేదీ నాటికి ఉద్దేశపూర్వక ఎగవేతలకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో 8,744 దావాలు దాఖలయ్యాయి. 2022 జూన్ 30వ తేదీ నాటికి ఈ సంఖ్య 14,485గా ఉంది. ఇందుకు సంబంధించి సూట్ ఫైల్ కాని వారి సంఖ్యలు వరుసగా 917, 401గా ఉన్నాయి. ► రూ. 25 లక్షలు, అంతకంటే ఎక్కువ విలువైన దావా ఫైల్ చేసిన ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల (సీఐసీ) వెబ్సైట్లలో పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంది. సూట్ ఫైల్కాని ఉద్దేశపూర్వక డిఫాల్టర్ల జాబితా గోప్యంగా ఉంటుంది. పబ్లిక్ డొమైన్లో ఉండదు . ► అక్రమ ధనార్జనా నిరోధక చట్టం (పీఎంఎల్ఏ), 2002 నిబంధనల ప్రకారం 2017 మే 1వ తేదీ నుండి ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు సంబంధించిన కేసులతో సహా మొత్తం 515 మోసం కేసులు నమోదయ్యాయి. 2022 డిసెంబరు 15 నాటికి, ఈ కేసుల్లో దాదాపు రూ. 44,992 కోట్ల ఆస్తుల జప్తు జరిగిందని, డైరెక్టరేట్ ద్వారా 39 ప్రాసిక్యూషన్ ఫిర్యాదులు దాఖలయ్యాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలియజేసింది. ► 2017 మే నుండి 2022 డిసెంబర్ 15 నాటికి పీఎంఎల్ఏ 2002 కింద విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటి ఉద్దేశపూర్వక ఎగవేతదారుల రూ. 19,312.20 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. వీటిలో రూ. 15,113 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వ రంగ బ్యాంకులకు అప్పగించడం జరిగింది. ► గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకుల్లో ప్రభుత్వం చేసిన మొత్తం రీక్యాపిటలైజేషన్ (మూలధన కేటాయింపుల) పరిమాణం మొత్తం రూ.2,90,600 కోట్లు. ప్రైవేట్ రంగ బ్యాంకుగా వర్గీకరణ జరిగిన (2019 జనవరి 21న) ఐడీబీఐ బ్యాంక్కు రీక్యాపిటలైజేషన్ విలువ రూ. 4,557 కోట్లు. భారీ లాభాలు మంత్రి తెలిపిన సమాచారం ప్రకారం, ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిల (ఎన్పీఏ) కట్టడికి తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (2022–23 జూలై–సెప్టెంబర్) 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల నికల లాభం (2021–22 ఇదే కాలంతో పోల్చి) ఇదే 50 శాతం పెరిగి రూ.25,685 కోట్లుగా నమోదయ్యింది. తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాంకింగ్ రంగం లాభాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 9.2 శాతం పెరిగాయి. ఈ మొత్తం రూ.15,306 కోట్లుగా నమోదయ్యింది. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర లాభం 32 శాతం పెరిగి రూ.40,991 కోట్లుగా నమోదయ్యింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.66,539 కోట్లు. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (రూ.31,816 కోట్లు) ఈ పరిమాణం రెట్టింపునకుపైగా పెరిగింది. పలు ప్రభుత్వరంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్ను కూడా ప్రకటించాయి. ఎస్బీఐ సహా తొమ్మిది బ్యాంకులు వాటాదారులకు 7,867 కోట్ల రూపాయల డివిడెండ్లను ప్రకటించాయి. నిజానికి బ్యాంకింగ్కు 2020–21 చక్కటి యూ టర్న్. 2015–16 నుంచి 2019–20 వరకూ వరుసగా ఐదు సంవత్సరాలలో బ్యాంకింగ్ మొత్తంగా నష్టాలను నమోదుచేసుకుంది. 2017–18లో అత్యధికంగా రూ.85,370 కోట్ల నష్టం చోటుచేసుకుంది. తరువాతి స్థానాల్లోకి వెళితే, 2018–19లో రూ.66,636 కోట్లు, 2019–20లో రూ.25,941 కోట్లు, 2015–16లో రూ.17,993 కోట్లు, 2016–17లో రూ.11,389 కోట్లు బ్యాంకింగ్ నష్టాల బాట నడిచింది. చదవండి: ఘరానా మోసం : రైల్వే ఉద్యోగం..8 గంటల డ్యూటీ, వచ్చే పోయే రైళ్లను లెక్కించడమే పని! -
ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల మొండిబకాయిల మాఫీ
న్యూఢిల్లీ: దేశంలో గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 10,09,511 కోట్ల మొండి బకాయిలను షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు మాఫీ(రైటాఫ్) చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె మంగళవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రైటాఫ్ అనేది రుణ గ్రహీతలకు ఎలాంటి లబ్ధి చేకూర్చదని నిర్మలా సీతారామన్ తేల్చిచెప్పారు. వారి నుంచి రుణాలను వసూలు చేసే ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టంచేశారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను (రైటాఫ్ లోన్లు) తిరిగి చెల్లించాల్సిందేనని వివరించారు. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ.6,59,596 కోట్ల రుణాలను తిరిగి వసూలు చేశాయని, ఇందులో రూ.1,32,036 కోట్ల మేర రైటాఫ్ లోన్లు ఉన్నాయని తెలియజేశారు. ఇదీ చదవండి: గోల్డ్ ఈటీఎఫ్లలో అమ్మకాలు -
ఎస్బీఐ మొండి బకాయిలు అన్ని కోట్లా? షాకింగ్ విషయాలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అందించిన రుణాల్లో 1,71,953 కోట్ల రూపాయలకు పైగా మొండి బకాయిలు ఉన్నాయని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిపారు. దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు వసూలు చేయని మొండి బకాయిలు ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి, పారిశ్రామికవేత్తలు రుణాలను తీసుకొని తిరిగి చెల్లించని అప్పులు ఎన్ని ఉన్నాయనే సమాచారాన్ని భారత రిజర్వ్ బ్యాంకు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకుని తెలుసుకున్న రాజేంద్ర పల్నాటి ఆ వివరాలను బయట పెట్టారు. వీటితో పాటుగా పారిశ్రామికవేత్తలకు వారి వ్యాపారాల కోసం నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ)లో భాగంగా అప్పుగా ఇచ్చిన లోన్లు 1,06,804 కోట్ల రూపాయలు ఇంకా తిరిగి రాలేదని భారతీయ స్టేట్ బ్యాంక్ పీఐఓ ములుకుంట్ల శ్రీనివాస్ రావు తెలిపారు. -
జేసీ ఫ్లవర్స్కు యస్ బ్యాంక్ మొండి రుణాలు.. విలువ రూ. 48,000 కోట్లు
న్యూఢిల్లీ: ఒత్తిడిలో పడిన మొండి రుణాలను విక్రయించేందుకు బోర్డు అనుమతించినట్లు యస్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. ఎంపిక చేసిన మొత్తం రూ. 48,000 కోట్ల రుణాలను యూఎస్కు చెందిన ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ జేసీ ఫ్లవర్స్ ఏఆర్సీకి విక్రయించనున్నట్లు పేర్కొంది. ఈ రుణాల పోర్ట్ఫోలియోకు జేసీ ఫ్లవర్స్ ఏకైక బిడ్డర్గా నిలిచినట్లు తెలియజేసింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం పారదర్శక బిడ్డింగ్ విధానాలను అవలంబిస్తూ స్విస్ చాలెంజ్ పద్ధతిలో బిడ్లకు ఆహ్వానం పలికినట్లు బ్యాంక్ వెల్లడించింది. ప్రాథమిక(బేస్) బిడ్డింగ్కు జులైలోనే జేసీ ఫ్లవర్స్ ఏఆర్సీ మాత్రమే రేసులో నిలిచినట్లు పేర్కొంది. ఇతర బిడ్స్ దాఖలుకాకపోగా.. స్విస్ చాలెంజ్ ప్రాసెస్ను ముగించినట్లు తెలియజేసింది. వెరసి ఈ విధానం ప్రకారం గెలుపొందిన జేసీ ఫ్లవర్స్ ఏఆర్సీకి డైరెక్టర్ల బోర్డు ఆమోదముద్ర వేసినట్లు తెలియజేసింది. కాగా.. ఒప్పందం ప్రకారం జేసీ ఫ్లవర్స్ ఏఆర్సీలో 19.99 శాతం వాటా కొనుగోలుకి బ్యాంక్ తగిన పెట్టుబడులకు సైతం బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించింది. దీంతో తప్పనిసరి ఒప్పందం కుదుర్చుకునే సన్నాహాలు ప్రారంభించనున్నట్లు తెలియజేసింది. చదవండి: పైలట్లకు భారీ షాకిచ్చిన స్పైస్ జెట్.. 3 నెలల పాటు -
మరింత తగ్గనున్న మొండిబాకీల భారం
న్యూఢిల్లీ: బ్యాంకుల మొండిబాకీల భారం 2024 మార్చి నాటికి 5–5.5 శాతానికి దిగి వచ్చే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదిక ప్రకారం 2022 మార్చి నాటికి స్థూల నిరర్ధక ఆస్తుల (జీఎన్పీఏ) పరిమాణం ఆరేళ్ల కనిష్ట స్థాయి అయిన 5.9 శాతానికి తగ్గింది. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్న నేపథ్యంలో వివిధ రంగాల్లో నెలకొన్న ఒత్తిడి క్రమంగా తగ్గి, మొండి బాకీల రికవరీలు కూడా పెరగనున్నాయి. రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. అలాగే 2023 ఆర్థిక సంవత్సరంలో రుణ వ్యయాలు 1.5 శాతం స్థాయిలో స్థిరపడగలవని, అటుపైన 1.3 శాతానికి తగ్గొచ్చని పేర్కొంది. ఇతర వర్ధమాన మార్కెట్లు, భారత్ 15 ఏళ్ల సగటు స్థాయికి రుణ వ్యయాలు సర్దుబాటు కావొచ్చని తెలిపింది. వడ్డీ రేట్ల పెరుగుదల, అధిక ద్రవ్యోల్బణంతో చిన్న, మధ్య తరహా సంస్థలు, అల్పాదాయ కుటుంబాలపై పరిమిత స్థాయిలో ప్రతికూల ప్రభావం పడొచ్చని ఎస్అండ్పీ వివరించింది. మెరుగ్గా వృద్ధి అంచనాలు .. మధ్యకాలికంగా చూస్తే భారత్ ఆర్థిక వృద్ధి అవకాశాలు పటిష్టంగానే ఉండగలవని ఎస్అండ్పీ పేర్కొంది. 2024–26 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి వార్షికంగా 6.5–7 శాతం స్థాయిలో నమోదు కావచ్చని వివరించింది. జనాభా, చౌకగా కార్మిక శక్తి లభ్యత తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని పేర్కొంది. అంతే గాకుండా ఆర్థిక వ్యవస్థకు కేంద్రం బాసటగా నిలుస్తుందని, అలాగే రెండు బ్యాంకుల ప్రైవేటీకరణ యోచన ఉన్నప్పటికీ ప్రభుత్వ రంగ బ్యాంకులకు మద్దతును కొనసాగించే అవకాశాలు ఉన్నాయని ఎస్అండ్పీ వివరించింది. రాబోయే రోజుల్లో జీడీపీకి అనుగుణంగా రుణ వృద్ధి ఉండగలదని, కార్పొరేట్ రంగంతో పోలిస్తే రిటైల్ రంగాలకు రుణాల్లో వృద్ధి అధికంగా ఉండే ధోరణులు కొనసాగవచ్చని పేర్కొంది. రుణ వ్యయాలు తగ్గడం, రుణ వృద్ధి మెరుగుపడుతుండటం వంటి అంశాలు బ్యాంకుల ఆదాయాలకు దన్నుగా నిలవొచ్చని ఎస్అండ్పీ వివరించింది. -
బకాయిలు..బాబోయ్!! హౌసింగ్ రుణాల్లో ‘మొండి బకాయిల’ భారం!
ముంబై: హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల పోర్ట్ఫోలియో నాణ్యత మెరుగుపడినప్పటికీ, వాటి స్థూల మొండి బకాయిలు (ఎన్పీఏ)లు గత ఏడాది నవంబర్, డిసెంబర్ల్లో 70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరిగినట్లు క్రిసిల్ రేటింగ్స్ తన నివేదికలో పేర్కొంది. బ్యాంకుల రుణ నిబంధనావళి పరిధిలోకి హౌసింగ్ ఫైనాన్షియర్లను తీసుకు వస్తుండడం దీనికి నేపథ్యమని నివేదిక విశ్లేషించింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గత ఏడాది నవంబర్ 12 వతేదీన రుణదాతలు అందరికీ వర్తించేలా కఠినమైన రుణ నాణ్యత రిపోర్టింగ్ నిబంధనలను ప్రవేశపెట్టింది. తద్వారా హౌసింగ్ ఫైనాన్షియర్లు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలను (ఎన్బీఎఫ్సీ) వాణిజ్య బ్యాంకుల నిబంధనావళి పరిధిలోకి తీసుకువచ్చింది. కొత్త నిబంధనలను 2021 డిసెంబర్ 31నాటికి అమలు చేయాల్సి ఉన్నప్పటికీ ఈ గడువును 2022 సెప్టెంబర్ 30 వరకూ పొడిగిస్తూ ఆర్బీఐ 2022 ఫిబ్రవరి 15వ తేదీన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో క్రిసిల్ ఆవిష్కరించిన నివేదికలోకి కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► మొండి బకాయిల్లో 2021–22 ప్రస్తుత (మార్చి) త్రైమాసికం ముగిసే నాటికి ఒక స్థిరీకరణ చోటుచేసుకునే అవకాశం ఉంది. ► 2021 నవంబర్ తర్వాత కేవలం నెలరోజుల్లో (2021 డిసెంబర్ 31 నాటికి) చౌక గృహ ఫైనాన్స్ కంపెనీలకు సంబంధించి స్థూల మొండిబకాయిలు 140 బేసిస్ పాయింట్లు పెరిగాయి. ఇతర ఫైనాన్షియల్ కంపెనీల విషయంలో ఏకంగా ఈ పెరుగుదల 3.3 శాతంగా ఉంది. కొత్త నిబంధనలకు అనుగుణంగా ఆయా కంపెనీల అకౌంట్ల సవరణలు దీనికి కారణ. ఇలాంటి పరిస్థితి లేకపోతే ఎన్పీఏలు డిసెంబర్ నాటికి కేవలం 2.6 శాతం పెరిగేది. దీని ప్రకారం, కొత్త నిబంధనల నేపథ్యం వల్ల ఎన్పీఏలు 70 బేసిస్ పాయింట్లు పెరిగాయన్నమాట. అయితే 2022 మార్చి ముగిసే నాటికి 3 శాతానికి ఎన్పీఏలను పరిమితమయ్యే అవకాశం ఉంది. ► మరో రకంగా చెప్పాలంటే, కొత్త నిబంధనలు లేకపోతే రుణ నాణ్యత 40 బేసిస్ పాయింట్ల మేర పెరిగే అవకాశం కూడా ఉంది. ►హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఎన్బీఎఫ్సీలను వాణిజ్య బ్యాంకుల పరిధిలోనికి తీసుకురావడానికి సంబంధించి గడువును ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ పొడిగించినప్పటికీ, ఈ ప్రభావం పెద్దగా ఉండదు. ఎందుకంటే, ఇప్పటికే పలు హౌసింగ్ ఫైనాన్స్, ఎన్బీఎఫ్సీలు ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని, అమలు చేస్తున్నాయి. ► రుణాల విషయంలో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు తమ విధానాలను మార్చుకుంటున్నాయి. అనవసర వ్యయాల కట్టడి, వసూళ్ల విషయంలో మరింత వ్యవస్థాపరమైన పటిష్టత వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ► కాగా, ఎన్బీఎఫ్సీలకన్నా హెచ్ఎఫ్సీల రుణ నాణ్యత కొంత మెరుగ్గా వుండే అవకాశాలు ఉన్నాయి. ► రుణాల విషయంలో 95 శాతం ఉన్న 35 హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలను క్రిసిల్ తన నివేదిక కోసం అధ్యయనం చేసింది. -
పీఎన్బీ మొండిబాకీ లెక్కల్లో వ్యత్యాసాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) దాదాపు రూ. 2,617 కోట్ల మేర మొండిబాకీలు తక్కువగా చూపినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆడిట్లో వెల్లడైంది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్బీఐ లెక్కల ప్రకారం పీఎన్బీ స్థూల మొండిబాకీలు (ఎన్పీఏ) రూ. 81,089.70 కోట్లుగా ఉన్నాయి. కానీ పీఎన్బీ రూ. 78,472 కోట్లు మాత్రమే ఎన్పీఏలుగా చూపించింది. దీంతో ఆర్బీఐ, పీఎన్బీ లెక్కల మధ్య రూ. 2,617 కోట్ల వ్యత్యాసం (డైవర్జెన్స్) వచ్చింది. ఇక నికర ఎన్పీఏలు రూ. 30,038 కోట్లుగా ఉన్నట్లు పీఎన్బీ చూపగా, ఆర్బీఐ ఆడిట్ ప్రకారం రూ. 32,655 కోట్లుగా ఉన్నాయి. దీంతో నికర ఎన్పీఏలకు సంబంధించి కూడా డైవర్జెన్స్ రూ. 2,617 కోట్లుగా ఉన్నట్లు పీఎన్బీ వెల్లడించింది. మరోవైపు మొండిబాకీలకు కేటాయింపుల విషయంలో కూడా రూ. 2,091 కోట్ల మేర వ్యత్యాసం నమోదైంది. రూ. 50,242 కోట్ల మేర ప్రొవిజనింగ్ చేయాల్సి ఉండగా.. రూ. 48,151 కోట్లు మాత్రమే పీఎన్బీ కేటాయించింది. 2018–19 ఆర్థిక ఫలితాల్లో పీఎన్బీ రూ. 9,975 కోట్ల నష్టాన్ని ప్రకటించగా.. ఆర్బీఐ లెక్కించిన విధంగా ప్రొవిజనింగ్ చేసి ఉంటే నష్టాలు రూ. 11,336 కోట్లుగా ఉండేవి. దాదాపు రూ. 14,000 కోట్ల నీరవ్ మోదీ స్కామ్ నుంచి బైటపడేందుకు నానా తంటాలు పడుతున్న పీఎన్బీకి ఇతరత్రా మొండిబాకీలు భారంగా మారుతున్నాయి. -
ఆర్బీఐ పరిష్కార గడువు నేటితో ముగింపు
ముంబై: భారీ మొండి బకాయి ఖాతాల (ఎన్పీఏలు) విషయంలో ఆర్బీఐ విధించిన ఆరు నెలల గడువు సోమవారంతో ముగిసిపోనుంది. సుమారు 70 ఖాతాలకు సంబంధించి రూ.3.8 లక్షల కోట్ల రుణాలకు బ్యాంకులు పరిష్కార ప్రణాళిక సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే వాటిని ఎన్సీఎల్టీ పరిష్కారానికి నివేదించక తప్పనిసరి పరిస్థితిని బ్యాంకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో బ్యాంకులు చివరి క్షణంలో వీటికి సంబంధించి పరిష్కారం కోసం తమ చర్యల్ని వేగవంతం చేశాయి. ఈ ఖాతాల్లో ఎక్కువగా విద్యుత్ కంపెనీలవి కాగా, ఈపీసీ, టెలికం కంపెనీలవీ ఉండటం గమనార్హం. అయితే, ఎన్సీఎల్టీకి నివేదించే విషయంలో బ్యాంకులు సుముఖంగా లేవు. ఎందుకంటే ఇప్పటికే ఎన్సీఎల్టీకి సిఫారసు చేసిన ఖాతాల విషయంలో బ్యాంకులు ఎక్కువ హేర్కట్ (ఒక రుణంపై నష్టం) ఎదుర్కోవాల్సి వచ్చింది. అలోక్ ఇండస్ట్రీస్ ఎన్పీఏ ఖాతాలో ఈ హేర్కట్ 86 శాతంగా ఉండటం గమనార్హం. అంటే బ్యాంకులు తామిచ్చిన రుణంలో 86 శాతాన్ని నష్టపోవాల్సిన పరిస్థితి. రుణ గ్రహీతలు చెల్లింపుల్లో ఒక్కరోజు ఆలస్యమైనా ఆయా ఖాతాలను ఎన్పీఏలుగా గుర్తించి, నాటి నుంచి 180 రోజుల్లోపు (ఆరు నెలలు) పరిష్కారాన్ని కనుగొనాలన్నది ఆర్బీఐ ఆదేశాల సారం. ఈ ఆదేశాలు ఈ ఏడాది మార్చి 1 నుంచి అమల్లోకి రాగా, నాటికి ఎన్పీఏలుగా ఉన్న ఖాతాలకు గడువు ఆగస్ట్ 27తో తీరిపోనుంది. సోమవారం నాటికి పరిష్కారం లభించకపోతే ఎన్సీఎల్టీ ముందు నమోదుచేసి, దివాలా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. చివరి క్షణంలోపు అవకాశం ఉన్నంత మేరకు పరిష్కారానికి బ్యాంకులు ప్రయత్నాలు చేస్తున్నాయి. అలహాబాద్ హైకోర్టులో విచారణ పెండింగ్ రూ.3.8 లక్షల కోట్ల ఎన్పీఏల్లో మూడో వంతు విద్యుత్ కంపెనీలవి కాగా, ఇవి ఇప్పటికే ఆర్బీఐ ఉత్తర్వులకు వ్యతిరేకంగా అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాయి. కాగా, కొన్ని బ్యాంకులు పరిష్కార ప్రణాళికను రూపొందించగా, మరికొన్ని ఇదే పనిలో ఉన్నట్టు ఓ ప్రభుత్వరంగ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు. చాలా వరకు బ్యాంకులు పరిష్కార ప్రణాళికకు ఆమోదం తెలిపేందుకు లేదా డిఫాల్టింగ్ కంపెనీలకు రుణ సదుపాయం ఇచ్చేందుకు గాను సోమవారం బోర్డు సమావేశాలు ఏర్పాటు చేశాయని చెప్పారు. అయితే, రూ.3.5 లక్షల కోట్లు విలువైన సుమారు 60 ఎన్పీఏ ఖాతాలను ఎన్సీఎల్టీకి నివేదించే అవకాశం ఉందన్న సమాచారం వినిపిస్తోంది. -
బ్యాంకు ఆఫ్ ఇండియా మరోసారి కుదేలు
సాక్షి, ముంబై: బ్యాంకు ఆఫ్ ఇండియా క్యూ4 ఫలితాల్లో మరోసారి చతికిలబడింది. విశ్లేషకులు అంచనాలను దరిదాపుల్లోకి కూడా రాలేక భారీ నష్టాలను చవి చూసింది. గత ఏడాది నష్టాలకు కొనసాగింపుగా మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో రూ.3969 కోట్ల భారీ నికర నష్టాలను నమోదు చేసింది. గత ఏడాది1045కోట్ల రూపాయల నష్టాలను సాధించింది. కాగా 1187కోట్ల రూపాయల నష్టాలను రిపోర్ట్ చేసే అవకాశం ఉందని ఎనలిస్టులు అంచనా వేశారు. బ్యాడ్ లోన్ల బెడద బ్యాంక్ ఆఫ్ ఇండియాను భారీగా దెబ్బ తీసింది. స్థూల ఎన్పీఏలు మార్చి చివరి నాటికి 16.58 శాతంగా నమోదయ్యాయి, అంతకు ముందు త్రైమాసికంలో 16.93శాతంగా ఉండగా , ఏడాది క్రితం ఇది 13.22శాతంగా ఉన్నాయి. బ్యాడ్ లోన్ల కేటాయింపులు 41 శాతం పెరిగి రూ .6,674 కోట్లకు చేరుకున్నాయి. -
మరో ఫేక్ న్యూస్ సంచలనం
సాక్షి, న్యూఢిల్లీ : నకిలీ వార్తల ప్రచారం పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు నకిలీ వార్తలు రాసిన జర్నలిస్టుల పీఐబీ గుర్తింపు కార్డులను తక్షణం రద్దు చేయాలంటూ కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రి స్మృతి ఇరానీ సర్కులర్ జారీ చేయడం, దాన్ని సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రద్దు చేయడం తదితర పరిణామాలు తెల్సినవే. పీఐబీ గుర్తింపు కార్డులు కలిగిన జర్నలిస్టులు నకిలీ వార్తలు రాయరని, సోషల్ మీడియా ఊపందుకున్న నేపథ్యంలో ఆకాశ రామన్నలు, అజ్ఞాతవ్యక్తులే అలాంటి వార్తలు రాస్తారని కాబోలు స్మృతి ఇరానీ సర్కులర్ విషయంలో నరేంద్ర మోదీ తక్షణం స్పందించారు. ఇప్పుడు మరో నకిలీ వార్త సంచలనం సృష్టించింది. యూపీఏ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ బ్యాంకుల నుంచి కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున రుణాలు తీసుకొని ఎగ్గొట్టడంతో పేరుకు పోయిన 9 లక్షల కోట్ల బ్యాంకుల నిరర్థక ఆస్తుల్లో నాలుగు లక్షల నిరర్థక ఆస్తులు లేదా రుణాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) 2016’ వసూలు చేసిందన్నది ఆ నకిలీ వార్త. ఈ వార్తను ముందుగా పాలకపక్ష భారతీయ జనతా పార్టీ ఏప్రిల్ 14వ తేదీన పోస్ట్ చేయగా, ప్రధాన మంత్రి వెబ్సైట్ కూడా ఈ వార్తను మీడియా విభాగంలో ప్రముఖంగా పేర్కొంది. ఆ తర్వాత ప్రధాన మంత్రి ‘నమో’ యాప్ విస్తతంగా షేర్ చేసింది. బీజేపీతోపాటు ఎన్డీయే ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికీ ఈ వార్తను షేర్ చేస్తున్నారు. ఈ వార్త నకిలీదని తెలుసుకోగానే బీజేపీ పార్టీ, ప్రధాని వెబ్సైట్ దాన్ని తొలగించాయి. గత కొన్నేళ్లుగా ప్రభుత్వ బ్యాంకుల్లో పేరుకుపోయిన 9 లక్షల కోట్ల నిరర్థక ఆస్తుల్లో నాలుగు లక్షల కోట్ల రూపాయలు వసూలు చేయడమంటే మాటలు కాదు. అది ఏ ప్రభుత్వం చేసినా దాన్ని ఆ ప్రభుత్వం ఘనతగానే పరిగణించవచ్చు. సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు. ఈ నకిలీ వార్త ముందుగా ఎక్కడ పుట్టిందో తెలుసుకునేందుకు ‘ఆల్టర్ న్యూస్’ వెబ్సైట్ నెట్లో తూర్పార పట్టగా, ఎకనామిక్ టైమ్స్ పత్రికలో ఏప్రిల్ నాలుగవ తేదీతో ‘4 లాక్ క్రోర్ రూపీస్ ఎన్పీఏఎస్ రిటర్న్ డ్యూ టూ ఇన్సాల్వెన్సీ సిస్టమ్: అఫీషియల్’ అనే శీర్షికతో ఓ వార్త ఉంది. ప్రభుత్వ బ్యాంకుల్లో పేరుకుపోయిన 9 లక్షల కోట్ల నిరర్థక లేదా చెడ్డ రుణాల్లో సగానికి కొంచెం తక్కువగా, 4 లక్షల కోట్ల రూపాయలు ‘ఐబీసీ–2016’ కింద వసూలయ్యాయన్నది ఆ వార్త. ఆ వార్త కూడా ఓ అధికారి చెప్పినట్లు ఉంది. ఆ వార్తను ఎకనామిక్ టైమ్స్ పత్రిక ‘ఐఏఎన్ఎస్’ అనే వార్తా సంస్థ నుంచి తీసుకొంది. ‘ఇండస్ట్రీ ఛాంబర్ కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ’ పరిశ్రమలు దివాలా సమస్యను ఎలా అధిగమించాలనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి ఇంజేటీ శ్రీనివాస్ మాట్లాడుతూ నాలుగు లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు చెప్పారట. ఆ తర్వాత ఈ వార్తకు మరింత మసాలా అద్ది నకిలీ వార్తలను ప్రచారం చేయడంలో ప్రసిద్ధి చెందిన వెబ్సైట్ ‘పోస్ట్కార్డ్ న్యూస్’ ప్రచురింది. ‘మాసివ్ క్రాక్డౌన్ బై మోదీ గవర్నమెంట్ ఆన్ ఎన్పీఎస్’ శీర్షికన ప్రచురించింది. ‘కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన 9 లక్షల కోట్ల మొండి రుణాల్లో నాలుగు లక్షల కోట్ల రూపాయలను అంటే, 44.44 శాతం రుణాలను ఇటీవల ప్రవేశపెట్టిన ఐబీసీ విధానం ద్వారా మోదీ వసూలు చేశారు’ అని అందులో ఉంది. పోస్ట్కార్డ్ న్యూస్ను ఎక్కువగా నమ్ముకునే బీజేపీ, దాని అనుబంధ సంఘాలు ఈ వార్తను పిక్ చేశాయి. షేర్ చేశాయి. నకిలీ వార్తల కేసులో పోస్ట్కార్డ్ న్యూస్ ఎడిటర్ మహేశ్ విక్రమ్ హెగ్డేను మార్చి 30వ తేదీన బెంగుళూరులో పోలీసులు అరెస్ట్ చేయడం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం 9.5 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్న బ్యాంకుల నిరర్థక ఆస్తులు ఎక్కువగా పెరిగినది 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాకే. ఏదైమైనా నాలుగు లక్షల కోట్ల రూపాయల చెడ్డ రుణాలు వసూలయ్యాయంటే సాధారణ చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆర్బీఐ ప్రకటించిన డేటాను సేకరించేందుకు ప్రయత్నించగా, రాజ్యసభలో మార్చి నెలలోనే ఆర్థిక సహాయ మంత్రి శివ ప్రసాద్ శుక్లా ఆర్బీఐ డేటాను వెల్లడించిన విషయం వెలుగుచూసింది. రిటెన్ ఆఫ్ చేసిన 2. 73 లక్షల కోట్ల రూపాయల చెడ్డ రుణాల్లో 29, 343 కోట్ల రూపాయలు వసూలయ్యాయని మంత్రి తెలిపారు. బ్యాంక్ రుణాల రైటాఫ్కు, రుణాల వేవర్కు తేడా ఉంది. ఈ రెండింటి మధ్య తేడా లేకుండా సోషల్ మీడియాలో వార్తలు వస్తుంటాయి. రైటాఫ్ చేసిన రుణాలను వసూలు చేసేందుకు వివిధ రకాల పద్ధతుల్లో ప్రయత్నిస్తూనే ఉంటారు. రైటాఫ్ చేసిన రుణాలను వసూలు చేసేందుకే మోదీ ప్రభుత్వం ‘ఐబీసీ–2016’ విధానాన్ని తీసుకొచ్చింది. అయినప్పటికీ నిరర్థక ఆస్తుల్లో వసూలు ఎప్పటిలాగే 10.77 శాతం మాత్రమే ఉందని శుక్లా వివరించారు. తుది వివరణ కోసం ‘ఆల్టర్ న్యూస్’ రిపోర్టర్, కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి శ్రీనివాస్ను ప్రశ్నించగా, తన వార్తను మీడియా తప్పుగా అర్థం చేసుకొందని చెప్పారు. ‘బ్యాంకుల మొత్తం నిరర్థక ఆస్తుల్లో 50 శాతం ఆస్తులను ఐబీసీ పరిధిలోకి తెచ్చాం. 3.30 లక్షల కోట్ట రూపాయలను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కు అప్పగించాం, ట్రిబ్యునల్కు నివేదించడానికి ముందే 83,000 కోట్ల రూపాయలు సెటిల్ అయ్యాయి. వాటిని కలుపుకుంటే నాలుగు లక్షలు దాటుతుంది’ అని మాత్రమే తాను చెప్పానన్నారు. వసూలైన 83వేల కోట్ల రూపాయలను వసూలుకాని రుణాలకు ఎందుకు కలుపుకోవాలో ఆయనకే తెలియాలి. ఈ అసలు వార్త అలా, అలా నకిలీ వార్తగా మారిపోయింది. ఎకనామిక్ టైమ్స్లాగానే శ్రీనివాస్ వార్తను ఇండియన్ ఎక్స్ప్రెస్, ఫస్ట్పోస్ట్ పత్రికలు ప్రచురించినప్పటికీ వసూలైన మొత్తం కచ్చితంగా అంత ఉండదని సందేహం వ్యక్తం చేశాయి. -
రూ 81,683 కోట్లకు చెల్లుచీటీ
సాక్షి, న్యూఢిల్లీ : బడాబాబుల ఎగవేతలకు బ్యాంకులు ఆమోదముద్ర వేశాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏకంగా రూ 81,683 కోట్ల రాని బాకీలను రద్దు చేశాయి. వీటిలో అత్యధికంగా ఎస్బీఐ రూ 20,339 కోట్లను రానిబాకీలుగా తేల్చేసి చేతులు దులుపుకుంది. ఈ గణాంకాలు ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం జరగకముందువి కావడం గమనార్హం. 2012-13లో పీఎస్యూ బ్యాంకులు రద్దు చేసిన మొత్తం రూ 27,231 కోట్లుగా నమోదైంది. గడిచిన అయిదేళ్లలో దాదాపు మూడు రెట్లు అధికంగా మొండి బాకీలను ప్రభుత్వ రంగ బ్యాంకులు తాజాగా రద్దుల పద్దుల చేర్చాయి. ఎస్బీఐతో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్ 2016-17లో రూ 9205 కోట్లను, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ 7346 కోట్లు, కెనరా బ్యాంక్ రూ 5,545 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ 4348 కోట్ల మేర రాని బాకీలను రద్దు చేశాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలల్లో బ్యాంకులు రద్దు చేసిన రుణాల మొత్తం రూ 53,625 కోట్లకు పెరిగింది. ఆర్బీఐ అంచనాల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల విలువ 15 శాతానికి పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. బ్యాంకులు ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న క్రమంలో పీఎస్యూ బ్యాంకులకు రానున్న రెండేళ్లలో రూ 2.11 లక్షల కోట్ల మూలధనం సమీకరించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. -
మొండి బాకీలను అమ్మేందుకు ఆన్లైన్ వేదిక
సాక్షి, ముంబయి : రూ లక్షల కోట్ల మొండి బాకీలతో సతమతమవుతున్న బ్యాంకింగ్ వ్యవస్థకు ఊతమిచ్చేందుకు అమెరికా తరహాలో ఆన్లైన్ ట్రేడింగ్ వేదికను ఏర్పాటు చేయాలని ఆర్బీఐ సూచించింది. ఆన్లైన్లో మొండి బాకీలను విక్రయించే వ్యవస్థ ఏర్పాటుకు పూనుకోవాలని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ వైరల్ ఆచార్య పేర్కొన్నారు. అమెరికా, దక్షిణ కొరియాలో బ్యాంకింగ్ సంక్షోభం తలెత్తినప్పుడు ఇలాంటి వ్యవస్థ ఏర్పాటై ఆ తర్వాత రుణ విక్రయాల్లో పరిశ్రమ ప్రమాణాలతో పనిచేస్తోందని గుర్తుచేశారు. ఇక 2017, సెప్టెంబర్ నాటికి బ్యాంకుల రాని బాకీలు మొత్తం రూ 10 లక్షల కోట్లకు చేరిన విషయం తెలిసిందే. మొండి బాకీలు పేరుకుపోతున్న క్రమంలో గత జూన్ నుంచి ఆర్బీఐ 40 అతిపెద్ద మొండి బకాయిదారులను గుర్తించి వారిని డెట్ రికవరీ ట్రిబ్యునల్స్కు నివేదించాలని బ్యాంకులకు సూచించింది. పది లక్షల కోట్ల మొండి బాకీల్లో ఈ 40 ఖాతాలే రూ 4 లక్షల కోట్ల వరకూ ఉన్నాయి. మొండి బకాయిల జాబితాలో ఎస్సార్ స్టీల్, భూషణ్ స్టీల్, భూషణ్ పవర్, అమ్టెక్ ఆటో, వీడియోకాన్ ఇండస్ర్టీస్, జేపీ ఇన్ఫ్రా వంటి కంపెనీలున్నాయి. ఇక బ్యాంకుల నిరర్థక ఆస్తులు ఈ ఏడాది మార్చి నాటికి 10.8 శాతానికి, సెప్టెంబర్లో 11 శాతానికి పెరుగుతాయని ఆర్బీఐ ఇటీవల వెల్లడించిన ఆర్థిక స్థిరత్వ నివేదికలో హెచ్చరించింది. -
ఎస్బీఐకి మొండిబకాయిల సెగ
ముంబై : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా లాభాల్లో పడిపోయింది. మొండిబకాయిలు విపరీతంగా పెరిగిపోవడంతో, 2017-18 ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఫలితాల్లో బ్యాంకు లాభాలు 20.45 శాతం క్షీణించాయి. శుక్రవారం విడుదల చేసిన ఫలితాల్లో బ్యాంకు లాభాలు రూ.2,005.5 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు లాభాలు రూ.2,520.96 కోట్లగా ఉన్నాయి. బ్లూమ్బర్గ్ అంచనాల ప్రకారం బ్యాంకు రూ.2,955.90 కోట్ల లాభాలను ఆర్జిస్తుందని భావించారు. కానీ బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తులు గత క్వార్టర్ నుంచి ఈ క్వార్టర్కు బాగా పెరిగాయి. గత క్వార్టర్లో 6.9 శాతమున్న స్థూల ఎన్పీఏలు ఈ క్వార్టర్లో 9.97 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు కూడా జూన్ క్వార్టర్లో 5.97 శాతానికి ఎగిశాయి. గత క్వార్టర్లో ఇవి కూడా 3.71 శాతంగానే ఉన్నాయి. అంతేకాక ప్రొవిజన్లు, కంటింజెన్సీస్ 53.1 శాతం పెరిగి రూ.21,054.74 కోట్లగా ఉన్నాయి. రుణాలు ఇవ్వడం ద్వారా బ్యాంకు ఆర్జించిన కోర్ ఆదాయం లేదా నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ)లు 22 శాతం పెరిగి రూ.17,606.01 కోట్లగా రికార్డయ్యాయి. ఇవి గతేడాది రూ.14,437.31 కోట్లుగానే ఉన్నాయి. ఇతర ఆదాయాలు 11.03 శాతం ఎగిసి రూ.8,005.66 కోట్లగా బ్యాంకు ప్రకటించింది. ఫలితాల ప్రకటనలో బ్యాంకు లాభాలు 20 శాతం మేర పడిపోవడం, మొండిబకాయిలు ఎగియడంతో బ్యాంకు షేరు 5.02 శాతం క్షీణించి రూ.281.80గా నమోదవుతోంది. -
మొండి కొండ @ 7.7 లక్షల కోట్లు
♦ 2016–17లో 35 శాతం పైకి ♦ ప్రైవేటు బ్యాంకుల్లోనూ పెరిగిపోతున్న ఎన్పీఏలు ♦ 70 శాతం పెరిగి రూ.85,063 కోట్లకు ♦ యాక్సిస్, యస్ బ్యాంకుల ఖాతాల్లో తేడాలు ♦ ఐవోబీ, ఐడీబీఐ బ్యాంకుల్లోనూ తార స్థాయికి ♦ సరైన స్థాయిలోలేని నిధుల కేటాయింపులు న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకులు 2016–17 ఆర్థిక సంవత్సరంలోనూ మొండి బకాయిల సమస్య నుంచి బయటపడలేకపోయాయి. సరికదా గత కాలపు రుణాల సమస్యలు వాటిని ఇంకా పట్టి పీడిస్తూనే ఉన్నాయి. బడా కార్పొరేట్ సంస్థల నుంచి ఛోటా మోటా కంపెనీల వరకు, ఔదార్యంతో భారీగా రుణాలను మంజూరు చేసేసిన బ్యాంకులు... ఇప్పుడు వాటిని వసూలు చేసుకోలేక, రద్దు చేసి అందుకు సరిపడా నిధులు కేటాయించలేక (ప్రొవిజన్స్) ‘మింగలేక కక్కలేక’ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇప్పటి వరకూ మొండి బకాయిలు (వసూలు కాకుండా మొండిగా మారినవి/ఎన్పీఏలు) ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ)కే ఎక్కువ శాతం పరిమితం అనుకుంటుంటే... ఇన్నాళ్లు వాటిని కప్పి పెట్టిన ప్రైవేటు రంగ బ్యాంకుల దాపరికాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఎన్పీఏలను వాస్తవ గణాంకాల కంటే తక్కువగా చూపిస్తున్నట్టు ఇటీవలి యెస్ బ్యాంకు ఉదంతం తెలియజేస్తోంది. మొత్తానికి దేశీయ స్టాక్ మార్కెట్లో నమోదిత బ్యాంకుల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి రూ.7.7 లక్షల కోట్లకు చేరి సవాల్గా మారాయి. ఏడాదిలోనే భారీగా పెరుగుదల మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను ఇప్పటి వరకు దాదాపు అన్ని బ్యాంకులు ప్రకటించాయి. సిటీ యూనియన్ బ్యాంకు వెల్లడించాల్సి ఉంది. ఇటీవలే ఐదు బ్యాంకులను తనలో కలిపేసుకున్న ఎస్బీఐ సైతం కన్సాలిడేటెడ్ ఫలితాలను వెల్లడించింది. ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడించిన అన్ని బ్యాంకుల ఖాతా పుస్తకాల ప్రకారం స్థూల ఎన్పీఏలు రూ.7.7 లక్షల కోట్లకు చేరినట్టు స్పష్టమవుతోంది. 2016 మార్చితో అంతమైన ఆర్థిక సంవత్సరంలో స్థూల ఎన్పీఏలు రూ.5.70 లక్షల కోట్లు. అంటే గడిచిన ఆర్థిక సంవత్సరంలో మొండి రుణాలు 35 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. నికర ఎన్పీఏలు 58 శాతం పెరిగిపోవడం గమనార్హం. కానీ, బ్యాంకులు మొండి బాకీల కోసం చేస్తున్న కేటాయింపులు అరకొరగానే ఉన్నట్టు అర్థమవుతోంది. ప్రైవేటు బ్యాంకుల ఎన్పీఏలు ప్రభుత్వరంగ బ్యాంకులు తమ ఖాతాల ప్రక్షాళన కార్యక్రమాన్ని 2015–16 ఆర్థిక సంవత్సరం చివరి రెండు త్రైమాసికాల నుంచే మొదలు పెట్టగా... ప్రైవేటు రంగ బ్యాంకులు మాత్రం ఈ ప్రక్రియను గత ఆర్థిక సంవత్సరం నుంచే ప్రారంభించాయి. దీంతో వాటి ఖాతాల్లోని మకిలి బయటకొస్తోంది. ఒక్క గత ఆర్థిక సంవత్సరంలోనే ప్రైవేటు రంగ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు ఏకంగా 70 శాతం పెరిగి రూ.85,063 కోట్లకు చేరడం దీన్నే సూచిస్తోంది. మరి అదే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (ఎస్బీఐలో కలిసిన బ్యాంకులను మినహాయించి చూస్తే) ఎన్పీఏల పెరుగుదల చాలా తక్కువగా 20 శాతంగానే ఉంది. ప్రభుత్వరంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో ఒక విధంగా తమ ఖాతాల ప్రక్షాళనను భారీగానే నిర్వహించాయి. ఆర్బీఐ సమీక్షతో వెలుగులోకి పీఎస్బీల్లో మొండి బకాయిల ప్రక్షాళన కార్యక్రమం 2015–16 ద్వితీయార్ధం నుంచి ఆరంభమైంది. బ్యాంకుల ఆస్తుల నాణ్యతను సమీక్షించిన (ఏక్యూఆర్) ఆర్బీఐ... వసూలు కాకుండా ఒత్తిడిలో ఉన్న రుణాలను ఎన్పీలుగా ప్రకటించి వాటికి నిధులు కేటాయించాలని ఆదేశించింది. ఈ ఆదేశాల ఫలితం 2015 డిసెంబర్ త్రైమాసికం నుంచి ఆర్థిక ఫలితాల్లో కనిపించడం ఆరంభమైంది. ఆర్బీఐ ఆస్తుల నాణ్యత సమీక్షకు ముందు 2015 సెప్టెంబర్ త్రైమాసికం నాటికి ఉన్న స్థూల ఎన్పీఏలను విశ్లేషించి చూస్తే ఆ తర్వాతి కాలంలో పీఎస్బీల కంటే ప్రైవేటు బ్యాంకుల ఎన్పీఏలు అనూహ్యంగా పెరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా యాక్సిస్ బ్యాంకు, యస్ బ్యాంకుల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఈ రెండు బ్యాంకుల్లో స్థూల ఎన్పీఏల పెరుగుదల 300% మించి ఉంది. ఆస్తుల నాణ్యత సమీక్షకు ముందు ఈ రెండు బ్యాంకులు ఎన్పీఏలను తక్కువ చేసి చూపించినట్టు స్పష్టమవుతోంది. 2016 ఆర్థిక సంవత్సరంలో ఎన్పీల విషయమై ఆర్బీఐ నిర్ధారణకు, తమ అంచనాలకు మధ్య తేడా ఉన్నట్టు ఈ రెండు బ్యాంకులు ఇటీవలే ప్రకటించాయి కూడా. ఈ తేడా రూ.9,478 కోట్లు అని యాక్సిస్ బ్యాంకు వెల్లడించగా... యాక్సిస్ ఖాతాల పరంగా వెలుగు చూడని ఎన్పీఏలు రూ.4,177 కోట్లు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో యునైటెడ్ బ్యాంక్, ఐడీబీఐ ఎన్పీఏలు భారీగా పెరిగాయి. పరిమితి దాటితే ఆంక్షలు.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎన్పీఏలు ప్రైవేటు రంగ బ్యాంకుల కంటే అధికంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఈ ఏడాది మార్చి నాటికి ఐఓబీ, ఐడీబీఐ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు అత్యధిక స్థాయిలో ఉన్నాయి. ఎన్పీఏల శాతం గరిష్ట స్థాయికి చేరిన నేపథ్యంలో ఈ బ్యాంకులు ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా సత్వర దిద్దుబాటు చర్యల్ని చేపట్టాల్సి ఉంటుంది. అంటే నియమకాలు నిలుపుచేయడం, శాఖల విస్తరణకు బ్రేక్వేయడం వం టివి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం చూస్తే... నికర ఎన్పీఏలు 6–9% ఉంటే ఆ బ్యాంకులు రిస్క్ కేటగిరీ–1 పరిధిలోకి వస్తాయి. ఎన్పీఏలు 9–12% ఉంటే రెండో రిస్క్ విభాగంలోకి, 12%పైన ఉన్న బ్యాంకులు మూడో కేటగిరీ కిందకు వస్తాయి. నికర విలువను దాటేసిన ఎన్పీఏలు: మెకిన్సే కన్సల్టింగ్ సంస్థ మెకిన్సే అండ్ కో దేశీ బ్యాంకుల మొండి బకాయిల సంక్షోభంపై తాజాగా నివేదిక విడుదల చేసింది. దేశీయ బ్యాంకులకు చెందిన ఒత్తిడిలో ఉన్న మొత్తం రుణాలు (పునరుద్ధరించిన రుణాలు సహా) ఈ రంగం మొత్తం నెట్వర్త్ను మించిపోయాయి. ఈ రంగం నికర విలువ రూ.9.24 లక్షల కోట్లు కాగా, ఒత్తిడిలో ఉన్న రుణాల విలువ రూ.9.6 లక్షల కోట్లుగా ఉన్నట్టు మెకిన్సే వివరించింది. ‘‘తక్కువ వడ్డీ రేట్ల వాతావరణంలోనూ రుణాల్లో వృద్ధి లేకపోవడం, ఒత్తిడితో కూడిన రుణాలు అధిక స్థాయికి చేరడం, టెక్నాలజీ, నియంత్రణల పరంగా వచ్చిన మార్పులు భారత బ్యాంకింగ్ రంగానికి తుఫాను మాదిరి వాతావరణాన్ని కల్పించాయి’’ అని మెకిన్సే పేర్కొంది. ఎన్పీఏ ఆర్డినెన్స్ పరిధిలో 15 రోజుల్లో ప్రణాళిక! న్యూఢిల్లీ: బ్యాంకింగ్ మొండిబకాయిల (ఎన్పీఏ)ల సమస్య పరిష్కారానికి కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్కు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో పక్షం రోజుల్లో ఒక కార్యాచరణ ప్రణాళిక విడుదల చేయనుంది. ఎన్పీఏలు రూ. 8 లక్షల కోట్లు దాటిన నేపథ్యంలో సమస్య పరిష్కారం దిశలో ఆర్బీఐకి మరిన్ని అధికారాలను కట్టబెడుతూ ఇటీవలే కేంద్రం ఒక ఆర్డినెన్స్ను జారీ చేయడం తెలిసిందే. ఎన్పీఏలకు సంబం ధించి సమస్యల గుర్తింపునకు ప్రత్యేక విభాగం ఏర్పాటు, సమ స్య పరిష్కార ప్రక్రియలో సమయ కేటాయింపు, నిర్ణయం వంటి అంశాలు ఉంటాయని సంబంధిత వర్గాలు వెల్ల డించాయి. ఈ సమస్య 60 నుంచి 90 రోజులు ఉంటుందని కూడా తెలుస్తోంది. బడా మొండిబకాయిలకు సంబంధించి ఇప్పటికే ఆర్బీఐ 50 కేసులను గుర్తించినట్లు సమాచారం. ఆర్డినెన్స్ అమలు పర్యవేక్షణకు కమిటీ ఎన్పీఏ ఆర్డినెన్స్ను ఆచరణలో పెట్టే దిశగా ఆర్బీఐ చర్యల్ని ఆరంభించింది. ఇందు కోసం తన అధికార పరిధిలో పర్యవేక్షణ కమిటీని తిరిగి ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఆర్బీఐ సోమవారం ప్రకటించింది. అలాగే, సమస్య తీవ్రత దృష్ట్యా కమిటీని విస్తరించి మరింత మంది సభ్యులకు చోటు కల్పించనున్నట్టు పేర్కొంది. -
రుణ మోసాలపై సత్వర నివేదికలు ఇవ్వండి: ఆర్బీఐ
ముంబై: రుణ మోసాలపై క్రియాశీలంగా సత్వర చర్యలు అవసరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) భావిస్తోంది. త్వరితగతిన ఈ సమాచారాన్ని అందించాలని, సమయాన్ని వృధా చేయరాదని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా సూచించారు. సంబంధిత రుణ మోసాలు, మొండిబకాయిల విషయంలో నాలుగేళ్ల సమాచారాన్ని నివేదికలో పొందుపరచాలని ఆయన పేర్కొన్నారు. ఒక రుణ గ్రహీతను ‘ఫ్రాడ్’ అని ప్రకటించే నాలుగేళ్ల ముందే అతని రుణం మొండిబకాయిగా గుర్తించిన సందర్భాలను తాము గమనిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకింగ్ మోసాల్లో 92 శాతం రుణాలతో సంబంధం ఉన్నవేనని ఆయన అన్నారు. -
మొండి బకాయిలకు... మూల కారణం గుర్తించాలి
సుప్రీంకోర్టు వ్యాఖ్య... కేవలం పేర్లు వెల్లడిస్తే సమస్య పరిష్కారం కాబోదని స్పష్టీకరణ న్యూఢిల్లీ: బ్యాంకింగ్కు రూ.500 కోట్లు ఆపైన బకాయిదారుల పేర్లు వెల్లడించినంత మాత్రాన మొండిబకాయిల సమస్య (ఎన్పీఏ) పరిష్కారం అయిపోదని సుప్రీంకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది. తీవ్రమైన ఎన్పీఏ సమస్యకు ప్రధాన కారణాన్ని విశ్లేషించి, పరిష్కరించడం అవసరమని అభిప్రాయపడింది. మొండిబకాయిలు, రూ.500 కోట్లు పైబడిన వారి పేర్ల వెల్లడికి సంబంధించి జరుగుతున్న విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏఎం ఖాన్వేకర్, జస్టిస్ డీవై చంద్రచూడ్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తాజా వ్యాఖ్యలు చేసింది. భారీ రుణ బకాయిదారుల పేర్ల వెల్లడి అవకాశాలను పరిశీలించాలని ఇప్పటికే కేంద్రం, ఆర్బీఐలకు సుప్రీం సూచించిన సంగతి తెలిసిందే. రుణ రికవరీ వ్యవస్థను సరిదిద్దడానికి తీసుకుంటున్న చర్యలు ఏమిటి? డెట్ రికవరీ ట్రిబ్యునళ్లు (డీఆర్టీ), డెట్ రికవరీ అప్పిలేట్ ట్రిబ్యునల్ (డీఆర్ఏటీ) వంటి న్యాయ వేదికల చట్టాల పటిష్టత విషయంలో చర్యలు వంటి అంశాలపై నాలుగువారాల్లో అఫిడవిట్ ఇవ్వాలని కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ తరఫున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ (ఎస్జీ) రంజిత్ కుమార్కు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంతక్రితం రంజిత్ కుమార్ కోర్టుకు తన వాదనలు వినిపిస్తూ... ఎన్పీఏలు సహా ఇందుకు సంబంధించి వివిధ సమస్యలపై ఒక కమిటీని నియమించినట్లు తెలిపారు. కమిటీ త్వరలో నివేదిక సమర్పిస్తుందనీ వెల్లడించారు. 57 డిఫాల్టర్ల బకారుులు రూ.85,000 కోట్లు... అంతక్రితం సొలిసిటర్ జనరల్ మొండిబకాయిదారుల గురించి సుప్రీంకోర్టుకు తెలియజేస్తూ... కేవలం 57 మంది రుణ గ్రహీతలు బ్యాంకింగ్కు చెల్లించాల్సిన మొత్తం రూ.85,000 కోట్లని అన్నారు. ‘‘ఈ రుణ గ్రహీతలు ఎవరు? వారు ఎంత చెల్లించాలి? ఎందుకు తిరిగి చెల్లించడం లేదు? వంటి అంశాలు ప్రజలకు ఎందుకు తెలియకూడదు’’ అని ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 8,100 ఎగవేతదారులు... రూ.76,685 కోట్లు దేశంలో 2016 మార్చి నాటికి దాదాపు 8,167 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారులు(విల్ఫుల్ డిఫాల్టర్లు) ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తం రూ.76,685 కోట్లని లోక్సభకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. ఏడాదిలో ఉద్దేశపూర్వక ఎగవేతదారుల సంఖ్య 16% పెరిగిందని ఆయన తెలిపారు. రూ.25 లక్షలు పైబడిన బకాయిదారుల సంఖ్య 2015 మార్చి నాటికి 7.031 మంది ఉంటే ఆ సంఖ్య 2016 మార్చి నాటికి 8,167 మందికి చేరినట్లు తెలిపారు. అదే సమయంలో బకాయిలు 28.5 శాతం ఎగసి రూ.59,656 కోట్ల నుంచి రూ.76,685 కోట్లకు చేరినట్లు వివరించారు. 2015-16లో రూ.21,509 కోట్ల వసూళ్లకు సంబంధించి బ్యాంకులు 1,724 ఎఫ్ఐఆర్లు నమోదుచేసినట్లు తెలిపారు. అరుుతే ఈ కేసుల విషయంలో శిక్షలు 1.14 శాతమే ఉందని వివరించారు. అలాగే బ్యాంకులు గడచిన ఏడాది కేవలం రూ.3,498 కోట్ల బకాయిలను మాత్రమే వసూలు చేసుకోగలిగాయని తెలిపారు. -
భారత్ ఓ ఆశా కిరణం
• బ్యాంక్ల మొండి బకాయిలు సమస్యే • ఐఎంఎఫ్ వెల్లడి న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో భారత్ ఆశాకిరణమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అభివర్ణించింది. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెరిగిపోతున్న మొండి బకాయిలు సమస్యేనని పేర్కొంది. భారత్తోపాటు చైనా సైతం తన వృద్ధిని కొనసాగిస్తుందని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ మౌరిస్ ఆబ్స్ఫెల్డ్ అన్నారు. భారత్లో ద్రవ్యోల్బణం, కరెంటు ఖాతా లోటు, ద్రవ్యలోటు తగ్గుముఖం పడుతున్నాయని పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో బ్రూకింగ్స్ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో ఆబ్స్ఫెల్డ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... భారత్లో ఇప్పటికీ నిర్మాణపరమైన సవాళ్లు ఉన్నాయన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల నిరర్థక ఆస్తుల విషయంలో చెప్పుకోతగ్గ పురోగతి ఉన్నప్పటికీ, అవి పెరిగిపోవడం సవాలేనన్నారు. 2016, 2017 సంవత్సరాల్లో భారత్ 7.6 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని ఇటీవలే ఐఎంఎఫ్ తన అంచనాలను ప్రకటించి న విషయం తెలిసిందే. -
‘మొండి’ భారం రెట్టింపు...
కేర్ రేటింగ్స్ వెల్లడి ముంబై: బ్యాంక్ల మొండి బకాయిలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో దాదాపు రెట్టింపై 8.5 శాతానికి చేరాయని ప్రముఖ రేటింగ్ సంస్థ, కేర్ రేటింగ్స్ తాజా నివేదిక తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంక్ల మొండి బకాయిలు భారీగా ఉండడమే దీనికి కారణమంటున్న ఈ నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.., ⇒ గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో 4.6 శాతంగా ఉన్న బ్యాంక్ల మొండి బకాయిలు ఈ క్యూ1లో 8.5 శాతానికి పెరిగాయి. ⇒ గత క్యూ1లో 5.3 శాతంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంక్ల మొండి బకాయిలు ఈ క్యూ1లో 10.4 శాతానికి ఎగిశాయి. మరో ఆరు నెలల పాటు ప్రభుత్వ రంగ బ్యాంక్లకు మొండి బకాయిలు, వాటికి కేటాయింపుల సమస్యలు తప్పవు. ఫలితంగా వాటా లాభదాయకత దెబ్బతింటుంది. ⇒ {పైవేట్ బ్యాంక్లు కొంత నయంగా ఉన్నాయి. గత క్యూ1లో 2.1%గా ఉన్న ప్రైవేట్ బ్యాంక్ల మొండి బకాయిలు ఈ క్యూ1లో 3%కి పెరిగాయి. ⇒ మొండి బకాయిల కారణంగా పలు ప్రభుత్వ రంగ బ్యాంక్లు భారీ నష్టాలను ప్రకటించాయి. ⇒ బకాయిలను గుర్తించి వాటికి కేటాయింపులు జరపడం దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇచ్చే చర్య. పోటీని తట్టుకోవడానికి తగిన సన్నద్ధతను ఇవ్వడానికి బ్యాంక్లకు ఈ చర్య ఉపకరిస్తుంది. -
82 శాతం తగ్గిన కార్పొరేషన్ బ్యాంక్ లాభం
న్యూఢిల్లీ: .కార్పొరేషన్ బ్యాంక్ నికర లాభం జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో 82 శాతం పడిపోయింది. 2015 ఇదే కాలంలో రూ.204.2 కోట్లుగా ఉన్న లాభం, తాజా సమీక్షా కాలంలో రూ.53.3 కోట్లకు తగ్గింది. మొండిబకాయిలకు సంబంధించి అధిక ప్రొవిజనింగ్ కేటాయింపులు దీనికి ప్రధాన కారణమని బ్యాంక్ తెలిపింది. కాగా ఇదే త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.5,335 కోట్ల నుంచి రూ.5,241 కోట్లకు పడిపోయింది. ప్రొవిజనింగ్ తదితర కేటాయింపులు రూ.621 కోట్ల నుంచి రూ.895 కోట్లకు పెరిగాయని తెలిపింది. స్థూల రుణాల్లో స్థూల మొండిబకాయిలు 5.43 శాతం నుంచి 11.01 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏల విషయంలో ఈ శాతం 3.55 శాతం నుంచి 7.22 శాతానికి పెరిగింది. -
యాక్సిస్ లాభాలకు బకాయిల సెగ
హెచ్డీఎఫ్సీ, కొటక్ మహింద్రా బ్యాంకుల వల్లే దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు యాక్సిస్ బ్యాంకుకి మొండిబకాయిల బెడద తప్పలేదు. శుక్రవారం ప్రకటించిన 2016-17 ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఫలితాల్లో నికర లాభాలు 21 శాతం పడిపోయాయి. జూన్ క్వార్టర్లో నికరలాభాలు రూ.1555.53 కోట్లగా ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభాలు రూ.1978.44 కోట్లగా ఉన్నాయి. మరోవైపు బ్యాడ్ లోన్స్ లేదా స్థూల నిరర్థక ఆస్తులు 59 శాతం పెరిగి, రూ.4010.23 కోట్లగా నమోదైనట్టు బ్యాంకు పేర్కొంది. 2016 మార్చి త్రైమాసికంలో ఇవి రూ.2522.14 కోట్లగా ఉన్నాయి. అయితే నికర వడ్డీ ఆదాయాలు 11.35 శాతం ఎగిసి, రూ.4,516.92 కోట్లగా నమోదుచేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ ఆదాయాలు రూ.4,056.23 కోట్లగా ఉన్నాయి. నిర్వహణ లాభాలు కూడా 9.22 శాతం జంప్ అయి, ఏడాదికి ఏడాది రూ.4,469.37 కోట్లగా రికార్డు చేసింది. ఏప్రిల్-జూన్ కాలంలో తన నెట్ వర్క్ లను విస్తరించుకున్నట్టు యాక్సిస్ బ్యాంకు ప్రకటించింది. దేశమంతటా తను కలిగి ఉన్న నెట్ వర్క్ లకు 102 బ్రాంచ్ లను కలుపుకున్నట్టు వెల్లడించింది. దీంతో జూన్ 30కి 1,882 సెంటర్లలలో బ్యాంకుకు మొత్తం 3,006 దేశీయ బ్రాంచ్లు, ఎక్స్టెన్షన్ కేంద్రాలు ఉన్నాయి. ఫలితాల నేపథ్యంలో ఈ బ్యాంకు షేర్లు 0.13 శాతం పడిపోయి, రూ.537.55గా నమోదైంది. -
భారత్ లో పడిపోయిన వ్యాపార ఆశావాదం
న్యూఢిల్లీ : రెండు త్రైమాసికాలుగా టాప్ స్థానంలో ఉన్న భారత్, వ్యాపార ఆశావాద స్థాయిలో(బిజినెస్ అప్టిమిజమ్ ఇండెక్స్) గ్లోబల్ గా మూడో స్థానానికి పడిపోయింది. సంస్కరణలు అమలుచేయడంలో విఫలమవుతుండటంతో వ్యాపార ఆశావాద స్థాయిని ప్రపంచవ్యాప్తంగా భారత్ కోల్పోయింది. ఏకీకృత వస్తుసేవల పన్ను(జీఎస్టీ), ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండిబకాయిల బెడద వంటి కారణాలతో భారత్ తన స్థానాన్ని కోల్పోయిందని రిపోర్టు వెల్లడించింది. తాజా గ్రాంట్ తోర్న్టన్ ఇంటర్నేషనల్ బిజినెస్ రిపోర్ట్ లో ఈ విషయం వెల్లడైంది. 2016 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత మూడో స్థానంలో నిలిచిందని రిపోర్టు నివేదించింది. జీఎస్టీ లాంటి ప్రధాన సంస్కరణల అమలులో విఫలం, పన్ను వివాదాలు ఎంతకీ తేలకపోవడం, నిరర్థక ఆస్తులు పెరగడంతో బ్యాంకింగ్ లో సమస్యలు పెరగడం, బ్యాంకింగ్ సెక్టార్ బ్యాంకుల్లో రీక్యాపిటలైజేషన్ అవసరం రావడం వంటివి కార్పొరేట్ ఇండియాలో వ్యాపార విశ్వాసాలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో మొత్తంగా భారత్ లో వ్యాపార ఆశావాద స్థాయిని తగ్గిస్తుందని రిపోర్టు పేర్కొంది. జనవరి-మార్చి త్రైమాసికంలో టాప్ లో నిలిచిన ఉపాధి అంచనాల వృద్ధి రెండో స్థానానికి క్షీణించింది. వ్యాపార అవకాశాలు, మార్కెట్లో ఆశావాద స్థాయి ఎక్కువగానే ఉన్నప్పటికీ.. కీలక సంస్కరణల అమలు పెట్టుబడిదారులు, ర్యాకింగ్ పై ప్రభావం చూపుతుందని గ్రాంట్ తోర్న్టన్ ఇండియా ఎల్ఎల్పీ పార్టనర్ హరీష్ హెచ్వీ చెప్పారు. ఒకవేళ ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో జీఎస్టీ బిల్లు పాస్ అయితే, ఈ ట్రెండ్ రివర్స్ అవుతుందని తెలిపారు. -
లాభాల్లో ఇండస్ ఇండ్...తప్పని బ్యాడ్ లోన్ భారం
ముంబై : ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు జోరు నేటినుంచి ప్రారంభమైంది. ప్రైవేట్ రంగానికి చెందిన ఇండస్ ఇండ్ బ్యాంకు తొలి త్రైమాసికంలో నికర లాభాల్లో అదరగొట్టింది. 2016 జూన్ 30కు ముగిసిన త్రైమాసికంలో నికర లాభాలు 26శాతం జంప్ అయి, రూ.661 కోట్లగా నమోదయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు నికరలాభాలు రూ.525 కోట్లగా ఉన్నాయి. నికర వడ్డీ ఆదాయం పెరగడంతో బ్యాంకు లాభాల బాటలో నడిచింది. నికర వడ్డీ ఆదాయం ఈ త్రైమాసికంలో రూ.1,325 కోట్లగా రికార్డు అయ్యాయి. ఈ ఆదాయాలు గతేడాది ఇదే క్వార్టర్లో రూ.980 కోట్లగా ఉన్నాయి. అయితే ప్రైవేట్ రంగానికి చెందిన ఈ బ్యాంకు కేవలం రూ.653 కోట్లను మాత్రమే నికర లాభాలుగా నమోదుచేస్తుందని మార్కెట్ విశ్లేషకులు అంచనావేశారు. విశ్లేషకుల అంచనాల కంటే కాస్త అధికంగానే బ్యాంకు లాభాలను నమోదుచేసింది. నికర వడ్డీ మార్జిన్లు ఈ త్రైమాసికంలో 3.97శాతం మెరుగయ్యాయి. అయితే బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు(నాన్ ఫర్ ఫార్మింగ్ ఆస్తులు) జూన్ క్వార్టర్లో రూ.776 కోట్లనుంచి రూ.860 కోట్లకు ఎగిశాయి. అదేవిధంగా నికర నిరర్ధక ఆస్తుల సైతం 0.36శాతం నుంచి 0.38శాతానికి పెరిగాయి. దీంతో బ్యాడ్ లోన్స్ ప్రభావం స్టాక్ మార్కెట్లో బ్యాంకు షేర్లపై పడింది. ఇండస్ ఇండ్ బ్యాంకు షేరు రూ.0.24శాతం పడిపోయి రూ.1,124వద్ద ముగిసింది. -
మొండిబకాయిల రికవరీ ఇక వేగవంతం
కీలక బిల్లుకు క్యాబినెట్ ఆమోదం న్యూఢిల్లీ: మొండి బకాయిలు మరింత వేగంగా రికవరీ కావడానికి దోహదపడే కీలక బిల్లును బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదించింది. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని లొసుగులను సరిచేసే క్రమంలో రూపొందిన ‘ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇన్ట్రస్ట్ అండ్ రికవరీ ఆఫ్ డెప్ట్ లాస్ అండ్ మిసిలీనియస్ ప్రొవిజన్స్ బిల్లు, 2016కు క్యాబినెట్ ఆమోదం లభించినట్లు అధికారిక ప్రకటన ఒకటి తెలిపింది. బ్యాంకింగ్ వ్యవస్థలో దాదాపు రూ.8 లక్షల కోట్ల మొండిబకాయిలు పేరుకుపోయిన నేపథ్యంలో... నాలుగు కీలక చట్టాల్లో (సర్ఫేసీ యాక్ట్ 2002, ది రికవరీ ఆఫ్ డెట్స్ యాక్ట్ 1993, ది ఇండియన్ స్టాంప్స్ యాక్ట్ 1899, ది డిపాజిటరీ యాక్ట్ 1996) సవరణలకు ఉద్దేశించి ఈ బిల్లు రూపొందింది. అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీలను రెగ్యులేట్ చేయడానికి సైతం ఈ బిల్లు ఆర్బీఐకి అనుమతి ఇస్తుంది. -
మొండిబకాయిల సమస్య ఆందోళనకరం
♦ కేంద్ర మంత్రి జయంత్సిన్హా ♦ రుణ నాణ్యతా సమీక్షలు తరచూ జరగాలని సూచన ముంబై: బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్య ఆందోళనకరంగా ఉందని ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్సిన్హా పేర్కొన్నారు. రుణ నాణ్యతకు సంబంధించిన సమీక్ష (ఏక్యూఆర్)లు ఒక్కసారితో సరిపెట్టకుండా తరచూ జరపాలని సైతం ఆయన సూచించారు. అనుమానాస్పద రుణాలను వెలికితీయడానికి గడచిన డిసెంబర్లో ఆర్బీఐ రుణ నాణ్యతా సమీక్షలు జరిపింది. ఇందుకు సంబంధించి 130 అకౌంట్లను ఖరారు చేసింది. కంపెనీలు పనిచేస్తున్నా లేకున్నా... ఏ పరిస్థితుల్లో ఉన్నా సంబంధిత అకౌంట్లు అన్నింటినీ మొండిబకాయిల జాబితాలో చేర్చాలని రెగ్యులేటర్ సూచించింది. దీనితో భారీగా అదనపు ప్రొవిజన్ కేటాయింపులతో బ్యాంకింగ్ రంగం లాభాలు ఒక్కసారిగా భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.70,000 కోట్ల మేర నిధులు అందుబాటులో లేకుండా పోయాయి. ఈ తరహా సమీక్షలు తరచూ చేయాలన్నది తన సూచనని జయంత్ సిన్హా ఇక్కడ మంగళవారం క్రిసిల్ నిర్వహించిన కార్యక్రమంలో పేర్కొన్నారు. ఎన్పీఏ ఫండ్ ఏర్పాటు కసరత్తు... సమస్య పరిష్కారంపై సిన్హా మాట్లాడుతూ, మొండిబకాయిల సమస్య పరిష్కార దిశలో ఒక ఫండ్ను ఏర్పాటు చేయడానికి కసరత్తు జరుపుతున్నట్లు తెలిపారు. -
పెద్ద బ్యాంకులుగా మిగిలేవి పదే!
♦ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ విలీన ప్రక్రియపై జయం ♦ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ విలీన ప్రక్రియపై జయంత్ సిన్హా వ్యాఖ్య బెంగళూరు: భారత్లో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ విలీనం, పెద్ద బ్యాంకుల ఏర్పాటుపై ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్సిన్హా శుక్రవారం కీలక ప్రకటన చేశారు. మొండిబకాయిల సమస్య పరిష్కారం తక్షణ ప్రాధాన్యతగా పేర్కొన్న ఆయన... తదుపరి బ్యాంకింగ్ విలీన ప్రక్రియపై కేంద్రం దృష్టి సారిస్తుం దన్నారు. చివరకు పోటీపడే పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులు 8 నుంచి పదే ఉంటాయని అన్నారు. మిగిలినవి ‘డిఫరెన్షియేటెడ్’ (నిర్దిష్ట కార్యకలాపాలు నిర్వహించే) బ్యాంకులుగా మిగులుతాయని వివరించారు. ఇండియన్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ ఇండస్ట్రీ రౌండ్ టేబుల్ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత్కు ప్రపంచ స్థాయి బ్యాంకింగ్ సంస్థల ఏర్పాటు అవసరమన్నారు. ‘‘ప్రస్తుతం 27 ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి. మొండిబకాయిల సమస్య పరిష్కారం అయిన తర్వాత, కేవలం 8 నుంచి 10 పోటీ పూర్వక బ్యాంకులే ఉంటాయని నేను భావిస్తున్నాను. వీటిలో కొన్ని ప్రపంచ స్థాయి బ్యాంకులుగా అవతరించే వీలుంది. మరికొన్ని డిఫెరెన్షియేటెడ్ బ్యాంకులుగా కొనసాగుతాయి’’ అని అన్నారు. -
ఎస్బీఐ లాభం డౌన్.. షేరు జూమ్!
♦ క్యూ4లో 66 శాతం తగ్గిన నికర లాభం; రూ.1,264 కోట్లు ♦ ఆదాయం రూ.53,527 కోట్లు; 10 శాతం పెరుగుదల ♦ భారీగా పెరిగిన మొండిబకాయిలు... ♦ స్థూల ఎన్పీఏలు 4.25 శాతం నుంచి 6.5 శాతానికి చేరిక ♦ షేరుకి రూ.2.6 చొప్పున డివిడెండ్ ♦ 10 శాతం దూసుకెళ్లిన షేరు ధర... కోల్కతా: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)ను మొండిబకాయిలు(ఎన్పీఏ) వెంటాడుతూనే ఉన్నాయి. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2015-16, క్యూ4)లో బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం 66 శాతం దిగజారి రూ.1,264 కోట్లకు పడిపోయింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 3,742 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా మొండిబకాయిలకు ప్రొవిజనింగ్(కేటాయింపులు) రెట్టింపునకు పైగా ఎగబాకడం లాభాలు దిగజారేందుకు దారితీసింది. ఇక క్యూ4లో మొత్తం ఆదాయం రూ. రూ.48,616 కోట్ల నుంచి రూ.53,527 కోట్లకు పెరిగింది. 10 శాతం వృద్ధి చెందింది. ఎన్పీఏలు ఇలా...: గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో బ్యాంక్ స్థూల ఎన్పీఏలు 6.5 శాతానికి పెరిగాయి. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇవి 4.25 శాతమే. మొత్తం రుణాల్లో విలువ పరంగా చూస్తే... స్థూల ఎన్పీఏలు రూ.56,725 కోట్ల నుంచి రూ.98,173 కోట్లకు ఎగబాకాయి. ఇక నికర ఎన్పీఏల విషయానికొస్తే... 2.12 శాతం (రూ.27,591 కోట్లు) నుంచి 3.81 శాతానికి (రూ.55,807 కోట్లు) చేరాయి. మొండిబకాయిలకు ప్రొవిజనింగ్ మార్చి క్వార్టర్లో రెట్టింపునకు పైగా(144 శాతం) పెరిగి రూ.12,140 కోట్లకు ఎగసింది. అంతక్రితం ఏడాది క్యూ4లో ఈ ప్రొవిజనింగ్ రూ.4,986 కోట్లు మాత్రమే. కాగా, క్యూ4లో కొత్తగా రూ.30 వేల కోట్ల విలువైన రుణాలు మొండిబకాయిలుగా మారినట్లు బ్యాంక్ వెల్లడించింది. పూర్తి ఏడాదికి చూస్తే... గడచిన 2015-16 పూర్తి ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఎస్బీఐ నికర లాభం రూ. 9,951 కోట్లకు తగ్గింది. 2014-15 ఏడాదిలో లాభం రూ.13,102 కోట్లతో పోలిస్తే 24 శాతం క్షీణించింది. ఇక మొత్తం ఆదాయం మాత్రం రూ.1,74,973 కోట్ల నుంచి రూ. 1,91,844 కోట్లకు ఎగసింది. దాదాపు 10 శాతం వృద్ధి నమోదైంది. ఇతర ముఖ్యాంశాలివీ... ♦ గత ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేరుపై ఎస్బీఐ డెరైక్టర్ల బోర్డు రూ.2.60 డివిడెండ్ను ప్రకటించింది. ♦ క్యూ4లో నికర వడ్డీ మార్జిన్(ఎన్ఐఎం) 3.27 శాతంగా నమోదైంది. ♦ నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 3.9 శాతం వృద్ధితో రూ.14,712 కోట్ల నుంచి రూ. 15,291 కోట్లకు చేరింది. ♦ వడ్డీయేతర(ఫీజులు ఇతరత్రా) ఆదాయం 25.6 శాతం ఎగబాకి రూ. 10,696 కోట్లకు దూసుకెళ్లింది. ♦ క్యూ4లో రుణ వృద్ధి 13 శాతంగా నమోదైంది. మార్చి నాటికి బ్యాంక్ మొత్తం రుణాలు రూ.15.09 లక్షల కోట్లకు చేరాయి. ఇక డిపాజిట్లు 10 శాతం వృద్ధితో రూ.17.3 లక్షల కోట్లకు పెరిగాయి. షేరు రయ్... మొండిబకాయిలు(ఎన్పీఏ) భారీగా పెరగడంతోపాటు, లాభాలు దిగజారినప్పటికీ ఎస్బీఐ షేరు మాత్రం దూసుకెళ్లింది. శుక్రవారం బీఎస్ఈలో బ్యాంక్ షేరు ధర ఒకానొక దశలో 10 శాతం మేర ఎగసి రూ.202 గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 6.5 శాతం లాభంతో రూ.196 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ ప్రధాన సూచీల్లో అత్యధికంగా లాభపడిన షేరు ఎస్బీఐయే కావడం గమనార్హం. శుక్రవారం ఒక్కరోజే బ్యాంక్ మార్కెట్ విలువ రూ.9,160 కోట్లు ఎగబాకింది. ఇది రూ1,51,801 కోట్లకు చేరింది. ఎస్బీఐ లాభం మార్కెట్ వర్గాల అంచనాలకు అనుగుణంగానే ఉందని ఏంజెల్ బ్రోకింగ్ సీనియర్ ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్(బ్యాంకింగ్) సిద్ధార్థ్ పురోహిత్ పేర్కొన్నారు. ఎన్పీఏల సమస్యతో ఇతర పీఎస్యూ బ్యాంకులన్నీ తీవ్రమైన నష్టాలను ప్రకటిస్తున్న నేపథ్యంలో ఎస్బీఐ మాత్రం లాభాలను కొనసాగిస్తుండడం ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంటుకు దోహదం చేసిందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అనుబంధ బ్యాంకుల విలీనానికి రూ. 3,000 కోట్ల వ్యయం.. ఆర్బీఐ మొండిబకాయిల సమీక్ష(ఏక్యూఆర్) నిబంధనల కారణంగా మార్చి క్వార్టర్లో రూ.9,000 కోట్ల రుణాలను ఎన్పీఏలుగా పరిగణించడంతో ప్రొవిజనింగ్ భారీగా పెరిగింది. లాభాలు దిగజారడానికి ఇది కూడా ప్రధాన కారణం. మరోపక్క, రూ.31,000 కోట్ల రుణ ఖాతాలను ప్రత్యేక పరిశీలన జాబితాలో చేర్చాం. ఇందులో విద్యుత్, ఇనుము-ఉక్కు ఇంజనీరింగ్, చమురు-గ్యాస్, నిర్మాణ రంగాలకు చెందిన కంపెనీల ఖాతాలు ఉన్నాయి. ఈ జాబితాలోని రుణాల్లో 70 శాతం మొండిబకాయిలుగా మారే అవకాశం ఉంది. ఇక గతేడాది క్యూ4లో కొత్తగా ఎన్పీఏలుగా మారిన రూ.30 వేల కోట్లలో రూ.1,000 కోట్లు చిన్న మధ్యస్థాయి సంస్థలు(ఎస్ఎంఈ), వ్యవసాయ రుణాలకు సంబంధించినవి. మిగతా రూ.29,000 కోట్లు బడా, మధ్యస్థాయి కార్పొరేట్ కంపెనీలవే. అయితే, రానున్న కాలంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే.. ఎన్పీఏలు దిగొస్తాయని భావిస్తున్నాం. ఇక 5 అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంక్ విలీనం వల్ల ఎస్బీఐ నిర్వహణా సామర్థ్యం మెరుగుపడుతుంది. అలాగే నిధుల సమీకరణ భారం కూడా దాదాపు ఒకశాతం మేర తగ్గుతుంది. విలీన ప్రక్రియకు దాదాపు రూ.3,000 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేస్తున్నాం. - అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చైర్పర్సన్ -
బ్యాంకులకు మొండి బకాయిల బెడద తప్పదా?
న్యూఢిల్లీ : భవిష్యత్తులో కూడా బ్యాంకులకు మొండి బకాయిల బెడద తప్పేటట్లు కనిపించడం లేదు. ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న వివిధ ఒత్తిడుల నేపథ్యంలో ఈ బకాయిలు 2017 మార్చి కల్లా 6.9శాతం పెరుగుతాయని ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది. 2015 సెప్టెంబర్ చివర వరకు 5.14శాతంగా ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకు రుణాలు, 2016 సెప్టెంబర్ నాటికి 5.4శాతానికి పెరుగుతాయని రిజర్వు బ్యాంకు తన రిపోర్టులో నివేదించింది. బ్యాంకుల మూలధన సంపూర్ణత వివరాలు తెలిపే క్యాపిటల్ టు రిస్క్ అసెట్ రేషియో(సీఆర్ఏఆర్) కూడా 2017 మార్చి కల్లా 10.4శాతానికి తగ్గుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదించింది. 2015 సెప్టెంబర్ లో ఇది 12.7 శాతంగా ఉన్నాయి. స్థూల ఆర్థిక అంశాలు స్థూల మొండిబకాయిల పెరగడానికి దోహదంచేస్తున్నాయని, దీనివల్ల ఈ బకాయిలు 6.9శాతానికి పెరిగే అవకాశాలున్నాయని నివేదిక పేర్కొంది. గత కొద్దికాలంగా దేశీయ వృద్ధి నిదానంగా ఉండటం, అంతర్జాతీయంగా ఏర్పడిన ఆర్థికమాద్యం నుంచి ఆర్థికవ్యవస్థలు మెల్లగా కోలుకోవడం, ప్రపంచ మార్కెట్లు ఒడిదుడుకుల్లో నడవడం, టెక్స్ టైల్, ఇంజనీరింగ్ గూడ్స్, లెదర్, జెమ్స్ ఉత్పత్తుల ఎగుమతులు మందగించడం వంటివి బ్యాంకులకు మొండి బకాయిలు పెరగడానికి ప్రధాన కారణంగా పేర్కొంటూ ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాక, మైనింగ్ ప్రాజెక్టులు నిషేధం, పవర్,స్టీల్ రంగాల్లో ప్రాజెక్టుల క్లియరెన్స్ కు ఆలస్యం కావడం, ముడిసరుకు ధరల్లో ఒడిదుడుకులు, విద్యుత్ ఉత్పత్తి తగ్గి మౌలిక రంగంపై ప్రభావం చూపడం కూడా బ్యాంకుల్లో మొండి బకాయిలు పెరగడానికి దోహదం చేస్తున్నాయని రిపోర్టు పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తీసుకున్న ఎక్కువ రుణాలు మౌలిక రంగానికి సంబంధించినవై ఉన్నాయని తెలిపింది. బ్యాంకుల్లో నెలకొన్న మొండిబకాయిల సమస్య ఉద్దేశించి తయారుచేసిన రిపోర్టులో, ఆ రుణాలను వసూలు చేసుకోవడం కోసం బ్యాంకులకు ప్రత్యేక చర్యలను ప్రతిపాదించింది. రుణాలను రికవరీ చేసుకునే సౌలభ్యం కోసం ఆరు కొత్త రుణాల రికవరీ ట్రైబ్యూనల్స్ ను ఏర్పాటుచేస్తున్నట్టు రిపోర్టు పేర్కొంది. -
ఆ బ్యాంకుకు రూ. 743 కోట్ల నష్టాలు
ప్రభుత్వ రంగంలోని అలహాబాద్ బ్యాంకు భారీ నష్టాలు నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 620.90 కోట్ల నికర లాభాలు సాధించిన ఈ బ్యాంకు.. ఈసారి ఏకంగా రూ. 743.31 కోట్ల నికర నష్టాల్లోకి జారిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు నిరర్ధక రుణాలు రూ. 2,856.66 కోట్ల నుంచి రూ. 5,253.19 కోట్లకు పెరిగాయి. కానీ ఈ మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో స్థూల నిరర్ధక రుణాలు రూ. 15,384.57 కోట్లుగాను, నికర నిరర్ధక రుణాలు రూ. 10,292.51 కోట్లుగాను తేలాయి. వీటి ఫలితంగానే అలహాబాద్ బ్యాంకు తీవ్ర నష్టాలలో మునిగిపోయింది. -
మందగమనం వల్లే మొండి బకాయిల సెగ
పార్లమెంటరీ కమిటీకి ఆర్బీఐ గవర్నర్ రాజన్ వివరణ... న్యూఢిల్లీ: దేశీ బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిలు(ఎన్పీఏ) ఘోరంగా పెరిగిపోవడానికి ఆర్థిక వ్యవస్థ మందగమనమే ప్రధాన కారణమని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ)కి ఇచ్చిన వివరణ నివేదికలో ఎన్పీఏలు ఎగబాకడానికి గల కారణాలను వివరించారు. పీఏసీకి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ నేత కేవీ థామస్ పదవీకాలం ముగియడంతో కొత్తగా ఏర్పాటయ్యే కమిటీ ఈ వివరణను పరిశీలించేందుకు రాజన్ను హాజరుకావాల్సిందిగా కోరే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అదేవిధంగా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్బీ)ల చీఫ్లను కూడా పిలిపించి వాటి మొండిబకాయిల వివరాలను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఆరు కారణాలు... డిసెంబర్ చివరినాటికి పీఎస్బీల ఎన్పీఏలు రూ.3.61 లక్షల కోట్లకు ఎగియడంతో స్వచ్చంధంగా(సుమోటో) ఈ అంశాన్ని పీఏసీ పరిశీలిస్తోంది. పీఎస్బీలకు డిసెంబర్ ఆఖరికల్లా రూ.100 కోట్లకు మించి బాకాయిపడ్డ ఖాతాలు 701 వరకూ ఉండగా.. మొత్తం విలువ రూ.1.63 లక్షల కోట్లుగా అంచనా. ‘చాలా ఎన్పీఏలకు సంబంధించి గతం లో రుణాన్ని మంజూరు చేసిన అధికారులే మళ్లీ వాటిని రికవరీ చేసుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న అంశాన్ని పీఏసీ తన పరిశీలనలో గుర్తించింది. దీన్నిబట్టి చూస్తే.. రికవరీకి తగిన యంత్రాంగం లేదని తేలుతోంది’ అని పీఏసీలోని ఒక సభ్యుడు వ్యాఖ్యానించారు. ప్రైవేటు రంగ బ్యాంకుల మొత్తం ఎన్పీఏలు 2.2% ఉండగా.. పీఎస్బీలకు సంబంధించి 5.98%కి పెరిగిపోవడమేంటని పీఏసీ రాజన్ను ప్రశ్నించింది. దీనికి 6 కీలక అంశాలను ఆర్బీఐ గవర్నర్ ప్రస్తావించారు. దేశీ, ప్రపంచవ్యాప్త ఆర్థిక మందగమనం ప్రధాన కారణమని చెప్పారు. ప్రాజెక్టులకు అనుమతుల జాప్యం, ఆర్థిక వ్యవస్థ బాగున్నప్పుడు ఎడాపెడా రుణాలు తీసుకున్న కార్పొరేట్లు పరిస్థితులు బాగోలేకపోవడంతో చేతులెత్తేస్తున్నాయని పేర్కొన్నారు. ఇంకా క్రెడిట్ రిస్కులు, ప్రాజెక్టులకు సంబంధించి సరైన మదింపు లేకపోవడం కూడా ఎన్పీఏలను ఎగదోస్తోందన్నారు. కొన్ని కేసుల్లో రుణాల మంజూరులో అవినీతి, మోసాలు, ఉద్దేశపూర్వక ఎగవేతలూ ఎన్పీఏలను పెంచుతున్నాయని రాజన్ వివరించారు. -
ఎస్బీహెచ్ లాభం రూ.253 కోట్లు
ఎన్పీఏలకు భారీ కేటాయింపులతో తగ్గుదల * ఈ ఆర్థిక సంవత్సరం లాభాల్లో 20% వృద్ధి లక్ష్యం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొండి బకాయిలకు అధిక కేటాయింపుల కారణంగా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) నికర లాభం 43% క్షీణించి రూ. 253 కోట్లకు తగ్గింది. అంతక్రితం ఏడాది నాలుగో త్రైమాసికంలో లాభం రూ. 446 కోట్లు. ఆర్బీఐ ప్రొవిజనింగ్ ఆదేశాకు అనుగుణంగా రానున్న కాలంలో మొండిబకాయిల రిస్కులను ఎదుర్కొనేందుకు కూడా భారీగా కేటాయింపులు జరపాల్సి రావడంతో లాభాల పరిమాణం తగ్గిందని, లేకపోతే మెరుగ్గానే ఉండేదని ఎస్బీహెచ్ ఎండీ శాంతను ముఖర్జీ ఆదివారం ఇక్కడ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా తెలిపారు. ఎకానమీ వృద్ధి ఇంకా ఆశించిన స్థాయికి చేరుకోకపోవడం, డిమాండ్ మందగించడం, ఖాతాల పునర్వ్యవస్థీకరణ తదితర అంశాలు.. బ్యాంకింగ్ వ్యవస్థలో మొండిబకాయిల(ఎన్పీఏ) పెరుగుదలకు కారణమవుతున్నాయని ముఖర్జీ పేర్కొన్నారు. అయితే, రాబోయే రోజుల్లో ఎన్పీఎ భారం తగ్గి.. నికర వడ్డీ మార్జిన్లు క్రమంగా మెరుగుపడగలవని ఆశిస్తున్నట్లు ఆయన వివరించారు. తాజాగా ఆరు కంపెనీలు వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణ (ఎస్డీఆర్) పరిధిలో వచ్చాయని, వీటిలో రెండు ఖాతాల పరిమాణం సుమారు రూ. 400 కోట్ల మేర ఉండగలదని ముఖర్జీ పేర్కొన్నారు. చాలా మటుకు ఇన్ఫ్రా సంస్థలకు గడ్డు కాలం తొలగినట్లేనని, పరిస్థితులు క్రమంగా మెరుగుపడగలవని ఆయన చెప్పారు. పంట రుణాల మాఫీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రం నుంచి రెండో విడత నిధులు కూడా అందాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇంకా రావాల్సి ఉందని తెలిపారు. మార్చి త్రైమాసికంలో ఎస్బీహెచ్ నిర్వహణ ఆదాయం రూ. 1,720 కోట్ల నుంచి రూ. 1,629 కోట్లకు తగ్గింది. నికర వడ్డీ ఆదాయం సుమారు 5% క్షీణించి రూ. 1,214 కోట్ల నుంచి రూ. 1,156 కోట్లకు తగ్గింది. నికర వడ్డీ మార్జిన్ 3.15% స్థాయిలో నమోదైంది. పూర్తి సంవత్సరానికి.. మరోవైపు, పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఎస్బీహెచ్ నికర లాభం 19 శాతం తగ్గుదలతో రూ. 1,317 కోట్ల నుంచి రూ. 1,065 కోట్లకు పడిపోయింది. స్థూల నిరర్ధక ఆస్తులు 5.75 శాతానికి చేరి రూ. 6,591 కోట్లుగాను, నికర నిరర్థక ఆస్తులు 3.37 శాతం స్థాయిలో రూ. 3,743 కోట్ల మేర ఉన్నాయి. వ్యాపార పరిమాణం రూ. 2,54,599 కోట్లకు చేరింది. రాబోయే క్వార్టర్లలో కూడా మొండి బకాయిలను దృష్టిలో ఉంచుకుని కేటాయింపులు మూడు రెట్లు అధికంగా రూ. 1,900 కోట్ల మేర జరిపినట్లు వివరించారు. రుణాల మంజూరీ 5 శాతం వృద్ధితో రూ. 1,14,369 కోట్లకు చేరింది. కరెంటు అకౌంటు, సేవింగ్స్ అకౌంటు (కాసా) డిపాజిట్లు సుమారు 13 శాతం పెరుగుదలతో రూ. 48,703 కోట్లకు చేరాయి. కాసా నిష్పత్తి 23 శాతం నుంచి 35 శాతానికి పెరిగింది. ప్రధానమంత్రి జన ధన యోజన కింద తెరిచిన ఖాతాల్లో సగటు బ్యాలెన్స్ రూ. 860గా ఉంటోందని, మొత్తం 35.37 లక్షల ఖాతాల్లో దాదాపు రూ. 546 కోట్ల మేర డిపాజిట్లు ఉన్నాయని ముఖర్జీ చెప్పారు. విస్తరణ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిపాజిట్ల వృద్ధి 17-18 శాతం మేర, రుణాల వృద్ధి 12 శాతం మేర ఉండాలని నిర్దేశించుకున్నట్లు ముఖర్జీ చెప్పారు. అలాగే, నికర లాభాల్లో దాదాపు 20-25 శాతం వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మరో 125 శాఖలు ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ముఖర్జీ చెప్పారు. ప్రస్తుతం మొత్తం 1,933 శాఖలు ఉండగా.. వీటిలో 776 తెలంగాణలో, 435 ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్నాయి. ఇప్పటికే 51 ఈ-కనెక్ట్ కేంద్రాలు ఉండగా కొత్తగా మరో 25 ప్రారంభించనున్నట్లు ముఖర్జీ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం దాదాపు 1,200 మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవడం జరిగిందని వివరించారు. -
ఊగిసలాటలో స్టాక్ మార్కెట్
ముంబై : బుధవారం నాటి దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమైనా మెల్లిగా లాభాల బాట పట్టాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ ఫలితాలు రావడంతో కొంత మేర కోలుకున్నాయి.. సెన్సెక్స్ 36.24 పాయింట్ల లాభంతో 26,043 వద్ద కదలాడుతుండగా.. నిఫ్టీ 16.35 పాయింట్ల లాభంతో 7979 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఊగిసలాటల మధ్య ట్రేడవుతున్న నేటి మార్కెట్లలో మంగళవారం ట్రేడింగ్ ఫుల్ జోష్ మీదున్న బ్యాంక్ ఇండెక్స్ షేర్లు బుధవారం ట్రేడింగ్ లో నష్టాలను చవిచూస్తున్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఎస్ బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్ డీఎఫ్ సీ, లుపిన్ షేర్లు నష్టాల్లో నడుస్తుండగా.. టాటా మోటర్స్, ఐటీసీ, హీరో, భారతీ ఎయిర్ టెల్, మారుతీ సుజుకీ,ఓఎన్ జీసీ, లాభాలు పండిస్తున్నాయి. బ్యాంకు షేర్లలో యాక్సిస్ షేర్లు భారీగా పడిపోతున్నాయి. 22,600 కోట్ల కార్పొరేట్ రుణాలను మొండిబకాయిలుగా కలిగి ఉన్నట్టు 'వాచ్ లిస్ట్' ప్రకటించడంతో ఈ షేర్లు 3 శాతం పైగా పడిపోయాయి. మరోవైపు బంగారం 92 పాయింట్లు పెరిగి, 29,294 వద్ద నమోదవుతుండగా, వెండి 444 పాయింట్ల లాభంలో 40,634 గా కొనసాగుతోంది. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ 66.51గా ఉంది. -
రోజుకు రూ.10 కోట్లు
* ఇదీ జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను లక్ష్యం * ఇక వసూళ్ల పర్వం * రెడ్ నోటీసులు జారీ సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల హడావుడి నుంచి అధికారులు బయటకు వచ్చారు. ఆస్తిపన్ను వసూళ్లపై దృష్టి సారించారు. ఎన్నికల నేపథ్యంలో చూసీ చూడనట్లు వ్యవహరించిన అధికారులు ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. రెడ్ నోటీసుల జారీకి వెనుకాడటం లేదు. మేయర్ బొంతు రామ్మోహన్ అధికారులతో నిర్వహించిన తొలి సమావేశంలోనే మొండి బకాయిల వసూళ్లకు తాము సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. దీంతో అధికారులు రెట్టించిన ఉత్సాహంతో ఆస్తిపన్ను వసూళ్లకు సిద్ధమయ్యారు. ఏళ్ల తరబడి చెల్లించని వారి నుంచి నయానో, భయానో వసూలు చేయాలని భావిస్తున్నారు. తాజా అంచనాల మేరకు ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రూ.450 కోట్లు వసూలు చేయాలని నిర్ణయించారు. ఉన్న గడువు దాదాపు 45 రోజులు. రోజుకు కనీసం రూ.10 కోట్లు వసూలు చేయాలని కమిషనర్ డా.బి.జనార్దన్రెడ్డి అధికారులకు నిర్దేశించారు. అభివృద్ధి పనులకు... మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. జీహెచ్ఎంసీ ప్రకటించిన కార్యక్రమాలు.. ప్రభుత్వం హామీలిచ్చిన పథకాలు ఈలోగా పూర్తి చేయాల్సి ఉంది. నగరంలో చేపట్టే పనులన్నిటికీ జీహెచ్ఎంసీ నిధులనే వినియోగిస్తున్నారు. ఆర్టీసీ వంటి సంస్థకూ దీని నిధులనే బదిలీ చేస్తున్నారు. ఖజానాలో సింహభాగమైన ఆస్తిపన్ను వసూలు చేయకపోతే పనులన్నీ నిలిచిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి భారీగానిధులు అవసరం. ఈ నేపథ్యంలో సర్కిల్కు ఒకరు చొప్పున 24 మంది ప్రత్యేక అధికారులను వసూళ్లకు నియమించారు. వీరు సంబంధిత జోనల్, డిప్యూటీ కమిషనర్లు, సిబ్బందితో కలసి లక్ష్యసాధనకు కృషి చేస్తారు. భారీ బకాయిలు ఉన్న వారిని వ్యక్తిగతంగా కలవడం, ఫోన్లు, ఎస్సెమ్మెస్లు, ఈ మెయిళ్ల ద్వారా గుర్తు చేస్తారు. రెడ్ నోటీసులూ జారీ చేస్తారు. ఇప్పటిదాకా పన్ను పరిధిలోకి రాని భవనాలను గుర్తిస్తారు. ప్రభుత్వ భవనాల నుంచి పన్ను వసూలుకు ప్రత్యేక చర్యలకు సిద్ధమయ్యారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రసార సాధనాలను వాడుకోవాలని, హోర్డింగ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆస్తిపన్ను చెల్లించాల్సిన వారు : 14,11,609 మంది రావాల్సిన మొత్తం : రూ.1630 కోట్లు ఇప్పటి వరకు వసూలై నది : రూ. 545 కోట్లు ఇంకా రావాల్సింది : రూ. 1075 కోట్లు ప్రభుత్వ రాయితీకి అర్హులు : 5,09,187 మంది రాయితీ ద్వారా తగ్గే మొత్తం : రూ. 87 కోట్లు * పై అంశాలను పరిగణనలోకి తీసుకుంటే దాదాపు 8 లక్షల మంది నుంచి రావాల్సిన ఆస్తిపన్ను: రూ.988 కోట్లు. * ఇది ఒక దశలోని అంచనా. ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని మొత్తం వసూలు చేయాల్సింది రూ.1100 కోట్లుగా తాజాగా అంచనా వేశారు. ఇప్పటి వరకూవచ్చినది పోనూ ఇంకా రూ.455 కోట్లు వసూలు చేయాలని నిర్ణయించారు. 21న సమస్యల పరిష్కారం ఆస్తిపన్ను వివాదాల పరిష్కారానికి ఈనెల 21న ఆదివారం అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ‘ప్రాపర్టీ టాక్స్ పరిష్కారం’ పేరిట ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ డా.బి.జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు, అన్ని స్థాయిల అధికారులు పాల్గొని ఆస్తిపన్ను చెల్లింపులో ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులు, వివాదాలు పరిష్కరిస్తారని తెలిపారు. -
మొండి బకాయిల పరిష్కారానికి చికిత్స అవసరం: రాజన్
ముంబై:బ్యాంకింగ్ మొండిబకాయిల పరిష్కారానికి తగిన ఫలితాలను అం దించే సమర్థవంతమైన శస్త్ర చికిత్స అవసరమని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ గురువారం పేర్కొన్నారు. మొండి బకాయిల సమస్య పరిష్కారమయితే అది బ్యాంకుల భవిష్యత్ పటిష్ట వృద్ధి రేటుకు సైతం దోహదపడుతుందని అన్నారు. ఇకపై రుణ నాణ్యతా సమీక్ష (ఏక్యూఆర్)లు ఏవీ ఉండబోవని కూడా సీఐఐ ఇక్కడ నిర్వహించిన ఒక బ్యాంకర్ల సదస్సులో ఆయన అన్నారు. కాగా మొండిబకాయిల సమస్యకు నిర్వహణా పరమైన లోపాలే కారణమని డిప్యూటీ గవర్నర్ ముంద్రా పేర్కొన్నారు. -
ఐసీఐసీఐకి మొండిబకాయిల సెగ
♦ క్యూ3లో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.3,122 కోట్లు; 4.4 % డౌన్ ♦ ఆదాయం రూ. 25,585 కోట్లు; 11 శాతం వృద్ధి... ♦ 4.72 శాతానికి ఎగబాకిన స్థూల ఎన్పీఏలు ఆర్బీఐ నిబంధనల ప్రకారం కొన్ని బలహీన ఖాతాలకు సంబంధించి మొండిబకాయిల విషయంలో సమీక్ష జరిపి ముందస్తుగా కేటాయింపులు జరపడంతో స్థూల ఎన్పీఏలు పెరిగేందుకు దారితీసింది. ముఖ్యంగా ఉక్కు రంగంలో ఈ ఎన్పీఏల పెరుగుదల ప్రభావం అధికంగా ఉంది. ప్రస్తుత మార్చి క్వార్టర్లోనూ మొండిబకాయిల ఒత్తిడి కొనసాగవచ్చు - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీ ముంబై: దేశీ ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకును మొండి బకాయిలు వెంటాడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో (2015-16, క్యూ3) బ్యాంక్ కన్సాలిడేటెడ్ నికర లాభం (బీమా, మ్యూచువల్ ఫండ్ ఇతర అనుబంధ సంస్థలతో కలిపి చూస్తే) రూ.3,122 కోట్లుగా నమోదయింది. కిందటేడాది ఇదే క్వార్టర్లో ఆర్జించిన రూ.3,265 కోట్లతో పోలిస్తే లాభం 4.4 శాతం దిగజారింది. మొత్తం ఆదాయం మాత్రం 11 శాతం వృద్ధి చెంది రూ.23,054 కోట్ల నుంచి రూ.25,585 కోట్లకు పెరిగింది. మొండి బకాయిలకు ప్రొవిజనింగ్ భారీగా పెరగడం లాభాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ప్రస్తుత మార్చి క్వార్టర్లో కూడా ఎన్పీఏలు పెరిగే అవకాశం ఉందని బ్యాంక్ వెల్లడించడం గమనార్హం. ఇక స్టాండ్ అలోన్ ప్రాతిపదికన రూ.3,018 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,889 కోట్లతో పోలిస్తే కేవలం 4 శాతం మాత్రమే పెరిగింది. మొత్తం ఆదాయం 13 శాతం వృద్ధితో రూ.17,563 కోట్లకు చేరింది. క్రితం ఏడాది క్యూ3లో ఆదాయం రూ.15,527 కోట్లుగా నమోదైంది. భారీగా ఎగసిన మొండిబకాయిలు... క్యూ3లో బ్యాంక్ మొత్తం రుణాల్లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏ) 4.72 శాతానికి ఎగబాకాయి. విలువ పరంగా ఈ మొత్తం రూ. 21,149 కోట్లు. క్రితం ఏడాది క్యూ3లో స్థూల ఎన్పీఏలు రూ.13,082 కోట్లు(3.4%) కాగా, ఈ ఏడాది క్యూ2లో ఇవి రూ. 6,759 కోట్లు(3.77%)గా ఉన్నాయి. ఇక నికర ఎన్పీఏలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో తైమాసికం నాటికి 2.28 శాతానికి (రూ.10,014 కోట్లు) దూసుకెళ్లాయి. క్రితం ఏడాది క్యూ3లో ఇవి రూ.4,773 కోట్లు(1.27%) కాగా, ఈ ఏడాది క్యూ2లో రూ.6,828 కోట్లు(1.65%)గా నమోదయ్యాయి. ప్రధానంగా అంతర్జాతీయంగా ఉక్కు రంగంలో తీవ్ర మందగమనం నెలకొనటం, మరికొన్ని రంగాల్లో అనిశ్చితి పెరగటంతో ఎన్పీఏలు ఎగబాకినట్లు బ్యాంక్ పేర్కొంది. అదేవిధంగా రానున్న రెండు క్వార్టర్లలో ఎన్పీఏల ఒత్తిడి ఉండే ఖాతాలను ముందుగానే గుర్తించి దానికి అనుగుణంగా ప్రొవిజనింగ్పై దృష్టిపెట్టాలన్న ఆర్బీఐ నిబంధనలు కూడా ఎన్పీఏలు అధికంగా కనబడటానికి ఒక కారణమని తెలిపింది. కాగా, మొండిబకాయిలకు కేటాయింపులు(ప్రొవిజనింగ్) కూడా ఈ ఏడాది క్యూ3లో భారీగా రూ.2,844 కోట్లకు ఎగబాకాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ప్రొవిజనింగ్ మొత్తం రూ.980 కోట్లు మాత్రమే. ఇతర ముఖ్యాంశాలివీ... బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) డిసెంబర్ క్వార్టర్లో రూ. 5,453 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది క్యూ3లో రూ. 4,812 కోట్లతో పోలిస్తే 13% పెరిగింది. వడ్డీయేతర ఆదాయం 36 శాతం వృద్ధితో రూ.3,091 కోట్ల నుంచి రూ.4,217 కోట్లకు ఎగబాకింది. ఇందులో ఫీజుల రూపంలో ఆదాయం రూ.2,262 కోట్లుగా నమోదైంది. అనుబంధ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్లో 4 శాతం వాటాను ప్రేమ్జీ ఇన్వెస్ట్, సంబంధిత సంస్థలకు విక్రయించేందుకు క్యూ3లో ఐఆర్డీఏ ఆమోదం లభించినట్లు బ్యాంక్ పేర్కొంది. ఈ అమ్మకం ద్వారా రూ.1,243 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు వెల్లడించింది. క్యూ3లో మొత్తం రుణాల్లో 16 శాతం వృద్ధి నమోదైంది. దీంతో డిసెంబర్ చివరినాటికి రుణాల పరిమాణం రూ.4,34,800 కోట్లకు చేరింది. ఇక డిపాజిట్లు 15 శాతం పెరిగి రూ.4,07,314 కోట్లకు చేరాయి. అనుబంధ సంస్థల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ నికర లాభం క్యూ3లో రూ. 462 కోట్ల నుంచి రూ.436 కోట్లకు తగ్గిపోయింది. ఇక ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ నికర లాభం కూడా రూ.176 కోట్ల నుంచి రూ.130 కోట్లకు పడిపోయింది. ఫలితాల నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు ధర బీఎస్ఈలో గురువారం 1.69 శాతం క్షీణించి రూ.233 వద్ద స్థిరపడింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. -
మొండిబకాయిల పరిష్కారానికి కమిటీ
ఆర్థిక సర్వీసుల కార్యదర్శి అంజలి చిబ్ దుగ్గల్ న్యూఢిల్లీ: బ్యాంకుల మొండి బకాయిల భారం ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు ఆర్థిక సర్వీసుల కార్యదర్శి అంజలి చిబ్ దుగ్గల్ తెలిపారు. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా సారథ్యం వహించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్లతో ఆర్థిక మంత్రి సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు వివరించారు. జూన్ ఆఖరు నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) మొండి బకాయిలు (ఎన్పీఏ) 6.03 శాతం పెరిగిపోయిన సంగతి తెలిసిందే. మార్చి ఆఖరు నాటికి ఇవి 5.20 శాతం స్థాయిలో ఉన్నాయి. ఎన్పీఏలు ఎక్కువగా ఉన్న ఉక్కు, అల్యూమినియం, టెక్స్టైల్ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తోందని దుగ్గల్ వివరించారు. ప్రధానమంత్రి ‘జన ధన్’ యోజనకి మంచి స్పందన వచ్చిందని, ఈ పథకం కింద డిపాజిట్లు రూ. 27,000 కోట్ల పైగా వచ్చాయని ఆమె తెలిపారు. జీరో బ్యాలెన్స్ ఖాతాల సంఖ్య 35 శాతానికి తగ్గిందన్నారు. మరోవైపు, ఎన్పీఏలు పెరిగిపోవడానికి పలు కారణాలు ఉన్నాయని సిన్హా చెప్పారు. -
‘అప్పు’డే చదువుకుంటారా?
- ఖర్చుతో పాటే పెరుగుతున్న విద్యా రుణాలు - సగటు రుణంలో ఏడాదికి 35 శాతం పెరుగుదల - ఈ రంగంలోనూ పెరుగుతున్న మొండి బకాయిలు - అప్పులిచ్చేటపుడు ఆచితూచి వ్యవహరిస్తున్న బ్యాంకులు - కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మాత్రం విద్యా రుణం సులువే - తొలి ఏడాది నుంచే తిరిగి చెల్లిస్తే ఈఎంఐలూ భారం కావు చదువంటే మాటలు కాదు. మంచి స్కూల్లో ఎల్కేజీలో చేర్చి డొనేషన్తో సహా వార్షిక ఫీజులు కట్టాలంటేనే... మధ్య తరగతి మనిషికి చుక్కలు కనిపిస్తాయి. ఇక చదువు పెరిగేకొద్దీ డబ్బుల లెక్కలూ పెరుగుతుంటాయి. ఎస్ఎస్సీ, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ... ఇలా ఏదో ఒక స్ట్రీమ్లో 10వ తరగతి అయిందనిపించాక అసలు కథ మొదలవుతుంది. ఇంటర్మీడియెట్కు ఏదో ఒక కార్పొరేట్ కాలేజీని ఆశ్రయించకతప్పదు. ఎందుకంటే ఏ ప్రొఫెషనల్ కోర్సుకైనా పునాది అక్కడే కనక. ఆ ఇంటర్ పూర్తయ్యాక... ప్రొఫెషనల్ కోర్సుల భారం మొయ్యటం ఎగువ మధ్య తరగతి వారికి కూడా అసాధ్యమే. ఇదిగో... ఇక్కడే బ్యాంకులు, ప్రయివేటు ఫైనాన్స్ కంపెనీలు రంగంలోకి దిగుతున్నాయి. మీ చదువుకు మేం రుణమిస్తామంటూ విద్యారుణాలకోసం కొత్త కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నాయి. ఈ విద్యారుణాలు ఎవరికిస్తారు? ఎంత ఇస్తారు? హామీ ఏం ఉండాలి? ఎలా తీర్చాలి? వడ్డీ ఎంత? ఇవన్నీ తెలియజేసేదే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం... విద్యా ఖర్చులు ఏటికేడాది ఎలా పెరుగుతున్నాయో తెలుసుకోవాలంటే ఒక్కసారి క్రెడిట్ రేటింగ్ సంస్థ సిబిల్ గణాంకాలు చూడాలి. వీటి ప్రకారం 2013లో సగటు విద్యారుణం విలువ రూ.4.5 లక్షలు. 2014కు వచ్చేసరికి అది రూ.6 లక్షలకు చేరింది. అంటే ఒక ఏడాదిలో దాదాపు 35 శాతం పెరుగుదలన్న మాట. ఈ ఏడాది ఇది ఇంకా పెరగవచ్చన్నది బ్యాంకు వర్గాల మాట. విద్యా వ్యయం పెరుగుతుండటంతో సగటు రుణమే కాదు... రుణాలు తీసుకునేవారూ పెరుగుతున్నారు. రుణ మొత్తమూ పెరుగుతోంది. 2014లో రూ.53,334 కోట్లుగా ఉన్న విద్యారుణాలు 2015 మార్చినాటికి రూ.63,800 కోట్లకు చేరుకున్నాయి. అయితే ఆర్థిక వృద్ధి రేటు క్షీణిస్తున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ మందగించి... రుణం తీసుకొని చదువుకున్న తర్వాత భారీ జీతాలతో కూడిన ఉద్యోగాలు లభించడం కష్టమవుతోంది. దీంతో విద్యారుణాల్లో మొండిబకాయిలు కూడా పేరుకుపోతున్నాయి. ఇవి క్రమంగా పెరుగుతుండటంతో ఇప్పుడు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు విద్యారుణాల మంజూరులో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం తిరిగి చెల్లించాల్సిందెప్పుడు? - విద్యారుణాలు మిగిలిన రుణాల్లా తీసుకున్న మరుసటి నెల నుంచి చెల్లించాల్సిన అవసరం లేదు. కోర్సు పూర్తయ్యాకే చెల్లించాలి. చాలా బ్యాంకులు కనీసం ఒక ఏడాది... లేదా ఉద్యోగం పొందిన ఆరు నెలల తర్వాత ఈ రెండింటిలో ఏది ముందైతే అప్పటి నుంచి రుణం చెల్లించే అవకాశమిస్తున్నాయి. - కోర్సు చేస్తున్న కాలంలో సాధారణ వడ్డీని లెక్కకట్టి దాన్ని అసలుకి కలుపుతారు. అక్కడి నుంచి చక్రవడ్డీని లెక్కించి ఆ ప్రకారం ఈఎంఐ చెల్లించాలి. - రుణాన్ని గరిష్టంగా 8 సంవత్సరాల్లో చెల్లించడానికి బ్యాంకులు అనుమతిస్తున్నాయి. కాబట్టి విద్యారుణం భారం కాకుండా ఉండాలంటే తీసుకున్న తొలి ఏడాది నుంచే తిరిగి చెల్లించాలి. - చాలా బ్యాంకులు విద్యారుణాల్లో ముంధస్తు చెల్లింపులపై ఎలాంటి పెనాల్టీలూ వసూలు చేయడం లేదు. లోన్ తీసుకున్న మరుసటి నెల నుంచే చెల్లించేవారికి కొన్ని బ్యాంకులు 1 శాతం రాయితీ కూడా ఇస్తున్నాయి. ఏయే చదువులకు..? - ఇంటర్ తరవాత చదివే కోర్సులన్నిటికీ విద్యా రుణం లభిస్తుంది. కాకుంటే వీటికి యూజీసీ, ఏఐసీటీఈ, ఐఎంసీ వంటి ప్రభుత్వ సంస్థల గుర్తింపు ఉండాలి. - ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థల్లో చేసే కోర్సులు, డిప్లొమా, ఒకేషనల్ కోర్సులు, గ్యారంటీ ఉపాధి లభించే టీచర్, నర్సింగ్, పెలైట్ ట్రైనింగ్లకూ రుణాలిస్తారు. - ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్(ఐబీఏ) గుర్తించిన 1,100 సంస్థల్లో చేసిన కోర్సులకే బ్యాంకులు విద్యా రుణాలిస్తున్నాయి. రుణం తీసుకునే సదరు కోర్సుకు, లేదా సంస్థకు ఐబీఏ గుర్తింపు ఉందా లేదా అన్న విషయం పరిశీలించడం మర్చిపోవద్దు. ఎంత రుణం... ఏ హామీ? - చాలా బ్యాంకులు ఇండియాలో చదివే కోర్సులకు గరిష్టంగా రూ. 10 లక్షల వరకు, కొన్ని ప్రత్యేక కోర్సులకు గరిష్టంగా రూ. 30 లక్షల వరకు రుణమిస్తున్నాయి. - విదేశీ విద్యకైతే గరిష్టంగా రూ.30 లక్షల వరకు.. కొన్ని ప్రత్యేక కోర్సులకు అవసరమైతే అంతకంటే ఎక్కువ మొత్తాన్ని కూడా ఇస్తున్నారు. - ఎంత రుణం వస్తుందనేది కోర్సు ఫీజు, కావాల్సిన పుస్తకాలు, ఇతర అవసరాలపై ఆధారపడి ఉంటుంది. రుణ మొత్తాన్ని లెక్కించడంలో కాలేజీ, స్కూల్, హాస్టల్కు చెల్లించాల్సిన ఫీజులు, ఎగ్జామినేషన్స్, లైబ్రరీ, ల్యాబరేటరీ, పుస్తకాలు, యూనిఫాంతో పాటు ఇతర పరికరాల ఖర్చులు కూడా పరిగణనలోకి తీసుకుంటారు. - రూ.4 లక్షల లోపు రుణానికి బ్యాంకులు ఎలాంటి హామీ అడగటం లేదు. రూ.4-7.5 లక్షల మధ్య అయితే థర్డ్పార్టీ గ్యారంటీని... ఆపై మొత్తానికి థర్డ్పార్టీతో పాటు ఏదైనా ఆస్తిని ష్యూరిటీగా చూపించాల్సి ఉంటుంది. వడ్డీ ఎంత? - విద్యారుణాలపై వడ్డీ ఎంతనేది రుణ మొత్తం, కాలపరిమితి, కోర్సు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఇది బ్యాంకుల బేస్ రేటు కంటే 2-3 శాతం అధికంగా ఉంటుంది. - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.4 లక్షల లోపు రుణాలపై 13.35 శాతం, రూ.4-7.5 లక్షల మొత్తానికి 13.60%, ఆపై మొత్తానికి 11.6% వడ్డీ వసూలు చేస్తోంది. - చాలా బ్యాంకులు అమ్మాయిల విద్యా రుణాలకు 0.5 నుంచి 1 శాతం వరకు వడ్డీలో రాయితీ ఇస్తున్నాయి. రుణ గ్రహీతల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.4.5 లక్షల లోపు ఉన్నా వడ్డీ రాయితీ ఇస్తున్నారు. 2009 ఏప్రిల్ తర్వాత ఈ రాయితీ అమల్లోకి వచ్చింది. -
ఎస్బీహెచ్ ఓటీఎస్ స్కీం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) మొండి బకాయిలను తగ్గించుకోవడానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. రుణాలు తీసుకొని కనీసం వడ్డీ కూడా చెల్లించకుండా ఉన్న మొండి బకాయిలను వసూలు చేయడం కోసం అదాలత్ పేరిట ‘వన్టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్)’ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ ఓటీఎస్ స్కీం అమల్లో ఉంటుందని, డిఫాల్టర్లు సమీప బ్యాంకు శాఖకు వెళ్ళి రుణ బకాయిలను పరిష్కరించుకోవచ్చని బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. వ్యవసాయ, చిన్న, మధ్య స్థాయి పారిశ్రామిక రంగాల వారు ఈ ఓటీఎస్ స్కీంను వినియోగించుకోవడం ద్వారా పెనాల్టీలు, న్యాయపరమైన చర్యల నుంచి తప్పించుకోవచ్చని బ్యాంకు పేర్కొంది. -
12న ఎస్బీఐ మెగా ఈ-వేలం
ముంబై: మొండిబకాయిలుగా మారిన నివాస, వాణిజ్య ఆస్తులను జూన్ 12న ఆన్లైన్లో వేలం వేయనున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 14 తర్వాత ఎస్బీఐ ఇలా ఈ-వేలం నిర్వహించడం ఇది రెండోసారి. అప్పట్లో బ్యాంకు రూ. 1,200 కోట్లు విలువ చేసే 300 నివాస, వాణిజ్య ఆస్తులను వేలానికి ఉంచింది. అయితే, కేవలం సుమారు రూ. 100 కోట్లు విలువ చేసే 130 ప్రాపర్టీలను మాత్రమే విక్రయించగలిగింది. వీటిలో ఎక్కువగా నివాస ఆస్తులే ఉన్నాయి. తాజాగా జూన్ 12 నిర్వహించబోయే ఈ-వేలంలో సుమారు 40 నగరాల్లో మొండిబకాయిలుగా మారిన ఆఫీసులు, షాప్లు, అపార్ట్మెంట్లు, ఫ్యాక్టరీ బిల్డింగులు మొదలైన వాటిని ఎస్బీఐ విక్రయించనుంది. మార్చి క్వార్టర్లో ఎస్బీఐ స్థూల నిరర్థక ఆస్తులు 4.95 శాతం నుంచి 4.25 శాతం స్థాయికి మెరుగుపడ్డాయి. అలాగే నికర ఎన్పీఏలు కూడా 2.57 శాతం నుంచి 2.12 శాతం స్థాయికి తగ్గాయి. -
జూన్9న సిండికేట్ బ్యాంక్ అదాలత్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకుండా మొండి బకాయిలుగా మారిన ఖాతాలను పరిష్కరించుకోవడానికి సిండికేట్ బ్యాంక్ జూన్ తొమ్మిదిన అదాలత్ నిర్వహిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని శాఖల్లో ఈ అదాలత్ను నిర్వహిస్తున్నామని, ఒకేసారి చెల్లించడం ద్వారా (వన్టైమ్ సెటిలిమెంట్ )ఎన్పీఏ ఖాతాలను వదిలించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. వ్యవసాయ, వ్యాపార, వ్యక్తిగత, విద్యా, ఉద్యోగ రుణాలున్న ఎన్పీఏ ఖాతాదారులు ఈ అదాలత్లో పాల్గొని వన్టైమ్ సెటిలిమెంట్ కింద వడ్డీ రాయితీని పొందచ్చని బ్యాంకు తెలిపింది. -
లాభాల్లో ప్రైవేటుదే పైచేయి..!
తొలిసారి నికరలాభంలో ప్రభుత్వ బ్యాంకుల కన్నా ముందంజ ప్రభుత్వ బ్యాంకులకు మొండిబకాయిలు గుదిబండలా మారుతున్నాయి. నానాటికీ ఇవి కొండలా పేరుకుపోతుండటంతో ఆ ప్రభావం వాటి లాభాలపై పడుతోంది. అందుకే... తొలిసారిగా దేశంలో 24 ప్రభుత్వ బ్యాంకుల మొత్తం నికర లాభాన్ని 13 ప్రయివేటు బ్యాంకుల నికరలాభం మించిపోయింది. దేశ చరిత్రలో తొలిసారి ఉమ్మడిగా ప్రభుత్వ బ్యాంకుల్ని ప్రైవేటు బ్యాంకులు అధిగమించాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 25 ప్రభుత్వ బ్యాంకుల మొత్తం నికరలాభం రూ.33,976 కోట్లు కాగా... టాప్ 13 ప్రైవేటు బ్యాంకుల ఉమ్మడి నికరలాభం రూ.37,361 కోట్లకు చేరింది. అంటే రూ.3,385 కోట్లు ఎక్కువన్న మాట. మొండిబకాయిల కోసం, రాని బకాయిల కోసం ప్రభుత్వ బ్యాంకుల పక్కనబెట్టిన మొత్తం (ప్రొవిజనింగ్) విపరీతంగా పెరిగిపోవటంతో వాటి నికరలాభం గణనీయంగా పడిపోయింది. ఎందుకంటే ప్రభుత్వ బ్యాంకుల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) ఈ సారి ఏకంగా 0.58 శాతం పెరిగి 5.47 శాతానికి చేరుకున్నాయి. అదే ప్రైవేటు బ్యాంకుల విషయంలో ఎన్పీఏల స్థాయి ఇంతలా లేదు. ఈ ఏడాది పెరుగుదల 0.19 శాతం మాత్రమే ఉండగా మొత్తం ఎన్పీఏల శాతం 2.01గా ఉంది. అందుకే నిరర్ధక ఆస్తుల నిమిత్తం ప్రైవేటు బ్యాంకులు రూ.10,852 కోట్లు కేటాయించగా ప్రభుత్వ బ్యాంకులు ఏకంగా రూ.72,095 కోట్లు కేటాయించాయి. ఇదే వాటి నికరలాభం తగ్గుదలకు ప్రధాన కారణంగా మారింది. చిత్ర మేంటంటే ఏడాది కిందట పరిస్థితి ఇలా లేదు. 13 ప్రయివేటు బ్యాంకుల మొత్తం నికర లాభం కన్నా 24 ప్రభుత్వ బ్యాంకులే రూ.2,312 కోట్లను అధికంగా ఆర్జించాయి. సగానికి క్షీణించిన నికరలాభం... ఉదాహరణకు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రెండింటి నికరలాభం గతేడాదితో పోలిస్తే సగమే నమోదయింది. గతేడాదికన్నా ఏకంగా 134 శాతం అధికంగా బీఓబీ ఏకంగా రూ.1,491 కోట్లను ఎన్పీఏల కోసం కేటాయించింది. చిత్రమేంటంటే ఈ విషయమై బ్యాంక్ ఆఫ్ బరోడా ఎండీ, సీఈఓ రంజన్ ధావన్ ఇటీవల మాట్లాడుతూ... తదుపరి సంవత్సరానికి అంటే 2015-16కు ఎన్పీఏలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పలేమనటం. ‘‘బడా కార్పొరేట్ సంస్థలు చాలావరకూ దారుణమైన కష్టాల్లో ఉన్నాయి. అలాంటి వాటిని ఎన్పీఏలుగా ప్రకటించాలా? లేదా? అనే విషయమై ఇంకా చర్చ జరుగుతోంది. నా ఉద్దేశం ప్రకారం వచ్చే ఐదారు నెలల్లో ఇవి ఎన్పీఏలుగా మారకపోవచ్చు. అలా మారితే గనక ఒకే కంపెనీ నుంచి వందల కోట్లు రాని బాకీలుగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది’’ అని చెప్పారు. పీఎన్బీ విషయానికొస్తే ఈ ఏడాది దాదాపు 76% అధికంగా రూ.7,979 కోట్లను రాని బాకీల కోసం కేటాయించింది. దీనిపై బ్యాంకు ఎండీ, సీఈఓ గౌరీ శంకర్ మాట్లాడుతూ ‘‘రాని బాకీలుగా గుర్తించిన వాటిలో కొన్ని రికవరీ అయ్యే చాన్సుంది. అదే జరిగితే ప్రొవిజనింగ్ మారి లాభం పెరుగుతుంది’’ అన్నారు. ఇన్ఫ్రా, ఉక్కు రంగాలు బాగా దెబ్బతిన్నట్లు చెప్పారాయన. ఈ మధ్యే దీనిపై ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్.ఎస్.ముంద్రా మాట్లాడతూ ఎన్పీఏలు అన్నిచోట్లా ఒకేలా లేవని, ప్రభుత్వ బ్యాంకుల్లో బాగా ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఎస్బీఐ కేటాయింపులు రూ. 25,812 కోట్లు ఉదాహరణకు ఎస్బీఐను చూస్తే 2014-15 కోసం కేటాయించిన రూ.25,812 కోట్లలో రూ.19,086 కోట్లు రాని బాకీల కోసమే. దీంతో మొత్తం కేటాయింపులు ఈ ఏడాది ఏకంగా 21.6% పెరిగినట్లయింది. ప్రొవిజనింగ్.. - ఒక ఖాతా గనక ఏడాదిపాటు నిరర్థక ఆస్తిగా దాన్ని నాసిరకంగా పరిగణిస్తారు. అలాంటి ఖాతాకోసం 15% మొత్తాన్ని కేటాయించాలి. - నాసిరకంగా 12 నెలలు కొనసాగితే దాన్ని రికవరీ అవుతుందో రాదో తెలియని సందేహాస్పద ఖాతాగా పరిగణిస్తారు. దీనికి కనీసం 25%, గరిష్టంగా 100% ప్రొవిజనింగ్ చేయాలి. -
బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మొండి బకాయిల భారం
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.56 కోట్ల నికర నష్టం పొందింది. మొండి బకాయిలకు అధిక కేటాయింపులు, అన్ని సెగ్మెంట్లలో పేలవమైన పనితీరు కారణంగా నష్టాలు వచ్చాయని బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయ లక్ష్మి అయ్యర్ చెప్పారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో జనవరి-మార్చి క్వార్టర్లో రూ.558 కోట్ల నికర లాభం పొందామని వివరించారు. స్థూల మొండి బకాయిలు 3.15 శాతం నుంచి 5.39 శాతానికి, మొండి బకాయిలకు కేటాయింపులు రూ.1,547 కోట్ల నుంచి 97 శాతం వృద్ధితో రూ.2,255 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. మొత్తం ఆదాయం రూ.11,274 కోట్ల నుంచి రూ.12,287 కోట్లకు పెరిగిందని తెలిపారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి వస్తే, 2013-14లో రూ.2,729 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15లో 37 శాతం క్షీణించి రూ.1,709 కోట్లకు తగ్గిందని అయ్యర్ పేర్కొన్నారు. మొత్తం ఆదాయం రూ.42,202 కోట్ల నుంచి రూ.47,663 కోట్లకు పెరిగిందని వివరించారు.. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఈ కంపెనీ షేర్ 6.6 శాతం క్షీణించి రూ.191 వద్ద ముగిసింది. సీఎండీగా రెండేళ్లు పదవీ బాధ్యతలు నిర్వర్తించిన లక్ష్మీ అయ్యర్ ఈ వారంలో పదవీ విరమణ చేయనున్నారు. -
ఐసీఐసీఐ లాభం 2,922 కోట్లు
క్యూ4లో 10 శాతం వృద్ధి... ⇒ నికర వడ్డీ ఆదాయం 5,079 కోట్లు; 17% అప్ ⇒ వదలని మొండిబకాయిల బెడద... ⇒ షేరుకి రూ. 5 డివిడెండ్ ప్రకటన... న్యూఢిల్లీ: దేశీ ప్రైవేటు రంగ బ్యాంకింగ్ అగ్రగామి ఐసీఐసీఐ బ్యాంక్ను మొండిబకాయిలు వెంటాడుతున్నాయి. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2014-15, క్యూ4)లో బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం 10.2 శాతం వృద్ధి చెంది రూ.2,922 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,652 కోట్లుగా ఉంది. మొండిబకాయిలకు ప్రొవిజనింగ్(కేటాయింపులు) పెరగడం, రుణ వృద్ధి మందగించడం వంటివి లాభాల వృద్ధిపై ప్రభావం చూపాయి. కాగా, క్యూ4లో బ్యాంక్ స్టాండెలోన్ ఆదాయం రూ.14,465 కోట్ల నుంచి రూ.16,235 కోట్లకు పెరిగింది. 12.2% వృద్ధి చెందింది. ఇక నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 17% పెరిగి రూ.5,079 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది క్యూ4లో ఎన్ఐఐ రూ.4,357 కోట్లుగా ఉంది. క్యూ4లో నికర వడ్డీ మార్జిన్(ఎన్ఐఎం) 3.46 శాతం నుంచి 3.57 శాతానికి చేరింది. ఇక పూర్తి ఏడాదికి చూస్తే(2014-15) స్టాండెలోన్ లాభం రూ.10 వేల కోట్లను అధిగమించింది. 2013-14లో నమోదైన రూ.9,810 కోట్లతో పోలిస్తే 14% వృద్ధి చెంది రూ.11,175 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ.54,606 కోట్ల నుంచి రూ.61,267 కోట్లకు ఎగసింది. 12.1% వృద్ధి నమోదైంది. కాగా, క్యూ4లో విదేశీ మారక(ఫారెక్స్) లావాదేవీలకు సంబంధించిన లాభాలు 3 రెట్ల జంప్తో రూ.245 కోట్ల నుంచి రూ.726 కోట్లకు దూసుకెళ్లాయి. లేదంటే... లాభాల వృద్ధి మరింత మందగించేది. కన్సాలిడేటెడ్గా చూస్తే...: బీమా, బ్రోకింగ్ ఇతరత్రా అనుబంధ సంస్థలన్నింటినీ కలిపి చూస్తే(కన్సాలిడేటెడ్) ఐసీఐసీఐ నికర లాభం క్యూ4లో 13.24% పెరిగి రూ.3,085 కోట్లకు చేరింది. ఆదాయం 15 శాతం వృద్ధితో రూ.21,652 కోట్ల నుంచి రూ.24,914 కోట్లకు ఎగసింది. మొండిబకాయిలు పెరిగాయ్... బ్యాంక్ మొత్తం రుణాల్లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏ) క్యూ4లో 3.78 శాతానికి ఎగబాకాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 3.03 శాతమే. ఇక నికర ఎన్పీఏలు సైతం 0.82 శాతం నుంచి 1.4 శాతం పెరిగాయి. దీంతో ప్రొవిజనింగ్ మొత్తం కూడా రెట్టింపై రూ.714 కోట్ల నుంచి రూ.1,345 కోట్లకు చేరింది. క్యూ4లో కొత్తగా రూ.3,260 కోట్ల స్థూల ఎన్పీఏలు జతవగా.. ఇందులో పునర్వ్యవస్థీకరించిన రుణాల వాటా రూ.2,246 కోట్లుకావడం గమనార్హం. మరో రూ.1,500 కోట్ల రుణాలు పునర్వ్యవస్థీకరణ బాటలో ఉన్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ఇతర ముఖ్యాంశాలివీ... ⇒ బ్యాంక్ రుణ వృద్ధి క్యూ4లో 14%గా ఉంది. దీంతో మార్చి, 2015 నాటికి మొత్తం రుణాల పరిమాణం రూ.3,87,522 కోట్లు. కాగా, రిటైల్ రుణాల్లో 25, కార్పొరేట్ రుణాలు 10% వృద్ధి చెందాయి. ⇒ డిపాజిట్లు 9 శాతం ఎగసి రూ.3,61,563 కోట్లకు చేరాయి. ⇒ జీవిత బీమా అనుంబంధ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ నికర లాభం 2014-15లో స్వల్పంగా రూ.1,567 కోట్ల నుంచి రూ.1,634 కోట్లకు పెరిగింది. సాధారణ బీమా సంస్థ ఐసీఐసీఐ లంబార్డ్ నికర లాభం రూ. 511 కోట్ల నుంచి రూ.536 కోట్లకు చేరింది. ⇒ రూ. 2 ముఖవిలువ గల షేరుపై రూ. 5 డివిడెండ్ ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ షేరు ధర సోమవారం బీఎస్ఈలో 1.85 శాతం క్షీణించి రూ.302.4 వద్ద స్థిరపడింది. కొన్ని వ్యాపార విభాగాలకు చెందిన రుణాల్లో సమస్యల కారణంగానే మొండిబకాయిలు పెరిగాయి. అయితే, ఎన్పీఏలకు ఇదే గరిష్టస్థాయి కావచ్చు. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇవి తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి. అదే విధంగా రుణాల్లో 20 శాతం, డిపాజిట్ల విషయంలో 16% వృద్ధిని అంచనా వేస్తున్నాం. కార్పొరేట్ రంగం నుంచి ఇంకా డిమాండ్ పుంజుకోవాల్సి ఉంది. దీంతో రిటైల్ రుణాలపైనే అధికంగా దృష్టిపెడుతున్నాం. - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీ -
మొండి బకాయిలకు కళ్లెం!
ముంబై: మొండి బకాయిల ఇబ్బందుల పరిష్కారానికి రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ప్రణాళికలు రూపొందిస్తోంది. కంపెనీలకు రుణ పరిమితిని తగ్గించాలని తాజాగా ప్రతిపాదించింది. బ్యాంకు ఏ సమయంలోనైనా తన వద్ద అందుబాటులో ఉండే మూలధనంలో 25 శాతాన్ని మాత్రమే ఒక కంపెనీ లేదా కార్పొరేట్ గ్రూపునకు రుణంగా మంజూరు చేయాలన్నది ఈ ప్రతిపాదనల్లో ప్రధానమైనది. ప్రస్తుతం ఈ రేటు 55 శాతం వరకూ ఉంది. వీలైతే ఈ విధానాన్ని 2019 జనవరి 1 నుంచీ అమల్లోకి తేవాలని భావిస్తోంది. ఈ ప్రతిపాదనలతో కూడిన ఒక పత్రాన్ని ‘లార్జ్ ఎక్స్పోజర్ ఫ్రేమ్వర్క్’ పేరుతో విడుదల చేసింది. ఆయా ప్రతిపాదనలపై ఏప్రిల్ 30వ తేదీలోపు సంబంధిత పక్షాలన్నీ తమ అభిప్రాయాలను తెలియజేయాలని సూచించింది. 27 ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల మొండిబకాయిలు 2011లో రూ.71,080 కోట్లయితే, 2014 డిసెంబర్ నాటికి ఈ పరిమాణం రూ.2,60,531 కోట్లకు చేరుకుంది. విదేశీ మారక నిల్వలు ః 340 బిలియన్ డాలర్లు కాగా భారత్ విదేశీ మారకపు ద్రవ్య నిల్వలు మార్చి 20తో ముగిసిన వారాంతానికి 339.99 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకుముందు వారంతో పోల్చితే ఇవి 4.26 బిలియన్ డాలర్లు పెరిగాయి. -
ఏమిటీ రైటాఫ్
సాక్షి, విశాఖపట్నం: పేరుకుపోయిన మొండిబకాయిలను అడ్డగోలుగా మాఫీ చేసేందుకు సభ్యుల ఆమోదం కోసం అజెండాలో ప్రతిపాదించిన అంశంపై డీసీసీబీ మహాజనసభ అట్టుడికి పోయింది. రూ. 3.95కోట్ల వరకు ఉన్న మొండి బకాయిలు వడ్డీతో కలుపుకుంటే రూ.20 కోట్లకు పైగా ఉంటాయని...వీటి వసూలుకు చర్యలు చేపట్టాల్సింది పోయి టెక్నికల్ రైటాఫ్ పేరుతో మాఫీకి యత్నించడం ఎంతవరకు సమంజసమంటూ పలువురు సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘దా‘రుణం’గా మాఫీ’ శీర్షకన మంగళవారం సాక్షిలో వచ్చిన కథనం మహాజనసభను కుదిపేసింది. అజెండాలో చేర్చిన ఈ అంశంపై వివరణ ఇవ్వాల్సిందేనని, తక్షణమే మాఫీ ప్రయత్నాలు ఆపి వసూలుకు చర్యలుచేపట్టాలని డిమాండ్ చేస్తూ మెజార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ అంశంపై సభలో వాడివేడిగా చర్చ జరుగుతుందని ముందుగానే ఊహించిన సహకార శాఖాధికారులు గైర్హాజరయ్యారు. డీసీసీబీ చైర్మన్ సుకుమార్ వర్మ అధ్యక్షతన జరిగిన 42వ మహాజనసభ ప్రారంభం కాగానే డెరైక్టర్ గనగళ్ల వివేక్ అజెండాలో 8వ అంశంగా చేర్చిన ఈ టెక్నికల్ రైటాఫ్ అంశాన్ని ప్రస్తావించారు. పాలకవర్గం ఆమోదం మేరకే మహాజనసభలో ప్రవేశపెడుతున్నామని అధికారులు చెబుతున్నారని, కానీ వాస్తవంగా 16న తేదీన బోర్డు మీటింగ్ జరిగింది.. 23వ తేదీన పాలకవలర్గ సమావేశం జరిగింది.. కానీ ఈ మహా జనసభ కోసం 9వ తేదీనే నోటీసు సర్వ్ చేశారు..అంటే బోర్డులో కానీ, పాలకవర్గ సమావేశంలో కానీ చర్చించకుండానే పాలకవర్గం ఆమోదంతో అంటూ అజెండాలో ఏ విధంగా ఈ అంశాన్ని చేర్చారని ప్రశ్నించారు. సమాధానం చెప్పేందుకు సీఈవో అట్లూరి వీరబాబు కొద్ది సేపు ఇబ్బందిపడ్డారు. ఎన్పీఏ తగ్గించుకునేందుకు టెక్నికల్ రైటాఫ్ చేయడం ఎంతవరకు సమంజసమని వివేక్ ప్రశ్నించారు. ల్యాండ్మార్ట్గేజ్ కింద ఇచ్చిన రుణాలకు తనఖా పెట్టిన డాక్యుమెంట్లు కనిపించడంలేదనే సాకుతో వాటిని రైటాఫ్కు యత్నించడం సరికాదన్నారు. పాలకవర్గం ఏర్పడి ఏడాది కావస్తోంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఈ బకాయిలపై సమీక్షలు చేసిన పాపన పోలేదు.. వసూలు కోసం కనీసం ప్రయత్నించలేదంటూ మరి కొందరు సభ్యులు సభలో ప్రస్తావించారు. రికవరీ చేయలేని అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని.. కనీసం ఆర్ఆర్ యాక్టుకింద వారి జీతభత్యాల నుంచి ఎందుకు రికవరీ చేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడు రికార్డులు పోయాయి..అప్పులిచ్చిన అధికారుల్లేరు అంటూ కుంటిసాకులు చెప్పడం సరికాదన్నారు. సూపర్బజార్ అప్పు ఏ విధంగా మాఫీ చేస్తారు? సూపర్బజార్కు ఇచ్చిన రూ.26 లక్షల రుణం వడ్డీతో కలుపుకుంటే రెండుకోట్లకు పైగా ఉంటుందని, వందకోట్లకుపైగా టర్నోవర్తో లాభాల బాటలో దూసుకెళ్తున్న ఈ సంస్థ నుంచి అప్పులు వసూలుకావడం లేదంటే సిగ్గుచేటని..ఈ అప్పును రైటాఫ్ చే యాలని నిర్ణయించడం సరికాదని వివేక్తో పాటు డెరైక్టర్లు సాయం రమేష్, దుడ్డు సన్యాసినాయుడులు ధ్వజమెత్తారు. మిగిలిన రుణాల సంగతి ఎలా ఉన్నా సూపర్ బజార్విషయంలో తామంతా అభ్యంతరం వ్యక్తంచేస్తున్నామంటూ సభ్యులంతా ముక్తకంఠంతో తేల్చిచెప్పారు. తక్షణం ఈ అంశాన్ని అజెండా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. డీసీఎంఎస్ అప్పు సంగతేంటి? డీసీఎంఎస్కు డీసీసీబీ ఇచ్చిన రుణాల సంగతేమిటని డీసీఎంఎస్ చైర్మన్ ఎం.మహాలక్ష్మీ నాయుడు, డెరైక్టర్ దండి సన్యాసిదొర(బాల)లు ప్రశ్నించారు. మాకు ఇచ్చిన రుణాలను కూడా మాఫీ చేస్తామంటేనే అజెండాలో చేర్చిన టెక్నికల్ రైటాఫ్కు అంగీకరిస్తామని తేల్చి చెప్పారు. అయినప్పటికీ లాభాల బాటలో ఉన్న సూపర్బజార్కు ఇచ్చిన అప్పులను టెక్నికల్ ైరైటాఫ్ చేస్తామంటే మాత్రం ఊరుకోబోమని తేల్చిచెప్పారు. డీసీఎంఎస్కు ఇచ్చిన అప్పులను కూడా మాఫీ చేసితీరాల్సిందేనని పట్టుబట్టారు. కాగా టెక్నికల్ రైటాఫ్ అంశాన్ని తొలిగించాలని మెజార్టీ సభ్యులంతా డిమాండ్ చేశారు. రూపాయి కూడా మాఫీ కాదుః చైర్మన్ టెక్నికల్ రైటాఫ్ అంటే రికార్డ్స్లో టెక్నికల్గా ఆ అప్పుల లిస్ట్ను తొలగించడమే తప్ప.. వాటిని మాఫీ చేసినట్టు కాదని డీసీసీబీ చైర్మన్ సుకుమార్వర్మ స్పష్టం చేశారు. ఇచ్చిన అప్పు కాదుకదా..కనీసం దానిపై వడ్డీ కూడా మాఫీ చేసే అధికారం మాకు లేదని.. వాణిజ్యబ్యాంకుల మాదిరిగానే రికార్డుల కోసమే టెక్నికల్ రైటాఫ్ అంశాన్ని చేర్చామని ఆయన వివరణ ఇచ్చారు. సభ్యులంతా వ్యతిరేకిస్తున్నందున సూపర్ బజార్ అంశాన్ని టెక్నికల్ రైటాఫ్ జాబితా నుంచి తొలగిస్తామన్నారు. అనంతరం ఇతర అంశాలన్నీ ఏకగ్రీవంగా మహాజనసభ ఆమోదించింది. -
ఎస్బీఐ భారీ ఆన్లైన్ ప్రాపర్టీ వేలం
ముంబై: మొండి బకాయిల బరువును తగ్గించుకోవడానికి ఎస్బీఐ ఈ వారంలో ఆన్లైన్ ప్రాపర్టీ వేలాన్ని నిర్విహంచనుంది. ఇది దేశంలో అత్యంత పెద్ద ఆన్లైన్ వేలం. ఎస్బీఐ ఇప్పటివరకూ స్వాధీనపర్చుకున్న ఆస్తుల్లో నుంచి ఈ వేలంలో దాదాపు 200 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1250 కోట్లు) విలువైన కార్యాలయాలను, ఫ్లాట్లను విక్రయించనుంది. దేశంలోని వివిధ 24 నగరాల్లో 300 రకాల ఆస్తుల్ని వేలం వేయనుంది. ఎస్బీఐ మొండిబకాయిలు దాదాపు 10 బిలియన్ డాలర్లకు (రూ. 62,500 కోట్లు) పైగా ఉన్నాయి. ఈ వేలం కోసం ఎదురుచూస్తున్నామని ఎస్బీఐ డిప్యూటీ మేనేజింగ్ ప్రవీణ్ కుమార్ మల్హోత్రా అన్నారు. -
ఐదేళ్లలో రూ. లక్ష కోట్లు
ప్రభుత్వ రంగ బ్యాంకులు రద్దు చేసిన మొండి బకాయిల విలువ ఇది... న్యూఢిల్లీ: గడచిన అయిదేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్బీ) ఏకంగా రూ. 1,06,170 కోట్ల మేర రుణాలను మొండి బకాయిల కింద రద్దు చేశాయి. పునర్వ్యవస్థీకరించిన రుణాల మొత్తం గడచిన మూడేళ్లలో రెట్టింపయ్యాయి. 2011-12లో రూ. 20,752 కోట్లుగా ఉన్న ఈ మొత్తం .. ఈ ఏడాది మార్చి నాటికి రూ. 44,447 కోట్ల స్థాయికి చేరింది. మొండి బకాయిలు పెరగడానికి ఆర్థిక వ్యవస్థ మందగమనం తదితర అంశాలు కారణమయ్యాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా మంగళవారం రాజ్యసభకి ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ విషయాలు తెలిపారు. మరోవైపు, మార్చి 31 నాటి దాకా గణాంకాల ప్రకారం రూ. 25 లక్షలు పైగా బకాయిపడిన వారిలో 1,600 మందిని ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ప్రకటించినట్లు ఆయన వివరించారు. సమస్యను ముందుగానే గుర్తించేందుకు, సత్వరం దిద్దుబాటు..రికవరీకి చర్యలు తీసుకునేందుకు రుణాల పునర్వ్యవస్థీకరణ వంటి విధానాలు, లోక్ అదాలత్ వంటి వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయని సిన్హా పేర్కొన్నారు. అటు పోంజీ తరహా మోసపూరిత స్కీముల నిర్వాహకులను కఠినంగా శిక్షించేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నట్లు సిన్హా తెలిపారు. సాధారణంగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం) లేదా ఉమ్మడి పెట్టుబడి పథకాలు(సీఐఎస్) రూపంలో ఇలాంటివి జరుగుతున్నట్లు ఆయన వివరించారు. ఇటీవలి కాలంలో 55 కంపెనీలు సీఐఎస్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గుర్తించిందని ఆయన తెలిపారు. ఇన్వెస్టర్ల సొమ్ము వాపసు చేశాక, స్కీములను నిలిపివే యాలని 19 కేసుల్లో సెబీ తుది తీర్పునిచ్చింది. -
బడా ఎగవేతదారులతోనే దెబ్బ!
ఆనంద్(గుజరాత్): బ్యాంకుల ఆర్థిక పరిస్థితులు దెబ్బతినడానికి బడా రుణ ఎగవేతదారులే కారణమని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. ‘కొంత మంది పెద్ద రుణ గ్రహీతల కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండిబకాయిలు భారీగా ఎగబాకి నష్టాలపాలవుతున్నాయి. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలన్న బాధ్యతలేకుండా రిస్క్లేని పెట్టుబడిదారీ విధానంతో ఈ బడా రుణ గ్రహీతలు ఒకరకంగా జల్సా చేస్తున్నారు. పన్ను చెల్లింపుదారులు, నిజాయితీగా రుణాలను చెల్లించేవాళ్లు దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఒక పెద్ద రుణ గ్రహీత మొండిబకాయిదారునిగా మారితే.. పరిశ్రమ దిగ్గజం కాబట్టి వెసులుబాటు ఇవ్వడం కుదరదు. దేశ ప్రజల కష్టార్జితాన్ని అనుభవిస్తున్న పరాన్నభుక్తులుగా వీళ్లను పేర్కొనవచ్చు’ అని రాజన్ పేర్కొన్నారు. మంగళవారమిక్కడ డాక్టర్ వర్ఘీస్ కురియన్ మూడో మెమోరియల్ లెక్చర్ కార్యక్రమంలో ఆయన ఈ అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు తీవ్రమైన మొండిబకాయిల సమస్యలను ఎదుర్కొంటుండటం... అదికూడా కొన్ని బడా కార్పొరేట్లకు ఇచ్చిన రుణా ల రికవరీ జటిలంగా మారుతున్న నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘నేను రిస్క్ తీసుకోవడానికి వ్యతిరేకం కాదు. కొంత మంది ప్రమోటర్లు తమ వ్యాపారాలు నిలదొక్కుకోవాలంటే కొన్ని ప్రోత్సాహకాలు కల్పించాలంటూ బ్యాంకులు, నియంత్రణ సంస్థలు, ప్రభుత్వాలను బెదిరిస్తున్న సందర్భాలూ ఉన్నాయి. అయితే, దురదృష్టవశాత్తూ మన రుణ వ్యవస్థ దుర్భరంగా ఉంది. ఇటీవల కొన్నేళ్లుగా తీసుకున్న రుణాల తిరిగి చెల్లింపులు సజావుగా జరగడం లేదు. ఈ ఇబ్బందులకు పెద్ద రుణ గ్రహీతలే కారణం. చిన్న రుణ గ్రహీతల వల్ల ఎలాంటి సమస్యాలేదు. అని కూడా రాజన్ అన్నారు. ఇవే అభిప్రాయాలతో గతంలో రాజన్ ‘సేవింగ్ క్యాపిటలిజం ఫ్రమ్ ద క్యాపిటలిస్ట్స్’ అనే పుస్తకాన్ని రాయడం గమనార్హం. విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ పలు బ్యాంకులకు రూ.7,000 కోట్లకుపైగా రుణాలు చెల్లించకుండా మొండిబకాయిదారుగా మారడం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధం నాటికి మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలోని రుణాల్లో మొండిబకాయిలు(పునర్వ్యవస్థీకరించిన వాటితో సహా) 10.4 శాతానికి ఎగబాకడం అటు ప్రభుత్వం, ఇటు నియంత్రణ సంస్థల్లో గుబులు పుట్టిస్తోంది. సమాజంలో ఆగ్రహం... రుణాల చెల్లింపుల విషయంలో కార్పొరేట్ల నిర్లక్ష్య ధోరణి కారణంగా సమాజంలో ఆందోళనలు పెల్లుబికేందుకు దారితీయొచ్చని కూడా రాజన్ వ్యాఖ్యానించారు. ప్రమోటర్లు, బ్యాంకుల మధ్య కుదిరే రుణ ఒప్పందాలపై మాట్లాడుతూ... బ్యాంకులు కొన్నిసార్లు బడా రుణ గ్రహీతల పలుకుబడి ఇతరత్రా అంశాల వల్ల తలొగ్గాల్సి వస్తుందన్నారు. ‘ప్రమోటర్లు తమ సొంత సొమ్ముతో కాకుండా ప్రజల సొమ్ముతో ఇష్టానుసారంగా వ్యాపారాలను నిర్వహిస్తుంటారు. దీనివల్ల ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుంది. దీంతో చట్టాలను మరింత పటిష్టం చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది. దీనివల్ల చిన్న సంస్థలు ఇబ్బందుల్లో పడతాయి’ అని రాజన్ పేర్కొన్నారు. ఎవరైనా బడా రుణ గ్రహీత ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగ్గొట్టినా.. లేదంటే బ్యాంకులకు చెల్లింపుల్లో సహకరించకపోయినా దీని అర్థం ఒక్కటే.. పన్ను చెల్లింపుదార్లను దోచుకుంటున్నట్లే లెక్క. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అవసరమైన కొత్త పెట్టుబడుల నిధులపై మరింత భారం పడేందుకు దీనివల్ల దారితీస్తుందని రాజన్ పేర్కొన్నారు. 2013-14లో బ్యాంకులు రూ.2.36 లక్షల కోట్ల బకాయిలను వసూలు చేసుకోవాల్సి ఉండగా.. రుణ వసూళ్ల ట్రిబ్యునల్(డీఆర్టీ) ద్వారా కేవలం రూ.30,590 కోట్లను మాత్రమే రికవరీ చేసుకోగలిగాయని కూడా రాజన్ తెలిపారు. డీఆర్టీల్లో కేసులు పేరుకుపోతున్నాయన్నారు. ఈ విధానపరమైన జాప్యాల కారణంగా బ్యాంకులపై తీవ్ర ప్రభావం పడుతోందని రాజన్ వివరించారు. వృద్ధి కోసం రిస్క్ తీసుకోవడానికి రెడీ.. నిలిచిపోయిన ప్రాజెక్టులను మళ్లీ పట్టాలెక్కించగలిగితే మొండిబకాయిలు(ఎన్పీఏ)గా మారిన రుణాలను పునర్వ్యవస్థీకరించడంలో బ్యాంకులకు మరింత వెసులుబాటు ఇవ్వడానికి సిద్ధమేనని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. ‘రుణాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి మరింత వెసులుబాటు కావాలంటూ బ్యాంకులు ఆర్బీఐని కోరుతున్నాయి. దీనివల్ల ఎన్పీఏల్లో కొంత భాగాన్ని ఆయా కంపెనీల్లో ఈక్విటీగా బ్యాంకులు తీసుకోవాల్సి వస్తుంది. వివిధ ప్రాజెక్టులకు నగదు ప్రవాహం పెరిగి మళ్లీ గాడిలోపడతాయని... వృద్ధి రేటు రికవరీ బాటలోకి పయనిస్తుందని భావిస్తే ఈ రిస్క్ తీసుకోవడానికి మేం సన్నద్ధంగానే ఉన్నాం’ అని రాజన్ వ్యాఖ్యానించారు. పర్యావరణ సంబంధ అనుమతుల్లో జాప్యం, భూసేకరణ వంటి అడ్డంకుల కారణంగా సుమారు రూ.20 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు నిలిచిపోయినట్లు అంచనా. దీంతో ఆర్బీఐ రుణాల పునర్ వ్యవస్థీకరణ నిబంధనలను కఠినతరం చేసింది. మరింత మొత్తాన్ని ప్రొవిజనింగ్గా పక్కనబెట్టాల్సి రావడంతో బ్యాంకుల లాభాలపై ప్రతికూల ప్రభావానికి దారితీస్తోంది. ‘2010-11లో 9 శాతంపైగా నమోదైన స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో 5 శాతం దిగువకు పడిపోయింది. ఈ నేపథ్యంలో ఎన్పీఏ సమస్యను సమర్థంగా ఎదుర్కోవడం కోసం బ్యాంకుల నుంచి వస్తున్న డిమాండ్లుకూడా సరైనవే. గతంలో ఇలాంటి వెసులుబాటు ఇస్తే చాలా బ్యాంకుల యాజమాన్యాలు దుర్వినియోగం చేశాయి. అందుకే ఆర్బీఐ ఈ విషయంలో తటపటాయించాల్సి వచ్చింది’ అని రాజన్ పేర్కొన్నారు. -
ఐడీబీఐ బ్యాంక్కు సీబీఐ నోటీసు
న్యూఢిల్లీ/ముంబై: కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కు ఐడీబీఐ బ్యాంక్ రుణం ఇవ్వడంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు ప్రారంభించింది. బ్యాంకుకు ఎంక్వైరీ నోటీసు జారీ చేసింది. ఆర్థిక భారంతో సర్వీసులు నిలిచిపోయిన విజయ్మాల్యా నియంత్రణలోని కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కు ఐడీబీఐ బ్యాంక్ రూ.950 కోట్ల రుణం మంజూరు చేసింది. ఇంతభారీ మొత్తం రుణం మంజూరు చేయడంలో విశ్వసనీయత కొరవడిందన్నది సీబీఐ నోటీసుల సారాంశంగా తెలుస్తోంది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ నెట్వర్త్ ప్రతికూలంగా ఉన్నప్పుడు రూ.950 కోట్ల భారీ రుణాన్ని ఐడీబీఐ బ్యాంక్ ఎలా మంజూరు చేసిందో తేలాల్సి ఉందని సీబీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇందుకోసమే ప్రాథమిక విచారణ (పీఈ)కు నోటీసులు జారీ అని తెలిపారు. వివరణ పంపుతాం: బ్యాంక్ సీఎండీ కాగా తాజా వ్యవహారంపై ఐడీబీఐ బ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ) ఎంఎస్ రాఘవన్ వివరణ ఇచ్చారు. ‘‘దీని గురించి సమాచారం అంతా ఉంది. కొన్ని ప్రశ్నలకు సమాధానాలను సీబీఐ కోరింది. వాటికి మేము రానున్న కొద్ది రోజుల్లో సమాధానం ఇవ్వాల్సి ఉంది. గతంలో కూడా ఈ తరహాలోనే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కోరడం జరిగింది. బ్యాంకు కూడా సమాధానాలు పంపింది. ఇక్కడ దాయడానికి ఏమీ లేదు. కన్సార్షియం లేదా మల్టిప్లై బ్యాంకింగ్లో భాగంగా రుణాలను బ్యాంక్ సమకూర్చింది’’ అని ఆయన అన్నారు. సిండికేట్ బ్యాంక్ నేపథ్యం... ప్రాధాన్యత నిబంధనలకు విరుద్ధంగా కంపెనీల రుణ పరిమితి పెంచేందుకు లంచం తీసుకున్న కేసులో సిండికేట్ బ్యాంక్ సీఎండీ ఎస్.కె.జైన్తో పాటు మరో ఏడుగురి అరెస్ట్, రిమాండ్ నేపథ్యంలో సీబీఐ తాజా నోటీసులకు ప్రాధాన్యత ఏర్పడింది. భూషణ్ స్టీల్ కంపెనీ సిండికేట్ బ్యాంకుకు కోట్లాది రూపాయల రుణాలకు సంబంధించిన వాయిదాలను చెల్లించకపోయిన్పటికీ ఆ కంపెనీ రుణ పరిమితిని పెంచేందుకు రూ.50 లక్షల కోసం సంప్రదింపులు జరుపుతున్న జైన్ను సీబీఐ అధికారులు ఇటీవలే అరెస్ట్ చేశారు. ప్రభుత్వ రంగ బ్యాం కుల్లో పాలనాపరమైన కొన్ని సమస్యలున్నాయని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇటీవలి పాలసీ విధాన ప్రకటన సందర్భంలోనూ పేర్కొన్నారు. రుణాల మంజూరులో మరింత పారదర్శకత అవసరమన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల పాలన వ్యవస్థపై మరోమారు దృష్టిసారించి లోపాలను సరిదిద్దాల్సి ఉందన్నారు. రుణ బకాయిల్లో కూరుకుపోయిన కింగ్ఫిషర్ 2012 అక్టోబర్ నుంచీ కార్యకలాపాలను నిలిపివేసింది. ఎస్బీఐ సారథ్యంలోని 17 బ్యాంకుల బృం దానికి కేఎఫ్ఏ దాదాపు రూ.7,000 కోట్ల బకాయి ఉంది. దీనిలో ఎస్బీఐ వాటా దాదాపు 1,600 కోట్లు. -
డిఫాల్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొండలా పెరిగిపోతున్న మొండి బకాయిలు ప్రభుత్వరంగ బ్యాంకులకు గుదిబండగా మారాయని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తొలిసారిగా పీఎస్యూ బ్యాంకులు దివాళా తీసే పరిస్థితులు తలెత్తుతాయని ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏఐబీఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. పీఎస్యూ బ్యాంకుల్లో మార్చి, 2013 నాటికి రూ.1.64 లక్షల కోట్లుగా ఉన్న ఎన్పీఏలు సెప్టెంబర్, 2013 నాటికి 2.36 లక్షల కోట్లకు చేరాయని, ఇప్పుడివి రూ.3.50 లక్షలు దాటినట్లు ప్రాథమిక అంచనాలను బట్టి తెలుస్తోందని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి బి.ఎస్.రాంబాబు తెలిపారు. రుణం తీసుకొని చెల్లించని వారిపై క్రిమినల్ కేసులు పెట్టి వారి ఆస్తులను జప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఏఐబీఈఏ దేశంలో రుణాలు తీసుకొని చెల్లించని సంస్థలు, వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. రుణాలు ఎగ్గొట్టిన టాప్ 50 కంపెనీల్లో రాష్ట్రానికి చెందిన డెక్కన్ క్రానికల్ (రూ.700 కోట్లు), ఐసీఎస్ఏ ఇండియా (రూ.646 కోట్లు), ల్యాంకో హోస్టెక్ హైవే (రూ.533), ఎంబీఎస్ జ్యూయెలర్స్ (రూ.524 కోట్లు), రాజీవ్ స్వగృహ (రూ.385 కోట్లు), పోగ్రసివ్ కనస్ట్రక్షన్ (రూ.351 కోట్లు), సుజన యూనివర్సల్ (రూ.330 కోట్లు) ఉన్నాయి. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ బ్యాంకుల ఆడిట్ కమిటీలో ఉద్యోగ సంఘాలకు చోటు కల్పిస్తే రుణాల మంజూరులో పారదర్శకత పెరిగి మొండి బకాయిలు తగ్గుతాయన్నారు. -
ప్రభుత్వ రంగ బ్యాంకులకు అతిపెద్ద సవాలు మొండిబకాయిలు రికవరీ
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో మొండిబకాయిలు(ఎన్పీఏలు) అంతకంతకూ ఎగబాకడం పట్ల ఆర్థిక మంత్రి పి. చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఎన్పీఏలే అతిపెద్ద సవాలుగా నిలుస్తున్నాయని చెప్పారు. వీటిని రికవరీ చేసుకునేందుకు మరింత దృష్టిపెట్టాలని, తగు చర్యలు చేపట్టాలని బ్యాంకులకు సూచించారు. బుధవారం ఇక్కడ పీఎస్యూ బ్యాంకులు, ఆర్థిక సంస్థల అధిపతులతో సమావేశం అనంతరం చిదంబరం విలేకరులతో మాట్లాడారు. ఈ భేటీలో వాటి త్రైమాసిక ఆర్థిక పనితీరును సమీక్షించారు. మధ్యస్థాయి పరిశ్రమలకు రుణ వితరణ తగ్గిందని, ఇదే సమయంలో వ్యవసాయ రంగానికి మాత్రం సంతృప్తికరంగానే ఉందని విత్తమంత్రి చెప్పారు. బ్యాంకు చీఫ్లతో సమావేశంలో ఎక్కువగా మొండిబకాయిలు, వీటి రికవరీ కోసం చేపట్టాల్సిన చర్యలపైనే చర్చజరిగినట్లు ఆయన వెల్లడించారు. ‘రియల్టీలో మొండిబకాయిలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ... బడా కార్పొరేట్ రంగాలు, చిన్న పరిశ్రమల్లో ఇవి భారీగా పేరుకుపోతున్నాయి. అయితే, 2013-14 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ కాలంలో పీఎస్యూ బ్యాంకులు రూ.18,933 కోట్ల బకాయిలను వసూలు చేయగలిగాయి. అదేవిధంగా ప్రతి బ్యాంక్ కూడా టాప్-30 ఎన్పీఏ ఖాతాలపై ప్రత్యేక పర్యవేక్షణను ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతున్నాయి’ అని చిదంబరం వెల్లడించారు. గతేడాది మార్చి చివరి నాటికి పీఎస్యూ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు రూ. 1.83 లక్షల కోట్లు కాగా... సెప్టెంబర్ నాటికి ఇవి రూ.2.36 లక్షల కోట్లకు ఎగబాకడం గమనార్హం. అంటే ఏకంగా 28.5 శాతం పెరిగిపోయాయి. యునెటైడ్ బ్యాంక్ ఎన్పీఏల వివాదంపై... ప్రభుత్వ రంగ యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎన్పీఏల సంక్షోభానికి సంబంధించిన అంశాన్ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్తో ఈ నెల 7న ప్రత్యేకంగా చర్చించనున్నామని చిదంబరం చెప్పారు. ఇది మరీ అంత ఆందోళనకరమైన అంశమేమీ కాదని, రాజన్తో భేటీ అనంతరం సమస్య సద్దుమణగనుందని చెప్పారు. మొండిబకాయిలు, రుణ పునర్వ్యవస్థీకరణ గణాంకాల వెల్లడి విషయంలో వైఫల్యానికి గాను యునెటైడ్ బ్యాంక్పై అంతర్గత విచారణతో పాటు ఆర్బీఐ కూడా ఫోరెన్సిక్ ఆడిట్కు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో బ్యాంక్ చైర్పర్సన్ అర్చనా భార్గవ స్వచ్ఛంద పదవీ విరమణతో వైదొలగడం కూడా జరిగింది. గతేడాది మార్చి క్వార్టర్లో రూ. 2,964 కోట్లుగా ఉన్న యునెటైడ్ బ్యాంక్ స్థూల ఎన్పీఏలు డిసెంబర్ త్రైమాసికం నాటికి ఏకంగా రూ. 8,546 కోట్లకు ఎగబాకడం తెలిసిందే. అంతేకాకుండా ఈ క్వార్టర్లో రూ. 1,238 కోట్ల భారీ నికర నష్టాన్ని కూడా ప్రకటించింది. పసిడిపై నియంత్రణలను సమీక్షిస్తాం... బంగారం దిగుమతులపై నియంత్రణలను తొలగించాలంటూ ఒత్తిడి పెరుగుతుండటంతో ప్రభుత్వం దీనిపై దృష్టిసారిస్తోంది. ఈ ఏడాది(2013-14) కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) గణాంకాలను పరిశీలించిన తర్వాత తప్పకుండా దిగుమతి సుంకాలను సమీక్షిస్తామని ఆర్థిక మంత్రి చిదంబరం పేర్కొన్నారు. గతేడాది క్యాడ్ చరిత్రాత్మక గరిష్టానికి(జీడీపీలో 4.8 శాతం-88.2 బిలియన్ డాలర్లు) ఎగబాకడంతో దీని అడ్డుకట్టకోసం దిగుమతులకు కళ్లెం వేసే పలు చర్యలు ప్రకటించడం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రధానంగా బంగారంపై దిగుమతి సుంకాన్ని దశలవారీగా 10 శాతానికి చేర్చారు. దీని ప్రభావంతో పసిడి దిగుమతులు భారీగా తగ్గడంతోపాటు క్యాడ్ కూడా దిగొచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్-డిసెంబర్ తొమ్మిది నెలల కాలంలో ఏకంగా జీడీపీలో 2.3 శాతానికి(31.1 బిలియన్ డాలర్లు) తగ్గింది. అక్టోబర్ త్రైమాసికంలో అయితే కేవలం 0.9 శాతం(4.2 బిలియన్ డాలర్లు) మాత్రమే నమోదైంది. ఇక బంగారం దిగుమతుల విషయానికొస్తే.. గతేడాది మే నెలలో 162 టన్నుల గరిష్టస్థాయి నుంచి నవంబర్లో 19.3 టన్నులకు పడిపోయాయి. కాగా, పసిడి దిగుమతులపై కఠిన నియంత్రణల కారణంగా స్మగ్లింగ్ పెరిగేందుకు దారితీస్తోందని, ఈ నియంత్రణలను సడలించాల్సిన అవసరం ఉందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ కూడా తాజాగా వ్యాఖ్యానించడం గమనార్హం. -
నిబద్ధత ఉంటే వెన్నంటి ఉంటాం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణం తీసుకునే సమయంలో చిన్న కారులో వచ్చి, రుణాన్ని పునర్వ్యవస్థీకరించండని కోరేందుకు ఖరీదైన కారులో వచ్చేవారిపై మమకారం చూపబోమని ఆంధ్రాబ్యాంకు సీఎండీ సి.విఆర్.రాజేంద్రన్ తేల్చి చెప్పారు. ‘తనఖా ఆస్తులకు సంబంధించిన కాగితాలు మా వద్ద ఉంటాయి. కంపెనీ కష్టాల్లో ఉన్నట్టయితే అవేవీ పనిచేయవు. అన్ని సమయాల్లోనూ వేలం ద్వారానే రావాల్సిన మొత్తాన్ని రాబట్టుకోవాలన్న భావన మాది కాదు. వ్యాపారంలో నిబద్ధత చూపిన పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటాం. విశ్వసనీయత చూపండి. తప్పకుండా ఆదుకుంటామంటూ కంపెనీల ప్రతినిధులకు హామీ ఇచ్చారు. మంగళవారమిక్కడ ఫెడరేషన్ ఆఫ్ స్మాల్, మీడియం ఎంటర్ప్రైసెస్(ఎఫ్ఎస్ఎంఈ) ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. కష్టాల్లో ఉన్న కంపెనీలను ఆదుకోవాలన్న ఫెడరేషన్ విజ్ఞప్తిపై ఆయన సానుకూలంగా స్పందించారు. ‘భవిష్యత్తులో కంపెనీ గాడిలో పడుతుందనేందుకు బలమైన కారణం చూపండి. బ్యాంకు పరంగా పూర్తి సహకారం ఉంటుంది’ అని పేర్కొన్నారు. మంచి ప్రతిపాదనతో రండి.. ‘వివిధ వ్యాపార రంగాలకు చెందిన సంఘాలు ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేయాలి. అదనపు రుణం, రుణ పునర్వ్యవస్థీకరణ ఇలా సహాయమేదైనా సభ్యుల నుంచి వచ్చే ప్రతిపాదనలను కమిటీ అధ్యయనం చేయాలి. మంచి ప్రతిపాదనలనే మా వద్దకు తీసుకురండి’ అని రాజేంద్రన్ పేర్కొన్నారు. చిన్న తరహా పరిశ్రమలకు సహాయం చేయడంలో వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటున్నట్టు తెలిపారు. మాంద్యంలోనూ కొత్త వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఇచ్చిన రుణాలపరంగా చూస్తే నిరర్ధక ఆస్తులుగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 3 శాతం, కార్పొరేట్లు 7 శాతం ఉంటాయని అన్నారు. గత చరిత్ర చూడండి.. నిరర్ధక ఆస్తులుగా(ఎన్పీఏ) ప్రకటించే ముందు కంపెనీల గత చరిత్ర చూడాలని ఎఫ్ఎస్ఎంఈ ప్రెసిడెంట్ ఏపీకే రెడ్డి కోరారు. మందగమనం, అధిక వడ్డీ రేట్లు, ముడి సరుకుల ధరలు పెరగడంతోపాటు రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో గంటకు 6 కంపెనీలు మూతపడుతున్నాయని వివరించారు. విద్యుత్ లేనప్పుడు అదనపు రుణమెందుకంటూ బ్యాంకర్లు అంటున్నారని ఫ్యాప్సీ వైస్ ప్రెసిడెంట్ వి.అనిల్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమం, ప్రభుత్వ విధానాల్లో లోపాలతో తమ వ్యాపారాలు దెబ్బతిన్నాయని వీబీ శంకర్ అనే పారిశ్రామికవేత్త చెప్పారు. విఫలమైన కంపెనీల కష్టాలకుగల కారణాలను అధ్యయనం చేసి, తగు పరిష్కారం అందించాలని విన్నవించారు. రుణాల పునర్వ్యవస్థీకరణతోపాటు చెల్లించాల్సిన వడ్డీని టెర్మ్ లోన్గా మార్చాలని రవి చంద్రమౌళి అనే పారిశ్రామికవేత్త కోరారు. తనఖా పెట్టిన ఆస్తులను తిరిగి విలువ కట్టాలని ఎఫ్ఎస్ఎంఈ సలహాదారు ఎమ్వీ రాజేశ్వరరావు సూచించారు. తిరిగి రుణాలిచ్చేందుకై ప్రత్యేక విభాగాన్ని తెరవాలన్నారు. సీఎంకు పెప్సి, క్యాడ్బరీ కావాలి.. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పెప్సి, క్యాడ్బరీ, ఇసుజు వంటి కంపెనీలే కనిపిస్తున్నాయని, చిన్న కంపెనీలను ఆదుకోవాలన్న సృహ లేదని ఏపీకే రెడ్డి విమర్శించారు. రోజుకు 1,400 మంది కార్మికులు రోడ్డున పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. బ్యాంకులు ఎన్పీఏలుగా ప్రకటిస్తూ పోతే కంపెనీలు మిగలవని అన్నారు. పారిశ్రామికవేత్తలు తమ పిల్లలను పారిశ్రామికవేత్తలు కావాలని కోరుకోవడం లేదని అన్నారు. రుణాలను ఎగ్గొట్టే ఉద్దేశం ఏ పారిశ్రామికవేత్తకూ లేదని వెల్లడించారు. పార్లే వంటి భారతీయ కంపెనీలను ప్రోత్సహించి, అట్టి కంపెనీల్లో మన విద్యార్థులకు పారిశ్రామిక శిక్షణ ఇప్పించాలన్నారు.