Brad Pitt
-
హాలీవుడ్ స్టార్ జంటకు విడాకులు.. ఎనిమిదేళ్ల తర్వాత సెటిల్మెంట్!
ప్రముఖ హాలీవుడ్ జంట ఏంజెలీనా జోలీ, బ్రాడ్ పిట్ తమ బంధానికి గుడ్ బై చెప్పేశారు. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఈ దంపతులకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. సెప్టెంబరు 2016లో ఎంజెలీనా జోలీ విడాకుల కోసం కోర్టును అశ్రయించారు. సుదీర్ఘమైన విచారణ తాజాగా వీరిద్దరు ఓ సెటిల్మెంట్కు వచ్చారు. దీంతో వీరిద్దరు అధికారికంగా విడాకులు తీసుకున్నట్లు ఎంజెలీనా తరఫు న్యాయవాది ధ్రువీకరించారు.కాగా.. 2014లో ఎంజెలీనా, బ్రాడ్ పిట్ పెళ్లి చేసుకున్నారు. ఈ జంట దాదాపు 12 ఏళ్ల పాటు కలిసి ఉన్నారు. హాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన జంటల్లో ఏంజెలినా జోలీ, బ్రాడ్ పిట్ ఒకరు. కాగా... విడాకుల సెటిల్మెంట్కు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచారు. ఈ కేసు కోసం దంపతులు ఒక ప్రైవేట్ న్యాయమూర్తిని నియమించారు.2016లో జోలీ యూరప్ ట్రిప్ తర్వాత విడాకుల కోసం దాఖలు చేసింది. పిట్ తన పట్ల, తన పిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించాడని ఆమె పేర్కొంది. అయితే ఈ జంటకు న్యాయమూర్తి వారికి 2019లో విడాకులు మంజూరు చేశారు. కానీ పిల్లలు, ఆస్తుల విభజన, పిల్లల సంరక్షణ సెటిల్మెంట్ కోసం కోసం మరో ఐదేళ్లు పట్టింది. ఇక నుంచి వీరిద్దరు అధికారికంగా విడిపోయినట్లే. ఇక సినిమాల విషయానికొస్తే ఎంజెలీనా జోలీ చివరిసారిగా మారియాలో కనిపించింది. -
ఎనిమిదేళ్ల తర్వాత విడాకులు తీసుకున్న ఏంజెలీనా జోలీ
హాలీవుడ్ కపుల్స్ ఏంజెలీనా జోలీ, బ్రాడ్ పిట్ విడాకులు తీసుకున్నారు. 2005లో మిస్టర్ అండ్ మిస్సెస్ సినిమా ద్వారా దగ్గరైన ఈ జంట.. తర్వాత చాలా ఏళ్లు డేటింగ్ చేసింది. 2014లో పెళ్లి చేసుకోగా.. రెండేళ్లకే ఈ జంట విడాకులకు దరఖాస్తు చేసింది. 2019 ఏప్రిల్ నుంచి తాము విడిగా ఉంటున్నట్లు ప్రకటించుకుంది. అప్పటి నుంచి పిల్లల బాధ్యతను ఇద్దరూ చూసుకుంటున్నారు. అయితే, విడాకుల తర్వాత పిల్లల బాధ్యత ఎవరిది అనే అంశాన్ని కోర్టుకు తెలపకపోవడంతో ఇన్నేళ్లుగా వారి విడాకులను కోర్టు మంజూరు చేయలేదు. అయితే, ఈ జంటకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. వారు మేజర్ అయ్యే వరకు తల్లిదండ్రులు ఇద్దరూ సంరక్షించాలని కోర్టు తెలిపింది. మొదటి నుంచి ఏంజెలీనా జోలి తన భర్త బ్రాడ్పిట్ పట్ల కర్కశంగా ప్రవర్తిస్తూ వస్తోంది. మీడియా మీట్లలో బ్రాడ్ పిట్ పట్ల నిర్లక్క్ష్య వైఖరి, విడాకుల పిటిషన్ వంకతో 9మిలియన్ డాలర్ల భరణం తీసుకోవడం, తాజాగా పిల్లల కస్టడీకి సంబంధించి డ్రామాతో ఆమె అభిమానులు విసిగిపోయారు. ఈ క్రమంలో బ్రాడ్ పిట్కు మద్ధతు పెరిగింది. బర్త్ డే పార్టీ పేరుతో తండ్రికి పిల్లల్ని దూరంగా తీసుకెళ్లిన సంఘటనలపై జోలి మీద ఫ్యాన్స్ ఫైర్ అయిన సంఘటనలు కూడా ఉన్నాయి.ఎంజెలీనా జోలీ 1996లో బ్రిటిష్-అమెరికన్ యాక్టర్ జానీ లీ మిల్లర్ని పెళ్లి చేసుకుని.. 18 నెలల తర్వాత విడిపోయారు. అయితే విడాకులు మాత్రం 1999లో తీసుకున్నారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో అమెరికన్ యాక్టర్ బిల్లీ బాబ్ను ఆమె రెండో పెళ్లి చేసుకుని.. మూడేళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. ఇప్పుడు బ్రాడ్ పిట్తో కూడా తన బంధాంన్ని తెంచుకుంది. -
స్టార్ హీరోతో ముద్దు సీన్స్.. తప్పుకున్న ఐశ్వర్య రాయ్!
చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల పరిస్థితి దారుణంగా ఉంటుంది. కెరీర్లో రాణించాలంటే అన్ని రకాల సినిమాలు చేయాల్సిందే. ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్లో నటిస్తేనే ఎక్కువ అవకాశాలు వస్తాయని కొంతమంది నమ్ముతారు. అది కొంతవరకు వాస్తవం కూడా. అయితే అలాంటి సీన్స్ చేస్తేనే అవకాశాలు వస్తాయనుకోవడం తప్పే. ఎలాంటి ఎక్స్ఫోజింగ్ చేయకుండా కేవలం తమ నటనతోనే ఆకట్టుకున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. అయితే ఏ సినిమా ఎంచుకోవాలి, ఇండస్ట్రీలో ఎలా నిలబడాలని అనేది సదరు హీరోయిన్ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. కొంతమంది పెద్ద సినిమాలో నటించే అవకాశం వచ్చినా..తమ పాత్ర నచ్చపోతే సున్నితంగా తిరస్కరిస్తారు. మరికొంత మంది పెద్ద ప్రాజెక్ట్ కదా అని కాంప్రమైజ్ అవుతారు. కానీ బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ మాత్రం ముద్దు సన్నివేశాలు ఉన్నాయని రెండు భారీ హాలీవుడ్ సినిమాలనే వదులుకుంది. స్టార్ హీరోలతో నటించే అవకాశం వచ్చినా.. సున్నితంగా ఆ ప్రాజెక్టుల నుంచి తప్పుకుంది.ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయని.. 2000 సంవత్సరంలో ఐశ్వర్యరాయ్కి బాలీవుడ్లో ఫుల్ డిమాండ్ ఉంది. వరుస సినిమాలు హిట్ కావడంతో హాలీవుడ్లో కూడా నటించే అవకాశం వచ్చింది. బ్రైడ్ అండ్ ప్రిజుడీస్, మిస్ట్రెస్ ఆఫ్ స్పైసెస్ లాంటి హాలీవుడ్ సినిమాల్లో కీలక పాత్ర పోషించి, తనదైన నటనతో ఆకట్టుకుంది. అదే సమయంలో ఆమె కెరీర్ని మలుపు తిప్పే రెండు భారీ హాలీవుడ్ సినిమా అవకాశాలు వచ్చాయట. కానీ కిస్ సీన్స్, రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని రిజెక్ట్ చేసిందట. హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్’లో హీరోయిన్గా నటించే అవకాశం ముందుగా ఐశ్యరకే వచ్చిందట. అయితే కథలో భాగంగా ఆమె హీరోతో ఇంటిమేట్ సీన్స్తో పాటు ముద్దు సన్నివేశాల్లో కూడా నటించాలని చెప్పారట. హీరోతో కిస్ సీన్ చేయడం ఇష్టం లేక ఐశ్వర్య ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట. దీంతో ఆ చాన్స్ ఏంజలినా జోలీ కొట్టేసింది.లిప్ లాక్ సీన్ ఉందని మరో చిత్రం..ఐశ్వర్య మరో హాలీవుడ్ చిత్రాన్ని కూడా ఇలానే వదులకుందంట. హాంకాక్( Hancock) చిత్రంలో విల్ స్మిత్తో స్క్రీన్ షేర్ చేసుకున్న చాన్స్ ఐశ్వర్యకు వచ్చిందంట. అయితే అందులో విల్ స్మిత్తో లిప్లాక్ చేసే సీన్ ఉందంట. అలాంటి సన్నివేశాల్లో నటించడం ఇష్టంలేక ఐశ్వర్య ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుందట. డేట్స్ కూడా ఖాలీగా లేకపోవడం మరో కారణమని ఐశ్వర్య ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. -
సమ్మర్లో ఎఫ్1 రేసింగ్
హాలీవుడ్ ప్రముఖ నటుడు బ్రాడ్ పిట్ తాజా చిత్రంగా ‘ఎఫ్1’ ఖరారైంది. ‘ఓన్లీ ది బ్రేవ్, టాప్గన్: మేవరిక్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు దర్శకత్వం వహించిన జోసెఫ్ కొసిన్క్సి ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమాను తెరకెక్కించనున్నారు. ‘ఎఫ్1’ని అధికారికంగా ప్రకటించి, ఫస్ట్ లుక్ను విడుదల చేశారు మేకర్స్. ఫార్ములా వన్ రేసింగ్ నేపథ్యంలో ఓ రేసర్ కథగా ఈ సినిమా రూపొందనుంది. ఫార్ములా వన్ రేసింగ్లో ఉండే సవాళ్లు, రేసర్ల వ్యక్తిగత, వృత్తిపరమైన జీవన విధానాలను ఈ సినిమాలో చూపించనున్నారట జోసెఫ్. జెర్నీ బ్రూక్హైమర్, బ్రాడ్ పిట్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘ఎఫ్1’ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానుంది. -
స్కర్ట్ వేసుకున్న స్టార్ హీరో.. వరల్డ్వైడ్గా చర్చ
Brad Pitt Explains On Why He Wore Skirt On Bullet Train Red Carpet: ఇప్పటివరకు బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన దుస్తులు ధరించి ట్రోలింగ్కు గురి కావడం చూశాం. తాజాగా ఇలాంటి డిఫరెంట్ వేర్తో దర్శనమిచ్చి వైరల్గా మారాడు ఓ స్టార్ హీరో. హాలీవుడ్ ప్రముఖ కథానాయకుల్లో బ్రాడ్ పిట్ ఒకరు. యాక్షన్ సినిమాలతో వరల్డ్ వైడ్గా పాపులారిటీ సంపాదించుకున్నాడు ఈ ఆస్కార్ విన్నర్. ఈ హీరో కూడా అప్పుడప్పుడు విచిత్రమైన ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తుంటాడు. బ్రాడ్ పిట్ తాజాగా నటించిన చిత్రం 'బుల్లెట్ ట్రైన్'. ఈ మూవీ ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రం రిలీజ్కు ముందు పలు దేశాల్లో ప్రీమియర్ షోలను వేస్తున్నారు. ఇలానే కొన్ని వారాల క్రితం బెర్లిన్లో 'బుల్లెట్ ట్రైన్' ప్రీమిర్ షోను ప్రదర్శించారు. ఈ షో కోసం వేసిన రెడ్ కార్పెట్పై స్కర్ట్ వేసుకుని కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు బ్రాడ్ పిట్. మోకాళ్ల వరకు ఉన్న స్కర్ట్, బూట్లు, వదులుగా ఉండే నార షర్ట్, జాకెట్తో దర్శనమిచ్చిన బ్రాడ్ పిట్ లుక్ వరల్డ్వైడ్గా వైరల్ అయింది. బ్రాడ్ పిట్ వేసుకున్న కాస్ట్యూమ్పై ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. దీంతో ఈ విషయంపై తాజాగా లాస్ ఏంజెల్స్తో జరిగిన మూవీ ప్రీమియర్ షోలో స్పందించాడు బ్రాడ్ పిట్. చదవండి: సౌత్ సినిమాలు సరిగ్గా ఆడట్లేదు: అలియా భట్ ఈ ప్రీమియర్ షోకు సాధారణ దుస్తుల్లో వచ్చన బ్రాడ్ పిట్.. 'బెర్లిన్లో అలా ఎందుకు చేశానో నాకు కూడా సరిగ్గా తెలియదు. కానీ త్వరలో మనందరం చనిపోతాం. అందుకే కొంచెం డిఫరెంట్గా చేద్దామని అనిపించింది' అని స్కర్ట్ వేసుకోవడంపై వివరణ ఇచ్చాడు. అలాగే తన రిటైర్మెంట్ ప్లాన్ గురించి చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించాడు. 'నేను రిటైర్ అవుతున్నాననే ఉద్దేశ్యంతో అలా మాట్లాడలేదు. ప్రస్తుతం నేను మిడిల్ ఏజ్లో ఉన్నాను. చివరి రోజుల్లో ఎలా ఉండాలనుకుంటున్నానో చెప్పాను అంతే' అని పేర్కొన్నాడు. చదవండి: 4కె ప్రింట్తో మళ్లీ రిలీజ్ చేస్తున్నారంటగా.. ఫ్యాన్స్ హ్యాపీనా.. -
యాక్షన్ కామెడీ మూవీ బుల్లెట్ ట్రెయిన్ రిలీజ్ ఎప్పుడంటే?
హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్ పిట్ నటించిన తాజా చిత్రం బుల్లెట్ ట్రెయిన్. యాక్షన్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా అమెరికాలో ఆగస్టు 5న రిలీజ్ కాబోతోంది. కానీ ఇండియాలో మాత్రం ఒకరోజు ముందుగానే అంటే ఆగస్టు 4కే థియేటర్లలో సందడి చేయనుంది. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. కాగా డెడ్పూల్ 2 డైరెక్టర్ డేవిడ్ లేచ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జోయ్ కింగ్, బ్రెయిన్ టైరీ హెన్రీ, ఆరన్ టేలర్ జాన్సన్, కరెన్ ఫుకుహార, లొగాన్ లెర్మన్ తదితరులు నటిస్తున్నారు. చదవండి: పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెన్సీపై విమర్శలు.. తొలిసారి స్పందించిన ఆలియా ట్రీట్మెంట్ ఫెయిల్, కాళ్లు, చేతులు మొద్దుబారుతున్నాయి: ఏడ్చిన నటి -
ఒక్క సినిమాకే వెయ్యి కోట్ల పారితోషికం!
సినిమాలో ఎవరి పారితోషికం ఎక్కువ అంటే హీరోలదే అన్న సమాధానం వస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే! అయితే రానురానూ షూటింగ్ బడ్జెట్ కంటే కూడా కథానాయకుల పారితోషికానికి పెట్టే బడ్జెటే ఎక్కువవుతూ వస్తోంది. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ హీరోలు రూ.40, 50, 100 కోట్ల వరకు తీసుకుంటున్నారు. అయితే హాలీవుడ్ హీరోలు మాత్రం ఓస్, వందేనా.. మేము వెయ్యి కోట్లు తీసుకుంటున్నాం. అయినా ఇది మాకు చాలా మామూలు విషయమని తేలికగా తీసిపారేస్తున్నారట. హాలీవుడ్లో ఏ హీరో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నాడనేదానిపై తాజాగా ఓ సర్వే లెక్కలు బయటకు వచ్చాయి. ఇందులో టామ్ క్రూయిజ్ దాదాపు రూ.800 కోట్ల(100 మిలియన్ డాలర్స్) చొప్పున తీసుకుంటున్నాడట! టాప్ గన్: మావెరిక్ సినిమాకు ఇంత మొత్తాన్నే వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు నిర్మాత కూడా టామ్ క్రూయిజే కావడంతో బోనస్గా అతడికి మరో రూ.180 కోట్ల దాకా వచ్చాయట. అంటే మొత్తంగా ఒక్క సినిమాకే ఈ స్టార్ హీరో దాదాపు వెయ్యి కోట్ల మేర వెనకేశాడన్నమాట. ఇక ఆస్కార్ అవార్డుల ఫంక్షన్లో హోస్ట్ క్రిస్ రాక్ చెంప చెల్లుమనిపించి సెన్సేషన్ అయిన విల్ స్మిత్ ఎమాన్సిపేషన్ మూవీకిగానూ రూ.280 కోట్లు (35 మిలియన్ డాలర్స్) అందుకున్నాడట. లినార్డో డికాప్రియో, బ్రాడ్ పిట్ ఇద్దరూ తాము నటిస్తున్న సినిమాకు రూ.240 కోట్లు(30 మిలియన్ డాలర్స్) అందుకున్నారట. డ్వేన్ జాన్సన్ రూ.180 కోట్లు (22.5 మిలియన్ డాలర్స్), క్రిస్ హేమ్స్వర్త్, డెంజెల్ వాషింగ్టన్, విన్ డీజిల్, జాక్విన్ ఫోనిక్స్, టామ్ హార్డీ, విల్ ఫెరల్, ర్యాన్ రెనాల్డ్స్ తలా రూ.160 కోట్లు (20 మిలియన్ డాలర్స్) వెనకేసుకుంటున్నారట. చదవండి: ప్రాణం కాపాడినవాన్నే అణచివేస్తే.. 'పరంపర 2' సిరీస్ రివ్యూ వేదం బ్యూటీ ఇలా అయిపోయిందేంటి? -
వెరైటీగా.. స్కర్టులో స్టార్ హీరో.. ఫోటోలు వైరల్
సినిమా ప్రమోషన్స్ కోసం హీరో, హీరోయిన్స్ రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. సినిమాను ఆడియెన్స్కు దగ్గర చేసేందుకు ఢిపరెంట్ కాన్సెప్ట్స్తో ప్రమోషన్స్ చేస్తుంటారు. హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్ పిట్ కూడా తన సినిమాను ప్రమోట్ చేసేందుకు వెరైటీ గెటప్లో దర్శనమిచ్చాడు. తన మోస్ట్ అవైటెడ్ మూవీ 'బుల్లెట్ ట్రైన్' త్వరలోనే రిలీజ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్తో మాంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్లో భాగంగా బెర్లిన్ ప్రీమియర్కు వచ్చిన బ్రాడ్ పిట్ లినెన్ స్కర్ట్తో కనిపించి అందరికి షాకిచ్చాడు. మ్యాచింగ్ బ్రౌన్ జాకెట్, పింక్ షర్ట్తో స్టైలిష్ గెటప్లో సందడి చేశాడు. అంతేకాకుండా ఈ గెటప్లో తన కాలిపై ఉన్న టాటూలతో మరింత స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు. ఒక కాలికి ఖడ్గమృగం, మరో కాలికి పుర్రె టూటూలతో బ్రాడ్ పిట్ స్పెషల్ లుక్లో కనిపించారు. ఇక ఈ ప్రీమియర్ షోకి జోయి కింగ్, ఆరోన్ టేలర్-జాన్సన్, బ్రియాన్ టైరీ హెన్రీతో సహా మిగిలిన తారాగణం సందడి చేసింది. -
తన మనసు నిండా విషమే: ఏంజెలీనాపై మాజీ భర్త సంచలన కామెంట్స్
మాజీ భార్య ఏంజెలీనా జోలీపై హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్ పిట్ సంచలన ఆరోపణలు చేశాడు. దంపతులుగా ఉన్నప్పుడు వీరిద్దరు కలిసి చేసిన వైన్ వ్యాపారాన్ని ఆమె నాశనం చేసి తనకు హానీ తలపెట్టే ప్రయత్నం చేస్తోందంటూ ఏంజెలీనాపై కోర్డులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ వ్యాపార సామ్రాజ్యంలో ఏంజెలీనా వాటా అమ్మకానికి సంబంధించి ప్రస్తుతం ఇద్దరి మధ్య నడుస్తున్న కేసులో భాగంగా బ్రాడ్ తాజాగా ఆరోపణలు చేశాడు. కాగా ఫ్రాన్స్ లోని దక్షిణ ప్రాంతంలో ఉన్న ఓ వైన్ యార్డ్తో పాటు షాటూ మిరావళ్ను 2008లో ఈ మాజీ దంపతులు కొనుగోలు చేశారు. చదవండి: భారీ భద్రత నడుమ హైదరాబాద్లో ల్యాండయిన సల్మాన్ 2014లో ఆ మిరావళ్ లోనే వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే, వివాహ బంధం నుంచి విడిపోయాక గత ఏడాది ఏంజెలీనా.. వ్యాపారంలోని తన వాటాను టెన్యూట్ డెల్ మోండో అనే సంస్థకు అమ్మేసింది. అయితే, దానిని బ్రాడ్ వ్యతిరేకించాడు. వ్యాపారాన్ని ఎవరికీ అమ్మబోమంటూ ఇద్దరం ఒప్పందం చేసుకున్నామని, కానీ, ఇప్పుడిలా అమ్మేయడం నమ్మకద్రోహమేనని పేర్కొంటూ కోర్టులో పిటిషన్ వేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ కేసుకు సంబంధించి మరిన్ని సంచలన ఆరోపణలు చేశాడు బ్రాడ్. మిరావళ్ తన కలల ప్రాజెక్టు అని, దానిని సక్సెస్ చేయడంలో ఏంజెలీనా పాత్రంటూ ఏమీ లేదని పిటిషన్లో ఆరోపించాడు. ప్రస్తుతం తన వైన్ బిజినెస్ కొన్ని వందల కోట్లకు ఎదిగిందని, ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన రోజ్ వైన్ తయారీదారుల్లో తన సంస్థ స్థానం సంపాదించిందని చెప్పాడు. కేవలం తన కృషి వల్లే అది సాధ్యమైందని, ఏంజెలీనా పాత్ర ఏమీ లేదన్నాడు. అయితే, విడాకుల అనంతరం తనకు తెలియకుండానే తన వాటాను వేరే సంస్థకు అమ్ముకోవడం దారుణమని బ్రాడ్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. చదవండి: ఇండియన్ రెస్టారెంట్లో జానీ డెప్ పార్టీ, రూ. 49 లక్షల బిల్లుతో షాకిచ్చాడు ఇక, ఏంజెలీనా జోలీ నుంచి వాటాను కొనుగోలు చేసిన టెన్యూట్ డెల్ మోండో సంస్థను రష్యాకు చెందిన యూరీ షెఫ్లర్ అనే వ్యాపారవేత్త పరోక్షంగా నడుపుతున్నాడని, ఇప్పుడు మిరావళ్ను చేజిక్కించుకునేందుకు రహస్య ఒప్పందం చేసుకున్నాడని ఆరోపించాడు. తెలియని కొత్త వ్యక్తితో తన వ్యాపార భాగస్వామిగా చేయాలని చూసిందన్నాడు. తన సంస్థ పేరు ప్రతిష్ఠలను మంటగలిపి తనకు హాని చేయాలని చూస్తోందని, తన మనసు నిండా విషమే ఉందని మాజీ భార్య ఏంజెలీనాపై బ్రాడ్ సంచలన కామెంట్స్ చేశాడు. -
వయసు 18.. శరీరం 144 ఏళ్లు! పోరాడి ఓడిన అమ్మాయి
పుట్టిన ప్రతీ ప్రాణికి ఏదో ఒకరోజు చావు తప్పదు. కానీ, ఆమె మాత్రం తన మరణం గురించి ముందే తెలుసుకుంది. అరుదైన జబ్బుతో బాధపడుతున్నా.. దుఖాన్ని దిగమింగుకుంది. సంతోషంగా ఉంటూ.. కన్నవాళ్లనూ, తోబుట్టువును నవ్వించేందుకు ప్రయత్నించింది. చివరికి బతుకు పోరాటంలో మృత్యువు ఒడిలోకి ఒదిగిపోయింది. యూకేకు చెందిన అశాంతి స్మిత్(18)గాథ ఇప్పుడు సోషల్ మీడియాతో కన్నీళ్లు పెట్టిస్తోంది. యూకే వెస్ట్ సస్సెక్స్కు చెందిన 18 ఏళ్ల అమ్మాయి Ashanti Smith.. జులై 17న కన్నుమూసింది. ఆమె ‘హట్చిసన్-గిల్ఫోర్డ్ ప్రోగేరియా’ అనే అరుదైన సిండ్రోమ్తో బాధపడుతూ వచ్చింది. ఇదొక జెనెటిక్ డిసీజ్. ఈ సిండ్రోమ్ ఉన్నవాళ్లకు చిన్నవయసులో వయసు మళ్లిన లక్షణాలు వస్తాయి. స్మిత్ ఎనిమిదవ ఏట నుంచి ఈ సిండ్రోమ్ తీవ్ర ప్రభావం చూపెడుతూ వస్తోంది. అప్పటి నుంచి ఏడాదికి.. ఎనిమిది రేట్ల వయసు పెరుగుతూ వస్తోంది. చివరికి.. పద్దెనిమిదేళ్ల వయసులో ‘పండు ముసలి’ లక్షణాలతో నరకం అనుభవిస్తూ ఆమె తుది శ్వాస విడిచింది. నవ్వుతూ బతకమంది అశాంటి స్మిత్.. బతికినంత కాలం ఆత్మస్థైర్యంతో బతికిందని ఆమె తల్లి లూయిస్ స్మిత్ గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనవుతోంది.‘తనకు ఉన్న జబ్బు గురించి అశాంటికి తెలుసు. ఎక్కువ కాలం జీవించదని కూడా తెలుసు. అయినా సంతోషంగా ఉండాలనుకుంది. అవతలి వాళ్లు తన గురించి ఏమనుకున్నా, జాలి పడినా.. అందరినీ నవ్విస్తూ బతికింది. మా కన్నీళ్లు తుడుస్తూ నవ్వుతూ ఉండాలని కోరేది. ఆమెకు బీటీఎస్ సంగీతం అంటే ఇష్టం. ఆమె అంత్యక్రియలు ఆ సంగీతంతోనే ముగిస్తాం. ఇక నుంచి ప్రొగెరియా సిండ్రోమ్తో బాధపడే చిన్నారుల చేయూత కోసం పని చేస్తాన’ని చెబుతోంది లూయిస్. ప్రొగేరియా అంటే.. డీఎన్ఏ సంబంధింత జబ్బు. రెండు కోట్ల మందిలో ఒకరు ఈ సిండ్రోమ్తో పుట్టే ఛాన్స్ ఉంది. 1886లో జోనాథన్ హట్చిన్సన్ అనే సైంటిస్టు ఈ సిండ్రోమ్ను గుర్తించాడు. ఆపై గిల్ఫోర్డ్ అనే సైంటిస్ట్ పూర్తి స్థాయి అధ్యయనం చేయడంతో.. ‘హట్చిసన్-గిల్ఫోర్డ్ ప్రొగేరియా’ అనే పేరు వచ్చింది. ఈ జబ్బుకు పూర్తిస్థాయి చికిత్స లేదు. వైద్యం కూడా చాలా ఖరీదుతో కూడుకుంది. అందుకే విరాళాల సేకరణతో పిల్లల్ని బతికించుకునే ప్రయత్నం చేస్తుంటారు తల్లిదండ్రులు. 2020 సెప్టెంబర్ నాటికి 53 దేశాల్లో.. 179 కేసులు రికార్డు అయినట్లు ప్రొగేరియా రీసెర్చ్ ఫౌండేషన్ చెబుతోంది. చాలామంది ఈ వ్యాధితో చనిపోగా.. కొన్ని కేసులు చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయాయి కూడా. లక్షణాలు ప్రొగేరియా ఒక జెనెటిక్ డిసీజ్.. డీఎన్ఏ విపరీతమైన మార్పుల వల్ల ఇలా జరుగుతుంది. ఈ డిసీజ్ వల్ల చర్మం మారుతుంది.. ముడుతలు పడుతుంది. జుట్టు ఊడిపోతుంది. వయసుకు సంబంధించిన ప్రతికూల లక్షణాలు శరీరంలో ఏర్పడతాయి. లక్షణాలు ఏడాది వయసు నుంచి కనిపించొచ్చు. లేదంటే ఆలస్యంగా బయటపడొచ్చు. జెనెటిక్ పరీక్షల ద్వారా మాత్రమే దీనిని నిర్ధారించుకోవచ్చు. ఈ డిసీజ్ గుండె జబ్బులకు దారితీస్తుంది, ఒక్కోసారి కదల్లేని స్టేజ్కు చేరుకుంటారు. పేషెంట్లలో 90 శాతం స్ట్రోక్స్తో చనిపోతుంటారు. బ్రాడ్ పిట్ నటించిన ‘ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్’(2008) ఇలాంటి సబ్జెక్ట్తో తీసిన కథే. అందుకే బెంజమిన్ బటన్ డిసీజ్ అని కూడా వ్యవహరిస్తుంటారు. ఈ మూవీకి ఇన్స్పిరేషన్.. అమెరికన్ శాన్ బెర్న్ జీవితం. 1996లో పుట్టిన శాన్బెర్న్.. ప్రొగేరియా పేషెంట్. అందుకే ఆ డిసీజ్ అవగాహన కోసం కృషి చేశాడు. చివరికి పద్దెనిమిదేళ్ల వయసులో యువ ఉద్యమవేత్తగా కన్నుమూశాడు. మరణానంతరం శాన్బెర్న్ పేరెంట్స్ ‘ప్రొగేరియా రీసెర్చ్ ఫౌండేషన్’ స్థాపించి.. ఆ వ్యాధి పట్ల అవగాహన కోసం కృషి చేస్తున్నారు. -సాక్షి, వెబ్డెస్క్ -
మాజీ భర్త చెంతకి ఎంజెలీనా జోలి.. విమర్శలు
న్యూయార్క్: హాలీవుడ్ నటి ఎంజెలీనా జోలి తీరుపై ఆమె అభిమానులే మండిపడుతున్నారు ఇప్పుడు. పిల్లల సంరక్షణ విషయంపై ఆమె భర్త బ్రాడ్ పిట్కి అనుకూలంగా ఈ మధ్య కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ ఉత్తర్వులు పట్టించుకోకుండా ఆమె పిల్లల్ని తీసుకుని న్యూయార్క్కు చెక్కేసింది. ఈ తరుణంలో బ్రాడ్ పిట్ తరుపు న్యాయవాది మరోసారి కోర్టును ఆశ్రయించాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే మొదటి నుంచి జోలి తన భర్త బ్రాడ్పిట్ పట్ల కర్కశంగా ప్రవర్తిస్తూ వస్తోంది. మీడియా మీట్లలో బ్రాడ్ పిట్ పట్ల నిర్లక్క్ష్య వైఖరి, విడాకుల పిటిషన్ వంకతో 9మిలియన్ డాలర్ల భరణం తీసుకోవడం, తాజాగా పిల్లల కస్టడీకి సంబంధించి డ్రామాతో ఆమె అభిమానులు విసిగిపోయారు. ఈ క్రమంలో బ్రాడ్ పిట్కు మద్ధతు పెరుగుతోంది. బర్త్ డే పార్టీ పేరుతో తండ్రికి పిల్లల్ని దూరంగా తీసుకెళ్లిన జోలిపై హాలీవుడ్ మీడియా వెబ్ సైట్లతో పాటు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మాజీ భర్త చెంతకి.. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలోనే కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. ఎంజెలీనా మాజీ భర్త జానీ లీ మిల్లర్(48)కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోందన్న కథనాలు వెలువడుతున్నాయి. బ్రిటిష్-అమెరికన్ యాక్టర్ జానీ లీ ప్రస్తుతం న్యూయార్క్లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. శుక్రవారం ఆ అపార్ట్మెంట్కు వెళ్లిన జోలి.. చాలాసేపు అక్కడే గడిపింది. దీంతో వీళ్లిద్దరూ మళ్లీ ఒక్కటి కాబోతున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఈ చేష్టలు పిట్ను రెచ్చగొట్టడానికేనేమోనని హాలీవుడ్ వర్గాల కథనం. కాగా, ఎంజెలీనా, జానీ ఇద్దరూ 1996 మార్చ్లో పెళ్లి చేసుకుని.. 18 నెలల తర్వాత విడిపోయారు. అయితే విడాకులు మాత్రం 1999లో తీసుకున్నారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో అమెరికన్ యాక్టర్ బిల్లీ బాబ్ను రెండో పెళ్లి చేసుకుని.. మూడేళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. ఇక ముచ్చటగా లాంగ్రిలేషన్ తర్వాత బ్రాడ్ పిట్ను 2014లో పెళ్లి చేసుకుని.. 2019లో విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది ఎంజెలీనా జోలి. చదవండి: బ్రాంజెలీనా విడిపోవడానికి కారణాలివే.. -
ఐదేళ్ల న్యాయపోరాటం.. ఎంజెలీనా జోలి ఓటమి
ఐదేళ్లుగా కొనసాగుతున్న న్యాయ పోరాటంలో హాలీవుడ్ నటి ఎంజెలీనా జోలి ఓడింది. బిడ్డల సంరక్షణ కోసం నటుడు, భర్త బ్రాడ్పిట్కి వ్యతిరేకంగా ఆమె న్యాయస్థానంలో పోరాడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంలో బ్రాడ్పిట్కి అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, 2016లో వ్యక్తిగత కారణాలతో భర్త బ్రాడ్ నుంచి విడాకులు కోరుతూ.. ఏంజెలీనా జోలి విడాకులకు కోర్టును ఆశ్రయించింది. అయితే అప్పటి నుంచి కేవలం పిల్లల సంరక్షణ గురించిన పిటిషన్తోనే కోర్టు వ్యవహారం నడుస్తోంది. దీంతో వీళ్లకు ఇప్పటి వరకు విడాకులు మంజూరు కాలేదు. ఇక కోర్టులో వాదప్రతివాదనల కోసం జాన్ అవుడర్కిరిక్ అనే ప్రైవేట్ జడ్జ్ను నియమించారు. 2014 వీళ్ల పెళ్లికి అధికారిక ముద్ర వేసింది కూడా జడ్జినే. ఈ జంటకు ఆరుగురు పిల్లలు. ఐదుగురు పిల్లల సంరక్షణను బ్రాడ్పిట్(57)తో కలిసి పంచుకోవాలని ఎంజెలీనా జోలిని జడ్జి ఆదేశించాడు. అయితే పెద్దవాడైన మాడోక్స్ కస్టడీ గురించి ఎటూ తేల్చలేదు. ఈ తీర్పుపై జోలి మండిపడింది. జడ్జి, బ్రాడ్పిట్కు అమ్ముడుపోయాడని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కోర్టు తీర్పుపై ఎంజెలీనా జోలి(45) రీ పిటిషన్ వెళ్లాలనుకుంటోంది. కొడుకు వయసున్న అమ్మాయితో.. : చదవండి ఇక 2005లో మిస్టర్ అండ్ మిస్సెస్ సినిమా ద్వారా దగ్గరైన ఈ జంట.. తర్వాత చాలా ఏళ్లు డేటింగ్ చేసింది. 2014లో పెళ్లి చేసుకోగా.. రెండేళ్లకే ఈ జంట విడాకులకు దరఖాస్తు చేసింది. 2019 ఏప్రిల్ నుంచి తాము విడిగా ఉంటున్నట్లు ప్రకటించుకుంది. అప్పటి నుంచి పిల్లల బాధ్యతను ఇద్దరూ చూసుకుంటున్నారు. అయితే విడాకుల తర్వాత పిల్లల బాధ్యత గురించే ముందుగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ క్లియర్ కావడంతో విడాకుల పిటిషన్కి లైన్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది. కాగా, వ్యక్తిగత సమస్యల వల్లే బ్రాడ్ పిట్తో తాను విడిపోతున్నట్లు ఎంజెలీనా ప్రకటించినా.. బ్రాడ్పిట్ ఎఫైర్లే అందుకు కారణాలని హాలీవుడ్ కథనాలు చెప్తున్నాయి. -
నా భర్త వేధించాడు, పిల్లలే సాక్ష్యం: ప్రముఖ నటి
లాస్ఎంజిల్స్: ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలినా జోలి తన భర్త బ్రాడ్ పిట్ నుంచి విడాకులు కోరుతూ 2016 కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరి విడాకుల కేసుపై కోర్టులో విచారణ జరుగుతునే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎంజెలినా కోర్టులో భర్త పిట్పై గృహ హింస కేసు పెడుతూ పిటిషన్ దాఖలు చేసింది. పిట్ తనను వేధించాడని చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయని, తన పిల్లలే ఇందుకు సాక్ష్యం అని ఆమె పేర్కొంది. వారు కోర్టుకు వచ్చి సాక్ష్యం ఇచ్చేందుకు కూడా సిద్దంగా ఉన్నారని ఆమె పటిషన్లో స్పష్టం చేసింది. కాగా 2004లో వచ్చిన ‘మిస్టర్ అండ్ మెసెస్ స్మిత్’ మూవీ సమయంలో ఎంజెలినా-బ్రాడ్ పట్లు ప్రేమలో పడ్డారు. పదేళ్ల సహజీవనం అనంతరం వీరిద్దరూ 2014లో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైయిన రెండేళ్లకే విడిపోయిన బ్రాడ్, ఎంజెలినాలు అప్పటి నుంచి కోర్టు వేదికగా కొట్లాడుకుంటున్నారు. ఇప్పటికి వీరికి విడాకులు రాలేదు. కానీ 2019లో నుంచి వీరిద్దరూ విడిగానే జీవిస్తున్నారు. అయితే వారి ఆరుగురి పిల్లల బాధ్యతను జాయింట్ కస్టడిలో ఉంచాలని వీరిద్దరూ డిమాండ్ చేస్తున్నారు. చదవండి: ఏంజెలినా విడాకుల కేసు: ఆ లాయర్ను తొలగించండి రంగ్దే ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా! -
అయామ్ సో లక్కీ: ఏంజెలీనా జోలీ
ఏంజెలీనా జోలీకి పిల్లలంటే ప్రాణం. భర్త బ్రాడ్ పిట్ పిల్లల్ని చిన్న మాట అన్నాడని అతడికి విడాకులు ఇచ్చేశారు. జోలీకి ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. ఈ ఆరుగురిలో ముగ్గురు కడుపున పుట్టిన వారు. ముగ్గురు కడుపుకు కట్టుకున్నవారు (అడాప్టెడ్). మాడెక్స్–19 కొ, పాక్స్–16 కొ, జహారా–15 కూ.. దత్తత తెచ్చుకున్నవాళ్లు. షిలా–14 కూ, నాక్స్–12 కొ, వివియన్–12 కూ.. జోలీకి, బ్రాడ్ కీ పుట్టిన వాళ్లు. ఈ చివరి ఇద్దరు కవలలు. ఈ తల్లీబిడ్డలు ఇప్పుడు లాస్ ఏంజెలిస్లోని తమ సొంత లాస్ ఫెలిజ్ భవంతిలో క్వారెంటైన్లో ఉంటున్నారు. మాడెక్స్ ఐదు నెలల క్రితమే దక్షిణ కొరియా నుంచి అమెరికా వచ్చేశాడు. అక్కడి యాన్సీ యూనివర్సిటీలో అతడు బయోకెమిస్ట్రీ స్టూడెంట్. ఇప్పుడిక ఆన్లైన్ లోనే చదువు కొనసాగుతోంది. (ఏంజెలినా విడాకుల కేసు: ఆ లాయర్ను తొలగించండి) మిగతా ఐదుగురివీ యూఎస్ చదువులే కనుక అంతా ఒకదేశంలో ఒకేచోట ఉన్నారు. ‘అయామ్ సో లక్కీ..’ అంటారు జోలీ తన పిల్ల సైన్యాన్ని చూసుకుని. తల్లికి అస్సలు పని పెట్టరట. చిన్న పిల్లల్ని పెద్దపిల్లలు కాసుకుని ఉంటారట. ఆగస్టు 21న జోలీ కొత్త సినిమా ‘ది వన్ అండ్ ఓన్లీ ఇవాన్’ విడుదలైంది. ఆ ప్రమోషన్ ఈవెంట్లో ఆమె ఇంటి విశేషాలు బయటికి వచ్చాయి. ఇల్లంటే జోలీకి పిల్లలే. 45 ఏళ్ల జోలీ.. పెద్ద కొడుకు మాడెక్స్ ని కంబోడియా నుంచి, రెండో కొడుకు పాక్స్ని వియత్నాం నుంచి, పెద్ద కూతురు జహారాను ఇథియోపియా నుంచి దత్తతు తెచ్చుకున్నారు. ‘ది వన్ అండ్ ఓన్లీ ఇవాన్’ కూడా పిల్లల సినిమానే. యానిమేటెడ్. అందులో ఒక పాత్రకు వాయిస్ ఇచ్చారు ఏంజెలీనా జోలీ. చదవండి: (అవుట్సైడర్స్కి ప్లస్ అదే!) -
ఆస్కార్ 2020 అవార్డుల ప్రదానోత్సవం
-
ఆస్కార్ 2020 విజేతలు వీరే
లాస్ఏంజెల్స్ : 92వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ఏంజెల్స్లో సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. డాల్బీ థియేటర్లో జరుగుతున్న ఈ వేడకకు ప్రముఖ హాలీవుడ్ తారాగణమంతా హాజరై సందడి చేసింది. జోకర్ సినిమా హీరో జోక్విన్ ఫినిక్స్ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ చిత్రంలో బ్రాడ్ పిట్ నటననకు ఉత్తమ సహాయ నటుడు అవార్డు దక్కింది. బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ఫిల్మ్గా టాయ్స్టోరీ నిలిచింది. ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్గా టాయ్స్టోరీ-4, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే బాంగ్ జాన్ హో (పారాసైట్), బెస్ట్ లైవ్యాక్షన్ షార్ట్ ఫిల్మ్గా ద నైబర్స్ విండో నిలువగా, ఉత్తమ స్క్రీన్ప్లే తైకా వెయిటిటి(జోజో రాబిట్) కు దక్కింది. ఉత్తమ చిత్రం : పారాసైట్ ఉత్తమ నటుడు : జోక్విన్ ఫీనిక్స్(జోకర్) ఉత్తమ నటి : రెంజి జెల్వెగర్ (జూడి) ఉత్తమ సహాయ నటుడు : బ్రాడ్పిట్ ( వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్) ఉత్తమ సహాయక నటి : లారా డెర్న్ (మ్యారేజ్ స్టోరీ) ఉత్తమ దర్శకుడు : బాంగ్ జోన్-హో(పారసైట్) ఉత్తమ సంగీతం : జోకర్ (హిల్దార్) బెస్ట్ మ్యూజిక్ ఒరిజనల్ సాంగ్ : ఐయామ్ గోన్నా.. లవ్ మీ ఎగేన్ (రాకెట్ మ్యాన్) ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ : పారాసైట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ : బాంబ్ షెల్ ఉత్తమ డాక్యుమెంటర్ షార్ట్ ఫీచర్ : అమెరికర్ ఫ్యాక్టరీ బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ప్లే : టైకా వైటిటి( జోగో ర్యాబిట్) బెస్ట్ యానిమేటేడ్ ఫీచర్: టాయ్ స్టోరీ 4 బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ : అమెరికన్ ఫ్యాక్టరీ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్: ది నైబర్స్ విండో ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ప్లే : బాంగ్ జూన్ హో( పారాసైట్) బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ : లెర్నింగ్ టూ స్కేట్బోర్డ్ ఇన్ ఏ వార్ జోన్ ( ఇఫ్ యుఆర్ ఏ గర్ల్) బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ : హెయిర్ లవ్ బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ : ఫోర్డ్ వి ఫెరారీ బెస్ట్ సౌండ్ మిక్సింగ్ : 1917 ఉత్తమ సినిమాటోగ్రఫీ : 1917 ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ : 1917 బెస్ట్ సౌండ్ ఎడిటింగ్ : ఫోర్డ్ వి ఫెరారీ ఉత్తమ ప్రొడెక్షన్ డిజైన్ : వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ : ది నైబర్స్ విండో (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విడాకులపై స్పందించిన ప్రముఖ నటి
హాలీవుడ్లోనే అత్యంత బలమైన అనుబంధమున్న జంటగా గుర్తింపు పొందిన బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీలు తమ వైవాహిక జీవితానికి స్వస్థి పలికిన సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్ల పాటు సహజీవనం చేసిన ఈ జంట.. 2014లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత వారి మధ్య విబేధాలు పొడ చూపడంతో.. 2016లో వివాహబంధానికి ముగింపు పలికారు. ఈ నేపథ్యంలో తాజాగా ఏంజెలినా జోలీ విడాకుల వల్ల తాను ఎంత ఒత్తిడికి గురయ్యారో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘బ్రాడ్ పిట్ నుంచి విడాకులు పొందిన తర్వాత నేను చాలా తీవ్ర దుఖాన్ని అనుభవించాను. నా తలరాతలో ఏం రాసిపెట్టి ఉందో నాకు తెలియదు కానీ.. నేను పరివర్తన కాలంలో ఉన్నట్లు మాత్రం నాకు అర్థం అయ్యింది. మనిషి తన మూలాలను వెతుక్కుంటు వెళ్లినట్లు నేను.. నా అంతరంగం లోనికి ప్రయాణించడం ప్రారంభించాను’ అన్నారు జోలీ. అంతేకాక ‘పిట్తో నా బంధం ముగింపుకు వచ్చిందని నాకు అర్థం అయ్యింది. ఆ సమయంలో నాలో కొంత భాగాన్ని కోల్పోయినట్లు నాకు అనిపించింది. ఆ క్షణం నుంచి మేం విడిపోవడం ప్రారంభించాము. అది నాకు చాలా క్లిష్టమైన సమయం. జీవితంలో నేను ఎక్కడ ఉన్నది నాకు తెలియలేదు. ఆ సమయంలో నేను చాలా తీవ్రమైన, నిజమైన బాధను అనుభవించాను. అయితే ఈ బాధ నాకు చాలా మేలు చేసింది. ప్రతి మనిషి జీవితం ముగింపుకు వచ్చే సరికే మిగిలేది వినయం మాత్రమే అని తెలిసివచ్చింది. అదే నన్ను, నా జీవితంతో మళ్లీ ముడివేసింది’ అని తెలిపారు. ప్రస్తుతం జోలీ, డిస్నీ సంస్థ నిర్మిస్తున్న ‘మేలిఫిసెంట్: మిస్ట్రెస్ ఆఫ్ ఈవిల్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. 2014లో వచ్చిన ‘మేలిఫిసెంట్’ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ నెల 18న ఇండియాలో విడుదల కానుంది. -
విక్రమ్ కనిపించిందా?
లాస్ఏంజెలిస్: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్–2 కు చెందిన విక్రమ్ ల్యాండర్ కనిపించిందా అని ప్రముఖ హాలీవుడ్ నటుడు బ్రాడ్పిట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) లోని వ్యోమగామిని ప్రశ్నించాడు. కనిపెట్టలేకపోయామని సదరు వ్యోమగామి సమాధానమిచ్చాడు. తన కొత్త చిత్రం ‘ఆడ్ ఆస్ట్రా’ ప్రమోషన్లలో భాగంగా బ్రాడ్పిట్ ఐఎస్ఎస్లోని నాసా వ్యోమగామి నిక్ హేగ్తో సంభాషించాడు. ఆడ్ ఆస్ట్రా చిత్రంలో బ్రాడ్పిట్ వ్యోమగామిగా నటించాడు.20 నిమిషాలపాటు సాగిన ఈ సంభాషణను సోమవారం నాసాటీవీ ప్రసారం చేసింది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగాల్సిన రోజు తాను నాసా కేంద్రంలోని జెట్ ప్రొపల్షన్ ల్యాబ్లో ఉన్నానని, అప్పుడు ఇస్రోకు నాసా సహ కారమందించడాన్ని గమనించానని తెలిపాడు. -
విక్రమ్ కనిపించిందా!?
వాషింగ్టన్: హాలీవుడ్ నటుడు బ్రాడ్పిట్ సోమవారం అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసాలో సందడి చేశారు. పిట్ నటించిన యాడ్ ఆస్టా చిత్రం త్వరలోనే విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నాసాలో సందడి చేశారు పిట్. ఈ సందర్భంగా ఇంటర్నెషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)లో ఉన్న ఆస్ట్రోనాట్ నిక్ హెగ్యూకు వీడియో కాల్ చేసి సంభాషించారు పిట్. దాదాపు 20 నిమిషాల పాటు సాగిన వీరి సంభాషణలో పలు ఆసక్తికర అంశాల గురించి చర్చించారు. దానిలో భాగంగా బ్రాడ్ పిట్ ‘భారత్ చంద్రుడి మీద ప్రయోగాల కోసం ఉద్దేశించిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీని కనిపెట్టారా’ అని నిక్ని అడిగాడు. అందుకు అతడు దురదృష్టవశాత్తు ఇంకా లేదు అని బదులిచ్చాడు. ఆ తర్వాత బ్రాడ్ పిట్, స్పేస్ స్టేషన్లో సైంటిస్ట్ జీవితం, వారి మీద గురుత్వాకర్షణ శక్తి ప్రభావం ఎలా ఉంటుంది అనే అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. LIVE NOW: There's an incoming call … from space! 👨🚀 @AstroHague is talking to #AdAstra actor Brad Pitt about what it’s like to live and work aboard the @Space_Station. Watch: https://t.co/yQzjEx1tr8 — NASA (@NASA) September 16, 2019 దాదాపు 20 నిమిషాల పాటు సాగిన ఈ వీడియో సంభాషణను నాసా టీవీలో ప్రసారం చేశారు. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ఆఖరి నిమిషంలో విఫలమైన సంగతి తెలిసిందే. విక్రమ్ ల్యాండర్తో కమ్యూనికేషన్ పునరుద్ధరణ కోసం ప్రస్తుతం ఇస్రో, నాసాతో కలిసి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. -
మాజీ భార్య ఆరోపణలపై హీరో ఆవేదన
హాలీవుడ్లో లాంగ్ రిలేషన్షిప్ కొనసాగించిన జంట ‘బ్రాంజెలీనా’(బ్రాడ్ పిట్+ఏంజెలినా జోలీ).. అనూహ్య కారణాలతో విడిపోయిన విషయం విదితమే. ఆ కారణాల వెనుక రకరకాల ఊహాగానాలు వినిపించినప్పటికీ.. అసలు కారణంపై మాత్రం ఇద్దరిలో ఎవరూ స్పష్టత ఇవ్వలేదు. ఇదిలా ఉంటే పిల్లల పోషణార్థం బ్రాడ్ పిట్ తమకు ఇంత వరకు నయా పైసా చెల్లించలేదని ఏంజెలీనా జోలీ ఓ పిటిషన్ దాఖలు చేయగా.. బ్రాడ్ పిట్ స్పందించాడు. ‘ఆమె చేసే ఆరోపణల్లో నిజం కాదు. విడాకుల పిటిషన్ సమయంలోనే ఆమె 9 మిలియన్ డాలర్ల దాకా భరణం చెల్లించాను. కేవలం నాపేరును చెడగొట్టేందుకే ఇప్పుడు ఈ ఆరోపణలు. మీడియా దృష్టిని తనవైపు తిప్పుకునేందుకే ఆమె ఇలా చేస్తోంది ’ అని బ్రాడ్ పిట్ తన లాయర్ ద్వారా ఓ ప్రకటన ఇప్పించాడు. ఇదిలా ఉంటే పిట్ ప్రకటనపై ఏంజెలీనా ఇంకా స్పందించలేదు. మిస్టర్ అండ్ మిస్ స్మిత్ చిత్ర షూటింగ్లో మొదలైన వీళ్ల ప్రేమ.. 9 ఏళ్లపాటు సహజీవనంగానే సాగింది. 2014లో వీళ్లు వివాహం తీసుకోగా.. రెండేళ్ల తర్వాత(2016లో) విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ జంటకు మొత్తం ఆరుగురు పిల్లలు(దత్తత) ఉండగా.. ప్రస్తుతం వాళ్లంతా తల్లి సంరక్షణలోనే ఉన్నారు. ఇదిలా ఉంటే పిల్లలను జాయింట్ కేరింగ్కు అప్పగించాలని ‘పిట్’ ఓ పిటిషన్ కూడా దాఖలు చేయటం గమనార్హం. కొడుకు వయసున్న అమ్మాయితో... -
ప్రేమా? రుగ్మతా?
హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీకి ఆరుగురు పిల్లలున్నారు. అందులో ముగ్గురు దత్త పుత్రులు కాగా మరో ముగ్గురు బ్రాడ్ పిట్, ఏంజెలినా దంపతులకు జన్మించినవారు. ఇప్పుడు మరో బాబు లేదా పాపను దత్తత తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట ఏంజెలినా. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏంజెలినాకు పిల్లలంటే ఎంత ఇష్టమో. బ్రాడ్పిట్తో విడాకుల తర్వాత పిల్లల సంరక్షణ, తండ్రితో ఎక్కువ సమయం గడపనివ్వడం లేదని కేస్ విషయమై ప్రస్తుతం ఈ మాజీ భార్యా భర్తలు కోర్ట్ చుట్టూ తిరుగుతున్నారు. ఏంజెలినా నటించిన తాజా చిత్రం ‘మాలిఫిసెంట్ 2’. ఈ సినిమా ప్రమోషన్స్ తర్వాత దత్తత తీసుకోవాలనుకుంటున్నారట. ఏంజెలినాకు పిల్లలంటే భలే ఇష్టమని కొందరు, ‘ఎమ్టీనెస్ట్ సిండ్రోమ్’తో (జీవితంలో ఏదో వెలితి ఉందనే రుగ్మత) బాధపడటం వల్లే ఇలా చేస్తున్నారని మరికొందరు భావిస్తున్నారు. పిల్లలు పెద్ద వాళ్లు అవ్వడంతో తన అవసరం ఇంక ఉండకపోవచ్చని భావించడం ఆ సిండ్రోమ్ లక్షణాలట. మరి ఏంజెలినాది ప్రేమా? సిండ్రోమా? ఏదైతేనేం.. ఆమె దత్తత తీసుకునే బిడ్డ లక్కీ అని చెప్పాలి. మంచి జీవితం దొరుకుతుంది కదా. అన్నట్లు.. ఏంజెలినా తన కడుపున పుట్టిన బిడ్డలకు సమానంగా దత్తత తీసుకున్నవారిని కూడా చూస్తారట. కంటేనే అమ్మ అని అంటే.. ఎలా? కడుపు తీపి తెలిసిన ప్రతి తల్లీ తల్లే అనాలి. ఏంజెలినా.. ఓ మంచి మదర్ అని హాలీవుడ్ వారు అంటారు. -
అప్పట్లో ఒకడుండేవాడు
ఏదైనా కథ చెప్పాలంటే అనగనగా లేదా అప్పట్లో ఒకడుండేవాడు అని మొదలుపెడతాం. హాలీవుడ్ డైరెక్టర్ క్వెంటిన్ టరంటినో కూడా తన లేటెస్ట్ కథను ఇలానే చెప్పబోతున్నారు. బ్రాడ్ పిట్, ఆల్ పాచినో, లియోనార్డో డికాప్రియో ముఖ్య తారలుగా దర్శకుడు క్వెంటిన్ రూపొందించనున్న చిత్రం ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్’. 1969 కాలంలో ఫేడవుట్ అయిపోయిన టీవీ సిరీస్ యాక్టర్, అతని బాడీ డబుల్ సర్వైవ్ అవ్వడానికి పడ్డ స్ట్రగుల్ ఏంటో ఈ సినిమాలో చూపించదలిచారట క్వెంటిన్. ఫేడవుట్ అయిన హీరోగా బ్రాడ్ పిట్, బాడీ డబుల్ క్యారెక్టర్లో లియొనార్డో డీ కాప్రియో నటించనున్నారు. 2019లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. రక్తం ధారలై ప్రవహించకపోతే రుచించని క్వెంటిన్ ఒక ఫెయిల్డ్ యాక్టర్ జీవితాన్ని ఎలా చూపిస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆయన ఫ్యాన్స్. -
సీన్ రివర్స్
జస్టిన్ థారోస్తో జెన్నిఫర్ ఆనిస్టన్ లాస్ట్ మంత్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. మరోపక్క జెన్నిఫర్ ఫస్ట్ హస్బెండ్ బ్రాడ్ పిట్.. ఆంజెలీనా జోలీతో 2016లో డైవర్స్ తీసుకొని సింగిల్గా ఉంటున్నారు. థారోస్తో డైవర్స్ తర్వాత జెన్నిఫర్, ఆంజెలినాతో విడాకులు తర్వాత బ్రాడ్ పిట్.. ఇద్దరూ సింగిల్గానే ఉన్నారు, మళ్లీ కలిస్తే బావుండు అని ‘పిట్, జెన్నిఫర్’ అభిమానులు కోరుకున్నారు. కానీ సీను రివర్స్ అయింది. జెన్నిఫర్ సింగిల్గానే ఉన్నారు, కానీ బ్రాడ్ పిట్టే మరో అమ్మాయితో మింగిల్ అవుతున్నారట. ఎమ్ఐటీ ప్రొఫెసర్ నెరీ ఓక్స్మెన్తో బ్రాడ్ పిట్ డేట్ చేస్తున్నారని హాలీవుడ్లో హాట్ టాపిక్. ఆర్ట్, ఆర్కిటెక్చర్ డిజైన్లో నెరీ ఓక్స్మెన్ రాక్స్టార్ అని చెప్పవచ్చు. ఎమ్ఐటీలో నెరీ గీసిన ఓ త్రీడీ పెయింటింగ్ చూసి ఫ్లాట్ అయ్యారట బ్రాడ్ పిట్. అప్పటినుంచి ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారన్నది హాలీవుడ్ ఓపెన్ సీక్రెట్. సో జెన్నీఫర్, పిట్ మళ్లీ కలుస్తారనుకున్న అభిమానుల కోరిక నేరవేరనట్టే. -
కుర్రాడు కావాలి!
జెన్నిఫర్ ఆనిస్టన్ ఈ మధ్యే భర్త జస్టిన్ థెరోకు విడాకులు ఇచ్చి ఫ్రీ బర్డ్ అయింది. అంతకుముందు బ్రాడ్పిట్తోనూ ఆమె పెళ్లి నిలవలేదు. ఇప్పుడు రెండో పెళ్లీ బ్రేక్ చేసి, ఫ్రీ బర్డ్ అయ్యాక ఆమె ఒక వింత కోరిక బయటపెట్టింది. అదేమిటంటే.. కుర్రాడితో ప్రేమలో పడాలని. తన వయసున్న వారితో ప్రేమ, పెళ్లి బోర్ కొట్టిందట జెన్నిఫర్కు. ఇప్పుడిప్పుడే ముప్పైల్లోకి అడుగుపెడుతున్న, పాతికేళ్లు దాటిన కుర్రాళ్లైతే పూర్తిగా డిపెండ్ అవ్వరనీ, వారితో సరదాగా ప్రేమలో పడి లైఫ్ను కొన్నాళ్లు ఎంజాయ్ చెయ్యాలనుకుంటున్నట్లు జెన్నిఫర్ చెప్పింది. ఈ వయసు కుర్రాళ్లతో అయితే పూర్తిగా కమిట్ అవ్వాల్సిన అవసరం లేదని, వాళ్లైతే కొత్తగా ఆలోచిస్తారని, నాన్సెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుందని జెన్నిఫర్ ఆలోచన. జెన్నిఫర్ వయసు ఇప్పుడు 49 ఏళ్లు. మరి ఆమె కోరిక ఎలా నెరవేరుతుందో చూడాలి!! -
చచ్చినా మళ్లీ ప్రేమలో పడను!
ఏంజెలినా జోలికి ఇప్పుడు 42 ఏళ్లు. రెండు దశాబ్దాల క్రితం హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత ఎనర్జిటిక్గా నటించిందో ఇప్పటికీ అదే ఎనర్జీ. ఇప్పుడింక ఆమెకు ఆరుగురు పిల్లలు. భర్తతో విడిపోయి, ఆ పిల్లలందరినీ తనే పెంచుతోంది. అయినా తనపై ఉన్న ఒత్తిడి సినిమాల్లో కనిపించనివ్వదు. అదెలా సాధ్యమని అడిగితే నవ్వి ఊరుకుంటుంది కానీ, పెద్ద సంఘర్షణే జరుగుతూ ఉండాలి ఆమెలో, ప్రతిరోజూ. అందుకేనేమో భర్త బ్రాడ్పిట్తో 2016లో విడిపోయాక పిల్లలే ప్రాణంగా గడిపేస్తోన్న ఏంజెలినా, మళ్లీ ప్రేమలో పడతారా? అని అడిగితే, అలాంటివి అస్సలు చెయ్యను. ‘‘మళ్లీ చచ్చినా ప్రేమలో పడను’’ అని చెప్పేస్తోంది. ఎందుకు? అని అడిగితే పిల్లలకు తన అవసరం ఉందని, వాళ్లను పెంచాల్సిన బాధ్యత తనపై ఉందని చెబుతోంది. మరోపక్క ఆమె భర్త బ్రాడ్పిట్ మాత్రం ఏంజెలినాతో విడిపోయాక వరుసగా ప్రేమలో పడిపోతూనే ఉన్నాడు. అయితే అవేవీ సీరియస్ ప్రేమలు కావట. ఏంజెలినా మాత్రం అదెలాంటి ప్రేమైనా ఆ జోలికి మాత్రం పోనని గట్టిగా చెప్పేస్తోంది. -
ఏంజెలినా దగ్గర డబ్బుల్లేవా?
ఏంజెలినా జోలి.. హాలీవుడ్లో స్టార్లకే స్టార్, సూపర్స్టార్! ఆరుగురు పిల్లలకు తల్లి. బ్రాడ్పిట్కు విడాకులిచ్చి, సంవత్సర కాలంగా పిల్లలను తానే పెంచుతోన్న ఏంజెలినా, క్రిస్మస్ కోసం పెద్ద ఎత్తునే ఏర్పాట్లు చేసుకుంటోంది. పిల్లలందరికీ బెస్ట్ టైమ్ క్రిస్మస్ కావడంతో వాళ్లను సంతోషపెట్టేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోందట. అయితే ఇంతవరకూ బాగానే ఉంది కానీ, ఇలా పిల్లలకు క్రిస్మస్ గిఫ్ట్లు ఇవ్వాలన్న ప్రయత్నంలో ఏంజెలినా జోలి డబ్బుల్లేక బాధపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మిలియన్ల డాలర్ల డబ్బులున్న ఏంజెలినా పిల్లలకు గిఫ్ట్లు కొనడానికి డబ్బుల్లేక బాధపడుతుందా? అని ఎవరన్నా అంటే.. అందుకు ఆమె ‘టార్గెట్’ స్టోర్లో కనిపించడాన్ని చూపిస్తూ తమ వాదనను సమర్థించుకుంటున్నారు కొందరు. అమెరికాలో డిస్కౌంట్లో బట్టలు అమ్మే పెద్ద స్టోర్ టార్గెట్. ఏంజెలినా దగ్గర డబ్బులే ఉంటే టార్గెట్లో, డిస్కౌంట్లో షాపింగ్ ఎందుకు చేయాలి? అన్న వాదనలు కొన్ని వచ్చాయి. ఇందులో నిజం లేదని ఇంకొందరు అంటారు. టార్గెట్ ఏంజెలినాకు ఫేవరెట్ ప్లేస్ అని, అలా అక్కడికి వెళ్లి ఉండొచ్చని వీరంటారు. కాదు.. కాదు బ్రాడ్పిట్తో ఆస్తి గొడవ ఇంకా తేలక ఏంజెలినా డబ్బుల్లేక కష్టాల్లో ఉన్నారని వారంటారు. ఎవరేమన్నా ఏంజెలినా దగ్గర డబ్బుల్లేవంటే ఎవ్వరూ నమ్మరని సగటు సినీ అభిమాని అంటాడు. చివరిదే నిజమై ఉండొచ్చు!! -
లైంగిక వేధింపులు.. హీరో వార్నింగ్
సాక్షి, సినిమా : హాలీవుడ్ను కుదిపేసిన హర్వే వెయిన్స్టెయిన్ ఉదంతంలో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. తన గర్ల్ ఫ్రెండ్పై సైతం లైంగిక వేధింపులకు పాల్పడటంతో సహించలేని బ్రాడ్ పిట్ ఆ సమయంలో హర్వేకు సాలిడ్ వార్నింగ్ ఇచ్చాడంట. ఈ విషయాన్ని నటి, పిట్ మాజీ ప్రేయసి గ్వైనెత్ పాల్ట్రో వెల్లడించారు. గ్వైనెత్ హర్వే ప్రొడక్షన్ హౌజ్లో షేక్స్ పియర్ ఇన్ లవ్ అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రంలో నటనకుగానూ ఆమెకు అకాడమీ అవార్డు కూడా దక్కింది. ఆ సమయంలో హర్వే ఆమెపై వేధింపులకు పాల్పడ్డాడంట. ఈ విషయాన్ని ఆమె తన ప్రియుడు అయిన బ్రాడ్ దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే ఆగ్రహానికి గురైన బ్రాడ్ ఓ పార్టీలో వెయిన్స్టెన్కు గట్టి వార్నింగే ఇచ్చాడంట. ఇంకోసారి ఇది రిపీట్ అయితే పరిణామాలు దారుణంగా ఉంటాయని చెప్పాంట. తనని ప్రాజెక్టు నుంచి తప్పించకపోయినప్పటికీ.. కోపాన్ని మాత్రం హర్వే మరోలా ప్రదర్శించాడని ఆమె పేర్కొంది. ఈ ఘటనను పాలట్రో న్యూయార్క్ టైమ్స్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ‘‘ఆ సమయంలో బ్రాడ్ పిట్ కెరీర్ ఇంకా ప్రారంభదశలోనే ఉంది. ఏకంగా హర్వేతోనే పెట్టుకోవటంతో అతని కెరీర్ నాశనం అవుతుందని భయపడ్డాను. కానీ, ఆ ప్రభావం పిట్ పై పడలేదు. పైగా వార్దిదరూ కలిసి ఓ చిత్రం కూడా చేయటం నాకు ఆశ్చర్యం కలిగించింది అని ఆమె తెలిపారు. కాగా, హాలీవుడ్ మూవీ మొఘల్ పై ఇప్పటిదాకా 80 మంది నటీమణులు ఆరోపణలు చేయగా.. అందులో స్టార్ నటి, బ్రాడ్ పిట్ మాజీ భార్య ఏంజెలీనా జోలీ కూడా ఉండటం గమనార్హం. బ్రాడ్ పిట్తో గ్వైనెత్ పాల్ట్రో పాత ఫోటో -
ఆమెతో డేటింగ్ చేస్తున్నాడు..!
హాలీవుడ్ నటుడు బ్రాడ్పిట్ మాజీ భార్య ఏంజెలినా జోలీకి దూరంగా ఉంటున్నాడు. జోలీతో విడాకులు అనంతరం ఆయన పలువురితో డేటింగ్ చేసినట్టు కథనాలు వచ్చాయి. హాలీవుడ్లో చక్కర్లు కొడుతున్న తాజా కథనం ప్రకారం బ్రాడ్.. ప్రముఖ నటి ఎల్లా పుర్నెల్తో ప్రేమలో మునిగిపోవాలని తపిస్తున్నాడట. అందుకు కారణం.. పుర్నెల్ అచ్చం ఏంజెలినా జోలీలాగే ఉండటమే.. 2014లో వచ్చిన 'మేల్ఫిసెంట్' సినిమాలో జోలీ చిన్నప్పటి పాత్రలో తను నటించింది. 21 ఏళ్ల ఎల్లా తాజాగా 'మిస్ పెరెగ్రిన్స్ హోమ్ ఫర్ పెక్యూలియర్ చిల్డ్రన్' సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఆమె నటన చూసి ఉప్పొంగిపోయిన పిట్.. ఆమెతో కలిసి పనిచేసేందుకు సిద్ధం అంటూ ఆఫర్ ఇచ్చాడు. బ్రాడ్ సొంత ప్రొడక్షన్ ప్లాన్ బీ నిర్మించనున్న 'స్వీట్ బిట్టర్'లో ఈ ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు. అప్పటినుంచి 53 ఏళ్ల బ్రాడ్ పిట్-21 ఏళ్ల ఎల్లా మధ్య అనుబంధం చిగిరిస్తోందని హాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 'బ్రాడ్, ఎల్లా మధ్య అనుబంధం ఇప్పుడిప్పుడే మొదలవుతున్నది. ఆమెను ఈ సినిమాలో తీసుకోవడానికి బ్రాడ్ ఎంతో దూరం వెళ్లాడు. తన పట్ల బ్రాడ్ చూపుతున్న అభిమానం, ప్రత్యేక ఆకర్షణ ఎల్లాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బ్రాడ్ ఎప్పుడు తన నంబర్ వన్ సెలబ్రిటీ క్రష్ అని ఎల్లా స్నేహితులతో చెప్తోంది' అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే, బ్రాడ్-ఎల్లా సన్నిహితంగా ముందుకు సాగుతుండటం మాజీ భార్య ఏంజెలినాకు ఏమాత్రం నచ్చడం లేదట. ఓ సినిమాలో తన చిన్నప్పటి పాత్ర పోషించిన అమ్మాయితో బ్రాడ్ సాన్నిహిత్యం నెరపడంపై ఆమె మండిపడుతున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. తమ కొడుకు మడోక్స్(16)కు కేవలం ఐదేళ్లు ఎక్కువ వయస్సున్న అమ్మాయితో అతను డేటింగ్ చేస్తుండటం.. పెద్ద తప్పు అని, వయస్సు వ్యత్యాసాన్ని అతను గుర్తించాలని జోలీ ఘాటుగా పేర్కొన్నట్టు తెలిసింది. అయితే, ఇవేమీ పట్టించుకోని బ్రాడ్.. ఒకవైపు తన తాజా సైన్స్-ఫిక్షన్ సినిమా 'యాడ్ అస్త్ర'లో పనిచేస్తూనే.. మరోవైపు ఎల్లాతో చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నాడని, ఆమె కోసం చాలా టైమ్ కేటాయించి దగ్గరవుతున్నాడని, తమ అనుబంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అతను భావిస్తున్నాడని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. -
హాట్ కపుల్ మళ్లీ కలుస్తున్నారా?
బ్రేకప్లు, మళ్లీ రిలేషన్లు కామన్ అయిపోతున్న ఈరోజుల్లో హాలీవుడ్ హాట్ జంట బ్రాడ్ పిట్, ఏంజెలీనా జోలీ తమ 12 ఏళ్ల బంధాన్ని తెంచేసుకుంటున్నట్లు ప్రకటించి వార్తల్లో నిలిచారు. అయితే విడాకుల ప్రక్రియను నిలిపివేయాలని జోలీ కోరటంతో ఆమె మనసు మార్చుకుని భర్తతో జీవించేందుకు సిద్ధమైపోయిందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ ప్రముఖ అమెరికన్ మ్యాగజైన్ కథనం ప్రచురించింది. బ్రాడ్ చేసిన తప్పులను క్షమించేసి తిరిగి అతనితో జీవించేందుకు ఇప్పటికే జోలీ రాయబారం మొదలు పెట్టిందని దాని సారాంశం. తమ ఆరుగురు పిల్లల సంరక్షణను బ్రాడ్ పట్టించుకోవట్లేదన్న కారణం చెప్పినప్పటికీ, మరో యువతితో 52 ఏళ్ల బ్రాడ్ మరో యువతితో అఫైర్ మూలంగానే విడాకులు దారితీసినట్లు హాలీవుడ్లో ఓ టాక్. బ్రాడ్తో విడిపోయాక వేరే ఇంటికి మకాం మార్చిన 42 ఏళ్ల జోలీ అతనిపై ప్రేమను చంపుకోలేక చెడు వ్యసనాలకు బానిసయ్యిందని, అంతేకాకుండా పిల్లల భవిష్యత్తు కోసమే తిరిగి భర్తకు చేరువయ్యేందుకు యత్నిస్తోందని, ఈ విషయాన్ని బంధువులు కూడా ధృవీకరించినట్లు ఆ కథనం చెబుతోంది. -
ఫాదర్స్ డే: వాళ్లకు మాత్రం 'మదర్స్ డే'!
లాస్ ఏంజెలిస్: భార్య ఏంజెలినా జోలీతో విడాకులు తీసుకున్న తర్వాత హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్ పిట్ ఒంటరి వాడయ్యాడు. ఎంతలా చివరికి 'ఫాదర్స్ డే' రోజు కూడా తన పిల్లలకు చేరువ కానట్లుగా ఈ హీరో పరిస్థితి తయారైంది. గత ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా.. తమ తండ్రితో అనుబంధాన్ని సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు. నటి, బ్రాడ్ పిట్ మాజీ భార్య ఏంజెలినా జోలీ మాత్రం తన ఇష్ట రీతిన ప్రవర్తించింది. గతేడాది వీరి విడాకుల సమయంలో పిల్లల్ని ఆయన ఎప్పుడైనా కలుసుకునే హక్కు ఉందని చెప్పిన జోలి.. ఈ ఫాదర్స్ డే రోజు తన ఆరుగురు పిల్లలతో కలిసి సరదాగా టూర్కు వెళ్లింది. లాస్ ఏంజెలిస్ విమానాశ్రయంలో శనివారం రాత్రి తన పిల్లలు మాడెక్స్ జోలీ-పిట్(15), పాక్స్ థియన్ జోలీ-పిట్(13), జహారా మార్లే జోలీ-పిట్(12), షిలోహ్ జోలీ-పిట్(11), కవలలు కెనాక్స్ జోలీ-పిట్, వివీన్నె జోలీ-పిట్(8) లతో దర్శనమిచ్చింది ఏంజెలినా జోలీ. ఇటీవల కొనుగోలు చేసిన కొత్త ఇంట్లో ఉంటున్న జోలీ.. మాజీ భర్తకు పిల్లల్ని దూరం చేసిందన్న వదంతులు ప్రచారంలో ఉన్నాయి. ఈ క్రమంలో ఫాదర్స్ డే రోజు బ్రాడ్ పిట్ను తమ పిల్లలకు దూరంగా ఉంచడంలో భాగంగా టూర్ ప్లాన్ చేసింది. మీడియాతో మాట్లాడేందుకు కూడా ఆమె నిరాకరిస్తూ తన దారిన వెళ్లిపోయినట్లు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా 'ఫాదర్స్ డే' జరుపుకుంటుంటే.. బ్రాడ్ పిట్ కు అందుబాటులో లేని పిల్లలు తల్లి ఏంజెలినాతో కలిసి 'మదర్స్ డే' జరుపుకున్నారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఫాదర్స్ డే రోజు లాస్ ఫెలిజ్ లోని తన పాతింట్లో బ్రాడ్ పిట్ ఒక్కడే బాధతో గడిపాడని తెలుస్తోంది. భర్తతో విడిపోయిన జోలీ నాలుగో పెళ్లికి సిద్ధమైనట్లు ఇటీవల హాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.ఈ కారణంగానే పిల్లలను మాజీ భర్తకు ఆమె దూరం చేస్తుందని.. వారికి తండ్రి ప్రేమ కరువైందని జోలీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
హాలీవుడ్ ఎటాక్
చోటు: షారుక్ ఖాన్ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు మోటు: కాదురా.. టెన్షన్తో కొట్టుకుంటున్నాడు. చోటు: వాట్స్ హిజ్ ప్రాబ్లమ్? మోటు: హాలీవుడ్ బాలీవుడ్ని ఎటాక్ చేస్తుందట. చోటు: సినిమా కథలు చెప్పకు.. ఇంకా బలిసి బ్లాస్ట్ అవుతావు. చోటు: పుల్లలాగా ఉన్నావు. ఒక్కటి పీకానంటే టూ పీస్ అవుతావు. చోటు: ట్రాక్ మార్చకుండా షారుక్ ప్రాబ్లమ్ ఎంటో చెప్పు. మోటు: మనోళ్లకు స్క్రీన్ప్లే రైటింగ్ రాదట! చోటు : వాట్? మోటు: మార్కెటింగ్ రాదట, టెక్నాలజీలో వీక్ అట, డిజిటల్ వేల్యూస్లో జీరో అట. చోటు : హవ్వ.. హవ్వ... మోటు: అమెరికన్ హీరో బ్రాడ్ పిట్ తన డిజిటల్ సినిమా ‘వార్ మెషీన్’ ప్రమోషన్కి వచ్చి కొట్టిన కొట్టుడుకి బెంబేలెత్తిపోయి హాలీవుడ్ ఎటాక్ స్టార్టయ్యింది. వార్ వన్ సైడ్ అయిపోయింది. బాలీవుడ్ని క్యాప్చర్ చేసేస్తారు అని షారుక్ భోరునlఏడుస్తున్నాడు. చోటు: ఒకసారి ‘బాహుబలి’ చూడమను... బాలీవుడ్ని కాపాడేది టాలీవుడ్ అని తెలుస్తుంది. -
'బాలీవుడ్ మూవీలో ఈ జీవితంలో నటించను'
ముంబై: బాలీవుడ్ లో నటించేందుకు తనకు కొన్ని లక్షణాలు లేవని హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్ పిట్ అభిప్రాయపడ్డాడు. తన లేటెస్ట్ మూవీ 'వార్ మేషిన్' ప్రమోషన్లలో భాగంగా స్టార్ హీరో భారత్ లో పర్యటిస్తున్నాడు. ముంబైలో ప్రమోషన్లో భాగంగా మాట్లాడుతూ.. బాలీవుడ్ మూవీలలో నటించాలని ఉంది. కానీ డ్యాన్స్ రాని కారణంగా ఎప్పటికీ ఆ పని చేయలేనని చెప్పాడు. 'వార్ మేషిన్' డైరెక్టర్ డేవిడ్ మిచోడ్, మూవీ యూనిట్ తనకెంతో సహకారం అందించిందని, బడ్జెట్ ను పట్టించుకోకుండా రిస్క్ తీసుకుని మూవీ చేయడం మూవీ యూనిట్ కు అలవాటని అందుకే తాను ఈ మూవీలో నటించానని బ్రాడ్ పిట్ చెప్పుకొచ్చాడు. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఈ ఈవెంట్లో ముఖ్య అతిథిగా హాజరై బ్రాడ్ పిట్ ను సరదాగా ఆటపట్టించాడు. 'బాలీవుడ్ లో ప్రతి ఒక్కరూ డ్యాన్స్ చేస్తారు. కావాలంటే నువ్వు కూడా ఒకసారి రెండు చేతులను ముందుకు, పక్కకు అలా చాచిపెట్టు. అదే నీ డ్యాన్స్ అయిపోతుంది' అని షారుఖ్ చెప్పేసరికి అందరూ నవ్వేశారు. బ్రాడ్ పిట్ నటించిన '12 మంకీస్', 'ద క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్' మూవీలు చూసి ఆయన అభిమానిగా మారానని షారుక్ వివరించాడు. -
నాలుగో పెళ్లికి హీరోయిన్ సిద్ధం.. హీరో షాక్..
హాలీవుడ్ భామ ఏంజెలీనా జోలి నాలుగో పెళ్లికి రెడీ అవుతోందనే వార్త హాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. భర్త బ్రాడ్ పిట్తో విడిపోయిన తర్వాత వ్యసనాలకు బానిసైన జోలీ.. మళ్లీ ప్రేమలో పడిందటా. బ్రిటన్కు చెందిన ఓ వ్యాపారిని ఆమె నాలుగో పెళ్లి చేసుకోనున్నట్లు ప్రముఖ మ్యాగజేన్ తన కథనంలో పేర్కొంది. మ్యాగజేన్ కథనంలో ఇంకా ఏముందంటే.. జోలీ మాలిబు ఎస్టేట్లో ప్రియుడిని తరచూ కలుస్తున్నట్లు చెప్పింది. ఈ విషయం తెలిసిన బ్రాడ్ షాక్కు గురయ్యారని తెలిపింది. జోలీ వేరొకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయం తనకు అసలు తెలియదని పిట్ తన సన్నిహితులతో వాపోయారని చెప్పింది. తన పిల్లలతో కలిసి వేరే వ్యక్తి కలిసివుంటారనే ఊహే బాధగా ఉందని బ్రాడ్ అన్నారని తెలిపింది. జోలీ ఇష్టపడుతున్న వ్యక్తిని కలుసుకోవడం బ్రాడ్కు ఇష్టం లేదని చెప్పింది. అతన్ని తన కుటుంబాన్ని విడదీస్తున్న వ్యక్తిగా బ్రాడ్ భావిస్తున్నారని తెలిపింది. త్వరలో తాను ప్రేమిస్తున్న వ్యక్తిని పిల్లలకు పరిచయం చేయాలని జోలీ భావిస్తున్నట్లు వివరించింది. -
ఏంజెలీనాకు బ్రాడ్పిట్ ఝలక్!
లాస్ ఎంజెల్స్: తన నుంచి వేరు పడిన మాజీ భార్య, ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలికి ఆస్కార్ నటుడు బ్రాడ్ఫిట్ ఝలక్ ఇచ్చారు. తనకు పిల్లల భారం పట్టదని తెగేసి చెప్పారు. ఈ మేరకు పిల్లల పేరిట జమచేయాల్సిన లక్ష డాలర్లను చెల్లించేందుకు ఆయన నిరాకరించారు. ఈ విషయాన్ని యాషెస్ షోబిజ్ అనే వార్తా సంస్థ తెలిపింది. ఇటీవల జోలి, బ్రాడ్పిట్ల వివాహం విచ్ఛిన్నం విషయం తెలిసిందే. మరో 90 రోజుల్లో వారు పూర్తిస్థాయిలో అధికారికంగా విడిపోనున్నారు. వీరిద్దరికి ఆరుగురు పిల్లలు ఉన్నారు. అయితే వారి పోషణార్థం ప్రతి సంవత్సరం ఒక్కొక్కరి పేరిట ట్రస్ట్ ఫండ్గా 2,50,000 డాలర్లను ఇరువురు వేయాల్సి ఉంటుంది. ఐదు మిలియన్ డాలర్లు వారి పోషణార్థం జమ చేయాలి. అయితే, ఈ మొత్తంలో తాను లక్ష డాలర్లను చెల్లించలేనని బ్రాడ్పిట్ చెప్పేశారంట. అంతేకాదు, బ్రాడ్ పిట్ నుంచి డబ్బులు వసూలు చేసే విషయంలో మాత్రం ఆమె చాలా గట్టిగానే వ్యవహరిస్తోందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. -
నటి విడాకులపై ఆమె తండ్రి ఏమన్నారంటే..!
లాస్ఏంజిల్స్: గత ఏడాది హాలీవుడ్ జంట బ్రాడ్పిట్-ఏంజెలీనా జోలీ విడాకులు తీసుకున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి 2016లో ఎక్కవగా చదివిన వార్త వీరి డైవర్స్కు సంబంధించింది కావడం గమనార్హం. అయితే కూతురు ఏంజెలీనా జోలీ- అల్లుడు బ్రాడ్పిట్ విడాకులు తీసుకోవడం తనకు ఎంతో బాధ కలిగించిందని నటి తండ్రి జాన్ వోయిట్ తెలిపారు. బ్రాంజెలీనా(బ్రాడ్పిట్-ఏంజెలీనా జోలీ)ల విడాకులు తీసుకున్న తర్వాత ఆయన తొలిసారి మీడియాతో(యూఎస్ మ్యాగజీన్) మాట్లాడారు. పిల్లల కోసమైనా వారు కలిసి ఉండాలని, వారి బాగోగులు ఇద్దరూ కలిసి చూసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. వీలైతే విడాకుల విషయాన్ని పక్కపపెట్టి మళ్లీ భార్యాభర్తలుగా ఉండాలని జోలీ తండ్రి, సీనియర్ నటుడు జాన్ వోయిట్ అభిప్రాయపడ్డారు. ఈ జనవరి 9న తమ విడాకులు, పిల్లల సంరక్షణ విషయాలను వ్యక్తిగతంగా ఉంచాలనుకున్నట్లు ఈ జంట తెలిపింది. చట్టపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఓ ప్రైవేట్ జడ్జిని నియమించుకోవాలని వారు భావిస్తున్నారు. బ్రాంజెలీనా దంపతులకు ముగ్గురు సంతానం కాగా, మరో ముగ్గురు పిల్లలను దత్తత తీసుకున్నారు. అయితే పిల్లల సంరక్షణ విషయంపై కూతురు, అల్లుడు మధ్య విభేదాలున్నాయని, వాటిని పక్కనపెట్టి తన మనవళ్లు, మనవరాళ్ల కోసమైనా మళ్లీ ఒకటిగా ఉండాలని జాన్ వోయిట్ ఈ సందర్భంగా వారికి సూచించాడు. మరోవైపు పిల్లలను తన వద్దే ఉంచాలని జోలీ కోరుకుంటుండగా, పిట్ మాత్రం సంరక్షణ బాధ్యతలను ఇద్దరికీ అప్పగించాలని కోర్టుకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. -
విడాకులపై హీరోహీరోయిన్ల ప్రకటన
విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత కోర్టును ఆశ్రయించిన హాలీవుడ్ హీరోహీరోయిన్లు బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ తొలిసారి సంయుక్తంగా ఓ ప్రకటన విడుదలు చేశారు. తమ ఆరుగురు పిల్లల సంరక్షణను దృష్టిలో ఉంచుకుని, విడాకులకు సంబంధించిన కోర్టు డాక్యుమెంట్లన్నింటినీ రహస్యంగా ఉంచాలని ఇద్దరూ ఓ అంగీకారానికి వచ్చారు. కుటుంబం, పిల్లలకు సంబంధించి వ్యక్తిగత రహస్యాల హక్కులను కాపాడటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒప్పందంపై బ్రాడ్ పిట్, ఏంజెలినా, వారి న్యాయవాదులు సంతకాలు చేశారు. తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి, అవసరమైన చట్టపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఓ ప్రైవేట్ జడ్జిని నియమించుకోవాలని నిర్ణయించినట్టు ఓ ప్రకటనలో తెలిపారు. పిల్లల సంరక్షణ బాధ్యతలపై ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. పిల్లలను తన వద్దే ఉంచాలని జోలీ కోరుకుంటుండగా, పిట్ మాత్రం సంరక్షణ బాధ్యతలను ఇద్దరికీ అప్పగించాలని కోరాడు. పిల్లలు మైనర్లు అయినందున వారిని తన వద్దే ఉంచాలని జోలీ భావిస్తోంది. పిట్, జోలీ విభేదాల గురించి గతంలో పలు వార్తలు వచ్చాయి. కుటుంబ శ్రేయస్సు దృష్ట్యా పిట్తో విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు తొలుత జోలీ చెప్పింది. ఓ ప్రైవేట్ విమానంలో పిట్ పిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించడమే దీనికి కారణం. పిట్తో వ్యక్తిగత, వృత్తిపరమైన సంబంధాలను పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని జోలీ నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఇద్దరూ వేరుగా ఉంటున్నారు. విడిపోయాక తీవ్ర ఒత్తిడికి గురైన ఏంజెలినా, చైన్ స్మోకర్గా మారినట్టు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అలాగే జోలీ దూరమయ్యాక పిట్ విషాదంలో మునిగిపోయాడు. జోలీతో తన బంధం ముగుస్తుందని, విడాకులు తీసుకుంటామని బ్రాడ్ ఎప్పుడూ భావించలేదని సన్నిహితులు చెప్పారు. పిల్లలకు దూరంగా ఉండటం కూడా బ్రాడ్ను బాధిస్తున్నట్టు తెలిపారు. జోలీ, పిట్ దంపతులకు ముగ్గురు సంతానం కాగా, మరో ముగ్గురు పిల్లలను దత్తత తీసుకున్నారు. -
భార్యతో విడిపోయాక నాకు ఫోన్కాల్స్!
- గుట్టు విప్పిన టాప్ హీరో మాజీ ప్రియురాలు లాస్ఏంజిల్స్: గత ఏడాది ప్రపంచ సినీప్రయులను ఆశ్చర్యానికి గురిచేస్తూ హాలీవుడ్ హీరో బ్రాడ్పిట్ తన రెండో భార్య ఏంజిలీనా జోలీ నుంచి విడాకులు తీసుకున్నాడు. సినీ రంగానికి సంబంధించి 2016లో ఎక్కువమంది చదివిన వార్తకూడా పిట్-జోలీ డైవర్స్కు సంబంధించిదేకావడం గమనార్హం. అయితే జోలీ నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటోన్న 53 ఏళ్ల బ్రాడ్పిట్.. తన మాజీ గర్ల్ప్రెండ్, గాయని సినిట్టాకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడట. త్వరలోనే టీవీల్లో ప్రసారంకానున్న ఓ టాక్ షోలో సినిట్టాయే స్వయంగా ఈ ముచ్చట చెప్పింది. ‘బ్రాడ్పిట్ చాలా రొమాంటిక్. మేం విడిపోయి చాలా ఏళ్లు అవున్నా.. అతనితో గడిపిన రోజులు నాకింకా గుర్తేఉన్నాయి. ఈ మధ్యే భార్య నుంచి విడిపోయిన అతను నాకు ఫోన్కాల్స్ చేయడం మొదలుపెట్టాడు. అఫ్కోర్స్ నేను కూడా ఒంటరినే! కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో నేను పిట్తో కలిసి ఉండలేను. అందుకే.. నన్ను కాకుండా ఇంకెవరినైనా చూసుకొమ్మని సలహా ఇచ్చా’ అని సినిట్టా చెప్పుకొచ్చింది. కెరీర్ ప్రారంభంలో సినిట్టాతో డేటింగ్చేసిన బ్రాడ్పిట్.. ఆమెతో బంధాన్ని బ్రేకప్ చేసుకుని నటి జెన్నీఫర్ అనిస్టీన్ను పెళ్లాడాడు. అదే సమయంలో సినిట్టా.. ఆండీ విల్నర్ను మనువాడింది. అయితే 2005 నాటికి ఈ రెండు జంటలూ విడిపోయాయి. జెన్నీఫర్ నుంచి విడిపోయిన బ్రాడ్పిట్.. ఏంజిలీనా జోలీని పెళ్లాడటం, ఆరుగురు పిల్లల్ని కలిగాక మొన్నీమధ్యే విడిపోవడం తెలిసిందే. సినిట్టా మాత్రం మొదటి విడాకుల తర్వాత నుంచీ ఒంటరిగానే జీవిస్తోంది. -
వేధింపుల కేసు: నటుడికి విముక్తి
లాస్ఏంజిల్స్: సొంత పిల్లలనే వేధింపులకు గురిచేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హాలీవుడ్ టాప్ హీరో బ్రాడ్ పిట్కు భారీ ఊరట లభించింది. నటి ఏంజిలీనా జోలీతో విడిపోయే సందర్భంలో ఆమెపై ఉన్న కోపాన్ని బ్రాడ్ పిట్ పిల్లలపై ప్రదర్శించాడని, ప్రైవేట్ జెట్ విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో చిన్నారులను వేధించాడని గత సెప్టెంబర్లో కేసు నమోదు అయింది. కాగా, వేధింపులకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లభ్యమయ్యే అవకాశాలు లేకపోవడంతో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష్(ఎఫ్బీఐ) ఈ కేసు దర్యాప్తును పూర్తిగా నిలిపేసింది. ఈ మేరకు మంగళవారం ఎఫ్బీఐ అధికార ప్రతినిధి ప్రకటన విడుదల చేశారు. అటు లాస్ఏంజిల్స్ కౌంటీ చైల్డ్ అండ్ ఫ్యామిలీ సర్వీసెస్ శాఖ కూడా నవంబర్ మొదటివారంలోనే బ్రాడ్ పిట్కు ఈ కేసులో క్లీన్చిట్ ఇవ్వడం గమనార్హం. 12 ఏళ్ల (10 ఏళ్ల సహజీవనం, రెండేళ్ల వైవాహిక) బంధానికి ముగింపు పలుకుతూ స్టార్ కపుల్స్ ఏంజిలీనా జోలీ, బ్రాడ్ పిట్లు గత సెప్టెంబర్లో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. భర్తతో కలిసుండే విషయంలో పునరాలోచన లేదన్న జోలి.. బ్రాడ్ పిట్ పిల్లల్ని వేధించాడని ఆరోపించారు. దీంతో ఆరుగురు పిల్లల(మాడెక్స్ జోలీ-పిట్, పాక్స్ జోలీ-పిట్, జహారా జోలీ-పిట్, షిలోహ్ జోలీ-పిట్, కవలలు కెనాక్స్ జోలీ-పిట్, వివీన్నె జోలీ-పిట్) సంరక్షణ బాధ్యత ఎవరికి అప్పగించాలనే దానిపై సందిగ్ధం నెలకొంది. ఒకదశలో పిల్లల్ని తనకే అప్పగించాలని కోర్టులో పోరాటం చేసిన బ్రాడ్ పిట్.. కొన్ని హామీల మేరకు దిగొచ్చారు. ప్రస్తుతానికి ఆరుగురు పిల్లలూ మలీబులోని ఇంట్లో తల్లి జోలీతో కలిసి ఉంటున్నారు. -
పిల్లల్ని ఆమె దగ్గరే ఉంచండి: హీరో
లాస్ ఏంజెలెస్: హాలీవుడ్ స్టార్స్ బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకున్న నేపథ్యంలో తమదగ్గరున్న తమ పిల్లల పెంపకంపై ఒక అంగీకారానికి వచ్చారు. ఆరుగురు పిల్లలను ఏంజెలినా జోలీ వద్ద ఉంచేందుకు బ్రాడ్ పిట్ అంగీకరించాడు. మాడెక్స్ జోలీ-పిట్(15), పాక్స్ జోలీ-పిట్(12), జహారా జోలీ-పిట్(11), షిలోహ్ జోలీ-పిట్(10), కవలలు కెనాక్స్ జోలీ-పిట్, వివీన్నె జోలీ-పిట్(8)... ఏంజెలినా జోలీ దగ్గర పెరగనున్నారు. వీరిని అప్పుడప్పుడు బ్రాడ్ పిట్ కలిసేందుకు జోలీ అంగీకరించింది. అంతేకాదు తండ్రిని చూడాలని పిల్లలు కోరుకుంటే అభ్యంతరం చెప్పబోనని జోలీ హామీయిచ్చింది. పిల్లల సంరక్షణ నిపుణుల ఆధ్వర్యంలో కుదిరిన ఈ ఒప్పందంపై బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ వారం క్రితం సంతకాలు చేశారని జోలీ తరపు ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. బ్రాడ్, జోలీ 12 ఏళ్లపాటు కలిసుండి ఇటీవల విడిపోయారు. బ్రాడ్ పిట్ అంతకుముందు జెన్నిఫర్ అనిస్టన్ నుంచి విడిపోయాడు. ఏంజెలినా జోలీ మూడోసారి విడాకులు తీసుకుంది. అంతకుముందు ఆమె బిల్లీ బాబ్ థొర్నటన్, జానీ లీ మిల్లర్ తో వైవాహిక బంధాన్ని తెంచుకుంది. -
హీరోయిన్ను ప్రశ్నించిన పోలీసులు
మొన్నీమధ్యే భర్త నుంచి విడాకులు తీసుకున్న హాలీవుడ్ హీరోయిన్ ఏంజెలీనా జోలీని ఎఫ్బీఐ పోలీసులు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. జోలీ మాజీ భర్త బ్రాడ్ పిట్ వాళ్లిద్దరి కొడుకు మాడాక్స్ (15)ను విమానంలో తీవ్రంగా తిట్టాడని, కొట్టాడని.. ఆ సమయంలో అతడు బాగా తాగి ఉన్నాడని జోలీ పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఈ ఘటన సెప్టెంబర్ 14న జరగ్గా, ఆ తర్వాత కొద్దిరోజులకే జోలీ విడాకుల పిటిషన్ దాఖలుచేసింది. గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘటన గురించి పోలీసులకు తెలిపారు. విమానం గాలిలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది కాబట్టి.. ఈ విషయాన్ని ఎఫ్బీఐ పరిశీలిస్తోంది. విమానం టేకాఫ్ అయినప్పటి నుంచి అది తిరిగి ల్యాండయ్యేవరకు ఏం జరిగిందో మొత్తం అంతా ఎఫ్బీఐ వాళ్లు పరిశీలిస్తున్నారని, ఏంజెలీనా జోలీ కూడా వాళ్లకు పూర్తిగా సహకరిస్తోందని పోలీసు వర్గాలు తెలిపాయి. మరికొన్ని వారాల పాటు ఎఫ్బీఐ విచారణ కొనసాగనుంది. తర్వాత ఈ కేసును కోర్టుకు తీసుకెళ్తారు. అక్కడ విచారణ అనంతరం బ్రాడ్ పిట్పై ఆరోపణలు నమోదుచేయాలా వద్ద అన్నది నిర్ణయిస్తారు. ఇందుకు కొన్ని నెలల సమయం పడుతుంది. నిజానికి బ్రాడ్ పిట్, ఏంజెలీనా జోలీ ఇద్దరూ కూడా దీనిపై కేసు పెట్టకపోతేనే మంచిదని భావిస్తున్నట్లు సమాచారం. అనవసరంగా లేనిపోని గొడవలు ఎందుకని అంటున్నారట. విమానంలో జరిగిన గొడవలో మాడాక్స్కు కూడా గాయాలు ఏమీ కాలేదని, అందువల్ల ఈ వివాదాన్ని ఇంతటితో వదిలిపెట్టడం మంచిదని భావిస్తున్నట్లు సమాచారం. -
హీరోయిన్ ను ప్రశ్నించిన ఎఫ్ బీఐ
లాస్ ఏంజెలెస్: హాలీవుడ్ అగ్రనటి ఏంజెలినా జోలిని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్ బీఐ) అధికారులు ప్రశ్నించారు. ఏంజెలినా భర్త బ్రాడ్ పిట్ వ్యక్తిగత విమానంలో జరిగిన గొడవ గురించి ఆమెను నాలుగు గంటల పాటు ఎఫ్ బీఐ అధికారులు విచారించారు. సెప్టెంబర్ 14న మద్యం మత్తులో బ్రాడ్ పిట్ తన కుమారుడు మాడ్ డాక్స్(15)ను దుర్బలాషడాడి కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత ఏంజెలినా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. కాగా, తాము అడిగిన ప్రశ్నలకు ఏంజెలినా ఓపిగ్గా సమాధానాలిచ్చారని, విచారణకు సహకరించారని ఎఫ్ బీఐ వర్గాలు వెల్లడించాయి. ఆకాశమార్గంలో విమానంలో గొడవ జరిగినందున తాము జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని వెల్లడించాయి. మరికొన్ని వారాల పాటు విచారణ కొనసాగే అవకాశముందని తెలిపాయి. అయితే కోర్టు కేసులకు దూరంగా ఉండాలని ఏంజెలినా, బ్రాడ్ పిట్ భావిస్తున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. తాము విడిపోతున్నామని వీరిద్దరూ ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. -
హీరోయిన్ ఆ టాటూను చెరిపేస్తోంది!
సెలబ్రిటీలు అభిమానుల నిఘాకళ్లను తప్పించుకోవడం కొచెం కష్టమే. ప్రేమలో మునిగితేలుతున్న సమయంలో వారు ఒంటిపై వేసుకునే టాటూలపై అభిమానులు కన్ను సహజంగానే ఉంటుంది. అయితే ఇలాంటి జంటలు విడిపోయాక చెరిపేసుకునే టాటూలను సైతం అభిమానులు గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అభిమానుల కళ్లు హాలీవుడ్ హీరోయిన్ ఏంజెలినా జోలీ టాటూపై పడ్డాయి. భర్త బ్రాడ్ పిట్తో తన అనుబంధానికి గుర్తుగా గతంలో టాటూ వేయించుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు మా ఇద్దరికీ కుదరదు అంటూ కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య ఇప్పుడు దూరం పెరగడంతో అతడికి సంబంధించిన టాటూ సైతం ఒంటిపై ఉండటానికి వీలులేదని ఏంజెలినా భావిస్తోంది. దీంతో.. బ్రాడ్ పిట్ గుర్తుగా ఉన్న టాటూను తొలగించుకోవాలని డిసైడైందని సమాచారం. అయితే.. గతంలో మాజీ భర్త బిల్లీ బాబ్ టాటూను సైతం విడిపోయిన తరువాత ఏంజిలీనా తొలగించింది. బాలీవుడ్ భామ దీపికా పదుకొనే సైతం రణ్బీర్తో అనుబంధానికి గుర్తుగా వేయించుకున్న 'ఆర్కే' టాటూను బ్రేక్అప్ తరువాత తొలగించడానికి నానా తంటాలు పడిన విషయం తెలిసిందే. -
భార్య విడిపోవడంతో హీరో విషాదం
హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్ తన భార్య, హీరోయిన్ ఏంజెలినా జోలీ దూరమయ్యాక విషాదంలో మునిగిపోయాడు. ఏంజెలినా జోలీతో విబేధాలు ఏర్పడ్డాక ఇటీవల జరిగిన సంఘటనలు అతన్ని తీవ్రంగా బాధించినట్టు సన్నిహితులు చెబుతున్నారు. జోలీతో తన బంధం ముగుస్తుందని, విడాకులు తీసుకుంటామని బ్రాడ్ ఎప్పుడూ భావించలేదని చెప్పారు. పిల్లలకు దూరంగా ఉండటం కూడా బ్రాడ్ను బాధిస్తున్నట్టు తెలిపారు. కుటుంబంలో ఏర్పడిన విబేధాలు, తన జీవితంలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల గురించి బ్రాడ్ తన తల్లిదండ్రులు, స్నేహితులతో చర్చించినట్టు సమాచారం. బ్రాడ్ తల్లి రోజు అతన్నిఓదారుస్తున్నట్టు సన్నిహితులు చెప్పారు. బ్రాడ్, జోలీ 12 ఏళ్ల అనుబంధం ఇటీవల ముగిసింది. ఓ ప్రైవేట్ విమానంలో బ్రాడ్ మద్యంమత్తులో పిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించాడనే కోపంతో జోలీకి అతనికి దూరమైంది. బ్రాడ్ ఇంటి నుంచి వెళ్లిపోయిన జోలీ పిల్లలతో కలసి అద్దె ఇంట్లో ఉంటోంది. ఇటీవల విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేసింది. బ్రాడ్, జోలీ ఇద్దరూ తాత్కాలికంగా ఓ ఒప్పందం చేసుకున్నారు. జోలీ విడిపోయిన తర్వాత బ్రాడ్ ఇటీవల తొలిసారి తన పిల్లలను చూశాడు. ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన ఈ జోడీ రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. మరో ముగ్గురు పిల్లలను దత్తత తీసుకున్నారు. -
భార్య ఇంటికి వెళ్లేందుకు హీరోకు షరతు
విడిపోవాలని నిర్ణయించుకుని విడాకులకు దరఖాస్తు చేసుకున్న హాలీవుడ్ జంట బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ తాత్కాలిక ఒప్పందం చేసుకున్నారు. బ్రాడ్ పిట్ డ్రగ్, ఆల్కాహల్ పరీక్షలు చేయించుకున్న తర్వాతే తన పిల్లలను చూసేందుకు వెళ్లాలనే షరతును ఈ ఒప్పందంలో చేర్చారు. దీనికి పిట్, జోలీ ఇద్దరూ అంగీకరించారు. ప్రస్తుతం జోలీ పిట్కు దూరంగా అద్దె ఇంట్లో ఉంటోంది. ఆరుగురు పిల్లలు ఆమె దగ్గరే ఉన్నారు. పిట్, జోలీకి ముగ్గురు సంతానం కాగా, మరో ముగ్గురిని దత్తత తీసుకున్నారు. ఇటీవల పిట్ మద్యంమత్తులో పిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ జోలీ విడిపోయింది. గత నెల 20న విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఇది కోర్టు విచారణలో ఉంది. గత నెల 15న జోలీ దూరమయ్యాక పిట్ ఇప్పటి వరకు పిల్లలను చూడలేదు. దీంతో వీరిద్దరూ శుక్రవారం తాత్కాలిక ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 20 వరకు ఇది అమల్లో ఉంటుంది. పిల్లల క్షేమంగా దృష్ట్యా తన వద్దే ఉంచుకున్నట్టు జోలీ చెప్పింది. -
బ్లాక్ లిస్ట్లో ఆయన ఫోన్!
ప్రముఖుల జీవితాల్లో ఏది జరిగినా మీడియాకు ఎక్కేస్తుంది. బ్రాడ్ పిట్, ఏంజెలీనా జోలీల విడాకుల కథలోని సంగతులు ఇప్పుడు అలాగే బయటకొస్తున్నాయి. హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్తో పన్నెండేళ్ల సహ జీవనం, రెండేళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ హాలీవుడ్ స్టార్ ఏంజెలీనా జోలీ విడాకుల కోసం కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. వారం రోజుల క్రితం ఏంజిలినా జోలీ కోర్టులో కేసు వేశారు. ఆరుగురి పిల్లల్ని తీసుకుని అద్దె ఇంటికి షిఫ్ట్ అయ్యారు. అంతే కాదండోయ్... ఇన్ కమింగ్ మెస్సేజ్లతో పాటు బ్రాడ్ పిట్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్ను కూడా జోలీ బ్లాక్ లిస్టులో పెట్టారట. దాంతో, హీరోగారు షాకయ్యారట. ‘‘గతంలో చాలాసార్లు విడాకులు ఇస్తానని బెదిరించింది. నిజంగా ఇంత పని చేస్తుందనుకోలేదు’’ అని సన్నిహితుల వద్ద బ్రాడ్ పిట్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారని వార్త. ఈ స్టార్ విడాకుల కేసులో పోను పోనూ ఇంకెన్ని కబుర్లు బయటికొస్తాయో చూడాలి. -
భర్తను వీడి అద్దెఇంటికి మారిన హీరోయిన్
హాలీవుడ్ హీరోయిన్, దర్శకురాలు ఏంజెలినా జోలీ తన పిల్లలను తీసుకుని భర్త, హీరో బ్రాడ్ పిట్ ఇంటినుంచి వెళ్లిపోయింది. లాస్ ఏంజిలెస్లోని ఓ అద్దె ఇంట్లో జోలీ తన ఆరుగురు పిల్లలతో కలసి ఉంటున్నట్టు సమాచారం. 52 ఏళ్ల పిట్, 41 ఏళ్ల జోలీ విబేధాల కారణంగా దూరమయ్యారు. విడాకులు కోరుతూ గతనెలలో జోలీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కుటుంబ శ్రేయస్సు దృష్ట్యా పిట్తో విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు జోలీ చెప్పింది. ఓ ప్రైవేట్ విమానంలో పిట్ పిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్టు వార్తలు వచ్చాయి. పిల్లల సంరక్షణ బాధ్యత తనకు అప్పగించాలని, పిట్కు పిల్లలను కలుసుకునే హక్కు మాత్రమే ఇవ్వాలని జోలీ కోర్టును కోరింది. జోలీ, పిట్ దంపతులకు ముగ్గురు సంతానం కాగా, మరో ముగ్గురు పిల్లలను దత్తత తీసుకున్నారు. పిట్ నటిస్తున్న ఓ ప్రాజెక్టు నుంచి ఇటీవల జోలీ వైదొలిగింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించేందుకు జోలీ తొలుత అంగీకరించినా, ఇటీవల జరిగిన పరిణామాల వల్ల పిట్తో వ్యక్తిగత, వృత్తిపరమైన సంబంధాలను పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించుకుంది. -
'నా ఆందోళనంతా ఎంజెలీనా పిల్లల గురించే'
లాస్ ఎంజెల్స్: తన కూతురు చేసే పనుల పట్ల తనకు ఎలాంటి బెంగలేదని, అయితే ఆమె పిల్లల భవిష్యత్ గురించే తన ఆందోళన అని ప్రముఖ హాలీవుడ్ నటి ఎంజెలీనా జోలి తండ్రి, నటుడు జాన్ వోయిట్ అన్నారు. కొన్ని కారణాల వల్ల తన భర్త బ్రాడ్ ఫిట్ నుంచి విడాకులు ఇప్పించాల్సిందిగా ఎంజెలీనా దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ జంట అధికారికంగా విడిబోతున్నారు. దీంతో ప్రతి ఒక్కరు ఈ ఇద్దరి జీవితంలో భవిష్యత్ లో జరగబోయే పరిణామాలు, జరిగిన అంశాలపైనే దృష్టి పెట్టారు. అందులో భాగంగానే ఎంజెలీనా తండ్రి జాన్ తన ఆందోళన వ్యక్తం చేశారు. 'నాకు తెలుసు నా కూతురు ఏం చేసినా మంచే చేస్తుంది. అయితే, నేను ఆమె కుటుంబం, చిన్నారుల గురించే ఆందోళన పడుతున్నాను. బ్రాడ్ ఫిట్, ఎంజెలీనా ఆరుగురు పిల్లలను సాకుతున్నారు. ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుందో అనే నా ఆలోచన' అని అన్నారు. అయితే, జోలి విషయంలో ఇంతకంటే ఎక్కువ స్పందించేందుకు ఆయన నిరాకరించారు. ప్రస్తుతం కూతురు నుంచి విడిపోయి దూరంగా ఉంటున్న ఈ నటుడు ఓ రకంగా బ్రెంజిలీనా జోడి బద్దలవడం తనకు దిగ్భ్రాంతిని కలిగించిందని చెప్పారు. -
మాజీ భర్త సినిమాకు నో చెప్పిన హీరోయిన్
లాస్ ఏంజిలెస్: హాలీవుడ్ స్టార్ హీరోయిన్, దర్శకురాలు ఏంజెలినా జోలీ ఓ సినిమా ఆఫర్ను వదులుకుంది. తన మాజీ భర్త బ్రాడ్ పిట్ ఈ సినిమాలో నటిస్తుండటంతో, అతనితో కలసి పనిచేసేందుకు ఇష్టంలేక ఆమె ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగింది. బ్రాడ్పిట్ నుంచి ఎంజెలినా జోలీ విడాకులు కోరిన విషయం తెలిసిందే. తమ మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నందున విడాకులు తీసుకుంటున్నానని కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. 2005 నుంచి పిట్, జోలీ దాదాపు పదేళ్లు అన్యోన్యంగా గడిపారు. వీరిద్దరూ కలసి గతంలో సినిమాలు చేశారు. జోలీ దర్శకత్వంలో పిట్ రెండు సినిమాల్లో నటించాడు. పిట్ హీరోగా జోలీ దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సివుంది. ఈ ప్రాజెక్టు చేసేందుకు జోలీ తొలుత ఆసక్తి చూపింది. అయితే ఇటీవల పిట్తో విడిపోవడంతో ఈ ప్రాజెక్టు చేసేందుకు నిరాకరించింది. పిట్తో వ్యక్తిగతంగా కానీ, వృత్తిపరంగా కానీ ఎలాంటి సంబంధాలూ కొనసాగించరాదని జోలీ నిర్ణయం తీసుకుంది. -
'వాళ్లు విడిపోయారుగా.. ఇక పెళ్లి చేసుకుంటా'
లాస్ ఎంజెల్స్: హాలీవుడ్ హాట్ కపుల్ బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ విడిపోవడంపై ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడేస్తున్నారు. హాలీవుడ్ నటి, కమెడియన్ చెల్సియా హ్యాండ్లర్ బ్రెంజిలీనాల(బ్రాడ్ పిట్, ఏంజెలినా) బ్రేకప్ పై స్పందిస్తూ ఏంజెలీనాను తప్పుబట్టింది. ఆమె చాలా వెర్రిదని, చపలచిత్తంగల స్త్రీ అని విమర్శించింది. ఎంతమంది పెళ్లి చేసుకున్నా వారు మాత్రం ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదని ఎప్పుడూ చెప్తుండే దాన్నని చెప్పింది. వాళ్లు పెళ్లి చేసుకున్నందున తిరిగి విడాకులు తీసుకునేవరకు తాను పెళ్లి చేసుకోబోనని చెప్పానని, ఇక వాళ్లు విడాకులు తీసుకుంటున్నందున నేను అధికారికంగా ఎవరైనా పెళ్లి ప్రతిపాదనలతో వస్తే అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది. ప్రతి ఒక్కరు బ్రాడ్ నే విమర్శిస్తున్నారని, ఆయనే తాగుబోతు, సిగరెట్లు తాగుతాడని విమర్శిస్తున్నారని, ఒక వేళ ఏ కారణం లేకుండానే అతడు అలా మారిపోతాడా అని ఆమె ప్రశ్నించింది. ఎంజెలీనా మంచిదికాదని ఆమె ఓ వెర్రిమాలోకం అని వెక్కిరించింది. ఈ విమర్శలు చేసిన చెల్సియా బ్రాడ్ ఫిట్ మాజీ భార్య ఆనిస్టన్ స్నేహితురాలు. అంతకుముందు కర్మ సిద్ధాంత ప్రకారం వారు విడిపోయారని బ్రాడ్ ఫిట్ మాజీ భార్య జెన్నిఫర్ ఆనిస్టన్ పేర్కొనడమే కాకుండా బ్రాడ్కు జోలీ ఎంతమాత్రం సరిపోదని చెప్పింది. సాదాసీదాగా ఉండే బ్రాడ్కు జోలీ చాలా సంక్లిష్టమైన జోడీ అని చెప్పింది. వారిద్దరు విడిపోవడం సంతోషంగానే ఉందని చెప్పింది.కాగా, బాగా తాగి వచ్చిన బ్రాడ్ ఫిట్ పిల్లలపై చేయిచేసుకోవడం వల్లే ఎంజెలీనా విడిపోయినట్లు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. -
మనుషులే కాదు..బొమ్మలూ విడిపోయాయ్!
హాలీవుడ్ హాట్ కపుల్ బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ విడిపోతున్నారు. పన్నెండేళ్ల ప్రేమానుబంధం, రెండేళ్ల వివాహ బంధానికి ఈ జంట ముగింపు పలికేశారు. పుష్కర కాలం క్రితం ప్రేమలో పడ్డ ఈ నటుడు, నటి రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. హాలీవుడ్లో ఉన్న చూడ చక్కని జంటల్లో ఈ జంట ఒకటి. ఇద్దరి మధ్య సరిచేసుకోలేనంతగా మనస్పర్థలు నెలకొనడంవల్లే విడిపోవాలని నిర్ణయించుకున్నామని ఈ జంట పేర్కొంది. విడాకులకు కూడా అప్లై చేసుకున్నారు. మనషులే విడిపోతున్నప్పుడు ఈ ఇద్దరి బొమ్మలు మాత్రం ఎందుకు కలిసి ఉండాలని లండన్లోని మేడమ్ తుస్సాడ్స్ నిర్వాహకులు భావించినట్లు ఉన్నారు. ప్రముఖుల మైనపు బొమ్మలు తయారు చేసి ఈ మ్యూజియమ్లో పెడుతుంటారు. 2013లో పిట్, జోలీల బొమ్మలు తయారు చేయించి, ప్రదర్శనకు ఉంచారు. ఇప్పుడు ఈ ఇద్దరూ విడిపోతున్నామని ప్రకటించిన నేపథ్యంలో తుస్సాడ్స్ వారు బొమ్మలను కూడా విడగొట్టేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ‘‘బ్రాడ్ పిట్, ఏంజెలినాలు విడిపోతున్న విషయం చాలామందిని షాక్కి గురి చేసిన నేపథ్యంలో వాళ్లిద్దర్నీ (బొమ్మలను) మేం అఫీషియల్గా విడగొట్టేశాం’’ అని సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. -
ఎంజెలినా జోలీ విడాకులకు కారణం ఇదే..!
లాస్ఏంజీల్స్: హాలీవుడ్ హీరో బ్రాడ్పిట్ నుంచి ఎంజెలినా జోలి విడాకులు కోరిన విషయం తెలిసిందే. తమ మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నందున విడాకులు తీసుకుంటున్నానని సోమవారం కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసిన సందర్భంగా ఎంజెలినా వ్యాఖ్యానించారు. 2005 నుంచి అన్యోన్యంగా కలిసుంటున్న వీరి మధ్య ఇంత సడన్గా అభిప్రాయ భేదాలు రావడం ఏంటని అభిమానులు తలలుగోక్కున్నారు. అయితే.. ఈ విడాకుల వ్యవహారానికి తక్షణ కారణం మాత్రం బ్రాడ్ పీట్ తన ఆరుగురు పిల్లల్లో ఒకరిపై తీవ్ర కోపంతో అరచి, కొట్టాడమేనట. ఇటీవల ప్రైవేట్ జెట్లో వెళ్తున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న బ్రాడ్.. తన పిల్లల్లో ఒకరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడని అందుకే ఎంజెలినా విడాకుల నిర్ణయం తీసుకున్నారని తాజాగా ఓ మీడియా సంస్థ వెల్లడించింది. బాలల హక్కుల చట్టాల కింద బ్రాడ్ పీట్పై విచారణ జరుగుతుందని సమాచారం. అయితే.. బ్రాడ్ పీట్ మాత్రం ఈ విషయంపై తీవ్రంగా స్పందించాడు. తాను తన పిల్లలపై ఎలాంటి హింసకు పాల్పడలేదని, కొందరు కావాలనే తనను చెడ్డవాడిలా చూపించాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో బ్రాడ్ పిట్, ఎంజెలినాలతో పాటు వారి ఆరుగురు పిల్లలను విచారించాలని అధికారులు భావిస్తున్నారు. -
వాళ్ల విడాకులపై మాజీ భార్య సంతృప్తి!
హాలీవుడ్లోనే ప్రముఖ జంటగా పేరొందిన బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ విడాకుల వార్త సహజంగానే ఇంటర్నెట్లో పెద్ద చర్చనీయాంశమైంది. భర్త బ్రాడ్తో విడాకులు తీసుకొనేందుకు కోర్టును జోలీ దరఖాస్తు చేసుకోవడంతో ఈ వార్తపై ఎన్నో కథనాలు వెలువడ్డాయి. అయితే, జోలీ-బ్రాడ్ విడాకులపై బ్రాడ్ మాజీ భార్య, హాలీవుడ్ నటి జెన్నిఫర్ అనిస్టన్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రం ఆన్లైన్ను కుదిపేస్తున్నాయి. ఆమె వ్యాఖ్యలపై ఎన్నో జోకులు వెల్లువెత్తుతున్నాయి. యూఎస్ వీక్లీ మ్యాగజీన్ కథనం ప్రకారం జోలీ-బ్రాడ్ విడాకులపై అనిస్టన్ తన సన్నిహితులతో స్పందించింది. ’కర్మ’ సిద్ధాంతం ప్రకారమే వారు విడిపోయినట్టు ఆమె పేర్కొంది. అంతేకాదు జోలీతో బ్రాడ్ విడిపోతుండటంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేసింది. 11 ఏళ్ల వైవాహిక జీవితం.. అరడజనుకుపైగా పిల్లలతో అన్యోన్యమైన జంటగా పేరొందిన బ్రాడ్-జోలీ మధ్య ఏదో జరుగుతుందని తనకు ఎప్పుడూ అనిపించేదని ఆమె సన్నిహితులతో పేర్కొంది. ’ బ్రాడ్కు జోలీ ఎంతమాత్రం సరిపోదని అనిస్టన్ ఎప్పుడూ భావించలేదు. కానీ సాదాసీదాగా ఉండే బ్రాడ్కు జోలీ చాలా సంక్లిష్టమైన జోడీ అని ఆమె భావించేది’ అని సన్నిహితులు పేర్కొన్నారు. తన మాజీ భర్త వైవాహిక జీవితంపై అనిస్టన్కు ఎలాంటి దురభిప్రాయాలు లేవని, వారు విడిపోవాలని కానీ, కలిసుండాలని కానీ ఆమె కోరుకోలేదని చెప్పారు. అయితే, బ్రాడ్-జోలీ విడిపోతుండటంపై ఆమె సంతృప్తిగా ఉందని వారు తెలిపారు. 2000 సంవత్సరంలో బ్రాడ్- అనిస్టన్ పెళ్లి చేసుకొని ఐదేళ్ల తర్వాత విడిపోయారు. అనంతరం 2011 నుంచి జస్టిన్ థిరౌక్స్తో డేటింగ్ చేసిన అనిస్టన్ 2015లో అతన్ని పెళ్లాడించింది. మరోవైపు పిట్-జోలీ విడాకులతో జెన్నిఫర్ అనిస్టన్ సంతోషంలో మునిగిపోయి పండుగ చేసుకుంటున్నదని ఆన్లైన్లో జోకులు వెల్లువెత్తుతున్నాయి. -
ఆ హీరో, హీరోయిన్ వైవాహిక బంధం బద్దలైంది
-
ఆ హీరో, హీరోయిన్ వైవాహిక బంధం బద్దలైంది
లండన్: హాలీవుడ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ కపుల్స్ ఎంజెలీనా జోలీ(41), ఆస్కార్ ఆవార్డు విజేత బ్రాడ్ ఫిట్(52) విడిపోతున్నారు. పన్నేండేళ్ల బంధానికి, రెండున్నారేళ్ల వైవాహిక జీవితానికి గుడ్బై చెప్పేస్తున్నారు. ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి మధ్యలో మరో అమ్మాయి రావడమే అందుకు ప్రధాన కారణమైంది. ఎంజెలీనా, బ్రాడ్ ఫిట్లకు 2014లో వివాహం అయింది. అంతకుముందు పన్నెండేళ్లపాటు లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. 2004 నుంచి వీరిద్దరు ఒకే ఇంట్లో ఉండటమే కాకుండా మంచి కపుల్స్ అని పేరు కూడా తెచ్చుకున్నారు. అయితే, కొద్ది రోజులుగా బ్రాడ్ వ్యవహారంలో అసంతృప్తిగా ఉన్న జోలీ అటార్న్ రాబర్ట్ వద్ద తనకు బ్రాడ్ ఫిట్ నుంచి విడాకులు ఇప్పించాలని దరఖాస్తు చేసుకొంది. తన కుటుంబ క్షేమం కోసమే తాను ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పింది. ఈ సమయంలో కుటుంబం విషయంలో ప్రైవసీ కోరుకుంటున్నందున తన విడాకులు కోరుతున్నట్లు వెల్లడించింది. బ్రాడ్ ఫిట్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. 'ఈ విషయం చెప్పేందుకు బాధగా ఉంది. మా చుట్టూ కొన్ని కారణాల వల్ల ఇలాంటి పరిణామాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మీడియా మాకు కొంత స్వేచ్ఛను ఇవ్వాలి' అని ఆయన చెప్పారు. బ్రాడ్ ఫిట్, ఎంజెలీనాకు ఆరుగురు పిల్లలు కాగా వారిలో ముగ్గురు దత్తత తీసుకున్నవారు ఉన్నారు. మిగితా ముగ్గురు జోలీ, బ్రాడ్ ఫిట్ కు కలిగిన సంతానమే. తన పిల్లలను సరిగా చూసుకోవడం లేదని తన విడాకుల దరఖాస్తులో పేర్కొన్న ఎంజెలీనా.. కావాలంటే అప్పుడప్పుడు బ్రాడ్ ఫిట్ వచ్చి చూసి వెళుతుండొచ్చని అందులో పేర్కొంది. అతడి వద్ద నుంచి ఎంజెలీనా భరణం కూడా కోరలేదు. 2004లో వీరిద్దరు ప్రేమలో పడ్డప్పుడు బ్రాడ్ కు జెన్నిఫర్ అనిస్టన్ అనే ఓ మోడల్ భార్యగా ఉంది. అయితే, బ్రాడ్ తో ఎంజెలీనా విడిపోయేందుకు ప్రధాన కారణం మాత్రం ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత బ్రాడ్ ఫిట్ ఓ మోడల్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుండటమే కాకుండా ఇంటి సంగతులు పక్కకు పెట్టినట్లు హాలీవుడ్ లో గుసగుసలు. అయితే, ఇలా విడిపోవడం హాలీవుడ్ లో సాధారణ విషయమే. -
ఔను! వాళ్లిద్దరూ విడిపోతున్నారు!
పదకొండు సంవత్సరాల వైవాహిక జీవితం.. అరడజనుకుపైగా పిల్లలు. హాలీవుడ్లోనే అత్యంత బలమైన అనుబంధమున్న జంటగా భావించిన బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ వైవాహిక బంధం బీటలు వారింది. ఈ జంట విడిపోతున్నట్టు గత కొన్నాళ్లుగా వస్తున్న వార్తలు నిజమేనని తేలింది. తాజాగా ఏంజెలినా జోలీ భర్త బ్రాడ్ పిట్తో విడాకులు తీసుకొనేందుకు కోర్టును ఆశ్రయించింది. తమకు విడాకులు ఇవ్వాల్సిందిగా కోర్టులో దరఖాస్తు చేసుకుంది. గతకొన్ని నెలలుగా పిట్-జోలీ అనుబంధంలో లుకలుకలు మొదలయ్యాయని సమాచారం. గత మార్చిలో బ్రాడ్ పిట్ ఒక్కడే తమ పిల్లలు పాక్స్, జాహరా, మడొక్స్, షిల్హా, నాక్స్, వివియెన్నెలతో కలిసి షాపింగ్ చేస్తూ కనిపించడం.. వీరి బ్రేకప్ కు నిదర్శనంగా గతంలో కథనాలు వచ్చాయి. జోలీ తన డైరీలో రాసుకున్న వ్యక్తిగత నిజాలను పిట్ చదువడం వల్లే వీరి మధ్య విభేదాలు మొదలైనట్లు ఈ కథనాల సారాంశం. ఆమె గత జీవితానికి సంబంధించిన సమస్యలు మళ్లీ వెలుగుచూడటంతో, ఆమె చిత్రంగా ప్రవర్తిస్తుండటంతో బ్రాడ్ పిట్ జోలీకి దూరమవుతున్నట్టు ద నేషనల్ ఎంక్వైరెర్ పత్రిక గతంలో పేర్కొంది. పిట్తో అనుబంధం నానాటికీ సన్నగిల్లుతుండటంతో ఆమె బేలగా, నీరసంగా మారిపోయిందని, గత మార్చిలో లండన్లో తన పిల్లలతో బయటకొచ్చిన జోలీ 'ఎముకల గూడు'లా కనిపించడంతో ఆమె ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతున్నదని 'టచ్ మ్యాగజీన్' తెలిపింది. పిట్తో గొడవలు, వ్యవహారం విడాకుల దాకా వెళుతుండటంతో జోలీ చాలా నీరసంగా మారిపోయి మరింత బరువు తగ్గిపోయిందని, తీవ్ర ఒత్తిడిలో భావోద్వేగానికి లోనవుతున్న ఆమె శారీరకంగా, మానసికంగా బ్రేక్డౌన్ అయ్యేలా కనిపిస్తున్నదని ఆ మ్యాగజీన్ పేర్కొంది. ఈ పరిస్థితిలో జోలీకి సహాయపడటం కానీ, తమ వైవాహిక బంధాన్ని నిలుపుకోవడానికిగానీ బ్రాడ్ పిట్ ప్రయత్నించడం లేదని చెప్పింది. అయితే ఈ కథనాలపై గతంలో ఈ దంపతులు పెదవి విప్పలేదు. -
ట్రంప్పై బ్రాడ్ పిట్కు చిర్రెత్తుకొచ్చింది..
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్కు అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్పై చిర్రెత్తుకొచ్చింది. ముఖ్యంగా ట్రంప్ వేర్పాటువాద ఆలోచనలపై ఈ ఆస్కార్ విన్నింగ్ యాక్టర్ మండిపడ్డారు. ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'అసలు ట్రంప్ ఏమనుకుంటున్నారు. మన దేశాన్ని వెనక్కి తీసుకెళ్లాలనుకుంటున్నారా? ఇది ఎక్కడికి వెళుతోంది? అంటూ ట్రంప్ వేర్పాటువాద ప్రకటనలపై బ్రాడ్ పిట్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రపంచమంతా ఇరుగుపొరుగుగా మారిపోయిందని, ఈ సమయంలో ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలన్నారు. ట్రంప్ విధానాలు ఒంటరి, వేర్పాటువాద ఆలోచనల వైపు ఉన్నాయన్నారు. ట్రంప్ మద్దతుదారులు అన్నింటికీ వ్యతిరేకంగా పోరాడుతున్నారని బ్రాడ్ పిట్ విమర్శించారు. యూరప్ నుంచి బ్రిటన్ విడిపోతుందని(బ్రెగ్జిట్) తాను అనుకోలేదని బ్రాడ్ పిట్ తెలిపారు. అందరినీ కలిపేది మంచిదని.. విడగొట్టేది చెడ్డదని ఆయన అభిప్రాయపడ్డారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అవుతాడని తాను భావించడం లేదన్నారు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో మెక్సికో సరిహద్దులో గోడ కడతానని, వలసదారులను వెనక్కి పంపుతానని, ముస్లింలను అమెరికాలోకి రానివ్వొద్దంటూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
భార్య కళ్లుగప్పి.. ప్రియురాలితో హీరో చెట్టాపట్టాల్!
హాలీవుడ్ జంట బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ బ్రేకప్ కథనాలు మళ్లీ జోరందుకున్నాయి. భార్య జోలీ కళ్లుగప్పి.. పిట్ తన ప్రియురాలు మరియన్ కాటిల్లార్డ్తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడని తాజాగా హాలీవుడ్ కోడై కూస్తున్నది. జోలీతో తెగదెంపులు చేసుకోవాలనే ఉద్దేశంతోనే కాటిల్లార్డ్తో పిట్ ప్రణయ సల్లాపాలు నెరుపుతున్నట్టు హాలీవుడ్ వర్గాల భోగట్టా. ప్రస్తుతం పిట్, కాటిల్లార్డ్ ప్రస్తుతం 'ఫైవ్ సెకండ్స్ ఆఫ్ సైలెన్స్ ఇన్ ఇంగ్లండ్' సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. 'ఈ ఇద్దరి మధ్య ఏదో గూడుపుఠాణి నడుస్తోంది. వారి మధ్య రహస్యంగా జరగకూడనిది జరుగుతోంది. తమ మధ్య ఉన్నదానిని రహస్యంగా ఉంచి పబ్లిగ్గా చూడటానికి మాత్రం తమ మధ్య ఏమీ లేనట్టు వారు నటిస్తున్నారు' అని ఈ సినిమాకు సంబంధించిన ఇన్సైడర్లు చెప్పినట్టు 'హాలీవుడ్లైఫ్.కామ్' తెలిపింది. (చదవండి: ఔను! వాళ్లు కూడా విడిపోతున్నారట!) 'గతంలో బ్రాడ్-జోలీ జంట ఎవరికివారుగా చాటుమాటుగా చిన్నపాటి సరస సల్లాపాలు నెరిపినా.. అవి పెద్ద దూరం వెళ్లకపోవడంతో వీరి బంధంపై ఆ ప్రభావం పడలేదు. కానీ బ్రాడ్ ఇటీవలికాలంలో మరియన్కు ఎమోషనల్గా దగ్గరవుతున్నాడు. ఇది ఈ జంట దాంపత్య జీవితంపై ప్రభావం చూపే అవకాశముంది. ఇది వీరి పెళ్లి పెటాకులవ్వడానికి దారితీయవచ్చు' అని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. చైన్ స్మోకింగ్, మద్యం వంటి అలవాట్ల కారణంగా భారీగా బరువు తగ్గిన ఏంజెలినా జోలీ ప్రస్తుతం 35 కిలోల బరువుకు పడిపోయి.. బలహీనంగా మారిపోయిందని, దాంతో ఆమెను బ్రాడ్ పట్టించుకోవడం మానేశాడని గతంలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పదకొండు ఏళ్ల తమ వైవాహిక జీవితానికి తెరదించాలని ఈ జంట భావించినట్టు, త్వరలోనే వీరు విడాకులు తీసుకోబోతున్నట్టు గతంలోనూ కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. -
అమ్మచాటు కొడుకులు ఈ టాప్ హీరోలు
ఒకరి దగ్గర కోట్లాది రూపాయల డబ్బు ఉండొచ్చు. వేసుకోవడానికి వందలకొద్దీ కోట్లుండొచ్చు.. ఖరీదైన బంగళాలు, విలాసాలకు బోలెడంత డబ్బు ఉండొచ్చు. ఇంకొకరి దగ్గర ఇవేవీ లేకున్నా ఒక్క అమ్మ ఉంటే చాలు! అవును. అమ్మతో కలిసుండటం, అమ్మను కలిగి ఉండటంలోని గొప్పతనాన్ని 'మేరే పాస్ మా హ:' అనే ఒకేఒక్క డైలాగ్ తో సోదరుడు అమితాబ్ కు తెలియజేస్తాడు 'దీవార్' సినిమాలో శశీకపూర్. ఆ డైలాగ్ బాలీవుడ్ లో ఎంత ఫేమసో, కొందరు హాలీవుడ్ హీరోల నిజజీవితాల్లోనూ అంతే. అమ్మ ఒడి అంటే... ఒక పాఠశాల. ఆ పాఠశాలలో ఎన్నో కథలు వినిపిస్తాయి. అవి కథలు మాత్రమే కాదు... జీవితాన్ని సక్రమమైన దారిలో నిర్మించుకోవడానికి అవసరమైన సాధనాలు. అలా అమ్మ కూచులుగా జీవితం ప్రారంభించి, అమ్మే ఇన్ స్పిరేషన్ గా విజయాలు సాధించామంటున్నారు ప్రముఖ హాలీవుడ్ హీరోలు టామ్ క్రూస్, బ్రాడ్ పిట్, జానీ డెప్, లియోనార్డో తదితరులు. తల్లిచాటు కొడుకులుగా పేరుపొందిన వీళ్లు తమ మాతృమూర్తులతో కలిసున్నప్పటి ఫొటోలివి. -
'తండ్రి నువ్వు కాదని డీఎన్ఏతో ప్రూవ్ చేయ్'
లాస్ ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ నటి ఎంజెలీనా జోలికి తన భర్త బ్రాడ్ పిట్పై అనుమానం మొదలైంది. మరో హాలీవుడ్ నటి మెలిస్సా ఎథెరిడ్జ్ పిల్లలకు అసలు తండ్రి తన భర్త బ్రాడ్ పిట్నేమో అనే ఆలోచన ఆమెను వేధిస్తోంది. దీంతో ప్రస్తుతం డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలని ఆమె బ్రాడ్ పిట్ ను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పరీక్ష ద్వారా తాను ఎథెరిడ్జ్ పిల్లలకు తండ్రి కాదనే విషయం నిరూపించుకోవాలని ఆమె బ్రాడ్ ను గట్టిగా నిలదీసినట్లు సమాచారం. అయితే, అసలు ఈ అనుమానం ఆమెకు ఎందుకొచ్చిందని అనుకుంటున్నారా.. మరేం లేదు. మొన్న ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న ఎథెరిడ్జ్ మాట్లాడుతూ తనకు పిల్లలు కావాలని కోరుతూ బ్రాడ్ పిట్ శుక్రకణాలు దానం చేయాలని బ్రాడ్ పిట్ ను కోరానని తెలిపింది. కానీ, అలా జరగకపోవడంతో.. సింగర్ డేవిడ్ క్రాస్బైను సంప్రదించి అతడి స్పెర్మ్ ద్వారా ఇద్దరు సంతానాన్ని పొందినట్లు తెలిపింది. కానీ, ఈ విషయం చెప్పినప్పటి నుంచి ఎంజెలీనాకు మాత్రం కలవరింత మొదలైంది. ఆమె పిల్లల అసలు తండ్రి బ్రాడ్ పిట్ అయ్యుండొచ్చని భావిస్తూ పరీక్ష చేయించుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. -
అయ్యోపాపం! వాళ్లూ విడిపోతున్నారంట!
పదకొండు సంవత్సరాల వైవాహిక జీవితం.. అరడజనుకుపైగా పిల్లలు. హాలీవుడ్లోనే అత్యంత బలమైన అనుబంధమున్న జంటగా భావించిన బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ వైవాహిక బంధానికి బీటలు వారినట్టు కనిపిస్తోంది. ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకోనుందన్న వార్తలు ప్రస్తుతం విదేశీ మీడియాలో పుంఖానుపుంఖాలుగా వెలువడుతున్నాయి. గతకొన్ని నెలలుగా పిట్-జోలీ అనుబంధంలో లుకలుకలు మొదలయ్యాయని, తాజాగా బ్రాడ్ పిట్ ఒక్కడే తమ పిల్లలు పాక్స్, జాహరా, మడొక్స్, షిల్హా, నాక్స్, వివియెన్నెలతో కలిసి షాపింగ్ చేస్తూ కనిపించడం.. వీరి బంధం విడిపోవడానికి చేరినట్టు సూచిస్తోందని ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ పత్రిక పేర్కొంది. జోలీ తన డైరీలో రాసుకున్న వ్యక్తిగత నిజాలను పిట్ చదువడం వల్లే వీరి మధ్య విభేదాలు మొదలైనట్లు ఆ పత్రిక పేర్కొంది. ఆమె గత జీవితానికి సంబంధించిన సమస్యలు మళ్లీ వెలుగుచూడటంతో, ఆమె చిత్రంగా ప్రవర్తిస్తుండటంతో బ్రాడ్ పిట్ జోలీకి దూరమవుతున్నట్టు ద నేషనల్ ఎంక్వైరెర్ పత్రిక పేర్కొంది. పిట్తో అనుబంధం నానాటికీ సన్నగిల్లుతుండటంతో ఆమె బేలగా, నీరసంగా మారిపోయిందని, ఇటీవల లండన్లో తన పిల్లలతో బయటకొచ్చిన జోలీ 'ఎముకల గూడు'లా కనిపించడంతో ఆమె ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతున్నదని 'టచ్ మ్యాగజీన్' తెలిపింది. పిట్తో గొడవలు, వ్యవహారం విడాకుల దాకా వెళుతుండటంతో జోలీ చాలా నీరసంగా మారిపోయి మరింత బరువు తగ్గిపోయిందని, తీవ్ర ఒత్తిడిలో భావోద్వేగానికి లోనవుతున్న ఆమె శారీరకంగా, మానసికంగా బ్రేక్డౌన్ అయ్యేలా కనిపిస్తున్నదని ఆ మ్యాగజీన్ పేర్కొంది. ఈ పరిస్థితిలో జోలీకి సహాయపడటం కానీ, తమ వైవాహిక బంధాన్ని నిలుపుకోవడానికిగానీ బ్రాడ్ పిట్ ప్రయత్నించడం లేదని చెప్పింది. అయితే ఇన్ని కథనాలు వెలువడుతున్నా ఈ దంపతులు మాత్రం ఇప్పటివరకు పెదవి విప్పలేదు. -
ఔను! వాళ్లు కూడా విడిపోతున్నారట!
-
ఔను! వాళ్లు కూడా విడిపోతున్నారట!
ఈ ఏడాది సెలబ్రిటీ దంపతులకు ఏమాత్రం కలిసివచ్చినట్టు కనిపించడం లేదు. అన్యోన్యంగా తిరిగిన వాళ్లు, చెట్టాపట్టాలేసుకొని మీడియా ముందు కనిపించిన వారూ.. చిలుకా గోరింకలు అంటే ఉదాహరణ అనిపించిన జంటలు సైతం ఈ ఏడాది మొదలైంది మొదలు తలోబాట పడుతున్నారు. ఇన్నాళ్ల బంధానికి విడాకులు ఇస్తూ వేరవుతున్నారు. ఇప్పటికే రణ్బీర్ కపూర్, కత్రినా కైఫ్ల మధ్య బ్రేకప్ ఖాయమైపోయింది. 16 ఏళ్ల పెళ్లి బంధాన్ని తెగదెంపులు చేసుకుంటూ ఫర్హాన్ అఖ్తర్, అధునా అఖ్తర్ వేరవుతున్నట్టు ప్రకటించారు. ఇక జాబితాలో చేరేదిశగా హాలీవుడ్లోనే అన్యోన్యమైన జంటగా పేరొందిన ఏంజిలీనా జోలీ, బ్రాడ్ పిట్ సాగుతున్నారు. నిజమే ఈ దంపతుల అభిమానులకు ఇది షాకింగ్ వార్తనే. అయినా వ్యక్తిగత కారణాల వల్ల ఈ జంట తమ అందమైన వైవాహిక అనుబంధానికి తెరదించేదిశగా సాగుతున్నదని హాలీవుడ్లైఫ్.కామ్ వెల్లడించింది. తనకున్న సమయాన్ని ఏంజెలీనా పిల్లలు, సామాజిక కార్యక్రమాలకు వెచ్చించడంతోనే సరిపోతున్నదని, దీంతో బ్రాడ్తో గడుపడానికి ఆమె వద్ద పెద్దగా సమయం ఉండటం లేదని ఆ వెబ్సైట్ వెల్లడించింది. అంతేకాకుండా ఏంజిలీనాకు కొన్ని వ్యక్తిగత సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయని, దీంతో ఆమె తరచూ అజ్ఞాతంలో గడుపుతుండటం బ్రాడ్ భరించలేకపోతున్నాడని, ఈ నేపథ్యంలో తమ అనుబంధాన్ని తెంచుకోవాలని ఈ జంట నిర్ణయించిందని ఆ వెబ్సైట్ తన కథనంలో తెలిపింది -
'మా పిల్లలకు ఆ ఉద్దేశం లేదు'
లాస్ ఎంజెల్స్: తమ పిల్లలను నటులుగా తీర్చిదిద్దే ఆలోచనేది ప్రస్తుతం తమకు లేదని ప్రముఖ హాలీవుడ్ స్టార్స్ బ్రాడ్ ఫిట్, ఎంజెలీనా జోలీ తెలిపారు. తన ఆరుగురు పిల్లల్లో ఒక్కరూ కూడా ఈ ఆలోచన చేయడంలేదని, తాము కూడా అలా భావిండచం లేదని తెలిపింది. తమ అడుగుజాడల్లోనే నటనా రంగం వైపు తమ పిల్లలు కూడా నడవాలని తాము అనుకోవడం లదని అన్నారు. అయితే, వారికి నిజంగా అలాంటి అవకాశం వస్తే మాత్రం వదులుకోవద్దని వారికి చెప్తానని చెప్పుకొచ్చింది. 'వారు ఇంకా ముభావంగా ఉండే స్థాయిలోనే ఉన్నారు. వాస్తవానికి వారికి నటులుగా మారాలని లేదు. కానీ వారికి ఆ అవకాశం వస్తే వదులుకోవద్దని చెప్తాను' అని జోలీ చెప్పింది. కుంగ్ ఫు పాండా 3 అనే సినిమాను చూపించేందుకు తన పిల్లలను తీసుకొచ్చిన జోలీ ఈ విషయాలు పంచుకుంది. -
'నాకు డజను సంతానం కావాలనుకున్నా'
లాస్ఏంజిల్స్: 'ఖుషీ' సినిమా క్లైమాక్స్లో పవన్ కళ్యాణ్, భూమిక డజనుకుపైగా పిల్లలతో ఇక్కట్లు పడే సీన్ ఒకటి ఉంటుంది. అదేవిధంగా తనకు కూడా డజను మంది సంతానం ఉండాలన్న కోరిక ఉండేదని హాలీవుడ్ నటుడు బ్రాడ్పిట్ తెలిపాడు. భార్య ఏంజెలినా జోలీతో కలిసి తాను 12 మంది పిల్లల్ని కనాలని భావించినా.. ఇప్పటికే ఇంట్లో ఆరుగురు పిల్లలు ఉండటం.. వారితో వేగలేక ఇళ్లంతా గందరగోళంగా మారాడంతో ఆ ఆలోచన మానుకున్నట్టు చెప్పాడు. ఈ దంపతులకు మడోక్స్ (14), పాక్స్ (11), జహరా (10), శిలొహ్ (9), ఏడేళ్ల కవలలు నాక్స్, వివీన్నె.. మొత్తం ఆరుగురు పిల్లలు ఉన్నారు. 'ఏంజీ, నేను కలిసి 12 మంది పిల్లల్ని కనాలనుకున్నాం. కానీ ఆరుగురికే ఆపేశాం' అని 51 ఏళ్ల బ్రాడ్ చెప్పాడు. ప్రస్తుతం కుటుంబ జీవితం అప్పుడప్పుడు గందరగోళంగా తోస్తుందని ఆయన తెలిపాడు. 'ఎంతో ప్రేమిస్తారు. ఎంతో కొట్టుకుంటారు. ఎన్నో చాడీలు చెప్తారు. అందరి పళ్లు తోమాలి. ముఖం కడుగాలి.. ఇదంతా ఎంతో గందరగోళం. కానీ ఎంతో సంతోషాన్ని కూడా ఇస్తుంది' అని బ్రాడ్పిట్ చెప్పాడు. -
అమ్మాయిలు తప్పు చేయరు: బ్రాడ్పిట్
హాలీవుడ్ స్టార్ హీరోగా అంతర్జాతీయ స్ధాయిలో భారీ గుర్తింపు తెచ్చుకున్న బ్రాడ్పిట్, తన కొడుకుల విషయంలో మాత్రం ఓ సాధారణ తండ్రిగానే ఆలోచిస్తాడట. చిన్నతనంలో తండ్రి తనతో వ్యవహరించిన తీరు చాలా కఠినంగా ఉండేదన్న బ్రాడ్పిట్, తను మాత్రం తన కొడుకులకు క్రమశిక్షణ మాత్రమే నేర్పుతున్నానన్నాడు. సదరన్ బాప్టిస్ట్ కుటుంబానికి చెందిన బ్రాడ్ తన ఫ్యామిలీ విషయాలను వెల్లడించాడు. కొడుకుల విషయంలో క్రమశిక్షణ పాటించే బ్రాడ్, కూతుళ్ల విషయంలో మాత్రం అలా ఉండటానికి ఇష్టపడడట. అమ్మాయిలు సాధారణంగా తప్పు చేయరు. అందుకే వారి మీద ఆంక్షలు విదించాల్సిన అవసరం లేదంటున్నాడు ఈ హాలీవుడ్ స్టార్. 'ఈ ప్రపంచాన్ని వాళ్లకు తెలియజేయటమే నా పని, వారి జీవితంలో వాళ్లు చేయాలనుకున్న పనికి, నేను సాయం చేయాలి. వారికి కావాల్సిన అవకాశాలు అందేలా చూడాలి. వారు తప్పు దారిలోకి వెళుతున్నట్టుగా అనిపిస్తే వారించాలి. తండ్రిగా ఇవే నా బాధ్యతలు.' అంటూ టెలిగ్రాఫ్ మ్యాగజైన్తో తన అనుభవాలను పంచుకున్నాడు. అయితే జోలి, తాను డజను పిల్లలు కావాలనుకున్నామని... ఇప్పటికే ఇల్లంతా పిల్లలతో సందడిగా మారిపోవడంతో ఆరుగురితో సరిపెట్టామని వివరించాడు. 51 ఏళ్ల ఈ హాలీవుడ్ స్టార్కు ఆరుగురు సంతానం. మడాక్స్ (14), పాక్స్ (11), జహర(10), ఫిలొహ్(9), నాక్స్, వివిన్ని అనే ఏడేళ్ల కవలలు బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలిల పిల్లలు. -
మా బంధం సినిమాలా కాదు
హాలీవుడ్ స్టార్స్ ఎంత త్వరగా ఒక్కటవుతారో అంతే త్వరగా విడిపోతారు. అయితే హాలీవుడ్ సూపర్ స్టార్ ఏంజెలినా జూలీ మాత్రం ఇందుకు మినహాయింపు. తన యాక్షన్ ఇమేజ్తో పాటు సోషల్ యాక్టివిటీస్తో కూడా ఎప్పుడు వార్తల్లో ఉండే హాలీవుడ్ ముద్దుగుమ్మ ఫ్యామిలీ రిలేషన్స్ విషయంలో కూడా చాలా ఫర్ఫెక్ట్గా ఉంటుంది. తన సహనటుడు బ్రాడ్పిట్ను పెళ్లాడిన ఈ బ్యూటి అతనితో ఎలాంటి సమస్యలు లేకుండా ఎంతో అన్యోన్యంగా ఉంటోంది. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తున్న ఈ జంట ఇటీవల ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో కలిసి నటించింది. పెళ్లి తరువాత ఇద్దరు దంపతుల మధ్య వచ్చే సమస్యల నేపధ్యంలో ఓ సినిమాను తెరకెక్కించారు. బై ద సీ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఏంజెలినా జోడి కలిసి నటించటమే కాదు ఆ సినిమాను జోలి దర్శకత్వంలో తమ సొంతం నిర్మాణ సంస్థ ద్వారా తెరకెక్కించారు. అయితే ఇటీవల రిలీజ్ అయిన సినిమా ట్రైలర్ లో భార్య భర్తల మధ్య చూపించిన సన్నివేశాలన మాధిరిగా కాకుండా, వ్యక్తిగతంగా తమ రిలేషన్ ఎంతో ఆనందంగా సాగుతుందని జోలి వివరణ ఇచ్చింది. -
మా సమస్యలు మాకున్నాయ్!
వైవాహిక బంధాన్ని కాపాడుకోవడం భార్యాభర్తల్లిద్దరి చేతుల్లో ఉంటుంది. ఒకరి లోపాలను మరొకరు ఇష్టపడాలి. లేదా నచ్చే పద్ధతిలో చెప్పి, మార్చుకోవాలి. ఇలాంటి విషయాలను ప్రస్తావిస్తూ హాలీవుడ్ నటి, దర్శకురాలు ఏంజెలినా జోలీ తీసిన చిత్రం ‘బై ది సీ’. ఈ చిత్రంలో ఏంజెలినా, ఆమె భర్త బ్రాడ్ పిట్ భార్యాభర్తలుగా నటించారు. వైవాహిక జీవితంలో ఏర్పడిన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఓ భార్య, భర్త ఏం చేశారనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది. రియల్ లైఫ్లో తనకూ, బ్రాడ్కూ మధ్య సమస్యలున్నాయంటూ -‘‘ఏ కాపురంలో అయినా అలకలు, కలతలు ఉంటాయి. అవి విడిపోవడానికి కారణం కాకూడదు. అంత దూరం వెళ్లనివ్వకుండానే సమస్యలను పరిష్కరించుకోవాలి. మా మధ్య పొరపొచ్ఛాలు వచ్చినప్పుడు మేం కూర్చుని మాట్లాడుకుంటాం. ఏ విషయాన్నీ తెగేదాకా లాగం. మా సమస్యలను సినిమాలో పెట్టలేదు. సినిమాలో చూపించినవి వేరు’’ అని ఏంజెలినా చెప్పారు. బ్రాడ్ పిట్, ఏంజెలినా పదేళ్ల తర్వాత ఈ చిత్రం కోసం మళ్లీ జత కట్టారు. -
ఏంజెలినా జోలీకి ఏడో పాప
మూడు దేశాలు, మూడు జాతులకు చెందిన పిల్లలను దత్తత తీసుకొని జాతులే కాదు దేశాల సరిహద్దులకు కూడా తాను అతీతమని నిరూపించుకొన్న హాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ ఏంజెలినా జోలీ ఇప్పుడు అంతర్యుద్ధంతో రగిలిపోతున్న సిరియా నుంచి ఓ పాపను దత్తత తీసుకోబోతోంది. గత మూడేళ్లలో ఐక్యరాజ్య సమితి అంబాసిడర్గా పలుసార్లు సిరియాను సందర్శించిన ఏంజెలినా.. అక్కడి శరణార్థుల శిబిరాల్లో నెలకొన్న పరిస్థితులను చూసి చలించిపోయారు. ముఖ్యంగా ఆడేపాడే వయస్సులో ఆకలితో అలమటిస్తున్న పిల్లలను చూసి జాలిపడ్డారు. 'బాల్యాన్ని హైజాక్ చేస్తారా' అంటూ టెర్రరిస్టులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అప్పటి నుంచే సిరియా శరణార్థుల శిబిరాల నుంచి ఓ ఆడపిల్లను దత్తత తీసుకోవాలనే ఆలోచన ఏంజెలినా మనసులో నాటుకుపోయిందని, ఇప్పుడు ఓ పాప దత్తత కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారని 'యూఎస్ వీక్లీ' గురువారం ఓ కథనాన్ని ప్రచురించింది. దత్తత తీసుకున్న ముగ్గురు పిల్లలు, తన కడుపున పుట్టిన ముగ్గురు పిల్లలతో కలుపుకొని ఆమెకు ఆరుగురు పిల్లలు ఉన్నారు. ఆమె ఎప్పటి నుంచో బ్రాడ్ పిట్తో కలసి కాపురం చేస్తున్న ఆమె తన 38వ ఏట గతేడాదే ఆయన్ని పెళ్లి చేసుకున్నారు. ఆరుగురు పిల్లలతో వారు కాలిఫోర్నియాలోని తమ ఇంట్లో ఉంటున్నారు. మడోక్స్ (13 ఏళ్లు), పాక్స్ (11), జహరా (10), శిలోహ్ (8), వివిన్నే (6), నాక్స్ (6). వివిన్నే, నాక్స్లు కవల పిల్లలు. కాంబోడియాలోని నామ్పెన్ నగరం అనాథాశ్రయం నుంచి మడోక్స్ను, వియత్నాంలోని హోచిమన్ నగరం అనాథాశ్రయం నుంచి పాక్స్, ఇథియోపియాలోని అడి అబాబా నగరం అనాథాశ్రయం నుంచి జహరాలను ఏంజెలినా దత్తత తీసుకున్నారు. ఇకముందు పిల్లలు పుట్టే అవకాశం లేకుండా ఆమె ఇటీవలనే అండాశయాన్ని తొలగించుకున్నారు. ఆమె తల్లి, ఇద్దరు సోదరీమణులు అండాశయ క్యాన్సర్తో చనిపోవడంతో, జన్యుపరంగా తనకు కూడా క్యాన్సర్ సోకే అవకాశం ఉండడంతో ముందుజాగ్రత్తగా దాన్ని తొలగించుకున్నారు. క్యాన్సర్ భయంతో ఆమె ఇదివరకే తన బ్రెస్ట్ తొలగించుకున్న విషయం తెలిసిందే. -
మేము ముందే పెళ్లి చేసుకున్నాం!
కాలిఫోర్నియా: అమెరికాలో జరిగిన పెళ్లి వేడుకకు ముందే ఏంజిలీనా జోలీ-బ్రాడ్ పిట్ ల జోడీ ఒక్కటైందట. గత సంవత్సరం ఆగస్టులో పిల్లల సమక్షంలో జరిగిన పెళ్లి తంతుకు ముందే తాము వివాహం చేసుకున్నట్లు హాలీవుడ్ నటి, దర్శకురాలు ఏంజిలీనా తాజాగా స్పష్టం చేసింది. 'ఒక రోజు ఫ్రాన్స్ లో నాలుగు గంటల సమయంలో బ్రాడ్ ను కలిశాను. తరువాత కొన్ని వివాహ పత్రాలపై ఇద్దరం సంతకాలు చేసి ఒక్కటయ్యాం' అని ఏంజలీనా తెలిపింది. అయితే తాము ఫ్రాన్స్ లో చేసుకున్న వివాహం చట్టబద్ధంగా జరగకపోవడంవల్ల మరోసారి కాలిఫోర్నియాలో పెళ్లి చేసుకున్నామన్నామని తెలిపింది. -
పదేళ్ల తర్వాత మళ్లీ జంటగా...
‘‘నా భర్తను డెరైక్ట్ చేయడం ఓ సరికొత్త అనుభూతినిస్తోంది’’ అంటున్నారు హాలీవుడ్ స్టార్ ఏంజెలినా జోలీ. ప్రస్తుతం ఆమె దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘బై ది సీ’. వైవాహిక బంధాన్ని కాపాడుకోవడానికి ఓ భార్య, భర్త ఏం చేశారన్న కథాంశంతో ఈ చిత్రం సాగుతుంది. ఎన్నో ఏళ్ల క్రితం జోలీ ఈ కథ రాసుకున్నారట. కథానాయికగా బిజీగా ఉన్నందున, దర్శకత్వ శాఖలోకి అప్పుడే అడుగుపెట్టడం ఇష్టం లేక ఆమె ఈ కథను తెరకెక్కించలేదు. గత ఏడాది ఆమె బ్రాడ్ పిట్ను పెళ్లి చేసుకున్నారు. అప్పట్నుంచీ ఈ కథను వెండితెరపై ఆవిష్కరించాలనే పట్టుదలతో ఉన్నారు జోలీ. ఇందులో తన నిజజీవిత భర్త బ్రాడ్పిట్, తానూ భార్యాభర్తలుగా నటిస్తే బాగుంటుందని భావించి, ఈ ఏడాది ఈ చిత్రాన్ని ఆరంభించారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. 2005లో జోలీ, పిట్లు ‘మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్’లో నటించారు. పదేళ్ల తర్వాత తామిద్దరం మళ్లీ జంటగా నటిస్తున్నందుకు జోలీ పరమానందపడిపోతున్నారు. -
నన్ను జోలీ దంపతులు కిడ్నాప్ చేశారు!
లాస్ ఏంజిల్స్: తనను హాలీవుడ్ నటి ఏంజిలీనా జోలీ మరియ ఆమె భర్త బ్రాడ్ పిట్ లు కిడ్నాప్ చేశారంటూ సింగర్ క్రిస్ మార్టిన్ తెలిపాడు. ఏంజిలీనా జోలీ దర్శకత్వం వహిస్తున్న 'అన్ బ్రోకెన్' సినిమాకు పిట్ రాస్తున్న పాట కోసం తనను కిడ్నాప్ చేశారని మార్టిన్ అన్నాడు. 'తొలుత ఆ సినిమాకు సంబంధించి ఒక సందేశాన్ని జోలీ-పిట్ లు పంపారు. ఆ పాట ఎలా వస్తుందో నన్ను చూడమంటూ ఆ మెస్సేజ్ సారాంశం. ఇందుకోసం వారు ముందు హెచ్చరించినట్లుగానే నన్ను కిడ్నాప్ చేశారు. తలపై కొట్టడమే కాకుండా ముఖంపై స్ప్రే చేశారు. తరువాత చూస్తే తాను ఒక ఆఫీస్ లో ఉన్నానన్నాడు. అక్కడ బ్రాడ్ పిట్ ఎక్సర్ సైజ్ లు చేస్తుండగా.. ఏంజిలీనా జోలి భర్త ముందు కూర్చుని ఉంది. అంతేకాకుండా ఓ వ్యక్తి తనపీకపై కత్తిపెట్టి కూర్చున్నాడన్నాడు. ప్రస్తుతం పాట రాస్తున్నామని.. అది విన్నాక అభిప్రాయం చెప్పమన్నారని వారు తనకు తెలిపారని మార్టిన్ అన్నాడు. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందండోయ్. ఇదంతా తమ వద్ద ఉన్న సాన్నిహిత్యం కారణంగానే అంటూ మార్టిన్ జోక్ పేల్చాడు. -
వీళ్లు డ్రాపౌట్స్..!
పంచామృతం: చదువు మానేయడం... జీవితాన్నే మార్చేస్తుంది. సాధారణంగా చదువు మానేయడం అనేది జీవితాలను నాశనం చేసే పని. అయితే మరికొంద రికి మాత్రం చదువుకు స్వస్తి పలికాకే ఉన్నత మార్గాలు చేరడానికి దారి దొరికింది. స్కూల్ దశలోనే బడికి నామం పెట్టిన వాళ్లు కొందరు... కాలేజీకి చుట్టపుచూపుగా వెళ్లిన వారు కొందరు... అయినప్పటికీ వాళ్లు వివిధ రంగాల్లో తమ ప్రతిభను చాటారు. చదువుతో వచ్చే గుర్తింపునకు మించి సాధించారు. అలాంటి వారిలో కొందరు. బ్రాడ్పిట్ ఈ హాలీవుడ్ హీరో కొంచెం చిత్రమైన పరిస్థితుల్లో చదువు వదిలేశాడు. సినిమాల్లోకి రాకముందు జర్నలిస్టుగా చేసిన బ్రాడ్ ఆ ఉద్యోగం కోసం చదువు మానేశాడట. జర్నలిస్టు కావడానికి గ్రాడ్యుయేషన్ కూడా అవసరం లేకపోవడంతో బ్రాడ్ ఆ జాబ్లో చేరిపోయాడు. ఆ తర్వాత సినిమాలవైపు అడుగేశాడు. ఆ రంగంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. డేవిడ్ కార్ప్ టీనేజ్లోనే బిలియనీర్గా పేరు సంపాదించుకోవడంతో పాటు... టంబ్లర్ బ్లాగ్ సృష్టికర్తగా కూడా గుర్తింపు ఉన్న కార్ప్ హైస్కూల్ చదువు కూడా పూర్తి చేయకుండా చదువుకు స్వస్తిపలికాడు. తల్లిమాట మేరకు చదువు మానేసి కంప్యూటర్స్ మీద దృష్టి పెట్టాడు. ఆ రంగంలో అద్భుతాలు సాధించాడు. అందుకే అమ్మ మాట వినాలి. దీపికా పదుకొనె మోడలింగ్ కెరీర్తో బిజీ అయిపోయినప్పుడే దీపిక చదువు వదిలేసింది. హై స్కూల్ పూర్తికాగానే ఈమె గ్లామరస్ ఫీల్డ్వైపు వెళ్లాలని ఫిక్సయ్యిందట. మోడలింగ్ చేస్తున్న దశలో దీపిక దూరవిద్యద్వారా బీఏ పూర్తి చేయడానికి ప్రయత్నించింది. కానీ వృత్తిలో బిజీ అయిపోవడంతో అది కూడా సాధ్యం కాలేదు. అయితేనేం దీపిక ఇప్పుడు బాలీవుడ్లోని టాప్ హీరోయిన్లలో ఒకరు! ఆలియా భట్ ఇప్పుడు నీకున్న డ్రీమ్ ఏమిటి? అంటే.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం అని అంటుంది ఆలియా. ప్లస్టూ కూడా సరిగా పూర్తి చేయకుండానే సినిమాలవైపు వచ్చేసిన ఆలియాకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం అనేది సాధ్యం అవుతుందో లేదో కానీ సినిమాల్లో అయితే దూసుకుపోతోంది. తండ్రి మహేశ్భట్ ప్రసిద్ధ దర్శకుడు కావడంతో సినీ పరిశ్రమతో ఏర్పడిన పరిచయాలు ఆలియాను ఈ రంగాన్ని ఎంచుకొనేలా చేశాయి. చదువును పక్కనపెట్టేలా చేశాయి. స్టీవెన్ స్పీల్బర్గ్ అకాడ మిక్ చదువు విషయంలో స్పీల్బర్గ్ ట్రాక్ రికార్డ్ ఏ మాత్రం బాగుండదు. చదువు వంటపట్టించుకోలేకపోయిన స్పీల్బర్గ్కు స్కూళ్లలో, కాలేజీల్లో అడ్మిషన్ లు దక్కించుకోవడమే కష్టం అయ్యింది. అంత కష్టం ఎందుకని ఇష్టమైన రంగంవైపు వచ్చాడు. తన సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకొన్నాడు. -
ఏంజెలినా ఫ్లోటింగ్ ప్యాలెస్!
వైవాహిక జీవితాన్ని సరికొత్తగా ఆస్వాదించాలని డిసైడ్ అయినట్టున్నారు హాలీవుడ్ స్టార్ జంట బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ. దాదాపు 250 మిలియన్ పౌండ్లు వెచ్చించి విలాసవంతమైన నావను కొనుగోలు చేశారు. అలలపై అలాఅలా తేలిపోయే ఈ ఫ్లోటింగ్ ప్యాలెస్ను తమ అభిరుచికి అనుగుణంగా తయారు చేయించుకొంటున్నారు. అంతేకాదు... దీన్ని మరింత ఆధునీకరించేందుకు అక్షరాలా మరో రెండు లక్షల పౌండ్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారట ఈ కొత్త జంట. ఇటాలియన్ బోట్ మేకింగ్ సంస్థ రిజర్డీ దీన్ని రూపొందిస్తోందని ‘ది మిర్రర్’ కథనం. -
2500 కోట్లతో భారీ పడవ కొన్న దంపతులు!
హాలీవుడ్ దంపతులు బ్రాడ్ పిట్, యాంజెలీనా జోలీ ఓ విలాసవంతమైన పడవ కొన్నారు. దాని విలువ దాదాపు 2500 కోట్లు! దాన్ని మరో రెండు కోట్లు వెచ్చించి తమకు తగినట్లుగా మార్పులు చేర్పులు చేయించుకున్నారు. విలాసవంతంగా.. నీళ్లమీద తేలియాడే ప్యాలెస్ లాంటి ఈ పడవలో అత్యద్భుతంగా ఉండే ఇటాలియన్ మార్పుల్ వాడతారు. ఇటాలియన్ కంపెనీ రిజార్డీ ఈ పడవను తయారుచేసింది. డిజిటల్ కెమెరాలను అడ్డుకునే ప్రత్యేక టెక్నాలజీ కూడా ఇందులో ఉంది. అంటే.. ఇందులో ఉన్నవాళ్లను ఫొటో తీయడం దాదాపు అసాధ్యం అన్నమాట 50 ఏళ్ల బ్రాడ్ పిట్, 39 ఏళ్ల యాంజెలీనా జోలీ ప్రస్తుతం మాల్టాలో ఓ సినిమా షూటింగులో ఉన్నారు. గత నెలలో ఫ్రాన్సులో వీళ్లిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. -
ఎట్టకేలకు జోలీ పెళ్లి
లాస్ ఏంజెలిస్: హాలీవుడ్ జంట ఏంజెలినా జోలీ, బ్రాడ్పిట్ ఎట్టకేలకు వైవాహిక బంధం తో ఒక్కటయ్యారు. తొమ్మిదేళ్లుగా సహ జీవనం చేస్తున్న వీరు శనివారం ఫ్రాన్స్లో కుటుంబసభ్యులు, సొంత బిడ్డలు, సన్నిహితుల మధ్య రహస్యంగా వివాహం చేసుకున్నారు. జోలీ(39)కి మూడో వివాహం కాగా, బ్రాడ్పిట్(50)కి రెండోది. వీరిద్దరూ ఒక ఆడపిల్ల, ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. మరో ఆడపిల్ల, ఇద్దరు మగపిల్లలను దత్తత తీసుకున్నారు. 2005లో ‘మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్’ సినిమాలో తొలిసారిగా కలిసి నటించిన తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ ‘బై ద సీ’ సినిమాలో జతకడుతున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది జోలీయే. -
ఫ్రాన్స్ లో ఏజెంలీనా జోలీ, బ్రాడ్ పిట్ల వివాహం
హాలీవుడ్ తారలు ఏజెంలీనా జోలీ, బ్రాడ్ పిట్లు శనివారం ఒక్కటవుతున్నారు. జోలీ, బ్రాడ్ పిట్ల వివాహం ఫ్రాన్స్లోని చాటీ మిరావల్లో జరుగుతుందని వారి ఆధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రైవేట్ కార్యక్రమంగా జరిగే ఈ వివాహానికి సన్నిహితులు, బంధువులు మాత్రమే హాజరువుతున్నారని ఓ ప్రకటనలో తెలిపారు. కాలిఫోర్నియా న్యాయమూర్తి నుండి వివాహపత్రాన్ని తీసుకున్నారని, వీరి పెళ్లిని ఫ్రాన్స్లో న్యాయమూర్తి జరిపిస్తారని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వివాహానికి జోలీ కుమారులు మాడోక్స్, పాక్స్లు కూడా హాజరవుతున్నారు. -
22మంది అతిథుల సమక్షంలో పెళ్లి!
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటారు. ఈ రెండూ ఒకేసారి చేస్తే, మధ్యతరగతి కుటుంబాలవారు కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే. కానీ, హాలీవుడ్ తారలు బ్రాడ్ పిట్, ఏంజెలీనా జోలీ వంటి కోటీశ్వరులకు ఇది చాలా చిన్న విషయం. ఈ ఇద్దరూ ఒకవైపు ఇల్లు కట్టిస్తున్నారు... మరోవైపు తమ పెళ్లికి సంబంధించిన సన్నాహాలు చేసుకుంటున్నారు. తాము ప్రేమలో పడ్డ విషయాన్ని పదేళ్ల క్రితం ప్రకటించింది ఈ జంట. ఎట్టకేలకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది చివర్లో లేక వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఉంగరాలు మార్చుకోవాలని వీరిద్దరూ నిశ్చయించుకున్నారు. పెళ్లయిన తర్వాత ఉండటం కోసం ఓ ఇల్లు కట్టిస్తున్నారు. ఇంటిపని ఇప్పుడు తుది మెరుగుల దశలో ఉంది. మరోవైపు పెళ్లిబట్టలు, నగలను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకునే పని మీద ఉన్నారిద్దరూ. అదేం లెక్కో కానీ.. కేవలం 22 మంది అతిథులను మాత్రమే ఈ వేడుకకు ఆహ్వానించాలనుకున్నారట. అత్యంత నిరాడంబరంగా వివాహం చేసుకోనున్నామనీ, జీవితానికి తీపి గుర్తుగా నిలిచే ఆ తేదీ ఏమిటన్నది త్వరలోనే ప్రకటిస్తామనీ బ్రాడ్, జోలీ జంట పేర్కొంది. -
ఆ కల నెరవేరుతుందా?
జీవితంలో ఏదేదో సాధించాలనే కల అందరికీ ఉంటుంది. కొంతమందే ఆ కలను నెరవేర్చుకోగలుగుతారు. మరి.. సోనాక్షీ సిన్హా తన కలను నెరవేర్చుకుంటారో లేదో చెప్పలేం కానీ.. ఆమె కల ఏంటో మాత్రం తెలుసుకుందాం. బాలీవుడ్లో మంచి ఫామ్లో ఉన్న కథానాయికల్లో ఒకరైన సోనాక్షీ ఇటీవల హాలీవుడ్ చిత్రం ‘రియో 2’లోని ఓ పాత్రకు డబ్బింగ్ చెప్పారు.. అది మంచి అనుభూతినిచ్చిందని సోనాక్షీ తెలిపారు. అలాగే తన కల గురించి చెబుతూ - ‘‘ప్రస్తుతం బాలీవుడ్లో నా కెరీర్ చాలా బాగుంది. ఇతర భాషల నుంచి అవకాశాలు వచ్చినా అంగీకరించేంత తీరిక లేదు. కానీ, హాలీవుడ్ స్టార్స్ జార్జ్ క్లూనీ, బ్రాడ్ పిట్, టామ్ క్రూజ్ సరసన అవకాశం వస్తే మాత్రం సద్వినియోగం చేసేసుకుంటా. ఎందుకంటే, నాకు ఈ ముగ్గురూ అంటే చాలా ఇష్టం. వాళ్లు నటించిన సినిమాలను ఇష్టపడి చూస్తుంటాను. ఆ సినిమాల్లో మనం నటించి ఉంటే ఎంత బాగుండేది? అని కూడా అనుకుంటాను. వెండితెరపై వారి సరసన నటిస్తున్న కథానాయికల స్థానంలో సరదాగా నన్ను నేను ఊహించుకుని చూసుకుంటాను. అంత అభిమానం’’ అని చెప్పారు. ప్రస్తుతం ఆమె హిందీలో ‘హాలిడే’, ‘తేవర్’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.