CMD
-
నేడు స్టీల్ ప్లాంట్ సీఎండీని కలవనున్న పోరాట కమిటీ నేతలు
-
యాజమాన్యానికి షాకిచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు
-
ప్రైవేటీకరణ వైపు స్టీల్ ప్లాంట్ నిజాలు బయటపెట్టిన CMD
-
విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ, కార్మిక సంఘాల నేతల మధ్య సమావేశం
-
ఆరేళ్లలో రూ.30 లక్షల కోట్లు కావాలి
న్యూఢిల్లీ: భారత్ విధించుకున్న కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను సాధించడానికి వచ్చే ఆరు ఆర్థిక సంవత్సరాల్లో (2024–2030) రూ.30 లక్షల కోట్లు అవసరమవుతాయని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ‘ఇరెడా’ సీఎండీ ప్రదీప్ కుమార్ దాస్ అన్నారు. దేశంలో సగం విద్యుత్తును పునరుత్పాదక ఇంధన వనరుల రూపంలో సమకూర్చుకోవాలన్న లక్ష్యాన్ని భారత్ ఏర్పాటు చేసుకోగా, 2070 నాటికి నికరంగా సున్నా కర్బన ఉద్గారాల స్థితికి చేరుకోనున్నట్టు ప్రకటించడం తెలిసిందే. దీంతో సోలార్ పరికరాలు, ఎలక్ట్రోలైజర్లు, పవన విద్యుత్ టర్బయిన్లు, వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ సామర్థ్యాల ఏర్పాటుపై పెట్టుబడులు అవసరమవుతాయని దాస్ చెప్పారు. ప్రపంచబ్యాంక్ నిర్వహించిన ఒక వెబినార్లో భాగంగా ఆయన మాట్లాడారు. పీఎం ప్రారంభించిన పీఎం సూర్యఘర్ మఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని గొప్ప ప్రాజెక్టుగా అభివర్ణించారు. దీని కింద కోటి ఇళ్లకు ప్రతి నెలా 300 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా ఇవ్వాలన్నది లక్ష్యం కాగా, ఇందు కోసం కేంద్ర సర్కారు రూ.75,000 కోట్లను ఖర్చు చేయనుంది. రూఫ్టాప్ సోలార్ ద్వారా దీన్ని చేపట్టనున్నారు. ఈ పథకం వల్ల గణనీయమైన ప్రయోజనాలకు తోడు, ప్రజల్లో పునరుత్పాదక ఇంధనం పట్ల పెద్ద ఎత్తున అవగాహన ఏర్పడుతుందని దాస్ అభిప్రాయపడ్డారు. దేశ కర్బన ఉద్గారాల లక్ష్యాలకు సాయపడుతుందన్నారు. ‘‘వచ్చే మూడేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్యాన్ని భారత్ విధించుకుంది. ఇందుకోసం పెద్ద ఎత్తున ఇంధన డిమాండ్ను చేరుకోవాల్సి ఉంటుంది. ఇందులో 90 శాతం పునత్పాదక ఇంధన వనరుల రూపంలోనే సమకూరనుంది’’అని దాస్ చెప్పారు. -
Poaching Row: ఐటీ కంపెనీల్లో అక్రమ వలసలు.. పెదవి విప్పిన కాగ్నిజెంట్ సీఎండీ
న్యూఢిల్లీ: ఇతర సంస్థల నుంచి అక్రమంగా అత్యున్నత అధికారులను ఆకట్టుకోవడం(పోచింగ్)వల్ల కంపెనీ బిజినెస్పై ఎలాంటి ప్రభావం పడబోదని ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్, ఎండీ రాజేష్ నంబియార్ తాజాగా పేర్కొన్నారు. ఇటీవల దేశీ ఐటీ కంపెనీల మధ్య అత్యున్నత అధికారుల అక్రమ వలస(పోచింగ్)లపై తలెత్తిన ఆరోపణల నేపథ్యంలో నంబియార్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ అంశంపై ప్రత్యేకంగా మాట్లాడేందుకు నిరాకరించిన నంబియార్ ఉద్యోగులతో గల కాంట్రాక్టు అమలుకు కంపెనీలు పట్టుబట్టడాన్ని సమర్ధించారు. ఇందుకు ఆయా కంపెనీలకు అధికారముంటుందని వ్యాఖ్యానించారు. అయితే నాన్పోచింగ్పై పరిశ్రమవ్యాప్తంగా వర్తించే నిబంధనలకు ఆస్కారంలేదని స్పష్టం చేశారు. ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీ అధికారులను లేదా నిపుణులను తీసుకోవడాన్ని నివారించేందుకు నిబంధనలు వర్తింపచేయలేమని అభిప్రాయపడ్డారు. ఐటీ పరిశ్రమ ప్రధానంగా నైపుణ్య ఆధారితంకావడమే దీనికి కారణమని తెలియజేశారు. నిపుణులతోనే నిర్మితమైన సాఫ్ట్వేర్ సేవల పరిశ్రమలో ఉద్యోగ వలసలకు చెక్ పెట్టేందుకు సరైన నిర్వచనాన్ని ఇవ్వలేమని వివరించారు. అయితే ఉపాధి కల్పనకు సంబంధించి పరిశ్రమవ్యాప్తంగా వర్తించే మార్గదర్శకాలకు వీలున్నట్లు తెలియజేశారు. పోచింగ్ సమస్య తమ కంపెనీపై ప్రభావాన్ని చూపబోదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అంతేకాకుండా పరిశ్రమపైన సైతం ప్రభావాన్ని చూపబోదని అభిప్రాయపడ్డారు. గత కొన్ని వారాలుగా సాఫ్ట్వేర్ సేవల దిగ్గజాల మధ్య పోచింగ్ వివాదాలు తలెత్తిన విషయం విదితమే. దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇటీవల.. తమ అధికారులను కాగ్నిజెంట్ అనైతిక పద్ధతుల్లో విధుల్లోకి తీసుకుంటున్నట్లు విమర్శించడంతో పరిశ్రమలో అలజడి తలెత్తింది. గతంలో ఇన్ఫోసిస్లో పనిచేసి ప్రస్తుతం కాగ్నిజెంట్ సీఈవోగా వ్యవహరిస్తున్న రవి కుమార్ ఇతర సంస్థల నుంచి 20 మంది సీనియర్ లీడర్లను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో పలువురు ఇన్ఫోసిస్, విప్రోలో బాధ్యతలు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. ఉద్యోగులతో కనీసం ప్రాథమిక స్థాయిలో నియామకాలలో సైతం ఎలాంటి సర్వీసు ఒప్పందాలు లేదా బాండ్లకు తెరతీయడంలేదని నంబియార్ వివరించారు. క్యాంపస్ల నుంచి ప్రధానంగా ఉద్యోగులకు ఎంపిక చేసుకుంటున్నట్లు తెలియజేశారు. ఇది స్వేచ్చా ప్రపంచమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
బీహెచ్ఈఎల్ సీఎండీగా కొప్పు సదాశివ మూర్తి
న్యూఢిల్లీ: బీహెచ్ఈఎల్ సీఎండీగా కొప్పు సదాశివ మూర్తి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు బీహెచ్ఈఎల్ బోర్డు ఆమోదం తెలిపింది. మూర్తిని సీఎండీగా నియమించే ప్రతిపాదనకు అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ కేబినెట్ (ఏసీసీ) ఆమోదం తెలిపిన విషయమై భారీ పరిశ్రమల శాఖ నుంచి బీహెచ్ఈఎల్కు సమాచారం అందింది. దీంతో సోమవారం సమావేశమైన బీహెచ్ఈఎల్ బోర్డు ఇందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సదాశివ మూర్తి కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సేవలు అందిస్తున్నారు. ‘‘సీఎండీగా కొప్పు సదాశివ మూర్తి నియామకం నవంబర్ 1 తర్వాత పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు అమల్లోకి వస్తుంది. పదవీ విమరణ తేదీ 2027 ఫిబ్రవరి 28 వరకు లేదంటే, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు (ఏది ముందు అయితే అది) ఈ నియామకం అమల్లో ఉంటుంది’’అని బీహెచ్ఈఎల్ తెలిపింది. -
కోటక్ మహీంద్రా సీఎండీగా ఉదయ్ కోటక్ రాజీనామా
Uday Kotak resigns: కొటాక్ మహీంద్రా బ్యాంక్ సీఎండీ ఉదయ్ కోటక్ రాజీనామా చేశారు. షెడ్యూల్ కంటే 3 నెలల ముందుగానే తన పదవికి రాజీనామా చేయడం వార్తల్లో నిలిచింది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్లోవెల్లడించింది. ఆయనను బ్యాంక్ సీఎండీ బాధ్యతలనుంచి వైదొలిగినట్టు పేర్కొంది. ఈ రాజానామాను బ్యాంక్ బోర్డు ఆమోదం మేరకు సెప్టెంబర్ 1, 2023 నుండి అమలులోకి వచ్చిందని తెలిపింది. అటు సీఎండీగా స్వచ్ఛందంగా వైదొలగుతున్నట్టు ఉదయ్ కోటక్ కూడా ట్విటర్లో వెల్లడించారు. విశ్వసనీయత , పారదర్శకత ప్రాథమిక సిద్ధాంతాలతో తాము విశిష్ట సేవలందించామనీ, లక్షకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పించామని పేర్కొన్నారు. 1985లో రూ. 10వేల మొదలైన తమ ప్రస్తానం ఈరోజు దాదాపురూ. 300 కోట్లకు చేరిందన్నారు. తమ సంస్థ సామాజిక , ఆర్థిక శక్తి కేంద్రంగా మార్చడంలో మరింత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనే విశ్వాసాన్ని ప్రకటించారు. వ్యవస్థాపకుడిగా, కోటక్ బ్రాండ్తో చాలా అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. (చిన్న రుణాలనుంచి..వరల్డ్ టాప్ బ్యాంకర్స్లో స్థానం దాకా! కిక్ అంటే ఇది!) Succession at Kotak Mahindra Bank has been foremost on my mind, since our Chairman, myself and Joint MD are all required to step down by year end. I am keen to ensure smooth transition by sequencing these departures. I initiate this process now and step down voluntarily as CEO.… — Uday Kotak (@udaykotak) September 2, 2023 చాలా కాలం క్రితం, JP మోర్గాన్, గోల్డ్మన్ సాక్స్ వంటి పేర్లు ఆర్థిక ప్రపంచంలో ఆధిపత్యం చూశాను . దేశంలో అలాంటి సంస్థను సృష్టించాలని కలతోనే నేను 38 సంవత్సరాల క్రితం కోటక్ మహీంద్రాను ముంబైలోని ఫోర్ట్లో 300 చదరపు అడుగుల కార్యాలయంలో 3 మంది ఉద్యోగులతో ప్రారంభించా. నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ , ముఖ్యమైన వాటాదారుగా సేవను కొనసాగినన్నారు.వ్యవస్థాపకులు వెళ్ళిపోతారు, కానీ సంస్థ శాశ్వతంగా వర్ధిల్లుతుందంటూ ట్వీట్ చేశారు. -
పీఎఫ్సీ సీఎండీగా పర్మిందర్ చోప్రా బాధ్యతలు
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ఎన్బీఎఫ్సీ, ప్రభుత్వరంగ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) చైర్మన్, ఎండీగా (సీఎండీ) పర్మిందర్ చోప్రా బాధ్యతలు స్వీకరించారు. సంస్థకు తొలి పూర్తి స్థాయి మహిళా చైర్మన్ అని పీఎఫ్సీ తెలిపింది. జూన్ 1 నుంచి పీఎఫ్సీ సీఎండీగా అదనపు బాధ్యతలను ఆమె నిర్వహిస్తుండగా, ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆ బాధ్యతల్లోకి వచ్చారు. అంతక్రితం వరకు పీఎఫ్సీ డైరెక్టర్ (ఫైనాన్స్)గా పనిచేశారు. డైరెక్టర్ (ఫైనాన్స్)గా పర్మిందర్ చోప్రా ఎన్పీఏలను కనిష్టానికి తగ్గించి, సంస్థ లాభదాయకతను పెంచడంలో, మహారత్న హోదా పొందడంలో కీలకంగా పనిచేశారు. విద్యుత్, ఫైనాన్షియల్ రంగాల్లో 35 ఏళ్ల అనుభవం ఉంది. -
ఎన్ఎండీసీ తాత్కాలిక సీఎండీగా అమితవ ముఖర్జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మైనింగ్ రంగ దిగ్గజం ఎన్ఎండీసీ తాత్కాలిక సీఎండీగా సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ అమితవ ముఖర్జీ అదనపు బాధ్యతలు స్వీకరించారు. మూడు నెలలు లేదా కొత్త సీఎండీ నియామకం పూర్తి అయ్యే వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు. 1995 బ్యాచ్ ఇండియన్ రైల్వేస్ అకౌంట్స్ సర్వీస్కు చెందిన ముఖర్జీ 2017లో ఎన్ఎండీసీలో చేరారు. ఎన్ఎండీసీ సీఎండీ పదవి కోసం పోటీపడుతున్న ఏడుగురిలో ముఖర్జీ కూడా ఉన్నారు. -
ఇన్ఫోసిస్కి షాకిచ్చిన టెక్ఎం కొత్త సీఎండీ, రోజు సంపాదన ఎంతో తెలుసా?
సాక్షి, ముంబై: ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్ , టెక్ దిగ్గజం టెక్ మహీంద్రా సీఎండీగా మోహిత్ జోషి ఎంపికైన సంగతి తెలిసిందే. భారతీయ ఐటీ పరిశ్రమలో అత్యంత ముఖ్యమైన పదివిని వరించిన ఈ నేపథ్యంలో ఆయన విద్యార్హతలు, టెక్ ప్రపంచంలో అనుభవం, వార్షికవేతన తదితర అంశాలు చర్చకు దారి తీసాయి. మోహిత్ జోషి ఎవరు? టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్లో 22 సంవత్సరాల అనుభవజ్ఞుడైన మోహిత్ జోషి ఢిల్లీ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి. ఇప్పటివరకు ఆయన ఒక్క రోజు వేతనం రూ. 9.5 లక్షలు. రెండు దశాబ్దాల అనుభవంతో ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ సాఫ్ట్వేర్,కన్సల్టింగ్ రంగంలో నిపుణుడు. ఇన్ఫోసిస్ కంటే ముందు అనేక ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో పనిచేశారు. (ఇదీ చదవండి: జాక్పాట్ అంటే ఇదే! నిమి...రతన్ టాటాను మించిపోయాడు!) 1974 ఏపప్రిల్13న జన్మించారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఆర్కే పురం నుండి పాఠశాల విద్య పూర్తి చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి చరిత్రలో తన గ్రాడ్యుయేషన్, తరువాత ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (FMS) నుండి MBA చేసాడు. అమెరికా హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నుండి ప్రపంచ నాయకత్వం , పబ్లిక్ పాలసీని కూడా అధ్యయనం చేశాడు. 2000లో ఇన్ఫోసిస్లో చేరి, వివిధ హోదాల్లో పనిచేశారు. మోహిత్ తన కెరీర్లో ఆసియా, అమెరికా,యూరప్, మెక్సికోలో పనిచేశారు. జోషికి భార్య ఇద్దరు కుమార్తెలతో లండన్లో నివసిస్తున్నారు. 2021 సంవత్సరంలో, మోహిత్ జీతం రూ. 15 కోట్ల నుండి రూ. 34. 82 కోట్లకు పెరిగింది. ఇన్ఫోసిస్ ఫైలింగ్ ప్రకారం, అతను 2021-2022లో రూ. 34,89,95,497 (రూ. 34.89 కోట్లు) జీతం పొందారు. ఇన్ఫోసిస్కి పెద్ద దెబ్బే ఇటీవలి కాలంలో ఇన్ఫోసిస్కి ఇది రెండో అతిపెద్ద నిష్క్రమణ. ఇటీవలే రవికుమార్ ఎస్ ఇన్ఫోసిస్కి గుడ్బై చెప్పి కాగ్నిజెంట్కు సీఈఓగా చేరారు. జోషిని బోర్డులో ఉంచడానికి ఇన్ఫోసిస్ చివరి నిమిషం దాకా ప్రయత్నించింది విఫలమైందట. జోషి నిష్క్రమణ ఇన్ఫోసిస్కి పెద్ద లోటేనని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. ఇన్ఫీ సీఎండీ సలీల్ పరేఖ్ తరువాత అత్యధిక పే అందుకున్నవారు జోషి మాత్రమే. (మైక్రోసాఫ్ట్లో మూడో రౌండ్ తీసివేతలు, ఈసారి ఎవరంటే?) గుర్నానీకి సరైన ప్రత్యామ్నాయం టెక్ మహీంద్రా సీఎండీ గుర్నానీ పదవీ విరమణ చేస్తున్న తరుణంలో ఆయనకు సరైన ప్రత్యామ్నాయంగా టెక్ఎం భావించడం విశేషం. డిసెంబర్ 20నుంచి మోహిత్ జోషి బాధ్యతలను స్వీకరించనున్నారని టెక్ మహీంద్ర స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ సమాచారంలోశనివారం ప్రకటించింది. అయితే టెక్ఎం సీఎండీగా జోషి వేతనం, ఇతర ప్రయోజనాలపై ప్రస్తుతానికి అధికారిక సమాచారం ఏదీ అందుబాటులో లేదు. మోహిత్ జోషి గురించి మరిన్ని విషయాలు మోహిత్ జోషి ఇన్ఫోసిస్ మాజీ సీఈవొ ఎడ్జ్వెర్వ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఛైర్మన్గా సేవలు అవివా Plcలో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా రిస్క్ & గవర్నెన్స్ నామినేషన్ కమిటీలలో సభ్యుడు CBI (కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండస్ట్రీ) ఎకనామిక్ గ్రోత్ బోర్డ్ వైస్ చైర్ 2014లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, దావోస్ యంగ్ గ్లోబల్ లీడర్ (YGL)గా ఎంపిక -
ఇన్ఫోసిస్కు బై..బై చెప్పి ప్రత్యర్థి కంపెనీకి సీఎండీగా బాధ్యతలు
సాక్షి, ముంబై: దేశీయ ఆరో అతిపెద్ద టెక్ దిగ్గజం టెక్ మహీంద్రా కొత్త సీఈవోగా మోహిత్ జోషి ఎంపికయ్యారు. ప్రస్తుత సీఎండీ సీపీ గుర్నానీ స్థానంలో ఆయన సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్గా చేరనున్నారు. డిసెంబర్ 20నుంచి మోహిత్ జోషి బాధ్యతలను స్వీకరించనున్నారని టెక్ మహీంద్ర ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో శనివారం ప్రకటించింది. గుర్నానీ పదవీ కాలం డిసెంబర్ 19న ముగియనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ జోషి ప్రత్యర్థి టెక్ మహీంద్రాలో చేరడానికి కంపెనీకి రాజీనామా చేసినట్లు రెండు సంస్థలు స్టాక్ ఎక్స్ఛేంజ్కు తెలిపాయి. 2000 నుండి ఇన్ఫోసిస్లో భాగమైన మోహిత్ జోషి 2023,మార్చి 11రాజీనామా చేశారు.జోషి మార్చి 11 నుండి సెలవులో ఉంటారని, జూన్ 9 చివరి తేదీ అని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్కి ఒక ప్రకటనలో ఇన్ఫోసిస్ తెలిపింది. అలాగే మోహిత్ జోషి డిసెంబర్ 2023 నుండి 5 (ఐదు) సంవత్సరాలపాటు 2028 వరకు పదవిలో ఉంటారని టెక్ ఎం వెల్లడించింది. ఇన్పీ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ హెల్త్కేర్/లైఫ్ సైన్సెస్ వ్యాపార హెడ్గా పనిచేసిన జోషికి ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ మరియు కన్సల్టింగ్ స్పేస్లో రెండు దశాబ్దాల అనుభవం ఉంది. ఇన్ఫోసిస్లో, జోషి గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ & హెల్త్కేర్, సాఫ్ట్వేర్ బిజినెస్కు నాయకత్వం వహించారు. అలాగే ఎడ్జ్వెర్వ్ సిస్టమ్స్కు ఛైర్మన్గా కూడా పనిచేశారు. ఇన్ఫోసిస్తో పాటు, ABN AMRO, ANZ Grindlays వంటి ప్రపంచంలోని అతిపెద్ద సంస్థలతో కూడా పనిచేశారు. సీబీఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండస్ట్రీ) ఎకనామిక్ గ్రోత్ బోర్డ్ వైస్ చైర్గా సేవలందించారు. Aviva Plcలో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గాను, రిస్క్ అండ్ గవర్నెన్స్ నామినేషన్ కమిటీలలో సభ్యుడిగా ఉన్నారు. 2014లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో గ్లోబల్ యంగ్ లీడర్ ప్రోగ్రామ్కు ఆహ్వానితుడు కూడా. మోహిత్ జోషి ఢిల్లీ యూనివర్శిటీ నుండి ఎంబీఏ, ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. -
విచారణ పేరుతో వేధించడం మానుకోండి!
న్యూఢిల్లీ: చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ), చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) వంటి ఒక కంపెనీ సీనియర్ మేనేజ్మెంట్ అధికారులను ఆషామాషీగా పిలవడం (సమన్స్ జారీ), వారిని అరెస్ట్ చేయడం వంటి విధానాలను విడనాడాలని క్షేత్రస్థాయి కార్యాలయాలను జీఎస్టీ (వస్తు సేవల పన్ను) ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ ఆదేశించింది. జీఎస్టీ చట్టం కింద యాంత్రిక పద్ధతిలో అరెస్టు చేసే విధానాలకు పాల్పడవద్దని స్పష్టం చేసింది. ప్రత్యక్ష పన్నులు, సుంకాల కేంద్ర బోర్డ్ (సీబీఐసీ) పర్యవేక్షణలో పనిచేసే ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఈ మేరకు ఫీల్డ్ ఆఫీసర్లకు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. వీటికి సంబంధించి కొన్ని కీలకాంశాలను చూస్తే.. ►ఒక వ్యక్తి వ్యక్తిగత స్వేచ్ఛ అరెస్టు వల్ల దెబ్బతింటుంది. అటువంటి చర్య విశ్వసనీయమైన అంశాల ఆధారంగా ఉండాలి. అరెస్టును మామూలుగా, యాంత్రికంగా చేయకూడదు. ►జీఎస్టీ ఎగవేత ఆరోపణలకు సంబంధించి నేరస్థుడిని అరెస్టు చేయాలనుకుంటే, సంబంధిత అధికారుల కోసం మార్గదర్శకాల చెక్లిస్ట్ను కూడా ఫీల్డ్ ఆఫీసర్లు పరిగణనలోకి తీసుకోవాలి. నేరస్థుడు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందా లేదా సాక్షులను బెదిరించే అవకాశం ఉందా, నేరానికి ఆ వ్యక్తి సూత్రధారా? వంటి ప్రశ్నలను ఒకటికి రెండుసార్లు సరిచేసుకోవాలి. ►చట్టపరమైన అవసరాలను నెరవేర్చడమే కాకుండా, ఒక వ్యక్తిని అరెస్టు చేయాలని నిర్ణయించే ముందు సంబంధిత అంశాలు తప్పనిసరిగా సరైన దర్యాప్తుతో నిర్ధారించుకోవాలి. సాక్ష్యాలను తారుమారు చేయడం లేదా సాక్షులను బెదిరించడం లేదా ప్రభావితం చేయడం వంటి అవకాశాలను నిరోధించడానికి, ఆ అవసరం ఏర్పడినప్పుడే అరెస్టులు జరగాలి. ►ఏదైనా కంపెనీ లేదా పీఎస్యూ (ప్రభుత్వ రంగ సంస్థ) సీఎండీ, ఎండీ, సీఈఓ, సీఎఫ్ఓ వంటి సీనియర్ మేనేజ్మెంట్ అధికారులకు సాధారణంగా మొదటి సందర్భంలోనే సమన్లుజారీ చేయకూడదు. ఆదాయాన్ని కోల్పోవడానికి దారితీసిన నిర్ణయం తీసుకునే ప్రక్రియలో వారి ప్రమేయంపై జరిగిన దర్యాప్తులో వారి ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడే వారిని పిలిపించాలి. ►మెటీరియల్ ఎవిడెన్స్, సంబంధిత పత్రాల కోసం ఫీల్డ్ ఆఫీసర్లు కంపెనీల ఉన్నతాధికారులను ‘ఏదో ఆషామాషీగా’ పిలుస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, జీఎస్టీ పోర్టల్లో ఆన్లైన్లో అందుబాటులో ఉండే జీఎస్టీఆర్–3బీ, జీఎస్టీఆర్–వంటి చట్టబద్ధమైన రికార్డుల కోసం సైతం కంపెనీ అధికారులకు సమన్లు పంపుతున్నట్లు సమాచారం. జీఎస్టీ పోర్టల్లో డిజిటల్గా ఆన్లైన్లో అందుబాటులో ఉన్న చట్టబద్ధమైన పత్రాల కోసం సమన్ల జారీ చేయడం ఎంతమాత్రం తగదు. సుప్రీంకోర్టు రూలింగ్కు అనుగుణంగా... అరెస్టుకు సంబంధించిన జీఎస్టీ ఇన్వెస్టిగేషన్ అథారిటీ మార్గదర్శకాలు సుప్రీంకోర్టు ఇటీవలి ఇచ్చిన ఒక తీర్పును పరిగణనలోకి రూపొందాయి. ‘‘చట్టబద్ధమైన రీతిలోనే, దీనిని అనుగుణంగా నడుచుకోలేదని స్పష్టమైన ఆధారాలతోనే ఒక అరెస్ట్ జరగాల్సి ఉంటుంది’’ అని సుప్రీంకోర్టు తన రూలింగ్లో పేర్కొంది. అరెస్టు చేసే అధికారం– దానిని అమలు చేయడానికి గల సమర్థనకు మధ్య తేడాను గుర్తించాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆకర్షణీయం వివిధ సందర్భాల్లో సాధారణ విషయాల కోసం కంపెనీల సీనియర్ అధికారులకు సమన్లు జారీ అవుతున్నాయి. కంపెనీ పన్ను విభాగంతో పరిష్కారమయ్యే అంశాలకు సైతం సీనియర్ అధికారులకు సమన్లు తగవు. ఈ నేపథ్యంలో జీఎస్టీ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ మార్గదర్శకాలు హర్షణీయం. – అభిషేక్ జైన్, కేపీఎంజీ వేధింపులకు అడ్డుకట్ట తాజా మార్గదర్శకాలు కింది స్థాయి జీఎస్టీ అధికారుల విపతీరమైన విధింపులను అరికట్టడానికి దోహదపడతాయని విశ్వసిస్తున్నాం. రజత్ మోహన్,ఏఎంఆర్జీ అండ్ అసోసియేట్స్ -
ప్రత్యేక కంపెనీగా స్పైస్ఎక్స్ప్రెస్
న్యూఢిల్లీ: కార్గో, లాజిస్టిక్స్ సంస్థ స్పైస్ఎక్స్ప్రెస్ను ప్రత్యేక కంపెనీగా విడదీసేందుకు బ్యాంకులు, వాటాదారులు అనుమతించినట్లు స్పైస్జెట్ ఎయిర్లైన్ తాజాగా వెల్లడించింది. వచ్చే నెల(ఆగస్ట్) తొలి వారంలో స్పైస్ఎక్స్ప్రెస్ను విడదీయనున్నట్లు స్పైస్జెట్ సీఎండీ అజయ్ సింగ్ పేర్కొన్నారు. కార్గో, లాజిస్టిక్స్ సర్వీసులను స్లంప్ సేల్ ప్రాతిపదికన అనుబంధ సంస్థ స్పైస్ఎక్స్ప్రెస్కు బదిలీ చేస్తున్నట్లు గతేడాది ఆగస్ట్ 17న స్పైస్జెట్ తెలియజేసింది. తద్వారా సంస్థకు స్వతంత్రంగా నిధుల సమీకరణ చేపట్టేందుకు వీలు చిక్కనున్నట్లు వెల్లడించింది. కాగా.. జూన్ 19 మొదలు కంపెనీ విమానాలలో ఎనిమిదిసార్లు సాంకేతిక సమస్యలు నమోదుకావడంతో గత వారం డీజీసీఏ నుంచి స్పైస్జెట్కు షోకాజ్ నోటీసు జారీ అయిన సంగతి తెలిసిందే. భద్రత, సమర్థత, విశ్వసనీయ విమానయాన సర్వీసులు అందించడంలో స్పైస్జెట్ వైఫల్యం చెందిందంటూ డీజీసీఏ పేర్కొంది. -
సింగరేణి సీఎండీ పదవీ కాలం పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ పదవీ కాలం మరో ఏడాది పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి మరో ఏడాది పాటు శ్రీధర్ను ఆ పదవిలో కొనసాగిస్తూ సీఎస్ సోమేశ్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2015 జనవరి1 నుంచి శ్రీధర్ ఆ పదవిలో కొనసాగుతుండగా, ఇప్పటికే ఐదుసార్లు ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. ఇప్పటికే ఏడేళ్ల పాటు ఆ పదవిలో ఉన్న శ్రీధర్కు మళ్లీ పొడిగింపు ఇవ్వడం గమనార్హం. -
Alka Mittal: డాక్టర్ అల్కా మిట్టల్... ఈ పేరే ఓ రికార్డు... తొలి మహిళగా
Alka Mittal Successful Journey: అది 1956. భారత ప్రభుత్వం ఓఎన్జీసీకి రూపకల్పన చేసింది. ఆ సంస్థ 65 ఏళ్ల మహోన్నత చరిత్రను రాసుకుంది. ఇప్పుడు... ఆ చరిత్రను ఓ మహిళ తిరగరాసింది. ఇప్పుడు దేశమంతా ఆమెనే చూస్తోంది. ఆమె ఓఎన్జీసీ సీఎండీ డాక్టర్ అల్కా మిట్టల్. డాక్టర్ అల్కా మిట్టల్... ఈ పేరే ఓ రికార్డు. ప్రసిద్ధ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ)కు సీఎండీగా నియమితులయ్యారామె. ఓఎన్జీసీ చరిత్రలో ఒక మహిళ సీఎండీ బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. గత రెండు రోజులుగా వార్తల్లో ప్రధానవ్యక్తిగా నిలిచారామె. ఎవరీ అల్కా మిట్టల్ అని, ఆమె వయసెంత అని, ఇంత పెద్ద బాధ్యతలు చేపట్టగలగడానికి ఆమె ఏం చదువుకున్నారు అనే ప్రశ్నలు గూగుల్ని శోధిస్తున్నాయి. ఆమె ఈ నెల ఒకటవ తేదీన అల్కా మిట్టల్ను సీఎండీగా అదనపు బాధ్యతల్లో నియమించినట్లు సోమవారం ఆ సంస్థ ట్విటర్లో ప్రకటించింది. అదేరోజు ఆమె సీఎండీగా అదనపు బాధ్యతలను స్వీకరించారు. ఆమె ఆ బాధ్యతల్లో ఆరునెలల పాటు ఉంటారు. ఒకవేళ ఈలోపు పూర్తిస్థాయిలో సీఎండీ నియామకం జరిగినట్లయితే అప్పటి వరకు ఆమె సీఎండీగా అదనపు బాధ్యతలను నిర్వహిస్తారు. చదవడం హాబీ డాక్టర్ అల్కా మిట్టల్ వయసు 56. పర్యటనలు, పుస్తక పఠనం, రాయడం అల్కామిట్టల్ హాబీలు. అలా హాబీగా చాలా చదివేశారామె. డెహ్రాడూన్లోని ఎంకేపీ పీజీ కాలేజ్ నుంచి 1983లో ఎకనమిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. రాజ్గురు మహావిద్యాలయ నుంచి ఎంబీఏ (హెచ్ఆర్), ఆ తర్వాత ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా నుంచి బిజినెస్, కామర్స్, కార్పొరేట్ గవర్నెన్స్లో 2001లో పీహెచ్డీ పట్టా అందుకున్నారు. అదీ రికార్డే ప్రస్తుతం ఓఎన్జీసీ సంస్థ చైర్పర్సన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా కొత్త బాధ్యతలు చేపట్టడానికి మునుపు 2018 నుంచి ఆమె ఆ సంస్థలో హెచ్ఆర్ డైరెక్టర్గా ఉన్నారు. ఆ సంస్థలో పూర్తిస్థాయి డైరెక్టర్గా నియమితమైన రికార్డు కూడా ఆమెదే. ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ రంగంలో ప్రసిద్ధ సంస్థ ఓఎన్జీసీకి సీఎండీగా ఒక మహిళ బాధ్యతలు చేపట్టడం అనేది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ స్థాయి ఆమెకు ఏ ఒక్కరోజులోనో వచ్చి వాలిన హోదా కాదు. గ్రాడ్యుయేట్ ట్రైనీగా 1985లో ఓఎన్జీసీలో చేరిన అల్కామిట్టల్ మూడున్నర దశాబ్దాలుగా రకరకాల విధులు నిర్వర్తించారు. ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, ఓఎన్జీసీ మంగుళూరు పెట్రో కెమికల్స్లో బోర్డు మెంబర్గా క్రియాశీలకంగా వ్యవహరించారు. అల్కా మిట్టల్ ఉత్తరాది రీజియన్కు చెందిన ‘ఫోరమ్ ఫర్ ఉమెన్ ఇన్ ద పబ్లిక్ సెక్టార్’ ప్రెసిడెంట్గా మహిళలకు క్షేమకరమైన పని వాతావరణం కల్పించడానికి అవసరమైన సూచనలు చేశారు. వడోదర, ముంబయి, ఢిల్లీ, జోర్హాత్లలో హెచ్ఆర్ విధులు నిర్వర్తించి ఉన్నారు. ఓఎన్జీసీలో ఆమె చీఫ్ స్కిల్ డెవలప్మెంట్ (సీఎస్డీ)గా అత్యంత క్రియాశీలకంగా పని చేశారు. దేశవ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి ఐదు వేల మందికి ‘నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్’ ద్వారా స్కిల్ ట్రైనింగ్ ఇప్పించారు. దేశంలో ఉన్న అన్ని ఓఎన్జీసీ శాఖల్లో పని చేసే వాళ్లకు ఒకేరకమైన తర్ఫీదు అవసరం అనే ఉద్దేశంతో ఆమె ఈ ప్రత్యేక ప్రోగ్రామ్కు రూపకల్పన చేశారు. ఆఫ్షోర్ (చమురు నిక్షేపాలను తవ్వి వెలికి తీయడానికి సముద్ర గర్భంలోకి వెళ్లడం) బాధ్యతలను కూడా సమర్థంగా నిర్వర్తించారామె. తొలి తరం మహిళ అల్కా మిట్టల్ను సీఎండీగా నియమించడానికి ముందు ఆ సంస్థ తొమ్మిది మందిని ఇంటర్వ్యూ చేసింది. అందులో ఇద్దరు విధుల్లో ఉన్న ఐఏఎస్లు కూడా ఉండడం విశేషం. మహిళలు అన్ని రంగాల్లో విశేషమైన సేవలందిస్తూ కెరీర్లో దూసుకుపోతున్నారు. కానీ కంపెనీ హెడ్ హోదాలో మాత్రం నూటికి తొంబై కంపెనీల్లో మగవాళ్లే ఉంటున్నారనేది కాదనలేని సత్యం. మహిళలు ఉద్యోగులుగా సేవలందించడానికే పరిమితమవుతున్నారనే నివేదికలను కాదనలేం. అయితే గ్లాస్ సీలింగ్ను బ్రేక్ చేసిన అతికొద్ది మంది మహిళల జాబితాలో చేరారు అల్కామిట్టల్. మహిళలు పెద్దగా ఆసక్తి చూపించని ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో అడుగుపెట్టిన తొలితరం మహిళగా ఆమెను చెప్పుకోవచ్చు. అలాగే సీఎండీగా అల్కా మిట్టల్ నియామకం ద్వారా ఆ కంపెనీ మహిళలు, మగవాళ్లకు సమాన అవకాశాలు కల్పించే ‘ఈక్వల్ ఆపర్చునిటీ ఎంప్లాయర్’ అనే గౌరవాన్ని దక్కించుకుంది. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో...తొలి మహిళలు ►విక్కీ హోలబ్, సీఈవో, యూఎస్లోని ఆక్సిడెంటల్ పెట్రోలియమ్ ఆయిల్ కంపెనీ ►లిండా కుక్, సీఈవో, నార్త్ సీ ఆయిల్.. ప్రొడ్యూసర్ ప్రీమియర్ ఆయిల్ క్రెసోర్ హోల్డింగ్ ►కేథరీన్ రో, సీఈవో, వెంట్వర్త్ రీసోర్సెస్, టాంజానియా ►మారియానా జార్జ్, సీఈవో, దక్షిణ, తూర్పు యూరప్లో అతి పెద్ద ఎనర్జీ కంపెనీ ఓఎమ్వీ పెట్రోమ్ ఆఫ్ ఆస్ట్రియా ►మనదేశంలో అల్కామిట్టల్కంటే ముందు ఈ రంగంలో నిషి వాసుదేవ రికార్డు సృష్టించారు. ఆమె 2014 మార్చిలో హిందూస్థాన్ పెట్రోలియమ్ కంపెనీలో కీలక బాధ్యతలను స్వీకరించారు. చదవండి: మంచు ఖండంలో మెరిసిన వజ్రం -
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కెయూరాకు సుచిరిండియా సీఎండీ రూ.లక్ష ప్రోత్సాహం
సాక్షి, హైదరాబాద్: లయన్ కిరణ్ సుచిరిండియా అధినేత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కెయూరాను ప్రోత్సహించేందుకు లక్ష రూపాయలను అందించారు. జూబ్లీహిల్స్లోని సుచిరిండియా కార్యలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సుచిరిండియా సీఎండి లయన్ కిరణ్ కుమార్ లక్ష రూపాయల చెక్కును ఆమెకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులను ప్రోత్సహించడం ద్వారా భారత్ తరుపున పోటీపడి పతకాలు సాధించి వారు ప్రపంచ స్థాయిలో భారత్కు గుర్తింపు తీసుకొస్తారన్నారు. ఈ నేపథ్యంలో గత 15 ఏళ్లుగా క్రికెట్ నుంచి మొదలుకొని అన్ని రకాల క్రీడాకారులకు సుచిరిండియా తరుపున అవసరమైన సామాజిక ఆర్థిక సహాకారాన్ని అందిస్తున్నామని అన్నారు. యువ క్రీడాకారలను గుర్తించి వారికి అవసరమైన సాయాన్ని అందించడం ద్వారావారు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారన్నారు. కెయూరాకు మున్ముందు అవసరమైన మరింత సాయాన్ని అందిస్తామన్నారు. ఇప్పటికే సుచిరిండియా తరుపున గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులకు అవసరమైన సాయాన్ని అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నామని, అంతేకాకుండా రన్ ఫర్ హైదరాబాద్, రన్ ఫర్ హ్యాపినెస్ కార్యక్రమాలను నిర్వహించామని కిరణ్కుమార్ తెలిపారు. కెయూరా మాట్లాడుతూ.. ఆల్ ఇండియా కేటగిరిలో 12వ ర్యాంకును, ఇంటర్నేషనల్ టోర్నీలలో 240 ర్యాంకులో ఉన్న తాను తాజాగా ఐరిష్ ఓపెన్ చాలెంజ్లో బ్రాంజ్ పతకం సాధించానని అన్నారు. జనవరిలో ఇండియా ఓపెన్తోపాటు మరో రెండు టోర్నీల్లో పాల్గొంటున్నానని అన్నారు. తన తల్లిదండ్రలు తనకు ఎంతో స్పూర్తి అని, వారి కారణంగానే తాను ఇంత దూరం వచ్చానన్నారు. తన తండ్రి ఉద్యోగాన్ని వదిలి అయిదేళ్లుగా తన క్రీడా భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నారన్నారు. తప్పనిసరిగా దేశం కోసం పతకాలు సాధిస్తామని, సుచిరిండియా అందిస్తున్న సాయానికి పతకాలు సాధించి తగిన ఫలితం చూపుతానని అన్నారు. ఇగ్నోలో బీకాం మొదటి సంవత్సరం పూర్తి చేశాను. చదువు, ఆటకు సమప్రాధాన్యం ఇస్తున్నట్లు కెయూరా వివరించారు. -
ఏపీలో డిస్కంల పనితీరు భేష్
సాక్షి, అమరావతి: ఏపీలోని విద్యుత్ పంపిణీ సంస్థలు మంచి పనితీరు కనబరుస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రశంసించారు. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్ఈసీ) సీఎండీ సంజయ్ మల్హోత్రా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎండీ డాక్టర్ ఆర్ఎస్ థిల్లాన్ బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు. అనంతరం సంజయ్ మల్హోత్రా మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించినట్లు చెప్పారు. కేంద్రం ఆర్డీఎస్ఎస్ పేరిట కొత్త పథకాన్ని ప్రారంభించిందన్నారు. దీనిపై సీఎంతో పాటు ఇతర ఉన్నతాధికారులతో చర్చించినట్లు తెలిపారు. వెంటనే తెలంగాణ విద్యుత్ బకాయిలు ఇప్పించండి.. తెలంగాణ చెల్లించాల్సిన రూ.6,283.88 కోట్ల విద్యుత్ బకాయిలను వెంటనే ఇప్పించాలని కేంద్ర అధికారులను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కేంద్ర ప్రభుత్వం బలవంతం చేయడం వల్లే రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు విద్యుత్ సరఫరా చేశామని గుర్తు చేసింది. ఆర్ఈసీ సీఎండీ సంజయ్ మల్హోత్రా, పీఎఫ్సీ సీఎండీ ఆర్ఎస్ థిల్లాన్ బుధవారం సీఎస్ సమీర్శర్మ, ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికారులు పలు అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ‘మీకు చెల్లించాల్సిన బకాయి కంటే తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన బకాయిలే ఎక్కువ. ముందు వాటిని ఇప్పించండి’ అని కోరారు. ఏపీ జెన్కో చెల్లించాల్సిన బకాయిలపై వడ్డీలు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఆర్థిక పరంగా ఏపీకి రావాల్సిన వాటిని వెంటనే వచ్చేలా సహకరించాలని కోరారు. -
ఇన్చార్జ్ సీఎండీల పాలనలో ట్రాన్స్కో, జెన్కో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో ఇన్చార్జిల పాలనలోనే కొనసాగుతోంది. ట్రాన్స్కో సీఎండీగా ఆ సంస్థ జేఎండీ సి.శ్రీనివాస రావు, తెలంగాణ జెన్కో సీఎండీగా సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్కు అదనపు బాధ్యతలను కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు వీరు అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎండీగా ప్రభాకర్రావు కొనసాగింపుపై అస్పష్టత...: ట్రాన్స్కో, జెన్కో సంస్థలకు 2014 అక్టోబర్ నుంచి డి.ప్రభాకర్రావు ఉమ్మడి సీఎండీగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ అనుమతితో గత ఆగస్టు 19 నుంచి 31 వరకు సెలవుపై వెళ్లారు. అనంతరం సెప్టెంబర్ 22 వరకు ప్రభాకర్రావు సెలవు పొడిగించుకున్నారు. అక్టోబర్ 1న విధుల్లో చేరి... ఆరు వరకు కొనసాగారు. ఆ తర్వాత నుంచి మళ్లీ ఆయన విధులకు హాజరు కాలేదు. సెలవు మంజూరు కోసం దరఖాస్తు కూడా చేసుకోలేదు. దీంతో ట్రాన్స్కో, జెన్కో సంస్థలకు సీఎండీలుగా జె.శ్రీనివాసరావు, ఎన్.శ్రీధర్లను అదనపు బాధ్యతల్లో కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర ఇంధన శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఉత్తర్వుల్లో ప్రభాకర్రావు సెలవుల పొడిగింపు అంశం ప్రస్తావించకపోవడంతో ట్రాన్స్కో, జెన్కో సీఎండీ పదవుల్లో ఆయన కొనసాగుతారా? లేదా? అన్నది విద్యుత్ సౌధలో చర్చనీయాంశంగా మారింది. ప్రభాకర్రావు సీఎండీ పదవికి రాజీనామా చేసి ఉండవచ్చని చర్చ జరుగుతుండగా, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం వర్గాలు తోసిపుచ్చాయి. ఆయన కొనసాగుతారా? లేదా ? అన్న అంశంపై సీఎంఓ వర్గాలు కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. -
విశాఖ స్టీల్ సీఎండీగా అతుల్ భట్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీగా అతుల్ భట్ నియమితులయ్యారు. గతంలో ఆయన టాటా స్టీల్తో పాటు పలు స్టీల్ప్లాంట్లలో పనిచేశారు. ఈ నియామకంతో ఆయన విశాఖకు సీఎండీగా జులై 1 నుంచి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. చదవండి: బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి -
విశాఖ స్టీల్ప్లాంట్ సీఎండీగా అతుల్ భట్
ఉక్కునగరం: విశాఖ స్టీల్ప్లాంట్ నూతన చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా మెకాన్ సీఎండీ అతుల్ భట్ ఎంపికయ్యారు. స్టీల్ప్లాంట్ సీఎండీగా బాధ్యతలు నిర్వహించిన పి.కె.రథ్ మే 31న పదవీ విరమణ చేయడంతో పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు (పీఈఎస్బీ) ఆధ్వర్యంలో నూతన సీఎండి ఎంపిక కోసం శుక్రవారం న్యూఢిల్లీలో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలో అతుల్ భట్ ఎంపికైనట్టు పీఈఎస్బీ వెబ్సైట్లో పొందుపరిచారు. 1986లో టాటా స్టీల్లో కెరీర్ ప్రారంభించిన భట్కు వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్ధలో పనిచేసిన విశేష అనుభవం ఉంది. 2002 నుంచి 2007 వరకు ఇరాన్లోని మిట్టల్ స్టీల్లో కంట్రీ మేనేజర్గా విధులు నిర్వహించారు. 2007 నుంచి 2008 వరకు లండన్లోని ఆర్సిలరీ మిట్టల్లో మెర్జర్స్, ఎక్విజిషన్స్ విభాగం జనరల్ మేనేజర్గా పనిచేశారు. 2009 నుంచి 2010 వరకు యూరప్లోని మెటలక్స్ వరల్డ్ సంస్థలో కమర్షియల్ మేనేజర్గా పనిచేసిన అనుభవం ఉంది. 2016 నుంచి ప్రభుత్వ రంగ ‘మెకాన్’కు సీఎండిగా ఉన్నారు. -
విశాఖ స్టీల్ప్లాంట్ టర్నోవర్ రూ.18 వేల కోట్లు
విశాఖపట్టణం: విశాఖ స్టీల్ప్లాంట్ 2020–21లో రూ.18 వేల కోట్లు టర్నోవర్ సాధించింది. స్టీల్ప్లాంట్ ప్రారంభించిన నాటి నుంచి ఇదే రెండో అత్యధిక టర్నోవర్ కావడం విశేషం. గురువారం స్టీల్ప్లాంట్ ఉన్నతాధికారుల వర్చువల్ సమావేశంలో సీఎండీ పి.కె.రథ్ గత ఏడాది ప్లాంట్కు సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఈ వ్యవధిలో 4.45 మిలియన్ టన్నులు అమ్మకాల ద్వారా 13 శాతం వృద్ధి సాధించామన్నారు. గత నాలుగు నెలల్లో రూ. 740 కోట్లు నికర లాభం సాధించామన్నారు. మార్చి నెలలో ఎన్నడూ లేని విధంగా 7.11 లక్షల టన్నులు అమ్మకాలతో రూ.3,300 కోట్లు టర్నోవర్ జరిగిందన్నారు. గత ఏడాది మార్చి నెలలో రూ. 2,329 కోట్లు అమ్మకాలు చేయగా ఈ ఏడాది 42 శాతం వృద్ధి సాధించడం జరిగిందన్నారు. 2020 డిసెంబర్ నుంచి రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధించడమే కంపెనీ ప్రగతికి ముఖ్య కారణమన్నారు. అదే విధంగా ఈ ఏడాది 1.3 మిలియన్ టన్నులు విదేశాలకు ఎగుమతులు చేయడం ద్వారా గత ఏడాది కంటే 261 శాతం వృద్ధి సాధించామన్నారు. ఈ ఏడాది సీఎస్ఆర్ కార్యక్రమాల్లో భాగంగా కోవిడ్–19 సందర్భంగా పీఎం కేర్స్ ఫండ్కు ఇచ్చిన రూ.5 కోట్లతో పాటు మొత్తం రూ.10 కోట్లు వ్యయం చేశామన్నారు. రాయబరేలీలో నిర్మించిన ఫోర్జ్డ్ వీల్ ప్లాంట్లో ఉత్పత్తి ఈ వారంలో ప్రారంభం కానుందన్నారు. ఉక్కు ఉత్పత్తి, అమ్మకాల కోసం విశేషంగా కృషి చేసిన ఉద్యోగులను ఆయన అభినందించారు. డైరెక్టర్ (కమర్షియల్) డి.కె.మొహంతి, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్)కె.కె.ఘోష్, డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎ.కె. సక్సేనా, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (సీవీఓ) కె.వి.ఎన్. రెడ్డి పాల్గొన్నారు. -
టాటా మోటార్స్ కొత్త బాస్ ఎవరంటే?
సాక్షి, ముంబై: భారతదేశపు అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ లిమిటెడ్ కొత్త బాస్ను ఎన్నుకుంది. ప్రస్తుత సీఎండీ పదవిని వీడనున్న తరుణంలో 2021 జూలై 1 నుండి మార్క్ లిస్టోసెల్లాను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్గా నియమించినట్లు టాటా మోటార్స్ శుక్రవారం (నిన్న) ప్రకటించింది. ప్రస్తుత ఎండీ, సీఈవో గుంటర్ బషెక్ స్థానంలో ఈ కొత్త నియామకం జరగింది. బషెక్ వ్యక్తిగత కారణాలతో జర్మనీకి మారనున్న సంగతి తెలిసిందే. మార్క్ నియామకంపై టాటా మోటార్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశంలో విస్తృతమైన కార్యాచరణ వాణిజ్య వాహనాల్లో అపార అనుభవం, నైపుణ్యంతో మార్క్ ఆటోమోటివ్ బిజినెస్ లీడర్గా ఉన్నారన్నారు. మార్క్ సారధ్యంలో సంస్థను ఉన్నత శిఖరాలకు తీసుకెళుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు తన నూతన బాధ్యతలపై మార్క్ స్పందిస్తూ భారత్తో తనకున్న అనుబంధంలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమంటూ ఆనందాన్ని ప్రకటించారు. సంస్థ సామర్థ్యాన్ని సంయుక్తంగా మరింత ముందుకు తీసుకెళతామని చెప్పారు. గతంలో మార్క్ ఫ్యుజో ట్రక్, బస్ కార్పొరేషన్ సీఈవోగా, డెమ్లర్ ట్రక్స్ ఆసియా హెడ్గా ఉన్నారు. 2016లో సీఎండీగా ఎంపికైన గుంటర్ బషెక్ నేతృత్వంలో టాటా మోటార్స్ దూసుకెళ్లింది.వ్యక్తిగత కారణాల వల్ల కాంట్రాక్ట్ చివరిలో జర్మనీకి మకాం మార్చాలని గుంటెర్ నిర్ణయించున్నారు. అయితే 2021, జూన్ 30 వరకు పదవిలో కొనసాగాలని టాటా బోర్డు చేసిన అభ్యర్థనను మన్నించారని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. కాగా కరోనా, లాక్డౌన్ సంక్షోభాలనుంచి ఇపుడిపుడే తేరుకుంటున్న టాటా మోటార్స్ డిసెంబర్ త్రైమాసికంలో గత 33 త్రైమాసికాలలో లేని అత్యధిక లాభాలను గడించింది. వార్షిక ప్రాతిపదికన 67.2 శాతం పెరిగి 2,906 కోట్ల లాభాలను ఆర్జించింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం సంవత్సరానికి 5.5 శాతం పుజుకుని 75,654 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఏడాది క్రితం ఇది 71,676 కోట్ల రూపాయలు. -
జీ మీడియాకు పునీత్ గోయెంకా రాజీనామా
సాక్షి, ముంబై: జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జీల్) సీఎండీ పునిత్ గోయెంకా జీ మీడియా నాన్-ఎగ్జిక్యూటివ్, నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. కంపెనీ డైరెక్టర్ పదవికి గోయెంకా రాజీనామా చేశారని, తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని జీ మీడియా ఎక్స్ఛేంజ్ సమాచారంలో బుధవారం తెలిపింది. 2010 జనవరి నుంచి జీల్ ఎండీ గా ఉన్న గోయెంకా ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర పెద్ద కుమారుడు. గోయెంకా జనవరి 1, 2010 నుండి జీ ఎంటర్టైన్మెట్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. మరోవైపు జీ మీడియా కార్పొరేషన్ ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 11.14 కోట్లుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో కంపెనీ 86.66 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఆదాయం 18.42 శాతం తగ్గి 138.15 కోట్ల రూపాయలకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 169.35 కోట్లుగా ఉంది. మల్టీ బిలియన్ డాలర్ల ఎస్సెల్ గ్రూపులో జీ మీడియా కార్పొరేషన్ లిమిటెడ్ (గతంలో జీ న్యూస్ లిమిటెడ్) ఒకభాగం. -
కాగ్నిజెంట్ ఇండియా సీఎండీ రాజీనామా
కాగ్నిజెంట్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్ట్ రామ్కుమార్ రామ్మూర్తి తన పదవులకు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కాగ్నిజెంట్ ప్రధాన కార్యాలయం సీఈవో బ్రియాన్ హంప్రీస్ శుక్రవారం వెల్లడించారు. కాగ్నిజెంట్ ఇండియా కంపెనీలో రామ్మూర్తి సుమారు 23 ఏళ్లపాటు పనిచేశారు. ఈయన 2019లో సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి వందలాది మంది సీనియర్ ఉద్యోగులు కాగ్నిజెంట్ నుంచి వైదొలిగారు. ఇదే కంపెనీలో 24ఏళ్ల పాటు సేవలు అందించిన కాగ్నిజెంట్ గ్లోబల్ డెలివరీ హెడ్ ప్రదీప్ షిలిగే కూడా సెప్టెంబర్ 30న వైదొలగనున్నారు. ఆయన స్థానంలో యాక్సెంచర్ ఎగ్జిక్యూటివ్ ఆండీ స్టాఫోర్డ్ను నియమిస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘కరోనా వైరస్ ప్రపంచాన్ని కబళిస్తున్న ఈ సమయంలో మీరు క్లయింట్ లకు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. ఈ సంక్లిష్ట సమయంలో ప్రపంచదేశాలకు మరిన్ని సేవలు అందిచాల్సిన బాధ్యత కాగ్నిజెంట్పై ఉంది. ఇప్పటికే సంస్థ అనేక దేశాల్లో సేవలందిస్తున్నది. ప్రపంచంలో తమ కంపెనీ బ్రాండ్ విలువ కూడా భారీగా పెరిగింది’’ అని ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో సీఈవో బ్రియాన్ పేర్కొన్నారు. ఇదే విధంగా రామ్మూర్తి కంపెనీకి అందించిన సేవలు మరువలేనివని, సంస్థ ఉన్నతికి చాలా కృషి చేశారని బ్రియాన్ కొనియాడారు. -
విద్యుత్ బిల్లులపై సందేహాలు తీరుస్తాం
సాక్షి, హైదరాబాద్: గత మూడు నెలలకు సం బంధించి ఒకేసారి రీడింగ్ తీయడం వల్ల బిల్లులు అధికంగా వచ్చాయని కొంతమంది విద్యుత్ వినియోగదారులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో సందేహాలు తీర్చడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ జీ రఘుమారెడ్డి గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. సంస్థ పరిధిలోని అన్ని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. వినియోగదారులు సామాజిక మాధ్యమాల ద్వారా కూడా తమ బిల్లుకు సంబంధించిన సందేహాలను తీర్చుకోవచ్చని స్పష్టంచేశారు. సంస్థ మెయిల్ ఐడీ customerservice@tssouthernpower.com, ట్విట్టర్ ఖాతా TsspdclCorporat@twitter, ఫేస్బుక్ ఖాతా gmcsc.tsspdcl@facebook. com లకు అందుకున్న ఫిర్యాదులను 2 పని దినములలో పరిష్కరించి బిల్లింగ్ వర్క్ షీట్ ద్వారా వినియోగదారునికి జవాబు పంపాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలియజేశారు. వినియోగదారులు తమ విద్యుత్ వాడకం బిల్లులపై ఏవైనా సందేహాలు, సమస్యలు ఉన్న యెడల తమ బిల్ పైభాగంలో ముద్రించిన ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్ (ఉఖౖ)ను సంప్రదించి గాని (లేదా) పైన పేర్కొన్న సంస్థ ఈ మెయిల్/ట్విట్టర్/ పేస్బుక్ పేజీకి పంపి తమ సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. -
‘అపోహ వద్దు.. రెండు నెలల బిల్లులు విడిగానే’
సాక్షి, విజయవాడ: మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన కరెంటు బిల్లులపై అదనంగా వసూలు చేసే అవకాశం లేదని ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ కో సీఎండీ నాగులపల్లి శ్రీకాంత్ వెల్లడించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ రెండు నెలలకు సంబంధించిన కరెంటు బిల్లులు కలిపి ఇస్తారనే అపోహలో చాలా మంది ప్రజలు ఉన్నారన్నారు. అయితే దానిపై ఎలాంటి గందరగోళం లేదని, రెండు బిల్లులు విడివిడిగా లెక్క కట్టామని ఆయన స్పష్టం చేశారు. గత అయిదేళ్లుగా మార్చిలో 46 శాతం వినియోగం, ఏప్రిల్లో నెలలో 54 శాతం వినియోగం ఉంటుందని, అందుకే ఏప్రిల్లో అధికంగా ఉన్న నాలుగు శాతాన్ని మార్చిలో కలిపినట్లు తెలిపారు. (‘ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా జగన్ బాటలోనే’ ) ఇక రెండు నెలలకు 50 శాతంగా లెక్క కట్టి బిల్లులు ఇవ్వడంతో స్లాబ్ మారే అవకాశం లేదన్నారు. ఏప్రిల్లో అదనంగా వచ్చిన యూనిట్లను మార్చిలో కలిపామని, మార్చి కి, ఏప్రిల్కు బిల్లులు విడివిడిగా ఎస్ఎంఎస్లు పంపుతామని చెప్పారు. మార్చి నెలకు సంబంధించిన గత సంవత్సరం టారీఫ్ ఏప్రిల్ నెలకు సంబంధించిన కొత్త టారీఫ్ ప్రకారం బిల్లులు పెట్టామని వెల్లడించారు. వినియోగదారులకు అనుకూలంగానే బిల్లింగ్ చేయడం జరిగిందని, ఎక్కడ ఒక్క యూనిట్ కూడా అదనంగా బిల్లింగ్ జరగలేదని తెలిపారు. కాగా లాక్ డౌన్ నేపథ్యంలో గృహ వినియోగం పెరిగిందని, సమస్యల పరిష్కారం కోసం ప్రతి జిల్లాకు ప్రత్యేక అధికారులను నియమించామని చెప్పారు. ఇక ప్రజలకు బిల్లులపై ఏమైనా అపోహాలు ఉంటే 1912కి డయల్ చేసి చేసి ఫిర్యాదు చేయాలని శ్రీకాంత్ సూచించారు. (వైరల్ ట్వీట్: ముంబై పోలీసులపై ప్రశంసలు) -
ఆ వార్తలు నిజం కాదు: జోయాలుక్కాస్
హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్ సీఎండీ జాయ్ అలూక్కాస్ క్షేమంగా ఉన్నారని ఆ గ్రూప్ ప్రకటించింది. సామాజిక మాధ్యమాల్లో ఆయన ఆరోగ్యానికి సంబంధించి ప్రచారమవుతోన్న తప్పుడు వార్తలను ఖండించింది. దుబాయ్లో మరణించిన ఒక వ్యాపారి పేరు సంస్థ సీఎండీ పేరుకు దగ్గరగా ఉన్న నేపథ్యంలో పొరపాటున అసత్య కథనాలను పలు వార్తా సంస్థలు ప్రచారం చేశాయని వెల్లడించింది. మరణించిన వ్యాపారి పేరు జాయ్ అరక్కల్ అని, ఆయనకు జాయ్ అలూక్కాస్కు సంబంధం లేదని స్పష్టంచేసింది. -
యస్ బ్యాంకు : సత్వర చర్యలు, కస్టమర్లకు ఊరట
సాక్షి, ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంకులో పునరుద్ధరణ చర్యలు చకా చకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే ఆర్బీఐ పునరుద్ధరణ ప్రణాళిక ప్రతిపాదనలను ఆమోదించిన కేంద్ర కేబినెట్ తదుపరి చర్యల్ని కూడా అంతే వేగంగా పూర్తి చేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే పాలనాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రశాంత్ కుమార్ను సీఈవో, ఎండీగా ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం (మార్చి 14)న వెల్లడించింది. అంతేకాదు శుక్రవారం రాత్రి జారీ చేసిన నోటిషికేషన్ ప్రకారం పునరుద్ధరణ ప్రణాళిక అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మార్చి 18, సాయంత్రం 6 గంటల నుంచి తాత్కాలిక నిషేధం రద్దు అవుతుంది. అంటే యస్ బ్యాంకు ఖాతాదారుడు రూ. 50వేల కు మించి నగదు ఉపసంహరించుకునే వెసులుబాటు కలుగుతుంది. పీఎన్బీ మాజీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సునీల్ మెహతా యస్ బ్యాంకు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే మహేష్ కృష్ణమూర్తి, అతుల్ భేడా నాన్ఎగ్జిక్యూటివ్ డైరెర్టర్లుగా వ్యవహరించ నున్నారు. ఇదివరకే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన దాని ప్రకారం యస్ బ్యాంక్పై ప్రస్తుతం అమలు చేస్తున్ననిషేధాన్ని(మారటోరియం)ఎత్తివేసిన వారం రోజుల్లోగా వీరంతా బాధ్యతలు స్వీకరించ నున్నారు. తద్వారా యస్ బ్యాంకుకు కొత్త డైరెక్టర్ల బోర్డు ఏర్పాటు కానుంది. కాగా యస్ బ్యాంక్పై ఆంక్షలతోపాటు, ఖాతాదారుల నగదు ఉపసంహరణపై నెల రోజుల పాటు నిషేధాన్ని ఆర్బీఐ విధించింది. అలాగే స్టేట్ బ్యాంక్ మాజీ సీఎఫ్వో, డిప్యూటీ ఎండీగా పనిచేసిన ప్రశాంత్ను యస్ బ్యాంక్ పాలనాధికారిగా రిజర్వ్ బ్యాంక్ నియమించిన సంగతి తెలిసిందే. -
ఎయిర్ ఇండియా సీఎండీగా రాజీవ్ బన్సాల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు సీఎండీగా సీనియర్ ప్రభుత్వ అధికారి రాజీవ్ బన్సాల్ను ప్రభుత్వం గురువారం నియమించింది. నాగాలాండ్ క్యాడర్కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ బన్సాల్.. గతంలో విజయవంతంగా సంస్థను నడిపించారు. 2017లో మూడు నెలలపాటు మధ్యంతర సీఎండీగా సేవలందించారు. ఆ సమయంలో వ్యయాలను గణనీయంగా తగ్గించి, సమయానికి విమానాలు నడిచేలా చేశారు. దీంతో ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంస్థను గాడిలో పెట్టేందుకు ఆయన్ని మళ్లీ నియమించింది. -
మరో రెండేళ్లు పొడిగింపు
న్యూఢిల్లీ: లిస్టైన కంపెనీల సీఎమ్డీ (చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్) పదవి విభజన గడువును మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ మరో రెండేళ్లు పొడిగించింది. ఈ మేరకు కంపెనీల నుంచి వచ్చిన వినతులను సెబీ మన్నించింది. సెబీ నిబంధనల ప్రకారం, మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా అగ్రశ్రేణి 500 లిస్టెడ్ కంపెనీలు సీఎమ్డీ పదవిని చైర్మన్గా, ఎమ్డీగా విభజించాల్సి ఉంది. దీనికి గడువును ఈ ఏడాది ఏప్రిల్ 1గా నిర్ణయించింది. లిస్టెడ్ కంపెనీల్లో కార్పొరేట్ గవర్నెన్స్ను మెరుగుపరచడం లక్ష్యంగా, కోటక్ కమిటీ సూచనల మేరకు సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ గడువును మరో రెండేళ్లపాటు పొడిగించాలని తాజాగా సెబీ నిర్ణయించింది. గడువు పొడిగింపునకు సంబంధించిన కారణాలను సెబీ వెల్లడించలేదు. అయితే ప్రస్తుత ఆర్థిక మందగమన కాలంలో సీఎమ్డీ పదవిని రెండుగా విభజించడం ఒకింత భారంతో కూడుకున్నదని, ఈ గడువును పొడిగించాలని పలు కంపెనీలు విన్నవించడంతో సెబీ గడువును పొడిగించిందని సమాచారం. ప్రస్తుతం టాప్ 500 లిస్టెడ్ కంపెనీల్లో సగం మాత్రమే సీఎమ్డీ పదవిని రెండుగా విభజించాయని స్టాక్ ఎక్సే్చంజ్ల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పలు కంపెనీలు ఈ రెండు పదవులను కలిపేశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, విప్రో, హీరో మోటోకార్ప్, తదితర కంపెనీల్లో ఈ రెండు బాధ్యతలను ఒక్క వ్యక్తే నిర్వహిస్తున్నారు. -
మారుతి బాస్గా మళ్లీ ఆయనే
సాక్షి, ముంబై: దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఎండి, సీఈవోగా మళ్లీ కెనిచి అయుకవ నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవీలో కొనసాగనున్నారని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. బుధవారం జరిగిన బోర్డు సమావేశంలో కెనిచిని తిరిగి నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. కెనిచి నియామకం 2019 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. 2013 మార్చిలో ఆయన సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా అవకాశంతో మూడోసారి కూడా మరోవమూడుళ్లపాటు కెనిచి సీఎండీగా కొనసాగనున్నారు. -
కొత్త ‘దొర’ ఎవరు?
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)కు కొత్త సీఎండీ ఎవరన్న దానిపై చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు సీఎండీగా ఉన్న హెచ్వై దొర రాజీనామాతో ఈ ప్రతిష్టాత్మక పదవి ఎవరిని వరిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలోని ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లలో ఒక డిస్కంకు ఐఏఎస్, మరొక డిస్కంకు నాన్ ఐఏఎస్లు సీఎండీలుగా నియమించాలన్న నిబంధన ఉంది. దానికి లోబడే సీఎండీల నియామకాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎస్పీడీసీఎల్కు ఐఏఎస్ అధికారి ఎంఎం నాయక్, ఈపీడీసీఎల్కు నాన్ ఐఏఎస్ అధికారి హెచ్వై దొర ఉన్నారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో దొర సీఎండీ పదవి నుంచి సోమవారం వైదొలిగారు. ఈ స్థానంలో మరొకరిని నియమించే వరకు ఎస్పీడీసీఎల్ సీఎండీ నాయక్కు తాత్కాలికంగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఇన్నాళ్లూ డిస్కంల్లో డైరెక్టర్, సీఎండీ పోస్టులకు వయసుతో పనిలేకుండా పదవీ విరమణ చేసిన వారిని కూడా నియమించేవారు. ఇకపై డిస్కం/ట్రాన్స్కో/జెన్కోల్లో డైరెక్టర్, సీఎండీ పోస్టులను 60 ఏళ్ల లోపు వారికే ఇచ్చేలా ఈనెల 15న ప్రభుత్వం సవరణ చేస్తూ జీవో జారీ చేసింది. ప్రభుత్వం వ్యూహాత్మకంగానే ఈ జీవోను జారీ చేసినట్టు స్పష్టమవుతోంది. సీఎండీ దొర చేత రాజీనామా చేయించి, ఆ స్థానంలో పదవీ విరమణ చేసిన వారు పోటీ పడకుండా అడ్డుకట్ట వేయడంలో భాగంగానే దీనిని విడుదల చేసినట్టు తేటతెల్లమవుతోంది. కొత్త జీవో ప్రకారం ప్రభుత్వ సర్వీసులో ఉన్న వారే సీఎండీ/డైరెక్టర్ పోస్టులకు అర్హులవుతారు. అంటే ఇకపై రిటైర్ అయిన వారికి ఆ పోస్టుల్లో అవకాశం ఉండదన్నమాట! వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ఈపీడీసీఎల్కు కొత్త సీఎండీని నియమించాల్సి ఉంటుంది. ఒక డిస్కంకు ఐఏఎస్, మరో డిస్కంకు నాన్ ఐఏఎస్ ప్రాతిపదికన ప్రస్తుతం ఎస్పీడీసీఎల్కు ఐఏఎస్ అధికారి ఎంఎం నాయక్ సీఎండీగా కొనసాగుతున్నారు. ఈ లెక్కన ఈపీడీసీఎల్కు నాన్ ఐఏఎస్ నియామకం జరపాల్సి ఉంది. ఇప్పుడు ఈ పోస్టుకు ఎవరు అర్హులన్న దానిపై ఈపీడీసీఎల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎండీ పదవికి డైరెక్టర్ లేదా చీఫ్ ఇంజినీర్/చీఫ్ జనరల్ మేనేజర్లు అర్హులు. ఈపీడీసీఎల్లో ప్రస్తుతం ఉన్న ఇద్దరు డైరెక్టర్లు బి.శేషుకుమార్, చంద్రశేఖర్లు పదవీ విరమణ చేసి కొనసాగుతున్నవారే. తాజా జీవో వల్ల వారికి సీఎండీ అయ్యే అవకాశం లేదు. ఇక సీజీఎంలుగా పి.సింహాద్రికుమార్, కె.సత్యనారాయణమూర్తి, జి.శ్రీనివాసరెడ్డిలు ఉన్నారు. వీరు ఏడాది, ఏడాదిన్నరలోనే పదవీ విరమణ చేయనున్నారు. ఈపీడీసీఎల్కు కార్తికేయమిశ్రా రిక్వెస్ట్? మరోవైపు ఈపీడీసీఎల్ సీఎండీ పదవికి ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పేరు వినిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్పీడీసీఎల్కు ఆయన ఏడాదిన్నర కాలం సీఎండీగా పనిచేశారు. గతంలో కొద్దిరోజులపాటు ఆయన ఈపీడీసీఎల్కు కూడా ఇన్చార్జి సీఎండీగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఆయన కొన్నాళ్ల క్రితం ఈపీడీసీఎల్ సీఎండీగా నియమించాలంటూ ప్రభుత్వానికి విన్నవించినట్టు సమాచారం. మారిన పరిస్థితుల్లో ఆయనకు అవకాశం ఇవ్వచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. అదే జరిగితే ఎస్పీడీసీఎల్కు నాన్ ఐఏఎస్ సీఎండీని నియమించే వీలుంది. కాగా నేడో, రేపో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి రానుండడంతో ఆయన నియామకానికి వీలుపడదని చెబుతున్నారు. అందువల్ల సార్వత్రిక ఎన్నికలయ్యే దాకా ఎస్పీడీసీఎల్ సీఎండీ నాయక్నే కొనసాగించే అవకాశం ఉంది. మరోవైపు నాయక్ మంగళవారం ఏపీఈపీడీసీఎల్ సీఎండీగా పూర్తి అదనపు బాధ్యతలను తిరుపతిలోని ఎస్పీడీసీఎల్ కార్యాలయం నుంచే స్వీకరించారు. -
తలదించుకున్న దొరతనం
అసిస్టెంట్ ఇంజినీర్ నుంచి సీఎండీ పదవి వరకు అంచెలంచెలుగా ఎదిగారు. మరెవ్వరికీ దక్కని అవకాశాన్ని దక్కించుకున్నారు. విద్యుత్ శాఖలోని అన్ని ఇంజినీరింగ్ పదవులను చేపట్టి ‘దొర’గా వెలుగొందారు. ఏకంగా యాభై ఏళ్లు ఏకఛత్రాధిపత్యాన్ని చెలాయించారు. చివరకు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయి పదవి నుంచి తప్పుకున్నారు. ఇంకా పదవీకాలం ఏడు నెలలుండగానే ఆయన నిష్క్రమించారు. ఈపీడీసీఎల్లో అర్థంతరంగా పదవి నుంచి వైదొలగిన ప్రథమ సీఎండీగా రికార్డుకెక్కారు. ఆయనే ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ హెచ్వై దొర. సాక్షి, విశాఖపట్నం: ఈపీడీసీఎల్ సీఎండీ దొర తరచూ ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నారు. అయినప్పటికీ తనకున్న పలుకుబడితో వాటి నుంచి బయటపడుతూ వస్తున్నారు. ఆఖరికి ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీగా ఆయనపై వచ్చిన ఆరోపణలు మెడకు చుట్టుకొని తల వంచుకొని నిష్క్రమించాల్సివచ్చింది. హెచ్వై దొర ఏపీఎస్ఈబీలో 1978లో అసిస్టెంట్ ఇంజినీర్గా విశాఖలోనే ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. చీఫ్ ఇంజినీర్ స్థాయిలో 2008లో పదవీ విరమణ పొందారు. అదే ఏడాది ఈపీడీసీఎల్ డైరెక్టర్గా నియమితులైన 2013లో ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ పీఠం ఎక్కారు. 2017 సెప్టెంబర్ 15న ఈపీడీసీఎల్ సీఎండీగా నియమితులయ్యారు. ఈయన పదవీకాలం 2018 సెప్టెంబర్తో ముగియాల్సి ఉన్న తరుణంలో ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని ఏడాదిపాటు పొడిగించింది. ఈ లెక్కన ఆయన వచ్చే సెప్టెంబర్ వరకు ఈ పదవిలో కొనసాగాల్సి ఉంది. ఇంతలో రాజీనామా చేయాల్సివచ్చింది. ఆరోపణలు కొత్త కాదు దొరపై ఆరోపణలు కొత్త కాదు. ఈపీడీసీఎల్ ఉద్యోగులు, ఇంజినీర్ల బదిలీల్లో అవినీతి, పక్షపాత వైఖరితో వ్యవహరిస్తారన్న ఆరోపణల్లో ఆయన చిక్కుకున్నారు. సంస్థ పనులు చేపట్టే కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తారని చెబుతారు. ఈపీడీసీఎల్లో జీవీఎస్ ప్రాజెక్ట్సు పేరుమీద నడిచే ఓ కాంట్రాక్టు సంస్థ యజమానితో సన్నిహితంగా ఉంటూ అందులో పెట్టుబడులు పెట్టారన్న ఆరోపణలున్నాయి. ఈ సొమ్ముతో విజయనగరం జిల్లాలో ఓ ప్రైవేటు స్కూలు నడుపుతున్నారని చెబుతున్నారు. ఇంకా సబ్స్టేషన్ల నిర్మాణం, వైర్లు మార్చడం, అవసరం లేకపోయినా పనులు సృష్టించి నిధులు వెచ్చించడం వంటి ఆరోపణలు కోకొల్లలుగా ఉన్నాయి. అయినా ఇవేమీ ఆయనను ఏమీ చేయలేకపోయాయి. మెడకు చుట్టుకున్న కవర్డ్ కండక్టర్లు.. అన్ని ఆరోపణల నుంచి తప్పించుకుంటూ వచ్చిన దొర కవర్డ్ కండక్టర్ల అవినీతి నుంచి బయట పడలేకపోయారు. ఎస్పీడీసీఎల్ సీఎండీగా ఉన్నప్పుడు కృష్ణా పుష్కరాల సందర్భంగా రెండు డిస్కంల పరిధిలో కవర్డ్ కండక్టర్లను వేశారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సరఫరాలో అంతరాయం కలగకుండా, ప్రాణాపాయం లేకుండా ఉండడానికి స్వీడన్ నుంచి దిగుమతి చేసుకున్న కవర్డ్ కండక్టర్లను అమర్చారు. బెంగళూరుకు చెందిన రేచం ఆర్పేజీ ప్రయివేటు లిమిటెడ్ అనే సంస్థకు అనుకూలంగా టెండరు నిబంధనలు రూపొందించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కాంట్రాక్టు దక్కించుకున్న ఆ సంస్థ 3,804 కిలోమీటర్ల మేర కండక్టరు వేయడానికి రూ.195.83 కోట్ల వ్యయం అవుతుందని తెలిపింది. స్వీడన్ నుంచి దిగుమతి అయిన ఆ పరికరాల ఇన్వాయిస్లను పరిశీలిస్తే రూ.64.52 కోట్లు మాత్రమే ఉన్నట్టు తేలడంతో ఆ కాంట్రాక్టు సంస్థకు రూ.131.30 కోట్లు అదనంగా చెల్లించినట్టు నిర్ధారణ అయింది. ఈ వ్యవహారంపై ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి విజిలెన్స్తో విచారణ చేయించగా.. అవినీతి జరిగినట్టు తేలింది. అయినా ఎవరిపైనా చర్యలు తీసుకోకపోవడంతో ఒక వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సీరియస్ అవడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఈ బాగోతంలో సీఎండీ దొర పాత్రను దృష్టిలో ఉంచుకుని ఆయనను రాజీనామా చేయాలని ప్రభుత్వ పెద్దలు సూచించారు. దీంతో ఆయన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు ప్రభుత్వానికి లేఖ పంపడం, వెంటనే ఆమోదించడం జరిగిపోయాయి. సాయంత్రం వరకూ కార్యాలయంలోనే.. మూడు రోజులు ముందుగానే రాజీనామా లేఖను పంపిన సీఎండీ దొర ఆ విషయాన్ని రహస్యంగా> ఉంచారు. ఎప్పటిలానే సోమవారం విధులకు హాజరయ్యారు. సాయంత్రం వరకు విధుల్లోనే ఉన్నారు. ఆయన రాజీనామాను ఆమోదిస్తూ సాయంత్రం ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో విధుల నుంచి నిష్క్రమిస్తున్నట్టు ఉద్యోగులకు సమాచారం ఇచ్చారు. ఈ ఆకస్మిక పరిణామానికి వారంతా నిశ్చేష్టులయ్యారు. ఒక్కొక్కరుగా ఆయనను కలిసి ‘అయ్యో సారూ’ అంటూ సానుభూతి ప్రకటించారు. అనంతరం మౌనంగా ఇంటికి వెళ్లిపోయారు. ఇలా విశాఖలోనే ఏఈగా ప్రస్థానాన్ని ప్రారంభించిన దొర అత్యున్నత సీఎండీ పదవిలో ఆరోపణల్లో చిక్కుకుని ఇంకా ఏడునెలలు పదవీ కాలం ఉండగానే ఇంటిముఖం పట్టారు. పదవి ఉండగానే నిష్క్రమించిన తొలి సీఎండీగా ‘దొర’ రికార్డుకెక్కారు. -
యాక్సిస్ బ్యాంకు కొత్త సీఎండీ
-
యాక్సిస్ బ్యాంకు కొత్త సీఎండీ
సాక్షి, ముంబై: ప్రయివేటు రంగ ప్రముఖ బ్యాంకు యాక్సిస్బ్యాంకు కొత్త సీఎండీగా అమితాబ్ చౌదరి (54) బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్లో సమాచారాన్ని అందించింది. డిసెంబరు 31నుంచి ప్రస్తుత సీఎండీ శిఖా శర్మ బాధ్యతలనుంచి తప్పుకున్న నేపథ్యంలో బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. అమితాబ్ జనవరి 1, 2019 నుంచి సీఈవో, ఎండీగా అమితాబ్ వ్యవహరిస్తారని యాక్సిస్ బ్యాంకు ప్రకటించింది.జనవరి 1, 2019 -31 డిసెంబరు 2021 వరకు మూడేళ్లపాటు అమితాబ్ చౌదరిని మూడేళ్లపాటు ఆయన పదవీకాలంలో కొనసాగనున్నారు. 1987లో బ్యాంక్ ఆఫ్ అమెరికాలో కరియర్ మొదలు పెట్టిన చౌదరి, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్కు సీఎండీగా పనిచేశారు. కాగా 2018 మే నాటికి మూడవసారి బ్యాంకు సీఎండీగా ఆమె పదవీ కాలం ముగియనుండగా, నాలుగవసారి కూడా ఎండీగా నియమించాలని యాక్సిస్ బ్యాంకు బోర్డు నిర్ణయించింది. అయితే భారీ నష్టాలు, నోట్లరద్దు సమయంలో చట్టవిరుద్ధంగా పాతనోట్లను మార్చిన ఆరోపణల నేపథ్యంలో శిఖాశర్మ పునర్నియామకంపై ఆర్బీఐ ప్రశ్నలు లేవనెత్తడంతో డిసెంబరు 31, 2018నుంచి బాధ్యతలనుంచి తప్పుకోనున్నట్టు ఏప్రిల్లో శిఖాశర్మ ప్రకటించారు. అయితే సీఎండీగా యాక్సిస్ బ్యాంకు అమితాబ్ చౌదరిని గత ఏడాది సెప్టెంబరులో ప్రకటించిన సంగతి తెలిసిందే. -
రాణాకు నో చెప్పిన ఆర్బీఐ
సాక్షి,ముంబై: సీఎండీ నియామకం అంశంలో ప్రయివేటురంగ బ్యాంకు ఎస్ బ్యాంకుకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా మరోసారి తన నిర్ణయాన్ని తేల్చి చెప్పింది. తాను ముందు ఆదేశించినట్టుగానే సీఈవో, ఎండీగా రాణా కపూర్ పదవి నుంచి వైదొలగాల్సిందేనని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1నాటికి బ్యాంకు కొత్త సీఎండీ నియామాకం చేపట్టాలని పేర్కొంది. ఆర్బీఐ మరోసారి తన నిర్ణయాన్ని దృఢంగా ప్రకటించడంతో బ్యాంకు సీఎండీ మరింత కాలం కొనసాగాలని భావించిన రాణా కపూర్కు ఎదురుదెబ్బ తప్పలేదు. బ్యాంకు ఉన్నతాధికారిగా కపూర్ పదవీ కాలాన్ని మూడు సంవత్సరాల పాటు పొడిగించాలని గతంలోనే వాటాదారులు కోరినప్పటికి ఆర్బీఐ ఆర్బీఐ నిరాకరించింది. 2019, జనవరి 31నాటికి కొత్త సీఎండీని ఎంపిక చేయాలని సెప్టెంబరు24న ఆదేశించింది. అయితే రాణా కపూర్ పదవీ కాలాన్ని కనీసం మరో మూడు నెలలు పొడిగించాలని , ఈ పదవికి అభ్యర్థిని ఎంపిక చేయడానికి మరింత సమయం కావాలని ఆర్బీఐని ఎస్బ్యాంకు కోరింది. అలాగే కపూర్ వారసుడి ఎంపిక కోసం సెర్చ్, సెలక్షన్ కమిటీని కూడా డైరెక్టర్ల బోర్డ్ నియమించింది. తాజాగా ఈ అభ్యర్థనను కూడా ఆర్బిఐ తిరస్కరించింది. -
ఐడీబీఐ బ్యాంకు కొత్త బాస్ ఈయనే
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా బి.శ్రీరామ్ ఎంపికయ్యారు. నేడు (శనివారం) బ్యాంకు సీఎండీ బాధ్యతలు స్వీకరించారని ఐడీబీఐ రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. ప్రస్తుత ఎండీ మహేష్ కుమార్ జైన్ ఆర్బీఐ (రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా) డిప్యూటీ గవర్నర్గా ఎంపికైన నేపథ్యంలో, ఆయన స్థానంలో శ్రీరామ్ను ఎంపిక చేసింది. జూన్ 29 న శ్రీరామ్ వాలంటరీ రిటైర్మెంట్కు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందని ఎస్బీఐ ప్రకటించింది. 2014 జూలై నుంచి ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు ఎస్బీఐలో ఎండీ (కార్పొరేట్ మరియు గ్లోబల్ బ్యాంకింగ్) గా శ్రీరామ్ పనిచేస్తున్నారు. మరోవైపు అప్పుల ఊబిలో చిక్కుకున్న ఐడీబీఐలో 51 శాతం వాటా కొనుగోలుకు ప్రభుత్వ రంగ బీమాసంస్థ ఎల్ఐసీ అన్నిమార్గాలను సుగమం చేసుకుంటోంది. ఈ డీల్కు తాజాగా భారతీయ బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డిఎఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
ఇన్ఫోసిస్ సీఎండీ ఈయనే...
సాక్షి, ముంబై: భారతీయ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్కు కొత్త సీఈవో ఎంపిక పూర్తయింది. సలీల్ ఎస్ పరేఖ్ను ఇన్ఫీ కొత్త సీఎండీగా ఎంపిక చేసినట్టునట్టు ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ శనివారం ప్రకటించింది. ఇన్ఫోసిస్ సీఈఓగా, ఎండీగా బలమైన ట్రాక్ రికార్డ్ ఉన్న పరేఖ్ చేరడం ఆనందంగా ఉందని, ఐటీ సేవల పరిశ్రమలో మూడు దశాబ్దాల గ్లోబల్ అనుభవం ఆయనకుందని ఇన్ఫోసిస్ బోర్డు ఛైర్మన్ నందన్ నీలేకని వ్యాఖ్యానించారు. ఇన్ఫీని నడిపించడంలో ఆయనే సరైన వ్యక్తిగా బోర్డు భావించింది. అలాగే కీలక పరిణామ సమయంలో సీఈవోగా బాధ్యతలు నిర్వహించిన యూబీ ప్రవీణ్రావుకు కూడా బోర్డు అభినందనలు తెలిపింది. ఎప్పటినుంచో ఐటీ పరిశ్రమ వర్గాలు ఎదురుచూస్తున్న ఇన్ఫీ సీఎండీ నియామకం ఎట్టకేలకు పూర్తయింది. ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎండీ (మేనేజింగ్ డైరెక్టర్) గా పరేఖ్ ను కంపెనీ నియమించింది. 2018, జనవరి 2నుంచి పరేఖ్ బాధ్యతలు చేపట్టనున్నారని వెల్లడించింది. సీఈవో ప్రవీణ రావు స్థానంలో పరేఖ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం, పరేఖ్ ఫ్రెంచ్ ఐటీ సేవల కంపెనీ క్యాప్ జెమినిలో గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడుగా ఉన్నారు. కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్ , మెకానికల్ ఇంజనీరింగ్లో మాస్టర్ డిగ్రీ చేశారు. అలాగే బొంబాయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కూడా చదివారు. మరోవైపు నందన్ నీలేకని నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా కొనసాగుతారు. అలాగే ఇన్ఫోసిస్ మధ్యంతర సీఈవో ప్రవీణ్ రావు సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా పునఃనియమితులవుతారు. బోర్డు పూర్తికాలపు డైరెక్టర్గా కొనసాగుతారు. -
ఎయిరిండియా కొత్త సీఎండీ ప్రదీప్ సింగ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ‘ఎయిరిండియా’ కొత్త సీఎండీగా ప్రదీప్ సింగ్ ఖరోలా నియమితులయ్యారు. ఈయన 1985 బ్యాచ్కు చెందిన కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుత ఎయిరిండియా సీఎండీ రాజీవ్ బన్సాల్ నుంచి ప్రదీప్ సింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎయిరిండియా వ్యూహాత్మక డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ ప్రారంభించిన నేపథ్యంలో ఖరోలా నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా ఈయన 2015 ఫిబ్రవరి నుంచి బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. అలాగే కర్ణాటక అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా, కర్నాటక ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. -
ఎయిర్ ఇండియా కొత్త సీఎండీ నియామకం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు కొత్త సీఎండీని కేంద్రం ఎంపిక చేసింది. సీనియర్ ఐఎఎస్ అధికారి ప్రదీప్ సింగ్ ఖరోలా ఎయిర్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే జీఎస్టీ నేషనల్ యాంటి ప్రాఫటీరింగ్ అథారిటీ చైర్మన్ గా ఐఎఎస్ అధికారి బద్రీ నారాయణ శర్మనుఅధికార వర్గాలు తెలిపాయి. కేరళ అసెంబ్లీ నియామక కమిటీ (ఎసిసి) ప్రకారం ఖరోలా. కర్ణాటక 1985 ఐఏఎస్ కేడర్కు చెందినవారు. ప్రభుత్వంలో కార్యదర్శి హోదా, వేతనాన్ని పొందుతారని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఆయన బెంగళూరులో మెట్రో మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. కాగా ప్రస్తుతం మధ్యంతర సీఎండీగా ఉన్న బన్సల్ పదవీకాలం మూడు నెలలు పొడిగింపు ఇచ్చిన కొద్ది రోజుల తర్వాత ఈ నియామకం చోటు చేసుకుంది. భారీ నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
అమ్మో.. ఐఏఎస్ ఆఫీసర్!
♦ ఎస్పీడీసీఎల్ సీఎండీగా ఐఏఎస్ అధికారి నియామకం ♦ విద్యుత్ ఉద్యోగులు, అధికారుల్లో గుబులు మొదలు ♦ ఆటలు సాగవని గుసగుసలు ♦ అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు ♦ సంస్థ బాగుపడుతుందని పలువురి అభిప్రాయం కర్నూలు (రాజ్విహార్): విద్యుత్శాఖ ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. ఎప ్పటిలా ఇక తమ ఆటలు సాగవని..విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని చర్చ జోరుగు జరుగుతోంది. ఏపీ ఎస్పీడీసీఎల్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టరుగా ఐఏఎస్ అధికారి అయిన ముదవతు ఎం. నాయక్ ఈనెల 1వ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరించడమే ఈ చర్చకు కారణమైంది. ఈయన ‘ఈపీడీసీఎల్ సీఎండీగా ఉన్నప్పుడు ఓ కార్మిక నేత చేసిన చిన్న తప్పును సైతం ఉపేక్షించలేదు. ఎన్ని ఒత్తిళ్లకు గురి చేసినా ఆ నాయకుడికి పోస్టింగ్ ఇవ్వకుండా అతడి ఆటలను కట్టడి చేశారు. ఇది అప్పట్లో సంస్థలోనే హాట్ టాపిక్. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏపీ ఎస్పీడీసీఎల్ డిస్కం చైర్మన్, మేనేజింగ్ డైరెక్టరుగా వచ్చారు. ఇది వరకు సీఎండీగా పనిచేసిన హెచ్.వై. దొర కాల పరిమితి ఆగస్టు 31వ తేదీతో ముగిసింది. దొర ఇదే శాఖలోనే పనిచేసి ఉండటం మృధు స్వభావి కావడంతో కొందరు అధికారుల ఆటలు బాగా సాగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన అధికార పార్టీ నాయకులు చెప్పిన పనులను క్షణాలో చేసిపెట్టారు. సీనియర్ ఇంజినీరు కావడంతో మళ్లీ అయనే సీఎండీగా వచ్చేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేసినా ఎందుకో ఫలించలేదు. చివరకు 2005 బ్యాచ్కు చెందిన నాయక్ను ఇక్కడి బాధ్యతలు అప్పగించారు. బదిలీల్లో విమర్శలు: సీఎండీగా ఉన్న దొర బదిలీల విషయంలో గత విద్యుత్ శాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కోరిన వ్యక్తికి కోరినట్లు ఆర్డర్లు ఇచ్చేశారు. అత్యవసరమున్న చోట్ల సిబ్బందిని కదిలించి పోస్టు లేని చోట్ల వారిని నియమించి సర్దుబాటు చేయాలని ఆదేశాలిచ్చారు. ఏకంగా కింది స్థాయి ఉద్యోగులు జూనియర్ లైన్మెన్లు, జూనియర్ అసిస్టెంట్లు ఇలా ఎవరడిగినా ఆర్డర్స్ ఇచ్చేశారు. వాస్తవానికి వీరి బదిలీ చేయాల్సిన పవర్స్ డీఈల పరిధిలో ఉంటాయి కానీ సీఎండీ ఇష్టానుసారంగా ఇచ్చేయడం అనేక విమర్శలకు తావిచ్చింది. టీడీపీ నేతల కనుసన్నల్లో ఆయన కీలుబొమ్మలా పనిచేశారనే చర్చ జరిగింది. అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు: అవినీతి, అక్రమ వసూళ్లలో విద్యుత్ శాఖ రెండో స్థానంలో ఉంది. పనుల కోసం వినియోగదారులను పీడించడం, ఇచ్చిన వాళ్లకు పనులు చేసి పెట్టడం వంటి ఆరోపణలను ఈ శాఖ ఎదుర్కొంటోంది. వీరి పట్ల పై అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకున్న దాఖలాలు చాలా తక్కువే. దీంతో బాధిత వినియోగదారులు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో పదుల సంఖ్యలో కేసులు నమోదై ఉన్నాయి. అయితే ఇంతకాలం ఆదే శాఖలో పనిచేసిన అధికారి సీఎండీ ఉండడంతో ఇవన్నీ నడిచాయి. ఇప్పుడు ఐఏఎస్ అధికారి సీఎండీగా రావడంతో వాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. సంస్థ గాడిలో పడుతుంది: దారి తప్పిన వ్యవస్థను కొత్త సీఎండీ, ఐఏఎస్ అధికారి గాడిలో పెడతారని కొందరు ఉద్యోగులు, అధికారులు భావిస్తున్నారు. సమీక్షలు, సమావేశాల్లో పురోగతి, లక్ష్య సాధన, వినియోగదారుల ఫిర్యాదులు, అవినీతి, ఆరోపణలపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతో వినియోగదారుల సమస్యలు త్వరగా పరిష్కారమయ్యేందుకు అవకాశం ఉంటుంది. -
ఎయిర్ ఇండియా కొత్త సీఎండీ ఈయనే
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయానసంస్థ ఎయిర్ ఇండియాకు కొత్త సీఎండీగా రాజీవ్ బన్సల్ ఎంపికయ్యారు. ఎయిర్ ఇండియా ఛైర్మన్ అశ్వని లోహానీ రైల్వే బోర్డ్ ఛైర్మన్ గా నియమితులుకావడంతో ఆయన స్థానంలోరాజీవ్ నియమితులయ్యారు. పెట్రోలియం మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శిగా ఉన్న బన్సల్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత బాధ్యతలకు అదనంగా ఈ బాధ్యతలను ఆయన చేపట్టనున్నారు. గతంలో విమానయాన మంత్రిత్వశాఖ డైరెక్టర్గా పనిచేసిన అనుభవం కూడా బన్సల్ కు ఉంది. పెట్రోలియం మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి, ఫైనాన్షియల్ అడ్వైజర్ గా ఉన్న రాజీవ్ బన్సల్ను తాత్కాలిక చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించినట్టు కేబినెట్ నియామకాల కమిటీ తెలిపింది. తదుపరి ఆదేశాలవరకు 3 నెలలు పాటు ఆయన ఈ బాధ్యతల్లోవుంటారని పేర్కొంది. కాగా రైల్వేలో వరుస ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ రైల్వే బోర్డు ఛైర్మన్ అశోక్ మిట్టల్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయనస్థానంలో ఎయిరిండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా అశ్వని లోహానిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఎయిర్ ఇండియాలో ప్రభుత్వ వాటా విక్రయానికి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి విదితమే. -
ఓఎన్జీసీ కొత్త చీఫ్ శశి శంకర్
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి సంస్థ ‘ఓఎన్జీసీ’ కొత్త చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా (సీఎండీ) శశి శంకర్ ఎంపికయ్యారు. పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సెలెక్షన్ బోర్డు (పీఈఎస్బీ) తాజాగా శంకర్ను ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) హెడ్గా ఎంపికచేసిం ది. ఈయన అక్టోబర్ 1 నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రసుతం శంకర్.. ఓఎన్జీసీ డైరెక్టర్గా (టెక్నికల్ అండ్ ఫీల్డ్ సర్వీసెస్) వ్యవహరిస్తున్నారు. ఈయన దినేశ్ కె సరఫ్ నుంచి ఓఎన్జీసీ సీఎండీ బాధ్యతలు స్వీకరిస్తారు. కాగా దినేశ్ సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు. -
హడ్కో ఐపీఓ...మే 8 నుంచి
ధరల శ్రేణి రూ.56–60 ముంబై: కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినీరత్న పీఎస్యూ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ వచ్చే నెల 8 నుంచి ప్రారంభమవుతోంది. వచ్చే నెల 11న ముగిసే ఈ ఐపీఓ ద్వారా హడ్కో రూ.1,200 కోట్లు సమీకరించనుంది. 2012 తర్వాత ఐపీఓకు వస్తున్న తొలి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇదే. షేర్ ముఖ విలువ రూ.10 అని, ఈ ఐపీఓ ధరల శ్రేణి రూ.56–60గా నిర్ణయించామని హడ్కో సీఎండీ ఎం. రవికాంత్ చెప్పారు.. ఈ ఐపీఓలో భాగంగా 10.19 శాతం వాటాను విక్రయించనున్నామని పేర్కొన్నారు. ఈ ఐపీఓలో భాగంగా 20.40 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నామని, వీటిల్లో 20.01 కోట్ల షేర్లను ఇన్వెస్టర్లకు, 38.68 లక్షల షేర్లను ఉద్యోగులకు కేటాయించామని వివరించారు. ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, నొముర, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సంస్థలు వ్యవహరిస్తున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లకు 5 శాతం డిస్కౌంట్ లభించే అవకాశాలున్నాయి. ఈ కంపెనీ పట్టణ మౌలిక, హౌసింగ్ ప్రాజెక్ట్లకు రుణాలందిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం (డిజిన్వెస్ట్మెంట్) ద్వారా రూ.72,500 కోట్లు సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. వీటిల్లో సగానికి పైగా ఐపీఓల ద్వారానే సమీకరించాలనేది ప్రభుత్వం ఆలోచన. -
3 ఏళ్లలో 15 వేల 2బీహెచ్కే గృహాలు!
• ‘సాక్షి రియల్టీ’తో ప్రజయ్ ఇంజనీర్స్ సీఎండీ విజయ్సేన్ రెడ్డి • షామీర్పేటలో ప్రజయ్ వాటర్ ఫ్రంట్ సిటీ-2 ప్రారంభం • 140 గజాల్లో రూ.15.30 లక్షలకే సొంతిల్లు సాక్షి, హైదరాబాద్ : నిర్మాణ రంగంలో 30 ఏళ్లకు పైగా అనుభవం.. వంద కోట్ల చ.అ.ల్లో వంద ప్రాజెక్ట్లను పూర్తి చేసిన ఘనత.. నిర్మాణంలో నాణ్యత, అందుబాటు ధరల్లో సొంతింటి కలను సాకారం చేసే ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్ లిమిటెడ్ తొలిసారిగా రెండు పడక గదుల గృహాల వైపు దృష్టిసారించింది. కేంద్ర ప్రభుత్వ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై), రాష్ట్ర ప్రభుత్వ 2 బీహెచ్కే పథకాలను ఆదర్శంగా తీసుకొని పలు 2 బీహెచ్కే ప్రాజెక్ట్లకు శ్రీకారం చుట్టింది. జూబ్లీహిల్స్లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రజయ్ వాటర్ ఫ్రంట్ సిటీ ఫేజ్-2 బ్రోచర్ను విడుదల చేసిన సందర్భంగా ప్రజయ్ ఇంజినీర్స్ సిండికేట్ లిమిటెడ్ సీఎండీ విజయ్సేన్ రెడ్డి ‘సాక్షి రియల్టీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. పూర్తి వివరాలివిగో.. ⇔ షామీర్పేటలోని బయోటెక్ పార్క్ (జీనోమ్ వ్యాలీ) కంటే ముందు 27.18 ఎకరాల్లో రూ.150 కోట్ల వ్యయంతో ప్రజయ్ వాటర్ ఫ్రంట్ సిటీ ఫేజ్-2 ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నాం. 140 గజాల్లో 750 చ.అ. బిల్టప్ ఏరియా, 645 చ.అ. కార్పెట్ ఏరియాలో మొత్తం 483 రెండు పడక గదుల గృహాలొస్తారుు. 2017 ఏప్రిల్లో ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభిస్తాం. ఏడాదిన్నరలో నిర్మాణం పూర్తి చేసి కొనుగోలుదారులకు అందిస్తాం. ధర విషయానికొస్తే.. తొలి 50 మంది కస్టమర్లకు రూ.15.30 లక్షలకే గృహాలను అందించనున్నాం. ఆ తర్వాత రూ.20 లక్షలకు పెంచుతాం. రూ.5.44 లక్షలు ఆదా కూడా.. 2 బీహెచ్కే గృహాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ పథకాలు, పన్ను రారుుతీలు కూడా కస్టమర్లకు మరింత ప్రోత్సాహకంగా నిలుస్తారుు. ఇంకా చెప్పాలంటే రూ.15.30 లక్షల ధరలోనూ రూ.5.44 లక్షలు ఆదా అవుతారుు కూడా. అదెలాగంటే.. 4.5 శాతం సర్వీస్ ట్యాక్స్ మినహారుుంపు ఉంటుంది. అంటే రూ.70 వేలు ఆదా. పీఎంఈవై పథకం కింద రూ.6 లక్షల వరకు వడ్డీ 9.3 శాతంలో 6.5 శాతం సబ్సిడీ ఉంటుంది. అంటే 2.58 శాతం మాత్రమే వడ్డీ కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మరో రూ.3.70 లక్షలు ఆదా అవుతుంది. ఆదాయ పన్ను చట్టం ప్రకారం తొలి ఇళ్లు కొనుగోలుదారులకు రూ.50 వేలు మినహారుుంపు ఉంటుంది. 2 బీహెచ్కే నిర్మాణానికి గాను నిర్మాణదారులకు 80 ఐబీఏ ప్రకారం 100 శాతం పన్ను రారుుతీలుంటారుు. వీటిని కూడా కస్టమర్లకే బదిలీ చేస్తాం. అంటే ఇక్కడ సుమారు రూ.55-60 వేలు ఆదా అవుతారుు. ఇలా మొత్తంగా కలిపి సుమారు రూ.5.44 లక్షలు ఆదా అవుతాయన్నమాట. ⇔ రెండేళ్లలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో 15 వేల 2 బీహెచ్కే గృహాలను నిర్మించాలని లక్ష్యం గా పెట్టుకున్నాం. మహేశ్వరంలో వర్జిన్ కౌంటీ ప్రాజెక్ట్లో 1,500, కుంట్లూరులో గుల్మోర్ ప్రాజెక్ట్లో 150 గృహాలు, ఘట్కేసర్లో విన్సర్పాక్ ప్రాజెక్ట్లో 1,200 గృహాలు, మూసాపేటలోనూ కొన్ని గృహాలను నిర్మించనున్నాం. ⇔ స్థానికంగా ఉండే చిన్న చిన్న వ్యాపారస్తులు, సామాన్యులకు కూడా సొంతింటిని అందించాలనే లక్ష్యంతో పాతికేళ్ల క్రితం విజయవంతంగా నడిపించిన ప్రజయ్ చిట్ ఫండ్ కంపెనీని తిరిగి అదే ప్రాంతంలో జనవరిలో పునః ప్రారంభించనున్నాం. ఇందులో 60, 100 నెలలుండే దీర్ఘకాలిక చిట్స్తో పాటూ ఫిక్స్డ్ డిపాజిట్స్ (ఎఫ్డీ) పథకాలను కూడా తీసుకొస్తున్నాం. ఈ చిట్స్ను 2 బీహెచ్కే స్కీమ్కు లింక్ చేస్తాం. దీంతో నెలవారీ వారుుదా పద్ధతుల్లో (ఈఎంఐ) గృహాలను పొందే వీలుంటుంది. ⇔ మా అన్న కూతురు, నా ఇద్దరు పిల్లలు కూడా ప్రజయ్ సంస్థలో భాగస్వాములయ్యారు. బిజినెస్ మేనేజ్మెంట్లో ఐఎస్ఈ గ్రాడ్యుయేట్ నయనికా రెడ్డి ఆపరేషన్స విభాగంలో, ఆర్కిటెక్ట్ అరుున సరోజిని రెడ్డి డిజైన్ విభాగంలో, పెన్సిల్వేనియా స్టేట్ వర్సిటీ నుంచి సివిల్ ఇంజనీర్ అరుున రోహిత్ రెడ్డి ఎక్స్క్లూషన్ బృందంలో విధులు నిర్వర్తిస్తారు. ⇔ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రెండు పడక గదుల కంటే ఈ గృహాలు నిర్మాణంలో, నాణ్యతలో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తున్నాం. హాలు, వంట గది, బెడ్ రూముల్లో 252 వర్టిఫైడ్ టైల్స్, బాత్రూముల్లో యాంటి స్కిడ్ సిరామిక్ టైల్స్, గ్రానైట్ కిచెన్ ఫ్లాట్ఫాం, స్టీల్ సింక్, యూపీవీసీ కిటికీల వంటివి ఉంటారుు. ఎలక్ట్రిక్ వైర్లు, స్విచ్చులు, ఫ్రేం వర్క్స్ వంటివి అన్ని ఉత్పత్తులను బ్రాండెడ్లనే వినియోగిస్తాం. ⇔ ప్రతి ఫ్లాట్కు కామన్గా ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ ఉంటుంది. అండర్ గ్రౌండ్ పైప్లైన్స ద్వారా ప్రతి ఇంటికి ప్రత్యేక నీటి సరఫరా ఏర్పాట్లుంటారుు. అండర్ గ్రౌండ్ పైప్లైన్స ద్వారా మురుగు నీటి వ్యవస్థను, ఎస్టీపీకి అనుసంధానం చేస్తాం. ⇔ వసతుల విషయానికొస్తే.. పార్క్, జాగింగ్, సైక్లింగ్ ట్రాక్స్, యోగా సెంటర్, జిమ్, ఇండోర్, అవుట్ డోర్ ప్లే ఏరియా, టెన్నిస్, బాస్కెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ కోర్టులు, క్రికెట్, ఫుట్ బాల్ మైదానాలు, ప్రాజెక్ట్లోనే షాపింగ్ కాంప్లెక్స్, స్కూలు, ఆసుపత్రి కూడా ఉంటారుు. ⇔ ఇప్పటికే అక్కడ సిమెంట్ రోడ్లు, ఎస్టీపీ, ల్యాండ్ స్కేపింగ్, పార్క్, టెన్నిస్ కోర్ట్ వసతుల ఏర్పాట్లు పూర్తయ్యారుు. 45 వేల చ.అ. క్లబ్ హౌస్ నిర్మాణ దశలో ఉంది. -
గతవారం బిజినెస్
నియామకాలు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ 1980వ బ్యాచ్కు చెందిన సీనియర్ అధికారి సుశీల్ చంద్ర తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. హాప్రభుత్వ రంగ దిగ్గజ మైనింగ్ కంపెనీ ‘ఎన్ఎండీసీ’ చైర్పర్సన్ కమ్ మేనేజింగ్ డెరైక్టర్గా (సీఎండీ) వ్యవహరిస్తున్న భారతీ ఎస్ సిహగ్ పదవీ కాలాన్ని కేంద్రం ఒక నెలపాటు పొడిగించింది. ప్రభుత్వపు తాజా నిర్ణయం నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. హా రిషి జైట్లీ తాజాగా ట్వీటర్ ఇండియా హెడ్ పదవి నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని ఆయన తన ట్వీటర్ వేదికగా వెల్లడించారు. ఒక యూజర్గా, ఉద్యోగిగా రిషికి ట్వీటర్తో నాలుగేళ్ల అనుబంధం ఉంది. హావరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ (డబ్ల్యూఎఫ్ఈ) కొత్త చైర్పర్సన్గా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) ఎండీ, సీఈఓ చిత్రా రామకృష్ణ నియమితులయ్యారు. ! కాల్ డ్రాప్స్పై ఫీడ్బ్యాక్కు ప్లాట్ఫామ్! కాల్ డ్రాప్స్ విషయంలో అవసరమైతే టెలికం ఆపరేటర్లపై చర్యలు తీసకుంటామని, జరిమానా సైతం విధిస్తామని ఆ శా ఖ మంత్రి మనోజ్సిన్హా హెచ్చరించారు. కాల్స్ ఫెయిల్ అవడంపై వినియోగదారులు నేరుగా తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు నెలరోజుల్లోపు ఓ ప్లాట్ఫామ్ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇన్ఫ్రా పరిశ్రమల స్పీడ్ ఎనిమిది పారిశ్రామిక విభాగాలతో కూడిన మౌలిక రంగం సెప్టెంబర్లో మంచి పనితీరును ప్రదర్శించింది. ఈ నెలలో ఐదు శాతం వృద్ధి నమోదయియంది. ఇది మూడు నెలల గరిష్ట స్థాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలో వృద్ధి 3.7 శాతంగా నమోదయింది. 2016 ఆగస్టులో రేటు 3.2 శాతం. సిమెంట్, స్టీల్, రిఫైనరీ పరిశ్రమల ఉత్పత్తుల జోరు గ్రూపుకు సానుకూలమైంది. ఇక ఆర్థిక సంవత్సరంలో గడచిన ఆరు నెలల్లో ఎనిమిది రంగాలనూ చూస్తే.. వృద్ధి 2.6 శాతం నుంచి 4.6 శాతానికి ఎగసింది. మిశ్రమంగా వాహన విక్రయాలు పండుగ సీజన్ నేపథ్యంలో దేశీ వాహన విక్రయాలు అక్టోబర్ నెలలో మిశ్రమంగా ఉన్నారుు. ఒకవైపు మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి దిగ్గజ కంపెనీలు వాటి వాహన అమ్మకాల్లో మంచి వృద్ధినే ప్రకటిస్తే.. ఇక నిస్సాన్ మోటార్ ఇండియా, ఫోక్స్వ్యాగన్, రెనో కంపెనీల వాహన విక్రయాలు జోరు మీద ఉన్నాయి. అయితే టయోటా, హోండా, మహీంద్రా, ఫోర్డ్ వాహన విక్రయాలు మాత్రం తగ్గాయి. ప్రీమియం వసూళ్లు పెరిగాయ్ నాన్-లైఫ్ ఇన్సూరెన్స కంపెనీల స్థూల ప్రీమియం వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు సెప్టెంబర్ నెలలో 86.2 శాతం పెరుగుదలతో రూ.14,950 కోట్లకు ఎగశాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలో ఈ కంపెనీల ప్రీమియం వసూళ్లు రూ.8,030 కోట్లుగా ఉన్నాయి. ఇన్సూరెన్స రెగ్యులేటర్ ఐఆర్డీఏ గణాంకాల ప్రకారం.. మొత్తం ప్రీమియం వసూళ్లలో ప్రభుత్వ రంగ నాన్-లైఫ్ ఇన్సూరెన్స కంపెనీల వాటా రూ.9,164 కోట్లుగా, ప్రై వేట్ కంపెనీల వాటా రూ.5,786 కోట్లుగా ఉంది. రూపీ బాండ్లకు ఆర్బీఐ అనుమతి మసాలా బాండ్ల (రూపీ డినామినేటెడ్ బాండ్లు) జారీ ద్వారా విదేశీ మార్కెట్లో బ్యాంకులు నిధుల సమీకరించుకోడానికి ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. ‘‘రూపీ బాండ్ల విదేశీ మార్కెట్ను అభివృద్ధి చేయాలన్న నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నాం. పరిమితులకు లోబడి ఈ బాండ్ల జారీ జరుగుతుంది’’ అని ఆర్బీఐ నోటిఫికేషన్ ఒకటి తెలిపింది. ఇన్ఫ్రా, చౌక ఇళ్లకు తగిన నిధుల సమీకరణకు తాజా నిర్ణయం దోహదపడుతుందని పేర్కొంది. టాటా బ్రాండ్ ర్యాంక్ తగ్గింది ఇటీవల వివాదంలో ఉక్కిరిబిక్కిరవుతున్న టాటా గ్రూప్నకు మరో షాక్ తగిలింది. అత్యంత ప్రతిష్టాత్మక టాటా ఉత్పత్తుల బ్రాండ్ స్థారుు తగ్గుతున్నట్లు ఒక సర్వే తేల్చింది. ట్రస్ట్ రీసెర్చ్ అడ్వైజరీ తాజాగా నిర్వహించిన భారత్లోని అత్యంత ఆకర్షణీయమైన బ్రాండ్ల సర్వేలో టాటా బ్రాండ్ ర్యాంక్ క్షీణించింది. ఎల్జీ టాప్లో నిలవగా... టాటా బ్రాండ్ ఏకంగా 7వ స్థానానికి పడిపోయింది. టాటా బ్రాండ్కు 2014లో 5వ ర్యాంక్ ఉండగా, 2015లో అది 4వ స్థానానికి చేరింది. ఇపుడు ఒకేసారి మూడు స్థానాలు వెనక్కి పడింది. దక్షిణ కొరియాకు చెందిన కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ ’ఎల్జీ’ దేశంలో టాప్ స్థానాన్ని దక్కించుకోగా తర్వాతి స్థానాల్లో సోనీ, శాంసంగ్ మొబైల్స్, హోండా, శాంసంగ్ నిలిచాయి. వడ్డీ చెల్లింపుల్లో జేఎస్పీఎల్ విఫలం నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్సీడీ) హోల్డర్లకు వడ్డీ చెల్లింపుల్లో జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (జేఎస్పీఎల్) మరోసారి విఫలం అరుు్యంది. ఎన్సీడీలకు గడువు ప్రకా రం అక్టోబర్ 31 లోపు రూ.15.43 కోట్ల మేర వడ్డీ చెల్లించాల్సి ఉండగా, అందులో విఫలమైనట్టు స్వయంగా కంపెనీయే బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సమాచారం ఇచ్చింది. నవీన్ జిందాల్కు చెందిన జేఎస్పీఎల్ రూ.46,000 కోట్ల రుణభారంతో సతమతమవుతోంది. రిలయన్సకు కేంద్రం షాక్ ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స ఇండస్ట్రీస్కు (ఆర్ఐఎల్) కేంద్రం షాకిచ్చింది. కేజీ బేసిన్లో ఓఎన్జీసీ గ్యాస్ బ్లాక్ నుంచి అక్రమంగా సహజవాయువును లాగేసుకున్నట్టు రేగిన వివాదంలో 1.55 బిలియన్ డాలర్ల (ప్రస్తుత లెక్కల ప్రకారం దాదాపు రూ.10,380 కోట్లు) భారీ జరిమానాను విధించింది. ఈ మేరకు రిలయన్సతో పాటు దాని భాగస్వామ్య సంస్థలైన బ్రిటిష్ పెట్రోలియం(బీపీ), నికో రిసోర్సెస్కు కేంద్ర పెట్రోలియం శాఖ శుక్రవారం డిమాండ్ నోటీసులను జారీ చేసింది. అయితే, దీనిపై రిలయన్స న్యాయపోరాటం (ఆర్బిట్రేషన్) చేసే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. చక్కెర ఉత్పత్తి 44 శాతం డౌన్ దేశంలో చక్కెర ఉత్పత్తి 2016-17 సీజన్ తొలి నెల అక్టోబర్లో 44 శాతం క్షీణతతో 1.04 లక్షల టన్నులకు పరిమితమరుుంది. చక్కెరను అధికంగా ఉత్పత్తి చేసే మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చెరకు క్రషింగ్ ఆలస్యం కావడం ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపించినట్లు ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) పేర్కొంది. 2015-16 సీజన్ ఇదే నెలలో చక్కెర ఉత్పత్తి 1.87 లక్షల టన్నులుగా ఉందని తెలిపింది. గతేడాది అక్టోబర్లో 65 మిల్లులు చెరకు క్రషింగ్ను ప్రారంభిస్తే.. ప్రస్తుత ఏడాది అదే నెలలో కేవలం 28 మిల్లులే చెరకు క్రషింగ్ కార్యకలాపాలను ప్రారంభించాయని వివరించింది. డీల్స్.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)తో ప్రముఖ మొబైల్ పేమెంట్స్ నెట్వర్క్ సంస్థ మోబిక్విక్ జతకట్టింది. ఇరు సంస్థలు వాటి ఒప్పందంలో భాగంగా ప్రయాణికుల కోసం తత్కాల్ బుకింగ్సకు సంబంధించి ఈక్యాష్ పేమెంట్స్ సేవలను అందుబాటులోకి తెచ్చాయి. ఇండోనేసియా ప్రభుత్వరంగ సంస్థ పీటీ పిండాడ్తో టాటా మోటార్స్ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇండోనేసియాతోపాటు ఆసియాలోని ఇతర దేశాలలో టాటా మోటార్స్ సాయుధ వాహనాలకు (ఆయుధాలు అమర్చిన వాహనాలు) మార్కెట్ అవకాశాలను పెంచుకునేందుకు ఈ ఒప్పందం చేసుకుంది. -
తాన్లా సొల్యూషన్స్ లాభం రూ. 10 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో తాన్లా సొల్యూషన్స్ నికర లాభం (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) రూ. 9.7 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ2లో ఇది రూ. 4.06 కోట్లు. తాజా క్యూ2లో ఆదాయం రూ. 106 కోట్ల నుంచి రూ. 135 కోట్లకు పెరిగింది. అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో సేవలందించడంతో మెరుగైన ఫలితాలు సాధించగలిగామని సంస్థ సీఎండీ ఉదయ్ రెడ్డి తెలిపారు. మూడో త్రైమాసికంలో ఆదాయం రూ.144 కోట్ల నుంచి రూ.148 కోట్ల దాకా, లాభం రూ. 9.3 కోట్ల నుంచి రూ. 9.9 కోట్ల దాకా ఉండొచ్చని సంస్థ గెడైన్స్ ఇచ్చింది. పూర్తి ఆర్థిక సంవత్సర కాలానికి మొత్తం ఆదాయాలు రూ.509.7 కోట్ల నుంచి రూ. 532.8 కోట్ల దాకా, లాభం రూ. 32.6 కోట్ల నుంచి రూ. 35.1 కోట్ల దాకా ఉండగలవని కంపెనీ అంచనా. -
జెన్కో సీఎండీని అడ్డుకున్న నేదునూరు నిర్వాసితులు
మానకొండూర్ : తిమ్మాపూర్ మండలం నేదునూర్లో నిర్మించతలపెట్టిన గ్యాస్ ఆధారిత విద్యుత్ పవర్ప్లాంట్కు ప్రహరీ ఏర్పాటు కోసం మంగళవారం వచ్చిన జెన్కో సీఎండీ ప్రభాకర్రావును భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. తమకు ఉపాధి చూపించాకే ప్రహరీ నిర్మించాలంటూ సుమారు 200 మంది ఆందోళనకు దిగారు. తమ పిల్లలకు ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. 2010లో పవర్ప్లాంట్కు అప్పటి సీఎం రోశయ్య శంకుస్థాపన చేశారని, తమ పిల్లలకు ఉద్యోగాలివ్వాలని కోరగా.. సానుకూలంగా స్పందించారని, అనంతరం విస్మరించారని ఆరోపించారు. న్యాయం చేసేవరకూ పనులు చేపట్టవద్దని హెచ్చరించారు. ప్రహరీ నిర్మిస్తేనే ప్రాజెక్టు ముందుకు కదులుతుందని, సుమారు రూ.400 కోట్ల వరకు నిధులువచ్చే అవకాశముందని సీఎండీ నచ్చజెప్పినా నిర్వాసితులు వినిపించుకోలేదు. దీంతో గత్యంతరం లేక ఆయన వెళ్లిపోయారు. -
ఏపీఈపీడీసీఎల్కు ‘మీ–సేవ’లు
కస్టమర్ సర్వీస్ సెంటర్ల నుంచి తొలగనున్న పలు సేవలు అధికారులకు స్పష్టం చేసిన సీఎండీ ఎంఎం నాయక్ సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ సేవలను వినియోగదారులకు అందించేందుకు మీ–సేవ కేంద్రాలను ఉపయోగించుకోనున్నారు. ప్రస్తుతం సంస్థ పరిధిలోని ఐదు జిల్లాల్లో 67 కస్టమర్ సర్వీస్ సెంటర్ల ద్వారా మాత్రమే ఏ సేవకైనా దరఖాస్తు చేసే వెసులుబాటు ఉంది. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) నుంచి అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు తీసుకున్న ఓ ప్రైవేటు సంస్థ వాటిని నడుపుతోంది. ఇక మీదట దశల వారీగా వాటిలో అందుతున్న సేవలను మీ సేవ కేంద్రాలకు బదలాయించి అక్కడి నుంచే ప్రజలకు అందేలా చేయాలని డిస్కం భావిస్తోంది. ఈ విషయాలను అధికారులకు సీఎండీ ఎంఎం నాయక్ స్పష్టం చేశారు. కార్పొరేట్ కార్యాలయం నుంచి ఐదు జిల్లాల సర్కిల్ అధికారులతో సీఎండీ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో కస్టమర్ సర్వీస్ సెంటర్ల అంశంపై సీఎండీ ప్రధానంగా చర్చించారు. ఐదు జిల్లాల్లోనూ వందలాది మీ–సేవ కేంద్రాలు ఉన్నందున కేటగిరి 1,2,7 విద్యుత్ కొత్త సర్వీసుల కోసం దరఖాస్తులను వాటి ద్వారా స్వీకరించే ఏర్పాటు చేస్తే వినియోగదారులకు వెసులుబాటు కలుగుతుందని అధికారులకు సీఎండీ సూచించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఐటీ జీఎం శ్రీనివాసమూర్తి ధ్రువీకరించారు. రానున్న రోజుల్లో అన్ని సేవలను మీ సేవా కేంద్రాల నుంచే అందించాలని డిస్కం భావిస్తున్నట్లు ‘సాక్షి’కి ఆయన వెల్లడించారు. -
ఈపీడీసీఎల్ సీఎండీ ఆకస్మిక తనిఖీలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) సీఎండీ ఎంఎం నాయక్ ఐదు జిల్లాలకు సేవలందిస్తున్న విశాఖలోని సెంట్రలైజ్డ్ కస్టమర్ కాల్సెంటర్ను శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు.సంస్థ పరి«ధిలోని ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల వినియోగదారుల నుంచి వస్తున్న విద్యుత్ సమస్యలను కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్లు ఏ విధంగా రోజుకి ఎన్ని స్వీకరించి వాటిని ఎంత సమయంలో సంబంధిత సెక్షన్ కార్యాలయానికి చేరవేస్తున్నారు,అక్కడి వారు ఎంత వేగంగా వాటిని పరిష్కరిస్తున్నారనే అంశాలను సీఎండీ పరిశీలించారు. శుక్రవారం ఫిర్యాదు చేసిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వినియోగదారుడికి సీఎండీ స్వయంగా ఫోన్చేశారు. సమస్య పరిష్కరించారా లేదా అని అడిగితెలుసుకున్నారు. పరిష్కారమయ్యిందని వినియోగదారుడు సమాధానమిచ్చారు. సీఎండీ స్వయంగా తనతో మాట్లాడటంతో వినియోగదారుడు ధన్యవాదాలు తెలిపారు. కాల్సెంటర్ను మరింత పటిష్టం చేసి, సెక్షన్ కార్యాలయాలతో సమన్వయం చేసేందుకు ప్రత్యేకంగా ఏడీఈ స్థాయి అధికారిని నియమించాలని ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ సి.శ్రీనివాసమూర్తిని సీఎండీ నాయక్ ఆదేశించారు.సంస్థ పరిధిలోని ఐదు జిల్లాల్లోని వినియోగదారులు విద్యుత్ సమస్యలను 1912కు ఫోన్ ద్వారా, ఆన్లైన్ ద్వారా కాల్సెంటర్కు తెలియజేసేలా వారిలో అవగాహన కల్పించాలని అధికారులకు, పట్టణ ప్రాంత వినియోగదారులకు ఫిర్యాదు చేసిన 4గంటల్లోనూ, గ్రామీణ ప్రాంతం వారు 12 గంటల్లోపు పరిష్కారం పొందవచ్చనే నమ్మకాన్ని కల్పించాలని కాల్సెంటర్ సిబ్బందికి సూచించారు. సీఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి నాయక్ చేసిన కార్యక్రమం వినియోగదారుల సేవలకు సంబంధించింది కావడంతో ఆయన ప్రధాన్యతలేమిటో స్పష్టమైంది. -
హీరో పగ్గాలుమళ్లీ పవన్ ముంజాల్కే
న్యూఢిల్లీ: దేశీ టూవీలర్ దిగ్గజ కంపెనీ ‘హీరో మోటోకార్ప్’ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ), సీఈవోగా మళ్లీ పవన్ ముంజాల్ నియమితులయ్యారు. ఈయన ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. మామూలుగా పవన్ ముంజాల్ పదవీ కాలం ఈ సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. కంపెనీ ఈయన పదవీ కాలాన్ని మరో ఐదేళ్లు పొడిగించింది. అలాగే విక్రమ్ కాస్బెకర్కు డెరైక్టర్ల బోర్డులో చోటు కల్పించింది. -
రాష్ట్రంలో విద్యుత్ వెలుగులు
వ్యవసాయం, పరిశ్రమలకు సరిపడా కరెంట్ఆటోమేటిక్ స్టార్టర్లు తొలగించాలి హరితహారంలో లక్షా 20వేల మొక్కలు నాటుతాం జెన్కో, ట్రాన్స్క సీఎండి ప్రభాకర్రావు జనగామ : స్వరాష్ట్రం సాధించుకోగానే సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ విద్యుత్ వెలుగులతో నిండిపోయిందని జెన్కో, ట్రాన్స్ కో సీఎండి ప్రభాకర్రావు తెలిపారు. ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) ఆధ్వర్యంలో శనివారం జనగామలో ని ర్వహించిన హరితహారం కార్యక్రమానికి ము ఖ్యఅతిథిగా హాజరై ఎన్పీడీసీఎల్ సీఎండీ వెంకటనారాయణతో కలిసి ఆయన మొక్కలు నా టారు. అనంతరం ప్రభాకర్రావు మాట్లాడు తూ రాష్ట్రం అవతరించిన తర్వాత వ్యవసాయానికి తొమ్మిది, గృహాలకు, పరిశ్రమలకు 24 గం టల విద్యుత్తు అందిస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 12 గంటల పా టు కోత విధిస్తూ పరిశ్రమలు మూతబడేలా చే శారన్నారు. చీకట్లు కమ్ముకుంటాయని ప్రచా రం చేసిన నాటి ఉమ్మడి రాజకీయ పార్టీలు నా ణ్యమైన విద్యుత్ సరఫరాను చూసి తలదించు కుంటున్నారన్నా రు. రైతులు వెంటనే అటోమేటిక్ స్టార్టర్లను తీసేయాలని సూచించారు. ఎన్పీడీసీఎల్ పరిధి లో లక్ష మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టుకో గా.. 20వేల మొక్కలు అదనంగా నాటామన్నా రు. విద్యుత్ తీగల కింద మొక్కలు నాట కుండా ముందే జాగ్రత్త తీసుకోవాలని, ఒక్కో సమయంలో లైన్ల కింద ఉన్న వృక్షాలను తొల గించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. జెన్కో డైరెక్టర్లు నర్సింగారావు, మోహన్రావు, సీజీఎంలు సదాలాల్, ఎస్ఈ శివరాం, ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు సంధ్యారాణి, వేణుగోపాలాచారి, మధుసూధన్రావు, తిరుపతిరావు, అశోక్, మోహన్రావు, డీఈ రాంబా బు, ఏడీఈ రవి, ఏఈలు కనకయ్య, రవికుమార్ పాల్గొన్నారు. -
ఈపీడీసీఎల్ సీఎండీగా నాయక్
విజయనగరం నుంచి విశాఖకు బదిలీ సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా విజయనగరం జిల్లా కలెక్టర్ ముదావత్ ఎం.నాయక్ నియమితులయ్యారు. ఇంతకుముందు సీఎండీగా పని చేసిన రేవు ముత్యాలరాజు ఈ నెల 22న నెల్లూరు జిల్లా కలెక్టర్గా బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఇన్చార్జి సీఎండీగా జిల్లా జాయింట్ కలెక్టర్ నివాస్ను నియమించారు. ఆయన ఆ బాధ్యతలు చేపట్టకముందే.. రెగ్యులర్ సీఎండీగా నాయక్ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2005 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన నాయక్ గుంటూరు జిల్లా చిలకూరిపేటలోని సుగాలి కాలనీలో జన్మించారు. -
ఎయిర్ ఇండియా శుభవార్త
న్యూఢిల్లీ: ఇటీవల సూపర్ సేల్ ఆఫర్ అంటూ విమాన ప్రయాణీకులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఎయిర్ఇండియా మరో సంచలన ప్రకటన చేసింది. రాబోయే నాలుగేళ్లలో మరిన్ని విమానాలను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించి దేశంలోని ప్రముఖ నగరాల్లో విమాన ప్రయాణ సౌకర్యం కోసం ఎదురు చూస్తున్న ప్రయాణీకులకు శుభవార్త అందించింది. దేశీయ సర్వీసుల కోసం మరో100 విమానాలను కొనేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రభుత్వరంగ సంస్థ విమాన యాన సంస్థ ఎయిర్ ఇండియా తెలిపింది. వీటి ద్వారా దాదాపు 32 ప్రాంతీయ నగరాల్లో సర్వీసులకోసం వీటిని వినియోగించనున్నట్టు తెలిపింది. ఎయిర్ ఇండియా సీఎండీ అశ్విన్ లోహాని ఒక సమావేశంలో మాట్లాడుతూ ఈ మేరకు ప్రకటించారు. -
బీఎస్ఎన్ఎల్ సీఎండీగా మరో నాలుగేళ్లు శ్రీవాత్సవనే
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ సీఎండీగా అనుపమ శ్రీవాత్సవ మరో నాలుగేళ్లు కొనసాగుతారు. ఐదేళ్ల కాలానికి లేదా 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకూ బీఎస్ఎన్ఎల్ సీఎండీగా శ్రీవాత్సవను ప్రభుత్వం గత ఏడాది నియమించింది. ఏడాది కాలం తర్వాత ఆయన పనితీరును మదింపు చేసిన తర్వాత ఈ నియామకాన్ని కొనసాగిస్తామనే షరతుపై ప్రభుత్వం ఆయనను నియమించింది. బీఎస్ఎన్ఎల్ సీఎండీగా ఏడాది కాలం పాటు ఆయన పనితీరును మదింపు చేసిన ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని మరో నాలుగేళ్లు పొడిగించింది. తన మీద నమ్మకం ఉంచినందుకు అనుపమ శ్రీవాత్సవ ప్రభుత్వానికి కృతజ్జతలు తెలిపారు. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్కు కీలకమని, ఇది టర్న్ అరౌండ్ సమయమని శ్రీవాత్సవ పేర్కొన్నారు. -
లావా మేక్ ఇన్ ఇండియా ఫోన్..
‘సాక్షి’ ఇంటర్వ్యూ : లావా సీఎండీ హరి ఓమ్ రాయ్ మార్చికల్లా తొలి ఉత్పాదన ⇒ నోయిడా యూనిట్లో అసెంబ్లింగ్ ⇒ {పోత్సహిస్తే తెలుగు రాష్ట్రంలో ప్లాంట్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ ‘మేక్ ఇన్ ఇండియా’ బాట పట్టింది. 2015 మార్చికల్లా లావా మేక్ ఇన్ ఇండియా తొలి ఉత్పాదన మార్కెట్లోకి రానుంది. నోయిడాలోని రిపేరింగ్ కేంద్రంలో తొలుత మొబైల్ ఫోన్లను అసెంబ్లింగ్ చేస్తారు. ప్రస్తుతం చైనాలోని షెన్జెన్లో ఉన్న సొంత ప్లాంటు నుంచి భారత్కు లావా, జోలో బ్రాండ్లలో వివిధ మోడళ్లను దిగుమతి చేస్తోంది. 100 శాతం భారత్లో తయారైన మొబైల్ రావడానికి నాలుగేళ్లు పడుతుందని లావా ఇంటర్నేషనల్ సీఎండీ హరి ఓమ్ రాయ్ తెలిపారు. ఐరిస్ ఫ్యూయెల్ 60 మోడల్ ఆవిష్కరణ కార్యక్రమానికి మంగళవారం ఢిల్లీ వెళ్లిన సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. విశేషాలు ఆయన మాటల్లోనే.. తయారీ కేంద్రంగా భారత్.. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ పరిమాణం 1.8 ట్రిలియన్ డాలర్లు. ఇందులో చైనాలో తయారవుతున్న ఎలక్ట్రానిక్స్ విలువ 1 ట్రిలియన్ డాలర్లు. ఇప్పుడు ైచె నీయులు కార్మికులుగా పనిచేసేందుకు ఇష్టపడడం లేదు. ఇదే మనకు కలసి వచ్చే అంశం. భారత్లోని యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తే చాలు. తయారీ రంగంలో ఆస్తులుగా రూపొందుతారు. 10-15 ఏళ్లలో ప్రపంచ ఎలక్ట్రానిక్స్ అవసరాల్లో 40 శాతం మేర ఉత్పత్తి చేయగలిగేంతగా భారత్లో అవకాశాలున్నాయి. ఇక్కడ దృష్టి సారించేందుకు కంపెనీలకు సరైన సమయమిది. ఈ విషయంలో భారతీయ కంపెనీగా మేం ముందడుగు వేస్తున్నాం. ఎక్కువ ప్రోత్సాహకాలిస్తే.. ప్రత్యేక మోడల్ మేక్ ఇన్ ఇండియా ట్యాగ్తో మార్చిలో వస్తోంది. ఈ మోడల్కు కావాల్సిన కొన్ని విడిభాగాలను దేశంలో తయారు చేస్తాం. ఇక ప్లాంటు విషయానికి వస్తే ఉత్తరాదితోపాటు దక్షిణాది రాష్ట్రాలనూ పరిశీలిస్తున్నాం. ఎక్కువ ప్రోత్సాహకాలిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఒక రాష్ట్రంలో ప్లాంటు పెట్టేందుకు మేం సిద్ధం. ప్రతిపాదిత ప్లాంటుకై మూడేళ్లలో రూ.500 కోట్లు వెచ్చిస్తాం. నెలకు 50 లక్షల మొబైల్ ఫోన్ల తయారీ సామర్థ్యంతో ఈ ప్లాంట్ రానుంది. 2018 నాటికి మొబైల్స్ను పూర్తిగా భారత్లో తయారు చేస్తాం. ఫిబ్రవరిలో ఆన్డ్రాయిడ్ వన్.. ఆన్డ్రాయిడ్ వన్ ఫోన్ తయారీలోకి లావా కూడా వస్తోంది. మార్కెట్లో ఉన్న వన్ ఫోన్లతో పోలిస్తే మరిన్ని ఫీచర్లతో ఇది రానుంది. లావా ఎక్స్క్లూజివ్ స్టోర్లు పెద్ద ఎత్తున ఫ్రాంచైజీ విధానంలో ఏర్పాటు చేస్తున్నాం. భారత్తోపాటు నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, రష్యా, థాయ్లాండ్ తదితర దేశాల్లో నెలకు 30 లక్షల ఫోన్లను విక్రయిస్తున్నాం. థాయ్లాండ్లో నెలకు సుమారు 4 లక్షల మొబైల్ పీసులు విక్రయిస్తూ రెండో స్థానంలో ఉన్నాం. 2013-14లో లావా ఇంటర్నేషనల్ రూ.2,909 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6,000 కోట్ల మార్కును దాటుతాం. భారత స్మార్ట్ఫోన్ల మార్కెట్లో లావాకు 8 శాతం వాటా ఉంది. -
నేడు 8బ్యాంకుల సీఎండీ పోస్టులకు ఇంటర్వ్యూలు
న్యూఢిల్లీ: ఎనిమిది ప్రభుత్వ రంగ (పీఎస్యూ) బ్యాంకుల సీఎండీ పోస్టుల భర్తీకి శుక్రవారం (నేడు) ఇంటర్వ్యూలు జరగనున్నాయి. మొత్తం 19 మంది అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకానున్నారు. ఇంటర్వ్యూలకు కేంద్రం ఇటీవల మూడు సబ్ కమిటీలను ఏర్పాటు చేసింది. మూడు కమిటీల సగటు మార్కుల వెయిటేజ్ ప్రాతిపదికన, ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని నియామకాల బోర్డ్ అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. అభ్యర్థుల జాబితాలో దేనా బ్యాంక్ సీఎండీ అశ్వనీ కుమార్, ఐడీబీఐ బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్ బీకే బాత్రా, ఆంధ్రాబ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎస్కే కల్రాలూ ఉన్నారు. ఇప్పటికే ఒక ప్రభుత్వ రంగ బ్యాంకుకు (దేనా బ్యాంక్) సీఎండీగా ఉన్న ఒక అధికారి, ఈ తరహా ఇంటర్వ్యూకు హాజరుకావడం ఇదే తొలిసారి. పైన పేర్కొన్న ముగ్గురి పేర్లూ విజిలెన్స్ క్లియరెన్స్ తరువాత చివరి నిముషంలో ఖరారయ్యాయి. మిగిలిన 16 మంది పేర్లూ ముందుగానే షార్ట్లిస్ట్ అయ్యాయి. బ్యాంకులు ఇవీ..: పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్ , యునెటైడ్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ల సీఎండీ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వచ్చే నెలలో విజయాబ్యాంక్ సీఎండీ పోస్ట్ కూడా ఖాళీ అవుతుంది. -
సాగర్లో పర్యాటకుల సందడి
నాగార్జునసాగర్ : విద్యాసంస్థలకు సెలవులు ఉండడంతో సాగర్లో పర్యాటకుల సందడి నెలకొంది. మంగళవారం పర్యాటకులు భారీ సంఖ్యలో వచ్చారు. లాంచీలో నాగార్జునకొండకు వెళ్లి అక్కడి మ్యూజియంలోని విశేషాలు, బుద్ధుడి విగ్రహాలు, తదితర ప్రాంతాలను సందర్శించారు. అక్కడినుంచి సాయంత్రం వేళలో ఎత్తిపోతల, అంతకుముందే అనుపు, బుద్ధవనం తదితర ప్రాంతాలను సందర్శించారు. మ్యూజియాన్ని సందర్శించిన తమిళనాడు పర్యాటక సీఎండీ తమిళనాడు పర్యాటక సంస్థ సీఎండీ అండ్ కార్యదర్శి ఆర్.కన్నన్ సతీసమేతంగా మంగళవారం నాగార్జునకొండ మ్యూజియాన్ని సందర్శించారు. లాంచీలో నాగార్జునకొండకు వెళ్లారు. ఆశ్వమేథయజ్ఞం, స్వస్తిక్ గర్తు, బుద్ధుడి విగ్రహం తదితర విగ్రహాలను సందర్శించారు. వీరివెంట ఏఎస్ఎం నర్సింహన్ తదితరులు ఉన్నారు. -
వంద రోజుల ప్రణాళిక
విజయనగరం మున్సిపాలిటీ:విద్యుత్ సరఫరాలో లోపాలను అధిగమించి నిరంతరాయంగా సరఫరా చేసేందుకు ప్రభుత్వం ప్ర త్యేకంగా కార్యచరణ రూపొందిస్తోంది. ప్రధానంగా సరఫరాలో అవంతరాలకు క్షేత్రస్థాయి సమస్యలే కారణం కావడంతో వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఎంవీ శేషగిరిబాబు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా ఈ సమస్యలను పరిష్కరించి వినియోగదారులకు మెరుగైన సరఫరా అందించాలన్నది ప్రభుత్వ ధ్యేయంగా విద్యుత్ శాఖాధికారులు పేర్కొంటున్నారు. ఇందులో భాగంగా విజయనగరం సబ్ డివిజన్ పరిధికి సంబంధిం చి వంద రోజుల ప్రణాళికను రూపొందించి ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ సి. శ్రీనివాసమూర్తికి నివేదికలు అందజేసినట్టు తెలి సింది. మిగిలిన సబ్ డివిజన్లకు సంబంధించి సోమవారం నాటికి పూర్తిస్థాయి నివేదికలు అందజేయాలని ఆయా అధికారులకు ఎస్ఈ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. గృహ విద్యుత్ కనెక్షన్లకు 24 గంటల పాటు, వ్యవసాయ విద్యుత్ కనె క్షన్లకు రోజులో ఏడు గంటల పాటు నిరంతరాయంగా సరఫరా అందించాలన్నదే ప్రభుత్వం ప్రధాన ఉద్ధేశం. ఈ మేరకు వంద రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేసి అక్టోబర్ 2 నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని యోచిస్తోం ది. ఈ మేరకు ఇందుకు అ వసరమైన విద్యుత్ పరికరాలను ఏపీఈపీడీసీఎల్ సరఫరా చేయనుంది. ఇందులో భాగంగా విజయనగరం సబ్ డివి జన్కు సంబంధించి రూపొందించిన ప్రణాళికల్లో లోఓల్టేజీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించిన అధికారులు ఆయా ప్రాం తాల్లో 48 కొత్త ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే మరమ్మతుకు గురైన ఏబీ స్విచ్లను 200 వరకు సరి చేయను న్నారు. పూర్తిగా పని చేయని కండక్టర్లను మార్చడంతో పాటు కొద్దిపాటి లోఓల్టేజీ సమస్యలున్న ప్రాం తాల్లో ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ పెంచనున్నారు. అలాగే సబ్ డివిజన్ పరిధిలో ఒరిగి ఉన్న, తుప్పుపట్టిన 81 విద్యుత్ స్తంభాలతో పాటు, వదులుగా ఉన్న విద్యుత్ లైన్స్ను సరి చే యనున్నారు. 15 నుంచి పనులు ప్రారంభం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 15వ తేదీ నుం చి విద్యుత్ శాఖలో రూపొందించిన వంద ప్రణాళికలో భాగంగా అభివృద్ధి పనులు ప్రారంభం కా నున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. ప్రారంభించిన పనులను వంద రోజుల్లో పూర్తి చేయాల్సి ఉం టుంది. అయితే అధికారులు వంద రోజుల్లో సమస్యలను పరిష్కరించాలంటే ప్రకృతి సహకరించాలి. కానీ అది ఎంతవరకు సాధ్యమన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో తలెత్తిన విద్యుత్ సంక్షోభం వల్ల నాలుగు నెలలుగా గృహావసర విద్యుత్ కనెక్షన్లతో పాటు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఎప్పుడు సరఫరా ఉంటుందో...ఎప్పుడు నిలిచిపోతుందో తెలియని పరి స్థితి ఉంది. తాజాగా అధికారులు వంద రోజుల ప్రణాళిక పేరుతో చేపడుతున్నట్టు అభివృద్ధి పనులు ఎంతవరకు సత్ఫలితాలిస్తాయో... వేచి చూడాల్సిందే. -
టీ జెన్కో సీఎండీగా ప్రభాకర్రావు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జెన్కో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ)గా దేవులపల్లి ప్రభాకర్రావు నియమితులుకానున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే టీఆర్ఎస్ ఉన్నతస్థాయి వర్గాలు ఒక నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మొన్నటివరకు ఆయన జెన్కో జేఎండీగా వ్యవహరించారు. రాష్ట్రంలోని వివిధ విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించడంలో, ఆర్థిక వనరులు సమకూర్చడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. విద్యుత్రంగాన్ని పటిష్టపరిచే విషయంలో చంద్రబాబుతో భేదాభిప్రాయాలు తలెత్తితే తన పదవికే రాజీనామా చేసేందుకు ఆయన సిద్ధపడ్డారు. సంస్థను పటిష్టపరచడంలో ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరున్న ప్రభాకర్రావు... సకాలంలో ప్రాజెక్టులను పూర్తిచేయడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారనే అభిప్రాయం ఇంధనశాఖలో ఉంది. ఈ నేపథ్యంలో విభజన అనంతరం తెలంగాణలో విద్యుత్ సమస్య తలెత్తుతుందనే అభిప్రాయం ఉన్న నేపథ్యంలో ఇటువంటి అనుభవజ్ఞుడిని జెన్కో సీఎండీగా చేయడం వల్ల త్వరగా ప్రాజెక్టులు పూర్తి అవుతాయని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం. సుదీర్ఘకాలం ఫైనాన్స్ డెరైక్టర్గా పనిచేయడం వల్ల పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ)తో పాటు బ్యాంకర్లతో ఆయనకు విస్తృత పరిచయాలున్నాయి. అందువల్ల ప్రభాకర్రావు నియామకం వల్ల విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సమీకరణకు కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తదనే అభిప్రాయమూ ఉంది. విద్యుత్ బోర్డు విభజనకు ముందు ఆయన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బోర్డులో ఫైనాన్స్ మెంబర్గా పనిచేశారు. అలాగే ట్రాన్స్కో, జెన్కోలలో ఫైనాన్స్ డెరైక్టర్గా పనిచేశారు. జెన్కోకు చెందిన విద్యుత్ ప్రాజెక్టులకు ఆర్థిక వనరులను సమకూర్చడంలో ముఖ్యభూమిక పోషించారు. -
బీఈఎల్ కొత్త సీఎండీగా ఎస్.కె. శర్మ
బెంగళూరు: భారత్ ఎలక్ట్రానిక్స్(బీఈఎల్) కొత్త సీఎండీగా ఎస్.కె. శర్మ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1978లో కంపెనీలో చేరిన ఆయన హైదరాబాద్, బెంగళూరు, ఘజియాబాద్ ప్లాంట్లలో వివిధ హోదాల్లో పనిచేశారని బీఈఎల్ పేర్కొంది. సైనిక దళాల కోసం భారీస్థాయి ఎలక్ట్రానిక్ వార్ఫేర్(యుద్ధ) ప్రాజెక్టులను, నావికాదళ సంబంధ ఈఎస్ఎం సిస్టమ్స్ను అభివృద్ధి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని బీఈఎల్ వివరించింది. -
తాత్కాలిక విద్యుత్ పునరుద్దరణకు జేఏసీ అంగీకారం
హైదరాబాద్: విద్యుత్ జేఏసీతో సీఎండీ చర్చలు సఫలం అయ్యాయి. తాత్కాలిక విద్యుత్ ను పునరుద్దరించేందుకు జేఏసీ అంగీకరించింది. విద్యుత్ ఉద్యోగుల ఆకస్మిక సమ్మెతో రాష్ట్రంలో అంధకారం అలుముకుంది. అత్యవసర సేవల్లో ఒకటైన విద్యుత్ స్తంభించిపోవడంతో ఆదివారం సాయంత్రం సీఎండీ జేఏసీ సభ్యులతో చర్చలు జరిపారు. కాగా, జేఏసీ మాత్రం రేపు ఉదయం వరకూ మాత్రమే విద్యుత్ సరఫరా చేయనున్నట్లు తెలిపింది. దీంతో ప్రకాశం, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల ప్రజలకు ఊరట లభించనుంది. విజయవాడ ట్రాన్స్ కోలో విద్యుత్ ఉత్పత్తి జీరో స్థాయికి పడిపోయింది. సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగడం రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. విద్యుత్ సంక్షోభం కారణంగా దక్షిణ మధ్య రైల్వే ఆదివారం 28 రైళ్లను రద్దు చేశారు. వీటిలో 24 ప్యాసింజర్, 4 ఎక్స్ప్రెస్ రైళ్లు ఉన్నాయి. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో పలు రైళ్లు మార్గమధ్యంలో ఆగిపోగా, మరికొన్నింటిని దారి మళ్లించి నడపుతున్నారు. విద్యుత్ స్తంభించిపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఈ ఏడాది దూకుడు లేనట్లే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా ఈ ఏడాది వ్యాపారంలో దూకుడుగా వెళ్లరాదని ప్రభుత్వరంగ సిండికేట్ బ్యాంక్ నిర్ణయించుకుంది. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న స్పష్టమైన సంకేతాలు వెలువడటం లేదని, వృద్ధిరేటు తిరిగి గాడిలో పడేదాకా వ్యాపారంలో ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్లు సిండికేట్ బ్యాంక్ సీఎండీ సుధీర్ కుమార్ జైన్ తెలిపారు. శనివారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వ్యాపారంలో 14 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో తమ బ్యాంక్ వ్యాపార పరిమాణం రూ.3.34 లక్షల కోట్లుగా కాగా అది ఈ సంవత్సరం రూ.3.8 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వ్యాపార విస్తరణలో భాగంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా 200 కొత్త శాఖలతోపాటు సుమారుగా 1,500 ఏటిఎంలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రస్తుతం సిండికేట్ బ్యాంక్కి 3,004 శాఖలు, 1,350 ఏటిఎంలు ఉన్నాయి. అలాగే ఈ ఏడాది 1,500 మంది ఆఫీసర్లను, 1,400 మంది క్లరికల్ సిబ్బందిని నియమించుకుంటున్నట్లు తెలిపారు. ఆర్బీఐ చర్యల వల్ల లిక్విడిటీపై స్వల్పంగా ఒత్తిడి ఉన్నప్పటికీ వడ్డీరేట్లను పెంచే ఆలోచన లేదన్నారు. ఈ సంవత్సరం రూ.1,830 కోట్ల మూలధనం సమకూర్చవలసిందిగా ప్రభుత్వాన్ని కోరినట్లు జైన్ చెప్పారు. రాష్ట్ర విభజన వల్ల రెండు రాష్ట్రాల వ్యాపారాల్లో పెద్దగా మార్పులొస్తొయని భావించడం లేదన్నారు. కాని ఈ వివాదాలు సద్దుమణిగితే మాత్రం ఆగిపోయిన పెట్టుబడులు హైదరాబాద్కు పెద్ద ఎత్తున రావచ్చన్నారు.