coastal andhra
-
37 మంది జైలు వార్డర్లపై క్రమశిక్షణా చర్యలు
ఆరిలోవ (విశాఖ జిల్లా): విశాఖ కేంద్ర కారాగారంలో నిబంధనలు ఉల్లంఘించిన 37 మంది వార్డర్లపై క్రమశిక్షణా చర్యలు చేపట్టినట్లు జైళ్ల శాఖ కోస్తాంధ్ర రీజియన్ డీఐజీ రవికిరణ్ తెలిపారు. విశాఖ కేంద్ర కారాగారం పర్యవేక్షణాధికారి ఎం.మహేశ్బాబు అవమానించారని.. విధి నిర్వహణలో కఠినంగా ఉంటున్నారంటూ వార్డర్లు తమ కుటుంబసభ్యులతో జైలు ప్రధాన ద్వారం ఎదుట ధర్నా చేశారు. ఈ విషయం తెలుసుకున్న డీఐజీ రవికిరణ్ శనివారం అర్ధరాత్రి రాజమండ్రి నుంచి విశాఖకు చేరుకున్నారు.వార్డర్లతో, జైలు సూపరింటెండెంట్తో చర్చించారు. ఆదివారం ఉదయం జైలును సందర్శించి.. ఖైదీలతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జైలులో ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అందరికీ ఒకే విధమైన నిబంధనలు వర్తిస్తాయన్నారు. జైలు లోపలకు నిషేధిత వస్తువులు తెచ్చారని అనుమానం వస్తే.. ఎవరినైనా వెంటనే తనిఖీ చేయవచ్చని చెప్పారు. అందులో భాగంగా సూపరింటెండెంట్ సమక్షంలో డిప్యూటీ సూపరింటెండెంట్.. ఇద్దరు వార్డర్లను తనిఖీ చేశారని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి జైల్ ముందు ధర్నా చేసి.. విధులకు గైర్హాజరైన 37 మంది వార్డర్లను రాష్ట్రంలోని వేర్వేరు జైళ్లకు బదిలీ చేశామన్నారు. -
AP Rains: ఏపీలో మరో రెండ్రోజులు వర్షాలు
విశాఖపట్నం, సాక్షి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలహీన పడిన వాయుగుండం.. అల్ప పీడనంగా నైరుతి దిశగా పయనిస్తోంది. ఈ క్రమంలో.. ఏపీకి మరో రెండ్రోజులు వర్షాలు తప్పవని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో పల్నాడులో కుండపోత వాన పడింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మరో రెండు రోజులపాటు విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది.రేపు, ఎల్లుండి నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో భారీ వర్షాలు పడనున్నాయి. కోస్తా తీరం వెంబడి కొనసాగనున్న తీవ్రమైన ఈదురు గాలులు కొనసాగుతాయి. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని ఇప్పటికే సూచించింది వాతావరణ శాఖ.ఇదీ చదవండి: అకాల వర్షం నిండా ముంచేసింది -
కోస్తాంధ్రలో మూడు రోజులు భారీ వర్షాలు..
-
కోస్తాంధ్రకు భారీ వర్షసూచన
సాక్షి, విశాఖపట్నం/అమరావతి/వాకాడు: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. తదుపరి రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. వాయుగుండంగా మారిన అనంతరం నెల్లూరు సమీపానికి చేరి.. అక్కడ దిశ మార్చుకుని తమిళనాడు వైపుగా పయనిస్తుందని, అక్కడే తీరం దాటే అవకాశాలున్నాయని వెల్లడించారు.దీని ప్రభావం శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ తీర ప్రాంతంలోని కోస్తాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపారు. బుధవారం నుంచి ఈ నెల 22 వరకూ రాష్ట్రానికి వర్ష సూచన ఉందని వెల్లడించారు. బుధవారం విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానాం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, విజయనగరం, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. 19న ఉత్తరాంద్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 గరిష్టంగా 55 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని పేర్కొన్నారు. మత్స్యకారులెవరూ ఈ నెల 22 వరకూ వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.తీరంలో అలజడిఅల్పపీడనం కారణంగా మంగళవారం వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. తిరుపతి జిల్లా సముద్ర తీరంలోని చిల్లకూరు, కోట, వాకాడు, తడ, సూళ్లూరుపేట మండలాల పరిధిలో సముద్రంలో భీకరమైన శబ్దాలతో అలలు ఎగసిపడుతున్నాయి. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు తలెత్తి మధ్యాహ్నం నుంచే చీకట్లు కమ్ముకుని తీవ్రమైన చలి గాలులు వీస్తున్నాయి. వాకాడు మండలం తూపిలిపాళెం సముద్ర తీరంలో భీకరమైన శబ్దాలతో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తీరప్రాంత ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. సాయంత్రం 4 గంటలకే రాత్రిని తలపిస్తూ బయట తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే వేటలో కొనసాగుతున్న మత్స్యకారులు తీవ్రమైన అలలు, చలి గాలులకి తట్టుకుని వేట చేయలేకున్నామని, తాము వేట ముగించుకుని, త్వరితగతిన ఒడ్డుకు వచ్చేస్తున్నామంటూ తోటి మత్స్యకారులకు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. -
ఏపీని భయపెడుతున్న తుపాను
సాక్షి, విశాఖ: తమిళనాడుతో పాటు ఏపీని కూడా తుపాను భయపెడుతోంది. ఈ రాత్రికి తీవ్ర వాయుగుండం తుపానుగా మారనుందని వాతావరణ శాఖ అంటోంది. ఫెంగల్ తుపాను సమీపించే కొద్దీ.. భారీ వర్షాలు అతలాకుతలం చేస్తాయని హెచ్చరిస్తోంది... ఇప్పటికే దక్షిణ కోస్తా భారీ వర్షాలు, తీవ్ర గాలులతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. మరో ఐదు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణశాఖ చెబుతోంది. కోస్తా తీరం వెంబడి ఉన్న పోర్టులలో ఒకటవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలు నేపథ్యంలో వ్యవసాయ పనులు చేసే రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది అధికార యంత్రాంగం. ఇక.. విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. .. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం బుధవారం ఉదయం చెన్నైకు దక్షిణ ఆగ్నేయ దిశలో 550 కి.మీ, పుదుచ్చేరికి 470 కి.మీ కేంద్రీకృతమై ఉంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ.. తుపానుగా మారే అవకాశం ఉంది. రాగల రెండ్రోజులు ఉత్తర ఆగ్నేయ దిశలోనే ప్రయాణించి తమిళనాడు తీరంలో కేంద్రీకృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ప్రాంతంలో పలు చోట్ల గురువారం, శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో 35 నుంచి 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని అన్నారాయన.ఏపీపై తుపాను ప్రభావం వారంపాటు కొనసాగనుంది. రేపు సాయంత్రం నుంచి దక్షిణ కోస్తా తీర ప్రాంతాల్లో గంటకు 50-70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. వచ్చే ఐదు రోజుల్లో.. దక్షిణ కోస్తా. రాయలసీమ, ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తాయని చెబుతోంది. ఈ నెల 30వ తేదీ దాకా మత్య్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు ఇదివరకే జారీ అయ్యాయి. ఇంకోవైపు.. తుపాను ప్రభావంతో తెలంగాణలోనూ వర్షాలు పడొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇప్పటికే తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది అక్కడి విద్యాశాఖ. -
రెండు రోజులపాటు కోస్తాంధ్రకు వర్ష సూచన
-
ఏపీలో రెండ్రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు
అమరావతి, సాక్షి: మధ్యప్రదేశ్ తీర పరిసర ప్రాంతం మీదుగా కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం, దీనికి అనుబంధంగా విస్తరించిన ఆవర్తనం రాష్ట్రం మీద ప్రభావం చూపించనుంది. ఈ ప్రభావంతో రెండ్రోజులపాటు ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు, ఎల్లుండి (జులై 18, 19వ తేదీల్లో) కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే.. మిగిలినచోట్ల విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారాయన. రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.‘‘వర్షం పడే సమయంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద ఉండరాదు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని సూచించారాయన. అలాగే.. అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్స్ 1070, 112, 18004250101 సంప్రదించాలని కోరారాయన. భారీ నుంచి అతి భారీ వర్ష సూచన జిల్లాలుశ్రీకాకుళం, విజయనగరం,మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ భారీ నుంచి అతి భారీ వర్ష సూచన జిల్లాలుకోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో పలుచోట్లుభారీ నుంచి అతి భారీ వర్ష సూచన జిల్లాలుకృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం -
కోస్తాంధ్ర, రాయలసీమలో రేపు భారీ వర్షాలు
-
AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. నెలన్నర రోజులుగా వడగాడ్పులు, వడగాడ్పులు వీస్తున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరుకుంటున్నాయి.ఈ తరుణంలో ఒకపక్క వడగాడ్పులు కొనసాగుతూనే మరోపక్క ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పతున్నాయి. ఆది, సోమవారాల్లో కోస్తాంధ్ర, రాయల సీమల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం నివేదికలో వెల్లడించింది.ఈ నెల 7న (మంగళవారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు, ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.మరోవైపు శనివారం ప్రకాశం జిల్లా దరిమడుగులో 47.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. 28 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 187 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. ఆదివారం 30 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 247 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. సోమవారం 15 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 69 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. -
ముందే హీటెక్కిన సీమ
సాక్షి, విశాఖపట్నం: ఈ ఏడాది రాయలసీమలో వేసవి సెగలు ముందే మొదలయ్యాయి. ఫిబ్రవరి నెలాఖరు నుంచే ఎండల తీవ్రత పెరుగుతోంది. మార్చి మొదటి వారం నుంచి మరింతగా విజృంభిస్తున్నాయి. ఏప్రిల్ నెలారంభంలో నమోదు కావాల్సిన పగటి (గరిష్ట) ఉష్ణోగ్రతలు ఇప్పటినుంచే రికార్డవుతున్నాయి. ప్రస్తుత ఉష్ణతాపాన్ని చూసి మున్ముందు ఇంకెంత తీవ్రతను చవి చూడాల్సి వస్తుందోనన్న ఆందోళన ఆ ప్రాంత వాసుల్లో నెలకొంటోంది. సాధారణంగా ఏప్రిల్ ప్రారంభం నుంచి 40 డిగ్రీలు, అంతకుమించి పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ.. ఈ ఏడాది అందుకు భిన్నంగా మార్చి ఆరంభంలోనే 41 డిగ్రీలకు పైగా చేరుకుంటున్నాయి. ఈ నెల 2న శనివారం అనంతపురంలో 41, కర్నూలు 39, నంద్యాల, కడపలో 38 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 3న అనంతపురంలో 39, కర్నూలులో 39, నంద్యాల, కడపలో 38, 4న అనంతపురంలో 40, కర్నూలులో 39, నంద్యాల, కడపల్లో 38 డిగ్రీలు, 5న 4న అనంతపురంలో 40, కర్నూలులో 39, నంద్యాల, కడపల్లో 38 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్నాళ్లుగా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకంటే రాయలసీమలోనే ఉష్ణతాపం అధికంగా కనిపిస్తోంది. అక్కడ సాధారణం కంటే 3–4 డిగ్రీలు అధికంగా ఉంటోంది. రాష్ట్రంలో విశాఖపట్నం, కళింగపట్నం మినహా అన్ని ప్రాంతాల్లో 33 నుంచి 37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దక్షిణ, ఉత్తర కోస్తాల్లో రాయలసీమ కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు రికార్డవుతుండటం ఆ ప్రాంత వాసులకు ఒకింత ఊరటనిస్తోంది. సెగలకు ఇదీ కారణం కోస్తాంధ్ర కంటే రాయలసీమలో పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవడానికి గాలిలో తేమ తక్కువగా ఉండటమే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గాలిలో తేమ తక్కువగా ఉంటే ఉష్ణతాపం పెరగడానికి దోహదపడుతుంది. ఈ తేమ 50 శాతం కన్నా తగ్గే కొద్దీ వేడి అధికమవుతుంది. కొద్ది రోజులుగా రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప, నంద్యాలలో తేమ 19 నుంచి 26 శాతం మాత్రమే ఉంటోంది. అందువల్ల అక్కడ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కంటే అధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. వారంలో మరింత భగభగ రానున్న వారం రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కొన్నిచోట్ల సాధారణంకంటే 2–3 డిగ్రీలు అధికంగా నమోదవుతుండగా.. వారం పది రోజుల్లో అవి 4–5 డిగ్రీలకు ఎగబాకే అవకాశం ఉందని చెబుతున్నారు. -
AP: దూసుకొస్తున్న ‘మిచాంగ్’ తుపాను.. ఐఎండీ రెడ్ అలర్ట్
సాక్షి, అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. రేపటికి తుపానుగా మారే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆ తర్వాత దక్షిణకోస్తా తీరానికి సమాంతరంగా పయనించనుందని, మంగళవారం మధ్యాహ్నం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశముంది. నెల్లూరు జిల్లా వైపు మిచాంగ్ తుపాను దూసుకొస్తుంది. ఐఎండీ రెడ్ ఎలర్ట్ ప్రకటించింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో 4వ తేదీ జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్ సెలవు ప్రకటించారు. Strong breeze now in Vizag . Similar 30-40kmph wind speed along the AP coast now !! #CycloneMichaung pic.twitter.com/BpcYuJrB1w — Vizag Weatherman@AP (@VizagWeather247) December 2, 2023 తుపాను ప్రభావంతో ఆదివారం నుండి మంగళవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయి. మంగళవారం అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం నుంచి కోస్తా తీరం వెంబడి గంటకు 80 -100 కీమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు మంగళవారం వరకు వేటకు వెళ్లరాదని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అంబేద్కర్ హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను కోస్తాంధ్రతో పాటు, రాయలసీమలోనూ పెను ప్రభావం చూపనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోంది. తుపాను ప్రభావిత జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది. తాడేపల్లిలో రాష్ట్ర కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, ఫోన్ నంబర్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసింది. చదవండి: ఏపీ రాజకీయాలపై తెలంగాణ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ ఎంత? -
రేపు కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. క్రమంగా ఇది వాయువ్యదిశగా కదులుతూ పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. రేపటికి(నవంబర్ 15కల్లా) పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండగా మారే అవకావం కనిపిస్తోంది. వాయవ్య దిశగా పయనించి.. 16వ తేదీ నాటికి తీవ్రవాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంపై కనిపించనుంది. కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం నాటికి ఇది ఉత్తర- ఈశాన్య దిశగా తిరిగి ఒడిశా తీరానికి చేరుకుంటుంది. కోస్తాంధ్ర తీరంలో వర్షాల నేపథ్యంలో.. మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. -
15న బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 15న అల్పపీడనం ఏర్పడనుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ఆధారంగా అది వాయుగుండంగా బలపడే అవకాశాలు అంతగా కనిపించడం లేదు. మరోవైపు 14వ తేదీ నుంచి ఈశాన్య, తూర్పు గాలులు బలోపేతం కానున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు, రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇంతలో 15న అల్పపీడనం ఏర్పడడం, ఈశాన్య, తూర్పు గాలులు తోడవడం వంటి కారణంతో వర్షాలకు ఆస్కారం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు రానున్న మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణమే నెలకొంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం రాత్రి నివేదికలో తెలిపింది. -
బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మరింత బలపడి సోమవారం వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. ఈ వాయుగుండం సోమవారం రాత్రికి శ్రీలంకలోని ట్రింకోమలికి తూర్పు ఆగ్నేయంగా 530, భారత్లోని కరైకల్కు తూర్పు ఆగ్నేయంగా 750 కిలోమీటర్ల దూరంలోను కేంద్రీకృతమై ఉంది. ఇది మంగళవారం సాయంత్రం వరకు పశ్చిమ వాయవ్య దిశగా కదులుతుందని, అనంతరం మలుపు తిరిగి క్రమంగా దక్షిణ నైరుతి వైపు పయనిస్తుందని, బుధవారం మధ్యాహ్నానికి శ్రీలంక వద్ద తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి నివేదికలో వివరించింది. దీని ప్రభావంతో మంగళవారం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం నుంచి రెండురోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. -
Rain Alet: దక్షిణ కోస్తా వైపునకు వాయుగుండం!.. భారీ వర్షాలకు అవకాశం
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 5వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ ఏడో తేదీ ఉదయానికి వాయుగుండంగా బలపడనుంది. అనంతరం అదే దిశలో పయనిస్తూ నైరుతి బంగాళాఖాతంలోకి చేరుతుంది. క్రమంగా కదులుతూ ఎనిమిదో తేదీ ఉదయానికి ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం రాత్రి నివేదికలో తెలిపింది. తొలుత ఈ వాయుగుండం దక్షిణ తమిళనాడు–పుదుచ్చేరి తీరాలకు చేరుకుంటుందని ఐఎండీ అంచనా వేసింది. తాజా అంచనాల ప్రకారం దిశ మార్చుకుని దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరువయ్యే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావం ఈ నెల ఆరో తేదీ తర్వాత దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమపై ఉంటుందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల విస్తారంగా, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంపైకి ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. ఫలితంగా రానున్న రెండు రోజులు ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణ కొనసాగనుంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో శనివారం ఒకటి, రెండుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది. చదవండి: మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్ -
కొనసాగుతున్న తూర్పు, ఈశాన్య గాలులు.. రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో దిగువస్థాయి నుంచి తూర్పు, ఈశాన్య గాలులు వీస్తున్నాయి. ఇవి మరికొద్ది రోజులు కొనసాగనున్నాయి. వీటి ఫలితంగా రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి నివేదికలో తెలిపింది. అనంతరం పొడి వాతావరణం మొదలయ్యాక రాష్ట్రంలో చలి ప్రభావం అధికమవుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కాగా శనివారం తిరుపతి జిల్లా ఇనుగుంటలో 7.6 సెం.మీల భారీ వర్షం కురిసింది. -
ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో మూడు రోజులు వర్షాలు
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ బుధవారానికి ఏపీ తీరం వైపునకు పయనించే అవకాశం ఉంది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్రలో పలుచోట్ల, రాయలసీమలో ఒకటి, రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి ప్రకటించింది. చదవండి: రామోజీ అర్ధసత్యాల ‘పంచాయితీ’ అదే సమయంలో కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు పడవచ్చని వివరించింది. మరోవైపు కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 45 కిలో మీటర్లు, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అందువల్ల సముద్రం అలజడిగా ఉంటుందని, రానున్న మూడు రోజులు మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు హుకుంపేట (వైఎస్సార్ జిల్లా)లో 3.5 సెం.మీ., కపిలేశ్వరపురం (డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా)లో 3.2, చాట్రాయి (ఏలూరు)లో 3.1, రాజానగరం (తూర్పుగోదావరి)లో 3, ఆళ్లగడ్డ (నంద్యాల జిల్లా)లో 2.9, జగ్గంపేట (కాకినాడ జిల్లా) 2.6, గొలుగొండ (అనకాపల్లి జిల్లా)లో 2.3 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయవ్య దిశగా కదిలి నేటి (శనివారం) సాయంత్రానికి వాయుగుండంగా, ఆదివారానికి తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ తుపానుకు అసాని అని పేరు పెట్టనున్నారు. తుపాను వాయవ్య దిశగా ప్రయాణించి 10వ తేదీన ఉత్తరాంధ్ర–ఒడిశా మధ్య తీరందాటే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఇది బంగ్లాదేశ్ వైపు ప్రయాణించే సూచనలు కూడా ఉన్నాయని, అయితే 10వ తేదీన విశాఖపట్నం తీరం సమీపానికి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దీనిప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మూడురోజుల పాటు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, వెళ్లినవారు వెంటనే తిరిగి రావాలని కోరారు. చదవండి: ఎంపీగా ఉండి కోర్టుకు రావడమేంటి? రఘురామకు హైకోర్టు చీవాట్లు -
కొనసాగుతున్న అల్పపీడనం
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం భూమిపైకి చేరి ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో కొనసాగుతోంది. ఇది విదర్భ మీదుగా ఉత్తరప్రదేశ్ వైపు పయనిస్తూ క్రమేపి బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మన రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఎక్కువ చోట్ల వర్షాలు పడ్డాయి. శ్రీకాకుళం జిల్లా మందసలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాబోయే రెండురోజులు కోస్తాంధ్రలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఈ నెల 23వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. -
రాగల 48 గంటల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు
-
కోస్తాకు తప్పిన వాయుగుండం ముప్పు
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలోని అల్పపీడనం దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్రల సమీపాన వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య ప్రాంతానికి ఆనుకుని కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో తుఫాను ఆవర్తనం నెలకొంది. ఈ అల్పపీడనం ఈ రోజు సాయంత్రానికి వాయుగుండంగా బలపడవచ్చు. ఇది ఉత్తర వాయవ్య దిశగా ఒడిసా తీరం వెంబడి, వాయవ్య బంగాళాఖాతంలో పయనిస్తూ 48 గంటల్లో బెంగాల్ బంగ్లాదేశ్ల మీదకు వెళుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపు సాయంత్రానికి ఇది తీవ్ర వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. చదవండి: వదలని వరద తూర్పు తీరం నుంచి పశ్చిమ తీరం వరకూ ద్రోణి కొనసాగుతోంది. ఇది మరో మూడురోజులు ప్రభావశీలంగా ఉంటుంది వీటి ప్రభావం తెలంగాణ కోస్తాంధ్రలమీద తక్కువగా కోస్తా రాయలసీమలో మాత్రం కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర సుముద్రతీరం అల్లకల్లోలంగా ఉంటుంది. మత్స్యకారులు వేటకు పోరాదనీ వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. -
పొంగిన వాగులు, వంకలు
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షాల ప్రభావంతో పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో వాగుల్లో కొట్టుకుపోయి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ► గుంటూరు జిల్లాలో పోటేళ్లవాగు, ఓగేరు, పెరమవాగు, మొద్దువాగులు, కొండవీటి వాగులు పొంగిపొర్లాయి. దీంతో సచివాలయంతోపాటు పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బాపట్ల మండలంలో అత్యధికంగా 151 మి.మీ. వర్షపాతం నమోదైంది. ► ప్రకాశం జిల్లాలో 14 మండలాల్లో కుండపోత వర్షం కురిసింది. గుండ్లకమ్మ వాగులో ట్రాక్టర్ కొట్టుకుపోయింది. వాగులో చిక్కుకున్న ఇద్దరిని గజ ఈతగాళ్లు ఒడ్డుకు చేర్చారు. పెంచికలపాడు వాగులో చిక్కుకున్న అంకయ్య అనే వ్యక్తిని కాపాడారు. కొత్తకోట వాగు ఉధృతిలో చిక్కుకున్న హరియాణకు చెందిన లారీ డ్రైవర్, క్లీనర్లను పోలీసులు ఒడ్డుకు చేర్చారు. తూర్పు వాగులో చిన అంబడిపూడి బీసీ కాలనీకి చెందిన పల్లపు శ్రావణ్కుమార్ (11), గుంజి విశాల్ అనే విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయారు. గాలించి ఇరువురిని వైద్యశాలకు తరలించగా అప్పటికే శ్రావణ్ మృతిచెందాడు. జిల్లాలో అత్యధికంగా రాచర్ల మండలంలో 186.2 మి.మీ. వర్షం కురిసింది. ► వైఎస్సార్ జిల్లాలో ఒక్కరోజులోనే 7.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కడపలోని ఆర్టీసీ బస్టాండ్ గ్యారేజీలోకి పెద్ద ఎత్తున నీరు చేరింది. ముద్దనూరు చెరువు కట్ట తెగింది. కలసపాడు బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహించింది. బుగ్గవంక ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో రెండు గేట్లు ఎత్తి దిగువకు వదిలారు. ► అనంతపురం జిల్లాలోని 63 మండలాల పరిధిలో ఒకే రోజు 23 మి.మీ. వర్షపాత సగటు నమోదైంది. వందలాది చెరువుల్లోకి పెద్దఎత్తున వర్షపునీరు చేరింది. ► చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని తంగేళిమిట్ట వద్ద మద్దెలవంకలో సుమంత్ (14) అనే విద్యార్థి వాగులో కొట్టుకుపోయాడు. తనతో పాటు వాగులో జారిన ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. సుమంత్ ఆచూకీ తెలియరాలేదు. ► కర్నూలు జిల్లాలో నంద్యాల పట్టణ పరిధి పెద్దకొట్టాల సమీపంలోని నంది ఫారŠుచ్యనర్ వెంచర్లోకి భారీగా వరద నీరు చేరడంతో తొమ్మిది కుటుంబాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. వెంచర్ ప్రహరీని పగలగొట్టించి వరదనీరు బయటకు వెళ్లేలా చేశారు. ఆర్టీపీపీ యూనిట్లలోకి నీరు ఎర్రగుంట్ల: వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లలో శనివారం భారీ వర్షం కురవడంతో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ) యూనిట్లలోకి నీరు వచ్చి చేరింది. దీంతో మోటార్లు, యంత్ర సామాగ్రి మునిగిపోయాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు నీటి పంపింగ్ చేపట్టారు. ఆర్టీపీపీ సీఈ ఎల్ మోహన్రావు మాట్లాడుతూ లోతట్టు ప్రాంతంలో నీరు చేరిందని, ఎలాంటి నష్టం జరగలేదని అన్నారు. నేడు, రేపు కోస్తాకు భారీ వర్షసూచన సాక్షి, విశాఖపట్నం: తూర్పు బిహార్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో ఏపీ తీరానికి సమీపాన పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఒడిశా మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 1.5 నుంచి 5.8 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ కర్ణాటక వరకూ 3.1కి.మీ. ఎత్తులో మరో ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఆది, సోమవారాల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. -
నేడు, రేపు కోస్తాంధ్రలో వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: అల్పపీడన ప్రభావంతో గురువారం, శుక్రవారం కోస్తాంధ్రలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. ► ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకొని వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. ► కోస్తా తీరం వెంట గంటకు 50 నుంచి 60 కి.మీ వేగం గాలులతో సముద్రం అల్లకల్లోలంగా ఉండనుంది. రెండు రోజులపాటు కోస్తా తీర ప్రాంత మత్స్యకారులెవరూ వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ► గత 24 గంటల్లో వర రామచంద్రాపురంలో 6 సెం.మీ, పోలవరం, పాడేరుల్లో 5, ప్రత్తిపాడు, పెద్దాపురంల్లో 4, చింతపల్లి, కుక్కునూరు, అమలాపురం, తాడేపల్లిగూడెం, కూనవరం, భీమడోలుల్లో 3 సెం.మీ వర్షపాతం నమోదైంది. -
మూడు రోజులు కోస్తాకు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: ఒడిశా తీరంలో ఉపరితల ఆవర్తనం, దానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని దీనికితోడు కోస్తాపై నైరుతి రుతుపవనాల ప్రభావం చురుగ్గా కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో రేపటి నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు విస్తారంగా కురుస్తాయి.రాయలసీమలో రానున్న మూడు రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నాయి. రేపటి నుంచి మూడు రోజుల పాటు కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ వర్ష సూచన. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిమీ వేగంతో, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గంటకు 40 –50 కిమీ వేగంతో గాలులు వీస్తాయని ప్రకటన. మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరిక. గడిచిన 24 గంటల్లో కర్నూలులో 3 సెంమీ, సి.బెలగొళ, బద్వేల్, మంత్రా లయం, పలమనేరులో 2 సెంమీ వర్షపాతం నమోదైంది. -
ఆగ్నేయ బంగాళాఖాతంతో అల్ప పీడనం
సాక్షి, విజయవాడ: దక్షిణ అండమాన్ నుంచి ఆగ్నేయ బంగాళఖాతం వరకు అల్ప పీడనం ఏర్పడినట్లు ఆంధ్ర ప్రదేశ్ విపత్తు నిర్వాహణ శాఖ డైరెక్టర్ వెల్లడించారు. కాగా వచ్చే 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి దక్షిణ అండమాన్ తీరంలో గంటకు 40 నుంచి 60 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఈ అల్పపీడన ప్రభావం ఏపీపై ఉండే అవకాశం లేదన్నారు. దీని ప్రభావం వల్ల ఆగ్నేయా బంగాళాఖాతం, దక్షిణ అండామాన్ సముద్ర పరిస్థితులు కఠినంగా ఉంటాయన్నారు. ఇక ఆంధ్ర కోస్టు తీరంలో చాపల వేటకు వెళ్లే మత్సకారులు ఆగ్నేయ బంగాళాఖాతం వైపుకు వెళ్లోద్దని డైరెక్టర్ హెచ్చరించారు. -
36 గంటల్లో అల్పపీడనం; భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం : ఈశాన్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తున ఆవరించి ఉంది. దీని ప్రభావంతో రాగల 36 గంటల్లో వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్ప పీడనం ఏర్పడుతుందని ఐఎండీ ఆదివారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. అదేవిధంగా దక్షిణ కోస్తా సముద్రతీరం, దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. వీటి ప్రభావంతో ఈ నెల 13వ తేదీన ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. -
మరో రెండు రోజులు కోస్తాలో వర్షాలు
సాక్షి, విశాఖపట్నం : ఇటీవల వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం క్రమంగా బలహీనపడుతోంది. ఉత్తర ఛత్తీస్గఢ్ నుంచి ప్రయాణిస్తూ.. ఈశాన్య మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈశాన్య దిశగా జబల్పూర్కు 75 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి రాగల 48 గంటల్లో క్రమంగా బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారనుందని భారత వాతావరణ విభాగం గురువారం రాత్రి పేర్కొంది. దీని ప్రభావంతో రాగల రెండు, మూడు రోజులు కోస్తాంధ్రలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి వానలు పడతాయని ఐఎంసీ తెలిపింది. గాలుల ప్రభావం మాత్రం కొనసాగుతుందని, గంటకు 45 నుంచి 55 కి.మీ వరకు గాలులు వీస్తాయని పేర్కొంది. కాగా, మత్స్యకారులు శనివారం కూడా వేటకు వెళ్లవద్దని విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. గడచిన 24 గంటల్లో కోస్తాలోని కొమరాడలో 9 సెం.మీ, కురుపాంలో 8, జియ్యమ్మవలస, పలాస, పార్వతీపురంలలో 5 సెం.మీ వర్షపాతం నమోదైంది. -
కోస్తాంధ్ర,రాయలసీమలో మోస్తారు వర్షాలు
-
కోస్తాంధ్రకు వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం : కోస్తాంధ్రకు భారత వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. వాయువ్య బంగాళాఖాతం ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్, ఒడిశాలపై ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీనితో పాటు ఉత్తర ఛత్తీస్ఘఢ్ పరిసర ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఉన్నట్లు పేర్కొంది. దీంతో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని.. రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు పడతాయిని తెలిపింది. అక్కడక్కడ ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 50 నుండి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా తీరంలోని సముద్రంలో అల్లకల్లోల పరిస్థితి ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. -
కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన.
-
కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన
హైదరాబాద్: వార్దా తుఫాను నెల్లూరుకు ఆగ్నేయ దిశలో 820 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 20 కిలో మీటర్ల వేగంతో నెల్లూరు వైపు పయనిస్తోంది. దీని ప్రభావం వల్ల ఆదివారం కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా వార్దా తుఫాను కదులుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపటి వరకు తీవ్ర తుఫానుగానే కొనసాగనుంది. ఏపీ తీరానికి చేరుకునే సరికి వార్దా తుఫాను బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశముంది. సోమవారం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటనుంది. ఇదిలావుండగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు వెళ్లాల్సిన యూఏఈ, కువైట్ పర్యటనను రద్దు చేసుకున్నారు. వార్దా తుఫాను వల్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో చంద్రబాబు సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు. -
కోస్తాంధ్రకు వర్ష సూచన
విశాఖ : రాష్ట్రంలో నేటి నుంచి వర్షాలు పెరిగే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా తీరానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందన్నారు. సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తు వరకు ఆవర్తనం ఆవరించి ఉందని చెప్పారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో అక్కడకక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. -
కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన
-
కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన
కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనానికి అనుబంధంగా 6 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం నెలకొని ఉంది. కోస్తాంధ్ర తీరంపైకి అల్పపీడనం చేరుకోవడంతో రాగల 24 గంటల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తాంధ్రలో గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. -
కోస్తాంధ్రలో చెదురుమదురు వర్షాలు!
-
కోస్తాంధ్రలో చెదురుమదురు వర్షాలు!
విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ఉపరితల ఆవర్తనం మరింత బలపడే అవకావం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్రలో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం చెప్పింది. -
కోస్తాంధ్రలో అక్కడక్కడా వర్షాలు
విశాఖపట్నం : ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో అక్కడక్కడా వర్షాలు పడతాయని తెలిపింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. చేపల వేటకు వెళ్లే మత్య్సకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖలోని వాతావరణ కేంద్రం చెప్పింది. -
కోస్తాంధ్రకు భారీ వర్షాలు !
విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో ఉరుములతో కూడిన వర్షాలు, కోస్తాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి పశ్చిమ దిశగా గంటకు 45 నుంచి 55 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు విస్తాయని పేర్కొంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
తెలంగాణ, కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు
విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. దీంతో కోస్తాంధ్ర, తెలంగాణలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమలో మాత్రం ఓ మోస్తరుగా వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయని, మత్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. -
కోస్తాంధ్రలో వర్షాలు !
విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలమైన ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అది నేడో రేపో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు... ఉత్తర కోస్తాలోనూ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి పశ్చిమ దిశగా గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు విస్తాయని చెప్పింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
ఎందుకీ వివక్ష..?
పేదల పెద్దాస్పత్రిపై ప్రభుత్వం శీతకన్నుస్టాఫ్ నర్సుల నియామకంలో తీవ్ర పక్షపాతం పడకలు ఎక్కువ.. నర్సింగ్ స్టాఫ్ తక్కువజీజీహెచ్తో పోల్చితే నెల్లూరు, ఒంగోలు ఆస్పత్రుల్లోనే అధికం తాజాగా విడుదల చేసిన కాంట్రాక్ట్ పోస్టుల్లోనూ అన్యాయం పట్టించుకోని అధికార పార్టీ జిల్లా ప్రజాప్రతినిధులు నేతల తీరును తప్పుపడుతున్న జిల్లా ప్రజలు సాక్షి, గుంటూరు : కోస్తాంధ్రలో ఆరు జిల్లాలకు ఆరోగ్య ప్రదాయినిగా ఉన్న గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిపై ప్రభుత్వం, వైద్య విద్య ఉన్నతాధికారులు వివక్ష చూపుతున్నారు. పడ కల సంఖ్యకు తగినంతగా స్టాఫ్ నర్సుల నియామకం లేకపోవడంతో వైద్యసేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయి. జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోకపోవడంతో పేదల పెద్దాస్పత్రిగా పేరు గాంచిన జీజీహెచ్కు అన్యాయం జరుగుతోంది. ఘన చరిత్ర కలిగిన గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న బోధనాసుపత్రి జీజీహెచ్ 1954లో ప్రారంభమైంది. అప్పట్లో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు, రోగులకు అనుగుణంగా 183 మంది స్టాఫ్నర్సులను నియమించారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో 1177 పడకలు అధికారికంగా ఉండగా, అనధికారికంగా మరో 800 వరకు ఉన్నాయి. నిబంధనల ప్రకారం జీజీహెచ్కు కనీసం మరో 400 మంది పైగా స్టాఫ్నర్సులను నియమించాల్సి ఉండగా ఉన్నతాధికారులు తీవ్ర వివక్ష చూపుతున్నారు. గుంటూరు ప్రభుత్వ వైద్యకళాశాలలో ప్రస్తుతం 200 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, దీనికి తగ్గట్లుగా నర్సింగ్ స్టాఫ్, వైద్య పరికరాలు, వసతులు లేవని పలుమార్లు తనిఖీలు నిర్వహించిన ఎంసీఐ అధికారులకు సూచించినప్పటికీ ప్రయోజనం కనిపించడం లేదు. ఆ హామీలకు ఐదు నెలలు.. జీజీహెచ్లో ఎలుకల దాడిలో పసికందు మృతి చెందిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన నేపథ్యంలో మంత్రులతోపాటు, సాక్షాత్తు ముఖ్యమంత్రి జీజీహెచ్లో మూడు గంటల పాటు పలు వార్డులు పరిశీలించారు. ఆస్పత్రి సమస్యలు తీరుస్తామంటూ హామీలు గుప్పించారు. ఐదు నెలలు గడుస్తున్నా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం గానీ, కొత్త పరికరాలు గానీ మంజూరు కాలేదు. విజయవాడ, ఒంగోలు, నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి అనేక మంది రోగులను మెరుగైన వైద్య సేవల నిమిత్తం గుంటూరు జీజీహెచ్కి తరలిస్తుంటారు. జీజీహెచ్తో పోలిస్తే ఒంగోలు రిమ్స్, నెల్లూరు ఏసీఎస్ఆర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సగం పడకలు కూడా లేవు. స్టాఫ్నర్సుల సంఖ్య మాత్రం అధికంగా ఉండటం గమనార్హం. తాజాగా ప్రభుత్వం మంజూరు చేసిన కాంట్రాక్టు స్టాఫ్నర్సుల పోస్టుల్లో కేవలం 160 మందిని మాత్రమే జీజీహెచ్కు కేటాయించారు. కాంట్రాక్టు పోస్టుల్లోనూ అన్యాయం.. నెల్లూరు ఏసీఎస్ఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 500 పడకలకు 190 మంది స్టాఫ్నర్సులు ఉన్నారు. తాజాగా మంజూరు చేసిన కాంట్రాక్టు పోస్టుల్లో సైతం ఈ ఆసుపత్రికి 362 మందిని కేటాయించడం గమనార్హం. అంటే గుంటూరు జీజీహెచ్ కంటే పది మంది పర్మనెంట్ స్టాఫ్నర్సులు అధికంగా ఉన్నప్పటికీ కాంట్రాక్టు న ర్సులనూ 200 మందిని అదనంగా ఇచ్చారు. ఇక ఒంగోలు రిమ్స్లో 550 పడకలకు 234 మంది పర్మనెంట్ స్టాఫ్నర్సులు ఉన్నారు. అంటే జీజీహెచ్లో ఉన్న పడకల కంటే సగం కూడాలేని రిమ్స్కు 50 మంది స్టాఫ్నర్సులు అదనంగా ఉండటం విశేషం. ప్రజాప్రతినిధులవి ప్రగల్బాలే.. రాజధాని ప్రాంతాన్ని, గుంటూరు నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని ప్రగల్బాలు పలికే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు జీజీహెచ్ విషయంలో పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు హడావుడిగా పర్యటించడం హామీలు గుప్పించడం మినహా ప్రయోజనం కనిపించండం లేదు. నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధులు తమ జిల్లాకు 362 మంది కాంట్రాక్టు స్టాఫ్ నర్సులను తెప్పించుకోగా, ఇక్కడి వారు కేవలం 160 మందిని మాత్రమే తెచ్చుకోగలిగారు. అర్హత లేని సిబ్బందిని అందల మెక్కించడంలో ఉపయోగపడిన వీరి అధికారం ఆసుపత్రి అభివృద్ధికి ఎందుకు ఉపయోగించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జిల్లా నేతలు జీజీహెచ్అభివృద్ధిపై దృష్టి సారించాలని వైద్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఆస్పత్రి పడకలు స్టాఫ్నర్సుల సంఖ్య గుంటూరు జీజీహెచ్ 1177 183 నెల్లూరు ప్రభుత్వాస్పత్రి 500 190 ఒంగోలు రిమ్స్ 550 234 -
నేడు, రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు
-
నేడు, రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు
విశాఖపట్నం : తమిళనాడు తీరం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా.... ఉత్తర బంగాళాఖాతం వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ ఆదివారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో నేడు, రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అయితే కోస్తా తీరం వెంబడి 45 - 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. -
కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు
విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో స్థిరంగా అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న 48 గంటల్లో అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. అల్ప పీడనం ప్రాంతంలో 7.6 కి.మీ ఎత్తు వరకు బలమైన ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. అల్పపీడనం కారణంగా కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 45-50 కి.మీ వేగంతో దక్షిణ కోస్తాలో పశ్చిమ దిశగా బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండగా, ఉత్తరకోస్తాలో వాయువ్య దిశగా బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది. -
రాగల 24 గంటల్లో కోసాంధ్రలో వర్షాలు
విశాఖపట్నం : మరో రెండు లేదా మూడు రోజుల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. అలాగే ఛత్తీస్గఢ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. -
ప్రమాదంలో కోనసీమ
-
కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు
విశాఖపట్నం : ఛత్తీస్గఢ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. అయితే ఏర్పడిన అల్పపీడనం ఛత్తీస్గఢ్ వైపు మళ్లిందని తెలిపింది. ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాలలో రుతుపవన ద్రోణి కొనసాగుతుందని వివరించింది. మరో 24 గంటలపాటు ఉత్తరాంధ్రలో వర్షాలు... కోస్తాంధ్రలో మోస్తర్ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. -
కోస్తాంధ్రలో భారీ వర్షాలు ?
-
కోస్తాంధ్రలో భారీ వర్షాలు ?
హైదరాబాద్: దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరానికి సమీపంలో అల్పపీడనం కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక అల్ప పీడన ప్రాంతంలోనే ద్రోణి ఉండటంతో రెండింటి ప్రభావంతో కోస్తాంధ్ర అంతటా వర్షాలు రానున్నట్లు పేర్కొంది. కోస్తాంధ్రలోని తీర ప్రాంతాలతోపాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, మత్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
కోస్తాంధ్రలో వడగాడ్పులు
పలుచోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు * రానున్న నాలుగైదు రోజులూ ఇదే పరిస్థితి * పశ్చిమ గాలుల వల్లేనంటున్న వాతావరణ నిపుణులు సాక్షి, విశాఖపట్నం: జోరుగా వర్షాలు కురవాల్సిన జూలైలో వడగాడ్పులు వీస్తున్నాయి. ఎండలు సాధారణం కంటే ఐదారు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఇలాంటి అనూహ్య పరిణామాలు వాతావరణ నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. సాధారణంగా జూన్ రెండో వారానికల్లా తొలకరి ప్రవేశంతో వాతావరణం బాగా చల్లబడుతుంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా ప్రవేశించినా బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండాల ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. అనూహ్యంగా జూలై ఆరంభం నుం చి మళ్లీ సెగలు మొదలయ్యాయి. రెండ్రోజుల క్రితం ఒకట్రెండు చోట్ల మాత్రమే 40 డిగ్రీల దా కా రికార్డయిన ఉష్ణోగ్రతలు ఆదివారం నాటికి అనేక ప్రాంతాల కు విస్తరించాయి. ఆదివారం ఒంగోలు, బాపట్ల, కావలి, నెల్లూరు, తిరుపతిలో 40, విశాఖపట్నం, తుని, మచిలీపట్నంలలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోస్తాంధ్రలోని విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా జిలా ్లల్లో వడగాడ్పులు వీచినట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రానున్న నాలుగైదు రో జులూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉం దని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అత్యంత అరుదు.. జూలైలో అధిక ఉష్ణోగ్రతల నమోదుతో పాటు వడగాడ్పులు వీయడం అత్యంత అరుదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి చూడలేదని రిటైర్డ్ వాతావరణ శాస్త్రవేత్త మురళీకృష్ణ ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. విశాఖపట్నంలో ఇప్పటిదాకా జూలైలో రికార్డయిన అత్యధిక ఉష్ణోగ్రత 39.9 డిగ్రీలు. అది కూడా 1997 జూలై 16న నమోదైంది. ఆ తర్వాత మళ్లీ ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతే అధికం కావడం విశేషం. ఎందుకిలా.. ప్రస్తుతం రుతుపవనాలు హిమాలయ పర్వతాల వైపు ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమ, వాయవ్య గాలులు వీస్తున్నాయి. పైగా సముద్రం నుంచి గాలులు వీయడం లేదు. గాలిలో తేమ తక్కువ కావడం, ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ ఏర్పడిన అల్పపీడన ద్రోణి బలహీనంగా ఉండడం, బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడకపోవడంతో ఉష్ణోగ్రతలు పెరిగి వడగాడ్పులకు కారణమవుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇదిలాఉండగా క్యుములోనింబస్ మేఘాలేర్పడి రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఆదివారం నాటి నివేదికలో తెలిపింది. -
రెండురోజుల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు
-
38 మంది మత్స్యకారుల గల్లంతు
తూర్పు గోదావరి/విశాఖపట్నం: తూర్పు గోదావరి జిల్లాలో వేటకు వెళ్లిన 38 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాలంటూ జిల్లా కలెక్టర్ ను తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కోరారు. కోస్తా అంతటా మరో 24 గంటల్లో గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ఈ ప్రాంతానికి చెందిన మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిషా సంబల్ పూర్కు 110 కి.మీ దూరంలో ఆగ్నేయ దిశగా వాయుగుండం కేంద్రీకృతమైంది. వాయుగుండం క్రమేణ బలహీనపడి రేపటిలోగా అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఒడిషా నుంచి కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడుతుందని పేర్కొన్నారు. విశాఖ, గన్నవరం, భీమునిపట్నం, కళింగపట్నం, కాకినాడ, మచిలీపట్నం పోర్టులలో మత్స్యకారులు సముద్రంలోనికి వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు ప్రమాద హెచ్చిరికలు జారీచేశారు. ఉత్తర తెలంగాణకు మరో 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
తెలంగాణ, దక్షిణ కోస్తా మీదుగా అల్పపీడన ద్రోణి
విశాఖపట్నం: ఛత్తీస్ ఘడ్ నుంచి తెలంగాణ..దక్షిణ కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్సపీడన ద్రోణి ఏర్పడినట్టు విశాఖలోని వాతావరణ కేంద్రం శుక్రవారం తెలిపింది. ప్రస్తుతం కోస్తాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ రెండింటి ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్ర్రాలలో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఒకటి, రెండు చోట్లు భారీ వర్షాలు పడతాయని అధికారులు వెల్లడించారు. -
కోస్తాంధ్ర, రాయలసీమలకు వర్షాలు!
సాక్షి, విశాఖపట్నం: ప్రస్తుతం కోస్తాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతోపాటు ప్రీమాన్సూన్ థండర్ షవర్స్ (రుతుపవనాల రాకకు ముందు కురిసే వానలు) ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగాను, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం నాటికి వాయుగుండంగా మారింది. ఇది మరింత బలపడి వచ్చే 24 గంటల్లో తీవ్ర వాయుగుండం కానుంది. ఇది గుజరాత్, మహారాష్ట్రల వైపు కదలితే నైరుతి రుతుపవనాలు మరింత బలపడి పశ్చిమ తీరంలో వర్షాలు కురుస్తాయి. పాకిస్తాన్ వైపు పయనిస్తే రుతుపవనాలను బలహీనపరచి వానలకు అవాంతరం కలిగిస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ‘నైరుతి’ తాకడానికి మరో రెండ్రోజుల సమయం పడుతుందని తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది. ఉష్ణోగ్రతల్లో స్వల్ప వ్యత్యాసం కొద్దిరోజులుగా వాతావరణం చల్లబడడంతో ఉష్ణోగ్రతలు సాధారణంకంటే ఏడెనిమిది డిగ్రీలు తక్కువకు క్షీణించాయి. అసాధారణంగా కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు సమానంగా రికార్డయ్యే స్థితికి చేరాయి. ఉదాహరణకు గడచిన 24 గంటల్లో తునిలో కనిష్టం 25, గరిష్టం 26 (వ్యత్యాసం 1 డిగ్రీ మాత్రమే) డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖ, కాకినాడ, నర్సాపురంలలో మూడు డిగ్రీల వ్యత్యాసంతో ఉష్ణోగ్రత రికార్డయింది. ఉత్తరాంధ్రలో భారీ వర్షం.. సాక్షి, విజయవాడ బ్యూరో/ విజయనగరం కంటోన్మెంట్/ శ్రీకాకుళం: రుతుపవనాల ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఆదివారం భారీ వర్షం కురిసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపుతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. విశాఖలో రోడ్లు, విజయనగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో గాలులతోకూడిన వర్షాలు కురిశాయి. ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చిత్తూరు జిల్లా తిరుపతి, చంద్రగిరి పలు ప్రాంతాల్లో మోస్తరు వానలు కురిశాయి. తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లో జల్లులు పడ్డాయి. ఉరుములు, సాంకేతిక కారణాల వల్ల శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో విద్యుత్ సరఫరాను నాలుగుగంటల పాటు అధికారులు నిలిపివేశారు. -
కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు !
విశాఖపట్నం: జార్ఖండ్ నుంచి ఒడిశా... కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం మంగళవారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్రలో కొన్నిచోట్లు ఉరుములతో కూడిన జల్లులు లేదా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని పేర్కొంది. అవి ఈ నెల 5వ తేదీ నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వెల్లడించింది. -
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం!
విశాఖపట్నం: అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల అవర్తనం కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) విశాఖపట్నం శాఖ వెల్లడించింది. ఉపరితల అవర్తనం మరింత బలపడి ఆగ్రేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో మరో ఉపరితల అవర్తనం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. కోస్తా తీర ప్రాంతాల్లో రేపటి వరకు వాతావరణం పొడిగానే ఉంటుందని తమ రిపోర్టులో ఐఎండీ పేర్కొంది. -
కోస్తా జిల్లాలకు మరో తుపాను ముప్పు
విశాఖ: కోస్తా జిల్లాలకు మరో తుపాను ముప్పు పొంచి ఉందని కేంద్ర వాతావరణశాఖ ఇండియా మెటెరోలాజికల్ డిపార్ట్ మెంట్ (ఐఎండీ) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈనెల 8 లేదా 9 తేదిన మరో తుపాను వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయని ఐఎండీ తెలిపింది. ఈనెల 5 తేదిన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్నని ఐఎండీ అధికారులు తెలిపారు. అల్పపీడనం క్రమంగా తుపానుగా మారవచ్చని ఐఎండీ అంచనా వేశారు. తుపాను హెచ్చరికల దృష్ట్యా కోస్తా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకూ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని, దాంతో కోస్తాంధ్రలో ఉరుములతో కూడిన జల్లులు గాని, ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి
విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా, తెలంగాణ మీదుగా ద్రోణి ఏర్పడినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయంలోగా అల్పపీడనంగా మారే అవకాశముందని తెలిపారు. దీని ప్రభావం వల్ల ఉత్తర కోస్తా ప్రాంతంలో అక్కడక్కడా, దక్షిణ కోస్తాలో చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశముందన వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన
హైదరాబాద్: వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. బంగాళాఖాతంలో రేపటిలోగా అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్టు విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడనం వ్యాపించవచ్చు. ఒడిశా, వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశముంది. -
కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం
హైదరాబాద్: కోస్తాంధ్ర ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముంది. విశాఖపట్నం వాతావరణ కేంద్రం ఈ మేరకు వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పడే సూచనలున్నాయని అధికారులు చెప్పారు. మత్స్యకారులు సముద్రంలోకి చేపలవేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు. శనివారం శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. -
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకట్రెండు రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశముందని వెల్లడించింది. ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్త్రాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి వ్యాపించివుందని పేర్కొంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర్లలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని, గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో నైరుతిదిశగా బలమైన ఈదురు గాలులు వీస్తామని తెలిపింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
రాగల 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
విశాఖపట్నం: ఉత్తరాంధ్ర తీరానికి అనుకుని అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. ఆ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం లేదని అయితే అల్పపీడనం భూమిపైకి చేరుకుని క్రమేణా బలహీనపడుతుందని తెలిపింది. రాగల 24 గంటల్లో కోస్తా, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
కోస్తాలో భారీ వర్షాలు
-
స్థిరంగా అల్పపీడన ద్రోణి
సాక్షి, విశాఖపట్నం: విదర్భ నుంచి దక్షిణ కోస్తా, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తా, తెలంగాణల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. కాగా బుధవారం ఉత్తర కోస్తాలో అక్కడక్కడా బుధవారం సాయంత్రం వర్షాలు కురిశాయి. విశాఖలో 3 సెం.మీ. వర్షపాతం నమోదయింది. వాయుగుండం ప్రస్తుతం పశ్చిమ మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో భోపాల్కు 50 కి.మీ. దూరంలో ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ దిశగా పయనించి మరో 24 గంటల్లో క్రమేపీ బలహీనపడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. భారీగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. -
స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం
కోస్తా, తెలంగాణల్లో చెదురుమదురు వర్షాలు సాక్షి, విశాఖపట్నం: ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ కోస్తా, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో అక్కడక్కడ, తెలంగాణలో కాస్త ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. రాగల 48 గంటల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్లలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం వాయుగుండంగా మారిన అల్పపీడనం ప్రస్తుతం తూర్పు మధ్యప్రదేశ్పై ఉంది. దీని ప్రభావం మనపై ఏ మాత్రం ఉండబోదని, రాగల 24 గంటల్లో ఇది మరింత బలహీనపడొచ్చని వాతావరణ నిపుణులు తెలిపారు. కోస్తా తీరం వెంబడి పశ్చిమ దిశ నుంచి గంటకు 45 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురు గాలులుంటాయని మత్స్యకారులకు ప్రత్యేక హెచ్చరికలు జారీచేశారు. -
తెలంగాణ, కోస్తాంధ్రలలో భారీ వర్షాలు
వర్షాలు లేక అల్లాడుతున్న అన్నదాతలకు శుభవార్త. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణ, కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. అల్పపీడనం ఉన్న ప్రాంతంలో 7.7 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో గంటకు 45 - 50 కిలోమీటర్ల వేగంగా వేగంతో దక్షిణ దిశగా బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్ర తీరంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. -
తీరాన్ని తాకనున్న రుతుపవనాలు
-
మేఘాల ప్రభావంతో ఉత్తర కోస్తా,తెలంగాణలో వర్షాలు
-
తెలంగాణ, కోస్తాలకు వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: ఉత్తర కోస్తా, తెలంగాణ ప్రాంతాన్ని క్యుములోనింబస్ మేఘాలు ఆవహించాయి. దీని ప్రభావంవల్ల వచ్చే 48 గంటల్లో ఉత్తర కోస్తా, తెలంగాణ ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. క్యుములోనింబస్ మేఘాలవల్ల గత రెండు రోజులుగా దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయని, ఇప్పుడు వీటి దిశ మారడంవల్ల ఉత్తర కోస్తా, తెలంగాణలో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొన్నారు. రుతు పవనాలు ప్రవేశానికి ముందు మే నెలలో వర్షాలు కురవడం సాధారణమేనని, ఇప్పుడు కూడా అలాంటి వానలే కురుస్తున్నాయని వాతావరణ శాఖ రిటైర్డు అధికారి మురళీకృష్ణ తెలిపారు. ప్రస్తుతం గాలిలో తేమ అధికంగా ఉండటంవల్ల ఉక్కపోత ఎక్కువగా ఉందని, ఈ నెలాఖరు వరకూ 40 నుంచి 44 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతలు ఉంటాయని పేర్కొన్నారు. ‘ఈ ఏడాది 95 శాతం వరకూ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఇది దేశం మొత్తానికి సంబంధించిన అంచనా. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. దక్షిణాది ప్రాంతంలో ఎంతమేరకు వర్షాలు కురుస్తాయో కూడా ఇప్పుడు చెప్పలేం. జూన్లో ఈ ప్రాంతంలోకి రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత ఈ ఏడాది దక్షిణాదిలో వర్షపాతం ఎంత మేరకు ఉంటుందో అంచనా వేయడానికి వీలవుతుంది’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. -
కోస్తాంధ్రలోనూ జగన్ హవానే..
* 123 అసెంబ్లీ స్థానాల్లో 87-95 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే * మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో 12 నుంచి 16 సీట్లు ఫ్యాన్వే * జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న 48% మంది ప్రజలు * సింగిల్ డిజిట్కే పరిమితం కానున్న కాంగ్రెస్ * టీడీపీకి 23 నుంచి 27 అసెంబ్లీ స్థానాలే సాక్షి, హైదరాబాద్: రాయలసీమ తరహాలోనే కోస్తాంధ్రలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే స్పష్టమైన ఆధిక్యం ఉందని ఎన్టీవీ - నీల్సన్ సర్వేలో వెల్లడైంది. పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలతో పాటు అన్నింటా వైఎస్ జగన్మోహన్రెడ్డి హవా కొనసాగింది. వచ్చే సాధారణ ఎన్నికల తరువాత జగన్ ముఖ్యమంత్రి కావాలని కోస్తాంధ్ర ప్రజలు 48 శాతం మంది కోరుకున్నట్లు వెల్లడైంది. కోస్తాంధ్రలోని 123 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ 87 నుంచి 95 స్థానాలు కైవసం చేసుకోనుందని సర్వే తేల్చి చెప్పింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నెలకొన్న రాజకీయపార్టీల స్థితిగతులపై నిర్వహించిన తాజా సర్వేలో భాగంగా శుక్రవారం కోస్తాంధ్రకు సంబంధించిన నీల్సన్ సర్వే ఫలితాలను ఎన్టీవీ ప్రసారం చేసింది. కోస్తాంధ్రలోని ఓటర్లు జగనే సీఎం కావాలని అత్యధికంగా 48 శాతం మంది కోరుకుంటుండగా... అదే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబును 38 శాతం మంది ప్రజలు భావిస్తున్నట్లు వెల్లడైంది. ఇద్దరి మధ్య పది శాతం తేడా ఉన్నట్లు స్పష్టంగా తేలింది. అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే కోస్తాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 87 నుంచి 95 స్థానాలు దక్కించుకొని పెద్దన్న పాత్ర పోషించనుంది. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉంటున్న టీడీపీని ఈసారి కూడా ఓటర్లు దూరంపెట్టారు. ఆ పార్టీకి 23 నుంచి 27 స్థానాలు మాత్రమే దక్కనున్నట్లు సర్వే పేర్కొంది. అయితే రాయలసీమతో పోల్చితే టీడీపీ కాస్త మెరుగైన స్థానాలు దక్కించుకుంది. ఇక కాంగ్రెస్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. కేవలం 4 నుంచి 7 స్థానాలతో సింగిల్ డిజిట్కే పరిమితమైంది. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా విభజిస్తుందనే భావన ప్రజల్లో బలంగా ఉన్నట్లు ఈ సర్వే ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఇక కోస్తాలో నామమాత్రంగా ఉన్న బీజేపీకి 0 నుంచి ఒక్కస్థానం దక్కే అవకాశముంది. ఇతరులు 0 నుంచి 4 స్థానాలు గెలిచే అవకాశమున్నట్లు పేర్కొంది. లోక్సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ హవా కోస్తాంధ్రలోని శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా ఉన్న 17 పార్లమెంటు స్థానాల్లో కూడా వైఎస్సార్సీపీ హవా కొనసాగింది. ఆ పార్టీకి 12 నుంచి 16 స్థానాల దాకా గెలుచుకొని స్పష్టమైన ఆధిక్యం సంపాదించింది. అదే విధంగా ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ 0 నుంచి 2 స్థానాలకే పరిమితమైంది. రెండు స్థానాలు కూడా టీడీపీకి దక్కని పరిస్థితి ఉన్నట్టు సర్వే వెల్లడించింది. ఇక కాంగ్రెస్కు 0 నుంచి 2 స్థానాలు దక్కవచ్చనుకున్నా.. ఖాతా తెరవడమే ఆపార్టీకి కష్టంగా ఉన్నట్లు పేర్కొంది. గతంలో 2009లో 17 స్థానాలకు గాను 14 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈసారి పరిస్థితి దయనీయంగా మారింది. ఓట్లశాతం విషయంలో కూడా వైఎస్సార్సీపీ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. 45 శాతం ఓట్లతో మొట్ట మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. రెండోస్థానంలో టీడీపీకి 38 శాతం ఓట్లు దక్కగా, కాంగ్రెస్ పార్టీకి కేవలం 13 శాతం మాత్రమే ఓట్లు రానున్నట్లు సర్వే స్పష్టంచేసింది. రాయలసీమ, కోస్తాంధ్రల్లోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ 126-139 స్థానాలు కైవసం చేసుకుని అగ్రస్థానంలో ఉంటుందని సర్వేలో వెల్లడైంది. టీడీపీ 30-47 స్థానాలు దక్కించుకుంటుందని, కాంగ్రెస్ కేవలం 6-11 స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని తెలుస్తోంది. ఇక మొత్తం 25 పార్లమెంటు స్థానాల్లో 19-24 స్థానాలు వైఎస్సార్సీపీ దక్కించుకుంటుందని కాంగ్రెస్, టీడీపీలు 0-3 స్థానాలకే పరిమితమవుతాయని సర్వే స్పష్టంచేస్తోంది. -
కోస్తా, రాయలసీమకు వర్ష సూచన
ఇటీవల వరుస తుఫాన్లు, భారీ వర్షాలతో వణికిన రాష్ట్రంపై మరోసారి అల్పపీడన ప్రభావం చూపే అవకాశముంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇటీవల వచ్చిన తుఫాన్లు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యం కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీని ప్రభావంతో పంటలకు అపారనష్టం వాటిల్లింది. లక్షలాది ఎకరాల్లో వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. ఇళ్లు, కొబ్బరిచెట్లు, విద్యుత్ స్తంబాలు నేలకొరిగాయి. -
‘లెహెర్’ మాటున ‘మాదీ’
విశ్లేషణ: తాజాగా బంగాళాఖాతం నుంచి చడీచప్పుడు లేకుండా దూసుకువస్తూన్న ‘లెహర్’ తుపాను నవంబర్ 28న కోస్తాంధ్రను భీకరంగా తాకబోతున్నట్టు హెచ్చరికలు వస్తున్నాయి. ‘హెలెన్’ పేరుతో ఉన్న తుపాను శాంతించక ముందే ‘లెహర్’ ముంచుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీనితో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి కకావికలమయ్యే ప్రమాదం మరింత పెరగవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏకకా లంలో ఎదుర్కొంటున్నన్ని ఉప ద్రవాలు, ఇంతటి తీవ్రస్థాయి లో, ఇంతకుముందెన్నడూ ఎదు ర్కొనలేదంటే అతిశయోక్తి కాదే మో! వీటిలో కొన్ని ఉపద్రవాలు ఇటీవలి మాసాలలో వరసగా వచ్చిన పెనుతుపానులు. కాగా, తెలుగువాళ్లు ప్రకృతి వైపరీత్యా లను సహితం మించిపోయి గాడితప్పిన ‘ప్రవృత్తి’ మూలంగా తెలుగు జాతినే ముమ్మరించిన అనర్థదాయకై మెన కృత్రిమ ‘తుపానులు’ కూడా చూస్తున్నాం! కొని తెచ్చుకుంటున్న ఆపద బంగాళాఖాతం స్థావరంగా తరచుగా కోస్తా ప్రాంతాల నూ, అప్పుడప్పుడూ రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల ను చుట్టబెడుతూన్న తుపానులకీ, తమ అవసరాల కోసం మనుషులు ప్రాణదాత ఈ పర్యావరణాన్నీ, ప్రకృతి సంప దనూ కుళ్లబొడుస్తున్న ఫలితంగా తలెత్తుతున్న పరిణామా లకీ ఉన్న సంబంధం గురించి శాస్త్రవేత్తలు నిరంతరం పరి శోధిస్తూనే ఉన్నారు. అలాగే మనకు మనం దెబ్బతీసుకుం టున్న సమతుల్యత గురించి కూడా ప్రపంచ వ్యాపితం గానే శాస్త్రవేత్తలు, వాతావరణ శాస్త్రజ్ఞులూ నిరంతరం పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. భూఖండం ఎలా వేడెక్కిపోతున్నదో, దాని ప్రభావం వాతావరణ పరిస్థితుల మీద ఎలా పడుతున్నదో కొంత కాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. వాతావరణంలో పెరిగిపోతున్న బొగ్గుపులుపు వాయు సాంద్రతనూ, కాలుష్యాన్ని నియంత్రించాల్సిన అవసరం ఎంత ఉందో ఘోషిస్తూనే ఉన్నారు. వాతావరణ మార్పుల వల్ల పెక్కుమార్లు సంభవిస్తున్న తుపానులు, పెనుతుపానులు దేశాలను ముప్పెరగొంటూ పంటలూ పరిసరాలనూ అతలాకుతలం చేస్తూ జన జీవితాన్ని ఎలా అల్లకల్లోలంలోకి నెడుతున్నాయో మనం చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. విస్మరించరాని విషయాలు కొలది రోజులలోనే రెండు పెను తుపానులు (ఫయలిన్, హెలెన్) ఆంధ్రప్రదేశ్ను చుట్టుముట్టి లక్షలాది ఎకరాల లోని వరి, పత్తి, అరటి, కొబ్బరి, కూరగాయలు, మామిడి, బొప్పాయి వగైరా పంటలనీ, తోటలనీ నేలమట్టం చేశా యి. జన నష్టం కలిగించాయి. ఇళ్లను, ఇతర ఆస్తులను ఊడ్చిపెట్టాయి. అనేక గ్రామాలను ముంచెత్తాయి. ఆధు నిక సాంకేతిక పరిజ్ఞానం తోడు వచ్చినందున వాతావరణ శాస్త్రవేత్తలు కొంతకాలంగా చాలా సందర్భాలలో చేస్తున్న వాతావరణ హెచ్చరికలు అంచనాలు తప్పడం లేదనుకుం టున్న సమయమిది. అయితే శాస్త్రవేత్తలను సహితం పల్టీలు కొట్టించే పెను తుపానులు ఆకస్మికంగా విరుచుకు పడుతున్నాయి. పర్యావరణంలో వేగంగా ముమ్మరిస్తున్న మార్పులను మనం ఎంత మాత్రం విస్మరించే వీలులేదని ఈ విపరిణామాలు హెచ్చరిస్తున్నాయి. ‘వానకన్నా ముం దు వరద’ అన్నట్టుగా ఈ పరిణామం ఆకాశంలోనూ, నేల మీద, సముద్రాంతరాలలోనూ జరుగుతోందని పలు దేశాల పరిశోధకుల అంచనా. పొంచి ఉన్న ‘మాదీ’ తాజాగా బంగాళాఖాతం నుంచి చడీ చప్పుడు లేకుండా దూసుకువస్తూన్న ‘లెహర్’ తుపాను నవంబర్ 28న కోస్తాంధ్రను భీకరంగా తాకబోతున్నట్టు హెచ్చరికలు వస్తున్నాయి. ‘హెలెన్’ పేరుతో ఉన్న తుపాను శాంతించక ముందే ‘లెహర్’ ముంచుకొచ్చే సూచనలు కనిపిస్తున్నా యి. దీనితో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి కకావికలమయ్యే ప్రమాదం మరింత పెరగవచ్చు. కథ అప్పుడే ముగిసేట్లు లేదు! ‘లెహర్’ తర్వాత రంగంలోకి దూకడానికి అప్పుడే మరొక ఉగ్ర తుపాను ‘మాదీ’ కాచుకు కూర్చుంది సుమా! ఈసారి ‘లెహర్’ తుపాను బీభత్సం వాయువేగాన్ని 170-180 కిలోమీటర్లకు పెంచే ప్రమాదముందనీ సంకేతాలు వస్తున్నాయి. ఈ సరికొత్త తుపాను తీవ్రతను శాస్త్రవేత్తలు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం తుపాను శక్తిని కొలిచే ‘స్టాషిర్-సింస్సన్’ (భూకంపాల శక్తిని అం చనా వేసే ‘రిక్టర్ స్కేల్’ లాగా) ద్వారా అంచనా వేశారు. శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం తొలి ఐదంచెలలో‘లెహర్’ ఇప్పటికి మూడవ స్థానంలో నిలిచింది! మొదటి రెండు పెద్ద తుపానులూ తమ చలనగతిని ఆకస్మికంగా ఒక స్థానం నుంచి మరొక మార్గంలోకి చిత్రగతులలో అనూ హ్యంగా సాగిపోయి శాస్త్రవేత్తలను, పాలనా యంత్రాం గాన్నీ నిద్రాహారాలు లేకుండా చేశాయి. ఈశాన్య రుతు పవనాల పేరిట ఈ పెనుతుపానులు సాగిస్తున్న ‘దోబూ చులాట’ ప్రజా బాహుళ్యానికీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థి తికీ అగ్ని పరీక్షగా పరిణమించింది. దక్షిణ అండమాన్ దీవులలోని ఫోర్ట్బ్లెయిర్కు 200 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం ‘లెహర్’ కేంద్రీకరించి ఉంది. ఇది కూడా ఏ ‘చాపల్యం’తో తన చలనగతిని ఎప్పుడు, ఎలా మార్చుకుంటుందో శాస్త్ర వేత్తలకు కూడా అంతుచిక్కని జోస్యం గానే ఉండిపోయే లా ఉంది! 2010లో తమిళనాడు కోస్తాలో కేంద్రీకరించిన ‘జాల్’ నుంచి ‘లెహర్’ దాకా తుపానులు ప్రజాజీవనానికి ప్రమాదకర సంకేతాలు అందిస్తూనే వచ్చాయి! ఇవి సుడి తుపానులు ఆసియాతో పాటు ప్రపంచంలోని పలు ఖండాలలో, భార త్తో పాటు పెక్కు దేశాలలో వాతావరణం కేవలం సాధా రణ తుపానుల స్థాయి దగ్గరే ఉండిపోవడం లేదు. వాటిని దాటి, తరచుగా ‘సుడి తుపానులు’ (టార్నొడోలు) కూడా అవతరిస్తున్నాయి. ఈ దృశ్యాలనే మహాకవి శ్రీశ్రీ ‘టార్నా డో, టార్పీడో / అవి విలయం / ఇది సమరం’ అని ఆలం కారికంగా వర్ణించాడు! ఈ వాతావరణ, ప్రకృతి విలయ దృశ్యాలకు శాస్త్రవేత్తలు భీకర తుపానుల ప్రత్యేకతను గుర్తించడానికి కొంత కాలంగా కొన్ని పేర్లను పెడుతు న్నారు. అలాంటివే ‘జాల్’, ఫయలిన్, హెలెన్. గురు వారం (28న) విలయ నృత్యానికి కుచ్చెళ్లు సవరించు కుంటున్న ‘లెహర్’! శివుడి ‘మూడోకన్ను’ లాంటి ఈ ‘ఉగ్రతుపానుల’ పుట్టుకకు కేంద్రస్థానం పసిఫిక్ మహాస ముద్రమని ఒక అంచనా! దశాబ్దన్నరగా వాతావరణం లోకి చొచ్చుకువచ్చిన ఈ వినూత్న దృశ్యానికే / వ్యవస్థకే ‘పసిఫిక్ ఫినామినా’ అని పేరు! ఎల్-నినో; లా-నీనా ఈ మార్పుల వల్ల రెండు రకాల కొత్త పరిణామాలు దూసు కువచ్చాయి. ఒకటి ఎల్-నినో, రెండు లా-నీనా. వీటిలో ఒకటి ప్రపంచంలో పలుచోట్ల తీవ్ర కరవు పరిస్థితులకు దారితీయగా, మరొకటి బిళ్లబీటుగా విరుచుకుపడే పెను తుపానులకూ దారితీస్తుంది. ఈ పరిణామాలు కొన్నేళ్లుగా హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. రేపు ముమ్మరించనున్న సరికొత్త ‘లెహర్’ తుపాను సహా ఫయిలిన్, హెలెన్లు ఈ అసాధా రణ పరిణామంలో భాగమేనని గుర్తించాలి. ఇటీవల ప్రతీ రెండు మూడేళ్లకూ క్రిస్మస్ సమయంలో, ఈ పరిణామం దేశాలపైన ‘దాడుల’కు సిద్ధమవుతోంది! ఎన్ని ఉపగ్ర హాలు మన నెత్తిమీద తాండవిస్తున్నప్పటికీ ఇప్పుడు ఈ ‘ఉగ్రతుపాను’ల బెడద ‘వానరాకడ, ప్రాణం పోకడ తెలియవన్న’ నానుడిలాగానే తయారైంది! ఇటీవల మన శాస్త్రవేత్తలు అంగారక గ్రహానికి పంపించిన ‘మామ్’ భూమికి 80,000 కిలోమీటర్ల ఎత్తు నుంచి విస్పష్టమైన వాతావరణ తొలి ఛాయాచిత్రాన్ని పంపించింది. రాక్షసుల మాదిరిగా నోళ్లు తెరుచుకుని చిత్రగతులలో సంచరిస్తున్న తుపాను మేఘాల తాండవ దృశ్యాల్ని అందులో చూపిం చింది! ఎందుకంటే, భూ ఉపరితలంలో 71 శాతం ప్రాం తాన్ని సముద్రాలు, మహా సముద్రాలూ చుట్టబెట్టి ఉన్నా యి. ఇందులో భూఖండం మీద ఉన్న జలరాశిలో 97 శాతం నీళ్లు మహాసముద్రాల అధీనంలో ఉన్నాయి! ప్రతి రోజూ ప్రపంచం చుట్టూ ఉరుములు, మెరుపులతో కూడిన తుపానులు 40,000 దాకా ఉంటాయని అంచనా! పరిమితులు గుర్తించొద్దా? 1959 సెప్టెంబర్లో వచ్చిన తుపాను ‘వీరా’ 5,000 మంది చావుకు కారణం కాగా, 1977లో దివిసీమను కుదిపేసిన ఉగ్రతుపాను 10,000 మందికి పైగా ప్రజల ప్రాణాలు తోడుకుంది! కాగా, 1990 నాటికే ప్రపంచ వ్యాపితంగా వాతావరణ హెచ్చరికల కోసం, పరిశీలన కోసం ఏర్పడిన 10 వేల పరిశోధనా కేంద్రాలు, 800 సౌండింగ్ స్టేషన్లు, వందల కొలది పరిశోధనా నౌకలూ, సముద్రాల ప్రవర్తనా సరళి గురించి గాని, వాతావరణ ప్రవర్తన గురించి గానీ కీలకమైన ప్రశ్నలకు తగిన సమాధానాలు రాబట్టుకోలేక పోతున్నామని శాస్త్రవేత్తలే ప్రకటించడం మానవుడి పరి మితుల్ని కూడా మరొక్కసారి గుర్తు చేసినట్టవుతోందని పరి శోధకుల అంచనా! ఏ పరిశోధనలు, ఏ శాస్త్ర చర్చలు ఎలా ఉన్నా, అగ్రరాజ్యాలు రకరకాల పేర్లతో అణుపాటవ పరీక్షల్ని, కాలుష్య నివారణకు నిర్దేశించిన ‘క్యోటో’ సభ తీర్మానాల ఉల్లంఘనలను శాశ్వతంగా ఆపకుండా వాతా వరణంలోనూ, పర్యావరణ పరిరక్షణలోనూ మానవాళి కనీస విజయాలను కూడా సాధించలేదు! - ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు -
తీవ్రవాయుగుండంగా మారనున్న వాయుగుండం
-
తీవ్రవాయుగుండంగా మారనున్న వాయుగుండం
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేడు తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ బుధవారం వెల్లడించింది. రేపు చెన్నై - ఒంగోలు మధ్య తీరందాటే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర జిల్లాలలో వర్షం పడే అవకాశాలు ఉన్నాయిని, అలాగే గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. సముద్రంలో వేటకు వెళ్ల వద్దని మత్స్యకారులకు భారత వాతావరణశాఖ హెచ్చరించింది. కోస్తాంధ్రలోని నౌకాశ్రయాల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
వాయుగుండంగా మారిన అల్పపీడనం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ మంగళవారం విశాఖపట్నంలో వెల్లడించింది. విశాఖ నుంచి 500 కిలోమీటర్ల దూరంలో నైరుతి దిశగా వాయుగుండం కేంద్రీకృతమైందని తెలిపింది. మరో 72 గంటల్లో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఆ క్రమంలో కోస్తాంధ్ర వైపు పయనించే అవకాశం ఉందని చెప్పింది. -
దక్షిణ కోస్తా, రాయలసీమలకు భారీ వర్షాలు
తమిళనాడులోని నాగపట్నానికి 620 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. వాయుగుండం నాగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తా,రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే సముద్ర తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించింది. దాంతో మత్య్సకారులను అధికారులు అప్రమత్తం చేశారు. రాష్ట్రంలోని వివిధ నౌకాశ్రయాల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. -
రాగల 48 గంటల్లో కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం శనివారం విశాఖపట్నంలో వెల్లడించింది. కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. అలాగే కొన్ని చోట్ల కుండపోతగా వర్షాలు తప్పవని పేర్కొంది. కోస్తాంధ్రలో ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు వివరించింది. మత్స్యకారులు ఎవరు సముద్రంలో చేపల వేటకు వెళ్ల వద్దని సూచించింది. తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. -
రాగల 48 గంటల్లో హైదరాబాద్లో భారీ వర్షాలు
-
రాగల 48 గంటల్లో హైదరాబాద్లో భారీ వర్షాలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. రాష్ట్రంపై అల్పపీడనం పూర్తిగా ఆవరించి ఉందని తెలిపింది. కోస్తాంధ్ర నుంచి తెలంగాణ మీదుగా అల్పపీడనం నెమ్మదిగా కదులుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. రాగల 48 గంటల్లో ఇటు తెలంగాణ, అటు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. 25 సెంటిమీటర్ల మేర వర్ష పాతం నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. అలాగే హైదరబాద్ నగరంలో కూడా రాగల 48 గంటల్లో కుండపోతగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం చెప్పింది. -
వర్ష బీభత్సం