death case
-
Visakhapatnam: మహిళపై జ్యోతిష్యుడు అత్యాచారం..
కొమ్మాది(విశాఖపట్నం): పెందుర్తి బీసీ కాలనీకి చెందిన జ్యోతిష్యుడు మోతి అప్పన్న అలియాస్ అప్పన్న దొర (50) అస్థి పంజరం కేసు మిస్టరీ వీడింది. భీమిలి నేరెళ్ల వలసకు చెందిన భార్యాభర్తలు గుడ్డాల మౌనిక, ఊళ్ల చిన్నారావు పథకం ప్రకారం అతన్ని హత్య చేశారు. ఘటనా స్థలంలో లభించిన వస్తువులు, సీసీ ఫుటేజ్, సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా భీమిలి పోలీసులు నిందితులను గుర్తించి గురువారం అరెస్ట్ చేశారు. భీమిలి సీఐ బి.సుధాకర్ తెలిపిన వివరాలివి..పెందుర్తి బీసీ కాలనీకి చెందిన మోతి అప్పన్న.. భార్య కొండమ్మ, కుమారులు ప్రసాద్, దుర్గా ప్రసాద్లతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయన ఇంటింటికీ వెళ్లి జ్యోతిష్యం చెబుతుంటాడు. ఇబ్బందుల్లో ఉన్న వారి ఇళ్లలో పూజలు చేస్తూ.. తద్వారా వచ్చిన ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇదిలా ఉండగా ఆయన ఈ నెల 9న ఆనందపురం వెళ్తున్నట్లు ఇంటి వద్ద చెప్పాడు. ఆ రోజు రాత్రి అప్పన్న ఇంటికి రాకపోవడంతో 10న ఆయన పెద్ద కుమారుడు దుర్గా ప్రసాద్ ఆనందపురం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా ఉప్పాడ ప్రాంతంలో అప్పన్న తప్పిపోయినట్లు గుర్తించి, ఆ ప్రాంతంలో అతని కుటుంబ సభ్యులు, పోలీసులు గాలించారు. అక్కడ ఓ ప్రైవేట్ లేఅవుట్లో అప్పన్నకు సంబంధించిన అవశేషాలు గుర్తించారు.పథకం ప్రకారం.. కత్తితో పొడిచికాగా.. నిందితులు నెల రోజుల కిందట ఆనందపురం మండలం లొగడలవానిపాలెంలో ఒక అద్దె ఇంట్లో దిగారు. అక్కడకు సమీపంలో ఉన్న యడ్ల తిరుపతమ్మ అనే టీ దుకాణం యజమానితో వారికి పరిచయం ఏర్పడింది. అదే టీ దుకాణానికి ప్రతి మంగళ, ఆదివారాల్లో అప్పన్న దొర వస్తుండేవాడు. చుట్టు పక్కల గ్రామాల్లో వాస్తు, పూజలు చేస్తుండేవాడు. తనకు కూడా సమస్యలు ఉన్నాయని, పరిష్కరించాలని నిందితురాలు అప్పన్నకు చెప్పగా ఇంటికి వచ్చి పూజలు చేస్తానని చెప్పాడు. ఈ క్రమంలో మౌనిక ఇంటికి వెళ్లిన అప్పన్న ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా అత్యాచారం చేశాడు.ఈ విషయం ఎవరికై నా చెపితే కుటుంబాన్ని నాశనం చేస్తానని బెదిరించాడు. ఆమె ఈ విషయాన్ని తన భర్త చిన్నారావుకు తెలియజేయగా అప్పన్న దొరను హత్య చేయడానికి పథకం వేశారు. ఉప్పాడలో ఉన్న తన తల్లికి ఆరోగ్యం సరిగా లేదని, పూజ చేయాలని చిన్నారావు అప్పన్నను నమ్మించాడు. రూ.7 వేలు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నాడు. ఈ నెల 9న బటన్ కత్తి, పల్సర్ బైక్ తెప్పించుకుని అతన్ని ఆనందపురం మండలం క్రాస్ రోడ్డు, బోయపాలెం మీదుగా భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ లే అవుట్కు తీసుకువెళ్లాడు. అతన్ని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో చిన్నారావు కుడిచేతి చూపుడు వేలికి గాయం కాగా కేజీహెచ్లో చికిత్స తీసుకున్నాడు.ఒక రోజు ఆగి..ఆధారాలు లేకుండా చేసేందుకు తర్వాత రోజు టిన్నర్, పెట్రోల్ కొనుగోలు చేశాడు. 11వ తేదీ వేకువజాము 4 గంటల సమయంలో రెండు లీటర్ల టిన్నర్, మరో రెండు లీటర్ల పెట్రోల్ తీసుకొని తన భార్యతో కలిసి బయలుదేరాడు. ఉదయం ఆరు గంటల సమయంలో మృతదేహాన్ని కాల్చివేశాడు. ఘటనా స్థలంలో లభించిన వస్తువులు ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. తన భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించాడనే కోపంతో చిన్నారావు జ్యోతిష్యుడిని హత్య చేశాడని, ఈ ఘటనలో భర్తకు మౌనిక సహకారం అందించడంతో ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు సీఐ బి.సుధాకర్ తెలిపారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు బటన్ కత్తి, రక్తపు మరకలు కలిగిన నిందితుడి జీన్ ప్యాంటు, అప్పన్నదొర ఫోన్ పౌచ్, లైటర్, పల్సర్ ద్విచక్రవాహనం, కీ పాడ్ మొబైల్ స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు.అదృశ్యమైన జ్యోతిష్యుడు.. అస్థిపంజరమై! -
ఫోన్లో భార్య సతాయింపులు.. భరించలేక భర్త బలవన్మరణం!
కట్టుకున్న భార్య రాచిరంపాన పెడుతుందని ఓ భర్త వాపోతే ఎలా ఉంటుంది?. నవ్వి ఊరుకుంటుంది ఈ సమాజం. కానీ, అతుల్ సుభాష్ అనే భార్యాబాధితుడి బలవన్మరణం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇలాంటి కేసులు.. వ్యక్తుల జీవితాలకు సంబంధించిన విచారణే కాకుండా చట్టాలను సవరించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ఇది ఇక్కడితో ఆగిపోలేదు. ఓ అతుల్.. కర్ణాటకలో ఓ కానిస్టేబుల్ తిప్పన్న.. రాజస్థాన్లో ఓ డాక్టర్ అజయ్ కుమార్ .. ఇలా రోజుకొక ఉదంతం ఈ చర్చలో భాగమవుతోంది. ఇదిలా ఉండగానే.. ఢిల్లీలో మరో అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది.వుడ్బాక్స్(Woodbox) అనే పాపులర్ కేఫ్ నడిపిస్తున్న పునీత్ ఖురానా(40) బలవనర్మణానికి పాల్పడ్డాడు. కల్యాణ్ విహార్ ప్రాంతం మోడల్ టౌన్ నివాసంలో మంగళవారం సాయంత్రం ఉరేసుకుని చనిపోయాడు. పునీత్ అతని భార్య మానిక జగదీష్ పహ్వాకి మధ్య విడాకుల కేసు నడుస్తోంది. అయితే.. ఈ కేసులో భార్య సతాయింపుల కోణం బయటకు వచ్చింది.తన భార్య వేధింపులకు సంబంధించి 16 నిమిషాల ఫోన్కాల్ ఆడియో.. అలాగే ఆమె ఎలా వేధించిందో చెబుతూ 54 నిమిషాల సెల్ఫ్ వీడియో రికార్డింగ్.. రెండింటిని బయటపెట్టి మరీ సూసైడ్ చేసుకున్నాడతను. ఈ మేరకు కుటుంబ సభ్యులు కూడా మానికపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.2016లో ఈ ఇద్దరికీ వివాహం జరిగింది. ఆపై వుడ్బాక్స్ కేఫ్ను ఆ భార్యాభర్తలిద్దరూ కలిసే ప్రారంభించారు. విడాకుల కేసు నేపథ్యంలో ఇద్దరూ దూరంగా ఉంటున్నప్పటికీ.. వ్యాపారంలో మాత్రం ఇద్దరూ భాగంగానే కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవలు ముదిరాయి. పునీత్ మరణం తర్వాత.. మానికతో జరిగిన జరిగిన ఫోన్ కాల్ సంభాషణ ఒకటి బయటకు వచ్చింది.మనం విడాకులు తీసుకున్నాం. అయినా కూడా నేను వ్యాపార భాగస్వామినే. కాబట్టి, నా బకాయిలు త్వరగా చెల్లించు అని మానిక, పునీత్తో వాగ్వాదం పెట్టుకుంది. పునీత్ ఎంత వేడుకుంటున్నా.. ఆమె మాత్రం కఠువుగానే మాట్లాడిందా ఆడియో క్లిప్లో. దీంతో.. చేసేది లేక ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మానికను విచారణ జరపాలని నిర్ణయించారు.ఇదిలా ఉంటే.. అతుల్ సుభాష్(Atul Subash) కోసం పుట్టుకొచ్చిన #JusticIsDue హ్యాష్ట్యాగ్ సోషల్ మీడియా నుంచి కనుమరుగు కాలేదు. జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న నిఖితా సింఘానియా బెయిల్ కోసం ప్రయత్నిస్తోంది. అయితే.. బిడ్డను సాకుగా చూపి బెయిల్ పొందలేరంటూ బెంగళూరు కోర్టు నిఖిత లాయర్కు స్పష్టం చేసింది. ఈ పిటిషన్పై తదుపురి వాదనలు జనవరి 4వ తేదీన వింటామంది. మరోవైపు.. బెంగళూరు హైకోర్టులోనూ నిఖితా సింఘానియా ఓ పిటిషన్ వేసింది. అదే టైంలో.. మనవడి సంరక్షణ కోరుతూ అతుల్ తల్లిదండ్రులు వేసిన పిటిషన్పైనా హైకోర్టు విచారణ జరపుతోంది. ఈ క్రమంలో నిఖితా సింఘానియా రిమాండ్లో ఉన్న విషయాన్ని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని బెంగళూరు హైకోర్టు అతుల్ పేరెంట్స్కు సూచించింది.కొడుకును వంకగా పెట్టుకుని భార్య తన నుంచి డబ్బు గుంజుతోందని.. తప్పుడు కేసులతో కోర్టుల చుట్టూ తిప్పుతూ తనను వేధిస్తోందంటూ 90 నిమిషాల వీడియో.. పేజీలకొద్దీ మరణ వాంగ్మూలం రాసి బెంగళూరు మరాథాహల్లి నివాసంలో అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకన్నాడు. ఆయన సోదరుడు బికాస్ కుమార్ ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ 108, రెడ్విత్ 3(5) కింద మారథాహల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన తర్వాత పరారీలో ఉన్న నిఖితను, అటు ఆమె తల్లి సోదరుడ్ని పోలీసులు అరెస్ట్ చేసి బెంగళూరుకు తరలించారు. అయితే.. తన భర్త అదనపు కట్నం కోసం తనను వేధించిన మాట వాస్తవమేనని, అతని మృతిలో తనకుగానీ, తన కుటుంబ సభ్యులకుగానూ ఎలాంటి ప్రమేయం లేదని నిఖిత మొదటి నుంచి వాదిస్తూ వస్తోంది. -
ఎస్సై ఐ ఫోన్ వాట్సాప్ చాటింగ్లో ఏముందో..
భిక్కనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట పీఎస్ కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ శివ మృతి మిస్టరీని ఛేదించే పనిలో ఉన్న పోలీసులకు ఆ ముగ్గురి వాట్సాప్ చాటింగ్, వారు ప్రయాణించిన ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీ కీలకమైంది. ముగ్గురూ మృతి చెందడంతో అసలేం జరిగి ఉంటుందనేదిపెద్ద ప్రశ్నగా మిగిలింది. ఈ క్రమంలో పోలీసులు ముగ్గురి ఫోన్లలోని వాట్సాప్ చాటింగ్పైఆధారపడ్డారు. అలాగే సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఏకకాలంలో జరిగిన ముగ్గురి మరణాల మిస్టరీని తేల్చేందుకు పోలీసు అధికారులు విచారణ ముమ్మరం చేశారు. చాలా కాలంగా క్లోజ్గా ఉన్న వాళ్లు కలిసి చనిపోవడానికి కారణాలు ఏమిటనేదానిపై ఆరా తీస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో బుధవారం సాయంత్రం భిక్కనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శ్రుతి, బీబీపేటకు చెందిన నిఖిల్లు చనిపోయిన విషయం తెలిసిందే. ఎస్సై, మహిళా కానిస్టేబుల్ చనిపోయిన ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కేసు మిస్టరీని ఛేదించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సై సాయికుమార్ వద్ద రెండు ఫోన్లు, కానిస్టేబుల్ శ్రుతి ఒక ఫోన్, నిఖిల్ రెండు ఫోన్లు వాడినట్లు నిర్ధారణకు వచ్చారు. ముగ్గురి కాల్ డేటాను ఇప్పటికే పరిశీలించారు. గడిచిన వారం రోజుల్లో ముగ్గురు పలుమార్లు కాల్స్ మాట్లాడినట్లు కాల్డేటా ద్వారా వెల్లడైనట్లు తెలుస్తోంది. ముగ్గురి మధ్య ఉన్న పరిచయాలు, వాళ్లు సడెన్గా ఆ రోజు ఎందుకు కలవాల్సి వచ్చింది ? అక్కడ జరిగిన గొడవ ఏమిటి? అనే అంశాలపై పోలీసులు ఫోకస్ చేస్తున్నారు.భిక్కనూరు నుంచి అడ్లూర్ ఎల్లారెడ్డి దాకా..విచారణలో భాగంగా పోలీసు అధికారులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. భిక్కనూరు టోల్ ప్లాజా దగ్గర నుంచి మొదలుకుని అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వరకు జాతీయ రహదారి వెంట ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. జాతీయ రహదారిపై ఓ దాబా హోటల్ సమీపంలో నిఖిల్ బైకును ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ హోటల్ వద్ద కలిసి భోజనం చేశారన్న ప్రచారం జరగడంతో అధికారులు హోటల్ సిబ్బందిని ప్రశ్నించినట్లు సమాచారం. అయితే అక్కడ సీసీ ఫుటేజీని చెక్ చేసే క్రమంలో అవి పనిచేయడం లేదని చెబుతున్నారు. అక్కడి నుంచి ముగ్గురు కలిసి కారులో కామారెడ్డి పట్టణంలోకి రాకుండా బైపాస్ రోడ్డు గుండానే నిజామాబాద్ రూట్లో వెళ్లినట్టు భావిస్తున్నారు. అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు సమీపంలో రోడ్డు పక్కన కారు ఆపుకుని డిస్కషన్ చేసి ఉంటారని, తరువాత ఎవరి కంట పడకుండా ఉండేందుకు చెరువు కట్టపైకి వెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనా ముగ్గురి చావుల మిస్టరీ తేల్చడం పోలీసులకు సవాల్గానే మారిందని చెప్పాలి.వాట్సాప్ చాటింగ్లో ఏముందో..ముగ్గురు కూడా రెగ్యులర్గా వాట్సాప్ వాడుతున్నట్లు పోలీసులు తమ ప్రాథమిక విచారణలో నిర్ధారించుకున్నారు. ఎస్సై సాయికుమార్ వాడుతున్న రెండు ఫోన్లలో ఒకటి కారులో ఉండగా, మరో ఫోన్ ఆయన ప్యాంట్ జేబులోనే ఉండిపోయింది. నీటిలో మునిగిపోవడంతో ఫోన్ ఆన్ కావడం లేదని తెలుస్తోంది. కారులో ఉన్న ఐ ఫోన్ స్క్రీన్ లాక్ ఉండడంతో ఓపెన్ చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. అయితే ఎస్సై ఫోన్ లాక్ గురించి ఆయన భార్యను తెలుసుకునే ప్రయత్నం చేయగా, తనకు తెలియదనే సమాధానం వచ్చినట్లు సమాచారం. నిఖిల్ వాడుతున్న రెండు ఫోన్లలో ఒకటి లాక్ ఓపెన్ కావడం లేదని, మరొకదానిలో పెద్దగా చాటింగ్ లేనట్టు చెబుతున్నారు. శ్రుతి ఫోన్ లాక్ సైతం ఓపెన్ కాలేదని తెలుస్తోంది. వాటిని ఓపెన్ చేయించేందుకు పోలీసు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వాట్సాప్ చాటింగ్లో కచ్చితంగా ఏదో ఒక ఆధారం దొరుకుతుందనే నమ్మకంతో పోలీసులు ఉన్నారు.కామారెడ్డి మిస్టరీ డెత్స్ కేసులో కొత్త కోణాలు.. జరిగింది ఇదేనా? -
గంటల కొద్దీ ఫోన్ కాల్స్!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించిన ఎస్ఐ, కానిస్టేబుల్, మరో యువకుడి మృతి కేసులో వారి ఫోన్కాల్, వాట్సాప్ చాటింగ్ డేటా కీలకంగా మారింది. చనిపోయే రోజు భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్, బీబీ పేట కానిస్టేబుల్ శ్రుతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఫోన్ లో గంటలకొద్దీ మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు ముగ్గురు ఈ నెల 25న కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో నీటమునిగి చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మ రం చేసిన పోలీసులు.. వారి కాల్ డేటాను సేకరించారు. చనిపోయేదాకా ఫోన్కాల్స్ బుధవారం వేకువజాము నుంచే వీరు ఫోన్లో మాట్లాడుకున్నట్లు కాల్ డేటా ద్వారా స్పష్టమైంది. సాయికుమార్ రెండు ఫోన్లలో కలిపి మూడు సిమ్లు వాడగా, నిఖిల్ రెండు ఫోన్లు వాడాడు. శ్రుతి ఒక ఫోన్ వాడుతుండేది. చనిపోయే వారం రోజుల ముందు నుంచి ఎక్కువ సార్లు ఫోన్లో మాట్లాడుకు న్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం నుంచి ఒక్క చోటు కి చేరుకునేదాకా వీరు ఫోన్లో మాట్లాడినట్టు గుర్తించారు. జిల్లా అధికారులతో ఫోన్ కాన్ఫరెన్స్లో ఉన్న సమయంలో తప్ప.. మిగతా సమయమంతా శ్రుతి, నిఖిల్తో సాయికుమార్ ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్కచోటుకు చేరి..: భిక్కనూరు పోలీస్స్టేషన్ నుంచి సాయికుమార్ ఒక్కడే తన కారులో బయలుదేరి 44వ నంబర్ జాతీయ రహదారి మీదుగా కామారెడ్డి వైపు వెళ్లాడు. బీబీపేట నుంచి నిఖిల్ తన బైకుపై దోమకొండ, బీటీఎస్ మీదుగా హైవేకు చేరుకున్నట్టు తెలుస్తోంది. శ్రుతి బస్సులోనే బయలుదేరిందని, ఆమె నర్సన్నపల్లి శివారు వద్ద బస్సు దిగిందని అంటున్నారు. ఓ దాబా వద్ద ముగ్గురూ ఆగారని ప్రచారం జరుగుతుండగా.. అక్కడ సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో స్పష్టత రాలేదు.నిఖిల్ తన బైకును అక్కడే వదిలేసి ఎస్సై కారులో వెళ్లినట్టు స్పష్టత వచ్చింది. అదే కారులో శ్రుతి కూడా ఎక్కిందని అంటున్నారు. ముగ్గురూ బైపాస్ ద్వారా అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వద్దకు చేరుకొని, కొంతసేపు అక్కడ మాట్లాడుకొని ఉంటారని భావిస్తున్నారు. తరువాత ఏమైందో ఏమో ముగ్గురూ చెరువులో పడి చనిపోవడం మిస్టరీగా మారింది. ఎవరైనా ఒకరు దూకితే కాపాడేందుకు మిగతా ఇద్దరు దూకారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారమే కారణమా? శ్రుతి, నిఖిల్ వాట్సాప్ మెసేజ్లను పోలీసులు పరిశీలించా రు. వీరి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్టు వాట్సాప్ మెసేజ్ లు స్పష్టం చేస్తున్నాయని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, వీరి ప్రేమ వ్యవహారంలో సాయికుమార్ ఎందుకు తలదూర్చాడన్నది ఇప్పుడు కీలకంగా మారింది. నిఖిల్, శ్రుతి పెళ్లి చేసుకోవాలనుకున్నారని.. కానీ విభేదాలు తలెత్తి పెళ్లి వాయిదా వేయడం వల్లే గొడవ ముదిరింది అన్న ప్రచారం కూడా జరుగుతోంది. -
అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్
రాజకీయ నాయకుల ర్యాలీలు, ప్రదర్శనల్లో సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు గతంలో అనేకం. అలాంటి కేసుల్లో నేతలకే ఊరట లభిస్తున్నప్పుడు అల్లు అర్జున్ అరెస్టు సరికాదు. ఈ దేశ పౌరుడిగా ఎక్కడికైనా వెళ్లే హక్కుఆయనకు ఉంటుంది. – హైకోర్టు న్యాయమూర్తిసాక్షి, హైదరాబాద్: పుష్ప–2 ప్రీమియర్ షో ప్రదర్శన సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన ఘటనలో నిందితుడు, ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ (ఏ11)కు హైకోర్టు 4 వారాలు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. హత్య చేయాలన్న ఉద్దేశం, పదునైన ఆయుధాలతో దాడి చేయడానికి సంబంధించిన సెక్షన్లు ఇక్కడ వర్తించవని స్పష్టం చేసింది. పోలీసులు అనుమతి ఇచి్చన తర్వాతే హీరో సినిమా చూసేందుకు వచ్చారని, ఆయన్ను రావొద్దని పోలీసులు చెప్పారనడానికి ఎలాంటి ఆధారం లేదని పేర్కొంది. అల్లు అర్జున్ నిర్లక్ష్యం కారణంగా మరణం చోటుచేసుకున్నా, గరిష్టంగా ఐదేళ్లు శిక్ష పడే నేరంలో బెయిల్కు ఆయన అర్హు డని పేర్కొంది. పలు తీర్పులను ప్రస్తావి స్తూ.. 4 వారాలు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జైలర్కు రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తు సమరి్పంచాలని స్పష్టం చేసింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని, దర్యా ప్తు అధికారులకు అందుబాటులో ఉండాలని అల్లు అర్జున్కు సూచించింది. తదుపరి విచారణ జనవరి 21కి వాయిదా వేసింది. భద్రత కల్పించని పోలీసులదే బాధ్యత: అల్లు అర్జున్ తరఫు న్యాయవాది పోలీసులు అల్లు అర్జున్ను అరెస్టు చేయడంతో ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో లంచ్మోషన్ రూపంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. ‘ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని పిటిషన్ వేశాం. అది ఇంకా ధర్మాసనం ముందుకు రాకముందే అరెస్టు చేశారు. క్వాష్ పిటిషన్ ద్వారా మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చని గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు ఇచ్చాయి. తొక్కిసలాట జరిగి ఒకరు ప్రాణాలు కోల్పోయిన కేసులో నటుడు షారుక్ఖాన్కు గుజరాత్ హైకోర్టు ఊరటనిచి్చంది. అర్నబ్ గోస్వామి కేసులో బాంబే హైకోర్టు బెయిల్ ఇవ్వకపోతే సుప్రీంకోర్టు దానిని సవరించింది. కిందికోర్టు రిమాండ్ విధించినా.. దాన్ని నిరాకరించే అధికారం హైకోర్టుకు ఉంటుంది (బండి సంజయ్ కేసును ప్రస్తావించారు).రాజమండ్రిలో గోదావరి పుష్కరాల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రావడంతో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మృతిచెందారు. అందుకు ఆయన్ను బాధ్యున్ని చేయలేదు కదా. పుష్ప ప్రీమియర్ షో ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇచి్చంది. హీరో, హీరోయిన్ వస్తారంటూ పోలీసులకు థియేటర్ యాజమాన్యం సమాచారం ఇచి్చంది. అల్లు అర్జున్ మొదటి అంతస్తులో ఉండగా, గ్రౌండ్ఫ్లోర్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. దానికి ఆయన బాధ్యుడెలా అవుతారు? ఇది ఉద్దేశపూర్వంగా లేదా కావాలని చేసింది కాదు. దురదృష్టవశాత్తు మహిళ మృతి చెందింది. 118 (1) బీఎన్ఎస్తో పాటు సెక్షన్ 105 ఈ కేసులో వర్తించదు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆ స్థాయిలో భద్రత కల్పించని పోలీసులే దీనికి బాధ్యత వహించాలి. తొక్కిసలాటను ఆపే ప్రయత్నం వారు చేయలేదు. పిటిషనర్ బెయిల్కు అర్హుడు. విడుదలకు ఆదేశాలు ఇవ్వాలి..’అని కోరారు. లంచ్మోషన్ అనుమతించవద్దు: పీపీ ప్రభుత్వం తరఫున పీపీ వాదనలు వినిపిస్తూ.. ‘క్వాష్ పిటిషన్పై విచారణ అత్యవసరం కాదు. బెయిల్ కోసం మరో పిటిషన్ వేసుకోవాలి. కోరగానే లంచ్మోషన్ ఇవ్వడం తప్పుడు సంకేతం ఇస్తుంది. లంచ్మోషన్ మధ్యాహ్నం వేయడాన్ని అనుమతించకూడదు. మధ్యంతర బెయిల్ ఇవ్వాలని క్వాష్ పిటిషన్లో ఎక్కడా కోరలేదు. కనీసం పిటిషన్ చదువుకునే సమయం అయినా ఇవ్వకుండా వాదనలు వినిపించాలంటే ఎలా? విచారణ సోమవారానికి వాయిదా వేయాలి. థియేటర్కు వెళ్లొద్దని అల్లు అర్జున్కు పోలీసులు చెప్పారు. ఆయన్ను ఇప్పటికే రిమాండ్కు తరలించాం..’అని తెలిపారు. హీరో అయినంత మాత్రాన స్వేచ్ఛను కోల్పోవాలా? ‘లంచ్ మోషన్ విచారణకు అనుమతి ఇవ్వొద్దని తొలుత భావించా. సామాన్యులైతే ఇద్దామనుకున్నా. అయితే సినీ హీరో అయినంత మాత్రాన స్వేచ్ఛను కోల్పోవాలా? అనే సందేహం వచి్చంది. అతని హోదా కారణంగా స్వేచ్ఛను కోల్పోవడం సరికాదని అనిపించింది. అర్నబ్ గోస్వామి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఇదే హైకోర్టు పలువురికి బెయిల్ మంజూరు చేసింది. రిమాండ్కు పంపిన తర్వాత బీజేపీ నేత బండి సంజయ్కి, అలాగే 489ఏ వ్యవహారంలో ఒక సామాన్యునికి ఊరట దక్కింది..’అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ ఆదేశాలిచ్చారు. ఇదే అంశంపై సంధ్యా థియేటర్ యాజమాన్యం, తదితరులు దాఖలు చేసిన మరో పిటిషన్లో అరెస్టయిన మరో ఇద్దరిని (ఏ–1, ఏ–2) కూడా విడుదల చేయాలంటూ ఉత్తర్వులిచ్చారు. ఇతర పిటిషనర్లపై అరెస్టు సహా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేశారు. -
సిమ్రత్ కేసులో కెనడా పోలీసుల కీలక ప్రకటన
భారత సంతతికి చెందిన యువతి గుర్సిమ్రత్ కౌర్(19).. ఓ ప్రముఖ స్టోర్లోని వాక్ ఇన్ ఒవెన్లో శవమై కనిపించడం తెలిసిందే. ఆమె మృతిపై తల్లితో సహా సహోద్యోగులు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ కేసు విచారణ జరిపిన కెనడా పోలీసులు తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తైందని, అనుమానాస్పద హత్యగా అనిపించలేదని హాలీఫాక్స్ పోలీసులు సోమవారం ప్రకటించారు. అలాగే.. తప్పు జరిగిందనడానికి ఆధారాలు కూడా లేవని వెల్లడించారు. ‘‘ఈ కేసులో ఏం జరిగిందో అనేదానిపై అనేక మంది అనేక ప్రశ్నలు లేవనెత్తారు. కానీ, మా విచారణలో అలాంటి అనుమానాలేవీ మాకు కనిపించలేదు. ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నట్లు మాకు అనిపించడం లేదు. ఈ కేసు దర్యాప్తు పూర్తైంది’’ అని ఓ అధికారి వీడియో సందేశంలో తెలిపారు.Statement on Sudden Death Investigation pic.twitter.com/0IsyAfMkzX— Halifax_Police (@HfxRegPolice) November 18, 2024 పంజాబ్కు చెందిన 19 ఏళ్ల గురుసిమ్రన్.. గత రెండేళ్లుగా తన తల్లితో కలిసి హాలీఫాక్స్లోని వాల్మార్ట్ షోరూంలో పని చేస్తోంది. తండ్రి, సోదరుడు భారత్లోనే ఉంటారు. అయితే కిందటి నెలలో.. వాక్ ఇన్ ఒవెన్లో ఆమె అనుమానాస్పద రీతిలో శవమై కనిపించింది.సిమ్రన్ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆమె స్టోర్ మొత్తం వెతికింది. చివరకు ఒవెన్ నుంచి పొగలు రావడం గమనించి స్టోర్ సిబ్బంది అనుమానంతో తెరిచి చూడగా అందులో కాలిపోయిన స్థితిలో గురుసిమ్రన్ మృతదేహం కనిపించింది. సిమ్రన్ మృతిపై తల్లి అనుమానాలు వ్యక్తం చేశారు. మరోవైపు ఆమెను బలవంతంగా అందులో ఎవరో నెట్టేసి హత్య చేసి ఉంటారని, వాక్ ఇన్ ఒవెన్ తలుపు లాక్ చేసి ఉండడమే తమ అనుమానాలకు కారణమని సిమ్రన్ సహోద్యోగులు చెప్పారు. కానీ, పోలీసులు మాత్రం అనుమానాలేవీ లేవని చెబుతుండడం గమనార్హం. -
విజయనగరం జిల్లాలో తగ్గని డయేరియా తీవ్రత
-
Shashi Tharoor: కర్కరే మృతిపై దర్యాప్తు జరపాలి
న్యూఢిల్లీ: మహారాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారి హేమంత్ కర్కరే మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ నేత శశిథరూర్ డిమాండ్చేశారు. పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ షూట్ చేయడం వల్ల యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్ కర్కరే చనిపోలేదని, ఆర్ఆర్ఎస్ భావజాలమున్న ఒక పోలీస్ అధికారి బుల్లెట్ తగలడం వల్లే కర్కరే మరణించారని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివార్ ఆరోపించడంతో శశిథరూర్ సోమవారం స్పందించారు. ‘‘ ఇది నిజంగా తీవ్రమైన అంశం. విజయ్ ఆరోపణల్లో నిజం ఉందని నేను అనట్లేను. కానీ దర్యాప్తు చేస్తే నిజాలు బయటికొస్తాయి. 2008 ముంబై దాడుల ఘటన రాత్రి అసలేం జరిగిందనేది యావత్భారతానికి తెలియాలి. మాజీ పోలీస్ ఐజీ ముష్రిఫ్ రాసిన పుస్తకంలోని అంశాలనే విపక్షనేత విజయ్ ప్రస్తావించారు. కసబ్ షూట్చేసిన గన్లోని బుల్లెట్తో కర్కరే శరీరంలోని బుల్లెట్ సరిపోలలేదని పుస్తకంలో రాశారు. శరీరంలోని బుల్లెట్ పోలీస్ రివాల్వర్లో వాడేదానిలా ఉందని పేర్కొన్నారు. అందుకే కర్కరే మృతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి’’ అని థరూర్ డిమాండ్ చేశారు. బీజేపీ అభ్యరి్థగా బరిలో దిగిన మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ మీదా థరూర్ ఆరోపణలు గుప్పించారు. ‘‘నాడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు కసబ్కు జైలులో బిర్యానీ పెట్టారని నికమ్ చెప్పారు. అది అబద్ధమని తేలింది. ఇప్పుడు బీజేపీ తరఫున బరిలో దిగడం చూస్తుంటే ఆనాడే ఆయన తన పక్షపాత వైఖరిని బయటపెట్టినట్లు తెలుస్తోంది. ముంబై దాడుల కేసులో మాత్రమే ఈయన ఇలా పక్షపాతంగా వ్యవహరించారా లేదంటే ఇతరకేసుల్లోనూ ఇలాగే చేశారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి’’ అని అన్నారు. మరోవైపు కర్కరేపై ఆర్ఎస్ఎస్ రగిలిపోయేదని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. మాలేగావ్ పేలుడు కేసులో ఆర్ఎస్ఎస్తో సంబంధాలున్న సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్, కల్నల్ పురోహిత్లను కర్కరే పోలీస్ టీం అరెస్ట్చేయడంతో ఆయనపై ఆర్ఎస్ఎస్ ద్వేషం పెంచుకుందని రౌత్ అన్నారు. -
గీతాంజలి కేసులో ఇద్దరి అరెస్ట్
సాక్షి, గుంటూరు: సోషల్ మీడియా ట్రోలింగ్తో బలవనర్మణానికి పాల్పడిన గీతాంజలి కేసులో అరెస్టుల పర్వం మొదలైంది. పసుమర్తి రాంబాబు అనే వ్యక్తిని తెనాలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాంబాబు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావుకు అనుచరుడిగా తెలుస్తోంది. దుర్గారావు అనే మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జగనన్న పాలనలో తనకు మంచి జరిగిందంటూ ఇంటి పట్టా అందుకున్న ఆనందంలో గీతాంజలి ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో భావోద్వేగానికి లోనైంది. అయితే ఆ వీడియోను ఉద్దేశపూర్వకంగా సోషల్మీడియాలో పోస్ట్ చేసి.. ఆమెను అతిదారుణంగా ట్రోల్ చేశారు. దీంతో.. తీవ్ర మనోవేదనకు గురైన ఆమె రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే గాయాలతో ఉన్న ఆమెను ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన ఏపీలో తీవ్ర దుమారం రేపింది. సోషల్ మీడియాలో వేధించిన సైకోలను వదల్లొద్దంటూ డిమాండ్ బలంగా వినిపించింది. ఏపీ పోలీసులు కూడా ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు. దర్యాప్తు ముమ్మరం చేసి.. పసుమర్తి రాంబాబును అరెస్ట్ చేశారు. గీతాంజలిపై రాంబాబు సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో రాంబాబును అదుపులోకి తీసుకుని తెనాలి స్టేషన్కు తరలించారు. దుర్గారావు అనే మరో వ్యక్తి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు గీతాంజలిపై అనుచిత పోస్టులు పెట్టిన టీడీపీ, జనసేన నేతల అకౌంట్ల పరిశీలన జరుగుతోందని పోలీసులు చెబుతున్నారు. చాలామంది పోస్టులు డిలీట్ చేసినప్పటికీ.. స్క్రీన్ షాట్లను పరిశీలించాక వాళ్లపై చర్యలు ఉంటాయని.. అలాగే పరారీలో ఉన్న మరికొందరిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు పోలీసులు. -
AP Police: ‘దిగులొద్దు.. భయపడొద్దు.. భరతం పడతాం’
టీడీపీ, జనసేన పార్టీల సోషల్ మీడియా విభాగాల వేధింపులు కొన్నాళ్లుగా వెర్రి తలలు వేస్తున్నాయి. సొంత వ్యక్తిత్వం, తమవైన అభిప్రాయాలు కలిగి ఉండటం మహానేరం అన్నట్లు కిరాయి మూకలు దారుణంగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో.. పచ్చ మూకల కిరాతకానికి తెనాలి మహిళ గీతాంజలి దారుణంగా బలైపోయింది. అయితే ‘సోషల్ మాఫియా’ దాడులపై బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని.. తాము అండగా నిలబడతామని ఏపీ పోలీసులు భరోసా ఇస్తున్నారు. టీడీపీ-జనసేన సోషల్ మీడియా బ్యాచ్ గత కొంతకాలంగా మరీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. మహిళలు, చిన్నారులని కూడా చూడకుండా అసభ్యకర పదజాలంతో దూషిస్తూ తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయి. బెండపూడి స్టూడెంట్ మేఘన, కుమారీ ఆంటీ.. వీళ్లను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో పోస్టలు చేశాయి. తాజాగా తెనాలి గృహిణి గీతాంజలి లక్ష్యంగా చేసుకుని తప్పుడు కామెంట్లు చేశాయి. దీంతో ఆమె ప్రాణం తీసుకుంది. అయితే.. ఆన్లైన్లో ఇలాంటి వేధింపులను ఉపేక్షించొద్దని ఏపీ పోలీసులు అంటున్నారు. వీటికి జంకితే మరింత దారుణంగా తెగబడటం ఖాయమని చెబుతున్నారు. బాధితులకు తక్షణమే రక్షణ కల్పించడం, వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసు శాఖ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిందని గుర్తు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా చేసిన చట్టాల్ని ప్రస్తావిస్తున్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తే చాలు వెంటనే కేసు నమోదు చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని.. బాధితులు నేరుగానే కాకుండా తమ సన్నిహితులు, స్నేహితుల ద్వారా కూడా బాధితులు ఫిర్యాదు చేసే వీలుందని చెబుతున్నారు. ఫిర్యాదు చేయడం ఇలా... ► ట్రోలింగ్కు గురయ్యేవారు, బాధితులు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. గ్రామ, వార్డు సచివాలయంలోని మహిళా పోలీసు ద్వారా కూడా పోలీసులను ఆశ్రయించవచ్చు. ► సైబర్ నేరాలు, సోషల్ మీడియా వేధింపులపై ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు సంప్రదించాల్సిన వేదికలు.. సైబర్ క్రైమ్ పోర్టల్: https://cybercrime.gov.in/ సైబర్ మిత్ర వాట్సాప్ నంబర్: 9121211100 సైబర్ బుల్లీయింగ్ 4ఎస్4యు: 9071666667 గీతాంజలి కేసులో నిందితుల గుర్తింపు వైఎస్సార్సీపీ సంక్షేమంతో తనకు చేకూరిన లబ్ధి గురించి సంతోషంగా చెప్పి.. ఆనక టీడీపీ-జనసేనల చేతిలో దారుణంగా ట్రోలింగ్కు గురైంది గీతాంజలి. అతి జుగుప్సాకరమైన పోస్టులు చేశారు ఆమె మీద. అయితే సున్నిత మనస్కురాలైన గీతాంజలి.. ఆ పోస్టులను భరించలేకపోయింది. తీవ్ర మనోవేదనకు గురైంది. చివరకు రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ క్రమంలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ సోమవారం వేకువఝామున కన్నుమూసింది. ఏపీలో సంచలనంగా మారిన ఈ ఆన్లైన్ వేధింపుల కేసును పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. భర్త ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. దర్యాప్తును ముమ్మరం చేశారు. ఐటీడీపీ, పలువురు జనసేన నేతల అకౌంట్లను పరిశీలించారు. ఇప్పటికే నిందితుల్ని గుర్తించామని.. పోస్టులు చేసిన కొందరు పరారీలో ఉన్నారని.. వాళ్లందరినీ పట్టుకుని తీరతామని పోలీసులు చెబుతున్నారు. -
కందుల జాహ్నవి కేసు.. ఇదెక్కడి న్యాయం?
కిందటేడాది తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల(23) అమెరికా సియాటెల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. రోడ్డు దాటుతున్న ఆమెను.. పోలీస్ పెట్రోలింగ్ వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. ఆ తర్వాత ఆమె మృతిపై అక్కడి పోలీసు అధికారి ఒకరు చులకనగా మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన భారత్.. ఆ అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అమెరికాను కోరింది కూడా. అయితే తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె మృతికి కారణమైన సదరు పోలీస్ అధికారిపై ఎలాంటి కేసు ఉండబోదని అక్కడి అధికార యంత్రాంగం ప్రకటించింది. బుధవారం వాషింగ్టన్ స్టేట్లోని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం ఈ మేరకు ప్రకటన చేసింది. కందుల జాహ్నవి మృతి ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసేదే అయినా.. ఆమె యాక్సిడెంట్ కేసులో సియాటెల్ పోలీస్ అధికారి కెవిన్ డేవ్కు వ్యతిరేకంగా సరిపడా ఆధారాలు లేవని, కాబట్టి.. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి క్రిమినల్ చర్యలు ఉండబోవు’’ అని ఉన్నతాధికారులు అంటున్నారు. మరోవైపు.. ఈ ప్రకటనపై జాహ్నవి బంధువులు, పలువురు భారతీయ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తున్నారు. ఆఫీసర్ కెవిన్ డేవ్ అతివేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని తేలినప్పుడు చర్యలు ఎందుకు తీసుకోరని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో ఆమె మృతిపై అవమానించేలా మాట్లాడిన అధికారి విషయంలోనూ చర్యలు ఏవని ప్రశ్నిస్తున్నారు. స్థానిక మీడియా వెల్లడించిన కథనాల ప్రకారం.. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. ఆ రోజు ప్రమాదం జరిగిన సమయంలో కెవిన్ విధి నిర్వహణలోనే ఉన్నారు. ఆ రూటులో స్పీడ్ లిమిట్ 40 మైళ్లు మాత్రమే. కానీ, కెవిన్ తన కారును 100 మైళ్లకు పైగా వేగంతో నడిపారు. ఎమర్జెన్సీ హారన్ ఇవ్వలేదుగానీ.. లైట్లను వెలిగించుకుంటూ వెళ్లారు. అదే సమయంలో రోడ్డు దాటుతున్న జాహ్నవి.. అత్యంత వేగంతో కారు దూసుకురావడాన్ని అంచనా వేయలేకపోయారు. కారు నడుపుతున్న కెవిన్ డేవ్ కూడా జాహ్నవిని ఢీకొట్టడానికి ఒక్క సెకను ముందు మాత్రమే బ్రేకులు వేశాడు. కారు బలంగా ఢీకొట్టడంతో జాహ్నవి ఎగిరి 100 మీటర్లకు పైగా దూరంలో పడిపోయారని సీటెల్ పోలీసులు తమ నివేదికలో రిపోర్ట్ లో పేర్కొన్నారు. అయితే కెవిన్పై క్రిమినల్ చర్యలు లేకపోయినా.. డిపార్ట్మెంట్ తరఫున చర్యలు ఉంటాయని అధికారులంటున్నారు. మార్చి 4వ తేదీన క్రమశిక్షణా కమిటీ ముందు కెవిన్ హాజరు కావాల్సి ఉంటుంది. అక్కడ అతని వివరణతో కమిటీ సంతృప్తి చెందకపోతే మాత్రం చర్యలు ఉంటాయని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి(23) గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లింది. కిందటి ఏడాది జనవరి 23వ తేదీ రాత్రి ఎనిమిది గంటల టైంలో రోడ్డు దాటుతున్న ఆమెను.. ఓ పోలీసు వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టి మృతి చెందింది. కెవిన్ డేవ్ అనే అధికారి నిర్లక్ష్యం వల్లే ఆమె ప్రాణం పోయిందని ఆ తర్వాతే తేలింది. అయితే.. ఈ ఘటన గురించి సమాచారం అందించిన తరుణంలో ఓ అధికారి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. Recent reports including in media of the handling of Ms Jaahnavi Kandula’s death in a road accident in Seattle in January are deeply troubling. We have taken up the matter strongly with local authorities in Seattle & Washington State as well as senior officials in Washington DC — India in SF (@CGISFO) September 13, 2023 సియాటెల్ పోలీస్ ఆఫీసర్స్ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ ఆర్డరర్ ఆమె మృతిపై చులకనగా మాట్లాడాడు. గిల్డ్ ప్రెసిడెంట్ మైక్ సోలన్కు ప్రమాదం గురించి సమాచారం అందిస్తూ.. ఆర్డరర్ నవ్వులు చిందించినట్టు రికార్డయింది. అంతేకాదు.. ఆమె జీవితానికి పరిమితమైన విలువ ఉందని.. కేవలం చెక్ ఇస్తే సరిపోతుందని.. చిన్న వయసులో ఆమె చనిపోయింది కాబట్టి 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుందని వెటకారంగా మాట్లాడాడు. అంతేకాదు ఆ తర్వాత దర్యాప్తులోనూ కెవిన్కు అనుకూలంగా.. తప్పంతా జాహ్నవిదే అన్నట్లు అధికారులకు నివేదిక ఇచ్చాడు. డేనియల్ ఆర్డరర్ వ్యాఖ్యల వీడియోపై అధికారులు ఇప్పటికే విచారణ జరుపుతున్నారు. అయితే తాను అవి ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కాదని.. ప్రభుత్వ లాయర్లను ఉద్దేశించి చేశానని.. ఇలాంటి కేసులో బాధితులకు అందాల్సిన పరిహారం ఎలా కుదించేలా ప్రయత్నిస్తారో చెప్పే క్రమంలో అలా మాట్లాడాల్సి వచ్చిందని డేనియల్ ఆర్డరర్ గతంలో వివరణ ఇచ్చాడు. -
Nampally Criminal Court: నాంపల్లి కోర్టు సంచలన తీర్పు
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి క్రిమినల్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 2018కి సంబంధించిన ఓ కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. అయితే, తొలిసారిగి హైదరాబాద్లో ఒక నిందితుడికి ఉరిశిక్ష విధించడం ఇదే మొదటిసారి. వివరాల ప్రకారం.. అదనపు కట్నం కేసులో భార్యను చంపిన భర్తకు నాంపల్లి కోర్టు ఉరిశిక్ష విధించింది. భవానీ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇంజమ్ హక్ అనే వ్యక్తి తన భార్యను అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేశాడు. ఈ క్రమంలో 2018లో ఇంజమ్ హక్ తన భార్యను హత్య చేశాడు. దీంతో, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా నేడు నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. ఇదిలా ఉండగా.. తొలిసారి హైదరాబాద్లో ఒక నిందితుడికి ఉరిశిక్ష విధించడం ఇదే మొదటిసారి. -
ప్రవళిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్
సాక్షి, వరంగల్: ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ఆమె కుటుంబం స్పష్టం చేసింది. ప్రవళిక తల్లి విజయ, సోదరుడు ప్రణయ్ వీడియో రిలీజ్ చేశారు. శివరామ్ వేధింపుల వల్లే తన సోదరి ఆత్మహత్య చేసుకుందని ప్రవళిక అన్న ప్రణయ్ అన్నారు. తమ చెల్లి హాస్టల్లో చదువుకోవడానికి వెళ్లినప్పుడు వేధింపులకు గురి చేశారని, ఫ్రెండ్స్ ఫోన్లతో పాటు వేరే ఇతర నంబర్ల నుంచి కాల్స్ చేసి ఇబ్బందులకు గురిచేశాడని, దాంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక తన చెల్లి సూసైడ్ చేసుకుందని సోదరుడు ఆవేదన వ్యక్తం చేశారు. శివరామ్ను కఠినంగా శిక్షించాలన్నారు. రాజకీయాల్లోకి తమ కుటుంబాన్ని లాగొద్దని ప్రవళిక తల్లి, సోదరుడు విజ్ఞప్తి చేశారు. కాగా, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూ ఆత్మహత్యకు పాల్పడిన మర్రి ప్రవళిక కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ వ్యవహారమే ఆమె ఆత్మహత్యకు కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రియుడు తనని కాదని మరొకరితో వివాహానికి సిద్ధం కావడంతో మనస్తాపం చెంది ఆమె సూసైడ్ చేసుకుందని సెంట్రల్ జోన్ డీసీపీ ఎం. వెంకటేశ్వర్లు తెలిపారు. చదవండి: బతుకమ్మకు వస్తనంటివి బిడ్డా.. -
ప్రేమ వ్యవహారమే ప్రవళిక బలవన్మరణానికి కారణం: డీసీపీ వెంకటేశ్వర్లు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్య ఉదంతం కేసుపై డీసీపీ వెంకటేశ్వర్లు శనివారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలియజేశారాయన. ప్రవళిక 15 రోజుల కిందటే హాస్టల్లో చేరింది. ఆమె శివరామ్ రాథోడ్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఆ సంగతి ఆమె తల్లిదండ్రులకు తెలుసు. కానీ, అతను ఆమెను మోసం చేశాడు. వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అది తెలిసి ప్రవళిక డిప్రెషన్లోకి వెళ్లింది. వాట్సప్ ఛాటింగ్, సీసీటీవీ ఫుటేజీలతో ఈ వ్యవహారం బయటపడింది. అది తట్టుకోలేక ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది అని డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. సూసైడ్ నోట్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపాం. శివరామ్తోనే ఆమె చివరిసారిగా కాల్ మాట్లాడింది. పూర్తి దర్యాప్తు తర్వాత అతనిపై చర్యలు ఉంటాయని డీసీపీ స్పష్టం చేశారు. ప్రవళిక మృతికి.. పరీక్ష వాయిదాకి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటివరకు ప్రవళిక ఎలాంటి పోటీ పరీక్షకు హాజరు కాలేదు. పూర్తిగా వ్యక్తిగతమైన అంశాలే ప్రవళిక ఆత్మహత్యకు కారణం. కాబట్టి.. ఎటువంటి అవాస్తవాలు ప్రచారం చేయొద్దు అని డీసీపీ వెంకటేశ్వర్లు కోరారు. కేసు వివరాలు.. వరంగల్ జిల్లా బిక్కాజీపల్లికి చెందిన మర్రి ప్రవళిక.. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ గ్రూప్-2 పరీక్షకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో.. శుక్రవారం ఎవరూ లేని టైంలో గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే.. ఆమె పరీక్ష వాయిదా కారణంగానే ఆమె తీవ్ర మనోవేదనకు గురైందని.. ఆ ఒత్తిడిలోనే ఆత్మహత్యకు పాల్పడిందని విద్యార్థి జేఏసీ ప్రతినిధులు, విపక్ష పార్టీ సభ్యులు, కొందరు ఉద్యోగాభ్యర్థులు ఆందోళనకు దిగారు. దీంతో శుక్రవారం అర్ధరాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆపై నిరసనకారుల్ని అరెస్ట్ చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మరోవైపు ఆత్మహత్య కాదని.. పరీక్షల వాయిదాతో ప్రభుత్వం చేసిన హత్య అంటూ రాజకీయ విమర్శలు తెరపైకి వచ్చాయి. ఇదిలా ఉండగానే.. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సైతం ప్రవళిక మృతిపై పోలీస్ శాఖను నివేదిక కోరారు. పోలీస్ బందోబస్తు మధ్య.. శనివారం మధ్యాహ్నం తర్వాత ప్రవళిక అంత్యక్రియలు పూర్తయ్యాయి. చివరకు.. ఆమె మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని దర్యాప్తు ద్వారా పోలీసులు తేల్చి చెప్పారు. -
మిస్టరీగా ఇంటర్ విద్యార్ధిని భవ్యశ్రీ అనుమానాస్పద మృతి
సాక్షి, చిత్తూరు జిల్లా: ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ అనుమానాస్పద మృతి కేసు మిస్టరీగా మారింది. న్యాయం కోసం పెనమూరు పీఎస్ ఎదుట బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆదివారం ఆందోళన చేపట్టారు. కాగా వేణుగోపాలపురానికి చెందిన భవ్యశ్రీ ఈ నెల 17న అదృశ్యమైంది. 18వ తేదీన విద్యార్ధిని తండ్రి మునికృష్ణయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. 20న ఎగువ చెరువు వద్ద బావిలో భవ్యశ్రీ శవమై కనిపించింది. పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా పోస్టుమార్టంలో ఆమె శరీరంపై ఎలాంటి గాయాలు లేవని ప్రాథమికంగా తెలిసిందని ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు. అఘాయిత్యం జరిగిందా, విషప్రయోగం జరిగిందా అని పరీక్షించేందుకు సాంపిల్స్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. నీటిలో మునిగి ఊపిరాడక చనిపోయిందా? ఎక్కడి నుంచి అయినా తెచ్చి ఆమె మృతదేహాన్ని బావిలో పడేశారా అన్న విషయం తేల్చేందుకు స్టెరమ్బోన్ సాంపిల్స్ను కెమికల్ అనాలసిస్ కోసం తిరుపతి ఆర్ఎఫ్ఎస్ఎల్కు పంపుతున్నట్లు పేర్కొన్నారు. ఆ నివేదికలు వచ్చిన అనంతరం అనుమా నితులను సమగ్రంగా, నిష్పాక్షికంగా విచారిస్తామన్నారు. విచారణను తప్పుదారి పట్టించేలా అసత్య ప్రచారాలను, నిరాధార వార్తలను ప్రచారంచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. చదవండి: రూ.2 లక్షలు లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, ఆర్ఐ -
కోరుట్ల దీప్తి కేసు.. పోలీసుల అదుపులో చందన, ఆమె బాయ్ ఫ్రెండ్?
సాక్షి, జగిత్యాల జిల్లా: సంచలనం సృష్టించిన కోరుట్ల దీప్తి మృతి కేసులో పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ కీలకం కానుంది. ఈ రోజు వైద్యులు ఇచ్చే పోస్ట్మార్టం నివేదికలో మరిన్ని విషయాలు బయటకురానున్నాయి. మంగళవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందిన దీప్తి ఒంటిపై స్వల్పగాయాలు ఉన్నట్లు సమాచారం. పోలీసుల అదుపులో చందన, ఆమె బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లు తెలిసింది. దీప్తి చెల్లె చందన, తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఆ రాత్రి ఇంట్లో మద్యం పార్టీ అనంతరం వెళ్లిపోవడంతో పలు అనుమానాలు నెలకొన్నాయి. చందన తాను అక్కను చంపలేదని తమ్ముడు సాయికి వాయిస్ మేసేజ్ పంపడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చందన ఆడియో కాల్స్పై పోలీసులు క్రాస్ చెక్ చేస్తున్నారు. అలాగే నిన్న అంతా హైలెట్ అయిన కోరుట్ల బస్టాండ్లో సీసీ కెమెరా ఫుటేజ్ చందన, ఆమె బాయ్ ఫ్రెండ్ది కాదని పోలీసులు తేల్చారు. చందన వాయిస్ మెసేజ్ ఆధారంగా విచారణ ముమ్మరం చేశారు. కోరుట్ల బస్టాండ్లో మంగళవారం ఉదయం కనిపించిన సీసీ ఫుటేజీ చిత్రాలు.. చందన, ఆమె బాయ్ఫ్రెండ్వి కావనే సమాచారంతో విచారణ గందరగోళంగా మారింది. అయితే, చందన బాయ్ ఫ్రెండ్ కారులో వచ్చి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చందన ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు మరోసారి పరిశీలిస్తున్నారు. ఆమె వాయిస్ మేసేజ్ వచ్చిన సెల్ఫోన్ ఆధారంగా రెండు బృందాలు హైదరాబాద్కు చేరుకుని గాలింపు చేపట్టాయి. చదవండి: నా తప్పేం లేదు.. నాకు అక్కను చంపే ఉద్దేశమే లేదు.. బంక శ్రీనివాస్రెడ్డి(దీప్తి తండ్రి) ఇంట్లో ఉన్న రూ.2 లక్షల నగదు, సుమారు 50 తులాల వరకు బంగారు ఆభరణాలు మాయమైనట్లు సమాచారం. ఇంట్లోనుంచి వెళ్లిపోయిన చందన.. డబ్బులు తాను తీసుకున్నట్లు వాయిస్ మేసేజ్లో చెప్పినా.. బంగారం విషయం ఎత్తలేదు. బంగారం సైతం చందన తీసుకెళ్లి ఉంటుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చందన తన క్లాస్మేట్ ఒకరితో కొన్నాళ్లుగా సన్నిహితంగా ఉంటోందని, అతడితో కలిసి డబ్బులు, నగలు తీసుకు వెళ్లి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. -
Korutla Death Mystery: కోరుట్ల టెక్కీ దీప్తి కేసులో సరికొత్త ట్విస్ట్
జగిత్యాల: కోరుట్ల సాఫ్ట్వేర్ దీప్తి మృతి కేసు ఊహించని మలుపు తిరిగింది. దీప్తి అనుమానాస్పద మృతి తర్వాత ఓ యువకుడితో వెళ్లిపోయిన దీప్తి సోదరి చందన పేరిట ఓ ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. తాము మద్యం సేవించిన మాట వాస్తవమేనని, కానీ తాను అక్కను చంపలేదంటూ.. తన సోదరుడు సాయికి చందన ఆ వాయిస్ మెసేజ్ పంపినట్లు తెలుస్తోంది. ‘‘అరేయ్ సాయి నేను చందక్కను రా.. నిజమెంటో చెప్పాలారా. దీప్తిక్క నేను తాగుదామనుకున్నాం. కానీ, నేను తాగలేదు. అక్కనే తాగింది. నేను నా ఫ్రెండ్ చేత తెప్పించా. అది నేను ఒప్పుకుంటా. కానీ, అక్కనే తాగింది. తాగిన తర్వాత తన బాయ్ఫ్రెండ్ను పిలుస్తా అంది. నేను వద్దన్నా.. అయినా పిలుస్తా అంటే చివరికి నీ ఇష్టం సరే అన్నా.. నేను ఇంట్లోంచి వెళ్లిపోదాం అనుకున్నాం. అది నిజం. అక్కకి చెప్పి వెళ్లిపోదాం అనుకున్నాం. అక్క హాఫ్ బాటిల్ కంప్లీట్ చేసింది. ఫోన్ మాట్లాడి.. సోఫాలో పడుకుంది. రెండుసార్లు లేపాను. సరే పడుకుందని డిస్టర్బ్ చేయొద్దని వెళ్లిపోయా. ఛాన్స్ దొరికిందని వెళ్లిపోయిన. నా తప్పేం లేదు సాయి. నాకు అక్కను చంపే ఉద్దేశం లేదు.. నన్ను నమ్ము సాయి.. నా తప్పేం లేదు.. ప్లీజ్రా నమ్మురా మేం రెండు బాటిల్స్ తెప్పించుకున్నాం. నేను బ్రీజర్ తాగా. అక్క వోడ్కా తాగింది. తర్వాత నాకు ఏమైందో తెలీదు. నేనైతే వెళ్లిపోయిన ఇట్లా అయితదనుకోలేదు. నేనెందుకు చంపుత సాయి.. నేనేందుకు మర్డర్ చేస్తా!.’’ అంటూ వాయిస్ మెసేజ్లో ఉంది. దీప్తి ఒంటిపై గాయాలు కోరుట్ల దీప్తి అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దీప్తి శరీరంపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఎడమ చేయి కూడా విరిగిపోయి ఉండడంతో.. ఇదే హత్యేననే నిర్ధారణకు వచ్చారు పోలీసులు. కిచెన్లో వోడ్కా, బ్రీజర్ బాటిళ్లు, వెనిగర్, నిమ్మకాయలు ఉండటంతో రాత్రి వేళ దీప్తి, చందన కలిసి మద్యం సేవించారా..? అనే అనుమానాలు వ్యక్తం కాగా.. తాజా ఆడియోక్లిప్తో అవి నిర్ధారణ అయ్యాయి. చందన ప్రియుడితో కలిసి వెళ్లిపోయే ప్రయత్నాన్ని దీప్తి అడ్డుకునే క్రమంలో గొడవ జరిగి ఆ గొడవలో తగలరాని చోట దెబ్బతగిలి దీప్తి చనిపోయిందా..? అనే సందేహాలు బలపడుతున్నాయి. ఇదిలా ఉంటే.. మృతురాలు దీప్తి సోదరి చందన దొరికితేనే ఈ కేసు చిక్కుముడి వీడేది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వాళ్లు నిజామాబాద్ వైపు వెళ్లే బస్సు ఎక్కినట్లు తెలుస్తోంది. దీంతో చందన ఆచూకీ కోసం రెండు బృందాలను రంగంలోకి దించారు పోలీసులు. మరోవైపు చందనతో ఉన్న యువకుడు ఎవరు? అనే దానిపైనా ఆరాలు తీస్తున్నారు. కేసు నేపథ్యం ఇదే.. ఆంధ్రకు చెందిన బంక శ్రీనివాస్రెడ్డి–మాధవి దంపతులు సుమారు పాతికేళ్లుగా కోరుట్లలోని భీమునిదుబ్బలో స్థిరపడ్డారు. ఇటుకబట్టీ వ్యాపారం చేసుకునే శ్రీనివాస్రెడ్డికి కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుమారుడు సాయి బెంగళూర్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్. పెద్ద కూతురు దీప్తి(24) పుణేలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా వర్క్ఫ్రం హోం పద్ధతిన ఇంట్లో నుంచి పనిచేస్తోంది. చిన్నకూతురు చందన ఇటీవల బీటెక్ పూర్తి చేసింది. సోమవారం ఉదయం శ్రీనివాస్రెడ్డి– మాధవి హైదరాబాద్లోని బంధువుల గృహాప్రవేశం కార్యక్రమానికి వెళ్లగా దీప్తి, చందన మాత్రమే ఇంట్లో ఉన్నారు. రాత్రి 10 గంటల వరకు తండ్రితో అక్కాచెల్లెళ్లు ఫోన్లో మాట్లాడారు. మంగళవారం ఉదయం శ్రీనివాస్రెడ్డి తన కూతుళ్లతో మాట్లాడటానికి ప్రయత్నించగా పెద్ద కూతురు దీప్తి ఫోన్ లిఫ్ట్ కాలేదు. చిన్నకూతురు చందన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. రెండుమూడు సార్లు ఫోన్లో కూతుళ్లతో మాట్లాడేందుకు ప్రయత్నించిన శ్రీనివాస్రెడ్డి చివరికి పక్క ఇంట్లో ఉన్నవారికి ఫోన్ చేశాడు. తమ కూతుళ్లు ఫోన్ ఎత్తడం లేదని చెప్పి, ఓ సారి ఇంటిదాకా వెళ్లి చూడమని కోరాడు. పక్క ఇంట్లో ఉండే ఓ మహిళ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో శ్రీనివాస్రెడ్డి ఇంట్లోకి వెళ్లి చూడగా తలుపు బయట నుంచి గొళ్లెం పెట్టి ఉంది. పిలిస్తే ఎవరూ పలకలేదు. దీంతో తలుపు గొళ్లెం తీసి లోపలికి వెళ్లి చూడగా పెద్ద కూతురు దీప్తి సోఫాలో పడిపోయి ఉంది. చుట్టుపక్కల వారికి విషయం చెప్పగా వారు దీప్తిని పరిశీలించి అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. బంధువులు, పోలీసులకు సమాచారం ఇవ్వగా మెట్పల్లి డీఎస్పీ వంగ రవీందర్రెడ్డి, సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సైలు కిరణ్, చిరంజీవి ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. -
మాదాపూర్ నారాయణ కాలేజీ విద్యార్థి బలవన్మరణం
సాక్షి, హైదరాబాద్: కార్పోరేట్ చదువులు మరో విద్యార్థిని బలిగొన్నాయి!. రాజేంద్రనగర్లో ఓ కార్పొరేట్ కళాశాల ఉదంతం మరువకముందే.. మాదాపూర్ నారాయణ కాలేజీలో సెకండ్ ఇయర్ విద్యార్థి ఒకరు శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన గదిలో ఫ్యాన్కి తాడుతో ఉరేసుకుని ఆత్మాహుతి చేసుకున్నాడు. కనక రాజు అనే విద్యార్థి.. మాదాపూర్ నారాయణ కాలేజీలో ఇంటర్ బైపీసీ సెకండియర్ చదువుతున్నాడు. మధ్యాహ్న సమయంలో అటెండెన్స్ సమయంలో కనకరాజు లేకపోవడంతో.. సిబ్బంది అతని గదికి వెళ్లి చూశారు. అక్కడ విగతజీవిగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు కనకరాజు. చదువులో బాగా రాణించేవాడని, ఫస్ట్ ఇయర్లో కూడా మంచి మార్కులు వచ్చాయని, అతనికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో తమకు తెలియదని కళాశాల యాజమాన్యం చెబుతోంది. మరోవైపు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. తల్లిదండ్రులకు సమాచారం అందించామని, వాళ్లను ప్రశ్నిస్తే కనరాజుకి ఉన్న సమస్యేంటో బయటపడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. -
మై వైఫ్ .. శివాని గురించి రమేశ్ చివరిమాటలు
సాక్షి, క్రైమ్: విశాఖలో వివాహేతర సంబంధంతో భర్త రమేశ్ను ప్రియుడితోపాటు హత్య చేసిన ఉదంతంలో సంచలన వీడియోలు బయటకు వచ్చాయి. భర్తను హత్యకు ముందు శివాని చేసిన పనికి పోలీసులు సైతం షాక్ తిన్నారు. రమేశ్కు మద్యం తాగించి.. ఆ సమయంలో తన గురించి పొగిడినదంతా ఆమె వీడియోలు తీయించుకుంది. కానిస్టేబుల్ రమేష్ హత్య కేసు లో కీలక వీడియోలు సాక్షి టివి చేతికి అందాయి. రమేశ్ని చంపే ముందూ.. తన మీద అనుమానం రాకుండా భర్తతో ప్రేమగా ఉన్నట్టు ఆమె వీడియోలు రికార్డు చేసింది. భర్తకి మటన్ వండి పెట్టీ.. మందు తాగించి.. ‘నా భార్య మంచిది’ అని రమేశ్తో చెప్పించింది శివాని. ఆపై మద్యం మత్తులో జోగుతున్న భర్తను మంచంపై పడుకోబెట్టినదంతా కూడా రికార్డు అయ్యింది. మా ఆవిడ చాలా తెలివైంది. గైడెన్స్ ఇస్తే ఏదైనా సాధిస్తుంది. నా వైఫ్.. మై లైఫ్. చాలా ధైర్యవంతురాలు. నేను ఉన్నంత వరకు ధైర్యం చూపిస్తుంది. నేను ఎప్పుడు ఉంటానో.. ఎప్పుడు పోతానో తెలియదు. నేను పోయాక కూడా అదే ధైర్యం చూపించాలి. నా వైఫ్ బెస్ట్ అంటూ మాట్లాడిన మాటలు అందులో ఉన్నాయి. భర్త హత్య తర్వాత గుండెపోటుతో చనిపోయాడని నాటకం ఆడే క్రమంలో.. తనపై ఎలాంటి అనుమానాలు రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఈ పని చేసింది శివాని. ఆమె ఫోన్ నుంచి వీడియోలు సేకరించిన పోలీసులు.. నేరస్తురాలి తెలివితేటలు చూసి షాక్ తిన్నారు. 2009 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్ బర్రి రమేష్(35). 2012లో శివాని(జ్యోతి)తో వివాహం జరిగింది. వీళ్లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదర్శనగర్లో ఉంటూ వన్టౌన్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం ఉదయం అతను చనిపోయినట్లు ఎంవీపీ పోలీసులకు సమాచారం వచ్చింది. రాత్రి మద్యం సేవించి పడుకున్నాడని, తెల్లవారి లేచి చూసేసరికి చనిపోయి ఉన్నాడని అతని భార్య శివాని(శివజ్యోతి) పోలీసులకు చెప్పింది. అతని ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు సమయంలో ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. తమదైన శైలిలో విచారించడంతో అసలు వాస్తవాలు బయటకొచ్చాయి. పోస్టుమార్టం నివేదికలో సైతం అతను ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీంతో పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడంతో కుట్రకోణం వెలుగుచూసింది. రామారావు అనే టాక్సీ డ్రైవర్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న రమేష్ భార్య శివాని.. అతని మోజులో కట్టుకున్న భర్తను మట్టుబెట్టింది. రామా రావు విషయంలో గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. కాగా.. మంగళవారం రాత్రి ఆమె రమేష్తో బాగా మద్యం తాగించి.. దాన్ని వీడియో కూడా తీసింది. కొంతసేపటికి అతను నిద్రలోకి జారుకున్నాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఆమె ప్రియుడు రామారావుకు సమాచారం ఇవ్వడంతో.. అతని స్నేహితుడు నీలాతో కలిసి ఇంట్లోకి వచ్చాడు. ఆమె సమక్షంలోనే అతనిని వీరు హత్య చేశారు. నీలా రమేష్కి ఊపిరాడకుండా దిండుతో నొక్కిపట్టుకోగా.. రామారావు కదలకుండా అతని కాళ్లు పట్టుకున్నాడు. కొద్దిసేపటికి ఊపిరాడక రమేష్ మృతి చెందాడు. ఇలా పక్కాగా రమేష్ను హతమార్చిన శివాని, అతని ప్రియుడు రామారావు దీన్ని సాధారణ మృతిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే తొలుత మద్యం తాగి చనిపోయాడని శివాని పోలీసులకు చెప్పినట్లు సీపీ వెల్లడించారు. ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వాస్తవాలను రాబట్టినట్లు తెలిపారు. శివానీని ఏ1గా, ప్రియుడు రామారావును ఏ2గా, వారికి సహకరించిన నీలాను ఏ3గా నిర్ధారించి కేసు నమోదు చేశారు. అనంతరం వారిని రిమాండ్కు తరలించారు. ఈ అఘాయిత్యంలో శివాని పెద్దమ్మ కూతురు పైడమ్మకు కూడా భాగం అయ్యిందనే అనుమానాలు ఉన్నాయి. పైడమ్మ వల్లే తనకు రామారావు పరిచయం అయ్యాడని శివాని పోలీసులకు చెప్పింది. అంతేకాదు.. కాన్ఫరెన్స్ కాల్స్లో మాట్లాడినట్లు నిర్థారించిన పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. అయితే తాను అమాయకురాలినని పైడమ్మ వాపోతోంది. -
విశాఖ బాలుడి మృతి కేసు...వెలుగులోకి వచ్చిన కీలక విషయాలు
-
మిస్టరీగా వికారాబాద్ శిరీష కేసు
సాక్షి, వికారాబాద్: కాండ్లాపూర్ నర్సింగ్ విద్యార్థిని శిరీష హత్య కేసు మిస్టరీగా మారుతోంది. యువతి మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించి కూడా పోలీసులు ఏం తేల్చలేకపోయారు. ఈ క్రమంలో కాండ్లాపూర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శిరీష మృతిని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని కాండ్లాపూర్ గ్రామస్తులు ధర్నా చేపట్టారు. అంతకు ముందు శిరీష తండ్రిపైనా దాడి చేశారు. శిరీషను హత్య చేసిన ఆనవాళ్లే కనిపిస్తున్నాయని, వాస్తవాల్ని బయటపెట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో యువతి చేయి, కాళ్లపై బ్లేడుతో కోసిన గాయలు ఉండడంతో పోలీసులు దాడిగా అనుమానిస్తున్నారు. లైంగిక దాడి జరిగిందా? అనే అనుమానాల నేపథ్యంలో మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించారు. సోమవారం ఉదయం శిరీష ఇంటికి చేరుకున్న పోలీసులు.. డాక్టర్ వైష్ణవి నేతృత్వంలో రీపోస్టుమార్టం నిర్వహించారు. అయితే ఇందులోనూ పోలీసులు ఏం తేల్చలేదు. ‘‘యువతి కళ్లకు కట్టెలు లేదంటే రాళ్లు గుచ్చుకుని ఉండొచ్చు. పరీక్ష రిపోర్టును ఎఫ్ఎస్ఎల్(FSL)కు పంపించాం. రిపోర్టు రావాలి’’ అని డాక్టర్ వైష్ణవి తెలిపారు. అయితే అత్యాచారం జరిగిందా? అనే ప్రశ్నకు ఆమె స్పష్టత ఇవ్వలేదు. రిపోర్ట్ వస్తేనేగానీ తెలియదు చెప్పారు. ఈ క్రమంలో ఆమె అక్కడి నుంచి హడావిడిగా వెళ్లిపోగా.. గ్రామస్తులు ఆగ్రహానికి లోనయ్యారు. ఆత్మహత్యగా చిత్రీకరించి కేసును మూసేసే యత్నం జరుగుతుందని ఆరోపిస్తూ శిరీష బంధువులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ‘‘మా ఇంట్లోనూ ఆడవాళ్లు ఉన్నారు. రేపు మా వాళ్లకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాదని గ్యారెంటీ ఏంటి?. కేసును పక్కదోవ పట్టించే యత్నం చేస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామ’’ని గ్రామస్తులు అంటున్నారు. శాంతింపజేసిన పోలీసులు శిరీష కేసులో ఆందోళన చేపట్టిన కాండ్లాపూర్ గ్రామస్తుల్ని పోలీసులు శాంతింపజేశారు. నచ్చజెప్పడంతో వాళ్లు నిరసనను ఆపినట్లు తెలుస్తోంది. నోరు విప్పని బావ ఇక శిరీష హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న శిరీష బావ అనిల్ నోరు విప్పలేదు. ఆమె ఇంట్లోనే ఆత్మహత్యకు యత్నించిందని పోలీసులకు అనిల్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇంట్లోనే చేతిపై, గొంతు దగ్గర కోసుకుని తనను, ఆమె తండ్రిని బెదిరించిందని అనిల్ చెప్పాడు. ఈ క్రమంలో తాను ఆమె ఫోన్ లాక్కున్నాడని, ఆమె బయటి నుంచి గడియ పెట్టి ఇంట్లోంచి వెళ్లిపోయినట్లు అనిల్ పోలీసులకు చెప్పాడు. ఆపై ఆమె ఊరు శివారులో ఉన్న కుంటలో దూకి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తొలుత భావించారు. అయితే కళ్లు పొడిచి ఉండడం, కాళ్లు చేతులకు గాయాల నేపథ్యంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో.. ఇంట్లో గొడవ జరిగితే శిరీష తండ్రి మాత్రం పొంతన లేని సమాధానం చెప్తుండడం, మోకాళ్ళ లోతు నీటి కుంటలో ఆత్మహత్య ఎలా సాధ్యమవుతుందనే అనుమానాలు ఉన్నాయి. అసలు ఇంట్లో గొడవలకి కారణాలేంటన్న కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇదీ చదవండి: అప్సర మొదటి భర్త ఆత్మహత్య.. కార్తీక్ తల్లి సంచలన ఆరోపణలు -
అప్సరను పూజారి సాయికృష్ణ అందుకే చంపాడు
సాక్షి, క్రైమ్: శంషాబాద్ పరిధిలో నర్కుడ వద్ద జరిగిన దారుణ హత్య కేసును పోలీసులు చేధించారు. పక్కా క్రిమినల్ ఆలోచనతోనే అప్సర(30)ను పూజారి సాయికృష్ణ(36) చంపాడని పోలీసులు వెల్లడించారు. అప్సరను గాఢంగా ప్రేమించానని చెప్పుకుని తిరిగిన సాయికృష్ణ ఎందుకు చంపాల్సి వచ్చింది?, చంపి ఆపై సాక్ష్యాలను మాయం చేసేందుకు ఏం చేశాడనే వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. నిందితుడు సాయికృష్ణ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు.. సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయానికి సమీపంలో ఉన్న గుడిలో సాయికృష్ణ పెద్దపూజారి. ఆ దగ్గర్లోనే శ్రీ వెంకటేశ్వరకాలనీలో అతను ఉంటున్నాడు. ఇక ఈ గుడి పక్కనే ఉండే ఇంటిలో అప్సర ఉంటోంది. గుడికి వచ్చే క్రమంలో అప్సరతో సాయికృష్ణకు పరిచయం ఏర్పడింది. శంషాబాద్ గోశాలకు ఇద్దరూ కలిసి వెళ్లేవారు. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. నిందితుడు సాయికృష్ణకు ఇదివరకే వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా అప్సర సాయికృష్ణను ఇష్టపడింది. గతంలో అప్సర గర్భం దాల్చడంతో.. అబార్షన్ చేయించినట్లు సాయికృష్ణ చెప్పాడు. ఇతరులతో చనువుగా ఉండడం, పెళ్లి చేసుకోవాలని అప్సర ఒత్తిడి చేయడంతోనే ఘాతుకానికి పాల్పడ్డాడని ఇప్పుడు అంటున్నాడు. శంషాబాద్ సీఐ శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 5వ తేదీన తన అక్క కూతురు కనిపించకుండాపోయిందని సాయికృష్ణ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది. అయితే.. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఈ కేసును ఛేదించాం. జూన్ 3వ తేదీన నర్కుడ దగ్గర్లో చంపేశాడు. ఆపై మృతదేహాన్ని ఓ కవర్లో చుట్టి కారులో వేసుకుని.. సరూర్ నగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వెనకాల ఉన్న డ్రైనేజీలో పడేశాడు. ఈ విషయం అప్సర కుటుంబ సభ్యులెవరికీ తెలియదు. అప్సర మిస్సింగ్ కేసులో అనుమానం రావడంతోనే సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నాం. విచారణలో.. నిజం ఒప్పుకున్నాడు. రెండోసారి గర్భం? సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని మ్యాన్ హోల్ లో నుండి అప్సర మృతదేహన్ని పోలీసులు శుక్రవారంనాడు వెలికితీశారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆమె రెండోసారి గర్భం దాల్చిందని అనుమానాలు ఉన్నాయి. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు భావిస్తున్నారు పోలీసులు. ఇతరులతో చనువుగా ఉన్న అప్సర.. వాళ్ల ద్వారా గర్భం దాల్చి ఉంటుందని సాయికృష్ణ అనుమానించి ఉంటాడని, దీనికి తోడు ఆమె పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో చంపేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తే.. ఈ చిక్కుముడి వీడే అవకాశం ఉంది. సాయికృష్ణ అలా చెప్పాడు: అప్సర తల్లి పూజారి ఘాతుకంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పూజారి అయ్యి ఉండి ఇలా చేస్తాడని ఊహించలేదని అప్సర తల్లి వాపోతోంది. అప్సర గతంలో తమిళ చిత్రంలో నటించింది. అయితే ఆవైపు వద్దని చెప్పి చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చేశాం. ఆ తర్వాత గుడిలో అప్సర-సాయికృష్ణకు పరిచయం ఏర్పడింది. సాయికృష్ణ తరచూ మా ఇంటికి వస్తుండేవాడు. మా అమ్మాయితో సాయికృష్ణకు ఉన్న సంబంధం ఏంటో నాకు తెలియదు. అయితే.. జూన్ 3వ తేదీన మా అమ్మాయి కోయంబత్తూరు వెళ్తున్నట్లుగా చెప్పి వెళ్లింది. సాయి తనను శంషాబాద్లో దించుతాడని చెప్పింది. కానీ, మరుసటి రోజున మా అమ్మాయి నుంచి ఎలాంటి సమాచారం లేదు. సాయి కృష్ణని అడిగితే.. తన స్నేహితులతో అప్సర భద్రాచలం వెళ్లిందని చెప్పాడు. అంబేద్కర్ స్టాచ్యూ వద్ద దించానని అన్నాడు. కానీ, ఆమె భద్రాచలం వెళ్లిన ఆనవాలు లభించలేదు. మా అమ్మాయిని ఎవరితో భద్రాచలం పంపావని నిలదీశాను. కానీ, అతని దగ్గరి నుంచి బదులు రాలేదు. సాయికృష్ణని పోలీసులు గట్టిగా నిలదీస్తే.. అప్పుడు అప్సరను చంపానని చెప్పాడు. వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే అప్సరను చంపానని సాయి కృష్ణ అంటున్నాడు. అందులో వాస్తవం ఉండకపోవచ్చు. సాయికృష్ణకు ఉరి శిక్ష పడాల్సిందే అని అప్సర తల్లి డిమాండ్ చేస్తోంది. అప్సర మంచిది ఈ ఏరియాలోనే సాయికృష్ణ పెద్ద పూజారి. అప్సరతో అతనికి మంచి స్నేహం ఉంది. సాయికృష్ణ రాత్రి 11 గంటల వరకు అప్సర ఇంట్లోనే ఉండేవాడు. ఒక్కోసారి ఇద్దరూ కలిసి రాత్రి 12 తర్వాత కూడా బైక్ మీద బయటకు వెళ్లేవాళ్లు. కానీ, అప్సర చాలా మంచిది. పూజారి ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడంటే నమ్మలేకపోతున్నాం అని అప్సర ఉంటున్న ఇంటి యజమాని చెప్తున్నాడు. వెలుగులోకి కీలక విషయాలు కోయంబత్తూరు వెళ్తున్నానని, సాయికృష్ణ తనను డ్రాప్ చేస్తాడని తల్లికి చెప్పి ఇంట్లో చెప్పి బయల్దేరింది అప్సర. ఇద్దరూ కలిసి ఫోర్డ్ కారులో శంషాబాద్ రాళ్ల గూడ వైపు వెళ్లారు. అక్కడ భోజనం చేశారు. ఆపై కారులో ఫ్రంట్ సీట్లో రిలాక్స్ మోడ్లో పడుకుంది అప్సర. ఇదే అదనుగా హత్య కోసమే తెచ్చిన బెల్లం దంచే దుడ్డుకర్రను బయటకు తీశాడు సాయికృష్ణ. ఆ కర్రతోనే ఆమె తలపై బాది చంపేశాడు. ఆపై కవర్లో ఆమె డెడ్బాడీని ఉంచి ఇంటికి తీసుకొచ్చాడు. ఆ కారు రోజంతా ఇంటి ముందే పార్క్ చేశాడు. ఆ మరుసటి రోజు మ్యాన్హోల్లో అప్సర మృతదేహాన్ని పడేసి.. పైన మట్టి కప్పి వెళ్లిపోయాడు. హత్యకు ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. -
తనను పెళ్లి చేసుకోవాలని నా భర్తను వేధించింది.. మమత కీలక వ్యాఖ్యలు
సాక్షి, పహాడీషరీఫ్: మృతదేహాన్ని డ్రమ్ములో కుక్కి చెరువులో పడేసిన ఘటనలో స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనలో మృతుడు చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో అదృశ్యమైన పూరన్ సింగ్గా గుర్తించారు. కాగా, పూరన్ సింగ్పై మృతిలో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. పూరన్ సింగ్ భార్య సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మృతికి జయదేవీ అనే మహిళే కారణమని చెప్పుకొచ్చారు. వివరాల ప్రకారం, పూరన్ సింగ్ మృతిపై తాజగా ఆయన భార్య మమతా సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. జయదేవీ తనను పెళ్లి చేసుకోవాలని నా భర్త వెంట పడుతోంది. ఆయన్ను వేధింపులకు గురిచేసింది. నన్ను వదిలేసి తనను పెళ్లి చేసుకోవాలని నా భర్తను గత కొద్దిరోజులుగా బెదిరిస్తోంది. తనను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చింది. నా భర్తను జయదేవీనే కిరాతకంగా చంపేసింది. పూరన్ సింగ్ను ట్రాప్ చేసి ప్లాన్ ప్రకారమే హత్య చేసింది అని కామెంట్స్ చేశారు. అంతకు ముందు, ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 25న సాయంత్రం చెరువులో మృతదేహం లభ్యం కావడంతో పరిసర పోలీస్స్టేషన్లలో అదృశ్యమైన కేసులను పరిశీలించారు. చాంద్రాయణగుట్ట పరిధిలోని కేసుగా పోలీసులు నిర్ధారించారు. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దీన్ దయాళ్ కుమారుడు పూరన్సింగ్ (30) హైదరాబాద్కు వలస వచ్చి చాంద్రాయణగుట్టలోని బండ్లగూడ పటేల్నగర్లో పానీపూరి బండి నడుపుకొంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ నెల 22న రాత్రి 10 గంటలకు బార్కాస్లోని వివాహానికి హాజరవుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడం.. స్థానికంగా గాలించినా ఫలితం లేకపోవడంతో అతని భార్య మమతా సింగ్ 23న రాత్రి 7 గంటలకు చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో మృతుడి వివరాలు తెలియరావడంతో పూరన్సింగ్కు ఉన్న విబేధాల విషయమై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఇది కూడా చదవండి: మాజీ మంత్రి నవ కిషోర్ దాస్ హత్యలో కీలక పరిణామం -
శ్వేత మృతి కేసులో కీలక మలుపు..
సాక్షి, విశాఖపట్నం: వివాహిత శ్వేత మృతి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్వేత అనుమానాస్పద మృతిపై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో శ్వేత పేరెంట్స్ ఆరోపణల మేరకు, సూసైడ్ లెటర్ ఆధారంగా ఆమె.. భర్త, అత్త, మామ, ఆడపడుచు భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. కాసేపట్లో వారిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇక, పోలీసులు.. శ్వేత ఆడపడుచు భర్తపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. మరోవైపు.. శ్వేత కేసులో పోస్టుమారం రిపోర్టు కీలకంగా మారనుంది. ఇదిలా ఉండగా.. ఈ కేసులో మరో ఊహించని మలుపు చోటుచేసుకుంది. శ్వేతను ఆమె భర్త మణికంఠ, అత్తమామలు, ఆడపడుచు అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తే, మణికంఠ సోదరి భర్త సత్యం లైంగిక వేధింపులకు గురి చేసినట్లు మూడో పట్టణ పోలీస్స్టేషన్లో ఆమె తల్లి రమ ఫిర్యాదు చేశారు. ఒకటి రెండు సార్లు శ్వేతను ఇబ్బంది పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మణికంఠ సోదరి భర్తపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అత్త, ఆడపడుచులపై వరకట్న వేధింపుల కేసు కట్టి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శ్వేత మృతదేహాన్ని ఆమె తల్లి, బంధువులకు అప్పగించగా.. కాన్వెంట్ కూడలి సమీపంలోని చావులమదుం శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు.. శ్వేత మృతదేహం లభ్యమైన ప్రాంతంలో కూడా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిసింది. ఈ కేసులో పోస్టుమార్టం నివేదికతో పాటు ఆమె సెల్ఫోన్ కీలకంగా మారింది. ప్రస్తుతం ఆమె కాల్డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇలా పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: వీడియో: ర్యాపిడో బైకర్ వికృత క్రీడ.. మహిళకు చేదు అనుభవం -
Vizag Beach: వివాహిత శ్వేత మృతి కేసులో ఊహించని ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: వివాహిత శ్వేత అనుమానాస్పద మృతి కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఈ ఘటనలో పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. భర్త మణికంఠ చెల్లెలి భర్తపైన లైంగిక వేధింపుల కేసు నమోదైంది. శ్వేత తల్లి రమాదేవి ఫిర్యాదుతో త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్వేత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. విశాఖలోని జ్ఞానాపురం స్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్టుతోపాటు శ్వేత సెల్ఫోన్ కీలకంగా మారింది. మృతురాలి మొబైల్ను పరిశీలిస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. కాగా అత్తింటి వేధింపులతో విశాఖ బీచ్లో ఐదు నెలల గర్భిణి శ్వేత ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. చదవండి: విశాఖ బీచ్లో గర్భిణీ మృతదేహం.. పెళ్లైన నెల నుంచే వేధింపులు.. సూసైడ్ నోట్ స్వాధీనం అసలేం జరిగిందంటే.. పెదగంట్యాడ మండలం నడుపూరులో గురువెల్లి మణికంఠ తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. దొండపర్తికి చెందిన శ్వేత(24)తో గత ఏడాది మణికంఠకు వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. మణికంఠ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. వారం రోజుల కిందట అతను హైదారాబాద్ వెళ్లాడు. శ్వేతను ఇక్కడే అతని తల్లిదండ్రుల వద్ద ఉంచాడు. మంగళవారం సాయంత్రం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆమె సాయంత్రం 6.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. తర్వాత ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆమె అత్తామామలు బంధువులు, స్నేహితుల ఇళ్లలో వాకబు చేశారు. ఫలితం లేకపోవడంతో ఆమె మామ శాంతారావు అర్ధరాత్రి 12 గంటల సమయంలో న్యూపోర్టు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఆర్.కె.బీచ్లో మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు 3వ పట్టణ పోలీసులు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని శ్వేత ఫొటోతో సరిపోల్చి.. న్యూపోర్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన భర్తతో ఉన్న కుటుంబ కలహాలతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో చిట్టీ(మణికంఠ ముద్దు పేరు) నేను లేకపోయినా నువ్వు బిందాస్గా జీవిస్తావని నాకు తెలుసు. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్. బిగ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ థింగ్ అని రాసి ఉంది. చదవండి: సొంత కొడుక్కే షాకిచ్చిన తండ్రి.. ఇంటికొచ్చిన ప్రియురాలితో కలిసి.. -
మానవ మృగాలు.. అంజలిని కాపాడే వీలున్నా..
క్రైమ్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ కంజావాలా మృతి కేసులో ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు చార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితుల(నలుగురు ప్రధాన నిందితులు) పేర్లను చేరుస్తూ.. 20 ఏళ్ల అంజలి మృతికి కారణమయ్యారంటూ ఢిల్లీ పోలీసులు ఛార్జ్షీట్లో పొందుపరిచారు. అంతేకాదు ఆమెను కాపాడే వీలున్నా అందుకు కనీస ప్రయత్నం చేయలేదని, పైగా ఆమెను చంపే ఉద్దేశంతోనే కారుతో ఈడ్చుకెళ్లారని పోలీసులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఘటన సమయంలో బాధితురాలు అంజలిని కాపాడే అవకాశాలు రెండుసార్లు కలిగినా కనికరం లేకుండా నిందితులు ముందుకు సాగారని పోలీసులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. మొదట.. స్కూటీపై వెళ్తున్న ఆమెను కారుతో ఢీ కొట్టారని, అప్పుడే ఆగి ఆమెను రక్షించే వీలున్నా ఆ ప్రయత్నం చేయలేదని తెలిపారు. రెండు.. ఢీ కొట్టిన తర్వాత ఆమె కారు కింద ఇరుక్కుందని వాళ్లకు తెలుసు. దిగి ఆమెను కాపాడే అవకాశం అప్పటికీ ఉంది. అయినా నిందితులు ఉద్దేశపూర్వకంగానే ఆమెను సుల్తాన్పురి నుంచి కంజావాలా మధ్య 12 కిలోమీటర్లపాటు ఈడ్చుకెళ్లారని ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొని ఇంటికి వెళ్తున్న అంజలి, ఆమె స్నేహితురాలిని తొలుత కారుతో ఢీ కొట్టారు నిందితులు. అంజలి కాలు కారు కిందే ఇరుక్కుపోగా.. స్నేహితురాలు కాస్త దూరంలో కింద పడిపోయి భయంతో అక్కడి నుంచి పారిపోయింది. ఆపై అంజలిని కారుతో ఈడ్చుకుంటూ వెళ్లిపోయారు నిందితులు. ఈ క్రమంలో ఆమె ప్రాణం పోతుందని తెలిసినా కూడా నిందితులు ముందుకు సాగడం ఘోరం. ఈ కేసులో నలుగురు నిందితులు అమిత్ ఖన్నా, కృష్ణన్, మనోజ్ మిట్టల్, మిథున్లపై హత్య నేరాభియోగాలను ఛార్జ్షీట్లో నమోదు చేశారు పోలీసులు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం వాళ్లపై అభియోగాలు నమోదు అయ్యాయి. స్కూటీని ఢీ కొట్టి 500-600 మీటర్ల దూరం వెళ్లాక.. డ్రైవర్ పక్క సీట్లో ఉన్న నిందితుడు, వెనకాల ఉన్న నిందితుడు ఇద్దరూ.. ఆమె ఇంకా కారు కింద ఉందా? లేదా? అనేది చూశారు. ఉందని నిర్ధారించుకున్న తర్వాత కూడా కారును ముందుకు పోనివ్వాలని డ్రైవర్ సీట్లో ఉన్న నిందితుడికి సూచించారు. అలా ముందుకు వెళ్లే క్రమంలో.. ఆమె దుస్తులు చినిగిపోయి, వీపు చిట్లిపోయి వెన్నుపూస బయటకు వచ్చేసింది. పుర్రె భాగం సైతం పగలిపోయింది. ఈడ్చుకెళ్లే దారిలోనే ఆమె ప్రాణం పోయిందని శవ పరీక్షలో వెల్లడైంది. తాము చేస్తున్న పని ఆమెను గాయపర్చడమే కాదు.. ప్రాణాలకు ముప్పు కలిగించేదని తెలిసి కూడా మృగాల్లా నిందితులు వ్యవహరించారని, ఈ కేసులో మద్యం మత్తు అనేది కేవలం తప్పించుకునే సాకుగానే కనిపిస్తోంది తప్ప నిందితులు ఘటన సమయంలో స్పృహలోనే ఉన్నారని, వాళ్లకు ఆ నేర తీవ్రత గురించి కూడా తెలుసని పోలీసులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఈ ఛార్జ్షీట్ ఆధారంగా ఢీల్లీ రోహిణి కోర్టు ఏప్రిల్ 18వ తేదీన వాదనలు విననుంది. -
నటి అనుమానాస్పద మృతి కేసు.. పోలీసుల అదుపులో సింగర్
ప్రముఖ బుల్లితెర నటి ఆకాంక్ష దూబే మృతి కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు ప్రముఖ సింగర్ సమర్ సింగ్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో హోటల్లోని సీసీటీవీ దృశ్యాలు మరింత కీలకంగా మారాయి. చనిపోయే కొన్ని నిమిషాల ముందు ఆమె ఓ వ్యక్తితో ఉన్న దృశ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసలేం జరిగిందంటే? భోజ్పురి నటి ఆకాంక్ష ఓ సినిమా షూటింగ్ కోసం వారణాసి వెళ్లారు. అక్కడే ఆమె ఓ హోటల్లో ఉంటూ షూటింగ్లో పాల్గొన్నారు. మార్చి 26న షూటింగ్ ముగిసిన వెంటనే హోటల్కు తిరిగొచ్చిన ఆకాంక్ష దూబే అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. చనిపోవటానికి కొన్ని నిమిషాల ముందు ఓ గుర్తు తెలియని వ్యక్తితో ఆమె మాట్లాడినట్లు తెలుస్తోంది. సీసీటీవీలో ఆకాంక్షతో పాటు కనిపించిన ఆ వ్యక్తి ఎవరో ఇంకా వివరాలు తెలియరాలేదు. ఆకాంక్ష మరణంతో అతడికి ఏదైనా సంబంధముందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆకాంక్ష మరణం హత్య అని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రముఖ సింగర్ సమర్ సింగ్ హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. ఆమెకు గతంలో సమర్ సింగ్ అనే సింగర్తో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు తెలుస్తోంది. -
H3N2 Virus: భారత్లో రెండు మరణాలు.. ఎక్కడంటే?
సాక్షి, ఢిల్లీ: హెచ్3ఎన్2 ఇన్ప్లూయెంజా ఫ్లూ.. ఈ వైరస్ బారినపడిన వారి సంఖ్యలో దేశంలో రోజురోజుకు పెరిగిపోతోంది. మరోవైపు.. ఈ వైరస్ కారణంగా దేశంలో ఇద్దరు మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తోంది. అయితే, ఈ ఫ్లూ వైరస్ పట్ల భయపడాల్సిన పనిలేదని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, హెచ్3ఎన్2 వైరస్ కారణంగా హర్యానాలో తొలి మరణం సంభవించిందని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కర్ణాటకలో కూడా మరో వ్యక్తి ఇదే వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొంది. చనిపోయిన వ్యక్తి హసన్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్టు కర్నాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ వెల్లడించారు. మరోవైపు.. ఈ వైరస్ బారినపడిన వారి సంఖ్య గతకొన్ని నెలలుగా వేల సంఖ్యలో ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, ఈ వైరస్ బారినపడకుండా ఉండాలంటే.. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్క్లు ధరించడం, తరచుగా చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించాలని ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా తెలిపారు. ఇక, ఈ వైరస్ సోకినవారిలో జ్వరం, జలుబు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, గొంతునొప్పి, వాంతులు, విరేచనాలు, రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. అలాగే ఈ ఫ్లూ లక్షణాలు ఒకటి నుంచి నాలుగు రోజుల్లోనే తెలిసిపోతాయి. హెచ్3ఎన్2 బారినపడివారిలో లక్షణాలు కన్పించకపోతే ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే ఈ ఇన్ఫ్లూయెంజా బారినపడితే శ్వాసకోశ సంబంధిత సమస్యలు కూడా తక్కువగానే ఉంటాయి. ఆక్సిజన్ అందిచాల్సిన అవసరం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే, ఓ వ్యక్తికి సోకింది కోవిడ్ లేక ఫ్లూనా అని కచ్చితంగా నిర్ధరించుకోవాలంటే కరోనా టెస్టు తప్పకుండా చేయించుకోవాల్సిందేని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే హెచ్3ఎన్2 ఇన్ఫ్లూయెంజా బారిన వారికి చికిత్సలో యాంటీబయాటిక్స్ ఉపయోగించవద్దని ఐసీఎంఆర్ సూచించింది. BIG BREAKING NEWS | H3N2 Influenza: Two deaths due to virus in Karnataka & Haryana - Sources Total of 90 H3N2 Influenza cases so far reported#BreakingNews #H3N2Influenza #H3N2 pic.twitter.com/ju9IA7JlfQ — Mirror Now (@MirrorNow) March 10, 2023 -
‘నవీన్ తల్లిదండ్రులకు మా క్షమాపణలు’
సాక్షి, వరంగల్: ఒకరేమో అనుమానంతో ఉన్మాదిగా మారిపోయి నమ్మిన స్నేహితుడినే కడతేర్చాడు. మరొకరేమో.. ఆ ఘాతుకంలో ప్రాణం పొగొట్టుకున్నాడు. హరిహరకృష్ణ-నవీన్లు ఇద్దరూ.. కన్నవాళ్లకూ పుట్టెడు దుఃఖం మిగిల్చారు. నల్లగొండ ఎంజీ యూనివర్సిటీ విద్యార్థి నవీన్ హత్యోదంతం కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో నిందితుడు హరిహరకృష్ణ తల్లిదండ్రులనూ పోలీసులు ప్రశ్నించగా.. మరోవైపు మీడియా వద్ద తండ్రి పేరాల ప్రభాకర్ తన కొడుకు చేసింది ముమ్మాటికీ నేరమేనని చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యాడు. హరిహరకృష్ణ స్వస్థలం వరంగల్లోని కరీమాబాద్. తండ్రీ పేరాల ప్రభాకర్ ఆర్ఎంపీ డాక్టర్, తల్లి గృహిణి. ప్రభాకర్ స్థానికంగా ఓ క్లినిక్ నడుపుతున్నాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. చిన్నవాడు హరిహరకృష్ణ. పెద్దకొడుకు ముఖేష్ కృష్ణ 2010లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. అయితే.. ముఖేష్ కృష్ణ 2011 జూన్ 15న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో చిన్నోడు సక్రమంగా పెరగాలని ఆ తల్లిదండ్రులు భావించారు. అందుకే దూరంగా హైదరాబాద్లో చదివిస్తున్నారు. సుమారు 14 ఏళ్ళ నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నాడు హరిహరకృష్ణ. ఈ క్రమంలోనే నవీన్తో స్నేహం ఏర్పడి.. ఇద్దరూ మంచి స్నేహితులుగా మెలిగారు. అలాంటి స్నేహితుల మధ్య అమ్మాయి కోసం వైరం ఏర్పడి.. చంపేంత దాకా వెళ్లింది!. అయితే తన కొడుకు చేసింది ముమ్మాటికీ నేరమేనని అంగీకరించిన హరిహరకృష్ణ తండ్రి ప్రభాకర్.. నవీన్ తల్లిదండ్రులను క్షమించమని వేడుకుంటున్నాడు. ‘‘ఐదు నెలల క్రితమే ఐదారుగురు ఫ్రెండ్స్ కలిసి రూమ్ తీసుకున్నారు. అక్క ఇల్లు.. ఉండగా రూమ్ ఎందుకు తీసుకున్నావని అడిగితే అందరం కలిసి చదువుకుంటున్నామని చెప్పాడు. మహాశివరాత్రి రోజున వరంగల్ కు వచ్చాడు. ఆరోజు ఫోన్లు బాగా రావడంతో ఆందోళనకరంగా కనిపించాడు. ఏమైందని అడిగితే.. ఏమీ లేదంటూ వరంగల్ నుండి హైదరాబాద్కు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రెండు రోజుల పాటు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరికి అందుబాటులోకి రాలేదు. అప్పటికే నవీన్ కనపడట్లేదని మిస్సింగ్ కేసు నమోదు అయింది. దీంతో మాలో ఆందోళన మొదలైంది. అందుకే మా అబ్బాయి కూడా కనపడకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాం. చివరికి.. ఈ నెల 23వ తేదీన వరంగల్ వచ్చాడు. ఏం జరిగిందని నిలదీస్తే అప్పుడు చెప్పాడు. నవీన్కు తనకు మధ్య గొడవ జరిగిందని, ఆ గొడవలో నవీన్ చనిపోయాడని చెప్పాడు. తీవ్రంగా మందలించి.. వెంటనే పోలీసులకు లొంగిపోవాలని సూచించాను. స్థానికంగా మిల్స్ కాలనీ పోలీసుల దగ్గరకు వెళ్దామంటే.. లేదు హైదరాబాద్కు వెళ్లి అక్కడ పోలీసులకు లొంగిపోతానని చెప్పాడు. అలాగే చేశాడు. ఈ హత్య మా అబ్బాయి ఒక్కడే చేసినట్లు అనిపించడం లేదు. ఇంకా ఇంకొందరు ఉండవచ్చు. అమ్మాయి కోసం హత్య అంటున్నారు. కాబట్టి, ఆమెను కూడా విచారిస్తే వాస్తవాలు తెలుస్తాయి. మా అబ్బాయికి నేర చరిత్ర లేదు. గంజాయి తీసుకోడు. మద్యం తాగే అలవాటు ఉంది. ఆ మత్తులో హత్య చేశాడని భావిస్తున్నాను. చదువులో క్లెవర్ స్టూడెంట్. ఏదో జరిగి ఉంటుందనే అనుమానం ఉంది. పెద్ద కొడుకు ఆత్మహత్య.. చిన్న కొడుకు హత్య కేసులో జైలు పాలుకావడంతో హరిహరకృష్ణ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. -
దమ్మాయిగూడ బాలిక మృతి కేసులో వీడిన మిస్టరీ
సాక్షి, హైదరాబాద్: జవహర్ నగర్ బాలిక ఇందు మృతి కేసులో మిస్టరీ వీడింది. ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలిక మృతిచెందినట్లు జవహర్నగర్ పోలీసులు గుర్తించారు. కాగా గురువారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యమై.. తెల్లారి చెరువులో శవమై తేలిన విషయం తెలిసిందే. దీంతో జవహర్నగర్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఆదివారం సీఐ చంద్రశేఖర్ ప్రత్యేక బృందాలతో కలిసి పరిసర ప్రాంతాలను జల్లెడ పడ్డారు. చెరువులో ఉన్న నీరు ఊపిరితిత్తులలోకి చేరి ఇందు మృతిచెందినట్లు పోస్టుమార్టమ్ రిపోర్టు నివేదికలోనూ వెల్లడైంది. అసలు ఏం జరిగింది? మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని దమ్మాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక ఇందు గురువారం ఉదయం కనిపించకుండా పోయింది. గురువారం ఉదయం తండ్రితో పాటు స్కూల్కు వచ్చిన బాలిక తన బ్యాగును అక్కడే విడిచిపెట్టి పార్కుకు వెళ్లినట్లుగా మిగిలిన పిల్లలు చెప్పారని హెడ్మాస్టర్ తెలిపారు. బాలిక వెళ్లిపోయిన విషయాన్ని ఆమె తండ్రికి ఫోన్ చేసి చెప్పినట్లు వెల్లడించారు. ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీంతో స్కూల్ హెడ్మాస్టర్, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. డాగ్ స్వ్కాడ్స్, క్లూస్ టీంలను రంగంలోకి దింపి గాలించారు. పాఠశాల ఆవరణలో సీసీటీవీ కెమెరాలు లేవు. దమ్మాయిగూడ చౌరస్త వద్ద ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో మాత్రమే బాలిక కనిపించింది. ఆ తర్వాత ఎటు వెళ్లిందనే విషయం తెలియరాలేదు. డాగ్ స్వ్కాడ్స్ చెరువు వద్దకు వెళ్లి ఆగిపోయాయి. దీంతో గజ ఈతగాళ్లతో గాలించగా.. శుక్రవారం ఉదయం చెరువులో మృతదేహం లభ్యమైంది. చదవండి: డబ్బు వసూలు చేసినట్లు నిరూపించు.. రోహిత్ రెడ్డికి రఘునందన్ సవాల్.. -
21 ఏళ్లైనా అంతుచిక్కని జర్నలిస్ట్ డెత్ మిస్టరీ.. హత్యే అని తెలిసినా..!
దుష్టులు నిర్మించుకున్న దుర్భేద్యమైన కోటలను కూలగొట్టాలని విఫలయత్నం చేశాడో వీరుడు. కథల్లోనో, సినిమాల్లోనో అయితే.. ఆ వీరుడే గెలిచేవాడు. కానీ ఈ రియల్ స్టోరీ.. అతడి మరణాన్నే మిస్టరీగా మలచింది. 1991 ఆగస్టు 10, మధ్యాహ్నం వెస్ట్ వర్జీనియాలోని మార్టిన్స్బర్గ్ సమీపంలోని షెరటన్ హోటల్ ముందు ఒక్కసారిగా జనం గుమిగూడారు. హోటల్ కస్టమర్స్, సిబ్బంది, యాజమాన్యం.. అంతా అక్కడున్నారు. వేగంగా వచ్చి ఆగిన పోలీస్ వ్యాన్లోంచి పోలీసులు ఒక్క ఉదుటన దుమికి.. ‘ఏ రూమ్?’ అన్నారు. సిబ్బందిలో ఒకరు 517 అని చెప్పగానే.. పోలీస్ బూట్లు అటుగా పరుగుతీశాయి. రూమ్ నంబర్ 517లోని బాత్టబ్లో ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ డానీ కాసోలారో(44) నిర్జీవంగా పడి ఉన్నాడు. అతడి రెండు చేతుల మణికట్లు లోతుగా తెగున్నాయి. ఓ పక్కన రేజర్ బ్లేడ్, మరోపక్కన సూసైడ్ నోట్ కనిపించాయి. నోట్ ఓపెన్ చేస్తే.. ‘నన్ను ప్రేమించేవారంతా నన్ను క్షమించండి. ముఖ్యంగా నా కొడుకు నన్ను అర్థం చేసుకుంటాడనుకుంటున్నా.. దేవుడు నన్ను ఆహ్వానిస్తున్నాడు’ అని రాసుంది. డానీ.. 1977లో మాజీ మిస్ వర్జీనియా అయిన టెరిల్ పేస్ను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు ట్రే అనే కొడుకున్నాడు. పదేళ్ల తర్వాత వాళ్లు విడాకులు తీసుకోవడంతో కొడుకు ట్రే బాధ్యతను డానీకే అప్పగించింది కోర్టు. 1970 నుంచి జర్నలిస్ట్గా ఉన్న డానీ.. కమ్యూనిస్ట్ చైనా నల్లమందును యూఎస్లోకి అక్రమంగా రవాణా చేయడం.. వంటి ఎన్నో సమస్యలను వెలుగులోకి తెచ్చి.. ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. డానీ రూమ్ మొత్తం క్షుణ్ణంగా వెతికిన పోలీసులకు.. క్రెడిట్ కార్డులు, డబ్బులున్న అతని వాలెట్ బెడ్ మీద సురక్షితంగా కనిపించింది. బలవంతంగా ఎవరైనా రూమ్లోకి వచ్చారా? అంటే.. అలాంటి ఆనవాళ్లేమీ లేవు. దాంతో డానీ మరణాన్ని ఆత్మహత్యగా నిర్ధారించేశారు పోలీసులు. రెండు రోజుల తర్వాత సమాచారం అందుకున్న డానీ ఫ్యామిలీ.. అది కచ్చితంగా హత్యేనని మొరపెట్టుకున్నారు. ‘మృతదేహం దొరికిన రోజే ఎందుకు మాకు సమాచారం ఇవ్వలేదు’ అని నిలదీశారు. దానికి అధికారుల నుంచి ఎలాంటి సమాధానం లేదు. రిపోర్టర్గా డానీ జరిపిన వందలాది విచార ణ పత్రాలు, ఇతర ముఖ్యమైన ఫైల్స్.. వేటినీ కుటుంబానికి అందించలేదు. ‘అవన్నీ ఎక్కడా?’ అని ఆరా తీసిన డానీ సోదరుడు టోనీకి.. మృతదేహం దొరికిన హోటల్ రూమ్లో అవేం దొరకలేదనే సమాధానం వచ్చింది. రక్తపరీక్షల కోసం సూది గుచ్చితేనే భయపడే డానీ.. చేతులను కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మలేమంటూ.. అతడి కుటుంబం పోరాటం మొదలుపెట్టింది. డానీ మరణానికి కొద్ది రోజుల ముందు.. అతను చాలా మంది స్నేహితులతో.. ‘నేను చాలా పెద్ద కేసుని దర్యాప్తు చేస్తున్నా. త్వరలోనే వెలుగులోకి తెస్తా’ అని చెప్పాడట. నిజానికి ఆగస్ట్ 1990లో ఇన్స్లా అనే కార్పొరేట్ – గవర్నమెంట్ సాఫ్ట్వేర్ కంపెనీదారులైన బిల్ హామిల్ట¯న్Œ , నాన్సీలను ఇంటర్వ్యూ చేయడంతోనే ఆ సాఫ్ట్వేర్ మీద డానీ పరిశోధన మొదలైందట. వారు ప్రారంభించిన ‘ప్రామిస్’ అనే శక్తిమంతమైన ప్రాసిక్యూషన్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్లో.. చాలా పెద్ద మోసం ఉందని.. తెరవెనుక పెద్ద స్కామ్ నడుస్తుందని అనుమానించిన డానీ.. ఆ దిశగా విచారణ మొదలుపెట్టాడు. అప్పటికే ఇన్స్లా కంపెనీ సాఫ్ట్వేర్ను దుర్వినియోగం చేస్తున్నారని.. కొందరు న్యాయశాఖ అధికారులు దీన్ని ఆధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని.. ఇందులో ప్రభుత్వపెద్దల కుట్ర కూడా ఉందని.. ఆ లింకులు ఇతర దేశాలకూ పాకుతున్నాయని వస్తున్న పుకార్లను కూపీలాగడం మొలుపెట్టాడు డానీ. ఎందరో గూఢచారుల్ని కలసి.. ఎన్నో ఆధారాలను సంపాదించాడు. ఆ క్రమంలోనే ఎన్నో బెదిరింపు కాల్స్నూ ఎదుర్కొన్నాడు. ఆ విషయం తన సోదరుడు టోనీకి చెబుతూ.. ‘ఒకవేళ నేను చనిపోతే, అది ప్రమాదవశాత్తు జరిగిన మరణమని నమ్మవద్ద’ని చెప్పాడట. తను విచారిస్తున్న కుంభకోణానికి ‘ది ఆక్టోపస్’ అని పేరు కూడా పెట్టాడట. పోలీస్ విచారణపై నమ్మకం లేని కుటుంబ సభ్యులు.. హోటల్ సిబ్బందిని ఆరా తీయగా మరో నిజం బయటపడింది. డానీ చనిపోయిన రోజు.. పోలీసులు రాకముందే ఎవరో.. ప్రొఫెషనల్ క్లీనింగ్ వర్కర్స్తో డానీ రూమ్ని శుభ్రం చేయించారని తేలింది. ఆ క్లీనింగ్ వర్కర్లలో ఒకరు మాట్లాడుతూ.. ‘ఆ రోజు రక్తంతో తడిచిన రెండు టవల్స్ని మృతదేహం దగ్గర్లో చూశాం. వాటిని అప్పుడే చెత్తలో వేసేశాం. మాకంటే ముందే ఎవరో ఆ రూమ్లో నేల మీద పడిన రక్తాన్ని ఆ టవల్స్తో తుడిచినట్లు అనిపించింది’ అని చెప్పాడు. అయితే అతడు బహిరంగ సాక్ష్యానికి అంగీకరించలేదు. ఇక ఆగస్టు 9 సాయంత్రం ఐదున్నరకు.. డానీ తన పక్క గదిలో దిగిన లూనీని పలకరించాడట. ఒక ముఖ్యమైన కేసుకు సంబంధించి ఒక వ్యక్తిని కలవబోతున్నానని చెప్పాడట. తొమ్మిదింటికి లూనీని మళ్లీ కలసిన డానీ.. ఒక ఫోన్ కాల్ మాట్లాడి వస్తానని వెళ్లి.. కొన్ని నిమిషాల్లోనే తిరిగివచ్చాడట. ‘బహుశా అవతల వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయలేదేమో? తెలియదు. మేం చాలాసేపు మామూలుగా మాట్లాడుకున్నాం’ అని లూనీ చెప్పుకొచ్చాడు. ఆ రోజు రాత్రి డానీ.. సమీపంలోని పిజ్జాహట్లో డిన్నర్ చేశాడట. అందులోని వెయిట్రెస్ డానీని గుర్తుపట్టింది. రాత్రి 10 దాటాక కాసోలారో సమీపంలోని కన్వీనియెన్స్ స్టోర్లో కాఫీ కొనుక్కుని తాగాడట. అదే అక్కడివారికి డానీ చివరిసారిగా సజీవంగా కనిపించింది. ఆ తర్వాత ఎవరికీ కనిపించలేదు. మరి ఆ రాత్రి ఏం జరిగింది? మరునాడు మధ్యాహ్నం వరకూ శవాన్ని ఎందుకు గుర్తించలేదు? ఇలా వేటికీ సమాధానాల్లేవు. మరోవైపు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని ఒక ఆర్మీమన్.. డానీ అంత్యక్రియలకు హాజరయ్యాడట. డానీ శవపేటిక మీద గౌరవప్రదంగా ఒక పతకాన్ని ఉంచి అక్కడి నుంచి వెళ్లిపోయాడట. అసలు అతడు ఎవరు? ఎందుకు వచ్చాడు? అతడు నిజంగానే సైనికాధికారా? లేక డానీని చంపిన కిల్లరా? అనేది నేటికీ తేలలేదు. 1973లో లాభాపేక్షలేని సంస్థగా ఏర్పడిన ఇన్స్లా.. 1981లో లాభాపేక్షతో కూడిన అనుబంధసంస్థలను ఏర్పాటు చేసింది. ఆ తర్వాతే దాని ఆస్తులన్నీ కొత్త సంస్థలకు బదిలీ అయ్యాయి. డానీ మరణం తర్వాత.. ఇన్స్లా సంస్థ.. తన సాఫ్ట్వేర్ను దొంగిలించడానికి ప్రభుత్వమే కుట్ర పన్నిందని, దొంగిలించిన సాఫ్ట్వేర్ను.. విదేశీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గూఢచర్య కార్యకలాపాలకు వినియోగించిందని.. నాసాతో సహా సీ.ఐ.ఏ, డి.ఓ.జీలు ఈ సమాచారాన్ని ఉపయోగించుకున్నాయని.. హత్యల్లోనూ ప్రమేయం ఉందని ఇలా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కొన్ని ఆధారాలు దొరికాయి. కానీ.. 12 సంవత్సరాల సుదీర్ఘన్యాయ విచారణ తర్వాత ఫెడరల్ క్లెయిమ్స్ కోర్ట్ వాటన్నింటినీ కొట్టిపారేసింది. ఇక్కడ 1960 నుంచి 66 వరకూ బిల్ హామిల్టన్ ఆరేళ్ల పాటు నాసా ఉద్యోగిగా ఉండడం గమనార్హం. -సంహిత నిమ్మన -
శశి థరూర్కు తప్పని చిక్కులు.. ఆ కేసులో కోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ను ఆయన భార్య సునంద పుష్కర్ మృతి కేసు వెంటాడుతూనే ఉంది. ఈ కేసులో శశిథరూర్కు క్లీన్చిట్ ఇవ్వటంపై హైకోర్టును ఆశ్రయించారు ఢిల్లీ పోలీసులు. థరూర్పై ఉన్న అభియోగాలను కొట్టవేస్తూ గతేడాది పాటియాలా హౌస్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేశారు. ఈ పిటిషన్ను స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు.. శశి థరూర్కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఊరట లభించిన దాదాపు 15 నెలల తర్వాత ఢిల్లీ పోలీసులు రివిజన్ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. పిటిషన్ను పరిశీలించిన జస్టిస్ ఢీకే శర్మ.. పిటిషన్ కాపీని శశి థరూర్ న్యాయవాదికి అందించాలని ఢిల్లీ పోలీసుల తరపు న్యాయవాదికి సూచించారు. పిటిషన్ కాపీ తమకు అందలేదని, అది ఉద్దేశ పూర్వకంగానే మరో మెయిల్కు పంపి ఉంటారని థరూర్ న్యాయవాది ధర్మాసనానికి తెలపడంతో ఈ మేరకు ఆదేశించారు. మరోవైపు.. రివిజన్ పిటిషన్ ఆలస్యానికి క్షమించాలని ఢిల్లీ పోలీసులు న్యాయస్థానానికి అప్పీల్ చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసుల పిటిషన్పై సమాధానం ఇవ్వాలని శశి థరూర్కు నోటీసులు జారీ చేసింది కోర్టు. ఈ కేసుకు సంబంధించిన పత్రాలను వ్యాజ్యదారులకు మినహా వేరే వ్యక్తులకు పంపించొద్దని సూచించింది ధర్మాసనం. కేసు విచారణను 2023, ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేశారు. ఇదీ కేసు.. 2014, జనవరి 17న ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్లో సునందా పుష్కర్ అనుమానాస్పదంగా మృతి చెందటం కలకలం సృష్టించింది. తొలుత హత్య కోణంలో దర్యాప్తు జరిపినా.. చివరకు ఆత్మహత్యగా పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అయితే, సునంద ఆత్మహత్య చేసుకునేలా శశి థరూర్ ప్రేరేపించారని ఆయనపై అభియోగాలు మోపారు. దీంతో ఆయన ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన పాటియాలా హౌస్ కోర్టు.. 2021, ఆగస్టులో ఆ అభియోగాలను కొట్టివేస్తూ థరూర్కు క్లీన్చిట్ ఇచ్చింది. ఇదీ చదవండి: రామభక్తుల నేలపై రావణుడు అనడం.. ఖర్గే కామెంట్లపై ప్రధాని ఘాటు కౌంటర్ -
సోనాలి ఫోగట్కు అన్ని కోట్ల ఆస్తులున్నాయా? ఆస్తి కోసమే హత్యచేశారా?
హరియాణా బీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్ అనుమానాస్పద మృతిపై మిస్టరీ వీడటం లేదు.సోనాలి ఫోగట్(43) హఠాన్మరణం కాస్త హత్యగా నిర్ధారణ కావడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు సోనాలి ఫోగట్ హత్య వెనుక ఎవరున్నారు? ఆస్తి కోసమే ఆమెను చంపాలనుకున్నారా వంటి కారణాలు ఇప్పుడు తెరమీదకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోనాలి ఫోగట్ కూతురు, ఆమె రూ 110కోట్ల విలువైన ఆస్తికి ఏకైక వారసురాలు యశోధర ప్రాణానికి కూడా ముప్పు ఉన్నట్లు ఆమె కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. 2016లో సోనాలి ఫోగట్ భర్త సంజయ్ ఫోగట్ కూడా అనుమానాస్పద రీతిలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సోనాలిని కూడా హత్య చేశారు. ఈ క్రమంలో ఆస్తి కోసం సోనాలి కూతురు యశోధరను కూడా హత్య చేయొచ్చని ఆమె కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం యశోధరకు కేవలం 15 సంవత్సరాలే. ఈ క్రమంలో ఆమె ప్రాణాలకు ముప్పు ఉన్న నేపథ్యంలో యశోధరను తిరిగి హాస్టల్కు కూడా పంపొద్దని కుటంబీకులు నిర్ణయించారు. ఇప్పటికే ఆమెకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు తన తల్లి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని యశోధర డిమాండ్ చేస్తుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..'నా తల్లిని పథకం ప్రకారమే హత్య చేశారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. గోవాలో వారం రోజుల పాటు షూటింగ్ ఉందని అమ్మ నాతో చెప్పింది. మరి అలాంటప్పుడు రిసార్ట్ను కేవలం రెండు రోజులకే ఎందుకు బుక్ చేసినట్లు? పక్కా ప్లాన్తోనే హత్య చేశారు. అయినా ఇప్పటివరకు మా అమ్మ హత్యకు గల కారణాలు పోలీసులు నిర్ధారించలేదు. గోవా పోలీసుల దర్యాప్తుతో నేను సంతృప్తిగా లేను. దర్యాప్తుపై అనేక సందేహాలున్నాయి. అందుకే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతున్నాం' అని ఆమె పేర్కొంది. -
దళిత చిన్నారి మృతి వ్యవహారంలో బిగ్ ట్విస్ట్!
జైపూర్: నీళ్ల కుండను తాకాడని ఓ దళిత చిన్నారిని టీచర్ దండించడం.. ఆ దెబ్బలకు ఆ చిన్నారి మరణించడం వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో, మీడియాలో విస్తృతంగా చర్చ కూడా నడిచింది. అయితే.. ఈ ఘటనపై శుక్రవారం షాకింగ్ రిపోర్ట్ను సమర్పించింది రాజస్థాన్ చైల్డ్ ప్యానెల్. అసలు ఈ వ్యవహారంలో దళిత కోణం ప్రస్తావనే లేదని తేల్చేసింది. జలోర్లో ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న తొమ్మిదేళ్ల బాలుడిని.. భోజన సమయంలో మంచి నీళ్ల కుండ తాకాడంటూ అగ్రకులానికి చెందిన ఒక టీచర్ తీవ్రంగా కొట్టాడని, ఆ దెబ్బలకు ఆ చిన్నారి మరణించాడని, దళితుడు కావడంతోనే అతనిపై అలాంటి ఘాతుకానికి పాల్పడ్డాడన్నది ఆ ఘటనపై మీడియాలో వచ్చిన కథనం. అయితే.. డ్రాయింగ్ బుక్ విషయంలో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. ఈ విషయం తనదాకా రావడంతో.. ఆ ఇద్దరు విద్యార్థులను టీచర్ విపరీతంగా కొట్టాడు. అందులో ఒక చిన్నారే బాధితుడు. కంటికి, చెవికి తీవ్ర గాయాలు కావడంతో.. ఆ తొమ్మిదేళ చిన్నారికి చికిత్స అందించారు. ఆ సమయంలోనే మృతి చెందాడు. ఇదీ.. రాజస్థాన్ బాలల హక్కుల సంఘం.. రాజస్థాన్ ప్రభుత్వానికి, విద్యాశాఖకు ఇచ్చిన నివేదిక సారాంశం. ఈ మేరకు స్కూల్ను సందర్శించిన చైల్డ్ ప్యానెల్ సభ్యులు.. బాధిత చిన్నారి తోటి విద్యార్థులను, టీచర్లను ఆరా తీసినట్లు తెలుస్తోంది. అంతేకాదు బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, జిల్లా పరిపాలనాధికారి అందించిన వివరాల ప్రకారం ఆ స్కూల్లో కుండనే లేదని, తాగు నీటి కోసం ఓ ట్యాంకర్ను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. బాధితుడి సోదరుల వాదన అయితే బాధితుడి సోదరులు ఇద్దరూ నరేష్ కుమార్, నాపారాంలు అదే స్కూల్లో చదువుతున్నారు. వాళ్లు మాత్రం తమ తమ్ముడు మధ్యాహ్న భోజన సమయంలో మంచి నీటి కుండ నుంచి నీళ్లు తీసుకున్నందుకే టీచర్ చితకబాదాడంటూ చెప్తున్నారు. వీళ్ల స్టేట్మెంట్నూ కూడా నివేదికలో జత చేసింది చైల్డ్ ప్యానెల్. అంతేకాదు.. ఒకవేళ స్కూల్ అనుమతుల్ని విద్యాశాఖ గనుక రద్దు చేస్తే పిల్లలను మరో స్కూల్లో అడ్మిషన్లకు అనుమతించాలంటూ సూచించింది. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో అధికార కాంగ్రెస్ పార్టీని తీరును విమర్శిస్తూ.. దళిత సంఘాలు ధర్నాలు, నిరసనలు చేపడుతున్నాయి. బీజేపీ సైతం ఈ ఘటనను ఆధారంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తోంది. ఇదీ చదవండి: చిన్నారి మృతి కేసు.. అధికార కాంగ్రెస్లో ముసలం -
అయ్యో పాపం.. వర్షిత
నాగోలు: అనుమానాస్పద స్థితిలో ఓ చిన్నారి అపార్టుమెంట్లోని నాలుగో అంతస్తుపై నుంచి కింద పడి అసువులు బాసిన ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల గ్రామానికి చెందిన సత్యనారాయణరెడ్డి, ప్రభావతి దంపతులు. మన్సూరాబాద్లోని మధురానగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ప్రభావతి ప్రైవేట్ టీచర్. సత్యనారాయణ రెడ్డి స్వగ్రామంలో వ్యవసాయ పనులు చూసుకుంటున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. రెండో కూతురు వర్షిత (12) స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. మంగళవారం సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన తర్వాత చిప్స్ కొనుక్కుంటానని తల్లి వద్ద రూ.20 తీసుకుని బయటకు వెళ్లింది. మన్సూరాబద్ చౌరస్తాకు వచ్చి ఆటో డ్రైవర్కు రూ.50 ఇచ్చి ఎల్బీనగర్లోని చంద్రపురి కాలనీలోని రోడ్డు నంబర్–2లో ఉన్న ఓ అపార్టుమెంట్ వద్దకు వచ్చిది. అపార్టుమెంట్ పైకి వెళ్తుండగా అక్కడి వాచ్మన్ ఎవరు కావాలని అడగటంతో ‘మా నాన్న ఇక్కడే ఉన్నాడు’ అంటూ నాలుగో అంతస్తుపైకి వెళ్లింది. అప్పటికే అనుమానం వచ్చిన వాచ్మన్ చిన్నారి వెనుక అతని కొడుకును లిఫ్ట్లో పంపించాడు. పైకి వెళ్లి వెతికినా వర్షిత జాడ కనపించలేదు. కొద్ది సేపటి తర్వాత బాలిక కింద పడిన శబ్దం రావడంతో అక్కడికి వెళ్లి చూడగా చిన్నారి తీవ్ర గాయాలతో కనిపించింది. వెంటనే స్థానికులు ఆమెను ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి కన్నుమూసింది. ఎల్బీనగర్ పోలీసులకు అపార్టుమెంట్ వాచ్మన్ సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలంలోని సీసీ కెమెరాలను వారు పరిశీలించారు. చిన్నారి అక్కడికి ఎందుకు వచ్చింది? అపార్టుమెంట్లో ఎవరు ఉన్నారు? నాలుగో అంతస్తుపై నుంచి తానే దూకిందా? వేరే ఎవరైనా బాలికను కిందకు తోశారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: డీఎస్పీ హత్య.. నిందితుడ్ని గంటల్లోనే పట్టుకున్న పోలీసులు.. ఎన్కౌంటర్లో బుల్లెట్ గాయం) -
బీఫార్మసీ విద్యార్థి తేజస్విని మృతి కేసు.. ప్రియుడు అరెస్ట్
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: జిల్లాలో సంచలన కలిగించిన బీఫార్మసీ విద్యార్థి తేజస్విని మృతి కేసులో నిందితుడు సాధిక్ను పోలీసులు అరెస్టు చేశారు. సాధిక్ ఆలియాస్ బాబూలాల్ వేధింపుల వల్లే తేజశ్విని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందన్న పోలీసులు.. అతనిపై 420, 376, 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు విచారణ బాధ్యతలు దిశ పోలీసులకు అప్పగించామని.. రెండు వారాల్లో దర్యాప్తు పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ తెలిపారు. చదవండి: పాపం రమాదేవి.. భర్త ప్రాణాలు కాపాడబోయి.. -
బీజేపీ నేత శ్వేత మృతి కేసులో సంచలన విషయాలు
బీజేపీ నేత శ్వేతా సింగ్ గౌర్ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తన నీచపు బాగోతం బయటపెడుతుందనే ఉద్దేశంతోనే ఆమె భర్తే ఆమెను హత్య చేసి.. అత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేస్తున్నాడంటూ ఆరోపణలు తెర మీదకు వచ్చాయి. ఈ కేసులో ఇప్పటికే శ్వేత భర్తను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్ బండాకు చెందిన జిల్లా పంచాయితీ సభ్యురాలు, బీజేపీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్వేతా సింగ్ గౌర్.. బుధవారం తన ఇంట్లో శవమై కనిపించారు. తన భర్త, బీజేపీ నేత దీపక్ గౌర్ ఇన్వాల్వ్ అయిన ఇంటర్నేషనల్ సె* రాకెట్కు సంబంధించి ఆడియో కాల్స్ ఆమె రికార్డు చేసిందని, ఆ భయంతోనే ఆమె బిక్కుబిక్కుమంటూ గడిపిందని శ్వేత కుటుంబం ఆంటోంది. అందుకే తమ బిడ్డను హత్య చేశారని, ఇందులో దీపక్తో పాటు అతని తండ్రి, తల్లి, అన్న.. అంతా ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపిస్తోంది. ఈ మేరకు ఫిర్యాదు ఆధారంగా దీపక్ కుటుంబంపై క్రిమినల్ కేసు నమోదు చేశారు పోలీసులు. నీచపు పని రష్యా, మొరాకో, ఆఫ్రికా అమ్మాయిలతో కూడిన వ్యభిచార ముఠాలతో దీపక్ లావాదేవీలు జరిపాడని శ్వేత కుటుంబం ఆరోపిస్తోంది. తన భర్త విటులను సంప్రదించిన ఫోన్ కాల్స్ను శ్వేత రికార్డు చేసిందని, ఇందుకు సంబంధించి ఫొటోలు, డబ్బు పంపిన వ్యవహారాలను సైతం ఆమె సేకరించింది. ఈ మేరకు మూడు సంభాషణలకు సంబంధించిన ఆడియో క్లిప్స్ మీడియా ద్వారా బయటకు వచ్చాయి. అంతేకాదు.. లక్నోలోని ఎంజే ఇంటర్నేషనల్ హోటల్ను అడ్డాగా మార్చుకుని రాసలీలలకు దిగాడని శ్వేత తమతో చెప్పిందని ఆ కుటుంబం అంటోంది. తన గుట్టు ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో ఆమెను హత్య చేశాడని, సీలింగ్కు ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని శ్వేత కుటుంబం ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు తమ బిడ్డకు న్యాయం చేయాలని కోరుతూ పూర్తి ఆధారాలను యూపీ పోలీసులకు అప్పగించింది ఆ కుటుంబం. పరువు పోకూడదని అమ్మ భరించింది దీపక్కు పలువురు మహిళలతోనే వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయంలో ఇంట్లో చాలాసార్లు గొడవలు జరిగాయని వీళ్ల ఇద్దరు కూతుళ్లు చెప్తున్నారు. అంతేకాదు ఇద్దరు ఆడపిల్లలు కావడంతో తమ తండ్రికి మరో వివాహం చేయాలని.. ఆయన కుటుంబం ప్రయత్నించిందని వాళ్లు అంటున్నారు. ఈ విషయమై చాలాసార్లు తమ తల్లి(శ్వేత) మీద దాడి జరిగిందని, కానీ పరువు పోకూడదనే ఉద్దేశంతో ఆమె ఇంతకాలం భరిస్తూ వచ్చిందని ఆ ఇద్దరు కూతుళ్లు అంటున్నారు. అదే టైంలో రాజేష్ అనే వ్యక్తి పేరిట.. దీపక్-శ్వేతల మధ్య ఓ వీడియో వైరల్ కావడం విశేషం. చదవండి: తల్లితో సహజీవనం.. ఏడాది కాలంగా కుమార్తెపై అత్యాచారం.. -
ఇక్కడ సయాలీ.. అక్కడ సాగర్.. ప్రేమవిషాదం!
ఎనిమిదేళ్ల ప్రేమ.. సహజీవనం. విషయం బయటపడడంతో పెద్దలు ఏమంటారో అని ఆ జంటలో భయం. కానీ, పెద్దలు నవ్వుతూ వాళ్లను ఆశీర్వదించింది. త్వరలో పెళ్లికి ముహూర్తం పెట్టింది. ఇంతలో ఏం జరిగిందో తెలియదు.. పాపం ఆ ప్రేమ కథ విషాదంగా ముగిసింది. మహారాష్ట్ర ముంబై వసాయ్కు చెందిన సాగర్ అరుణ్ నాయక్(29), సయానీ ససానే(26) ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఈ మధ్యే పెద్దలకు తెలిసింది. రెండు కుటుంబాలు కూర్చుని మాట్లాడుకున్నాయి. త్వరలో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇంతలో.. ఆ జంట మధ్య ఏం జరిగిందో తెలియదు. ఫిబ్రవరి 27వ తేదీన పాపిడిలోని ఓ హోటల్లో దిగింది ఈ జంట. ఆ తర్వాతి రోజు హోటల్ సిబ్బంది, తలుపులు ఎంత బాదినా అవతలి నుంచి స్పందన లేదు. చివరికి డోర్ బద్ధలు కొట్టి చూసేసరికి.. సయాలి విగతజీవిగా కనిపించింది. ప్లంబింగ్ పనిముటుతో ఆమెకు గాయపర్చి హత్య చేశారెవరో. ఈ కేసులో అనుమానితుడిగా ప్రియుడు సాగర్ పేరును చేర్చారు పోలీసులు. అతని కోసం గాలింపు మొదలుపెట్టారు. సరిగ్గా వారం తర్వాత.. వేల కిలోమీటర్ల అవతల సాగర్! సయాలి మరణం తర్వాత సాగర్ కనిపించకుండా పోవడంతో అతని మీద అనుమానంతో పోలీసులు వెతకసాగారు. ఇంతలో బీహార్ ఓ హోటల్ గదిలో శవమై కనిపించాడు సాగర్. సయాలీ మరణం తర్వాత బీహార్కు చేరుకున్న సాగర్.. ముజఫర్పూర్ని ఆస్తా హోట్లో దిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మార్చి 6వ తేదీనే హోటల్ ఖాళీ చేయాల్సి ఉండగా.. అది జరగలేదు. దీంతో అనుమానం వచ్చిన సిబ్బంది డోర్లు లోపల నుంచి లాక్ చేసి ఉండడం గమనించారు. సాగర్ ఫోన్కు ట్రై చేసినా స్పందన లేకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సిబ్బంది సాయంతో తలుపులు బద్ధలు కొట్టారు. లోపల బాత్రూంలో సాగర్ మృతదేహాంగా కనిపించాడు. బహుశా ఆత్మహ్యతకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు పోలీసులు. ఈ కేసు మిస్టరీ వీడాల్సి ఉంది. -
చిక్కుల్లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ
న్యూఢిల్లీ: పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ చిక్కుల్లో పడ్డారు. మూడు దశాబ్దాల క్రితం ఒక వ్యక్తి మరణానికి కారకుడైన కేసులో దోషి అయిన సిద్ధూ స్వల్ప జరిమానాతో బయటపడ్డారు. సిద్ధూ చేసిన నేరానికి తగిన శిక్ష పడలేదని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తూ మళ్లీ కోర్టుకెక్కడంతో తీర్పుని పునఃసమీక్షించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. 1998లో పంజాబ్లోని పాటియాలాలో వాహనం పార్కింగ్పై వివాదం నెలకొని 65 ఏళ్ల వయసున్న గుర్నామ్ సింగ్ అనే వ్యక్తిని సిద్ధూ చితకబాదారు. ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో కుటుంబ సభ్యులు సిద్ధూపై కేసు పెట్టారు. ఈ కేసు నుంచి బయట పడడానికి సిద్ధూ దశాబ్దాల పాటు న్యాయ పోరాటం చేశారు. పంజాబ్ హరియాణా హైకోర్టు సిద్ధూ ఒక వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణమయ్యారని దోషిగా తేలుస్తూ మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2018 మేలో సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుని పక్కన పెట్టేసింది. సీనియర్ సిటిజన్ను గాయపరిచినందుకు కేవలం వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ సిద్ధూని కేసు నుంచి విముక్తుడిని చేసింది. ఈ తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బాధిత కుటుంబం మళ్లీ కోర్టుకెక్కింది. సిద్ధూకి కఠిన శిక్ష విధించాలని బాధిత కుటుంబం సుప్రీంలో శుక్రవారం వాదనలు వినిపించింది. సిద్ధూ తరపున కాంగ్రెస్ నేత, లాయర్ పి. చిదంబరం వాదనలు వినిపించారు. ఇన్నేళ్ల తర్వాత తీర్పుని సమీక్షించడం అర్థరహితమని పేర్కొన్నారు. -
Delta Varient: రష్యాలో రికార్డు స్థాయిలో మరణాలు
మాస్కో: వేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ కారణంగా రష్యాలో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. అక్కడ వరుసగా రెండో రోజు రికార్డు స్థాయిలో కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 21,042 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 669 మరణాలు నమోదైనట్లు బుధవారం రష్యా ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో డెల్టా వేరియంట్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజులో నమోదైన అత్యధిక కోవిడ్ మరణాలు ఇవేనని తెలిపింది. స్థానిక అధికారుల లెక్కల ప్రకారం రష్యాలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 55,14,599 కాగా, మరణాల సంఖ్య 1,35,214కి చేరింది. ఇదిలా ఉంటే, గత శుక్రవారం యూరో 2020 ఫుట్ బాల్ టోర్నీకి(క్వార్టర్ ఫైనల్) ఆతిథ్యమిచ్చిన సెయింట్ పీటర్స్ బర్గ్ కోవిడ్ హాట్ స్పాట్ గా మారింది. ఆ నగరంలో కోవిడ్ మరణాలు అత్యధికంగా నమోదవుతున్నాయి. రాజధాని మాస్కోలో కూడా పరిస్థితి ఆందోళనకరమైన నేపథ్యంలో అక్కడ కోవిడ్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. నగర వ్యాప్తంగా నమోదవుతున్న 90శాతం కోవిడ్ కేసులకు డెల్టా వేరియంటే కారణమని మాస్కో మేయర్ సెర్గియి సోబ్యానిన్ తెలిపారు. కాగా, మంగళవారం కూడా రష్యాలో 20,616 కోవిడ్ కేసులు, 652 మరణాలు నమోదైన విషయం తెలిసిందే. దేశంలో కోవిడ్ కేసులు, మరణాలు మళ్లీ పెరిగిపోతున్న నేపథ్యంలో రష్యన్లందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని అధ్యక్షుడు పుతిన్ మరోసారి సూచించారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు రష్యాలో చాలా మంది వెనకాడుతున్న నేపథ్యంలో…ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, తాను కూడా దేశీయంగా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నానని పుతిన్ వెల్లడించారు. -
ఎట్టకేలకు న్యాయం.. 22 ఏళ్ల జైలు శిక్ష
సంచలనం సృష్టించిన జార్జ్ ఫ్లాయిడ్(46) హత్య ఉదంతంలో ఎట్టకేలకు న్యాయం జరిగింది. మెడను కాలితో నొక్కిపట్టి ఊపిరి ఆడకుండా చేసి అతడి మరణానికి కారణమైన పోలీస్ మాజీ అధికారి డెరిక్ చౌవిన్ (45)కు కఠిన శిక్ష విధించింది కోర్టు. డెరిక్ను ఇదివరకే దోషిగా నిర్ధారించిన మిన్నియపొలిస్ కోర్టు గత రాత్రి అతడికి శిక్షను ఖరారు చేస్తూ తీర్పును వెలువరించింది. మొత్తం ఇరవై రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. పోయినేడాది మే 25న జార్జ్ ఫ్లాయిడ్ను నడిరోడ్డుపై డెరిక్ చౌవిన్ మోకాలితో నొక్కి అదిమిపట్టాడు. తనకు ఊపిరి ఆడడం లేదని, కాలు తీయాలని ఫ్లాయిడ్ వేడుకున్నా డెరిక్ కనికరించలేదు. ఆ తర్వాత ఫ్లాయిడ్ను ఆసుపత్రికి తరలించగా మరణించాడు. ఇందుకు సంబంధించి వీడియోలు, పొటోలు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ‘భావోద్వేగంలోనో లేదంటే సానుభూతితోనో డెరిక్కు ఈ శిక్ష విధించడం లేదు’ అని తీర్పు సందర్భంగా జడ్జి పీటర్ కాహిల్ ప్రకటించారు. కాగా, తీర్పు వెలువరించే ముందు డెరిక్.. లేచి నిలబడి ఫ్లాయిడ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించాడు. సూటిగా జడ్జి కళ్లలోకి చూసి మాట్లాడకపోగా.. ఆ ఒక్కముక్క మాట్లాడి వెంటనే కూర్చున్నాడు. ఇక డెరిక్ తల్లి వ్యవహారంపై పలువురు మండిపడుతున్నారు. తన కొడుకు అమాయకుడంటూ, ఫ్లాయిడ్ హత్యలో అనవసరంగా ఇరికించారంటూ ఆమె కంటతడితో స్టేట్మెంట్ ఇచ్చింది. మరోవైపు ఫ్లాయిడ్ కుటుంబం తరపున అతని ఏడేళ్ల కూతురు తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ మాట్లాడిన మాటల్ని రికార్డుగా కోర్టు పరిగణలోకి తీసుకుంది. తీర్పు తర్వాత ప్రెసిడెంట్ బైడెన్ సహా పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు స్పందించారు. ఫేక్ డాలర్ నోట్ల అనుమానంతో డెరిక్, అతని ముగ్గురు సహాచర అధికారులు జార్జ్ ఫ్లాయిడ్ను ముందుగా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతన్ని తరలించే క్రమంలో క్రూరంగా వ్యవహరించగా.. ప్రాణాలు కోల్పోయాడు. జాత్యాహంకార హత్యగా ఇది ప్రపంచాన్ని కుదిపేసింది. కాగా, ఈ ఘటనను డార్నెల్లా ఫ్రాజెయిర్ అనే అమ్మాయికి ఈ ఏడాది పులిట్జర్ గౌరవ పురస్కారం దక్కింది కూడా. కాగా, అమెరికాలో పోలీసుల చేతిలో హత్యలకు గురైన ఉదంతాలు తక్కువేం కాదు. ఫ్లాయిడ్ ఉదంతం నాటికి 1,129 మంది పౌరులు, పోలీసుల చేతిలో చంపబడ్డారని నివేదికలు వెల్లడించాయి కూడా. Judge Peter Cahill just sentenced #DerekChauvin to 270 months that’s 22.5 years in the murder of #GeorgeFloyd. pic.twitter.com/6sRoJBHjW1 — Sara Sidner (@sarasidnerCNN) June 25, 2021 చదవండి: నాన్న ఫ్లాయిడ్ ప్రపంచాన్నే మార్చేశాడు! -
‘మారడోనాను డాక్టర్లే చంపారు.. ఆయనను అస్సలు పట్టించుకోలేదు’
బ్వేనోస్ ఎయిరెస్: ఫుట్ బాల్ మాంత్రికుడు, అర్జెంటీనా దివంగత ఆటగాడు డీగో మారడోనాను డాక్టర్లే చంపారని ఆయనకు వైద్యం చేసిన నర్సు సంచలన ఆరోపణలు చేసింది. కేవలం వారి నిర్లక్ష్యం కారణంగానే మారడోనా మృతి చెందాడని, చివరి రోజుల్లో డాక్టర్లు అతన్ని అస్సలు పట్టించుకోలేదని మారడోనా అనుమానాస్పద మృతి కేసులో విచారణ ఎదుర్కొంటున్న దహియానా గిసెలా మాడ్రిడ్ అనే నర్సు పేర్కొంది. ఈ విషయాన్ని ఆమె తన లాయర్ ద్వారా వెల్లడించింది. కేసు విచారణ సందర్భంగా ప్రాసిక్యూటర్ అడిగిన ప్రశ్నలకు నర్సు తరపు న్యాయవాది స్పందిస్తూ.. మారడోనా బ్రెయిన్ సర్జరీ నుంచి కోలుకున్నాక కూడా ఏ డాక్టరూ ఆయన ఆరోగ్య స్థితిని పరీక్షించలేదని తన క్లయింటు చెప్పినట్లు పేర్కొన్నాడు. హాస్పిటల్లో మారడోనా కింద పడిపోయినప్పుడు తన క్లయింట్ ఆయనకు వెంటనే సీఏటీ స్కాన్ చేయాలని చెప్పినప్పటికీ అక్కడే ఉన్న డాక్టర్ స్పందించలేదని, ఈ విషయం మీడియాకు తెలిస్తే రచ్చ చేస్తారని సదరు డాక్టర్ తన క్లయింట్తో చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఏ డాక్టర్ కూడా మారడోనా మరణాన్ని ఆపలేకపోయారని, అయన చివరి రోజుల్లో తన క్లయింటే అతని బాగోగులు చూసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా, మారడోనా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని, అతని సంతానం ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో మారడోనా వ్యక్తిగత వైద్యునితో సహా ఏడుగురిని ప్రాసిక్యూట్ చేస్తున్నారు. వారిలో మాడ్రిడ్ అనే నర్సు కూడా ఒకరు. మారడోనా గతేడాది నవంబరులో 60 ఏళ్ళ వయస్సులో గుండెపోటుతో ఆర్జెంటీనాలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో మృతి చెందారు. చదవండి: గ్రౌండ్లో కుప్పకూలిన మరో స్టార్ ప్లేయర్.. -
సుశీల్కు బిగుసుకుంటున్న ఉచ్చు
న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా మృతి వ్యవహారంపై పోలీసుల విచారణ కీలక మలుపు తీసుకుంది. గ్రీకో రోమన్ 97 కేజీల విభాగంలో జాతీయ జూనియర్ మాజీ చాంపియన్ అయిన 23 ఏళ్ల సాగర్ రాణాను కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా కొట్టడంతో అతను చనిపోయాడు. భారత రెజ్లర్లకు అడ్డాలాంటి ఛత్రశాల్ స్టేడియం బయట జరిగిన ఈ ఘటనలో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, భారత మేటి రెజ్లర్ సుశీల్ కుమార్ హస్తం ఉందని వినిపిస్తోంది. అయితే అతను ఇప్పటికీ పోలీసులకు చిక్కలేదు. ఈ నేపథ్యంలో సుశీల్ మామ, సీనియర్ కోచ్ సత్పాల్ సింగ్ను పోలీసులు విచారించారు. ‘సుశీల్ మామ సత్పాల్ సింగ్, అతని బావమరిదిలను సుమారు రెండు గంటల పాటు విచారించాం. మంగళవారం స్టేడియం పార్కింగ్ ఏరియా వద్ద జరిగిన గొడవలో సుశీల్, అజయ్, ప్రిన్స్ దలాల్, సోనూ మహల్, సాగర్ అమిత్ భాగంగా ఉన్నారని మా విచారణలో తేలింది. సుశీల్, అతని సహచరులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో వెతుకుతున్నాం’ అని అడిషనల్ డీసీపీ గురిక్బాల్ సింగ్ వెల్లడించారు. మరోవైపు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ జితేంద్ర సింగ్ రాసిన ఎఫ్ఐఆర్ కాపీలో ‘సుశీల్ పహిల్వాన్, అతని సహచరులు ఈ నేరం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది’ అని రాసి ఉంది. 1982 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన సత్పాల్ సింగ్కు కేంద్ర ప్రభుత్వం నుంచి అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు, పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు కూడా లభించాయి. కెరీర్ తొలినాళ్ల నుంచి సత్పాల్ సింగ్ వద్ద శిక్షణ తీసుకున్న సుశీల్ 2010లో సత్పాల్ సింగ్ కూతురు సావీని పెళ్లి చేసుకున్నాడు. -
జార్జి ఫ్లాయిడ్ కుటుంబానికి 196 కోట్ల పరిహరం
మినియాపొలిస్: అమెరికాలో తీవ్ర అలజడులకు, నిరసనలకు కారణమైన జార్జి ఫ్లాయిడ్ మరణ ఉదంతంలో మరో పరిణామం చోటుచేసుకుంది. నల్లజాతీయుడైన బాధితుడి కుటుంబానికి 27 మిలియన్ డాలర్ల (సుమారు రూ.196 కోట్లు) భారీ మొత్తాన్ని పరిహారంగా చెల్లించేందుకు మినియాపొలిస్ నగర కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఫ్లాయిడ్ కుటుంబ న్యాయవాది బెన్ క్రంప్ తాజా పరిణామంపై స్పందిస్తూ.. కేసు విచారణకు ముందు జరిగిన అతి పెద్ద సెటిల్మెంట్ ఇదేనన్నారు. ఈ సెటిల్మెంట్కు ఫ్లాయిడ్ కుటుంబం ఒప్పుకుందని కూడా ఆయన చెప్పారు. ఫ్లాయిడ్ మృతికి కారకులైన చౌవిన్, ఇతర మాజీ పోలీసులపై కోర్టులో కొనసాగుతున్న విచారణకు ఈ పరిణామానికి ఎలాంటి సంబంధం లేదని న్యాయ నిపుణులు అంటున్నారు. 2020 మే 25వ తేదీన డెరెక్ చౌవిన్ అనే పోలీసు అధికారి అనుమానంతో జార్జిఫ్లాయిడ్ను కిందపడేసి మెడపై తొమ్మిది నిమిషాల పాటు మోకాలితో నొక్కి ఉంచడంతో ఊపిరాడక చనిపోయిన ఘటన అమెరికాలో ఆగ్రహ జ్వాలకు కారణమైంది. -
800 తాబేళ్ల మృతి.. కలెక్టర్కు హైకోర్టు నోటీసులు
భువనేశ్వర్: ఆలివ్ రిడ్లేల మృత్యువాతపై రాష్ట్ర హైకోర్టు చొరవ కల్పించుకోవడం విశేషం. గహీరమ తీరంలో లెక్కకు మించి ఆలివ్రిడ్లే రకం తాబేళ్లు మరణిస్తుండడంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం నమోదైంది. ఈ నేపథ్యంలో వివరణ కోరుతూ కేంద్రాపడ జిల్లా కలెక్టర్, అటవీ-పర్యావరణ విభాగం కార్యదర్శికి కోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే గహీరమర మెరైన్ సాంక్చువరిలో ఆలివ్ రిడ్లేల సంరక్షణ మార్గదర్శకాల కార్యాచరణ సమీక్షించేందుకు హైకోర్టు త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న డాక్టర్ కార్తీక్ శంకర్(బెంగళూరు), పర్యావరణ విభాగం డైరెక్టరు డాక్టర్ సుశాంత నొందొ, న్యాయవాది మోహిత్ అగర్వాల్ గహీరమ, రుసికుల్యా సాగర తీరాలను సందర్శిస్తారు. అనంతరం ఆలివ్ రిడ్లేల సంరక్షణ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మత్స్యకారులు, స్థానికులు ఇతర అనుబంధ వర్గాలతో కమిటీ సభ్యులు ప్రత్యక్షంగా భేటీ అయి సంప్రదిస్తారు. మార్చి 10వ తేదీ నాటికి ఈ కమిటీ నివేదిక దాఖలు చేస్తుందని హైకోర్టు తెలిపింది. ఈ ఏడాది జనవరి నుంచి రాష్ట్రంలో ఆలివ్ రిడ్లేలు మరణాలు అత్యధికంగా చోటుచేసుకుంటుండగా, ఈ విషయంపై పలు వార్తా పత్రికల్లో వచ్చే కథనాల ఆధారంగా హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం నమోదు కావడం విశేషం. ప్రస్తుతం ఈ కేసు విచారణ మార్చి 15వ తేదీ నాటికి వాయిదా పడగా, జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 800 తాబేళ్లు మృతి చెందినట్లు వ్యాజ్యంలో పేర్కొన్నారు. దీనికి గహీరమ శాంక్చువరీ తీరంలో దాదాపు 30 కిలోమీటర్ల పొడవునా నీటిపై తేలిన తాబేళ్ల కళేబరాలు నిలువెత్తు సాక్ష్యంగా వ్యాజ్యంలో తెలిపారు. సియాలి నుంచి నాసి వరకు పలు తీరాల్లో తాబేళ్ల కళేబరాలు తారసపడ్డాయి. 1997లో గహీరమ-రూర్కీ ప్రాంతాన్ని మెరైన్ సాంక్చువరీగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆలివ్రిడ్లే సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆంక్షలు కూడా జారీ చేసింది. గతేడాది నవంబరు 1వ తేదీ నుంచి ఈ ఏడాది మే 31వ తేదీ వరకు గహీరమ తీరంలో 20 కిలో మీటర్ల పొడవునా చేపల వేట కూడా ప్రభుత్వం నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా, గహీరమ ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర తాబేళ్ల సంతతి ఉత్పత్తి తీరంగా వెలుగొందుతుండడం విశేషం. చదవండి: బాలాకోట్ ఆపరేషన్: లాంగ్ రేంజ్ స్టైక్ -
డ్యాన్సర్ గాయత్రి ఆత్మహత్య కేసులో ట్విస్ట్
సాక్షి, విజయవాడ: బెజవాడలో ఈవెంట్ డ్యాన్సర్ గాయత్రి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. గాయత్రి ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు గాయత్రి ఇంటికి నీలిమ అనే యువతి వచ్చివెళ్లిన విషయం తెలిసిందే. అయితే నీలిమ భర్త బన్నీతో గాయత్రికి అక్రమ సంబంధం ఉన్నట్లు సమాచారం. (చదవండి: ఈవెంట్ డ్యాన్సర్ అనుమానాస్పద మృతి) దీంతో కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. తాజాగా తన భర్తతో వివాహేతర సంబంధంపై గాయత్రితో నీలిమ గొడవ పడింది. మనస్తాపం చెందిన గాయత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా గాయత్రి ఇంటికి తాను వెళ్లిన మాట వాస్తవమేనని, అయితే ఆమెతో ఘర్షణ పడలేదని నీలిమ తెలిపింది. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో పోలీసులే తేల్చాలని నీలిమ వ్యాఖ్యానించింది.(చదవండి: టీడీపీ నేత బెదిరింపులు తాళలేక..) -
మత్తులో మనోళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత దేశవ్యాప్తంగా డ్రగ్స్ వినియోగంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మాదకద్రవ్యాల వినియోగంలో ఉన్న చీకటి కోణాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో డ్రగ్స్ వినియోగంపై సర్వేల వివరాలు వెలువడుతున్నాయి. టాప్–10 నగరాల్లో ఢిల్లీ, ముంబై.. జర్మనీకి చెందిన మార్కెట్ పరిశోధన సంస్థ ఏబీసీడీ ప్రపంచంలోని 120 దేశాల్లో 2018 డ్రగ్స్ వినియోగంపై డేటా ఆధారంగా జాబితాను రూపొందించింది. ఏబీసీడీ జాబితా ప్రకారం.. ► ప్రపంచంలో అత్యధికంగా డ్రగ్స్ వినియోగం న్యూయార్క్ నగరంలో జరుగుతోంది. ఇక్కడి ప్రజలు ప్రతి సంవత్సరం 70 వేల 252 కిలోల మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నారు. ► పాకిస్తాన్లోని కరాచీ నగరం రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ ఏటా 38 వేల 56 కిలోల డ్రగ్స్ను వినియోగిస్తారు. ► ప్రపంచంలోని టాప్–10 నగరాల జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ మూడో స్థానంలో, దేశ ఆర్థి క రాజధాని ముంబై ఆరో స్థానంలో ఉంది. ఢిల్లీవాసులు ప్రతీ సంవత్సరం 34 వేల 708 కిలోల డ్రగ్స్ వినియోగించగా, ముంబై వాసులు ప్రతీ ఏటా 29 వేల 374 కిలోల మాదక ద్రవ్యాలను వాడుతున్నారు. ► నాలుగోస్థానంలో అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ( 32,713 కిలోలు), ఐదోస్థానంలో ఈజిప్ట్లోని కైరో ( 29,565 కిలోలు), ఏడో స్థానంలో ఇంగ్లండ్ రాజధాని లండన్ (28,485 కిలోలు), ఎనిమిదోస్థానంలో అమెరికాలోని షికాగో (22,262 కిలోలు), తొమ్మిదోస్థానంలో రష్యా రాజధాని మాస్కో ( 20,747 కిలోలు), పదో స్థానంలో కెనడా రాజధాని టొరంటొ ( 20,638 కిలోలు) ఉన్నాయి. 5 ఏళ్లలో 14.74 లక్షల కిలోల డ్రగ్స్.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం 2019లో 3.42 లక్షల కిలోల కంటే ఎక్కువ మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. 35,310 మందిని ఎన్సీబీ అరెస్టు చేసింది. అరెస్ట్ అయిన వారిలో 35 వేల మంది పురుషులు, 284 మంది మహిళలు ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో 2015 – 2019 మధ్య దేశవ్యాప్తంగా ఎన్సీబీ 14.74 లక్షల కిలోల డ్రగ్స్ని స్వాధీనం చేసుకుంది. 2018 లో అత్యధికంగా 3.91 లక్షల కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. రోజుకు 23 మంది మృతి.. ఒకసారి మాదకద్రవ్యాలకు బానిసౖలైన వారు ఆ వ్యసనాన్ని వదిలించుకోవడం చాలా కష్టం. డ్రగ్స్ వినియోగంతోనూ ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. డ్రగ్స్ దొరకని పరిస్థితుల్లోనూ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. దేశంలో మాదకద్రవ్యాల వినియోగం కారణంగా ప్రతిరోజూ 23 మంది మరణిస్తున్నారని ఎన్సీబీ గణాంకాలు సూచిస్తున్నాయి. గతేడాది 7,860 మంది డ్రగ్స్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. డ్రగ్స్ అధిక మోతాదు కారణంగా 704 మంది మరణించారు. 2019లో డ్రగ్స్ కారణంగా 8,564 మంది మృతి చెందారు. దీని ప్రకారం ప్రతిరోజూ 23 మంది మాదకద్రవ్యాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. -
ముంబైలో టీఆర్పీ స్కామ్
ముంబై: ముంబైలో ఒక టెలివిజన్ రేటింగ్స్ పాయింట్స్(టీఆర్పీ) స్కామ్ వెలుగు చూసింది. టీవీ కార్యక్రమాల ప్రజాదరణను గణాంకాలతో వివరించే టీఆర్పీ ఆధారంగా ఆయా కార్యక్రమాలకు ప్రకటనలు వస్తాయి. ముంబైలో కొన్ని టీవీ చానళ్లు అక్రమ మార్గాల ద్వారా టీఆర్పీలను పెంచుకుంటున్న విషయాన్ని పోలీసులు గురువారం బట్టబయలు చేశారు. ఇందుకు సంబంధించి నలుగురిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. రిపబ్లిక్ టీవీకి కూడా ఈ కుంభకోణంలో భాగం ఉందని ముంబై పోలీస్ కమిషనర్ పరమ్వీర్ సింగ్ వెల్లడించారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి కేసులో మహరాష్ట్ర ప్రభుత్వంపై, ముంబై పోలీసులపై ఆ న్యూస్ చానల్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణంలో ఆ వార్తాచానల్ పాత్రకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశామని పరమ్వీర్ సింగ్ తెలిపారు. సుశాంత్ మృతి కేసులో ప్రశ్నించినందువల్ల ముంబై పోలీస్ కమిషనర్ తమపై తప్పుడు అభియోగాలు మోపారని ఆ చానల్ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి ఆరోపించారు. రెండు మరాఠీ చానళ్లు కూడా రెండు మరాఠీ చానళ్లు అయిన ఫాస్ట్ మరాఠీ, బాక్స్ సినిమాల యజమానులను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ చానళ్లకు చెందిన బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తున్నామన్నారు. ‘టీఆర్పీల ఆధారంగా∙చానళ్లకు ప్రకటనలు వస్తాయి. తద్వారా ఆదాయం వస్తుంది. ఇదంతా వేల కోట్ల వ్యవహారం. తప్పుడు విధానాలతో టీఆర్పీలను పెంచుకుని చూపించి ఆయా చానళ్లు ఆదాయం పెంచుకున్నాయి’ అని వివరించారు. ‘కొంతమంది ఎంపిక చేసిన వినియోగదారుల ఇళ్లల్లో బారోమీటర్లను ఏర్పాటు చేసి, ఆయా కుటుంబాలు చూస్తున్న చానళ్లను గుర్తిస్తారు. తద్వారా టీఆర్పీలను గణిస్తారు. అయితే, అక్రమంగా టీఆర్పీలను పెంచుకుని చూపాలనుకునే చానల్.. ఆయా వినియోగదారులకు డబ్బులు ఆశ చూపి, తమ చానల్నే ఎక్కువ సేపు చూడాలని, లేదా చూడకపోయినా తమ చానల్నే ఆన్ చేసి ఉంచాలని కోరుతాయి’ అని తెలిపారు. బారోమీటర్లు ఉన్న వినియోగదారుల్లో చాలామంది తాము డబ్బు తీసుకున్నట్లు విచారణలో అంగీకరించారన్నారు. టీఆర్పీలను ప్రతీవారం విడుదల చేసే బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బార్క్) అధికారులను కూడా విచారిస్తామన్నారు. ‘టీఆర్పీలను లెక్కించేందుకు ముంబైలో 2 వేల బారోమీటర్లు ఉన్నాయి. వాటి నిర్వహణను హంస అనే ఏజెన్సీకి బార్క్ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆ ఏజెన్సీ వారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఈ కుంభకోణాన్ని వెలికితీశాం’ అని వివరించారు. హంస ఏజెన్సీ మాజీ ఉద్యోగులు కొందరికి ఇందులో పాత్ర ఉందని పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు. మంబైలోనే కాకుండా ఈ తరహా మోసం దేశంలోని ఇతర నగరాల్లోనూ జరగుతుండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. -
సుశాంత్ కేసు : క్వారంటైన్లో బిహార్ పోలీసుల విచారణ
ముంబై : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుట్ మృతిపై బిహార్ పోలీసుల విచారణను అడ్డుకుంటున్నారని, ఈ కేసును క్వారంటైన్లోకి నెట్టారని మహారాష్ట్ర తీరును బిహార్ ఐపీఎస్ అధికారి వినయ్ తివారీ తప్పుపట్టారు. బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు తనను క్వారంటైన్ చేయలేదని సుశాంత్ కేసు విచారణను క్వారంటైన్ చేశారని ఆయన వ్యాఖ్యానించారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ దాఖలైన నేపథ్యంలో కేసు దర్యాప్తును పర్యవేక్షించేందుకు ముంబై చేరుకున్న పట్నా ఎస్పీ వినయ్ తివారీని కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా బీఎంసీ అధికారులు క్వారంటైన్ చేశారు. ఆగస్ట్ 15 వరకూ క్వారంటైన్లో ఉండాలని, ఆయనకు బీఎంసీ అధికారులు క్వారంటైన్ ముద్ర వేశారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జోక్యంతో క్వారంటైన్ నుంచి తివారీని బీఎంసీ అధికారులు విడుదల చేశారు.క్వారంటైన్లో ఉన్న బిహార్ ఐపీఎస్ అధికారి వినయ్ తివారీని ఆయన స్వరాష్ట్రానికి వెళ్లేందుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు అనుమతించారు. కాగా తివారీని విడుదల చేయాలని బిహార్ పోలీసులు కోరడంతో క్వారంటైన్ గడువుకు వారం ముందుగానే ఆయనను విడుదల చేశామని బీఎంసీ అధికారి తెలిపారు. ఇక సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతిపై దర్యాప్తునకు సంబంధించి రియా చక్రవర్తి శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. తన సోదరుడు సౌవిక్ చక్రవర్తితో కలిసి ముంబైలోనీ ఈడీ కార్యాలయానికి చేరుకున్న రియాపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. సుశాంత్కు చెందిన కోట్లాది రూపాయలను అక్రమంగా దారి మళ్లించినట్టు రియా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జూన్ 14న బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ముంబైలోని బాంద్రా నివాసంలో విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే. చదవండి : ఈడీ ముందుకు రియా: అరెస్ట్ చేస్తారా? -
సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ ప్రారంభం
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసు విచారణను బిహార్ పోలీసుల నుంచి గురువారం సీబీఐ స్వీకరించింది. ఎస్పీ నుపుర్ ప్రసాద్ నేతృత్వంలో డీఐజీ గగన్దీప్ గంభీర్, జాయింట్ డైరెక్టర్ మనోజ్ శశిధర్ పర్యవేక్షణలో సీబీఐ ఈ కేసును విచారించనుంది. డీఐజీ గగన్దీప్, జేడీ మనోజ్ గుజరాత్ కేడర్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారులు. సుశాంత్ స్వరాష్ట్రమైన బిహార్లో ఇప్పటికే పోలీసులు సుశాంత్ తండ్రి ఫిర్యాదుపై ఆయన ప్రియురాలిగా భావిస్తున్న రియా చక్రవర్తిపై నేరపూరిత కుట్ర, ఆత్మహత్యకు పురిగొల్పడం మొదలైన నేరాలకు సంబంధించిన ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు, సుశాంత్ ఆత్మహత్యపై ముంబై పోలీసులు కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటివరకు ముంబై పోలీసులు రియా చక్రవర్తి, బాలీవుడ్ దర్శకులు ఆదిత్యచోప్రా సహా మొత్తం 56 మందిని విచారించారు. -
సుశాంత్ స్నేహితుడి కదలికలపై పోలీస్ నజర్
పట్నా : బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై బిహార్ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో మహారాష్ట్ర పోలీసులు సహకరించడంలేదని, కేసుకు సంబంధించిన కీలక పత్రాలను అందచేయడం లేదని బిహార్ పోలీసులు ఆరోపిస్తున్న క్రమంలో పట్నా ఎస్పీ వినయ్ కుమార్ ముంబైకి పయనమయ్యారు. జులై 14 అర్ధరాత్రి 12.30-12.45 గంటల మధ్య సుశాంత్ రూం తలుపును ఓపెన్ చేసేందుకు ఆయన స్నేహితుడు, రూమ్మేట్ సిద్ధార్థ్ పితాని పిలిపించిన తాళాలు తయారుచేసే వ్యక్తి కోసం పట్నా పోలీసులు గాలిస్తున్నారు. కీ మేకర్ను గుర్తించామని, త్వరలోనే మొత్తం ఘటనపై అతడిని ప్రశ్నిస్తామని పోలీసులు పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా బిహార్ పోలీసులు సుశాంత్ సింగ్ రాజ్పుట్ విషాదాంతం సీన్ రీకన్స్ర్టక్షన్ చేపట్టారు. సుశాంత్ నివాసంలో పనిచేసే ఆయన సిబ్బందిలో పలువురిని సైతం పోలీసులు ప్రశ్నించారు. ఇక దర్యాప్తులో భాగంగా సుశాంత్ సిబ్బందిలో ఒకరు యువనటుడి గర్ల్ఫ్రెండ్ రియా చక్రవర్తి గురించి సంచలన విషయాలు వెల్లడించారు. సుశాంత్ బాంద్రా నివాసంలో రియా ఉన్నప్పుడు అన్ని విషయాలూ ఆమె కనుసన్నల్లోనే సాగేవని సుశాంత్ వద్ద పనిచేసే స్వీపర్ తెలిపారు. ఆమె అనుమతి లేకుండా సుశాంత్ రూంలోకి ఏ ఒక్కరికీ ప్రవేశం ఉండేది కాదని చెప్పారని తెలిసింది. సుశాంత్ గదిని శుభ్రపరచాలా, లేదా అనేది కూడా ఆమే నిర్ణయించేవారని చెప్పారు. జూన్ 14న సుశాంత్ విషాదాంతంలో తొలిసారి సుశాంత్ మృతదేహాన్ని చూసిన ఆయన స్నేహితుడు, రూమ్మేట్ సిద్ధార్థ్ పితాని ఆచూకీపైనా బిహార్ పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, సుశాంత్ మరణానికి ఆయన గర్ల్ఫ్రెండ్ రియా చక్రవర్తే కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి. చదవండి : ‘రియా చక్రవర్తి జాడ తెలియలేదు’ -
కిరణ్ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం
సాక్షి, ప్రకాశం: చీరాల ఎస్సై విజయకుమార్ దాడి చేసిన ఘటనలో కిరణ్ అనే దళిత యువకుడు గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈ నెల 19న బైకుపై వస్తూ మాస్క్ ధరించలేదని ఆగ్రహించిన ఎస్సై విజయకుమార్ లాఠీతో కిరణ్ను చితకబాదాడు. దీంతో అతడిని ఎస్సై సిబ్బందితో చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పూర్తి వివరాలను సేకరించాని జిల్లా ఎస్పీని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది. ఈ ఘటనపై స్పందించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరణించిన కిరణ్ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి అధికారులుతో విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. -
‘30 ఏళ్ల తర్వాతే పెరోల్కు అర్హుడు’
వాషింగ్టన్ : రెండేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మూడేళ్ల భారతీయ బాలిక షెరిన్ మాథ్యూస్ మృతి కేసులో అరెస్టయిన ఆమె దత్తత తండ్రి వెస్లీ మాథ్యూస్కి డల్లాస్ కోర్టు బుధవారం జీవిత ఖైదు విధించింది. 30 ఏళ్ల పాటు శిక్ష అనుభవించిన తర్వాతే అతను పెరోల్కు అర్హుడని తేల్చి చెప్పింది. ఓ మూడేళ్ల చిన్నారి పట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు అతని మిగతా జీవితం అంతా జైలులోనే గడపాలని కోర్టు ఆదేశించింది. కేరళకు చెందిన సైనీ, వెస్లీ దంపతులు 2016లో బిహారులోని ఓ శరణాలయం నుంచి ప్రత్యేక అవసరాలున్న షెరిన్ను దత్తత తీసుకుని అమెరికాకు తీసుకెళ్లారు. 2017 అక్టోబరు 7న షెరిన్ కనపించకుండా పోయిందంటూ వెస్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సరిగ్గా పాలు తాగనందుకు షెరిన్పై ఆగ్రహించిన వెస్లీ పాపను తెల్లవారుజామున మూడుగంటల ప్రాంతంలో షెరిన్ని ఒంటరిగా ఇంటి బయట నిలబెట్టనాన్నడు. తర్వాత వచ్చి చూసేసరికి పాప కనిపించలేదని వెస్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారిని ఇంటి నుంచి పంపించిన 15 నిమిషాలకే తాను వెళ్లి చూశానని.. అప్పటికే పాప అక్కడ లేదని వెస్లీ చెప్పాడు. అయితే అఫిడవిట్లో మాత్రం తాను సూర్యోదయం అయ్యాక వెళ్లి చూశానని పేర్కొన్నాడు వెస్లీ. కొన్నిరోజుల తార్వత వెస్లీ ఇంటికి సమీపంలో ఓ చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వైద్య పరీక్షల్లో ఆ మృతదేహం చిన్నారి షెరిన్దేనని తేలింది. దీంతో వెస్లీని విచారించగా.. అసలు విషయం బయటపెట్టాడు. ఘటన జరిగిన రోజు షెరిన్ పాలు తాగనని మారాం చేసిందని.. దాంతో తాను బలవంతంగా ఆమెతో పాలు తాగించానని వెస్లీ చెప్పాడు. ఈ క్రమంలో ఆమెకు వూపిరాడలేదని తెలిపాడు. కొద్ది సేపటికే ఆమె శ్వాస తీసుకోవడం ఆగిపోయిందని.. పల్స్ కూడా కొట్టుకోలేదని, దీంతో ఆమె చనిపోయినట్లు అర్థమైందని చెప్పాడు. ఆ తర్వాత మృతదేహాన్ని తానే ఇంటి నుంచి దూరంగా తీసుకెళ్లి గుర్తు పట్టరాకుండా చేసి కల్వర్టులో పడేశానని అంగీకరించాడు. -
ఎన్నికల విధుల్లో ఉద్యోగి మృతి
సాక్షి, సత్తుపల్లిటౌన్: ఎన్నికల విధులకు హాజరైన ఓ ఉద్యోగి, గుండెపోటుతో మృతిచెందారు. వైరాకు చెందిన ఎదునూరి నాగరాజు(35), మధిరలోని నీటి పారుదల శాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఆయనకు ఎలక్షన్ డ్యూటీ పడింది. సత్తుపల్లిలోని జ్యోతి నిలయం పాఠశాలలో ఏర్పాటైన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రానికి బుధవారం ఉదయం చేరుకున్నారు. సత్తుపల్లి మండలం కిష్టారంలోని 199 పోలింగ్ స్టేషన్ను ఇతనికి అధికారులు కేటాయించారు. పోలింగ్ సామాగ్రి తీసుకున్న తరువాత, మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఛాతీలో నొప్పిగా ఉన్నదంటూ అక్కడే ఉన్న వైద్య శిబిరానికి వెళ్లారు. ఆయనను డాక్టర్ చింతా కిరణ్కుమార్ పరీక్షించి, వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని సూచించి, హెల్త్ అసిస్టెంట్ డి.శ్రీనివాస్ తోడుగా ద్విచక్ర వాహనంపై సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి పంపించారు. అక్కడ ఆయనకు వెంటనే డాక్టర్ శివకృష్ణ ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. గుండెపోటుగా నిర్థారించి వైద్యం చేస్తుండగదానే నాగరాజు కుప్పకూలిపోయారు, ప్రాణాలొదిలారు. ఆయనకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. భార్య కృష్ణవేణి, కుమార్తెలు వెన్నెల, మనన్వి ఉన్నారు. మృతదేహాన్ని కుటుంబీకులకు సత్తుపల్లి తహసీల్దార్ కె.విజయ్కుమార్, ఆర్ఐలు విజయ్భాస్కర్, జగదీష్ అప్పగించారు. పిల్లల్ని ఎండకు పంపొద్దని చెప్పి... సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రిలో భర్త నాగరాజు మృతదేహంపై పడి భార్య కృష్ణవేణి, తల్లి గుండెలవిసేలా రోదించారు. ‘‘పిల్లలను ఎండకు పంపించొద్దు. ఇంటి దగ్గర జాగ్రత్త అని చెప్పి, డ్యూటీకి వెళ్లారు. ‘‘తాను తిరిగి రాలేననే... ఇన్ని జాగ్రత్తలు చెప్పారేమో’’నని ఆమె విలపిస్తుంటే... చూపరుల కళ్లల్లో తడి చేరింది. మృతదేహాన్ని అంబులెన్స్లో స్వగ్రామం వైరాకు తరలించారు. -
దివ్యభారతి మరణించిన రాత్రి ఏం జరిగింది?
ముంబై: నటి దివ్యభారతి మరణం వెనుక ఎటువంటి కుట్ర లేదని ఆమె తండ్రి ఓమ్ భారతి వెల్లడించారు. ప్రమాదవశాత్తు ఆమె మరణించిందని ఓ మేగజీన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. నేడు దివ్యభారతి 45వ జయంతి సందర్భంగా మరోసారి ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. దివ్యభారతి మరణంపై వ్యక్తమైన అనేక అనుమానాలు ఇప్పటికే అలాగే ఉన్నాయి. చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన దివ్యభారతి 1993, ఏప్రిల్ 5న అంధేరీ ప్రాంతంలోని తులసీ అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుంచి పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. దివ్యభారతి ఆత్మహత్య చేసుకోలేదని, ఆమెను ఎవరూ హత్య చేయలేదని ఓమ్ భారతి చెప్పారు. ఆమె మరణించడానికి కొద్ది గంటల ముందు ఏం జరిగిందనేది ఆయన మాటల్లోనే... ‘ ఆ రోజు దివ్య మద్యం సేవించింది. అంత ఎక్కువగా ఏమీ తాగలేదు. ఆమె కుంగుబాటుకు లోనుకాలేదు. అది ప్రమాదం మాత్రమే. పిట్టగోడపై కూర్చునివున్న ఆమె నియంత్రణ కోల్పోయి కింద పడిపోయింది. దివ్య ఫ్లాట్కు తప్ప ఆ అపార్ట్మెంట్లోని అన్ని ఫ్లాట్లకు గ్రిల్స్ ఉన్నాయి. కింద ఎప్పుడూ కార్లు పార్క్ చేసి వుండేవి. కానీ ఆ రాత్రి ఒక్క కారు కూడా లేదు. దివ్య నేరుగా కింద పడిపోయింది. నేను షాక్ గురయ్యాను. స్పృహ కోల్పోయాను. వైద్య బృందం వచ్చే సరికి ఆమె కొనప్రాణంతో ఉంది. దగ్గరలోని ఆస్పత్రికి తరలించిన కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయింద’ని ఓమ్ భారతి వివరించారు. -
టెకీ మృతిపై బెహన్ స్పందన ఇలా..
లక్నో : యాపిల్ ఎగ్జిక్యూటివ్ వివేక్ తివారీ మృతి కేసులో బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరగడం పట్ల బీఎస్పీ అధినేత్రి మాయావతి యోగి సర్కార్పై మండిపడ్డారు. ప్రభుత్వ తీరుతో యూపీలో శాంతిభద్రతల వ్యవస్థ కుప్పకూలినట్టు కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘తాను ముఖ్యమంత్రినైతే ముందుగా టెకీ హత్యకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకుని, ఆ తర్వాతే బాధిత కుటుంబానికి భరోసా ఇస్తానని, యూపీ సీఎం తరహాలో అందుకు భిన్నంగా వ్యవహరించబో’నని ఆమె స్పష్టం చేశారు. లక్నోలోని గోమతి ప్రాంతంలో శనివారం రాత్రి మహిళా సహోద్యోగితో కలిసి కారులో వెళుతున్న వివేక్ తివారీ (38)పై పోలీస్ కానిస్టేబుల్ కాల్పులు జరపగా, విండోనుంచి దూసుకెళ్లిన బుల్లెట్ టెకీ ప్రాణాలను బలిగొంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేశారు. టెకీ మృతిపై విపక్షాల నుంచి యోగి సర్కార్పై ముప్పేట దాడి తీవ్రమైంది. మరోవైపు బాధితుడి కుటుంబ సభ్యులు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ను కలుసుకున్నారు. ప్రభుత్వం వారికి అన్ని విధాలా సాయం చేస్తుందని ఈ సందర్భంగా సీఎం వారికి భరోసా ఇచ్చారు. -
‘లోయా మృతి’పై రివ్యూ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: సీబీఐ కోర్టు జడ్జి బీహెచ్ లోయా మృతిపై పునర్విచారణ జరపాల న్న పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. లోయాది సహజమరణమే అని ఏప్రిల్ 19న కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సమీక్షించాలని బాంబే లాయర్ల అసోసియేషన్ వేసిన పిటిషన్లో విచారణార్హమైన విషయాలేవీ లేవని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ల ధర్మాసనం పేర్కొంది. ‘రివ్యూ పిటిషన్, దానికి సంబంధించిన పత్రాలన్నింటిని క్షుణ్నంగా పరిశీలించాం. పాత ఉత్తర్వుల్లో మార్పు చేయడానికి తగిన కారణం కనిపించలేదు’ అని బెంచ్ తెలిపింది. సోహ్రాబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసును విచారిస్తున్న బీహెచ్ లోయా 2014, డిసెంబర్ 1న గుండెపోటుతో మరణించారు -
మూటలో విదేశీ మద్యం, కండోమ్స్
యశవంతపుర(కర్ణాటక): ఉడిపి శిరూరు మఠాధిపతి లక్ష్మీవరతీర్థ స్వామి అనుమానాస్పద మృతి కేసు విచారిస్తున్న పోలీసులకు మఠం పక్కలోని స్వర్ణనదిలో డీవీఆర్ (వీడియో రికార్డర్) బాక్స్ దొరికింది. స్వామి ధరించిన అనేక బంగారు ఆభరణాలు మాయమైనట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో నిత్యం స్వామి వేసుకున్న చేతి కడియాలు, మెడలో వేసుకునే ఖరీదైన బంగారు గొలుసు, చేతి ఉంగరం, బంగారు తుళసి మాల కనిపించటం లేదు. స్వామికి చెందిన మూడు బంగారు కడియాలలో ఒక కడియాన్ని అప్పుడప్పుడు ఆయన భక్తురాలుగా చెప్పుకునే రమ్యాశెట్టి ధరించేవారని తెలిసింది. ఆమె నగలు ధరించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనితో మిగిలిన బంగారును కూడా రమ్యాశెట్టినే దాచి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. బంగారంపై రమ్యాశెట్టి మక్కువ భక్తులు దానం చేసిన బంగారంపై రమ్యాశెట్టికి వ్యామోహం పెరగటంతో శుభ కార్యాలకు స్వామి ధరించే బంగారాన్ని ఆమె ధరించేవారని తెలిసింది. స్వామి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన తరువాత మఠంలోని బంగారు అభరణాలు గల్లంతయినట్లు ప్రచారం జరుగుతోంది. మణిపాల్ ఆస్పత్రిలో చేరినప్పుడు అయన చేతికి మూడు ఉంగరాలు ఉండగా, మిగిలిన నగలను మఠంలోని తన గదిలో భద్రపరిచిన్నట్లు తెలిసింది. దీనితో మఠంలో పని చేస్తున్న అనుమానితులను పోలీసులు పిలిచి విచారిస్తున్నారు. స్వామి తన వద్ద మూడు కేజీల బంగారం ఉన్నట్లు సమాచారం. ఆయన నిత్యం ఒక కేజీ బంగారు నగలను ధరించేవారు. అవి చాలా పురాతన కాలం నాటివని భక్తులు అంటున్నారు. రమ్యాశెట్టి మాత్రమే స్వామి గదికి వెళ్లేవారని రెండు రోజుల నుండి ఆమెను విచారిస్తున్న పోలీసులు చెబుతున్నారు. అజ్ఞాతంలో రమ్యా విచారణ మంగళవారం సాయంత్రం నుండి రమ్యాశెట్టిని పోలీసులు అజ్ణాత ప్రదేశానికి తీసుకెళ్లి విచారణ చేస్తున్నారు. ఆమె ఐదు మంది సహచరులు పోలీసుల అదుపులో ఉన్నారు. వారు వాడిన ముబైల్ నంబర్ల ఆధారంగా ముంబైకి లింక్లు ఉన్నట్లు నిర్థారించారు. బంధుమిత్రుల శుభ కార్యక్రమాలలో పాల్గొన్న ఆమె పోటోలను పోలీసులు సేకరిస్తున్నారు. గత రెండేళ్ల నుండి అమె స్వామిని మోసపుచ్చి లూటీ చేసిదంటూ సామాజిక మాధ్యమాలలో ఆరోపణలు వస్తున్నాయి. రమ్యాశెట్టి సుళ్యకు చెందిన మహిళ కాగా, ఆమె ముంబైలో కూడా కొంతకాలం నివాసం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మఠానికి అప్పుడప్పుడు ముంబైకి చెందిన బంగారం వ్యాపారులను పిలిపించి స్వామికి పరిచయం చేసినట్లు తెలిసింది. నాలుగు నెల క్రితం ఒక యాంటిక్ ఆభరణాన్ని ఆమె ధరించినట్లు పోలీసులు ఒక ఫోటోను సేకరించారు. దానిని స్వామి కూడా కొన్నిసార్లు ధరించినట్లు గుర్తించారు. నిత్య పూజలు ప్రారంభం బుధవారం నుండి శిరూరు మఠంలో నిత్యపూజలు, నైవేద్యలను ప్రారంభించారు. మూల మఠంలో ముఖ్యప్రాణ, మూల దేవుడుకి నైవేద్యం పెట్టి పూజలు చేశారు. లక్ష్మీ వరతీర్థస్వామి రోజు నాలుగుసార్లు బియ్యంతో నైవేద్యం, మూడుసార్లు పూజలు చేసేవారని భక్తులు తెలిపారు. మఠంలోనికి అర్చకులు, సిబ్బంది తప్ప భక్తులను అనుమతించటం లేదు. పోలీసుల విచారణ ముగిసిన తరువాత తదుపరి పీఠాధపతిని నియమించే అవకాశం ఉంది. నదిలో డీవీఆర్ స్వాధీనం మఠం పరిధిలోని బావిలో డీవీఆర్ దొరికిందని అందరూ ఊహించారు. కానీ దొరికిన మూటలో విదేశీ మద్యం, కండోమ్స్ లభించాయి. స్వామి నిద్రించే గదిలో కొన్ని ఔషధాలు కనిపించాయి. రమ్యాశెట్టితో సన్నిహితంగా ఉన్న అటోడ్రైవర్ జగదీశ్ను కూడా విచారిస్తున్నారు. డీవీఆర్ను హిరియడ్క మఠం పక్కలోని స్వర్ణ నదిలో పడేసిన్నట్లు చెప్పడంతో అక్కడ బుధవారం ఉదయం ఐదు గంటల సమయంలో గజ ఈతగాళ్ల సాయంతో దీనిని బయటకు తీశారు. రికార్డయిన సమాచారం ఉందో లేదో పోలీసులకు అర్థం కావటంలేదు. నదిలో వేసింది ఎవరనేది పోలీసులు విచారిస్తున్నారు. -
ఎయిర్హోస్టెస్ మృతి కలకలం
సాక్షి, న్యూఢిల్లీ: భర్త చేతిలో చిత్రహింసలకు గురైన ఎయిర్హోస్టెస్ మృతి దేశరాజధానిలో కలకలం రేపింది. దక్షిణ ఢిల్లీలోని పంచశీల పార్క్ వద్ద ఓ అపార్ట్మెంట్ పైనుంచి దూకి అనిస్సియా బత్రా(32) అనే ఎయిర్హోస్టెస్ ప్రాణాలు విడిచింది. అయితే ఆమె భర్త మయాంక్ సింఘ్వీ, అతని కుటుంబ సభ్యులే ఆమెను చంపేసి ఉంటారని అన్నిసా బంధువులు ఆరోపిస్తున్నారు. రెండేళ్ల క్రితం అనిస్సియాకు మయాంక్తో వివాహం జరిగింది. అయితే గత ఆరు నెలలుగా మయాంక్ తప్పతాగి వచ్చి అదనపు కట్నం కోసం ఆమెను హింసిస్తున్నాడు. ఈ వ్యవహారంలో అతని తమ్ముళ్లు కూడా సహకరిస్తున్నారు. దీంతో అనిస్సియా తండ్రి ఆర్ఎస్ బత్రా(రిటైర్డ్ ఆర్మీ అధికారి) కొన్నిరోజుల క్రితం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె భర్త, మరదులు కొన్నిరోజులుగా ఆమెను టార్చర్ పెడుతున్నారని, ఆమెకేమైనా అయితే వారిదే బాధ్యత అని బత్రా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదుకాగా, పోలీసులు ఆమె అత్తమామల్ని, మరుదులను ప్రశ్నించారు కూడా. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఆమె బిల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. చనిపోయేముందు... చనిపోయేముందు తన సోదరి తనకు ఫోన్ చేసిందని కరన్ బత్రా చెబుతున్నాడు. ‘నాకు ఫోన్ చేసింది. నన్ను గదిలో పెట్టి హింసిస్తున్నారు, పోలీసులకు సమాచారం అందించండని, రక్షించండని ఏడ్చింది. కాసేపటికే బిల్డింగ్ నుంచి దూకేసిందని, ఆస్పత్రిలో చేర్పించామని మయాంక్ ఫోన్ చేశాడు. తీరా ఆస్పత్రికి వెళ్లేసరికి ఆమె శవమై కనిపించింది. ఖచ్ఛితంగా వాళ్లే చంపేసి ఉంటారు’ అని కరణ్ ఆరోపిస్తున్నాడు. అంతేకాదు పోలీసులు సీజ్ చేసిన గదిని స్పేర్ కీ తో మయాంక్ తెరిచి సాక్ష్యాలను తారుమారు చేశాడని కరణ్ తెలిపాడు. అయితే పోలీసులు మాత్రం ఆ ఆరోపణలను ఖండించారు. -
అన్నాచెల్లెళ్ల మృతిపై దర్యాప్తు జరపాలి
జయపురం: కొరాపుట్ జిల్లా కొట్పాడ్ పోలీస్స్టేషన్ పరిధి కుసిమి రైల్వే పట్టాల వద్ద లభించిన యువకుడు, బాలికల మృతదేహాల సంఘటనపై దర్యా ప్తు జరిపి వాప్తవాలు తెలుసుకోవాలని మృతుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు వా రు కోట్పాడ్ పోలీసులను కలిసి విన్నవించారు. ఈ నెల 21 వ తేదీన కొరాపుట్ జిల్లా కొట్పాడ్ సమీప కుసిమి రైల్వేస్టేషన్ పట్టాలపై ఇద్దరు యువతీయువకుల మృతదేహాలు ఉన్నట్లు సాక్షిలో వార్త ప్రచురించిన విషయం విదితమే. పట్టా లపై మృతి చెందిన వారిద్దరూ అన్నా చెల్లెళ్లు అవుతారని తెలిసింది. వారిద్దరూ ఆముండి పొదర్ గ్రామానికి చెందినవారు. వారి మరణం ఎలా సంభవించిందన్నది చర్చనీయాంశమైంది. వారు ఆత్మహత్య చేసుకున్నారా? లేదా ఎవరైనా హత్య చేశారా? అన్నది వెల్లడి కాలేదు. అయితే వారిని ఎవరో హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. వార్డు మెంబర్ అర్జున భొత్ర, బాలిక ధనమతి ముదులి తండ్రి మెటా ముదులి, మృతి చెం దిన యువకుడు పరశురాం ముదులి తండ్రి సన ముదులి తదితరులు పోలీసులను కలిసి వారి మరణంపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని పోలీసులను కోరారు. ఉభయ కటుంబాల వారు దగ్గరి బంధువులు. మరణించి వారిద్దరూ వరుస కు అన్నా చెల్లెళ్లు. అంతేకాకుండా వారి మధ్య ఎటువంటి వివాదాలుగాని, తగాదాలు, కుటుంబ కలహాలుగాని లేవని బంధువులు వెల్లడించారు. వారు ఆత్మహత్య చేసుకోలేదని భావిస్తున్నామన్నారు. హత్యకు గురయ్యారేమో? వారిని ఎవరో హత్య చేసి రైల్వేట్రాక్ పక్కన పడవేశారని బంధువులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సంఘటనా స్థలంలో బాలిక దగ్గర విరిగిన గాజులు పడి ఉన్నాయని, కొంత దూరంలో రక్తపు మరకలు ఉన్నాయని పోలీసులకు తెలియజేశారు. అలాగే యువకుడి గావంచా కూడా పడి ఉందని తెలిపారు. సంఘటన జరిగిన రోజున ధనమతి, పరశురాంలు గ్రామంలో ఒక మహిళతో కలిసి కెనాల్ రోడ్డులో వెళ్లారని అందుచేత ఈ సంఘటనపై ఆ మహిళకు తెలిసి ఉండవచ్చని మృతుల కుటుంబ సభ్యులు, గ్రామవాసులు అభిప్రాయ పడుతున్నారు. మొదట అందరూ వారిని ప్రేమికులుగా అనుమానించారు. తరువాత వారి దగ్గర బంధువులు అన్నాచెల్లెళ్లు అని తెలిపారు. అయితే వీరిద్దరి మరణానికి గల పూర్తి కారణాలు తెలియరాలేదు. -
సునంద మృతి కేసులో కీలక విషయాలు
-
‘లోయా కేసుపై ఆశలు సజీవం’
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ న్యాయమూర్తి జస్టిస్ బీహెచ్ లోయ మరణం చుట్టూ అల్లుకున్న రాజకీయ దుమారం నేపథ్యంలో ఆయన మరణంపై వాస్తవాలు వెలుగుచూస్తాయనే ఆశ మిగిలిఉందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. జస్టిస్ లోయాది సహజమరణమేనని దీనిపై స్వతంత్ర విచారణ అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం ఆయన మృతిపై దాఖలైన పిటిషన్ను తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం తీర్పుతో ఇక ఆశలు ఆవిరైపోయాయని లోయా కుటుంబ సభ్యులు వ్యాఖ్యానించిన నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘లోయా కుటుంబ సభ్యుల ఆవేదనను అర్థం చేసుకున్నా.. అయితే ఇంకా ఆశలు సజీవంగానే ఉన్నాయని వారికి చెబుతున్నా..లక్షలాది భారతీయులు వాస్తవాలను చూస్తా’రని రాహుల్ ట్వీట్ చేశారు. జస్టిస్ లోయాను మరిచిపోయేందుకు భారత్ సిద్ధంగా లేదని వ్యాఖ్యానించారు. జస్టిస్ లోయా కేసుపై సుప్రీం ఉత్తర్వుల నేపథ్యంలో గురువారం కూడా రాహుల్ బీజేపీ, అమిత్ షాలను టార్గెట్ చేసుకుని వరుస ట్వీట్లలో విమర్శలు గుప్పించారు. ఏదో ఒకరోజు బీజేపీ చీఫ్ను వాస్తవం వెంటాడుతుందని వ్యాఖ్యానించారు. సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో గతంలో అమిత్ షా నిందితుడిగా ఉన్న క్రమంలో ఈ కేసును డీల్ చేస్తున్న సీబీఐ న్యాయమూర్తి జస్టిస్ లోయా మరణించడంపై దుమారం రేగింది. -
ఢిల్లీలో హత్య...ఉత్తరాఖండ్లో మకాం?
సాక్షి, డిల్లీ : గత ఏడాది ఢిల్లీలో ఓ డాక్టర్ను హత్య చేసి కలకలం సృష్టించిన సూయూష్ గుప్తా అనే నిందితుడు ఉత్తరాఖండ్లో తలదాచుకున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఓ లాడ్జ్లో అతడు దాగి ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. గుప్తా తన తోటి వైద్యుడు, స్నేహితుడైన డాక్టర్ శశ్వత్ పాండేను గతేడాది (2017) ఆగస్ట్లో గొంతు కోసి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పరరాయ్యాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. ఇప్పటి వరకు పోలీసులు అతడిని అరెస్టు చేసేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. పలుమార్లు అతడి కుటుంబానికి నోటీసులు పంపినా, అతని కోసం గాలింపు చేపట్టినా, చివరకు లక్ష రూపాయల రివార్డును ప్రకటించినా అతడి జాడ లేకపోయింది. అయితే తాజాగా అతడి ఆచూకీపై ఓ పోలీసు అధికారి వెల్లడిస్తూ, ‘అతను గతేడాది ఆగస్ట్లో హరిద్వార్ లోని ఒక లాడ్జ్లో ఉన్నట్లు సమాచారం వచ్చింది. కానీ అప్పటి నుంచి ఆచూకీ లభించలేదు. గుప్తా అక్కడ ఉన్నప్పుడు తన ఫోన్ను అక్కడ పనిచేసే వ్యక్తికి ఇచ్చి, ఏడాది తరువాత స్విచ్చాన్ చేయమన్నాడు. కానీ అతను మాత్రం నవంబర్లోనే ఆన్ చేశాడు. సిగ్నల్స్ ద్వారా దాన్ని ట్రేస్ చేసి పట్టుకున్నాము. కానీ అప్పటికే అతను అక్కడి నుంచి తప్పించుకున్నాడు. పాండేను చంపేముందు గుప్తా తన అకౌంట్లో నుంచి 8లక్షల రూపాయలను డ్రా చేశాడు. గుప్తాకు పాండే తప్ప మరో స్నేహితుడు లేడు. త్వరలోనే ఒక బృందాన్ని ఉత్తరఖాండ్కు పంపిస్తాం’ అని పోలీసు అధికారి తెలిపారు. -
పాండి మరణం కేసులో మలుపు
సాక్షి, చెన్నై: తమిళ ఇన్స్పెక్టర్ పెరియ పాండి మరణం కేసు మలుపు తిరిగింది. ఆయనను దుండగులు కాల్చి చంపేశారంటూ తమిళ పోలీసుల బృందం రచించిన నాటకాన్ని రాజస్తాన్ రాష్ట్రం పాలి జిల్లా పోలీసులు బట్టబయలు చేశారు. చెన్నై కొళత్తూరులోని ఓ నగల దుకాణం దోపిడీ కేసు ఛేదింపునకు రాజస్తాన్కు వెళ్లిన పోలీసుల బృందంపై దుండగులు కాల్పలు జరపడం, ఇందులో మదుర వాయిల్ ఇన్స్పెక్టర్ పెరియపాండి మరణించిన విషయం తెలిసిందే. అయితే, ఇది కట్టు కథగా పాలి పోలీసులు తేల్చారు. దుండగుడ్ని పట్టుకునే క్రమంలో మరో ఇన్స్పెక్టర్ మునిశేఖర్ తుపాకీ గురి తప్పడంతోనే పెరియపాండి మరణించినట్టు నిర్ధారించారు. తన తుపాకీ తీసుకుని దుండగుడు నాదూ రాం.. ఇన్స్పెక్టర్ పెరియ పాండిని కాల్చాడని మునిశేఖర్ పేర్కొనడంతో అనుమానమొచ్చిన పాలీ పోలీసులు విచారణ చేపట్టారు. తుపాకీని కాల్చింది మునిశేఖరే అని విచా రణలో తేలినట్లు పాలీ ఎస్పీ దీపక్ భార్గవ్ తెలిపారు. అజాగ్రత్తగా వ్యవహరించిన అతడిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ నెల 12న నాదూరాంను పట్టుకున్నప్పుడు పెరియపాండిపై దుండగుడి బంధువులు దాడి చేయగా, అతడిని రక్షించే క్రమంలో మునిశేఖర్ నాదూరాంకి గురిపెట్టి కాల్చిన తూటా గురి తప్పి పెరియపాండిని బలిగొనట్లు తేల్చారు. -
అమ్మ మరణంలో సంచలన కొత్త కోణం
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణ మిస్టరీపై జరుగుతున్న విచారణ మరో మలుపు తిరిగింది. ప్రభుత్వం తరపున నియమితులైన తామే ఆస్పత్రిలో ఉన్న జయను చూడలేక పోయామని విచారణ కమిషన్ ముందు వైద్య బృందం చెప్పుకొచ్చింది. 75 రోజుల పాటు ప్రత్యేక గదికే పరిమితమై, సాయంకాలం వరకు కాలక్షేపం చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. స్వల్ప అనారోగ్య కారణాలతో గత ఏడాది సెప్టెంబర్ 22వ తేదీన చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. అమ్మకు జరుగుతున్న చికిత్సను పర్యవేక్షించేందుకు ఐదుగురితో కూడిన ప్రభుత్వ వైద్యుల బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 75 రోజుల తర్వాత డిసెంబర్ 5న జయలలిత కన్నుమూశారు. దీనిపై ప్రతిపక్షాలు న్యాయవిచారణకు పట్టుపట్టడంతో గత ఏడాది సెప్టెంబర్ 25న ప్రత్యేక కమీషన్ ఏర్పాటు అయింది. ఇప్పటి వరకు 27 మంది తమ వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఇందులో భాగంగా మరో వందమందికి పైగా ఫిర్యాదులతో కూడిన వినతిపత్రాలు సమర్పించగా వీరికి సైతం సమన్లు పంపాల్సిందిగా ఆర్ముగస్వామి తన సిబ్బందిని ఆదేశించారు. ఈ నెల 12వ తేదీన ఆక్యుపంచర్ వైద్యుడు శంకర్, 13న జయ మేనకోడలు దీప, 14న దీప సోదరుడు దీపక్, 20న ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్, 21న ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మెహన్రావు హాజరయ్యేలా సమన్లు వెళ్లాయి. గదికే పరిమితం కమిషన్ విచారణలో భాగంగా గురువారం చైర్మన్గా ఆర్ముగస్వామి ముందు వాంగ్మూలం ఇచ్చిన ప్రభుత్వ వైద్యుల బృందం కొత్త విషయాలను బైటపెట్టింది. వైద్యుల బృందం ఏర్పాటైంది. ఈ బృందం కో ఆర్డినేటర్ డాక్టర్ బాలాజీ, ఇతర నలుగురు వైద్యులను కమిషన్ వేర్వేరుగా విచారణ జరిపింది. తిరుప్పరగున్రం, తంజావూరు, అరవకురిచ్చి ఉప ఎన్నికల్లో బీఫాం కోసం శశికళ సమక్షంలో తానే జయ వేలిముద్రలు సేకరించానని, ఆ సమయంలో మరెవ్వరూ లేరని బాలాజీ వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఆదే బృందంలోని మిగిలిన నలుగురు వైద్యులు మరో కోణాన్ని ఆవిష్కరించారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తాము ఒక్కసారి కూడా జయలలితను నేరుగా చూడలేదని, తమ కళ్లెదురుగా సీటీస్కాన్కు తీసుకెళ్లినపుడు సైతం ఆమె చుట్టూ కర్టెన్ కట్టారని తెలిపారు. అపోలో ఆస్పత్రిలో తమ నలుగురికీ కనీసం టీవీ కూడా లేని ఒక ప్రత్యేక గదిని కేటాయించారని చెప్పారు. గది నుంచి అప్పుడప్పుడూ బయటకు వదులుతారని, ఆ సమయంలో జయకు జరుగుతున్న చికిత్సపై విడుదల చేస్తున్న బులెటిన్ను తమకు చదివి వినిపిస్తారని అన్నారు. ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు గదిలో కూర్చుని వెళ్లిపోవడం మినహా చేసింది ఏమీ లేదని వారు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ప్రభుత్వం నియమించిన ఐదుగురు వైద్యుల బృందంలో బాలాజీ ఒక్కరు మాత్రమే జయ వద్దకు వెళ్లడం, మిగిలిన వారిని దూరంగా పెట్టడంపై అనుమానాలు రేగాయి. ఈనెల 27వ తేదీన మరోసారి హాజరుకావాల్సిందిగా డాక్టర్ బాలాజీని కమిషన్ ఆదేశించింది. మాజీ సీఎస్లకు సమన్లు విచారణ పూర్తి చేసిన నివేదిక అందజేసేందుకు మరో ఆరునెలల గడువు ఇవ్వాల్సిందిగా విచారణ కమిషన్ శుక్రవారం ప్రభుత్వానికి లేఖ రాసింది. సెప్టెంబర్ 25వ తేదీన కమిషన్ ఏర్పాటు సమయంలోనే ప్రభుత్వం మూడునెలల గడువు విధించింది. ఆర్ముగస్వామి బాధ్యతల స్వీకరణలోనే (అక్టోబర్ 24) నెలరోజుల జాప్యం ఏర్పడింది. ఆ తరువాత విచారణ వేగవంతంగా సాగుతున్నా ఈనెల 24వ తేదీతో ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగుస్తుంది. ఇంకా పలువురిని విచారించాల్సి ఉన్నందున మరో ఆరునెలలకు గడువు పొడిగించాల్సిందిగా కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసింది. -
టెలికాలర్ సునీతది ఆత్మహత్య?
-
టెలికాలర్ సునీతది ఆత్మహత్య?
పెళ్లికి నిరాకరించడమే కారణమా! హైదరాబాద్: మాదాపూర్ భాగ్యనగర్ సొసైటీలో మంటల్లో కాలి చనిపోయిన టెలికాలర్ సునీతది ఆత్మహత్యగా పోలీసులు నిర్ధారణకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అనేక కోణాల్లో విచారిస్తున్నారు. పెళ్లికి పట్టుబట్టడంతో గత ఆగస్టు నుంచి సునీతను అతడు దూరంగా పెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో వాలెంటైన్స్ డే నాడు కలిసేందుకు ప్రియుడు నిరాకరించడంతో సునీత తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. (చదవండి: టెలికాలర్ దారుణ హత్య) గచ్చిబౌలిలో టెలికాలర్గా పనిచేసే ప్రియుడిని భాగ్యనగర్ సొసైటీ రోడ్డులో కలిసేదని, ఈ క్రమంలోనే అక్కడ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆత్మహత్యగా పరిగణించేందుకు పూర్తిస్థాయి ఆధారాలు లభించలేదని, సునీత మరణంలో ఇంకెవరికైనా ప్రమేయం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా హత్యా... ఆత్మహత్యా అన్నది నిర్ధారించాల్సి ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు. (సన్నిహితుడే హంతకుడు!) (టెలీకాలర్ సునీత హత్య కేసులో పురోగతి) -
నెల కావస్తున్నా స్పష్టత లేదు..
ఇంకా మిస్టరీగానే తనూజ మృతి కేసు కేసులో కనీస పురోగతి సాధించలేకపోయిన పోలీసులు పెందుర్తి(విశాఖపట్నం): అనుమానస్పదంగా మృతి చెందిన కృష్ణరాయపురం బాలిక తనూజ మృతి కేసు అడుగు కూడా ముందుకు పడలేదు. గత నెల 23న అర్ధరాత్రి(24 ఉదయం వెలుగులోకి వచ్చింది) జరిగిన ఈ ఘటనలో పోలీసులు కనీస పురోగతి సాధించలేకపోయారు. గత నెల రోజులుగా పలువురు అనుమానితులను విచారించారు. అనేక ఆధారాలు సేకరించారు. అయినా ఈ కేసులో కనీస పురోగతి లేదు. తీవ్ర సంచలనం రేపిన ఈ కేసులో చివరకు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అది ఎప్పుడు వస్తుందో వారికీ స్పష్టత లేదు. ఆ అపార్ట్మెంట్లో ఏం జరిగింది.. కృష్ణరాయపురంలో నివాసం ఉంటున్న కె.నాగేశ్వరరావు, అరుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో చిన్నకుమార్తె తనూజ(14) పురుషోత్తపురం మహతి పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతుంది. రోజూ ఇంటి నుంచి పాఠశాలకు నడిచుకుని రాకపోకలు సాగిస్తుంది. ఈ క్రమంలో జూలై 23న(శనివారం) సాయంత్రం పాఠశాల నుంచి వస్తున్న తనూజతో ఓ యువకుడు మాట్లాడుతూ వస్తుండగా ఆమె అక్క చూసింది. విషయాన్ని తల్లికి చెప్పడంతో అదే రోజు రాత్రి తనూజని మందలించింది. దీంతో మనస్థాపం చెందిన తనూజ ఇంటి నుంచి బయటకు వచ్చి సమీపంలోని ఓ అపార్ట్మెంట్ ప్లాట్లో ఉంటున్న స్నేహితురాలి వద్దకు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే అదే అపార్ట్మెంట్ కింద ఉన్న గోడకు ఆనుకుని తనూజ మతదేహం జూలై 24న(ఆదివారం) ఉదయం కనిపించింది. తల్లి మందలించడంతో అలిగి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తనూజ ఆ అపార్ట్మెంట్కు వెళ్ళడం వాచ్మెన్తో పాటు స్థానికులు చూసినట్లు చెబుతున్నారు. అక్కడకు వెళ్ళిన తనూజ స్నేహితురాలి వద్దకు వెళ్ళిందా..స్నేహితుడి సన్నిహితుల ప్లాట్కు వెళ్ళిందా అన్నది స్పష్టత రావడం లేదు. లేకపోతే తనూజ ఒంటరిగా బయటకు రావడం చూసి అక్కడే పొంచి ఉన్న ఆకతాయిలు ఏమైనా చేశారా అన్నది అంతుచిక్కడం లేదు.. మొత్తానికి ఈ ఘోరం అపార్ట్మెంట్ వేదికగానే జరిగిందన్నది సుస్పష్టం. ఫోరెన్సిక్ రిపోర్టు రావాలి..విజయ్కుమార్, ఎస్ఐ తనూజ కేసును అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. ఏ క్లూ దొరికినా వదిలిపెట్టం. అయితే కొన్ని విషయాల్లో స్పష్టత రావాల్సి ఉంది. ఫోరెన్సిక్ రిపోర్టు వస్తే విషయం తెలుస్తుంది. మరికొద్దిరోజుల్లో రిపోర్టు రావచ్చు. -
ఎస్వీఎస్ విద్యార్థినులది హత్యేనా?
సాక్షి, చెన్నై: విల్లుపురం ఎస్వీఎస్ కళాశాల విద్యార్థినుల మృతికేసు మలుపు తిరిగింది. ఇది ముమ్మాటికి హత్యే అన్న వాదనలకు బలం చేకూరే రీతిలో కోర్టుకు పోస్టుమార్టం నివేదిక చేరింది. ఊపిరి ఆడక పోవడం వల్లే మరణించినట్టుగా నివేదిక లో పేర్కొనబడి ఉండడం కేసును మలు పు తిప్పి ఉన్నది. అలాగే, బావిలో దూకి మరణించి ఉంటే, ఊపిరి తిత్తుల్లోకి నీళ్లు చేరి ఉండేదని పేర్కొన బడి ఉండడంతో ఆ ముగ్గురిదీ హత్యే అన్న వాదనకు బలం చేకూరినట్టు అవుతోంది. విల్లుపురం జిల్లా కళ్లకురిచ్చిలోని ఎస్వీఎస్ సిద్ధ వైద్య కళాశాలకు చెందిన విద్యా కుసుమాలు మోనీషా, శరణ్య, ప్రియాంకలు అనుమానాస్పద స్థితిలో బావిలో గత నెల శవాలుగా తేలిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలాన్ని సృష్టించింది. ఈ కేసులో తొలుత ఆ జిల్లా యంత్రాంగం ఎవర్నో రక్షించే ప్రయత్నం చేసినట్టుగా మెతక వైఖరి అనుసరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు బయలుదే రడం, విద్యార్థిలోకం కన్నెర్ర చేయడంతో కేసును ఓ సవాల్గా తీసుకోవాల్సి వచ్చింది. అయితే, ఆత్మహత్య కేసుగా విచారణ సాగించినా, తదుపరి పరిణామాలతో స్థానిక పోలీసుల చేతి నుంచి కేసును సీబీసీఐడీ తన గుప్పెట్లోకి తీసుకుంది. ఈ కేసులో ఆ కళాశాల కరస్పాండెంట్ వాసుకీతో పాటుగా నలుగురు అరెస్టు అయ్యారు. ఈ అరెస్టులతో ఆ కళాశాలకు అస్సలు గుర్తింపు లేదన్న విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, ఆ విద్యార్థినుల మృతి మిస్టరీగానే ఉండడంతో దర్యాప్తు వేగం పెరగలేదని చెప్పవచ్చు. తన కుమార్తె మృతిలో అనుమానాలు ఉన్నాయంటూ మోనీషా తండ్రి కోర్టును ఆశ్రయించడంతో ఆమె మృత దేహానికి మరో మారు పోస్టుమార్టం చెన్నైలో జరిగింది. హత్యేనా: మద్రాసు హైకోర్టులో విచారణలో ఉన్న మోనీషా తండ్రి తమిళరసన్ దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. కోర్టుకు విల్లుపురం వైద్య వర్గాలు జరిపిన పోస్టుమార్టం నివేదిక చేరడం,అందులో పేర్కొన్న అంశాలు కేసును మలుపు తిప్పినట్టు చేసింది. అందులో మృతి చెందిన వారి ఊపిరి తిత్తుల్లో నీళ్లు లేవు అని పేర్కొని ఉండడంతో ఇది ముమ్మాటికీ హత్యే అన్న వాదనలకు బలం చేకూరినట్టు అవుతోంది. అయితే, ఊపిరితిత్తుల్లోనే నీళ్లు చేరని దృష్ట్యా, ఇది హత్యే అన్న వాదనను తమిళరసన్ తరపు న్యాయవాదులు కోర్టు ముందు ఉంచే పనిలో పడ్డారు. కాగా, ఇప్పటికే చెన్నైలో జరిగిన పోస్టుమార్టం మేరకు మోనీషా ఊపిరి ఆడకపోవడం వల్లే మరణించిం దని, ఊపిరి ఆడకుండా చేసి మరణించి నానంతరం నీళ్లలోకి తెచ్చి పడేసినట్టుం దని తమిళరసన్ తరపు వైద్యుడు సంపత్ స్పష్టం చేసి ఉండడంతో ఇది హత్యే అన్న వాదనకు బలం చేకూరినట్టు అయింది. అయితే, నివేదికను సమగ్రంగా పరిశీలించాల్సిన అవశ్యం ఉన్న దృష్ట్యా, ఈ కేసును హత్య కేసుగా నమోదు చేసి, తదుపరి విచారణ కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోనన్న ఉత్కంఠ బయలు దేరింది. తన కుమార్తె శరణ్య మృత దేహానికి సైతం రీ పోస్టుమార్టం జరపాలని కాంచీపురం జిల్లా సెయ్యారుకు చెందిన ఏలుమలై కోర్టును ఆశ్రయించడంతో, ఈ పిటిషన్లన్నింటిపై మంగళవారం కోర్టు విచారణ నిర్వహించి, ఉత్తర్వుల్ని జారీ చేయనుంది. -
కారులో వచ్చి దొరికి'పోయాడు'
నటుడు బాలప్రశాంత్ మృతి కేసు దర్యాప్తులో వెల్లడి? హైదరాబాద్: స్కోడా కారులో రావడమే వర్ధమాన సినీ నటుడు బాలప్రశాంత్ మృతికి కారణమైందా... అంటే అవుననే చెబుతున్నాయి పోలీసు విచారణలో వెల్లడవుతున్న విషయాలు. పోలీసుల కథనం ప్రకారం...ఈనెల 13న ప్రియురాలి భర్త అనంతపురంలోని ఒక ఫంక్షన్కు వెళ్లాడు. ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా రమ్మని ప్రియుడు బాలప్రశాంత్ని పవర్నగర్లో ఉండే వివాహిత ఆహ్వానించింది. అయితే ఆమె భర్త... బావమరిదికి ఫోన్చేసి ఇంట్లో మీ అక్క ఒక్కతే ఉందని, ఇంటికి వెళ్లి ఉండాలని చెప్పాడు. దీంతో అతను ఇంటికి వెళ్లి గడియ కొట్టగా తాను నిద్రపోతున్నానని ఇంటికి వెళ్లిపోమని సోదరుడికి ఆమె చెప్పింది. ఈ విషయాన్ని బావమరిది.. బావకు చెప్పడంతో అనుమానం వచ్చిన ఆయన సెల్లార్లో వాహనాలు ఉన్నాయేమో చూడమని చెప్పాడు. స్కోడా కారు ఉందని బావమరిది చెప్పడంతో అనుమానం వచ్చిన భర్త... తన అక్కాబావలను తన ఇంటికి వెళ్లమని చెప్పాడు. వారు వెళ్లగా గడియ తీసిన వివాహిత ‘నన్ను ప్రశాంతంగా ఉండనీయండి’.. అంటూ చేతులు కోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా, అక్కడి నుంచి ఆమె సెల్ఫోన్ ద్వారా ‘ ప్లీజ్ ఎలాగైనా తప్పించుకో’ అని బాలప్రశాంత్కు మెస్సేజ్ పెట్టగా.. అలాగే చేస్తా అని అతను తిరిగి మేస్సేజ్ పెట్టాడు. తర్వాత ఇంట్లోంచి తప్పించుకొని వెళ్లే క్రమంలో అపార్ట్మెంట్పై నుంచి కిందపడి మృతి చెందినట్టు భావిస్తున్నారు. కాగా, మూసాపేటలోని ఆంజనేయనగర్లో బాలప్రశాంత్ నిర్వహిస్తున్న డ్యాన్స్ స్కూల్కు తన కూతురిని రెండేళ్లుగా పంపిస్తున్న ఆమె అతడికి దగ్గరైందని తెలిసింది. -
సారిక కేసులో ఏ4గా సన
-
వారికి పాలిగ్రాప్ పరీక్షలు చేయొచ్చు
న్యూఢిల్లీ: సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో వాస్తవాలు తెలుసుకునేందుకు శశిథరూర్ ఇంటి సహాయకులపై నిజనిర్దారణ పరీక్షకు(పాలిగ్రాప్ టెస్ట్) ఢిల్లీ కోర్టు అనుమతించింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) ఈ మేరకు అనుమతి పొందింది. అయితే, ఇది ఎప్పుడు నిర్వహిస్తారన్న విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. శశిథరూర్ భార్య అయిన సునందా పుష్కర్ అనుమానాస్పద స్థితిలో చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పలు అనుమానాలు దారితీయడంతో కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. వారి దర్యాప్తులో భాగంగా థరూర్ సేవకులైన నరేన్ సింగ్, డ్రైవర్ బజ్ రంగీ, స్నేహితుడు సంజయ్ దెవాన్పై పాలిగ్రాప్ పరీక్షలు చేయాలని నిర్వహించింది. వారు ఏవో నిజాలు దాస్తున్నారని, ఈ పరీక్ష ద్వారా అవి తెలిసి కేసులోని పలు అనుమానాలకు పరిష్కారం చూపినట్లవుతుందని సిట్ భావించింది. ఈ నేపధ్యంలోనే ఢిల్లీ కోర్టు అనుమతినిచ్చింది. -
సునంద కేసులో ముగ్గురికి 'లైడిటెక్టర్' పరీక్షలు
-
సునంద కేసులో ఆ ముగ్గురికి 'లై డిటెక్టర్' పరీక్షలు
కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ హత్య కేసు దర్యాప్తు కీలక మలుపు తీసుకోనుంది. హత్య జరిగిన రోజు.. అంతకు ముందు చోటుచేసుకున్న పరిణామాలను శోధిస్తోన్న ఢిల్లీ పోలీసులు.. ముగ్గురు సాక్షులకు లై డిటెక్టర్ (సత్యశోధన) పరీక్షలు నిర్వహించేందుకు అనుమతినివ్వాలని కోర్టుకు విన్నవించారు. శశి థరూర్ వ్యక్తిగత సహాయకుడు నారాయణ్ సింగ్, డ్రైవర్ భజరంగి, స్నేహితుడు సంజయ్ దావన్లు దర్యాప్తునకు సహకరించడంలేదని, జవాబులు తెలినప్పటికీ కీలకమైన ప్రశ్నలు కొన్నింటికి సమాధానాలు దాటవేస్తున్నారని, అందుకే ఆ ముగ్గురికి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాల్సిఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. సదరు సాక్షులు ముగ్గురు మే 20న కోర్టుకు హాజరుకానున్న నేపథ్యంలో ఆ రోజే వారిని పోలీసు కస్టడీకి అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. -
గర్భిణి మృతి కేసులో తీర్పును నిలిపేసిన కోర్టు
న్యూఢిల్లీ: గర్భం తీసేసిన డాక్టర్ ఆమె చావుకు కారణమైన కేసులో కోర్టు తీర్పును నిలిపివేసింది. ఆ చికిత్స చేసేందుకు అతనికి కనీస అర్హతలు లేవని జిల్లా జడ్జి ఐనా మల్హోత్రా తేల్చి చెప్పారు. ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్న డాక్టర్ యశ్వంత్ కుమార్ జైన్ నిర్లక్ష్యంతో చావుకు కారణమైన నేరం కింద ట్రయల్ కోర్టు విధించిన 18 నెలల శిక్షను ఒక ఏడాదికి తగ్గించింది. 1996లో ఆరు వారాల గర్భిణీ అయిన మహిళకు గర్భం తీసేయడంతో చనిపోయింది. తప్పుడు ఇంజెక్షన్ ఇవ్వడం, క్లినిక్లో సరైన సౌకర్యాలు లేకపోవడం వల్లే గాయత్రి చనిపోయిందని ఆమె భర్త రణ్బీర్ సింగ్వర్మ కేసు నమోదు చేశారు. అయితే గర్భం తీసేయడం వల్ల ఆమె ప్రాణానికే ప్రమాదమని ముందే హెచ్చరించినా గర్భం తీసేయించుకుం దని, నిజానికి చికిత్స చేసే సమయంలో ఆమెకు ఎలాంటి హానీ జరగలేదని డాక్టర్ కోర్టుకు తెలిపారు. ఎనిమిదేళ్ల నుంచి చికిత్స అంది స్తున్నా ఇంతవరకు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని కోర్టుకు చెప్పారు. కేసు పూర్వాపరాలు విన్న కోర్టు తీర్పును నిలిపివేసింది. -
ఈశాన్యవాసుల క్షేమమే పార్లమెంట్ కాంక్ష
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో అరుణాచల్ప్రదేశ్ యువకుడు నిడో తానియా హత్యను లోక్సభ బుధవారం ఖండించింది. యువకుని మరణాన్ని యావత్ భారతదేశం ఖండిస్తోందని, ఈశాన్య ప్రాంతవాసులను రక్షించాలని పార్లమెంటు ఆకాంక్షిస్తోందన్న విస్పష్ట సందేశం దేశ ప్రజల్లోకి వెళ్లాలని స్పీకర్ మీరా కుమార్ చెప్పారు. సిగ్గుచేటు ఘటన: సుష్మాస్వరాజ్నిడో హత్య అంశాన్ని జీరో అవర్లో లేవనెత్తిన ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ ఈ ఘటనను సిగ్గుచేటుగా అభివర్ణించారు. నిడో మరణంతోపాటు ఇద్దరు మణిపురి యువతుల వేధింపుల ఘటననూ ఆమె సభలో ప్రస్తావించారు. ఈశాన్య ప్రాంతవాసులపట్ల వివక్షను రూపుమాపాలని ఆమె కోరారు. ఢిల్లీవాసులు దేశంలోని వైవిధ్యాన్ని అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈశాన్య ప్రాంతాల విద్యార్థుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈశాన్య ప్రాంతవాసులను రక్షించవలసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధర్నాలు చేస్తూ కూర్చుంటున్నాయని పరోక్షంగా కేజ్రీవాల్ను విమర్శించారు. ఈశాన్య ప్రాంత విద్యార్థులు దేశంలోని ఇతర ప్రాంతాల వారితో కలిసి నివసించేందుకు వీలుగా హాస్టల్స్ నిర్మించాలని డిమాండ్ చేశారు. చర్యలకు వామపక్షాల డిమాండ్... వామపక్ష ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తి నేరస్తులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈశాన్య ప్రాంతవాసుల పట్ల జాతివివక్షను ఆపండి అని రాసిఉన్న పోస్టర్ను వారు ప్రదర్శించారు. ఈశాన్య ప్రాంత విద్యార్థుల పట్ల జాతి వివక్ష తీవ్రమైన అంశమని, దానిని రూపుమాపాలని మైనారిటీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి నినాంగ్ ఎరింగ్ అన్నారు. నీడో మరణాన్ని రాజకీయం చేయవద్దని కోరారు. ఇటువంటి ఘటనలు జరుగకుండా ఉండేందుకు కఠిన చట్టం తేవాలని ఆయన కోరారు. జేడీయూ నేత శరద్ యాదవ్ ఈ అంశంపై మాట్లాడుతూ... ఇది దేశ ఐక్యతకు సంబంధించిన విషయమని, ఎవరికీ అన్యాయం జరగకూడదని అన్నారు. నిడోను చంపిన నిందితులెవరో ఇప్పటికీ పోలీసులు గుర్తించలేదని సభ దృష్టికి తెచ్చారు. తాజా నివేదికివ్వండి: హైకోర్టు నగరంలో నిడో తానియా మరణంపై తనంతటతానుగా విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు... ఢిల్లీ పోలీసులు సమర్పించిన నివేదికను బుధవారం తోసిపుచ్చింది. మృతుడి పోస్ట్మార్టమ్కు సంబంధించిన అన్ని వివరాలతోపాటు తాజా నివేదికను సమర్పించాలని ఢిల్లీ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. నత్తనడకన దర్యాప్తు జరుపుతున్న తీరును న్యాయస్థానం తప్పుపట్టింది. ఐదుగురు సభ్యులతో కమిటీ.. నగరంలో ఈశాన్య వాసుల సమస్యలను పరిశీలించడం కోసం హోం మంత్రిత్వశాఖ ఐదుగురు సభ్యుల కమిటీని నియమించింది. నిడో మరణంపై న్యాయ దర్యాప్తుకు కూడా మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. -
కూతుర్ని చంపి.. తల్లి ఆత్మహత్యాయత్నం
అమెరికాలో తెలుగు మహిళ ఘాతుకం వాషింగ్టన్: అమెరికాలోని ఫ్లోరిడాలో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన సుజాత గూడూరు(44) తన కుమార్తె చేతన(17)ను .38 రివాల్వర్తో కాల్చి చంపి తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నానని అయితే, చేతన అనాథగా మారుతుందని భావించి తొలుత ఆమెను కాల్చి, అనంతరం తనను తాను కాల్చుకున్నట్లు పోలీసులకు వివరించారు. కొన్ని వారాల కిందటే ఆత్మహత్య చేసుకోవాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్న సుజాత విషయాన్ని ఈ-మెయిల్ ద్వారా తన సోదరుడికి వివరించారు. చేతనపై రెండు రౌండ్లు కాల్పులు జరిపిన అనంతరం సుజాత తనపై కాల్పులు జరుపుకొన్నారు. సోమవారం ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో ఉన్న తల్లీ కుమార్తెలను ఆర్లాండో వైద్యశాలకు తరలించారు. అక్కడ చేతన ప్రాణాలు కోల్పోగా సుజాత కోలుకుంటున్నారు. మరోవైపు ఈ ఉదంతం గురువారం గుంటూరులో కలకలం సృష్టించింది. సుజాత గుంటూరుకు చెందిన మహిళ అని, మానసిక వ్యాధితో బాధపడుతున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. -
శశిథరూర్కు సునంద సోదరుడు మద్దతు
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ మృతి కేసులో కేంద్ర మంత్రి శశిథరూర్కు ఆమె కుటుంబం నుంచి గట్టి మద్దతు లభించింది. థరూర్ సునందకు హాని చేస్తారని ఊహించలేమని పుష్కర్ సోదరుడు రాజేశ్ పేర్కొన్నారు. ఈయన భారత సైన్యంలో కల్నల్గా పనిచేస్తున్నారు. తమ కుటుంబాన్ని వ్యథకు గురిచేస్తున్న వదంతులకు ఇకనైనా ముగింపు పలకాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సునంద ఎంతో దృఢమైన వ్యక్తిత్వమున్న మనిషని, ఆమె తనను తాను గాయపరుచుకుంటార ని అనుకోవడం కూడా అసంబద్ధం, నమ్మలేని విషయమని చెప్పారు. వారి దాంపత్య జీవితం యూవత్తూ తాను వెన్నంటి ఉన్నానని, వారు పరస్పరం పిచ్చి ప్రేమలో ఉన్నట్టు తాను చెప్పగలనని కల్నల్ రాజేశ్ పేర్కొన్నారు. విభేదాలేమైనా ఉంటే క్షణికమేనని, ప్రతి కుటుంబంలో అవి సాధారణమేనని చెప్పారు. వదంతులకు తెరదించేందుకు కేసును వేగంగా దర్యాప్తు చేయూలని ఆయన కోరారు. అంతకుముందు సునంద కుమారుడు శివ్మీనన్ కూడా తన తల్లి మృతి వెనుక కుట్ర ఉందనడాన్ని తాను విశ్వసించబోనంటూ ప్రకటించిన విషయం తెలిసిందే.