delta
-
నిజాం షుగర్స్ నుంచి ‘డెల్టా’ ఔట్?
సాక్షి, హైదరాబాద్: నిజాం డెక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్) పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా.. ఇందులో భాగస్వామ్యం ఉన్న డెల్టా పేపర్స్ లిమిటెడ్ సంస్థ తన 51 శాతం వాటాను ఉపసంహరించుకుని బయటికి వెళ్లనుంది. నిజాం షుగర్స్ను పునరుద్ధరించినా తాము నడపలేమంటూ డెల్టా సంస్థ గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత ఇచ్చింది. ఈ నేపథ్యంలో సంస్థ ఆస్తుల విలువ, యూనిట్ల సాంకేతిక స్థితిగతులను మదింపు చేయడంతోపాటు న్యాయపరమైన అంశాలపై సలహాలు, సూచనల కోసం ప్రభుత్వం ‘క్యాపిటల్ ఫార్చూన్స్’అనే సంస్థను కన్సల్టెంట్గా ఎంపిక చేసింది. వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి వివరాలతో తుది నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ప్రైవేటు భాగస్వామ్య సంస్థ వాటాను తిరిగి చెల్లించాక.. నిజాం షుగర్స్ను ఏ తరహాలో నడపాలనే అంశంపై స్పష్టత రానుంది. తొలుత రుణ విముక్తి చేసి.. నిజాం షుగర్స్ను పునరుద్ధరిస్తామన్న హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 12న మంత్రులు శ్రీధర్బాబు చైర్మన్గా, దామోదర్ రాజనర్సింహ వైస్ చైర్మన్గా ఎనిమిది మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. పునరుద్ధరణకు అనుకూలంగా ఈ కమిటీ ఇచి్చన ప్రతిపాదనలను ఆగస్టులో కేబినెట్ ఆమోదించింది. 2015లో ఎన్డీఎస్ఎల్ యూనిట్లు మూతపడేనాటికి సంస్థ ఆస్తుల విలువ సుమారు రూ.400 కోట్లుగా లెక్కించారు. మరోవైపు బ్యాంకర్లు వడ్డీతో కలిపి ఈ సంస్థకు ఇచ్చిన రుణ మొతాన్ని రూ.390 కోట్లుగా పేర్కొన్నాయి. అయితే ప్రభుత్వం బ్యాంకర్ల కన్సార్షియంతో సంప్రదింపులు జరిపి వన్ టైమ్ సెటిల్మెంట్ కింద రూ.190 కోట్లు చెల్లించడంతో నిజాం షుగర్స్కు రుణ విముక్తి కలిగింది. రుణ విముక్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.171 కోట్లు, డెల్టా పేపర్స్ రూ.19 కోట్లు చెల్లించాయి. ‘డెల్టా’తప్పుకోవడంపైనా మార్గనిర్దేశం కన్సల్టెన్సీ సంస్థ న్యాయపరమైన అంశాలు, ఆస్తుల విలువ, యూనిట్ల సాంకేతిక స్థితిగతులను మదింపు చేయడంతోపాటు యూనిట్ల పునరుద్ధరణకు సంబంధించిన సాంకేతిక, ఆర్థికపరమైన ఖర్చులపై కసరత్తు ప్రారంభించింది. 51 శాతం వాటా కలిగిన డెల్టా పేపర్స్ భాగస్వామ్యం నుంచి తప్పుకోవడంపైనా కన్సల్టెన్సీ సంస్థ మార్గనిర్దేశం చేయాల్సి ఉంటుంది. కన్సల్టెన్సీ సంస్థకు అవసరమైన సమాచారాన్ని ఎన్డీఎస్ఎల్ తరఫున ఎప్పటికప్పుడు అందించేందుకు గతంలో చక్కెర పరిశ్రమ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్ హోదాలో రిటైరైన ఓ అధికారిని సమన్వయకర్తగా నియమించినట్టు తెలిసింది. కన్సల్టెన్సీ సంస్థ ఇచ్చే మధ్యంతర నివేదికల ఆధారంగా నిజాం షుగర్స్ పునరుద్ధరణ తీరుతెన్నులపై చర్చించనున్నారు. ఈ మేరకు 26 లేదా 28వ తేదీన శ్రీధర్బాబు నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ‘ప్రైవేటు’చేతుల్లోకే నిజాం షుగర్స్? నిజాం షుగర్స్ నుంచి డెల్టా పేపర్స్ సంస్థ బయ టికి వెళ్లనున్న నేపథ్యంలో.. దానిని ఎవరు నడపాలనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రభుత్వ లేదా సహకార రంగంలో నడపడం సాధ్యం కాదనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో నిర్వ హణకు ముందుకొచ్చే ప్రైవేటు సంస్థలకు లీజు ప్రాతిపదికన ఇవ్వడమో లేదా విక్రయించడమో జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఇజ్రాయెల్ కంపెనీతో జతకట్టిన రిలయన్స్
భారతదేశపు రిలయన్స్ రిటైల్ వెంచర్.. సెప్టెంబర్ 10న ఇజ్రాయెల్ ప్రధాన కార్యాలయం డెల్టా గలీల్ ఇండస్ట్రీస్తో జాయింట్ వెంచర్ను ప్రకటించింది. ఇన్నర్వేర్ మార్కెట్ను విస్తరించడంలో భాగంగా 50/50 జాయింట్ వెంచర్ భాగస్వామ్యాన్ని ధృవీకరించాయి. ఈ భాగస్వామ్యం ద్వారా డెల్టా గలీల్.. రిలయన్స్ ఉత్పత్తుల డిజైన్ అండ్ తయారీకి సహకరిస్తుంది.వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ మార్కెట్లో తన పాదముద్రను విస్తరించేందుకు డెల్టా గలీల్ ఈ భాగస్వామ్యాన్ని ఉపయోగించుకుంటుంది. ఇందులో భాగంగానే రిటైల్, హోల్సేల్ వంటి వాటితో పాటు.. బ్రాండ్ల పోర్ట్ఫోలియోను విస్తరించనుంది.భారతీయ వినియోగదారుల డిమాండ్స్ తీర్చడానికి.. వారు కోరుకునే దుస్తుల ఆవిష్కరణలను ఏర్పాటు చేయడమే ఈ భాగస్వామ్యం ప్రధాన ఉద్దేశ్యం. కంపెనీ గణనీయమైన వృద్ధికి కూడా ఈ జాయింట్ వెంచర్ దోహదపడుతుంది. డెల్టా గలీల్ ఇండస్ట్రీస్ అనేది పురుషులు, మహిళలు, పిల్లల కోసం బ్రాండెడ్ & ప్రైవేట్ లేబుల్ దుస్తులను అందించే సంస్థ. ఈ కంపెనీ 1975లో ప్రారంభమైంది.రిలయన్స్ రిటైల్ & డెల్టా గలీల్ భాగస్వామ్యం గురించి రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వీ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. భారతీయ వినియోగదారులకు వినూత్న ఉత్పత్తులను అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. రిలయన్స్తో కలిసి ప్రయాణించడం చాలా ఆనందంగా ఉందని డెల్టా గలీల్ సీఈఓ పేర్కొన్నారు. -
డెల్టా కార్ప్కు మరో రూ.6,384 కోట్ల జీఎస్టీ నోటీస్
న్యూఢిల్లీ: డెల్టా కార్ప్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. రూ. 6,384 కోట్ల షార్ట్ పేమెంట్ కోసం ఒక జీఎస్టీ నోటీసును అందుకుంది, దీనితో కంపెనీపై మొత్తం పన్ను డిమాండ్ దాదాపు రూ. 23,000 కోట్లు దాటింది. పన్ను డిమాండ్లు ఏకపక్ష మైనవని, చట్ట విరుద్ధంగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. వీటిని సవాలు చేయనున్నట్లూ వెల్లడించింది. సంస్థ ప్రకటన ప్రకారం, డీజీజీఐ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్), కోల్కతా విభాగం అక్టోబర్ 13న డెల్టా కార్ప్ అనుబంధ సంస్థ అయిన డెల్టాటెక్ గేమింగ్కు జీఎస్టీ నోటీసు పంపుతూ, జనవరి 2018 నుండి నవంబర్ 2022 కాలానికి సంబంధించి రూ. 6,236.8 కోట్ల పన్ను చెల్లింపుల డిమాండ్ చేసింది. జూలై 2017 నుండి అక్టోబర్ 2022 వరకు మరో 147.5 కోట్ల రూపాయల పన్ను డిమాండ్ నోటీసునూ అందించింది. రూ. 16,800 కోట్ల షార్ట్ పేమెంట్ నిమ్తి్తం కంపెనీకి గత నెలలో షోకాజ్ నోటీసులు అందుకున్న సంగతి తెలిసిందే. ఆన్లైన్ గేమింగ్ సంస్థలు, కాసినోలు తమ ప్లాట్ఫారమ్లపై ఉంచిన స్థూల పందెం విలువపై 28 శాతం జీఎస్టీ చెల్లించవలసి ఉంటుందని ఆగస్టులో జీఎస్టీ అత్యున్నత స్థాయి మండలి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కంపెనీకి తాజా జీఎస్టీ నోటీసులు వెలువడ్డం గమనార్హం. చట్ట నిబంధనలకు అనుగుణంగానే ఈ–గేమింగ్ కంపెనీలకు రెట్రాస్పెక్టివ్ ప్రాతిపదికన జీఎస్టీ పన్ను డిమాండ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ ఇటీవల స్పష్టం చేశారు. డేటాను పూర్తిగా విశ్లేషించిన మీదటే పన్ను మొత్తంపై నిర్ధారణకు వస్తున్నట్లు తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్ఎస్ఈలో డెల్టా కార్ప్ షేర్ ధర 9 శాతం పడిపోయి రూ.120కి పడింది. -
డెల్టా కార్ప్ కథ కంచికేనా? జియా మోడీ మేజిక్ చేస్తారా? అసలెవరీ మోడీ?
Delta Corp-Zia Mody: గత కొన్ని రోజులు డెల్టా కార్ప్ లిమిటెడ్ వార్తల్లో నిలుస్తోంది.ముఖ్యంగా GST ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ జనరల్ (DG) నుండి ఇటీవల రూ. 16,822 కోట్ల పన్ను నోటీసుల నేపథ్యంలో స్టాక్మార్కెట్లో భారీ నష్టాలను నమోదు చేసింది. దీనికి తోడు ప్రముఖ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా కంపెనీలో సగటు ధరకు 15,00,000 షేర్లను విక్రయించడం మార్కెట్లో ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. ఫలితంగా రెండు రోజుల్లో ఏకంగా 24 శాతం కుప్పకూలింది. సెప్టెంబర్ 25న ఎన్ఎస్ఈలో స్టాక్ 52 వారాల కనిష్ట స్థాయి రూ.140.35కి పడిపోయింది. అయితే బుధవారం నాటి మార్కెట్లో లాభాలతో కొనసాగుతోంది. భారతదేశంలో క్యాసినో కంపెనీలకు వేల కోట్ల పన్ను ఎగవేత ఆరోపణలతో జీఎస్టీ అధికారులు పలు కంపెనీలకు షాక్ ఇచ్చింది. భవిష్యత్లో మరింతమందికి నోటీసులిచ్చే అవకాశం ఉందని అంచనా. ఈ నోటీసులపై ఇప్పటికే డ్రీమ్ 11ను కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో డెల్టా కార్ప్ న్యాయపోరాటం చేస్తుందా? చేస్తే ఫలితం ఎలా ఉండబోతోంది? అసలు డెల్టాకార్ప్ ఎవరిది అనే విషయాలను ఒక సారి చూద్దాం. (నీతా అంబానీకి మరో అరుదైన గౌరవం) డెల్టాకార్ప్ ఓనర్ ఎవరో తెలుసా డెల్టా కార్ప్ ప్రముఖ న్యాయవాది జియా మోడీ భర్త జయదేవ్ మోడీకి చెందినది. జియా ప్రముఖ కార్పొరేట్ లాయర్. పాపులర్ మహిళా వ్యాపారవేత్త. అంతేకాదు భారత మాజీ అటార్నీ జనరల్ సోలి సోరాబ్జీ కుమార్తె. జియా మోడీ ప్రముఖ లా సంస్థ AZB & పార్టనర్స్ కి సహ వ్యవస్థాపరాలు మేనేజింగ్ భాగస్వామిగా ఉన్నారు. మూడు నెలల క్రితం క్యాసినోల కోసం స్థూల పందెం విలువపై 28 శాతం GST విధించాలని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఆన్లైన్ కంపెనీలు గందరగోళం పడ్డాయి. డెల్టా కార్పొ, డ్రీమ్ 11 సమా పలు కీలక కంపెనీలకు వేల కోట్ల పన్ను ఎగవేత నోటీసులందాయి. నెల రోజుల క్రితం డెల్టా కార్పొ ముఖ్య ఆర్థిక అధికారి రాజీనామా చేశారు. రెండు నెలల క్రితం కంపెనీ తన ఆన్లైన్ గేమింగ్ బిజినెస్కంపెనీ తన ప్రారంభ పబ్లిక్ ఆఫర్ను నిలిపివేసినట్లు సమాచారం. 16,822 కోట్ల పన్ను నోటీసు మీడియం-టర్మ్లో ప్రతికూలమని ఎనలిస్టుల అంచనా. (వేల కోట్ల జీఎస్టీ ఎగవేత: అధికారుల షాక్..కోర్టుకెక్కిన డ్రీమ్11) ఎలాంటి కేసునైనా..ఇట్టే! RSG ఇండియా నివేదిక ప్రకారం, భారతదేశంలో, ఆసియాలోనే అతిపెద్ద కార్పొరేట్ అటార్నీలలో ఒకరైన జియా ఎలాంటి క్లిష్ట సమస్యనైనా ఈజీగా పరిష్కరించే చాకచక్యం సొంతమని ఆమె క్లయింట్లు నమ్ముతారు. ఈ నేపథ్యంలో కంపెనీ ఈ పన్ను నోటీసు వివాదంనుంచి విజయవంతంగాగా బయపడుతుందా అనే చర్చ జోరుగా నడుస్తోంది. గత ఐదేళ్లలో కంపెనీ అమ్మకాలు 11 శాతం, నికర లాభం 13 శాతం పెరిగాయి. కంపెనీపై పెట్టుబడిదారుల నమ్మకంతోపాటు, టాక్స్ల కు సంబంధించిన కొన్ని టెక్నికల్ సమస్యల రీత్యా డెల్టాకార్ప్కు లాంగ్ టర్మ్లో పెద్దగా ఇబ్బంది లేదనేది ఇండస్ట్రీ వర్గాల అంచనా. డెల్టా కార్ప్ పని అయిపోయినట్టేనా? భారతీయ కాసినో పరిశ్రమలో ఆధిపత్యం, బలమైన బ్రాండ్ నమ్మకమైన కస్టమర్ బేస్ కారణంగా డెల్టా కార్ప్ దీర్ఘకాలిక దృక్పథం ఆశాజనకంగా కనిపిస్తుంది. సవాళ్లను నావిగేట్ చేయగల కంపెనీ సామర్థ్యాన్ని నమ్మే పెట్టుబడిదారులు, ప్రస్తుత స్టాక్ ధర తగ్గుదల కొనుగోలు అవకాశమని రైట్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు, క్వాంట్-బేస్డ్ PMS ఫండ్ మేనేజర్ సోనమ్ శ్రీవాస్తవ అన్నారు. పన్ను ఎగవేత ఆరోపణలమొత్తం జూలై 2017-మార్చి 2022 వరకు ఉన్న లాభాలపై, అయితే కొత్త జీఎస్టీ అక్టోబర్ 2023 నుండి మాత్రమే అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో విజయం డెల్టా కార్ప్దే అని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా దివంగత బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేష్ జున్జున్వాలా భార్య రేఖ ఒకప్పుడు క్యాసినో ఆపరేటర్లో వాటాదారులుగా ఉన్నారు. అయితే 2022లో తమ వాటాలను విక్రయించారు. డెల్టా కార్ప్లో 1 శాతం కంటే ఎక్కువ వాటా ఉన్న వాటాదారులెవరూ లేరు. -
సాక్షి మనీ మంత్రా: నష్టాల ముగింపు, జీఎస్టీ సెగ, డెల్టా కార్ప్ ఢమాల్!
దేశీయ స్టాక్మార్కెట్లు వరుస లాభాల నుంచి వెనక్కి తగ్గాయి. ఆరంభంలో లాభాల్లో ఉన్న సూచీలు లాభాల స్వీకరణతో ఫ్లాట్గా మారాయి. ఆ తరువాత మరింత నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 224 పాయింట్ల నష్టంతో 65394 వద్ద,నిఫ్టీ 55 పాయింట్లు క్షీణించి 19384 వద్ద ముగిసాయి. తద్వారా నిఫ్టీ 19400దిగువకు చేరింది. ప్రధానంగా పీఎస్యూ బ్యాంక్ షేర్లు లాభపడగా, ఐటీ షేర్లు నష్టపోయాయి. ఓఎన్జీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోటక్ మహీంద్ర బ్యాంకు, ఐషర్ మోటార్స్,సన్ఫార్మా టాప్ విన్నర్స్గా నిలిచాయి. మరోవైపు ఎల్టిఐఎండ్ట్రీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్ అదానీ ఎంటర్ప్రైజెస్ బీపీసీఎల్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో నష్టపోయాయి. మరోవైపు రానున్న ఫలితాల నేపథ్యంలో టీసీఎస్, హెచ్సీఎల్ నష్టపోయాయి. జీఎస్టీ పెంపు: కుప్పకూలిన డెల్టా కార్ప్ మరోవైపు క్యాసినో ఆపరేటర్ డెల్టా కార్ప్ లిమిటెడ్ ఏకంగా 25 శాతం కుప్పకూలింది. తాజా జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కాసినోలపై జీఎస్టీ 18-28 శాతానికిపెంచడంతో25 లోయర్ సర్క్యూట్లో లాక్ అయింది. ఇది రెండు నెలల కనిష్ట స్థాయి. రికార్డులో స్టాక్కి ఇదే అతిపెద్ద సింగిల్ డే డ్రాప్ కూడా. ఫలితంగా సంస్థ మార్కెట్ క్యాప్ రూ.1,600 కోట్లు నష్టపోయింది. ఈ క్షీణత దాని మొత్తం ఆర్థిక సంవత్సరం 2023 ఆదాయం రూ.1,021 కోట్ల కంటే ఎక్కువే కావడం గమనార్హం. అటు మంగళవారం నాటి ముగింపు 82.36తో పోలిస్తే బుధవారం డాలర్తో రూపాయి 12 పైసలు పెరిగి 82.24 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
కావేరి డెల్టాలో ‘కోల్’ కల్లోలం
ఏడాదికి మూడు పంటలతో కళకళలాడే డెల్టా జిలాల్లో కల్లోలం రేగుతోంది. నిత్యం పచ్చదనంతో ఉండే సురక్షిత వ్యవసాయ క్షేత్రంలో నేలబొగ్గు తవ్వకాలకు కేంద్రం అనుమతించ్చిందనే సమాచారంతో అక్కడి రైతులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. వివిధ రాజకీయ పార్టీలు పోరుబాట పట్టాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్నదాతలు ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాఖ మంత్రి సూచించారు. రైతులను ఇబ్బంది పెట్టే నిర్ణయాలను పునఃసమీక్షించి వెనక్కి తీసుకోవాలని సీఎం స్టాలిన్ ప్రధాని మోదీకి లేఖ రాయడం గమనార్హం. సాక్షి, చైన్నె: కావేరి డెల్టా పరిధిలోని సురక్షిత వ్యవసాయ క్షేత్రంలో నేల బొగ్గు తవ్వకాలకు కేంద్రం అనుమతించిందనే సమాచారంతో రైతుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా ఆరు చోట్ల నేల బొగ్గు సొరంగాలు, 11 చోట్ల పరిశోధనలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ పరిధిలోని మినిస్టరీ ఆఫ్ కోల్ నోటిఫికేషన్ జారీ చేయడంపై అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వీటికి ఆదిలోనే అడ్డుకట్ట వేయాలని పీఎంకే నేత అన్భుమణి రాందాసు డిమాండ్ చేశారు. సురక్షిత క్షేత్రంలో కేంద్రం నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ డిమాండ్ చేశారు. నేపథ్యం ఇదీ.. రాష్ట్రంలో పచ్చటి పంట పొలాలతో నిండిన జిల్లాలుగా తిరువారూర్, తంజావూరు, పుదుకోట్టై, పెరంబలూరు, అరియలూరు, నాగపట్నం, కడలూరు, తిరుచ్చికి పేరుంది. ఇక్కడ లక్షలాది ఎకరాలల్లో వరి పంట, వేలాది ఎకరాలలో ఇతర పంటలు సాగవుతున్నాయి. అలాగే పెద్దఎత్తున కొబ్బరి సాగవుతోంది. కావేరినది నీటి ఆధారంగానే ఇక్కడ పంటలు పండుతున్నాయి. గత కొన్నేళ్లుగా వరుణుడి కరుణ, కావేరి పరవళ్లతో ఇక్కడి అన్నదాతల్లో ఆనందం తాండవిస్తోంది. అయితే డెల్టా జిల్లాల్లోని భూగర్భంలో ఉన్న ఇంధనం, హైడ్రో కార్బన్, గ్యాస్, నేల బొగ్గు వంటి నిక్షేపాలను వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం గత కొంతగాలంగా ప్రయత్నాలు చేస్తోంది. గతంలో కేంద్రం ఇచ్చిన అనేక ఉత్తర్వులకు వ్యతిరేకంగా డెల్టాలో మహోద్యమాలు జరిగాయి. కేంద్రం వ్యూహాలకు చెక్ పేట్టే విధంగా, రైతుల్లో నెలకొన్న ఆందోళనను పోగొట్టే రీతిలో గత అన్నాడీఎంకే ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా కీలక తీర్మానం చేసింది. డెల్టా జిల్లాలను సురక్షిత వ్యవసాయ క్షేత్రంగా ప్రకటిస్తూ చట్టం తీసుకొచ్చింది. ఈ క్షేత్రంలో వ్యవసాయం మాత్రమే చేపట్టాలని, ఇతర పరిశ్రమలు, తవ్వకాలకు అనుమతులు లేవని స్పష్టం చేసింది. అలాగే గతంలో జారీ చేసిన ఇతర పరిశ్రమలకు సంబంధించిన అనుమతులను రద్దు చేశారు. దీంతో డెల్టా సురక్షిత వ్యవసాయ క్షేత్రంగా మారింది. అదే సమయంలో రాష్ట్రంలో అధికార మార్పు తర్వాత.. ప్రస్తుతం కేంద్రం మళ్లీ చాప కింద నీరులా డెల్టాపై కన్నేసి వ్యూహాలకు పదును పెట్టడం మంగళవారం అక్కడి రైతుల్లో ఆందోళన రేకెత్తించింది. నైవేలి తరహాలో.. కడలూరు జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఆ జిల్లాను పూర్తిగా తన గుప్పెట్లోకి తీసుకునే విధంగా దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. నైవేలి పరిసరాల్లో నేల బొగ్గు తవ్వకాల పేరిట గ్రామాలను తమ ఆధీనంలోకి తీసుకోవడం వివాదానికి దారి తీసింది. దీనికి వ్యతిరేకంగా ఓ ఉద్యమమే ప్రారంభమైంది. అలాగే వీరాణ్ణం రిజర్వాయర్ పరిధిలో నేల బొగ్గు తవ్వకాలకు పరిశోధనలు చేయడం వెలుగులోకి రావడంతో కల్లెం వేయడానికి ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమయంలో డెల్టాలో ప్రధాన జిల్లాగా ఉన్న తంజావూరు ఒరత్తనాడు పరిధిలో ఆరు చోట్ల నేల బొగ్గు తవ్వకాలకు సొరంగాలపై కేంద్రం దృష్టి పెట్టడం వివాదానికి దారి తీసింది. తిరువారూర్– తంజావూరు జిల్లాల పరిధిలో ఆరు చోట్ల నేల బొగ్గు తవ్వకాలకు సంబంధించిన సొరంగాలు, పరిశోధనలకు కేంద్రం అనుమతి ఇవ్వడం వెలుగు చూసింది. ఈ సమాచారం అన్నదాతల్లో ఆగ్రహాన్ని రేపింది. సురక్షిత క్షేత్రాన్ని చిన్నాభిన్నం చేసే కుట్రలు జరుగుతున్నాయంటూ రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం స్పందించకుంటే మరో ఉద్యమం ప్రారంభమవుతుందని హెచ్చరించాయి. అడ్డుకట్ట వేసేందుకు.. కావేరి డెల్టాలోని లక్షా 25 వేల ఎకరాల పంట పొలాలను సర్వనాశనం చేయడానికి కేంద్రం సిద్ధమైందని పీఎంకే నేత అన్భుమణి రాందాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వద్ద ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని వివరించారు. తంజావూరు జిల్లా పరిధిలో 11 చోట్ల పరిశోధనలు, ఆరు చోట్ల సొరంగాల తవ్వకాలకు కేంద్రం కార్యచరణ సిద్ధం చేసిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా కేంద్రం ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకోవడం తగదని హితవుపలికారు. ఈ వ్యవహారంపై సీఎం స్టాలిన్ తక్షణం స్పందించాలని, అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేయాలని పట్టుబట్టారు. బీజేపీ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ మాట్లాడుతూ.. సురక్షిత వ్యవసాయం క్షేత్రంలో పరిశోధనలకు కేంద్రం అనుమతులు ఇస్తున్న నేపథ్యంలో ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా మని నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ వ్యాఖ్యలు చేశారు. రైతులతో కలిసి పెద్దఎత్తున పోరాటాలకు తాము సిద్ధం అని ప్రకటించారు. ఆందోళన వద్దు.. కేంద్రం అనుమతులు ఇచ్చినంత మాత్రాన అవన్నీ అమల్లోకి వచ్చే ప్రసక్తే లేదని వ్యవసాయ శాఖ మంత్రి ఎంఆర్కే పన్నీరు సెల్వం స్పష్టం చేశారు. తాము చూస్తూ ఊరుకోబోమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న స్థలాల్లో, తమ అనుమతి లేకుండా కేంద్రం ఎలా తవ్వకాలపై దృష్టి పెడుతుందని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సీఎం స్టాలిన్ స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడిస్తారన్నారు. తిరువారూర్, తంజావూరు పర్యటనలో ఉన్న క్రీడల శాఖమంత్రి ఉదయ నిధి స్టాలిన్ మాట్లాడుతూ, కేంద్రం చర్యలను ఆదిలోనే కట్టడి చేస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా డెల్టాలో ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో సీఎం స్టాలిన్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారం లేఖ రాశారు. సురక్షిత వ్యవసాయ క్షేత్రాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని వివరించారు. తక్షణం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. -
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లంక భూములకు డి పట్టాలు
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతంలోని లంక భూములకు డి పట్టాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏ, బీ కేటగిరీలుగా గుర్తించిన లంక భూములకు సంబంధించి వివాదాల్లేకుండా సాగు చేసుకుంటున్న అర్హులకు పట్టాలు ఇవ్వడంతోపాటు సి కేటగిరీలో ఉన్న భూములకు ఐదేళ్ల లీజు పట్టాలు ఇవ్వనుంది. ఈ మేరకు లంక భూముల అసైన్డ్ నిబంధనలను సవరిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సాయిప్రసాద్ జీఓ జారీ చేశారు. కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లోని ఒండ్రు మట్టి ఒక దగ్గర చేరి ఉన్న భూములు కాలక్రమేణా సాధారణ భూములుగా మారి సారవంతంగా ఉండడంతో రైతులు (శివాయి జమేదార్లు) వాటిని సాగు చేసుకుంటున్నారు. ఏ, బీ కేటగిరీ భూముల్లోని కొందరికి గతంలో డి పట్టాలిచ్చారు. మునిగిపోయే అవకాశం ఉండడంతో సీ కేటగిరీ భూములకు పట్టాలివ్వకుండా ఒక సంవత్సరం లీజుగా ఇచ్చారు. వాటినే లీజు పట్టాలుగా పిలుస్తారు. ఎంజాయ్మెంట్ సర్వే ద్వారా పట్టాలు పూర్వపు తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ మూడు కేటగిరీల్లో ఉన్న లంక భూములను సాగు చేసుకుంటున్న చాలా మందికి పట్టాలు లేవు. అలాంటి వారిని గుర్తించి నిబంధనల ప్రకారం పట్టాలివ్వాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించి ఏ, బీ కేటగిరీల్లోని భూములకు ఆమోదంతో పట్టాలివ్వనుంది. సీ కేటగిరీ కింద ఉన్న భూములకు గతంలో ఇచ్చే సంవత్సరం లీజును ఐదేళ్లకు పొడిగించి ఇవ్వనున్నారు. అసైన్మెంట్ కమిటీల ఆమోదంతో పట్టాలిచ్చే అధికారాలను జిల్లా కలెక్టర్లకు ఇచ్చారు. లంక భూముల్లో సీజీఎఫ్ (కో–ఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్) సొసైటీలు ఉండేవి. మిగిలిన ప్రాంతాల్లోని సీజీఎఫ్ఎస్ భూములకు పట్టాలిచ్చినా, లంక భూముల్లోని సీజీఎఫ్ఎస్ భూములకు మాత్రం ఇవ్వలేదు. ఈ సొసైటీలు రద్దయ్యే పరిస్థితుల్లో వాటి కింద ఉన్న అర్హులను గుర్తించి తాజాగా పట్టాలివ్వాలని నిర్ణయించారు. గతంలో ఇచ్చిన పట్టాలు, అడంగల్లో నమోదైన పట్టాదారులకు ఇబ్బంది లేకుండా ఇప్పుడు డి పట్టాలివ్వాలని జీవోలో స్పష్టం చేశారు. 10 వేల మందికి మేలు లంక భూముల కేటగిరీలను మార్చేందుకు తాజాగా అవకాశం కల్పించారు. జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, రివర్ కన్సర్వేటర్ (ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్)లతో ఉన్న కమిటీ కేటగిరీ మార్పుపై వచ్చే దరఖాస్తులను పరిశీలించి కలెక్టర్ సిఫారసు చేస్తారు. ఈ సిఫారసుల ఆధారంగా జిల్లా కలెక్టర్ దీనిపై నిర్ణయం తీసుకుంటారు. ఈ మేరకు నిబంధనలను సవరించారు. దీనివల్ల సుమారు 10 వేల మంది లంక భూముల రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది. అర్హులకు పట్టాలివ్వగా మిగిలిన భూముల్లో 50 శాతాన్ని ఎస్సీ, ఎస్టీ రైతులకు, మిగిలిన 50 శాతం భూమిలో మూడింట రెండొంతుల (2/3) భూమిని బీసీ రైతులకు, మిగిలిన (1/3) భూమిని నిరుపేద రైతులకు పంచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏ కేటగిరీ: గట్టుకు దగ్గరగా ఉండి, వరద వచ్చినా కొట్టుకుపోని భూమి బీ కేటగిరీ: ఏ కేటగిరీ భూమికి ఆనుకుని, కొంత నదిలోకి ఉన్న భూమి సీ కేటగిరీ: ఏ, బీ కేటగిరీకి ఆనుకుని నదిలోకి ఉండి.. వరదలు వస్తే పూర్తిగా మునిగిపోయే భూమి -
కరోనా కొత్త రూపాంతరం దడ! ... ఇప్పటి వరకు 25 కేసులు నమోదు!
Deltacron Cases Found In UK: కరోనా వైరస్ కొత్త రూపాంతరం గురించి ప్రపంచ ఆరోగ్య నిపుణులు ఆందోళనకు గురవుతున్నారు. ఇది డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల లక్షణాలను ప్రదర్శిస్తున్నందున డెల్టాక్రాన్గా నిపుణలు వ్యవహరించారు. అంతేకాదు డెల్టాక్రాన్గా పిలుస్తున్న ఈ హైబ్రిడ్ వేరియంట్ని యూకేలో తొలిసారిగా గుర్తించారు. అయితే ఈ వేరియంట్ ఎంతగా వ్యాప్తి చెందుతుంది, ఎంతవరకు ప్రమాదకరమైనది అనే విషయాలను అధికారికంగా ఇప్పటివరకు యూకే నిపుణులు వెల్లడించలేదు. అయితే సెకండ్వేవ్లో డెల్టా వేగంగా వ్యాపించి ఎంతలా ప్రాణాంతకంగా మారిందో తెలిసిందే. మూడోవేవ్లో ఒమిక్రాన్ అంత ప్రభావంతంగా వ్యాప్తి చెందకపోయినప్పటికి మరింత ప్రమాదకారి మాత్రం కాలేదు. అలాగే మరణాల సంఖ్య, కేసుల సంఖ్య తక్కువే. ఈ మేరకు ఈ డెల్టాక్రాన్ వేరియంట్ను గత ఏడాది చివర్లో సైప్రస్లో లియోనిడోస్ కోస్ట్రికిస్ అనే పరిశోధకుడు మొదటిసారిగా కనుగొన్నారు. యూనివర్శిటీ ఆఫ్ సైప్రస్లో పనిచేస్తున్న లియోనిడోస్ కోస్ట్రికిస్ తన బృందం ఈ డెల్టాక్రాన్కి సంబంధించి సుమారు 25 కేసులను గుర్తించినట్లు పేర్కొన్నారు. అంతేకాదు 25 డెల్టాక్రాన్ కేసుల సీక్వెన్సులు జనవరి 7, 2022న వైరస్లో మార్పులను ట్రాక్ చేసే అంతర్జాతీయ డేటాబేస్ అయిన GISAIDకి పంపించారు కూడా. కానీ కొంతమంది నిపుణులు మాత్రం ఇది "ల్యాబ్ ఎర్రర్గా" తోసిపుచ్చారు. ఈ క్రమంలో ఇంపీరియల్ కాలేజ్ లండన్ బార్క్లే లాబొరేటరీలో పరిశోధనా సహచరుడు థామస్ పీకాక్ కూడా డెల్టాక్రాన్ అంత ప్రభావవంతమైనది కాదని స్పష్టంగా తెలుస్తుందని అన్నాడు. కానీ కోస్ట్రికిస్ తన వాదనను సమర్థించటమే కాక కరోనా వైరస్ కొత్త రూపాంతరం అయిన ఈ హైబ్రిడ్ వేరియంట్ డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్ల కంటే వేగంగా వ్యాపిస్తుందంటూ హెచ్చరిస్తున్నాడు. మరోవైపు ప్రపంచ ఆరోగ్యసంస్థ ఒమిక్రాన్ వేరియంట్ చాలా దేశాల్లో వేగంగా సంక్రమించే అత్యంత ప్రమాదకర వేరియంట్గా ఉందని పేర్కొనడం గమనార్హం. (చదవండి: కుక్క గర్భవతి అనుకుని ఆసుపత్రికి తీసుకెళ్లాడు... ఆశ్చర్యపోయిన వైద్యులు) -
మార్చికల్లా కరోనా మటాష్..! గుడ్ న్యూస్ చెప్పిన టాప్ సైంటిస్ట్
న్యూఢిల్లీ: కరోనా థర్డ్ వేవ్ దేశాన్ని అల్లాడిస్తున్న వేళ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వేసిన అంచనాలు కొత్త ఊపిరిపోస్తున్నాయి. కరోనా పీడ ఎప్పుడు విరగడైపోతుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న ప్రజలు కోవిడ్–19 నిబంధనల్ని నిర్లక్ష్యం చేయకుండా తు.చ. తప్పకుండా పాటిస్తే మరో రెండు నెలల్లోనే ఆ మంచిరోజులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో కరోనా మహమ్మారి మార్చి నాటికి ఎండమిక్ దశకు చేరుకుంటుందని ఐసీఎంఆర్లో వ్యాధుల నివారణ విభాగం చీఫ్ సమీరన్ పాండా చెప్పారు. ఎండమిక్ దశ అంటే దేశవ్యాప్తంగా ఒకేసారి కరోనా ఉధృతి కనపడకుండా అక్కడక్కడా విసిరేసినట్లు కొద్ది ప్రదేశాలకు కరోనా వ్యాప్తి పరిమితం కావడం, కరోనా సాధారణ వైరస్గా మారిపోయి ప్రజలు దానితో సహజీవనం చేసే పరిస్థితికి చేరుకోవడం. ప్రజలందరూ కోవిడ్ రక్షణ కవచాలైన మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, తరచూ చేతులు కడుక్కోవడం వంటివి తప్పనిసరిగా చేస్తూ ఉంటే, కొత్త వేరియంట్లు ఏవీ పుట్టుకొని రాకపోతే కరోనా ఇక తుది దశకు చేరుకున్నట్టేనని అన్నారు. కరోనా ఎండమిక్ దశ మార్చి 11 నుంచి మొదలయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. ‘‘డెల్టా వేరియంట్ స్థానాన్ని ఒమిక్రాన్ ఆక్రమిస్తే కరోనాకి అదే ముగింపు అవుతుంది. కొత్తగా ఏ వేరియంట్లు రాకపోతే ఇక కరోనా ముగిసిపోయినట్టే. డిసెంబర్ 11 నుంచి మొదలైన కరోనా థర్డ్ వేవ్ మూడు నెలల్లో ముగిసిపోతుంది’’ అని ఐసీఎంఆర్ నిపుణుల బృందం గణిత శాస్త్ర విధానం ఆధారంగా రూపొందించిన అంచనాల్లో వెల్లడైందని పాండా తెలిపారు. ‘‘మార్చి 11 నుంచి కరోనా ఉధృతి తగ్గిపోతుంది. ఢిల్లీ, ముంబైలలో కోవిడ్–19 కేసులు గరిష్ట స్థాయికి చేరుకున్నాయో లేదో తెలియాలంటే మరి రెండు, మూడు వారాలు వేచిచూడాలి. ఆ రెండు నగరాల్లో పాజిటివిటీ రేటు తగ్గుతున్నప్పటికీ అక్కడ కరోనా పరిస్థితి ఏ దశలో ఉందో ఇప్పుడే చెప్పలేము. ఒకట్రెండు రోజుల్లో అక్కడ పరిస్థితులపై ఒక అంచనాకి రాలేము. ప్రస్తుతానికి ఒమిక్రాన్, డెల్టా కేసులు అక్కడ 80:20 నిష్పత్తిలో నమోదవుతున్నాయి’’ అని పాండా వివరించారు. కరోనా పరీక్షలు తప్పనిసరి వివిధ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి వివిధ దశల్లో ఉందని పాండా చెప్పారు. కరోనా మహమ్మారి రూపాంతరం చెందుతూ ఉంటే దానికి అనుగుణంగా కోవిడ్–19 పరీక్షలకు సంబంధించి వ్యూ హాలు మార్చుకుంటామన్నారు. కరోనా పరీక్షలు తగ్గించాలని తాము ఎప్పుడూ రాష్ట్రాలకు చెప్పలేదన్నారు. కరోనా స్వభావం మారినప్పుడల్లా ఐసీఎంఆర్ కోవిడ్–19 పరీక్షలు, నిర్వహణ వ్యూహాలను మార్చుకుంటూ ఉంటుందని వివరించారు. కరోనా అత్యవసర పరిస్థితులు ఇక ఉండవ్ : ప్రపంచ ఆరోగ్య సంస్థ దావోస్: కోవిడ్–19తో విధించే అత్యవసర పరిస్థితులు ఈ ఏడాదితో ముగిసిపోయే అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంచనా వేస్తోంది. వ్యాక్సిన్ పంపిణీలో అసమానతలను నిర్మూలించి అందరికీ లభ్యమయ్యేలా చర్యలు చేపడితే కోవిడ్–19 మర ణాలు, ఆస్పత్రిలో చేరికలు, లాక్డౌన్లు వంటివి అరికట్టవచ్చునని డబ్ల్యూహెచ్ఒ ప్రతినిధి డాక్టర్ మైఖేల్ ర్యాన్ చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్ అసమానతలపై వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న మైఖేల్ ఇలాంటి వైరస్లో మన పర్యావరణ వ్యవస్థలో అంతర్భాగంగానే ఎప్పటికీ ఉంటాయన్నారు. అన్ని దేశాలకు సమానంగా టీకా పంపిణీ జరిగితే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి ఇక రాకపోవచ్చునని అన్నారు. ఫిబ్రవరి 28 వరకు అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు న్యూఢిల్లీ: ఒమిక్రాన్ కేసుల ఉధృతి కొనసాగుతూ ఉండడంతో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధాన్ని ఫిబ్రవరి 28 వరకు పొడిగించినట్టుగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. అయితే పరస్పర ఒప్పందం ఉన్న దేశాలకు ప్రత్యేక విమానాలు నడుస్తాయని, అందులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. కరోనా మొదటి వేవ్ సమయంలో 2020 మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమానాలపై డీసీజీఏ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి విడతల వారీగా నిషేధాన్ని కొనసాగిస్తూ వస్తోంది. 40 దేశాలకు ప్రత్యేక విమానాలు మాత్రం యథాతథంగా తడుస్తాయని డీసీజీఏ పేర్కొంది. ఒకే రోజు 2.82 లక్షల కరోనా కేసులు దేశవ్యాప్తంగా కరోనా కేసుల ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. ఒకే రోజు 2,82,970 కేసులు నమోదయ్యాయి. 18,31,000కి క్రియాశీల కేసుల సంఖ్య చేరుకున్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. ప్రతీ కరోనా కేసుని జన్యుక్రమ విశ్లేషణకు పంపించడం సాధ్యం కాదని అందుకే ఒమిక్రాన్ కేసులు ఎంత శాతం నమోదవుతున్నాయో కచ్చితమై న లెక్కలు చెప్పలేమని స్పష్టం చేసింది. రోజువారీ పాజిటివిటీ రేటు 15.13 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 15.53శాతంగా ఉంది. (కీలక విషయాలు వెల్లడి.. రాష్ట్రాల కోవిడ్ మృతుల సంఖ్యలో భారీ తేడా?) -
వైరస్ టెన్షన్!.. తారస్థాయిలో విరుచుకుపడుతున్న థర్డ్వేవ్
సాక్షి హైదరాబాద్: ఊహించినట్లే జరుగుతోంది. గ్రేటర్లో థర్డ్వేవ్ తారస్థాయికి చేరుతోంది. ఒకవైపు డెల్టా.. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్లు గ్రేటర్వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. క్రిస్మస్, డిసెంబర్ 31 వేడుకల తర్వాత రికార్డు స్థాయిలో కేసులు నమోదువుతుండటం, చికిత్స కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు మరింత పెరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో తారస్థాయికి చేరిన కేసులు.. ఆగస్టు తర్వాత తగ్గుముఖం పట్టాయి. డిసెంబర్ మూడో వారం నుంచి మళ్లీ కేసుల సంఖ్య పెరుతూ వచ్చింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మూడు రోజుల క్రితం.. 397 పాజిటివ్ కేసులు నమోదైతే.. తాజాగా బుధవారం ఒక్కరోజే 1,285 మందికి వైరస్ నిర్ధారణ కావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. హెచ్చరికలు బేఖాతరు.. కోవిడ్ టీకాలు అందుబాటులోకి రావడంతో పాటు వైరస్ తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం ఆగస్టు నుంచి కోవిడ్ ఆంక్షలను సడలిస్తూ వచ్చింది. ఫలితంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు పూర్తిస్థాయిలో పని చేయడం ప్రారంభించాయి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సెప్టెంబర్ నుంచి దశలవారీగా విద్యా సంస్థలను పునఃప్రారంభించింది. వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు సినిమా థియేటర్లు, పర్యాటక ప్రదేశాలు, హోటళ్లు పూర్తిస్థాయిలో తెరుచుకున్నాయి. కోవిడ్ నిబంధనల మేరకు రోజువారీ పనులు కొనసాగించాలని వైద్యులు సూచించినప్పటికీ.. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నామనే ధీమాతో వాటిని పూర్తిగా విస్మరించారు. వైద్యనిపుణుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ పుట్టిన రోజు, పెళ్లి రోజు, పండుగలు, పబ్బాల పేరుతో విందులు, వినోదాల్లో మునిగి తేలారు. రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులతో పాటు సభలు, సమావేశాలకు వచ్చిన కార్యకర్తలు సైతం మాస్కులను విస్మరించారు. భౌతిక దూరం అనే అంశాన్ని పూర్తిగా మరిచిపోయారు. శానిటైజర్తో ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోకపోవడం వల్ల వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా విస్తరించింది. మచ్చుకు కొన్ని కేసులు ఇలా.. మెయినాబాద్ మండల పరిధిలోని నాగిరెడ్డిగూడలోని ప్రముఖ క్రీడాకారిణి గుత్తా జ్వాల టెన్నిస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న వందమంది క్రీడాకారుల్లో ఇటీవల చెన్నైలో జరిగిన టెన్నిస్ పోటీలకు 40 మంది హాజరై వచ్చారు. వీరిలో స్థానికంగా ఉన్న ఓ ఇంటర్నేషనల్ స్కూలు విద్యార్థులు కూడా ఉన్నారు. టోర్నమెంట్కు వెళ్లి వచ్చిన తర్వాత వీరిలో ఆరుగురు క్రీడాకారులకు దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు బయటపడ్డాయి. మూడు రోజుల క్రితం వీరికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, వీరిలో నలుగురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో శిక్షణ కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. స్కూలు యాజమాన్యం కూడా ఆఫ్లైన్ క్లాసులను రద్దు చేసి, ఆన్లైన్లో పాఠాలు బోధిస్తోంది. నాదర్గుల్ సమీపంలో నివాసం ఉంటున్న డీఆర్డీఓకు చెందిన ఓ కీలక అధికారి ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఆ తర్వాత ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయనను స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. అప్పటికే ఆయనకు సన్నిహితంగా తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు మెలగడంతో ఆ తర్వాత వారికి కూడా వైరస్ సోకింది. వైరస్ నిర్ధారణ అయినప్పటికీ.. లక్షణాల తీవ్రత పెద్దగా లేకపోవడంతో వారంతా హోం ఐసోలేషన్లోనే చికిత్స తీసుకున్నారు. శంషాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల దుబాయ్ వెళ్లి వచ్చాడు. ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ర్యాండమ్ చెకప్లో భాగంగా ఆయన నుంచి నమూనాలు సేకరించి, పరీక్షించగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆ తర్వాత జరిపిన జీనోమ్ సీక్వెన్సీ పరీక్షల్లో ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు తేలింది. అప్పటికే ఆయన ఇంటికి చేరుకోవడం, కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలగడం వల్ల ఆయన ద్వారా ఆయన కుమారునికి, ఇతర కుటుంబ సభ్యులకు వైరస్ నిర్ధారణ అయింది. కోర్సిటీ కంటే.. శివారు ప్రాంతాల్లోనే.. నిజానికి ఫస్ట్, సెకండ్ వేవ్లో వైరస్ పూర్తిగా కోర్ సిటీకే పరిమితమైంది. ప్రస్తుతం శివారు ప్రాంతాల మున్సిపాలిటీలకు, మారుమూల గ్రామాలకు విస్తరించింది. సిటీ నుంచి శివారు ప్రాంతాలకు రాకపోకలు పెరిగింది. దీంతో పాటు వైరస్ శివారు ప్రాంతాలకు విస్తరించింది. సిటిజన్లతో పోలిస్తే.. శివారు బస్తీవాసుల్లో వైరస్పై సరైన అవగాహన లేదు. ఓ వర్గం ప్రజల్లో టీకాలపై ఇప్పటికీ మూఢ నమ్మకం నెలకొంది. దీనికి అపోహ తోడైంది. ఇప్పటికీ చాలా మంది టీకాలు వేసు కోకుండా దూరంగా ఉండిపోయారు. టీకా వేసుకోక పోవడానికి తోడు వీరిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వీరు త్వరగా వైరస్ బారిన పడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఫంక్షన్ హాళ్లు, ప్రముఖ హోటళ్లు, ఐటీ అనుబంధ సంస్థలన్నీ ఓర్ఆర్ఆర్కు అటూఇటుగా విస్తరించి ఉండటం, ఇక్కడికి రాకపోకలు ఎక్కువగా జరుగుతుండటం కూడా రికార్డు స్థాయిలో కేసుల నమోదుకు మరో కారణమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు వైరస్ నిర్ధారణ అయిన వారిలో పెద్దగా లక్షణాలు కన్పించకపోవడం, ఎక్కువ కేసులు ఉన్న ప్రాంతాలను గుర్తించి, కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించకపోవడం, ఈ విషయం తెలియక ప్రజలు తరచూ ఆయా ప్రాంతాల్లో సంచరిస్తుండటం, హోం ఐసోలేషన్లో ఉన్న వారిపై నిఘా కూడా లేకపోవడం, మందులు, కాయకూరలు, నిత్యవసరాల కొనుగోలు పేరుతో వీరంతా సాధారణ పౌరుల్లా బయట తిరుగుతుండటం కూడా ఆయా ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటానికి కారణ మ ని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ, తెలంగాణ జిల్లాల నుంచే కాదు.. సరిహద్దు రాష్ట్రాల బాధితులు చికిత్స కోసం ఇక్కడికే వస్తున్నారు. వీరికి సహాయంగా వచ్చిన వారు ఆస్పత్రి ఆవరణలో సాధారణ రోగుల మధ్య తిరుగుతున్నారు. -
పెరుగుతోంది! పారాహుషార్!
సునామీ గురించి విన్నాం... చూశాం. కానీ కోవిడ్ సునామీ గురించి? గత వారంగా రోజూ సగటున 9 లక్షల ప్రపంచ కేసుల ట్రెండ్ చూస్తుంటే, అటు డెల్టా, ఇటు కొత్త ఒమిక్రాన్ వేరియంట్లతో రానున్న రోజుల్లో ప్రపంచ దేశాలపై కోవిడ్ కేసులు సునామీలా విరుచుకుపడే ప్రమాదం ఉందంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. భారీగా కేసులొచ్చి, ఆస్పత్రిలో చేరేవాళ్ళు, మృతులు పెరిగితే, ఇప్పటికే రెండేళ్ళుగా పరిమితికి మించి శ్రమిస్తున్న ఆరోగ్య వ్యవస్థలపై ఒత్తిడి పడే ముప్పుంది. డబ్ల్యూహెచ్ఓ బుధవారం చేసిన ఈ హెచ్చరిక ఓ పెను ప్రమాదఘంటిక. అసలే ఆరోగ్య సిబ్బంది కొరత కాగా, వారిలో అనేకులు కరోనా బారినపడడం కష్టాలను మరింత పెంచుతోంది. ప్రపంచ దేశాల్లో అంతకంతకూ పెరుగుతున్న కేసుల సంఖ్య... పండుగల వేళ మన దేశాన్ని పారాహుషార్ అంటోంది. ప్రపంచవ్యాప్తంగా గత వారంలో 11 శాతం మేర కరోనా కేసులు హెచ్చాయి. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ, స్పెయిన్లలో రికార్డుస్థాయిలో కరోనా బారినపడుతున్నారు. 61.9 శాతం జనాభాకు పూర్తిగా టీకాలు వేసిన అమెరికాలో పరిస్థితే ఇలా ఉంటే, మిగతాచోట్ల ఏమిటో ఊహించుకోవచ్చు. నిజానికి, ఈ ఏడాది చివరి కల్లా ప్రతి దేశంలో 40 శాతం మందికి పూర్తిగా టీకా వేయాలనీ, కొత్త ఏడాది మధ్యకల్లా అది 70 శాతానికి చేరాలనీ భావించారు. కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థలో సభ్యు లైన 194 దేశాల్లో 92 దేశాలు ఈ ఏటి 40 శాతం లక్ష్యాన్ని కూడా చేరుకోవట్లేదు. అదీ విషాదం. అతి కొద్ది ధనిక దేశాల చేతుల్లోనే టీకాలు, ఆరోగ్య పరికరాలు పోగుపడడంతో సమానత్వం అసాధ్యం. కరోనాపై పోరులో వర్ధమాన దేశాలు వెనకబడ్డాయి. కొత్త వేరియంట్లకూ సందు చిక్కింది. గత వేరియంట్ల కన్నా ఒమిక్రాన్ తక్కువ ప్రాణాంతకమని ప్రాథమిక స్టడీలు చెబుతున్నా, పెద్దయెత్తున ఆస్పత్రి పాలయ్యే ప్రమాదమైతే ఉంది. కరోనాతో ఉద్యోగులు క్వారంటైన్లో ఉంటే, వ్యాపారాలకూ దెబ్బే. ఆర్థిక రంగాన్ని దృష్టిలో పెట్టుకొనో ఏమో అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు బాధితులు 10 రోజులు ఐసొలేషన్లో ఉండాల్సి ఉంటే, దాన్ని తాజాగా 5 రోజులకే తగ్గిస్తున్నాయి. ఈ వివాదాస్పద నిర్ణయం ఎంతవరకు శాస్త్రీయమో చెప్పలేం. ఐసొలేషన్ రోజుల్ని తగ్గించడంతో బాధితుల నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి వేగవంతం కావచ్చని నిపుణుల అనుమానం. డాక్టర్ల మందులతో పాటు నర్సుల సేవ కీలకమైన వేళ భారత్ లాంటి చోట్ల నర్సుల కొరత ఉంది. ప్రతి వెయ్యిమందికీ ముగ్గురు నర్సులుండాలని ఆరోగ్యసంస్థ మాట. భారత్లో 1.7 మందే ఉన్నారు. మన దేశంలోనూ రోజుకు సగటున 8 వేలకు పైగా కేసులు వస్తున్నాయి. సగటు కరోనా పాజిటివిటీ రేటు 0.92 శాతం. గత 24 గంటల్లో 13 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 33 రోజుల తర్వాత దేశంలో తొలిసారి కేసుల సంఖ్య 10 వేలు దాటింది. భయపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులూ వెయ్యికి చేరుతున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్రల్లో కేసులు పెచ్చరిల్లుతున్నాయి. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 1.73 శాతం దాటింది. అక్కడి కేసుల్లో 46 శాతం ఒమిక్రాన్వే. చెన్నై, బెంగళూరు, కోల్కతా, అహ్మదాబాద్ లాంటి నగరాల్లో గత వారంగా కరోనా పెరగడం, ఢిల్లీ – ముంబయ్లలో ఇప్పటికే కరోనా థర్డ్వేవ్ వచ్చేసిందనీ, సామాజిక వ్యాప్తి జరుగుతోందనీ వార్తలు రావడం ఆందోళనకరం. కాగా, దేశంలోని కేస్లోడ్లో 25 శాతం కేరళ నుంచేనట. కేరళ సహా కొన్నిచోట్ల నైట్ కర్ఫ్యూ పెట్టేశారు. ముంబయ్లో 144 సెక్షన్ విధించారు. రోజు రోజుకూ కేసులు పెరుగుతున్న తెలంగాణలో సైతం ఆరోగ్యాధికారులు రెండో ప్రమాద హెచ్చరిక చేశారు. రానున్న 2 నుంచి 4 వారాలు అత్యంత కీలకమనీ, జాగ్రత్తలు అవసరమనీ పదేపదే గుర్తుచేస్తు్తన్నారు. పరిస్థితులు ఇలా ఉంటే, వచ్చే ఏడాది మొదట్లో 15 కోట్ల మంది ఓటర్లు పాల్గొనే యూపీ సహా వివిధ రాష్ట్రాల ఎన్నికలు, ర్యాలీలు యథావిధిగా జరగనున్నాయి. గురువారం ఎన్నికల సంఘం ఆ సంగతి తేల్చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలనీ, గుంపులకూ, ఉత్సవాలకూ దూరంగా ఉండాలనీ చెబుతున్న పాలకులు, పార్టీ నేతలు ఎన్నికల వేళ తాము ఆ పని చేయడం లేదు. ముఖానికి మాస్కు, భౌతిక దూరం లేని జనప్రదర్శనలతో అన్ని పార్టీలదీ అదే తీరు. రాత్రి వేళ కర్ఫ్యూలు, పగటిపూట ర్యాలీలు– ఇదీ నేటి ద్వంద్వ నీతి. ఢిల్లీలో రెండు రోజుల క్రితమే ఎల్లో అలర్ట్ జారీ చేసి, స్కూళ్ళు, సినిమా హాళ్ళు మూసేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పంజాబ్ ఎన్నికల ర్యాలీలు మాత్రం మానుకోదలిచినట్టు లేరు. చండీగఢ్లో ఆయన తాజా విజయోత్సవ ర్యాలీయే అందుకు నిదర్శనం. యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ మొదలు ప్రధాని, హోమ్ మంత్రి పాల్గొంటున్న ఉత్తరాది రాష్ట్రాల ర్యాలీలు సరేసరి. కుంభమేళాకు లేని అభ్యంతరం ఇప్పుడు బెంగాల్లో గంగా సాగర్ మేళాకు ఎందుకన్నది మమతా బెనర్జీ ప్రశ్న. ఇలాంటి చర్యలు సరైనవేనా అన్నది నాయకులే ఆత్మపరి శీలన చేసుకోవాలి. ప్రజారోగ్యం కన్నా పార్టీల ఎన్నికల ప్రయోజనాలే ఎక్కువ కావడం సరైనదా అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే, ఈ ఏడు ఇలాగే తమిళనాడు, కేరళ, బెంగాల్ తదితర రాష్ట్రాల ఎన్నికల ర్యాలీలతో ఎన్ని రెట్లు కేసులు పెరిగాయో తెలిసిందే. ఇప్పుడు ప్రజల ఆరోగ్యం వాళ్ళ చేతుల్లోనే ఉంది. పైపెచ్చు, డిసెంబర్ మొదట్లో రోజూ 80 లక్షల డోసులు వేస్తే, ఇప్పుడది 60 లక్షలకు పడి పోవడం పాలకుల లోపమే. కొత్తగా రెండు కొత్త వ్యాక్సిన్లు (కోవోవ్యాక్స్, కోర్బెవ్యాక్స్) – ఓ మాత్ర (మాల్నూపిరవర్)కు అనుమతిచ్చినా, వృద్ధులకు బూస్టర్లు – టీనేజర్లకు టీకాలేస్తామంటున్నా, నేటికీ వయోజనుల్లో 63 శాతానికే 2 డోసులూ పూర్తయ్యాయని మర్చిపోతే కష్టం. -
Covid-19: తొలగని థర్డ్ వేవ్ ముప్పు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తిపై ప్రజల్లో భయాందోళనలు పూర్తి తొలగిపోయే పరిస్థితి కనిపించట్లేదు. డెల్టా వేరియంట్లో ఇప్పటివరకు 25 మ్యాటేషన్లను నిపుణులు గుర్తించారు. భారత్లోనే కాకుండా, అమెరికా, యూరప్తో సహా అనేక దేశాలలో ఈ మ్యూటేషన్ పరివర్తన కొనసాగుతోంది. దీని కారణంగా వైరస్లో మరిన్ని మార్పులు సంభవిస్తాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. భారతదేశంలో డెల్టా–4 అనే కరోనా వేరియంట్తో థర్డ్ వేవ్ ప్రమాదం ఇంకా తొలగిపోలేదని బయో టెక్నాలజీ విభాగం శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాస్తవానికి దేశంలో డెల్టా–4 వేరియంట్ వ్యాప్తి పెరుగుతోంది. దీనికి సంబంధించి శాస్త్రవేత్తల బృందం హెచ్చరికలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ నుంచి డెల్టా వేరియంట్లో మ్యూటేషన్లు జరుగుతూనే ఉన్నాయని , ఈ నెల 13వ తేదీన బయోటెక్నాలజీ విభాగం బృందం కేంద్ర ప్రభుత్వానికి అందించిన ఒక నివేదికలో తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా వేరియంట్లలో మ్యూటేషన్లను గుర్తించేందుకు ఇప్పటివరకు 90,115 నమూనాల జన్యు శ్రేణి పూర్తయిందని, అందులో 62.9 శాతం నమూనాల్లో వైరస్కు సంబంధించిన తీవ్రమైన వేరియంట్స్ని గుర్తించామని నివేదికలో పేర్కొన్నారు. వీటిలో డెల్టా, ఆల్ఫా, గామా, బీటా, కప్ప వంటి వేరియంట్లు కోవిడ్–19కు సంబంధించిన ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచడమే కాకుండా, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా సోకుతాయని గుర్తించారు. దేశంలో మ్యూటేషన్ సి.1.2 అనే వేరియంట్ కేసు ఇప్పటివరకు గుర్తించలేదని నివేదిక స్పష్టంగా పేర్కొంది. అయితే కరోనా వైరస్కు సంబంధించిన డెల్టా, డెల్టాకు సంబంధం ఉన్న ఇతర మ్యూటేషన్లు నిరంతరం జరుగుతున్నాయని తెలిపారు. దీని కారణంగా మహమ్మారి విషయంలో పరిస్థితి ఆందోళనకరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం పరీక్షిస్తున్న అనేక నమూనాల్లో డెల్టా–4 మ్యూటేషన్ను గుర్తిస్తున్నారు. డెల్టా–1 నుంచి డెల్టా–25 వరకు గుర్తించిన అన్ని మ్యూటేషన్లలో డెల్టా–4 అనే మ్యూటేషన్ చాలా వేగంగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ప్రస్తుతం అదే డెల్టా–4 మ్యూటేషన్ మహారాష్ట్ర, కేరళలలో వ్యాపిస్తోంది. రాబోయే రోజుల్లో కరోనా థర్డ్ వేవ్ వస్తే అందులో డెల్టాలో జరుగుతున్న ఈ మ్యూటేషన్లు కీలకంగా మారుతాయనే ఆందోళనన నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ) ప్రకారం, గత నెలలో మహారాష్ట్రలో 44 శాతం మంది, కేరళలో సుమారు 30 శాతం మంది రోగులలో డెల్టా–4 వేరియంట్ కనుగొన్నారు. ప్రస్తుతం డెల్టా –4 వేరియంట్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళనకరమైనదిగా వర్గీకరించింది. అయితే వైరస్కు సంబంధించిన ఈ కొత్త మ్యూటేషన్లు కొత్త అంటు వ్యాధులకు కారణం అవుతాయని నిపుణులు భావిస్తున్నారు. యాక్టివ్ కేసులు 0.95% మాత్రమే దేశంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. కేంద్రం సోమవారం విడుదల చేసిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 80.85 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోస్లను అందించారు. దేశంలో గతేడాది మార్చిలో కోవిడ్ కేసులు ప్రారంభమైన తర్వాత మొత్తం పాజిటివ్ కేసుల్లో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 0.95 శాతంతో అత్యల్పంగా ఉన్నాయి. దేశంలో గత 183 రోజుల్లో అతి తక్కువగా యాక్టివ్ కేసులు 3,18,181 కు చేరుకున్నాయి. కాగా గత 24 గంటల్లో 30,256 కొత్త కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 295 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,45,133కు చేరుకుంది. -
రాష్ట్రంలో ఐదు రకాల డెల్టా వేరియంట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రెండో వేవ్లో నమోదైన కేసుల్లో డెల్టా వేరియంట్కు చెందిన ఐదు ఉప రకాలు వ్యాప్తి చెందినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు కరోనా బారినపడ్డ వారి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ చేసి ఈ నిర్ధారణకు వచ్చారు. తాజాగా ‘గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ షేరింగ్ ఏవియన్ ఇన్ఫ్లూయెంజా డేటా (జీఐఎస్ఏఐడీ)’లో ఈ వివరాలను పొందుపరిచారు. రాష్ట్రంలో జూలై నాటికి నమోదైన కేసుల్లో 95 శాతం డెల్టా వేరియంట్వేనని ఇప్పటికే ప్రకటించగా.. అందులో ఉప రకాల డేటాను ప్రస్తుతం వెల్లడించారు. దేశవ్యాప్తంగా డెల్టా వేరియంట్లో ఏకంగా 13 ఉప రకాలు ఉన్నాయని.. అందులో తెలంగాణలో ఐదు రకాలు ఉన్నాయని గుర్తించినట్టు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కువగా ‘ఏవై–12’ వ్యాప్తి జూలైలో నమోదైన కరోనా కేసుల్లో దేశవ్యాప్తంగా అసలైన డెల్టా రకం కేసులు ఎక్కువశాతం ఉండగా.. రాష్ట్రంలో మాత్రం డెల్టా ఉప రకం ‘ఏవై–12’కేసులు అధికంగా నమోదైనట్టు తేలింది. రాష్ట్రంలో ఈ ఉపరకం కేసులు 48 శాతం ఉండగా.. అసలైన డెల్టా కేసులు 31 శాతమే నమోదయ్యాయి. ►తర్వాత నాలుగో రకం (ఏవై–4) డెల్టా కేసు లు 10%, ఆరో రకం 3 శాతం, ఐదో రకం ఒక శాతం, మిగతా అన్ని వేరియంట్లు/ఉప రకాలు కలిపి ఏడు శాతం కేసులు వచ్చాయి. ►హైదరాబాద్లో ఒరిజినల్ డెల్టా 45 శాతం, 12వ రకం డెల్టా కేసులు 41 శాతం ఉన్నాయి. ►హైదరాబాద్, గద్వాలలో నాలుగు రకాల డెల్టా ఉప రకాలు ఉండగా.. జగిత్యాల, మహబూబ్బాబాద్ జిల్లాల్లో 3 రకాలు వ్యాప్తి చెందాయి. ►జగిత్యాల, జనగాం, గద్వాల, మహబూబాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, ములుగు, నాగర్కర్నూల్, నల్లగొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిరిసిల్ల, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, సిద్దిపేట జిల్లాల్లో ఎక్కువ శాతం ‘ఏవై–12’రకం కేసులు నమోదయ్యాయి. ►ఒరిజినల్ డెల్టా కేసులు అత్యధికంగా హైదరాబాద్, జగిత్యాల, మేడ్చల్, నాగర్కర్నూల్ జిల్లాల్లో వచ్చాయి. ►వనపర్తి జిల్లాలో నాలుగో రకం డెల్టా వైరస్ ఉందని తేలింది. రెండు మ్యూటేషన్లతో.. రాష్ట్రంలో అధికంగా వ్యాప్తిలో ఉన్న ‘ఏవై–12’ఉప రకంలో రెండు మ్యూటేషన్లు జరిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒరిజినల్ డెల్టాతో పోలిస్తే టీ–33ఆర్, పీ–1162ఏ ప్రొటీన్లు మ్యూటేషన్ చెందాయని వెల్లడించారు. అయితే ఇవి ఏ మేరకు ప్రమాదకరం అన్నదానిపై స్పష్టత లేదని.. పూర్తిస్థాయిలో పరిశోధన చేస్తే, దాని వ్యాప్తి సామర్థ్యం, ప్రమాద తీవ్రత తెలుస్తుందని పేర్కొన్నారు. -
తెలంగాణలో ‘డెల్టా’ కేసులే ఎక్కువ..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా డెల్టా వేరియంట్ రకానివే ఉన్నట్లు తేలింది. క్రమంగా ఈ వేరియంటే స్థిరపడిపోతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వేరియంట్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల్లో రోజురోజుకూ డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతున్నట్లు నిర్ధారణ అయింది. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నమోదైన కేసుల శాంపిళ్లను శాస్త్రవేత్తలు జీనోమ్ సీక్వెన్సింగ్ చేశారు. ఆ వివరాలు తాజాగా గ్లోబల్ ఇన్షియేటివ్ ఆన్ షేరింగ్ ఏవియన్ ఇన్ఫ్లూయెంజా డేటా (జీఐఎస్ఏఐడీ)లో పొందుపరిచారు. అన్ని దేశాల జీనోమ్ సీక్వెన్సింగ్ డేటాను ఇందులోనే అధికారికంగా పొందుపరుస్తారు. ఇందులో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో డెల్టా వేరియంట్ ఏ స్థాయిలో ఉందో ప్రస్తావించడం గమనార్హం. జూలైలో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల్లో 95 శాతం డెల్టా వేరియంట్వేనని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో జగిత్యాల, జనగాం, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్, ములుగు, నాగర్కర్నూలు, నల్లగొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి, వరంగల్ వంటి 14 జిల్లాల్లో నమోదైన కేసులన్నీ డెల్టా వేరియంట్వేనని నిర్ధారించారు. హైదరాబాద్లో నమోదైన వాటిల్లో 94 శాతం, గద్వాల జిల్లాలో 93%, సూర్యాపేట జిల్లాలో 86% కేసులు డెల్టా రకానివని కనుగొన్నారు. నెలనెలా పెరుగుతున్న తీవ్రత ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో సెకండ్ వేవ్ తీవ్రత పెరిగిన విషయం విదితమే. డెల్టా వేరియంట్ రకం వైరస్ సోకిన రోగులకు తీవ్ర లక్షణాలు కనిపించాయి. దీంతో వారికి రెమిడెసివిర్, స్టెరాయిడ్స్ ఎక్కించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలోనే మరణాలు కూడా అధికంగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్లో రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 33 శాతం డెల్టా రకానివి ఉండగా, అవి మే నెలలో ఏకంగా 84 శాతానికి పెరిగాయి. జూన్లో 86 శాతానికి చేరగా, జూలైలో అదికాస్తా 95 శాతానికి చేరడం గమనార్హం. ఆగస్టులో ఇంకా పెరగవచ్చని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం రాష్ట్రంలో డెల్టా ప్లస్ కేసులు రెండు నమోదయ్యాయి. డెల్టా రకంతో పోలిస్తే ఇది ప్రమాదకరమా కాదా అన్నదానిపై స్పష్టత లేదు. మహారాష్ట్ర, కేరళలో డెల్టా ప్లస్ కేసులు పెరుగుతున్నాయి. మున్ముందు ఇది మరింత విస్తరించే ప్రమాదముందని హెచ్చరికలు వస్తున్నాయి. థర్డ్వేవ్లో ఏ రకం వైరస్ విజృంభిస్తుందో ఇంకా స్పష్టత రావడం లేదని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. టీకానే పరిష్కారం: డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకుడు కరోనాకు సంబంధించి ఎలాంటి వేరియంట్ వచ్చినా జాగ్రత్తలతోనే తిప్పికొట్టాలి. మాస్క్లు ధరించడం, భౌతికదూరం పాటించడం, చేతులను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసుకోవడంతోనే వైరస్ను ఎదుర్కోవచ్చు. వీటితోపాటు వ్యాక్సిన్ వేసుకుంటేనే అన్ని రకాల వైరస్లకు చెక్ పెట్టొచ్చు. కాబట్టి ప్రజలు టీకా వేయించుకునేందుకు ముందుకురావాలి. రాష్ట్రంలో 12 లక్షల టీకాలు అందుబాటులో ఉన్నాయి. రెండ్రోజులకోసారి రెండు లక్షల టీకా డోసులను కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది. కాబట్టి టీకాకు ఎక్కడా కొరతలేదు. -
ఆరువారాల లాక్డౌన్, అయినా లొంగని డెల్టా వేరియంట్
సిడ్నీ: ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ కేసుల ఉధృతి తగ్గుముఖం పట్టడం లేదు. ముఖ్యంగా శరవేగంగా వ్యాప్తి చెందే డెల్టా వేరియంట్తో సిడ్ని నగరం విలవిలలాడుతోంది. ఆరు వారాల కఠిన లాక్డౌన్ తర్వాత కూడా రికార్డు స్థాయిల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలోని అతిపెద్ద నగరం సిడ్నీలో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో 291కి పెరిగింది. అంతేకాదు పరిస్థితి మరింత దిగజారవచ్చని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుత ధోరణి ప్రకారం రోజువారీ కేసు సంఖ్య మరింత ఉధృతమయ్యే ప్రమాదం ఉందని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర ప్రీమియర్ గ్లాడిస్ బెరెజిక్లియన్ శుక్రవారం ప్రకటించారు. ఆస్ట్రేలియాలోని మూడు అతిపెద్ద నగరాలతో సహాఇతర ప్రాంతాల్లో కూడా కరోనా మహమ్మారి విధ్వంసం కారణంగా దేశ జనాభాలో మూడింట రెండు వంతుల మంది లాక్డౌన్లో ఉన్నారు. ఉత్తరాన ఉన్న క్వీన్స్ల్యాండ్, పశ్చిమ ఆస్ట్రేలియాలలో కూడా డెల్టా వేరియంట్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా క్వీన్స్లాండ్లో10, మెల్బోర్న్లో విక్టోరియాలో 6 కొత్త కేసులు నమోదయ్యాయి. సిడ్నీ, మెల్బోర్న్, బ్నిస్బేన్ నగరాల్లో లాక్డౌన్ అమల్లో ఉంది. ఫలితంగా వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆగస్టు 28 వరకు సిడ్నీ లాక్డౌన్ అమల్లో ఉండనుంది. ఒక్క సిడ్నీ నగరంలోనే దాదాపు 50లక్షల మంది ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. -
కోవిడ్ మహమ్మారి మళ్లీ విశ్వవిజృంభణ
-
డెల్టా వేరియంట్పై షాకింగ్ అధ్యయనం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ మూడో వేవ్ ముంచుకొస్తోందన్న ఆందోళన కొనసాగుతున్న తరుణంలో ‘డెల్టా వేరియంట్’ పై తాజా నివేదిక మరింత ఆందోళన పుట్టిస్తోంది. ఇది ఇతర వేరియంట్ల కంటే తీవ్రమైన ఇన్ఫెక్షన్ను కలిగిస్తుందని, అత్యంత ప్రమాదకరమైన చికెన్పాక్స్ కంటే సులభంగా వ్యాప్తి చెందుతుందని యూఎస్ హెల్త్ అథారిటీని ఉటంకిస్తూ అక్కడి మీడియా నివేదించింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఇంకా ప్రచురితం కాని డేటా ప్రకారం భారతదేశంలో ముందుగా గుర్తించిన డెల్టా వేరియంట్ రెండు డోసులు తీసుకున్న వ్యక్తుల నుంచి బాగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ కథనాలను ప్రచురించాయి. డెల్టా సోకిన వ్యక్తిలో వైరస్ లోడ్ మూములు దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువ అని తాజా అధ్యయనం తెలిపింది. దీనిపై శుక్రవారం సీడీసి అదనపు డేటాను ఏజెన్సీ ప్రచురిస్తుందని భావిస్తున్నారు. కరోనా వైరస్కు చెందిన డెల్టా వేరియంట్ చాలా ప్రమాదకరంగా విస్తరిస్తోందని, వ్యాక్సిన్ల రక్షణ వలయం కూడా దీన్ని అడ్డుకోలేదని, మరింత విధ్వంసకరంగా విజృంభించే ప్రమాదముందని సీడీసీ వెల్లడించింది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి డెల్టా వేరియంట్ సోకితే, వారి ముక్కు, గొంతులో ఎంత వైరస్ ఉంటుందో, వ్యాక్సిన్ తీసుకోని వారిలో కూడా అంతే వైరల్ లోడ్ ఉంటుందని సీడీసీ డైరెక్టర్ డాక్టర్ రోషెల్ పీ వాలెన్స్కీ వెల్లడించారు. వైరస్ లోడ్ మూములు దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువనీ, మెర్స్, సార్స్, ఎబోలా, కామన్ కోల్డ్, సీజనల్ ఫ్లూ, స్మాల్ పాక్స్ వైరస్ల కన్నా డెల్టా వేరియంట్ వేగంగా విస్తరిస్తుందని పేర్కొన్నారు. అలాగే డెల్టా వేరియంట్తో చాలా తీవ్రమైన ముప్పు అని వస్తున్న డేటాతో ఆందోళన రేపుతోందని, దీనిపై తక్షణమే గట్టి చర్యలు అవసరమని పేర్కొన్నారు. అందుకే అందరూ ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు, సిబ్బంది ఇతరులు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని వాలెన్స్కీ చెప్పారు. కాగా అమెరికాలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. వ్యాక్సిన్ తీసుకున్నవారితో వైరస్ వ్యాప్తి అవుతున్నట్లు తాజాగా తేలింది. దీంతో అందరూ మాస్క్ ధరించాలని సీడీసీ మళ్లీ ఆదేశాలు జారీ చేసింది. టీకా వైరస్ తీవ్రతను 90 శాతం అడ్డుకున్నప్పటికీ ఇన్ఫెక్షన్ లేదా ట్రాన్స్మిషన్ను నివారించడంలో తక్కువ ప్రభావవంతంగా ఉండవచ్చు అని తెలిపింది. డెల్టా వేరియంట్ సోకిన వారిలో ఇతర కేసులతో పోలిస్తే వైరల్ లోడ్ అధికంగా ఉందనీ, ఆల్ఫా వేరియంట్ సోకినవారు గాలిలోకి వదిలే లోడ్తో పోలిస్తే డెల్టా వేరియంట్తో గాలిలోకి విడుదలయ్యే వైరల్ లోడ్ పది రెట్లు ఎక్కువగా ఉన్నట్లు సీడీసీ అంచనా వేసింది. -
జాన్సన్ వ్యాక్సిన్కు మరోషాక్ : షాకింగ్ స్టడీ
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాక్సిన్కు సంబంధించి జాన్సన్ అండ్ జాన్సన్కు మరో భారీ షాక్ తగిలింది. జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ కోవిడ్-19 వ్యాక్సిన్ డెల్టా వేరియంట్, ఇతర వేరియంట్లపై సరిగా పనిచేయడంలేదని తాజా నివేదికలో తేలింది ప్రస్తుతం అమెరికాలో మళ్లీ విస్తరిస్తున్న కేసులకు కారణమైందని న్యూయార్క్ విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం జరిపిన ఒక అధ్యయనం వెల్లడించింది. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం అమెరికాలో ఆమోదించిన మూడు కరోనా వ్యాక్సిన్లను తీసుకున్న వ్యక్తుల నుండి తీసుకున్న రక్త నమూనాలపై నిర్వహించిన పరీక్షల ఆధారంగా ఈ అధ్యయనాన్నినిర్వహించారు ఈ సందర్బంగా జాన్సన్ టీకా సమర్థత 29 శాతం మాత్రమేనని తేల్చారు. ఈ క్రమంలో ఈ వ్యాక్సిన్ తీసుకున్నవారికి బూస్టర్ డోస్లు అవసరమవుతాయని అధ్యయనవేత్తలు సూచించారు. డెల్టా వేరియంట్పై ఆస్ట్రాజెనెకా టీకా సింగిల్ డెస్ పనితీరు 33 శాతం సమర్ధతతో పనిచేస్తుంది. రెండు డోసులకు గాను 60 శాతం సమర్ధతతను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో రెండో డోస్ కావాలని అధ్యయనం అంచనా వేసింది. వైట్ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీ మాట్లాడుతూ, బూస్టర్ షాట్లు అవసరమా అనేదానిపై పరిశోధకులు ఇంకా అంచనా వేస్తున్నారన్నారు. మరోవైపు ఈ వాదనను జే అండ్ జే ప్రతినిధి సీమా కుమార్ తోసి పుచ్చారు. ఇతర కొత్త వేరియంట్లపై తమ టీకా ప్రభావవంతంగా ఉంటుందని స్పష్టం చేశారు. క్లినికల్ ట్రయల్స్లో సింగిల్ షాట్ జాన్సన్ వ్యాక్సిన్ మొదటి కరోనా వైరస్పై 66శాతం, రెండు-షాట్ల ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు 90శాతం కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉన్నాయని తేలాయి. సీడీసీ డైరెక్టర్ డాక్టర్ రోషెల్ వాలెన్స్కీ మంగళవారం అందించిన సమాచారం అమెరికాలో మొత్తం కేసుల్లో 83 శాతం డెల్టా వేరియంట్ కేసులే. అలాగే అమెరికాలో 13 మిలియన్లకు పైగా జాన్సన్ టీకాను తీసుకున్నారు. కాగా ఇప్పటికే ఈ కంపెనీకి చెందిన కరోనా వ్యాక్సిన్ పలు విమర్శలొచ్చాయి. జాన్సన్ వ్యాక్సిన్ ఫిబ్రవరిలో ఆమోదం పొందినప్పటి నుండి అనేక సమస్యపై నివేదికలు వెలువడ్డాయి. తీవ్రమైన రక్తం గడ్డకట్టేసమస్యల వివాదంతో ఏప్రిల్లో 10 రోజుల విరామాన్ని ప్రకటించింది. ఆ తరువాత ఈ టీకా తీసుకున్న వారిలో అరుదైన నాడీ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, గుల్లెయిన్-బారే సిండ్రోమ్ అనే న్యూరోలాజికల్ డిజార్డర్ ప్రమాదం ఉందని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ) హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
కొత్త వేరియంట్లు పుట్టుకొస్తే పాజిటివ్ కేసులు భారీగా పెరిగే ప్రమాదం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నమోదవుతున్న రోజువారీ కరోనా కేసుల్లో 80 శాతానికి పైగా డెల్టా వేరియంట్ (బి.1.617.2) వేనని ఇండియన్ సార్స్–కోవ్–2 జినోమిక్స్ కన్సార్టియం సభ్యుడు డాక్టర్ ఎన్.కె.అరోరా చెప్పారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి డెల్టా వేరియంట్ కారణమని తెలిపారు. మరింత తీవ్రత కలిగిన కొత్త వేరియంట్లు పుట్టుకొస్తే పాజిటివ్ కేసులు భారీగా పెరిగే ప్రమాదం ఉందన్నారు. డెల్టా కంటే ముందు ఆల్ఫా రకం కరోనా పురుడు పోసుకుంది. ఆల్ఫా కంటే డెల్టాకు 40–60 శాతం వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉంది. డెల్టా ఇప్పటికే ప్రపంచ దేశాలను చుట్టేస్తోంది. యూకే, అమెరికా, సింగపూర్ తదితర 100కు పైగా దేశాల్లో ఈ వేరియంట్ కేసులు బయటపడ్డాయి. ఇక డెల్టా ప్లస్ ప్రభావం కూడా భారత్లో మొదలయ్యింది. మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఇప్పటిదాకా 55–60 డెల్టా ప్లస్ (ఏవై1. ఏవై.2) వేరియంట్ కేసులు బయటపడ్డాయి. ఈ రకం కరోనా వ్యాప్తి తీరు, తీవ్రత, వ్యాక్సిన్ నిరోధకతపై అధ్యయనం చేస్తున్నట్లు డాక్టర్ అరోరా వెల్లడించారు. డెల్టా వేరియంట్ స్పైక్ ప్రొటీన్లో మార్పులు (మ్యుటేషన్స్) జరుగుతున్నాయని, తద్వారా వేగంగా వ్యాప్తి చెందే లక్షణాన్ని సంతరించుకుంటోందని, అంతేకాకుండా మనిషి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ ప్రభావం నుంచి తప్పించుకోగలుగుతోందన్నారు. -
కరోనా నెమ్మదించలేదు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి నియంత్రణలోకి వస్తోందన్న భావన వద్దని, మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయమిదని డబ్ల్యూహెచ్వో ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్ కేసులు భారీగా నమోదవుతుండటం, లాక్డౌన్ నిబంధనల సడలింపు, టీకాల కార్యక్రమం మందగమనం, ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం.. ఈ నాలుగు అంశాలు దీనికి కారణమని తెలిపారు. కరోనా పరిస్థితిపై బ్లూమ్బెర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు కీలక అంశాలను వెల్లడించారు. డెల్టా వేరియంట్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయని, వ్యాధి ఇప్పటికీ వ్యాపిస్తూనే ఉందనేందుకు స్పష్టమైన ఆధారాలు ఉన్నా యని ఆమె వివరించారు. ‘‘శుక్రవారం ఒక్కరోజే దాదాపు ఐదు లక్షల కొత్త కేసులు నమోదు కాగా.. 9,300 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే మహమ్మారి తగ్గుముఖం పడుతోందని అనే అవకాశమే లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా వర్గీకరించుకున్న ఆరు ప్రాంతాల్లో కనీసం ఐదింటిలో కేసుల సంఖ్య ఎక్కువైంది. ఆఫ్రికా దేశాల్లో అయితే మరణాల రేటు 30–40 శాతం పెరిగింది. డెల్టా వేరియంట్ కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది. కొత్త కేసుల పెరుగుదలలో బ్రెజిల్, ఇండోనేషియా, అమెరికా, యూకేలు ముందు వరసలో ఉన్నాయి. యూరప్లో గత వారం రోజుల్లో 32.2 శాతం, తూర్పు మధ్యధరా ప్రాంతంలో 21.2 శాతం, ఆఫ్రికాలో 18.2 శాతం కేసులు పెరిగాయి..’’అని సౌమ్యా స్వామినాథన్ వివరించారు. టీకా ఉత్పత్తి పెంచాలి ప్రపంచవ్యాప్తంగా కరోనా టీకాల కార్యక్రమం మందగిస్తోందని, లాక్డౌన్ నిబంధనల సడలింపు కూడా తోడు కావడంతో సమస్య జటిలమవుతోందని సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. ‘‘బ్రిటన్లో ఈ నెల 19వ తేదీ నుంచి కోవిడ్ నిబంధనలను పూర్తిగా తొలగిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇతర యూరోపియన్ దేశాల్లోనూ దశలవారీగా నిబంధనల ఎత్తివేత కొనసాగుతోంది. ఇది వైరస్ విస్తరణ పెరిగేందుకు కారణమవుతుంది. ప్రపంచ దేశాలు టీకాల ఉత్పత్తిని పెంచే ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. సాంకేతిక పరిజ్ఞానాలను ఉచితంగా అందుబాటులో ఉంచడం, స్వచ్ఛందంగా కంపెనీలకు లైసెన్సులు ఇవ్వాలి. ట్రిప్స్ ఒప్పందంలోని కొన్ని అంశాలను అనుకూలంగా మార్చుకుని మేధోహక్కుల రాయితీలివ్వడం వంటి చర్యలు చేపట్టాలి. తద్వారా ఎక్కువ సంఖ్యలో టీకాలు ఉత్పత్తి చేయవచ్చు’’అని సూచించారు. దేశాలు స్థానికంగానే టీకాలు తయారు చేసుకునేందుకు ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. ప్రాణాలు కోల్పోయారు. అంటే మహమ్మారి తగ్గుముఖం పడుతోందని అనే అవకాశమే లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా వర్గీకరించుకున్న ఆరు ప్రాంతాల్లో కనీసం ఐదింటిలో కేసుల సంఖ్య ఎక్కువైంది. ఆఫ్రికా దేశాల్లో అయితే మరణాల రేటు 30–40 శాతం పెరిగింది. డెల్టా వేరియంట్ కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది. కొత్త కేసుల పెరుగుదలలో బ్రెజిల్, ఇండోనేషియా, అమెరికా, యూకేలు ముం దు వరసలో ఉన్నాయి. యూరప్లో గత వారం రోజుల్లో 32.2%, తూర్పు మధ్యధరా ప్రాంతంలో 21.2%, ఆఫ్రికాలో 18.2% కేసులు పెరిగాయి..’’అని సౌమ్యా స్వామినాథన్ వివరించారు. టీకా ఉత్పత్తి పెంచాలి ప్రపంచవ్యాప్తంగా కరోనా టీకాల కార్యక్రమం మందగిస్తోందని, లాక్డౌన్ నిబంధనల సడలింపు కూడా తోడు కావడంతో సమస్య జటిలమవుతోందని సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. ‘‘బ్రిటన్లో ఈ నెల 19వ తేదీ నుంచి కోవిడ్ నిబంధనలను పూర్తిగా తొలగిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇతర యూరోపియన్ దేశాల్లోనూ దశలవారీగా నిబంధనల ఎత్తివేత కొనసాగుతోంది. ఇది వైరస్ విస్తరణ పెరిగేందుకు కారణమవుతుంది. ప్రపంచ దేశాలు టీకాల ఉత్పత్తిని పెంచే ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. సాంకేతిక పరిజ్ఞానాలను ఉచితంగా అందుబాటులో ఉంచడం, స్వచ్ఛందంగా కంపెనీలకు లైసెన్సులు ఇవ్వాలి. ట్రిప్స్ ఒప్పందంలోని కొన్ని అంశాలను అనుకూలంగా మార్చుకుని మేధోహక్కుల రాయితీలివ్వడం వంటి చర్యలు చేపట్టాలి. తద్వారా ఎక్కువ సంఖ్యలో టీకాలు ఉత్పత్తి చేయవచ్చు’’అని సూచించారు. దేశాలు స్థానికంగానే టీకాలు తయారు చేసుకునేందుకు ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. -
ప్రపంచంలో కోవిడ్ మరణాలు 40 లక్షలు
వాషింగ్టన్: భారత్లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన కరోనా డెల్టా వేరియెంట్ వివిధ దేశాల్లో విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్–19 మరణాలు 40 లక్షలు దాటడం ఆందోళన పెంచుతోంది. అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రకారం ప్రపంచ దేశాల్లో కరోనా మృతుల సంఖ్య బుధవారం నాటికి 40 లక్షలు దాటింది. ప్రతీ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి కంటే ఈ సంఖ్య మూడు రెట్లు ఎక్కువ. 1982 నుంచి ఇప్పటివరకు జరిగిన యుద్ధాల్లో మరణించిన వారితో ఈ మృతుల సంఖ్య సరిసమానమని ఓస్లోలోని పీస్ రీసెర్చ్ యూనివర్సిటీ అంచనా వేసింది. జనవరి నెలలో రోజుకి ప్రపంచ దేశాల్లో 18 వేలుగా ఉన్న కరోనా మరణాలు, వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరమైన తర్వాత 7,900కి తగ్గింది. అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్ వంటి దేశాల్లో వ్యాక్సినేషన్ ఉధృతంగా జరిగి కరోనా నుంచి ఉపశమనం లభించిందని భావిస్తున్న తరుణంలో డెల్టా వేరియెంట్ మళ్లీ ఆయా దేశాల్లో విజృంభిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలోనే కోవిడ్–19 మరణాలు అధికంగా నమోదయ్యాయి. ప్రతీ ఏడుగురు కరోనా రోగుల్లో ఒకరు మరణించారు. ఇప్పటివరకు ఈ మహమ్మారితో 6 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత స్థానం బ్రెజిల్ది. ఆ దేశంలో 5 లక్షలకు పైగా కరోనా మరణాలు సంభవించాయి. అయితే ఆ దేశం మరణాల సంఖ్యని దాస్తోందన్న ఆరోపణలైతే ఉన్నాయి. కరోనాతో 40 లక్షల మంది మరణించారని రికార్డులు చెబుతున్నప్పటికీ లెక్కల్లోకి రాని వి మరిన్ని ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రెయాసస్ అన్నారు. వ్యాక్సినేషన్ పెరిగితే మరణాల సంఖ్యని అరికట్టవచ్చునని చెప్పారు. వివిధ దేశాలు లాక్డౌన్ ఎత్తేస్తున్నాయని, ఇది అత్యంత ప్రమాదకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నిరుపేద దేశాలకు అండగా ధనిక దేశాలు నిలవాలని విజ్ఞప్తి చేశారు. -
డెల్టా ఉంది.. ల్యామ్డా వచ్చేసింది?
కొత్తా దేవుడండి.. కొంగొత్తా దేవుడండి... అప్పుడెప్పుడో వచ్చిన తెలుగు సినిమా పాట పల్లవిది! ఇప్పుడు తరచూ దీన్ని మార్చి పాడుకోవాల్సిన పరిస్థితి! ఎందుకంటారా? ఏముందీ.. ఇంకో కొత్త కరోనా రూపాంతరితం అవతరించిందట! ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్లు ఎక్కడికీ పోలేదు కానీ... పాతికకుపైగా దేశాల్లో ఇప్పుడు ల్యామ్డా కలకలం మొదలైంది! కంగారేమీ లేదు లెండి.. ప్రస్తుతానికి దీంతో ముప్పు తక్కువే. దేశంలో రెండో దశ కరోనాలో విధ్వంసం సృష్టించిన డెల్టా రూపాంతరితం ఇప్పుడు ఇతర దేశాల్లో విజృంభిస్తూంటే.. కొన్ని దేశాల్లో ల్యామ్డా ఆందోళన రేకెత్తిస్తోంది. నిజానికి ఇది కొత్తగా కనుక్కున్న రూపాంతరితం ఏమీ కాదు. గత ఏడాది ఆగస్టులోనే దక్షిణ అమెరికా దేశమైన పెరూలో దీన్ని గుర్తించారు. ఆ తరువాత అది సుమారు 30 దేశాలకు విస్తరిం చింది కూడా. కానీ ఇప్పటివరకూ భారత్లో ఈ కొత్త రూపాంతరిత వైరస్ సోకిన వారు ఎవరూ లేరు. గత నెల 14న ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్గా ప్రకటించింది. అప్పటివరకూ దీనికున్న సాంకేతిక నామం సి.37. కరోనా వచ్చిన తరువాత గుర్తించిన ఏడవ వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్ ఇది. మనకేమైనా ప్రమాదమా? భారత్తోపాటు, మన ఇరుగుపొరగు దేశాల్లోనూ ఇప్పటివరకూ ల్యామ్డా రూపాంతరితాన్ని గుర్తించలేదు. ఆసియా మొత్తమ్మీద ఒక్క ఇజ్రాయెల్లోనే దీన్ని గుర్తించారు. అయితే యూరోపియన్ దేశాలు కొన్నింటిలో ఈ వైరస్ ఉన్న కారణంగా, ఆ దేశాల నుంచి భారత్కు రాకపోకలు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్న నేపథ్యంలో ల్యామ్డాపై కొంచెం జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యాక్సీన్లు వేసుకున్న వారికీ ఈ వైరస్ సోకే అవకాశం ఉండటం కొంత ఆందోళన కలిగించే విషయమే. మూక నిరోధకతకు దగ్గరగా ఉన్న యూరోపియన్ దేశాల్లో కూడా మళ్లీ మళ్లీ కేసులు ఎక్కువ అవుతూండటం గమనించాల్సిన అంశం. లక్షణాలేమిటి? ల్యామ్డాను ఇప్పటివరకూ 30 దేశాల్లో గుర్తించారు. డెల్టా రూపాంతరితం మాదిరిగానే వేగంగా వ్యాపిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని రూఢీ చేసేందుకు ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం ఈ అధ్యయనాలు జరుగుతున్నాయి. పెరూతోపాటు దక్షిణ అమెరికాలోని పలు దేశాల్లో నమోదైన కేసుల్లో ల్యామ్డావే ఎక్కువ. ఒక దశలో పెరూలో నమోదైన కేసుల్లో 80 శాతం ఈ రూపాంతరితానివే కావడం గమనార్హం. ఇటీవలే యునైటెడ్ కింగ్డమ్లో అంతర్జాతీయ ప్రయాణాలు చేసే ఆరుగురికి ఈ వైరస్ సోకింది. ఫ్రాన్స్, జర్మ నీ, ఇటలీ వంటి యూరోపియన్ దేశాలతోపాటు ఆస్ట్రేలియాలోనూ దీని ఉనికిని గుర్తించారు. జన్యుమార్పులేమిటి? వైరస్ పరిణామ క్రమంలో మ్యుటేషన్లు (జన్యుమార్పులు) సహజం. అయితే ఈ మ్యుటేషన్లు అన్నీ ప్రమాదకరం కాదు. ల్యామ్డా విషయానికి వస్తే దీని కొమ్ము ప్రొటీన్లో ఏడు ముఖ్యమైన జన్యుమార్పులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. డెల్టాలో ఈ సంఖ్య మూడు మాత్రమే. కొమ్ము ప్రొటీన్లో కీలకమైన మార్పులు జరిగాయి కాబట్టి ఈ వైరస్ డెల్టా కంటే వేగంగా వ్యాపిస్తుందని, యాంటీబాడీలను (సహజంగా పుట్టేవైనా.. వ్యాక్సిన్ ద్వారా శరీరంలో ఉత్పత్తి అయ్యేవైనా) నిరోధించగలదని కొంతమంది అంచనా వేస్తున్నారు. చిలీలో ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ప్రకారం ల్యామ్డా రూపాంతరితం యూకే, బ్రెజిల్లలో ముందుగా గుర్తించిన ఆల్ఫా కంటే ఎక్కువ నిరోధకత (యాంటీబాడీలకు) కలిగి ఉన్నట్లు తెలిసింది. చైనా వ్యాక్సిన్ సైనోవ్యాక్కు ల్యామ్డా స్పందించడం లేదని కూడా స్పష్టమైంది. అయితే పూర్తిస్థాయి అంచనాకు వచ్చేందుకు మరింత విస్తృత స్థాయిలో ఈ రూపాంతరితం తాలూకూ జన్యుక్రమాలను నమోదు చేసి పరిశీలించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘డెల్టా’పై టీకాల ప్రభావం అంతంతే!
న్యూఢిల్లీ: డెల్టా వేరియంట్ (బి.1.617.2).. ఇప్పుడు ప్రపంచాన్ని వేగంగా చుట్టేస్తున్న కరోనా మహమ్మారిలోని కొత్తరకం ఇది. మరోవైపు కరోనా నియంత్రణ కోసం టీకాలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే, ఈ టీకాలు చైనాలోని వూహాన్లో పుట్టిన ఒరిజినల్ వేరియంట్తో పోలిస్తే డెల్టా వేరియంట్కు వ్యతిరేకంగా 8 రెట్లు తక్కువ ప్రభావం చూపుతున్నట్లు ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రి నిర్వహించిన అధ్యయనంలో తేలింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయన్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిరక్షకాలు కరోనా దాడిని అడ్డుకుంటాయి. డెల్టా వేరియంట్పై టీకాల వల్ల ఉత్పత్తి అయిన యాంటీబాడీలు 8 రెట్లు తక్కువగా స్పందిస్తున్నట్లు గుర్తించారు. సర్ గంగారాం హాస్పిటల్ సహా దేశంలో మూడు కేంద్రాల్లో వంద మందికిపైగా హెల్త్కేర్ వర్కర్లపై ఈ అధ్యయనం నిర్వహించారు. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలోనూ డెల్టా వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు గమనించారు. అంటే కరోనా టీకాలు డెల్టాపై పెద్దగా ప్రభావం చూపడం లేదన్నమాట. డెల్టా రకం కరోనాను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆందోళనకరమైన వేరియంట్గా ప్రకటించిన సంగతి తెలిసిందే. నాన్–డెల్టా ఇన్ఫెక్షన్లతో పోలిస్తే డెల్టాలో వైరల్ లోడ్ అధికం. వేగంగా వ్యాప్తి చెందే లక్షణాన్ని కలిగి ఉంది. ఇది డామినెంట్ (ఆధిపత్య) వేరియంట్గా డబ్ల్యూహెచ్ఓ నిర్ధారించింది. -
బైడెన్ అట్టర్ ఫ్లాప్!
వైట్హౌజ్లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే పాలనాపరమైన దూకుడును ప్రదర్శించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్పై.. ఇప్పుడు విమర్శలు మొదలయ్యాయి. కరోనా వ్యాక్సినేషన్ విషయంలో టార్గెట్ మిస్ అయ్యాడంటూ బైడెన్ను ఉతికి ఆరేస్తున్నారు ప్రత్యర్థులు. వాషింగ్టన్: ఎన్నికల వాగ్ధానాల్లో.. అధ్యక్షుడిగా అధికారంలోకి రాగానే బైడెన్ చేసిన కీలక ప్రకటన.. అమెరికన్లకు వ్యాక్సిన్ డోసులు అందించడం. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం నాటికి 70 శాతం అమెరికన్లను(పెద్దలకు..27 ఏళ్లు పైబడిన వాళ్లు) వ్యాక్సిన్ డోసులు అందిస్తానని ప్రమాణం చేశాడు. అందుకే తగ్గట్లే తొలినాళ్లలో ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లతో డ్రైవ్ జోరు మాములుగా కనిపించలేదు. అయితే.. ఈ ప్రణాళికలో బైడెన్ టార్గెట్ను చేరుకోలేదని తెలుస్తోంది. జులై 3 నాటి ఫాక్స్ న్యూస్ రిపోర్ట్ ప్రకారం.. 67 శాతం పెద్దలకు మాత్రమే ఇప్పటిదాకా వ్యాక్సిన్ అందినట్లు సమాచారం. అయితే అమెరికాకే చెందిన మరో రెండు ప్రముఖ దినపత్రికలు మాత్రం అది 60 శాతం లోపే ఉందని కథనాలు వెలువరించడం విశేషం. ఇక దాదాపు 35 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో.. 15.7 కోట్ల మందికి పూర్తి డోసులు, 18.2 కోట్ల మందికి ఒక్క డోసైన అంది ఉంటుందని మీడియా గణాంకాలు చెప్తున్నాయి. మరోవైపు.. ఇతర దేశస్తులకు వ్యాక్సిన్లు డోసులు అందినప్పటికీ, వాటిలో చాలావరకు లెక్కలకు తీసుకోకపోవడం.. ఈ కారణం వల్లే అమెరికన్లను డోసులు పూర్తిగా అందలేదని, పైగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే లెక్కల్లో గందరగోళం నెలకొందని రిపబ్లికన్లు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రా నుంచి పూర్తి స్థాయిలో నివేదికలు అందలేదన్న వైట్హౌజ్ ప్రతినిధి వ్యాఖ్యలతో మీడియా కథనాలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. కరోనా యుద్ధం ముగియలేదు నన్ను తప్పుగా అనుకోకండి.. కరోనాతో యుద్ధం ఇంకా ముగియలేదు. డెల్టా లాంటి రకరకాల వేరియెంట్లు పుట్టుకొస్తున్నాయి అని అమెరికా ఇండిపెండెన్స్ డే సందర్భంగా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించాడు. వెయ్యి మంది అతిథుల మధ్య వైట్ హౌజ్లోని జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘‘245 ఏళ్ల క్రితం బ్రిటిష్చెర నుంచి స్వాతంత్ర్యం సంపాదించుకున్నాం. అలాగే ఇవాళ ప్రమాదకరమైన కరోనా వైరస్ నుంచి విముక్తి కోసం పోరాటంలో చివరి దశకు చేరుకున్నాం. పోరాటం ఆపొద్దు. వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలి’’ అని జాతిని ఉద్దేశించి ప్రసంగించాడు బైడెన్. మరోవైపు అమెరికా వ్యాప్తంగా సంబురాలు మాత్రం అంబురాన్ని అంటాయి. మాస్క్లు లేకుండా గుంపులుగా జనాలు వేడుకలు చేసుకున్నారు. పబ్లలో, బీచ్లలో కోలాహలం కనిపించింది. ఇక భారత ప్రధాని మోదీ సహా పలు దేశాల అధినేతలు అమెరికన్లను శుభాకాంక్షలు తెలియజేశారు. Warm felicitations and greetings to @POTUS @JoeBiden and the people of the USA on their 245th Independence Day. As vibrant democracies, India and USA share values of freedom and liberty. Our strategic partnership has a truly global significance. — Narendra Modi (@narendramodi) July 4, 2021 -
డెల్టాపై కోవాగ్జిన్ ప్రభావం 65%
హైదరాబాద్: కోవిడ్ 19 వైరస్ వేరియంట్లపై భారత్ బయోటెక్కు చెందిన కోవాగ్జిన్ చూపే ప్రభావం మదింపు గణాంకాలను కంపెనీ వెల్లడించింది. ఫేజ్ 3 ప్రయోగాల విశ్లేషణ అనంతరం కోవాగ్జిన్ టీకా సింప్టమాటిక్ కోవిడ్– 19కు వ్యతిరేకంగా 77.8 శాతం, డెల్టా వేరియంట్కు వ్యతిరేకంగా 65.2 శాతం రక్షణ కల్పిస్తుందని తెలిపింది. ఈ టీకా తీసుకున్న 12 శాతం మందిలో సాధారణ సైడ్ ఎఫెక్టులు, 0.5 శాతం మందిలో సీరియస్ సైడ్ ఎఫెక్టులు సేఫ్టీ అనాలసిస్ తెలియజేసిందని కంపెనీ వెల్లడించింది. లక్షణాల్లేని కోవిడ్కు వ్యతిరేకంగా టీకా 63.6 శాతం రక్షణనిస్తుందని తెలిపింది. సెకండ్ డోస్ ఇచ్చిన రెండువారాల పాటు దాదాపు 25 నగరాల్లో ఫేజ్ 3 ట్రయల్స్ను నిర్వహించారు. టీకా ట్రయల్స్తో నూతన ఆవిష్కరణలో ఇండియా సత్తా వెల్లడయిందని కంపెనీ సీఎండీ కృష్ణ ఎల్లా చెప్పారు. ఐసీఎంఆర్ సహకారంతో కంపెనీ ఈ టీకా తయారు చేసింది. టీకా ట్రయల్స్ ఫలితాలపై ఐసీఎంఆర్ సంతృప్తిని వ్యక్తం చేసింది. అన్ని రకాల వేరియంట్లపై కోవాగ్జిన్ ప్రభావం చూపుతుందని ఐసీఎంఆర్ డైరెక్టర్ భార్గవ చెప్పారు. ప్రపంచ టీకా ఉత్పత్తి రంగంలో భారత స్థానాన్ని కోవాగ్జిన్ మరింత బలోపేతం చేసిందన్నారు. వ్యాక్సిన్ డోసులు @ 34.46 కోట్లు సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్లో పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోస్ల సంఖ్య 34.46 కోట్లు దాటింది. శనివారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 45,60,088 శిబిరాల ద్వారా 34,46,11,291 డోసుల పంపిణీ జరిగింది. గత 24 గంటల్లో 43,99,298 వ్యాక్సిన్ డోస్లను అందించారు. దేశవ్యాప్తంగా గత 24 గంటలలో 44,111 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 6 రోజులుగా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 50వేలలోపు నిర్ధారణయ్యాయి. కోవిడ్ బారినపడి ఒక్క రోజులోనే మరో 738 మంది చనిపోవడంతో మొత్తం మరణాలు 4,01,050కు పెరిగాయి. అదే సమయంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్యలోనూ తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్న కరోనా రోగుల సంఖ్య 4,95,533కు చేరింది. 97 రోజుల తరువాత ఈ సంఖ్య 5 లక్షల లోపుకు పడిపోయింది. గత 24 గంటల్లోనే కరోనా చికిత్సలో ఉన్న వారి సంఖ్య 14,104కు తగ్గింది. మరోవైపు కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. 51 రోజులుగా కొత్త కేసుల కంటే కోలుకుంటున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. ఇప్పటివరకూ కోవిడ్ బారిన పడి కోలుకున్న వారు 2,96,05,779 మంది కాగా, గత 24 గంటల్లో 57,477 మంది కోలుకున్నారు. అంతకు ముందురోజు కంటే 13,366 మంది అదనంగా కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి శాతం 97.06కు పెరిగింది. -
కరోనా వేరియంట్లపై ‘డెల్టా’దే ఆధిపత్యం
ఐరాస/జెనీవా: ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాల్లో కోవిడ్–19 వైరస్ డెల్టా వేరియంట్ వ్యాప్తిలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తెలియజేసింది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉన్న ఈ వేరియంట్ రాబోయే రోజుల్లో ఆధిపత్య (డామినెంట్) వేరియంట్గా మారే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 2021 జూన్ 29 నాటికి 96 దేశాల్లో డెల్టా వేరియంట్ కేసులు బయటపడ్డాయని తెలిపింది. వాస్తవానికి ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉంటుందని పేర్కొంది. కరోనా వేరియంట్లను గుర్తించేందుకు అవసరమైన సీక్వెన్సింగ్ కెపాసిటీ చాలా దేశాల్లో పరిమితంగానే ఉందని వివరించింది. డెల్టా రకం కరోనా వల్ల పాజిటివ్ కేసులతోపాటు ఆసుపత్రుల్లో చేరే బాధితుల సంఖ్య పెరుగుతోందని వివరించింది. డెల్టా వ్యాప్తి తీరును గమనిస్తే ఇది రాబోయే కొన్ని నెలల్లో ఇతర అన్ని కరోనా వేరియంట్లను అధిగమించే పరిస్థితి ఉందని స్పష్టం చేసింది. కరోనా నియంత్రణ విషయంలో ప్రస్తుతం పాటిస్తున్న జాగ్రత్తలు, అమలు చేస్తున్న చర్యలు డెల్టాతో సహా ఆందోళనకరమైన వేరియంట్ల(వీఓసీ) నియంత్రణకు సైతం చక్కగా ఉపయోగపడుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ వెల్ల డించింది. ఆందోళనకరమైన వేరియంట్ల వ్యాప్తి పెరుగుతోందంటే అర్థం నియంత్రణ చర్యలను దీర్ఘకాలం కొనసాగించడమేనని తేల్చిచెప్పింది. వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని సూచించింది. నియంత్రణ చర్యలను గాలికొదిలేయడం వల్లే.. ఇప్పటివరకు గుర్తించిన కరోనా వేరియంట్లలో డెల్టా రకం వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్గా గుర్తించినట్లు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అడానోమ్ ఘెబ్రెయెసుస్ గతవారమే ప్రకటించారు. కరోనా వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతున్న దేశాల్లో ఇది అమిత వేగంతో వ్యాప్తి చెందుతోందని చెప్పారు. ఈ పరిణామం పట్ల ప్రపంచ దేశాలతోపాటు తాము కూడా ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. కొన్ని దేశాలను కరోనా ఆంక్షలను సడలించాయని, నియంత్రణ చర్యలను గాలికొదిలేశాయని, దీనివల్లే ప్రమాదకర వేరియంట్లు పంజా విసురుతున్నాయని పేర్కొన్నారు. తాజా గణాంకాల ప్రకారం.. అల్ఫా వేరియంట్ కేసులు 172 దేశాల్లో బయటపడ్డాయి. బీటా వేరియంట్ ఉనికి 120 దేశాల్లో వెలుగు చూసింది. ఇక గామా వేరియంట్ 72 దేశాల్లో, డెల్టా వేరియంట్ 96 దేశాల్లో వ్యాప్తి చెందుతున్నాయి. -
కోవిడ్ టీకా ప్రభావాన్ని డెల్టా ప్లస్ తగ్గించలేదు!
న్యూఢిల్లీ: కొత్తగా వచ్చిన డెల్టా ప్లస్ వేరియంట్ కోవిడ్ టీకాల ప్రభావాన్ని తగ్గిస్తుందనిగానీ, అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందనిగానీ చెప్పేందుకు శాస్త్రీయ గణాంకాలేవీ లేవని నీతి ఆయోగ్ సభ్యుడు, కోవిడ్ టాస్క్ఫోర్స్ చీఫ్ వీకే పాల్ చెప్పారు. కరోనా వైరస్ ధోరణిని అంచనా వేయడం కష్టం కాబట్టి ఫలానా ఫస్ట్ వేవ్ ఇప్పుడని, సెకండ్ వేవ్ అప్పుడని చెప్పలేమన్నారు. కరోనా నుంచి దేశం బయటపడాలంటే క్రమశిక్షణతో కూడిన ప్రభావవంతమైన ప్రవర్తన అవసరమన్నారు. కరోనా వేవ్స్ రావడం, రాకపోవడం మన చేతలపై ఆధారపడి ఉందని గుర్తు చేశారు. సెకండ్ వేవ్లో రోజుకు 4 లక్షల వరకు నమోదైన కేసులు కొన్ని రోజులుగా రోజుకు 50వేల దిగువకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ టీకాలు అందుబాటులో ఉన్నాయి. డెల్టా వేరియంట్లో జరిగిన ఉత్పరివర్తనాలతో డెల్టాప్లస్ ఉద్భవించిందని, దీని గురించిన సైంటిఫిక్ డేటా తక్కువగా ఉందని చెప్పారు. డెల్టాపై టీకాలు ఓకే ఐసీఎంఆర్ విశ్లేషణ ప్రకారం కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు డెల్టా వేరియంట్పై మంచి ప్రభావాన్ని చూపాయని పాల్ తెలిపారు. ఫైజర్, మోడెర్నా టీకాలకు ప్రభుత్వ అనుమతి అనేక అంశాలపై ఆధారపడి ఉందని, అందువల్ల ఎప్పటికల్లా ఇవి అందుబాటులోకి వస్తాయనేది ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. ఈ వ్యాక్సిన్ల అనుమతి ప్రక్రియకు కంపెనీలకు, ప్రభుత్వానికి మధ్య నష్టపరిహార అంశంపై చర్చలు కొలిక్కిరాలేదు. డబ్ల్యూహెచ్ఓ నుంచి కోవాగ్జిన్కు త్వరలో అనుమతి రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో టీకా ఉత్పత్తిదారులకు సామర్ధ్య విస్తరణ కోసం వివిధ గ్రాంట్ల రూపంలో కేంద్రం రూ. 670 కోట్ల సాయం అందించిందన్నారు. దీనికి మించి ప్రభుత్వ సైన్సు సంస్థలు ఎంతో విలువైన సాంకేతిక సాయాన్ని సైతం టీకా ఉత్పత్తిదారులకు అందించాయన్నారు. -
గుడ్న్యూస్: 50 శాతం మంది చిన్నారుల్లో యాంటీ బాడీలు!
ముంబై: మహారాష్ట్రలో డెల్లా ప్లస్ వేరియంట్ కేసుల పెరుగుదల, థర్డ్వేవ్తో పిల్లలకు ప్రమాదం పొంచి ఉందన్న భయాల నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఊరట కలిగించే వార్త చెప్పింది. దేశ ఆర్థిక రాజధానిలో నిర్వహించిన సేరో సర్వేలో 51 శాతానికిపైగా బాలబాలికల్లో కోవిడ్ యాంటీ బాడీలు ఉన్నట్లు తేలిందని వెల్లడించింది. ఏప్రిల్ 1 నుంచి జూన్ 15 వరకు సుమారు 2176 రక్త నమూనాలు పరీక్షించగా.. ఒకటి నుంచి నాలుగేళ్ల వయసు గల పిల్లల్లో 51.04 శాతం, 5-9 వయస్కుల్లో 47.55 శాతం, 10 నుంచి 14 ఏళ్ల చిన్నారుల్లో అత్యధికంగా 53.43 శాతం మంది, 15-18 ఏజ్ గ్రూప్లో 51.39 శాతం మందిలో వైరస్ ప్రతిరక్షకాలు కనుగొన్నట్లు తెలిపింది. మొత్తంగా 1- 18 ఏళ్ల వయసు గల పిల్లల్లో సెరో పాజిటివిటీ రేటు 51.18 శాతం ఉన్నట్లు బీఎంసీ నివేదిక పేర్కొంది. ఇక ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన సర్వేతో పోలిస్తే... సేరో పాజిటివిటీ రేటులో భారీ పెరుగుదల నమోదైనట్లు వెల్లడించింది. ‘‘18 కంటే తక్కువ వయస్సున్న పిల్లల్లో సెరో పాజిటివిటీ 39.4 శాతం ఉన్నట్లు గత సర్వేలో తేలింది. సెకండ్ వేవ్లో పిల్లలు ఎక్కువగా కోవిడ్ బారిన పడ్డారు. వారిలో ప్రతిరక్షకాలు పెరిగాయి’’ అని బీఎంసీ పేర్కొంది. కాగా డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లు చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయంటూ భయాలు నెలకొన్న విషయ తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్దీప్ గులేరియా.. తొలి, రెండో దశలో పిల్లలకు కరోనా సోకినా పెద్దగా ప్రమాదం జరుగలేదని, చిన్నపాటి ఇన్ఫెక్షన్ మాత్రమే సోకిందని, కాబట్టి జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదం తప్పుతుందని పేర్కొన్నారు. ఇక అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ సైతం.. ‘‘థర్డ్వేవ్లో పిల్లలు తీవ్ర లక్షణాలతో బాధపడతారనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. 90 శాతం మంది స్వల్ప లక్షణాలతో బయటపడతారు’’ అని ఓ ప్రకటన విడుదల చేసింది. చదవండి: థర్డ్వేవ్ హెచ్చరికలు: జూలై 15 వరకు లాక్డౌన్ పొడిగింపు Delta Variant: మళ్లీ కఠిన ఆంక్షలు పిల్లలపై... థర్డ్వేవ్ ప్రభావానికి ఆధారాల్లేవ్! -
హడలేత్తిస్తున్న డెల్టా ప్లస్ వేరియంట్.. పొరుగు రాష్ట్రం నుంచి ముప్పు
సాక్షి, వాంకిడి(ఆదిలాబాద్): కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి తగ్గి ఇప్పుడిప్పుడే జనజీవనం కుదుటపడుతున్న తరుణంలో డెల్టా ప్లస్ వేరియంట్ భయపెడుతోంది. కరోనా నుంచి పుట్టుకొచ్చిన డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు పొరుగున ఉన్న మహారాష్ట్రలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి వారిలో భయాందోళనలు నెలకొంటున్నాయి. మహారాష్ట్రకు జిల్లా మీదుగా నిత్యం రాకపోకలు నడుస్తున్న నేపథ్యంలో వైరస్ సంక్రమించే అవకాశం ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ పరిణామాల మధ్య అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. కనీసం మహారాష్ట్ర నుంచి వచ్చే వారిని తనిఖీ కూడా చేయడం లేదని పేర్కొంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన వాంకిడి మండల కేంద్రంలో చెక్పోస్టు ఏర్పాటు చేసి, పోలీస్, వైద్య, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించి, వారి పూర్తి వివరాలు నమోదు చేసుకునేవారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ– పాస్లు ఉన్న వారిని మాత్రమే అనుమతించారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గి, కేసుల సంఖ్య స్వల్ప స్థాయికి చేరడంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలను పూర్తిగా ఎత్తేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొని వ్యాపారాలు, వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయని వార్తలొస్తుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహారాష్ట్రకు రాకపోకలు.. మహారాష్ట్రలో కరోనా సెకెండ్ వేవ్ కేసులు విపరీతంగా పెరగడంతో అటువైపు వెళ్లే బస్సుల రాకపోకలను నిలిపివేశారు. దీంతో పాటు మండల కేంద్రంలో ప్రత్యేక చెక్పోస్టు ఏర్పాటు చేసి అత్యవసర వాహనాలను మాత్రమే అనుమతించేవారు. ప్రస్తు తం కరోనా ఉధృతి సాధారణ స్థాయికి చేరగా రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసింది. అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టును సైతం తొలగించారు. మహారాష్ట్రలో మండలానికి చెందిన వారి బంధువులు ఎక్కువగా ఉన్నారు. ఆర్టీసీ బస్సులు మునుపటిలా యథావిధి గా పూర్తిస్థాయిలో నడుస్తుండడం వల్ల ప్రతిరోజూ వందల మంది రాకపోకలు సాగిస్తున్నారు. వ్యాపారాల నిమిత్తం చంద్రాపూర్, నాగ్పూర్ వరకూ ప్రయాణాలు సాగిస్తుంటారు. డెల్టా ప్లస్ అలజడి.. మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదవుతున్నట్లు, తగు జాగ్రత్తలు పాటించాలని కేంద్రం హెచ్చరించింది. ఈ రకం వైరస్ ఫస్ట్, సెకండ్ వేవ్ల కంటే వేగంగా విస్తరించొచ్చని, మాస్కు లేకుండా పక్క నుంచి వెళ్లినా సోకే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మండలం నుంచి మహారాష్ట్రకు అధిక సంఖ్యలో రాకపోకలు సాగుతుండడం, దేశంలోనే మ హారాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదు కావడం వంటి వి ఆందోళన కలిగించే విషయాలు. లాక్డౌన్ ఎత్తివేశాక చెక్పోస్టును తొలగించడంతో విస్తారంగా రాకపోకలు సాగుతున్నాయి. సెకండ్ వేవ్తో అతలాకుతలమైన సామన్య ప్రజానీకం కొత్త రకం వేరియంట్ ఎక్కడ కమ్ముకుంటుందోనని భయందోళనకు గురవుతున్నారు. అధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ జాగ్రత్తతో ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఆదేశాలు వస్తే ఏర్పాటు చేస్తాం ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలు ఎత్తేయడంతో పై అధికారుల ఆదేశాలనుసారం చెక్ పోస్టును తొలగించాం. మండలంలో కరోనా వైరస్ అదుపులోనే ఉంది. కరోనా నిబంధనలు పాటించని, మాస్కులు ధరించని వారికి జరిమానా విధిస్తున్నాం. ప్రజలు పోలీసులకు సహకరిస్తూ, నిబంధనలు పాటించాలి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే చెక్పోస్టు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడతాం. – దీకొండ రమేశ్, ఎస్సై, వాంకిడి చదవండి: Delta Plus: 12 రాష్ట్రాలకు డెల్టా ప్లస్ వ్యాప్తి -
చిత్తూరు జిల్లాలో ‘డెల్టా ప్లస్’ కేసులు లేవు
తిరుపతి, అన్నమయ్య సర్కిల్: కరోనా డెల్టా ప్లస్ వేరియంట్పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ యు.శ్రీహరి పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో ప్రస్తుతం ఎటువంటి డెల్టా ప్లస్ కేసులు లేవన్నారు. తిరుపతిలో డెల్టా ప్లస్ ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలకు ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తిరుపతి మంగళం పీహెచ్సీ పరిధిలో ఓ వ్యక్తికి ఏప్రిల్ 4న పాజిటివ్గా నిర్ధారణ కాగా, 5న స్విమ్స్ కోవిడ్ కేర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారన్నారు. బాధితుడు కరోనాకు చికిత్స తీసుకొని ఏప్రిల్ 13న డిశ్చార్జ్ అయ్యాడని, ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని వెల్లడించారు. చికిత్స తీసుకున్న సమయంలో అతని నుంచి శాంపిల్స్ను సేకరించి హైదరాబాద్లోని సీసీఎంబీకి పరీక్ష నిమిత్తం పంపించారన్నారు. జూన్ 23వ తేదీన వచ్చిన రిజల్ట్లో డెల్టా ప్లస్గా నిర్ధారణ అయిందన్నారు. సమాచారం అందిన వెంటనే ఆ వ్యక్తిని, అతని కుటుంబసభ్యులను పరామర్శించి, ఆరా తీయగా అందరూ ఆరోగ్యంగా వున్నారని, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని గుర్తించామన్నారు. అతను నివసించే ప్రాంతంలో ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించగా అక్కడి వారంతా కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు తేలిందన్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో డెల్టా వేరియంట్ ప్రభావం ఏమాత్రం లేదన్న విషయాన్ని గుర్తించి ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని కోరారు. -
12 రాష్ట్రాలకు డెల్టా ప్లస్ వ్యాప్తి
న్యూఢిల్లీ: కోవిడ్–19 డెల్టా ప్లస్ వేరియెంట్ కేసులు దేశాన్ని వణికిస్తున్నాయి. ఈ కేసులు 12 రాష్ట్రాలకు విస్తరించగా, తమిళనాడులో తొలి మరణం నమోదైంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 51కి చేరుకుంటే మహారాష్ట్రలో 22 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 9, మధ్యప్రదేశ్లో 7, కేరళలో 3, పంజాబ్, గుజరాత్లలో రెండేసి కేసులు నమోదయ్యాయి. ఏపీ, కర్ణాటక, ఒడిశా, రాజస్థాన్, జమ్ముకశ్మీర్, హరియాణాల్లో ఒక్కో కేసు నమోదైనట్టుగా నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) డైరెక్టర్ సుజీత్ సింగ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 45 వేల శాంపిల్స్ని పరీక్షించగా 51 కేసులు డెల్టా ప్లస్వని తేలినట్టుగా సింగ్ తెలిపారు. కోవిడ్–19 డెల్టా ప్లస్ వేరియెంట్ సోకిన వ్యక్తి మరణించడం తమిళనాడులో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మదురైకి చెందిన ఒక వ్యక్తి డెల్టా ప్లస్ వేరియెంట్ సోకి మరణించినట్టుగా రాష్ట్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం తమిళనాడులో ఇప్పటివరకు తొమ్మిది డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయని చెబుతూ ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు వేరేగా ఉన్నాయి. ఇప్పటివరకు మూడే కేసులు నమోదైతే ఇద్దరు కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సుబ్రమణియన్ వెల్లడించారు. చెన్నైలోని 32 ఏళ్ల వయసున్న ఒక నర్సుకి డెల్టా ప్లస్ సోకితే, కాంచీపురం జిల్లాలో మరొకరికి సోకిందని వారిద్దరూ కోలుకున్నారని తెలిపారు. మదురైకి చెందిన కోవిడ్ రోగి మరణించాక అతని శాంపిల్స్ పరీక్షించగా డెల్టా ప్లస్ వేరియెంట్ సోకిందని తేలినట్టుగా ఆయన చెప్పారు. రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నా డెల్టా ప్లస్ రాజస్థాన్లో 65 ఏళ్ల మహిళకి డెల్టా ప్లస్ వేరియెంట్ సోకింది. రాజస్థాన్లో ఇదే తొలి కేసు. ఆమె ఇప్పటికే రెండు టీకా డోసులు తీసుకున్నారు. మేలోనే ఆమె కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆ మహిళకి కరోనా పాజిటివ్ రావడంతో అది డెల్టా ప్లస్ వేరియెంట్గా తేలడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఈ వైరస్పై జాగురూకతతో ఉండాలని రాజస్థాన్ సీఎం గహ్లోత్ అన్నారు. -
హెచ్చరిక: డెల్టా వేరియంట్ చాలా డేంజర్
జెనీవా: కోవిడ్–19 వైరస్ డెల్టా వేరియంట్ దాదాపు 85 దేశాల్లో వ్యాపించిందని, ఇప్పటివరకు గుర్తించిన వేరియంట్ల కన్నా ఇది చాలా ఎక్కువగా వ్యాప్తి చెందగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రెయాసస్ హెచ్చరించారు. ముఖ్యంగా టీకా తీసుకోని సమూహాల్లో దీన్ని వ్యాప్తి చాలా ఎక్కువగా ఉందన్నారు. ప్రపంచ దేశాలతో పాటు తాము సైతం ఈ వేరియంట్పై ఆందోళనగా ఉన్నామన్నారు. కొన్ని దేశాల్లో కరోనా నిబంధనల సడలింపు కారణంగా ఈ వేరియంట్ వ్యాప్తి మరింత పెరగవచ్చన్నారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే మరలా మృత్యు ఘంటికల మోత పెరుగుతుందన్నారు. భవిష్యత్లో మరిన్ని కరోనా వైరస్ వేరియంట్లు పుట్టుకొచ్చేందుకు అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. వైరస్లంటేనే మార్పులు తప్పనిసరని, కానీ వ్యాప్తిని అరికట్టడం ద్వారా కొత్త వేరియంట్ల పుట్టుకను అడ్డుకోవచ్చని తెలిపారు. డెల్టా వేరియంట్ మరిన్ని దేశాలకు వ్యాపించే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. ఆల్ఫాతో పోలిస్తే డెల్టా వేరియంట్ చాలా డేంజరని డబ్ల్యూహెచ్ఓ ఉన్నతాధికారి డా. మారియా హెచ్చరించారు. పలు దేశాల్లో ఈ వేరియంట్ల కేసులు పెరుగుతున్నట్లు గమనిస్తున్నామన్నారు. పలు యూరప్ దేశాల్లో మొత్తంమీద కరోనా కేసులు తగ్గుతున్న తరుణంలో ప్రజలు గుమిగూడే సందర్భాలు పెరుగుతున్నాయ ని, దీనివల్ల డెల్టావేరియంట్ వేగంగా వ్యాపించేందుకు దోహదం చేసినట్లవుతుందని ఆమె వివరించారు. చదవండి: (వ్యాక్సినేషన్ తర్వాతా.. 76% మందికి కరోనా) కొన్ని దేశాల్లో ఎక్కువమందికి టీకాలందినా, పూర్తి జనాభాకు ఇంకా టీకాలు వేయడం పూర్తికాలేదని గుర్తు చేశారు. డెల్టా వేరియంట్ సహా అన్ని రకాల వేరియంట్లను సమర్ధవంతంగా అడ్డుకోవడంలో టీకాలు ప్రభావవంతంగా పనిచేస్తాయని భరోసా ఇచ్చారు. టీకాలతో పాటు ప్రజలంతా కరోనా నిబంధనలను తప్పక పాటించడమే ప్రస్తుత పరిస్థితుల్లో కీలకమని గుర్తు చేశారు. భారీ గా గుమిగూడడం వల్ల భారీ ప్రమాదాలుంటాయన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా గణాంకాల ప్రకారం ఆల్ఫా వేరియంట్ 170 దేశాల్లో, బీటా వేరియంట్ 119 దేశాల్లో, గామా వేరియంట్ 71 దేశా ల్లో, డెల్టా వేరియంట్ 85 దేశాల్లో వ్యాపించాయి. చదవండి: (వణికిస్తున్న‘డెల్టా’.. అక్కడ మరోసారి పూర్తి లాక్డౌన్) -
ముంబైలో లెవల్ 3 ఆంక్షలు విధింపు
-
ఆస్ట్రేలియాలో డెల్టా వేరియంట్ కలకలం
-
దేశంలో విజృంభిస్తున్న డెల్టా ప్లస్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు డెల్టా ప్లస్ వేరియంట్ గల 48 కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 45 వేల నమూనాలను పరీక్షించగా ఈ డెల్టా ప్లస్ కేసులు వెలుగు చూశాయని, మహారాష్ట్రలో అత్యధికంగా 20 కేసులు ఉన్నాయని తెలిపింది. ఈ పరివర్తనకు సంబంధించి చాలా తక్కువ కేసులు ఉన్నాయని చెబుతూ ఇవి పెరిగే ధోరణిని చూపిస్తుందని చెప్పలేమని స్పష్టం చేసింది. డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు మహారాష్ట్రలో 20, తమిళనాడులో తొమ్మిది, మధ్యప్రదేశ్లో ఏడు, కేరళలో మూడు, పంజాబ్, గుజరాత్లలో రెండేసి కేసులు ఉన్నాయని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) డైరెక్టర్ సుజిత్ సింగ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్తాన్, జమ్మూకశ్మీర్, కర్ణాటకలో ఒక్కో కేసు నమోదైందని విలేకరుల సమావేశంలో ఆయన వివరించారు. ‘డెల్టా ప్లస్ మ్యుటేషన్ కేసులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. గడిచిన 3 నెలల్లో 12 జిల్లాల్లో దాదాపు 50 కేసులు గుర్తించాం. ఏ జిల్లాలో గానీ ఇది పెరుగుతున్న ధోరణిని చూపిస్తుందని చెప్పలేం‘అని సింగ్ తెలిపారు. డెల్టాలో కనిపించే ట్రాన్స్మిషన్ వేరియంట్ను ఈ వేరియంట్లో కూడా గమనించవచ్చని వివరించారు. దేశంలో కరోనా వైరస్ యొక్క జన్యు పరిణామ క్రమ విశ్లేషణలో ఎన్సీడీసీ పాల్గొంటోందని తెలిపారు. డెల్టా ప్లస్ వేరియంట్ డెల్టా వేరియంట్ను అదనపు మ్యుటేషన్తో సూచిస్తుందని సింగ్ చెప్పారు. బి.1.617.2.1 గా పరిగణిస్తారని, డెల్టా వేరియంట్కు కె.417ఎన్ జన్యు వేరియంట్ కలవడం వల్ల డెల్టా ప్లస్ అయ్యిందని వివరించారు. కె.417ఎన్ బీటా వేరియంట్లో కూడా ఉండడంతో ఇది ప్రాముఖ్యత కలిగి ఉందని వివరించారు. డెల్టా ప్లస్ వేరియంట్ను ప్లస్ గుర్తుతో సూచిస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘దీని అర్థం వ్యాప్తి తీవ్రత ఎక్కు వనో లేదా మరింత తీవ్రమైన వ్యాధికి దారితీస్తుంద నో కాదు. అలాంటి శాస్త్రీయ ఆధారాలు తేలితే కచ్చితంగా తెలియజేస్తాం..‘అని ఆయన వివరించారు. డెల్టా వేరియంట్ వల్లే.. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, హరియాణా, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్లలో పాజిటివ్ నమూనాల్లో 50 శాతానికి పైగా నమూనాల్లో డెల్టా వేరియంట్ ఉందని ఆయన తెలిపారు. ‘ఈ నేపథ్యంలో రెండో వేవ్ సమయంలో ఉప్పెనలా వచ్చిన కేసులు ఈ వేరియంట్ వల్లే అన్న నిర్ణయానికి వచ్చాం’అని సింగ్ వివరించారు. కొత్త కేసులు 51,667 దేశంలో 24 గంటల్లో కొత్తగా 51,667 కోవిడ్ కేసులు వెలుగులోకి వచ్చినట్లు కేంద్రం తెలిపింది. దీంతో మొత్తం కేసులు 3,01,34,445కు చేరుకున్నాయని తెలిపింది. అదేవిధంగా, ఒక్క రోజులో ఈ మహమ్మారితో 1,329 మంది చనిపోగా మొత్తం మరణాలు 3,93,310కి చేరుకున్నాయి. అత్యధిక స్థాయి నుంచి 88% తగ్గుదల హా కోవిడ్ 19 కేసుల్లో దేశంలో అత్యధికంగా మే 7న 4,14,188 కొత్త కేసులు నమోదవగా, క్రమంగా తగ్గుతూ జూన్ 25 నాటికి 51,667 కేసులు నమోదయ్యాయి. అంటే మే 7 నుంచి జూన్ 25 నాటికి కొత్త కేసుల్లో 88 శాతం తగ్గుదల కనిపించింది. ► వారం రోజుల్లో కొత్త కేసుల నమోదులో సగటున రోజుకు 24 శాతం మేర తగ్గుదల నమోదైంది. మే రెండో వారంలో 6.7 శాతం తగ్గుదల, మూడో వారంలో 22.3 శాతం తగ్గుదల, నాలుగో వారంలో 23.3% తగ్గుదల, మే 29 నుంచి జూన్ 4 మధ్య 33.1% తగ్గుదల, జూన్ 5–11 మధ్య 31.3% తగ్గుదల, జూన్ 12–18 మధ్య 30.3%, గత వారం 23.8% తగ్గుదల నమోదైంది. ఈ తగ్గుదల ఇలాగే కొనసాగుతుంది. అయితే ఇందుకు వీలుగా కోవిడ్ కట్టడి చర్యలు పాటించాల్సి ఉంటుంది. ► మే 4న దేశవ్యాప్తంగా 531 జిల్లాల్లో వందకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యేవి. జూన్ 2 నాటికి కేవలం 262 జిల్లాల్లోనే కేసులు నమోదయ్యేవి. జూన్ 23 నాటికి ఇలా వందకు పైగా నమోదవుతున్న జిల్లాల సంఖ్య 125కు తగ్గింది. వీటిలో అత్యధికంగా దక్షిణాది రాష్ట్రాల్లోని జిల్లాలే ఉన్నాయి. ► యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. మే 10న అత్యధికంగా 31.3 లక్షల యాక్టివ్ కేసులు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 6.13 లక్షలకు తగ్గింది. ఇదేస్థాయిలో మే 3వ తేదీన 81.8 శాతం ఉన్న రికవరీ రేటు క్రమంగా 96.7 శాతానికి చేరుకుంది. ► పాజిటివిటీ రేటు తగ్గుతూ వచ్చింది. ఏప్రిల్ 30–మే 6 మధ్య అత్యధికంగా పాజిటివిటీ రేటు 21.6 శాతం ఉండగా, జూన్ 24 నాటికి అది 3.1 శాతానికి చేరుకుంది. ‘డెల్టా ప్లస్’పై రాష్ట్రాలకు కేంద్రం లేఖ డెల్టా ప్లస్ కేసులు గుర్తించిన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, రాజస్తాన్, పంజాబ్, జమ్మూకశ్మీర్, హరియాణా ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. కేసులున్న ప్రాంతాల్లో కంటైన్మెంట్, కాంటాక్ట్ ట్రేసింగ్ వంటి చర్యలు చేపట్టాలన్నారు. ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందడం, ఊపిరితిత్తుల్లో కణాలతో బంధం ఏర్పర్చుకోవడం, మోనోక్లోనల్ యాంటీబాడీస్ నుంచి తప్పించుకోవడం వంటి లక్షణాలున్నాయన్నారు. -
వ్యాక్సినేషన్ తర్వాతా.. 76% మందికి కరోనా
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ, వైరస్ ఇన్ఫెక్షన్కు సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) చేసిన మొట్టమొదటి అధ్యయనం విడుదలైంది. వ్యాక్సిన్ ప్రభావంపై తీసుకున్న శాంపిల్స్పై జరిగిన అధ్యయనంలో వ్యాక్సిన్ రెండు డోస్లు వేసుకున్న 76 శాతం మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. అంతేగాక కరోనా సోకిన వారిలో కేవలం 16% మందిలో మాత్రమే ఎలాంటి లక్షణాలు కనిపించకపోగా, 10 శాతం మంది చికిత్స కోసం ఆసుపత్రులలో చేరాల్సి వచ్చిందని అధ్యయనంలో తేలింది. ఈ ఏడాది మార్చి 1వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ మధ్య జరిగిన ఈ అధ్యయన సమయంలో 361మందికి ఆర్టీ–పీసీఆర్ పరీక్ష నిర్వహించగా, అందులో 274 మందికి పాజిటివ్గా తేలింది. వ్యాక్సిన్ రెండు డోస్లు తీసుకున్న 14 రోజుల తరువాత ఈ వ్యక్తులకు వైరస్ సంక్రమించినట్లుగా గుర్తించారు. కోవిషీల్డ్తో పోలిస్తే కోవాగ్జిన్ తీసుకునే వారిలో 77% యాంటీబాడీలు మాత్రమే కనిపించాయని అధ్యయనంలో గుర్తించారు. మెడికల్ జర్నల్ రీసెర్చ్ స్క్వేర్లో ఈ ఫలితాలు ప్రచురితమయ్యాయి. వ్యాక్సిన్ రెండు డోస్లు తీసుకోని కారణంగా 87 శాంపిల్స్ను ఈ అధ్యయనం నుంచి మినహాయించారు. అనంతరం జరిగిన దర్యాప్తులో వ్యాక్సిన్ రెండు డోస్లు తీసుకున్న తరువాత 274 మందిలోనూ వైరస్ జాడను కనుగొన్నారు. వీటిలో 35 శాంపిల్స్(12.8%) కోవాగ్జిన్ రెండు డోస్లను తీసుకోగా, 239 శాంపిల్స్ (87.2%) కోవిషీల్డ్ రెండు డోస్లను తీసుకున్నారు. అంతేగాక కోవాగ్జిన్ రెండు డోస్లు తీసుకున్న తరువాత వైరస్ సోకిన వారిలో 43% మంది ఇటీవల వచ్చిన సెకండ్ వేవ్ సమయంలో కోవిడ్ వార్డుల్లో పనిచేసిన ఆరోగ్య కార్యకర్తలు. అదే సమయంలో, కోవిషీల్డ్ తీసుకున్న తర్వాత 10% మంది ఆరోగ్య కార్యకర్తలు సైతం వ్యాధి బారిన పడ్డారు. కోవిషీల్డ్ రెండు డోస్ల తర్వాత కరోనా వైరస్ సంక్రమణకు గురికావడం మధ్య సగటు వ్యవధి 45 రోజులుగా గుర్తించారు. అయితే ఈ సంక్రమణ సగటు వ్యవధి కోవాగ్జిన్ తీసుకునే వారిలో 33 రోజులుగా ఉంది. అధ్యయన సమయంలో ఒక రోగి మృతి అధ్యయనం సమయంలో కోవిషీల్డ్ రెండు డోస్లు వేసుకున్న ఒక వ్యక్తికి వైరస్ సంక్రమించి మరణించినట్లు ఐసీఎంఆర్ నిపుణులు నిర్ధారించారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మహారాష్ట్రకు చెందిన ఒకే ఒక్క రోగి మరణించినట్లు ప్రభుత్వం ఇప్పటివరకు సమాచారం ఇవ్వగా, ఈ అధ్యయనంలో దాని సమాచారం ఇవ్వలేదు. ఈ రెండు కేసులు భిన్నమైనవని శాస్త్రవేత్తలు అంటున్నారు. అధ్యయన సమయంలో హాస్పిటల్లో చేరిన 9.9%మంది: వ్యాక్సిన్ రెండు డోస్లను తీసుకున్న తరువాత కరోనా సోకిన వారిలో 9.9% మంది అధ్యయన సమయంలో మెరుగైన చికిత్స కోసం హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. అయితే వీరు డిశ్చార్జ్ అయ్యేందుకు కనీసం 11 రోజులు పట్టిందని, ఒక రోగి ఇప్పటికీ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడని నివేదికలో పేర్కొన్నారు. డెల్టా వేరియంట్ ప్రభావమే వ్యాక్సిన్లు వేసిన తరువాత కూడా డెల్టా వేరియంట్ సంక్రమణకు కారణమవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ వేరి యంట్ యాంటీబాడీలను గణనీయంగా తగ్గిస్తుంది. దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ జనవరి 16 నుంచి జరుగుతున్నప్పటికీ, మార్చిలో వచ్చిన సెకండ్ వేవ్లో నమోదైన 80%కి పైగా కేసులు డెల్టా వేరియంట్తో ముడిపడి ఉన్నాయి. ఇది వేగంగా పెరుగుతూ వచ్చింది. ఈ వేరియంట్ కారణంగా వ్యాక్సిన్ రెండు డోస్లు తీసుకున్న వారిపై కూడా కరోనా సంక్రమణ ప్రభావం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. -
సూపర్ వ్యాక్సిన్.. అన్ని వేరియంట్లకు అడ్డుకట్ట
►డెల్టా ప్లస్కు వ్యాపించే సామర్థ్యం ఎక్కువగా ఉన్నా.. అందుకు మనం ఆస్కారం ఇస్తున్నామా అన్నది ముఖ్యం. లాక్డౌన్ సడలించారన్న ఉద్దేశంతో జనం గుమిగూడటం, కొవిడ్ నిబంధనలు పాటించకుండా ఇష్టమొచ్చినట్టు తిరిగితే అందరినీ ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ►ప్రజలు గుంపులుగా చేరకుండా ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరికైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే.. ఇంట్లో వారిని, ఇతర ప్రైమరీ కాంటాక్టులను విడిగా ఉంచి పరీక్షలు చేయించాలి. వ్యాక్సినేషన్ వేగం పెంచాలి. మార్కెట్లు, ఆఫీసులు వంటి చోట్ల పూర్తిగా భౌతికదూరం పాటించడం సాధ్యం కాకపోవచ్చు. కచ్చితంగా మాస్కులు ధరించడం, శానిటైజేషన్ పాటించేలా చూడాలి. ►ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్లను ఎదుర్కొనేలా కొత్త వ్యాక్సిన్లపై పరిశోధనలు జరుగుతున్నాయి. వాస్తవానికి వైరస్ ఉపరితలంపై ఉండే స్పైక్ ప్రోటీన్తో పోల్చితే.. అంతర్గతంగా ఉండే యాంటీ జెన్లు నెమ్మదిగా మ్యుటేట్ అవుతాయి. అందువల్ల స్పైక్ ప్రోటీన్తోపాటు యాంటీజెన్లపైనా పనిచేసేలా.. భిన్నమైన వేరియెంట్లను ఎదుర్కొనేలా కొత్త వ్యాక్సిన్లను రూపొందిస్తున్నారు. అమెరికాలో ఇలాంటి సూపర్ వ్యాక్సిన్కు సంబంధించి మార్చిలోనే ట్రయల్స్ మొదలయ్యాయి. దీనిపై తదుపరి దశల ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి సూపర్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక శాస్త్రవేత్త కేథరిన్ జె వూ వెల్లడిస్తున్న వివరాల ప్రకారం.. మల్టీ యాంటీజెన్ వ్యాక్సిన్లను పరీక్షిస్తున్నారు. స్పైక్ ప్రోట్రీన్, న్యూక్లియో క్యాప్సిడ్, ఇంటీరియర్ వైరల్ యాంటీజెన్లతో కూడిన ‘ఓఆర్ఎఫ్–3ఏ’లను సమ్మిళితం చేసి ఆ వ్యాక్సిన్లు తయారు చేస్తున్నారు. ఇంటర్వ్యూ: డాక్టర్ కె.శ్రీనాథ్రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, ఎపిడమాలజిస్ట్ సాక్షి, హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదని.. వైరస్ తాకిడి మాత్రమే తగ్గిందని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, ఎపిడమాలజిస్ట్ డాక్టర్ కె.శ్రీనాథ్రెడ్డి స్పష్టం చేశారు. ప్రమాదం పక్కనే పొంచి ఉందనే విషయాన్ని మరిచిపోవద్దని, లాక్డౌన్ సడలింపును ఆసరాగా తీసుకుని ఇష్టమొచ్చినట్టు వ్యవహరించ వద్దని సూచించారు. పూర్తిగా సాధారణ పరిస్థితులు ఏర్పడేదాకా అన్ని జాగ్రత్తలు పాటించాలన్నారు. అన్ని వేరియంట్లపై పనిచేసే సూపర్ వ్యాక్సిన్పై ప్రయోగాలు జరుగుతున్నాయని, ఏడాది చివరినాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. దేశంలో మూడో వేవ్ వస్తుందన్న అంచనాలు, కొత్తగా డెల్టా ప్లస్ కేసుల నమోదు, వ్యాక్సినేషన్ తీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై శ్రీనాథ్రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. దీని ముఖ్యాంశాలు.. సాక్షి: డెల్టా ప్లస్ వేరియంట్ ఏ మేరకు ప్రమాదకరం? కె.శ్రీనాథ్రెడ్డి: డెల్టా ప్లస్ వేరియంట్కు సంబంధించి ఇంకా పూర్తిస్థాయి సమాచారం అందుబాటులో లేదు. మనదేశంలోనే కాదు పలు ఇతర దేశాల్లోనూ డెల్టా ప్లస్ కేసులొచ్చాయి. కొత్త వేరియంట్తో పెద్ద ప్రమాదం వస్తుందనేందుకు ప్రస్తుతం ఆధారాలేమీ లేవు. వ్యాప్తి ఎక్కువగా ఉండొచ్చన్న అంచనాలు మాత్రం ఉన్నాయి. ఈ వేరియంట్పై వ్యాక్సిన్ ప్రభావం ఎలా ఉంటుందన్నది తేలాల్సి ఉంది. గతేడాది వ్యాక్సిన్ లేకపోయినా లాక్డౌన్లు, కఠినమైన నిబంధనలు పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తిని చాలా వరకు ఆపగలిగాం. రెండో వేవ్లో కొత్త వేరియంట్లు రావడం, జాగ్రత్తలు సరిగా పాటించకపోవడం వల్ల వైరస్ వ్యాప్తికి మనమే ఆస్కారం ఇచ్చాం. నిజానికి వైరస్లలో మార్పులు సహజం. అయితే కొత్త వేరియంట్గా మారినపుడు తీవ్రత (విరులెన్స్) పెరిగిందా, తగ్గిందా అనేది ముఖ్యం. సాధారణంగా వైరస్ ఇన్ఫెక్టివిటీ (వ్యాప్తి సామర్థ్యం)ని పెంచుకున్నప్పుడు విరులెన్స్ తగ్గు తుంది. ఎవల్యూషనరీ బయాలజీలో భాగంగానే ఇది జరుగుతుంది. అప్పటికే ఉన్న వ్యాక్సిన్లు కొత్త వేరియెంట్లపై కాస్త తక్కువ ప్రభావం చూపొచ్చు తప్ప.. వ్యాధి తీవ్రంగా మారకుండా ఉంటుంది. దేశంలో జీనోమ్ సీక్వెన్సింగ్ పరిస్థితి ఏమిటి? మన దేశంలో వైరస్ శాంపిళ్ల జీనోమ్ సీక్వెన్సింగ్ను మరింతగా పెంచాలి. యూకే వేరియంట్ వ్యాప్తితో జనవరిలో భారత్లో ఈ సీక్వెన్సింగ్ ప్రారంభించారు. కానీ రెండో వేవ్ రాదనే భ్రమలో జీనోమ్ సీక్వెన్సింగ్ను భారీ స్థాయిలో చేపట్టేందుకు ఏర్పాట్లు చేయలేదు. మొత్తం శాంపిళ్లలో కనీసం 5 శాతమైనా సీక్వెన్సింగ్ చేయాలి. వైరస్ వేరియంట్లను గుర్తించి ఆయా చోట్ల నియంత్రణ చర్యలు చేపట్టాలి. కానీ ప్రస్తుతం అది జరగడం లేదు. పబ్లిక్ హెల్త్ సిస్టమ్ బలోపేతమెలా? కోవిడ్ నేపథ్యంలో దేశంలో వైద్య మౌలిక సదుపా యాలను పెంచుకోవాల్సి ఉంది. 2021–22 బడ్జెట్లో కేంద్రం, 15వ ఆర్థిక సంఘం నుంచి ప్రాథమిక వైద్య సదుపాయాల పెంపు, అత్యవసర సేవల కోసం నిధులు కేటాయించారు. ప్రభుత్వాలు పర్యవేక్షక వ్యవస్థను బలోపేతం చేసి.. కొత్త వైరస్లు, ఇతర సూక్ష్మజీవుల వ్యాప్తిపై నిఘా పెట్టాలి. కొత్త వైరస్లు, మైక్రోబ్లను గుర్తిస్తే.. వెంటనే పరిశోధన చేపట్టి, వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవచ్చు. ప్రస్తుతం రెండో వేవ్ తగ్గుముఖం పట్టినందున.. వెంటనే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రాథమిక వైద్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రుల బలోపేతానికి చర్యలు చేపట్టాలి. పర్యవేక్షక వ్యవస్థను పటిష్టపరచడం, అన్నిచోట్లా క్రిటికల్ కేర్ విభాగాల ఏర్పాటు మంచిది. వైద్య రంగానికి నిధుల కేటాయింపులు పెంచాలి. కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనూ ఈ చర్యలు తీసుకోవాలి. ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? కరోనా మహమ్మారి నుంచి రక్షణకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలి. దానితోపాటు మాస్కులు, ఇతర జాగ్రత్తలు పాటించడం అనివార్యం. మాస్కులు ధరించకపోతే తమకే కాదు, ఇతరులకూ నష్టం చేసిన వారవుతారన్న విషయాన్ని గ్రహించాలి. పశ్చిమ దేశాల్లో మాస్కులు కచ్చితంగా పెట్టుకోవడం వల్ల.. కరోనాను తప్పించుకోవడంతోపాటు అక్కడ సీజనల్గా వచ్చే ఫ్లూ వ్యాధులు కూడా గణనీయంగా తగ్గినట్టు గుర్తించారు. వ్యాక్సిన్లు వేసుకుంటే బయటపడొచ్చా? దేశవ్యాప్తంగా కనీసం 50శాతంపైగా వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకు అప్రమత్తత అవసరం. జాగ్రత్తగా ఉండటమంటే పూర్తిగా తలుపులు మూసుకుని, ఇళ్లలోనే ఉండాలని కాదు. వారం వారం పోల్చి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయా, సీరియస్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయా, ఆస్పత్రులకు తాకిడి ఎక్కువగా ఉందా, మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటోందా అన్న అంశాలను బట్టి కరోనా తీవ్రతను అంచనా వేయొచ్చు. కేసులు, సీరియస్ పేషెంట్ల సంఖ్య పెరిగితే మళ్లీ కఠిన నిబంధనలు అమలు చేయాల్సి వస్తుంది. కొత్త వేరియంట్లకు సంబంధించి ఏ అంశాలపై దృష్టి పెట్టాలి? కొత్త వేరియంట్ల వ్యాప్తి సామర్థ్యం(ఇన్ఫెక్టివిటీ), తీవ్రత ఎలా ఉంటుందో గమనించాలి. అవి ఇన్ఫెక్టివిటీ పెంచుకుంటే ఎక్కువ మందిని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా జనం గుమిగూడితేనే వైరస్ వ్యాప్తికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. దక్షిణ కొరియాలో జనం గుమిగూడిన చోట్లనే మరో వేవ్ వచ్చింది. ఆస్ట్రేలియాలో కొత్తగా కేసులు నమోదైన సిడ్నీలోనూ ఎయిర్పోర్ట్కు టాక్సీ నడిపే డ్రైవర్లు వ్యాక్సిన్ తీసుకోకపోవడం, మాస్కులు సరిగా పెట్టుకోకపోవడం వల్ల విమాన ప్రయాణికుల నుంచి వైరస్ సోకింది. కేసులు పెరిగాయి. దాంతో సిడ్నీ న్యూసౌత్వేల్స్లో మళ్లీ లాక్డౌన్ పెట్టారు. ఇలాంటి ఘటనలతో మనవాళ్లకు జ్ఞానోదయం కలగాలి. కనీసం 50–60 శాతం దాకా వ్యాక్సినేషన్ పూర్తయ్యే దాకా జాగ్రత్తలు పాటించాలి. ఉన్నవేకాదు.. కొత్తగా పుట్టుకొచ్చే వాటికీ సూపర్ చెక్ సాధారణంగానే వైరస్లు తరచూ మ్యుటేషన్ చెంది కొత్త వేరియంట్లు ఏర్పడుతుంటాయి. అదే తరహాలో కరోనా వైరస్ చాలా మ్యూటేషన్లు చెందింది. ప్రస్తుతం డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని రకాల కరోనా వేరియంట్లపై పనిచేసే సూపర్ వ్యాక్సిన్ను.. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాకు చెందిన ‘గిల్లింగ్స్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్’శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ను ప్రయోగశాలలో ఎలుకలు, ఇతర జంతువులపై పరిశీలించగా.. మంచి ఫలితాలు ఇస్తున్నట్టు గుర్తించారు. హైబ్రిడ్ ఆర్ఎన్ఏ టెక్నాలజీతో.. నార్త్ కరోలినా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మొదట ఫైజర్, మొడెర్నా కంపెనీల తరహాలో ‘ఎంఆర్ఎన్ఏ’టెక్నాలజీతో వ్యాక్సిన్ రూపొందించాలని భావించారు. ఆ దిశగా ప్రయోగాలు మొదలుపెట్టారు. అయితే వైరస్ వేరియంట్లు మారినప్పుడు కూడా వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేసేందుకు ఎక్కువ సంఖ్యలో కరోనా వేరియంట్ల ‘ఆర్ఎన్ఏ’లను తీసుకుని.. ‘హైబ్రిడ్ ఎంఆర్ఎన్ఏ’ఎన్కోడింగ్ను అభివృద్ధి చేశారు. దీనితో రూపొందించిన వ్యాక్సిన్ను ప్రయోగశాలలో ఎలుకలపై పరీక్షించారు. శరీరంలో రోగనిరోధక శక్తిని తప్పించుకునేలా మ్యూటేట్ అయిన దక్షిణాఫ్రికా బీటా రకం (బీ.1.351) కరోనాపైనా వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తోందని గుర్తించారు. వేరియంట్లు మారినా.. ఇప్పుడున్న వేరియంట్లే కాదు భవిష్యత్తులో కొత్తగా పుట్టుకొచ్చే కరోనా వేరియంట్లను కూడా ఈ సూపర్ వ్యాక్సిన్ ఎదుర్కొంటుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డేవిడ్ ఆర్ మార్టినెజ్ చెప్పారు. కరోనా స్పైక్ ప్రొటీన్తోపాటు అంతర్గతంగా ఉండే న్యూక్లియోటైడ్, యాంటీ జెన్లనూ ఈ వ్యాక్సిన్ టార్గెట్ చేస్తుందని వివరించారు. ఈ సూపర్ వ్యాక్సిన్పై త్వరలోనే హ్యూమన్ ట్రయల్స్ చేపడతామని తెలిపారు. తమ పరిశోధన ఆధారంగా భవిష్యత్తులో ‘సార్స్ కోవ్–3’వచ్చినా కూడా సులువుగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని వివరించారు. –సాక్షి సెంట్రల్ డెస్క్ -
వణికిస్తున్న‘డెల్టా’.. అక్కడ మరోసారి పూర్తి లాక్డౌన్
సిడ్నీ: భారత్లో మొట్టమొదటిసారిగా వెలుగులోకి వచ్చిన కోవిడ్–19 డెల్టా వేరియెంట్ ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కరోనాను జయించామని ప్రకటించుకున్న ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్లలో డెల్టా వేరియెంట్ కేసులు వెలుగులోకి రావడంతో మళ్లీ ఆంక్షలు విధించారు. ఆఫ్రికా దేశాల్లో ఈ వేరియెంట్తో మూడో వేవ్ ఉధృత దశకు చేరుకుంది. ఆస్ట్రేలియాలోని అతి పెద్ద నగరమైన సిడ్నీలో లాక్డౌన్ విధించారు. ఆస్ట్రేలియాలో సాధారణ పరిస్థితులు నెలకొన్న కొన్ని నెలల తర్వాత మళ్లీ కరోనా కేసులు నమోదుకావడం ఆ దేశాన్ని షాక్కి గురి చేస్తోంది. సిడ్నీలో కేవలం రెండు వారాల్లోనే 65 కేసులు నమోదయ్యాయి. సిడ్నీ విమానాశ్రయం నుంచి క్వారంటైన్ హోటల్కి ప్రయాణికుల్ని తీసుకువెళ్లిన డ్రైవర్కి తొలుత వైరస్ సోకింది. ఆ తర్వాత అత్యంత వేగంగా కేసులు వెలుగులోకి రావడం మొదలయ్యాయి. దీంతో ఒక వారం పాటు ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దంటూ సిడ్నీలో పూర్తి లాక్డౌన్ విధించారు. ఒకే రోజు 227 కేసులు ఇజ్రాయెల్లో మాస్కులు అక్కర్లేదని ప్రభుత్వం ప్రకటించిన కొద్ది వారాల్లోనే డెల్టా వేరియెంట్ కేసులు విజృంభించాయి. రోజుకి 100 వరకు ఈ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. గురువారం ఒక్క రోజే 227 కేసులు నమోదు కావడంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కోవిడ్ సోకిన వారెవరూ ఆస్పత్రి అవసరం లేకుండా ఇంట్లోనే కోలుకోవడం ఊరట కలిగించే అంశమని ఇజ్రాయెల్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ నచ్మాన్ ఆష్ చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఒక్క కేసు కూడా బయటకు రాని ఫిజిలో ప్రస్తుతం రోజుకు 300 వరకు కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు రష్యాలో రోజుకి 20 వేల కేసులు నమోదవుతున్నాయి. ఆఫ్రికాలోని 12 దేశాల్లో కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తున్నాయి. ఆఫ్రికాలోని 14 దేశాల్లో డెల్టా వేరియెంట్ కేసులు కనిపిస్తే కాంగో, ఉగాండాలో అత్యధికంగా నమోదవుతున్నాయని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (ఆఫ్రికా సీడీసీ) డైరెక్టర్ జాన్ కెంగసాంగ్ చెప్పారు. (చదవండి: పండ్ల రసాలు, కెచప్లతో కొవిడ్ ఫేక్ పాజిటివ్!) -
దడ పుట్టిస్తున్న ‘డెల్టా’.. 85 దేశాల్లోకి ఎంట్రీ!
ఐరాస: ప్రపంచ దేశాలకు దడ పుట్టిస్తున్న కరోనా డెల్టా వేరియంట్ను 85 దేశాల్లో గుర్తించారని గురువారం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది.మరిన్ని దేశాలకు విస్తరించే ప్రమాదముందని హెచ్చరించింది. విస్తృతంగా వ్యాప్తి చెందే ప్రధాన వేరియంట్గా మారనుందని ఆందోళన వ్యక్తం చేసింది. వేరియంట్ల వారీగా ఆల్ఫా 170 దేశాల్లో, బీటా 119 దేశాల్లో, గామా 71 దేశాల్లో, డెల్టా 85 దేశాల్లో గుర్తించారని జూన్ 22న విడుదల చేసిన, గత వారం రోజుల గణాంకాలతో కూడిన నివేదికలో వెల్లడించింది. ఈ నాలుగు ఆందోళనకారక వేరియంట్ల (వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్) మ్యుటేషన్లను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. ఆల్ఫా సహా మిగతా వేరియంట్ల కన్నా డెల్టా అతి వేగంగా వ్యాప్తి చెందుతోందంది. జూన్ 14 –20 మధ్య భారత్లో అత్యధికంగా 4,41,976 కేసులు, 16,329 మరణాలు నమోదయ్యాయని తెలిపింది. అయితే, ఇవి గతవారంతో పోలిస్తే 30% తక్కువని తెలిపింది. డెల్టా వేరియంట్ సోకినవారికి ఆక్సిజన్ అవసరం, ఐసీయూలో చేరే పరిస్థితి అధికంగా ఉందని, మరణాలు కూడా అధికంగానే ఉన్నాయని సింగపూర్లో విడుదలైన ఒక నివేదిక వెల్లడించిందని తెలిపింది. ఆల్ఫా కన్నా డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తోందని జపాన్లో విడుదలైన ఒక నివేదిక పేర్కొందని వెల్లడించింది. డెల్టా వేరియంట్పై ఫైజర్ బయోఎన్టెక్–కొమిర్నటీ, ఆస్ట్రాజెనెకా–వాక్జ్జెవ్రియా టీకాలు ప్రభావవంతంగా పనిచేశాయని ఆ రెండు నివేదికలు వెల్లడించాయని పేర్కొంది. మైసూరులో ఒకరికి డెల్టా ప్లస్ మైసూరు: మైసూరులో ముగ్గురికి డెల్టా వేరియంట్ కరోనా వైరస్, ఒకరికి డెల్టా ప్లస్ వేరియంట్ సోకినట్లు అధికారులు తెలిపారు. మైసూరులో 19 ఏళ్ల యువకుడిలో రాష్ట్రంలో తొలిసారి డెల్టా వైరస్ను గుర్తించారు. అలాగే మరో ఇద్దరిలోనూ డెల్టా వైరస్, ఒకరిలో డెల్టా ప్లస్ వేరియంట్ను గుర్తించారు. మే 13న బెంగళూరులోని నిమ్హాన్స్ ల్యాబ్కు ఈ అనుమానిత కరోనా రోగుల శాంపిల్స్నుపంపించగా అందులో ముగ్గురికి బీ1.617.2 (డెల్టా), మరొకరిలో బీ1.617.2.1 (డెల్టా ప్లస్) వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. హోం ఐసోలేషన్లో ఉంటూ చికిత్స పొంది, ఈ నలుగురూ కోలుకున్నారని అ«ధికారులు తెలిపారు. -
మాస్క్ లేకుంటే డెల్టా ప్లస్ డేంజరే.. పక్కన ఉన్నా పాజిటివ్!
►మన దేశంలో ఇప్పటివరకు 40కి పైగా డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయి. మహా రాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయి. కర్ణాటక, తమిళ నాడు, జమ్మూకశ్మీర్ రాష్ట్రా ల్లోనూ కేసులు మొదలయ్యాయి. ►డెల్టా ప్లస్ సోకినట్టు గుర్తించిన వారిలో తొలిసారిగా మధ్యప్రదేశ్లో మహిళ చనిపోయింది. ఆమె ఎటువంటి వ్యాక్సిన్ తీసుకోకపోవడంతో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని వైద్యులు ప్రకటించారు. ►కొత్త వేరియంట్ ప్రమాదకరమయ్యే అవకాశం ఉందన్న అంచనాలతోనే కేంద్ర ప్రభుత్వం దీన్ని ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్ (ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన కరోనా వేరియంట్)’గా ప్రకటించింది. డెల్టా, దాని అనుబంధ వేరియంట్లతో ప్రమాదం ఎక్కువేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇటీవల వెల్లడించింది. ►కరోనా ఏ వేరియంట్ వచ్చినా కూడా.. ‘కోవిడ్ జాగ్రత్తలు పాటించడం, వ్యాక్సినేషన్, లాక్డౌన్’ ఈ మూడు అంశాలే కీలకమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వీటితోనే మూడో వేవ్ను నియంత్రించవచ్చని చెప్తున్నారు. ►మహారాష్ట్రలో డెల్టా ప్లస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాయిగఢ్, రత్నగిరి, సింధుదుర్గా, సాతారా, సాంగ్లీ, క్లోహపూర్, హింగోలి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. తొందరపడి లాక్డౌన్ ఆంక్షలు పూర్తిగా సడలించవద్దని సీఎం అధికారులకు సూచించారు. సాక్షి, హైదరాబాద్: కరోనా రెండో దశలో లక్షల కేసులకు కారణమైన డెల్టా వైరస్ను అదుపు చేయగలిగామని అనుకుంటుండగానే.. డెల్టా ప్లస్ కలవరం మొదలైంది. ఇది మరింత శక్తివంతమని, వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ సోకిన వారి పక్క నుంచి మాస్కు పెట్టుకోకుండా వెళ్లినా కూడా వైరస్ సోకే అవకాశం ఉంటుందని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ రణ్దీప్ గులేరియా ఇటీవల వెల్లడించారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కొత్త వేరియంట్ సోకు తుందని.. మాస్కులు, శానిటైజేషన్, భౌతికదూరం వంటి కోవిడ్ జాగ్రత్తతోనే రక్షణ అని స్పష్టం చేశారు. డెల్టా ప్లస్ వేరియంట్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఔషధాన్ని తట్టుకుంటుందని, రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకుంటుందన్న అంచనాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతానికి దేశంలో ఈ కొత్త వేరియంట్ కేసులు చాలా తక్కువగా ఉన్నాయని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న ఆరు నుంచి ఎనిమిది వారాలు అత్యంత కీలకమని రణ్దీప్ స్పష్టం చేశారు. మొదట ఇంగ్లండ్లో గుర్తింపు కరోనా వైరస్ రూపాంతరాల్లో డెల్టా ప్లస్ (ఏవై.1) సరికొత్తది. ఇంగ్లండ్ పబ్లిక్ హెల్త్ అధికారులు ఈ కొత్త వేరియంట్ను తొలిసారి గుర్తించినట్టుగా ఈ నెల 11న ప్రకటించారు. భారత్లో రెండో వేవ్కు ప్రధాన కారణమైన డెల్టా వేరియంట్లోని కొమ్ము (స్పైక్) ప్రొటీన్లో ‘కే417’ జన్యు మార్పు జరిగి కొత్త వేరియంట్ పుట్టింది. ఈ తరహా జన్యుమార్పును బీటాగా పిలిచే దక్షిణాఫ్రికా వేరియంట్లో గతంలోనే గుర్తించారు. అయితే బీటా రకం కంటే డెల్టా వేరియంట్కు వ్యాప్తి చెందే సామర్థ్యం ఎక్కువ. అలాంటిది ఈ సామర్థ్యానికి తాజా జన్యుమార్పు జత కలవడంతో.. డెల్టా ప్లస్ మరింత వేగంగా వ్యాపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ కొత్త వేరియంట్పై మోనోక్లోనల్ యాంటీబాడీస్ చికిత్స ప్రభావం తక్కువగా ఉంటుందని ప్రముఖ వైరాలజిస్ట్ షాహీద్ జమీల్ ఇటీవలే వెల్లడించారు. ఎక్కడెక్కడ కేసులు? డెల్టా ప్లస్ వేరియంట్ కేసులను ఇప్పటికే 11కుపైగా దేశాల్లో గుర్తించారు. మొదట గుర్తించిన బ్రిటన్తోపాటు అమెరికా, చైనా, రష్యా, పోర్చుగల్, స్విట్జర్లాండ్, జపాన్, పోలండ్, నేపాల్ తదితర దేశాల్లో కొత్త వేరియంట్ను గుర్తించారు. మన దేశంలోనూ 40కిపైగా డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయి. దాదాపు 45 వేల నమూనాల్లోని జన్యుక్రమాలను విశ్లేషించి ఈ కేసులను గుర్తించారు. ఇవి మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. నిజానికి భారత్లో ఏప్రిల్ ఐదో తేదీన తీసిన ఓ శాంపిల్లోనే డెల్టా ప్లస్ ఆనవాళ్లు ఉన్నాయని, ఈ వేరియంట్ అప్పుడే మొదలైందని ఓ అంచనా. బ్రిటన్లో తొలి ఐదు కేసులను ఏప్రిల్ 26న సేకరించిన శాంపిళ్లలో గుర్తించారు. ప్రమాదం ఎంత? రెండో దశలో నమోదైన కేసుల్లో అత్యధికం డెల్టా రూపాంతరితానివే. డెల్టా ప్లస్ విషయంలోనూ కేసులు అంత భారీ సంఖ్యలో ఉంటాయా అన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. డెల్టా ప్లస్తో ప్రమాదం ఎంత? ఇప్పుడున్న వ్యాక్సిన్లు పనిచేస్తాయా లేదా? అన్నదానిపై భారత వైద్య పరిశోధన సమాఖ్య, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలు ఇప్పటికే అధ్యయనం ప్రారంభించాయి. ప్రమాదం ఉండకపోవచ్చు డెల్టా ప్లస్లోని కే417 జన్యుమార్పు ఒక్కదానితోనే ప్రమాదం పెరిగిపోదని, లక్షలకొద్దీ కేసులు వస్తాయని అనుకోవాల్సిన పనిలేదని కొందరు వైరాలజిస్టులు అంటున్నారు. కోవిడ్ జాగ్రత్తలు, నియమాలు ఎలా అమలు చేస్తున్నామన్నది కూడా ముఖ్యమని స్పష్టం చేస్తున్నారు. కరోనా వైరస్ భవిష్యత్తులోనూ మరింతగా రూపాంతరం చెందుతూనే ఉంటుందని, అవకాశం ఉన్నంత వరకు సోకుతూనే ఉంటుందని అంటున్నారు. అందువల్ల నమూనాల సేకరణ, జన్యుక్రమ నమోదు కార్యక్రమం కట్టుదిట్టంగా, విస్తృతంగా జరగాలని.. ఎక్కడికక్కడే కొత్త రూపాంతరితాలను గుర్తించి, కట్టడి చేయడం సాధ్యమవుతుందని సూచిస్తున్నారు. వ్యాక్సిన్లు పనిచేస్తాయా? మన దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు డెల్టా రూపాంతరితం నుంచి కూడా రక్షణ కల్పిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. కానీ డెల్టా ప్లస్ విషయంలో టీకాల సమర్థత ఎంత అన్నది ఇంకా తేలలేదు. టీకా ఒక డోసు తీసుకున్న తర్వాత కొందరు వైరస్ బారిన పడటాన్ని బట్టి చూస్తే.. కొత్త రూపాంతరితాలపై టీకా ప్రభావం తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని కొందరు నిపుణులు చెప్తున్నారు. కేసులు తగ్గాయని నిర్లక్ష్యం వద్దు కరోనా కేసులు తగ్గిపోయాయి కదా అంటూ మొదటి వేవ్ తర్వాతిలాగా ఇప్పుడూ నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం తప్పదు. ఏది ఏమైనాసరే అన్నట్టుగా కఠినంగా మాస్కులు, భౌతికదూరం, శానిటైజేషన్ వంటి కోవిడ్ జాగ్రత్తలు పాటించాల్సిందే. ఇదే సమయంలో విస్తృతంగా వ్యాక్సినేషన్ చేపట్టాలి. అప్పుడే మూడో వేవ్ను ఎదుర్కోగలుతాం. -ఎయిమ్స్ ప్రధానాధికారి రణదీప్ గులేరియా ఆ కేసులు తక్కువగానే ఉన్నాయి డెల్టా ప్లస్తో దేశంలో మరోదఫా లక్షల సంఖ్యలో కేసులు వస్తాయన్న దానికి రుజువులేమీ లేవు. అలాగని అజాగ్రత్తగా ఉండటం సరికాదు. మేం ఇప్పటివరకు మహారాష్ట్ర నుంచి సేకరించిన 3,500 నమూనాలను విశ్లేషించాం. ఏప్రిల్, మే నెలల నమూనాల్లో డెల్టా ప్లస్కు చెందినవి ఒక శాతం కంటే తక్కువగా ఉన్నాయి. -డాక్టర్ అనురాగ్ అగర్వాల్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ) డైరెక్టర్ -
నిన్నటి తప్పు నేడు చేయొద్దు!
‘డెల్టా ప్లస్’ అత్యంత ప్రమాదకారి అని అంతర్జాతీయ శాస్త్రసమాజమే అభిప్రాయపడుతోంది. ‘అసలు డెల్టాయే ప్రమాదకారి, డెల్టా ప్లస్ ఇంకా...’ అని ప్రఖ్యాత వైరాలజిస్టు, అమెరికా శ్వేతసౌధ ముఖ్య సలహాదారు ఆంథోనీ ఫౌచీ పేర్కొన్నారు. గత రెండు రోజులుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తున్న సూచనలు, చేస్తున్న హెచ్చరికలు ఇదే ధ్రువపరుస్తున్నాయి. ‘ఇది అత్యంత ప్రమాదకారి, దీంతో జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో వైద్యులు, శాస్త్ర నిపుణుల నిర్దేశించే ప్రవర్తన కలిగి ఉండటం పౌర సమాజపు ప్రధాన కర్తవ్యం! పౌరసమాజానికిది పరీక్షా కాలం! ప్రభుత్వాలకు, అంతకుమించి మన ప్రజారోగ్య వ్యవస్థకున్న పరిమితులు తేటతెల్లమైన తర్వాత ఎవరైనా పౌరసమాజంపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ప్రభుత్వ చర్యల వైపు చూస్తూనే విశాల జనబాహుళ్యపు పూర్తి సహకారం అర్తించే సమయమిది. ప్రజలు సంయమనం, క్రమశిక్షణ, శ్రద్ధ వహిస్తేనే... కోవిడ్–19 వంటి మహమ్మారి నుంచి సమాజం బయటపడగలుగుతుంది. ఇలాంటి ఉపద్రవాలనెన్నింటినో అధిగమిం చిన చారిత్రక సందర్భాలు ప్రజల ‘సమష్టి–నిబద్ధ కృషి’ ఖాతాలో చాలా ఉన్నాయి. ఏడాదిన్నర కాలంగా ప్రపంచ మానవాళినే వణికి స్తున్న కోవిడ్–19 తగ్గినట్టే తగ్గుతూ... వైరస్ కొత్త రకాల్ని సృష్టి స్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. మనిషి సహజ రోగనిరోధక శక్తి, చికిత్స ద్వారా ఇచ్చే ఔషధాలను తట్టుకునేందుకు వైరస్ తనంత తాను రూపు–స్వభావం మార్చుకోవడం (మ్యుటేషన్) సహజం. ఈ క్రమంలో పుడుతున్న కొత్త రకాలు (వేరియంట్స్) ఎన్నో! వూహాన్ (చైనా) మౌలిక రకం నుంచి... ఆల్ఫా (యు.కె.లో గుర్తించిన రకం), బీటా (దక్షిణాఫ్రికాలో బయటపడిన రకం), డెల్టా (భారత్లో వెలుగు చూసిన రకం)లను దాటి తాజాగా పుట్టి క్రియాశీలమౌతున్న ‘డెల్టా ప్లస్’ రకం దడ పుట్టిస్తోంది. దేశంలో 40 కేసులు దాటాయి. మననే కాక మరో 8 దేశాలకూ నిద్ర లేకుండా చేస్తోంది. దాని లక్షణాలు, కన బరిచే స్వభావం, చూపే ప్రభావం... సరికొత్త సవాల్! ఇప్పుడు మనం వాడుతున్న టీకామందులు కొత్త రకం వైరస్ నుంచి ఏమేర రక్షణ కల్పిస్తాయనే విషయమై విశ్వవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతు న్నాయి. ‘డెల్టా’ మౌలిక రకం వైరస్ బారిన పడినా, ఆస్పత్రి వెళ్లే దాకా పరిస్థితిని రానీయకుండా ఫైజర్, ఆస్ట్రాజెనికా (మన కోవిషీల్డ్) టీకా మందు రక్షణనిస్తుందని ఆక్స్ఫర్డ్ అధ్యయనంలో వెల్లడైంది. ‘డెల్టా ప్లస్’ వైరస్ నుంచి కూడా సదరు రక్షణ లభిస్తుందా? అన్నది ఇంకా పరీక్షల స్థితిలోనే ఉంది. ఇదే విషయమై భారత వైద్య పరిశోధనా మండలి (ఐ.సి.ఎం.ఆర్) నిర్వహిస్తున్న పరీక్ష ఫలితాలు త్వరలోనే వెలువడనున్నాయి. ‘టీకామందు తీసుకున్న వారిలో పుట్టే యాంటీ బాడీలు, కొత్త వైరస్ను నిర్వీర్యం చేస్తున్నాయా? అనేది మా పరీక్షల్లో తేలుతుంది’ అంటూ మండలి శాస్త్రవేత్త డాక్టర్ సమీరన్ పండ చెప్పిన మాటలు కొత్త ఆశల్ని, ఆకాంక్షల్ని రేకెత్తిస్తున్నాయి. అతి ప్రమాదకారి కొత్త రకం ‘డెల్టా ప్లస్’ అత్యంత ప్రమాదకారి అని అంతర్జాతీయ శాస్త్రసమాజమే అభిప్రాయపడుతోంది. ‘అసలు డెల్టాయే ప్రమాదకారి, డెల్టా ప్లస్ ఇంకా...‘ అని ప్రఖ్యాత వైరాలజిస్టు, అమెరికా శ్వేతసౌధ ముఖ్య సల హాదారు ఆంథోనీ ఫౌచీ పేర్కొన్నారు. లోతైన పరిశీలనల్ని బట్టి.... వేగంగా వ్యాప్తి, ఇన్ఫెక్షన్ను పెంచడం, సోకిన వారి–ఊపిరితిత్తుల కణజాలాన్ని బలంగా అంటిపెట్టుకోవడం, మోనోక్లోనల్ యాంటీ బాడీల ప్రభావాన్ని బాగా తగ్గించడం వంటివి తాజా వైరస్ లక్ష ణాలుగా చెబుతున్నారు. అందుకే, వ్యూహాత్మకంగా ముందుకు సాగా లని ప్రభుత్వాలూ హెచ్చరిస్తున్నాయి. గత రెండు రోజులుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తున్న సూచనలు, చేస్తున్న హెచ్చరికలు ఇదే ధ్రువపరుస్తున్నాయి. మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. ‘ఇది అత్యంత ప్రమాదకారి, తీవ్ర రూపం దాల్చకుండా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని రాష్ట్ర ప్రభుత్వాలను అప్ర మత్తం చేసింది. మరో మూడు రాష్ట్రాల్లోనూ ఈ కేసుల్ని గుర్తించినట్టు చెబుతున్నా అధికారికంగా సమాచారం లేదు. డెల్టా ప్లస్ కేసులు రాగానే అప్రమత్తం కావాలని, ఆయా ప్రాంతాల్లో స్థానిక కట్టడి (కంటైన్మెంట్ జోన్ల ప్రకటన) ఏర్పరచాలని, నమూనాలను తదుపరి పరీక్ష–విశ్లేషణ కోసం ‘జీనోమిక్ కన్సార్షియం’ (ఐఎన్ఎస్ఏసీవోజీ)కి పంపించాలనీ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్దేశించింది. డెల్టా రకం వైరస్ 80 దేశాల్లో కనిపించినా, డెల్టా ప్లస్ భారత్తోపాటు అమెరికా, బ్రిటన్, పోలాండ్, పోర్చ్గల్, రష్యా, చైనా, జపాన్, నేపాల్ దేశాల్లో వెల్లడైంది. ఆల్ఫా రకం ఒకరి నుంచి సగటున నలుగురికి వ్యాప్తి చెందే ఆస్కారం ఉంటే, డెల్టా ప్లస్ 5 నుంచి 8 మందికి సోకే ప్రమాదముంది. డెల్టా మౌలిక రకం కూడా ప్రమాదకారేనని పశ్చిమ దేశాల వైద్యులు, శాస్త్రవేత్తలంటున్నారు. బ్రిటన్ గణాంకాల ప్రకారం, డెల్టా సోకిన వారిలో లక్షణాలు బయటకు కనిపించిన నాటి నుంచి కేవలం 3–4 రోజుల్లోనే ఇన్ఫెక్షన్ తీవ్ర స్థితికి వెళ్లిపోతున్నట్టు స్పష్టమైంది. అడుగులు ముందుకే పడాలి దేశంలో కోవిడ్ కేసులు రమారమి తగ్గుతున్న పరిస్థితి. మొత్తమ్మీద 40 కోట్ల మందికి పరీక్షలు జరుపగా, 3 కోట్ల మందికి కరోనా సోకినట్టు రికార్డయింది. ఒకరోజు కొత్త కేసులు సగటున 40 వేలకు తగ్గాయి. ఒకరోజు కోలుకున్న వారి సంఖ్య 82 వేలకు పెరిగింది. కొత్త కేసుల కన్నా రోగులు కోలుకున్న కేసుల సంఖ్య ఎక్కువ గత 40 రోజుల నుంచి నిరవధికంగా నమోదవుతోంది. ఈ పరిస్థితుల్లో... వైరస్ కొత్తరకం వ్యాప్తి పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా, కోవిడ్ మూడో అల అనుకున్న దానికన్నా ముందే ముంచుకు వచ్చే ప్రమాదాన్ని ప్రభు త్వాలతో పాటు నిపుణులూ శంకిస్తున్నారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల చర్యలెలా ఉన్నా... పౌరసమాజం బాధ్యతగా వ్యవహరించాలంటు న్నారు. కోవిడ్ సముచిత ప్రవర్తన (సీఏబీ) కలిగి ఉండాల్సిన అవ సరం ఏమిటో రెండో అలలో మనకు స్పష్టంగా బోధపడింది. వ్యూహం కొరవడ్డ ప్రభుత్వ విధాన లోపాలు, అవసరానికి తగ్గట్టు లేని మన వైద్య–ప్రజారోగ్య వ్యవస్థ అగచాట్లకు పౌరుల విపరీత ప్రవర్తన తోడై రెండో అలలో తీవ్ర నష్టమే జరిగింది. లక్షలమంది ప్రాణాలు కోల్పో యారు. ఇరవై రోజుల్లో లక్షమంది భారతీయులు చనిపోయిన పాడుకాలం ఈ అలలోనే చూశాం. లక్షలాది మంది వ్యాధి బారిన పడి కోలుకున్నా... కోవిడ్ తర్వాతి ఇబ్బందులతో ఇంకా సతమతమౌ తున్నారు. కోట్లాది మంది ప్రాణాలు అరచేత పట్టుకొని బిక్కుబిక్కు మంటూ గడిపిన దిక్కుమాలిన కాలం. మొదటి అల ముగింపు దశలో మన అలసత్వానికి తగిన మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. అంత దాకా ఉన్న కట్టడిని క్రమంగా ఎత్తివేసి ప్రభుత్వాలు కొంత వెసులు బాటు ఇవ్వగానే, పౌరులు విచ్చలవిడిగా బయటకు వచ్చారు. మహ మ్మారి నుంచి గట్టెక్కామనుకున్నారు. గుంపులుగా తిరిగి, పండుగలు– పబ్బాల్లో గుమిగూడి, మాస్క్లు లేకుండా, భౌతిక దూరం లెక్క చేయక ఇష్టానుసారం నడిచారు. అప్పుడే డెల్టా రకం వైరస్ వచ్చి తీరని నష్టం కలిగించింది. గత డిసెంబరులో తొలిసారి ఇక్కడే వెలుగు చూసింది. రెండో అల వేగంగా ముంచుకు వచ్చి, తీరని నష్టం కలిగిం చడం వెనుక బలమైన కారణాలు ఇవే అని ఆధారాలతో వెల్లడైంది. వైరస్ ప్రభావం, కేసుల సంఖ్య తగ్గుతూ ఇప్పుడిప్పుడే ఊరట చెందు తుంటే... వైరస్ కొత్త రకం మళ్లీ బయపెడుతోంది. అవసరం మనది... ఒక వంక వైరస్ వ్యాప్తిని నిలిపి, వైద్యం అందించి ప్రాణాలు నిలు పడం మరో వైపు కార్యకలాపాలు సాగించి ఆర్థికవ్యవస్థను మెరుగు పరచడం ప్రభుత్వాల బాధ్యత. రెంటి మధ్య సమతూకం పాటించి ప్రాణాలు, ప్రాణాధారాలను కాపాడే ద్విముఖపాత్ర ప్రభుత్వాలు పోషిస్తాయి. కానీ, ప్రాణాధారాలు కాపాడుకుంటూనే ప్రాణాలు నిలుపుకోవలసిన అవసరం ప్రజలది. ఇంతటి మహమ్మారిని ఎదు రొడ్డి నిలిచే నిత్య పోరాటం ఒక ఉమ్మడి బాధ్యత! వైరస్ వ్యాప్తిని, కోవిడ్ ప్రభావాన్నీ నిలువరించేలా పౌరులు అన్ని జాగ్రత్తలు పాటిం చాలి. వైరస్ కొత్తరూపంలో ప్రమాదం ముంచుకొస్తున్నప్పుడు... అప్రమత్తత ఎంతో అవసరం. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతుల్ని నిరంతరం శుభ్రపరచుకోవడం... ఇలా వైద్యులు, శాస్త్ర నిపుణుల నిర్దేశించే ప్రవర్తన కలిగి ఉండటం పౌర సమాజపు ప్రధాన కర్తవ్యం! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
డెల్టా వేరియంట్తో పెనుముప్పు: ఫౌచీ
వాషింగ్టన్: కోవిడ్ మహమ్మారి నిర్మూలన కోసం అమెరికా ప్రభుత్వం సాగిస్తున్న ప్రయత్నాలకు డెల్టా వేరియంట్ పెనుముప్పుగా పరిణమించిందని అంటువ్యాధుల నిపుణుడు, వైట్హౌస్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంథోనీ ఫౌచీ అన్నారు. వ్యాప్తిలో ఉన్న వేరియంట్లతో పోలిస్తే డెల్టా వేరియంట్ ప్రభావం తీవ్రంగా ఉంటోందని గుర్తుచేశారు. అమెరికాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో 20 శాతానికి పైగా కేసులు డెల్టా వేరియంట్కు సంబంధించినవేనని తెలిపారు. వారం రోజుల క్రితం ఈ సంఖ్య 10 శాతమే ఉండేదన్నారు. అంటే కేవలం వారం రోజుల్లోనే ఈ వేరియంట్ వ్యాప్తి రెట్టింపు అయ్యిందని వెల్ల డించారు. యునైటెడ్ కింగ్డమ్(యూకే)లోని డెల్టా రకం వణికిస్తోందని పేర్కొన్నారు. అమెరికాలో అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్పై సమర్థంగా ప్రభావం చూపుతున్నాయని, ఇది గుడ్న్యూస్ అని చెప్పారు. -
Delta Variant: ప్రపంచ దేశాల్లో డెల్టా వేరియెంట్ దడ
వాషింగ్టన్/మాస్కో: మొట్టమొదటిసారిగా భారత్లో వెలుగు చూసిన కోవిడ్–19 డెల్టా వేరియెంట్ (బి.1.617.2) ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తోంది. యూకే థర్డ్ వేవ్ గుప్పిట్లో చిక్కుకొని ఆంక్షల సడలింపుని వాయిదా వేసింది. రష్యా, ఇండోనేసియాలో డెల్టా వేరియెంట్ విజృంభిస్తోంది. ఈ వేరియెంట్ ప్రపంచ దేశాలకు ఒక ముప్పుగా పరిణమించిందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ చెప్పారు. కోవిడ్–19పై వారాంతపు నివేదికను విడుదల చేసిన ఆమె 80 దేశాల్లో ఇప్పటికే ఈ వేరియెంట్ కేసులు ఉన్నాయని, మరో 12 దేశాల్లో డెల్టా కేసులు వెలుగు చూస్తున్నాయని చెప్పారు. యూకేలో వారం రోజుల్లోనే డెల్టా వేరియెంట్ కరోనా కేసులు 33,630 వెలుగు చూశాయని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ (పీహెచ్ఈ) వెల్లడించిన నేపథ్యంలోనే డబ్ల్యూహెచ్ఓ కూడా దీని ప్రమాదాన్ని తన వారాంతపు నివేదికలో పొందుపరిచింది. ఇండోనేషియాలోని జకార్తాలో డెల్టా వేరియెంట్ కేసులు వస్తున్నాయి. మాస్కోలో రోజుకి 9 వేల కేసులు రష్యాలో కరోనా ముప్పు తొలిగిపోయిందని ప్రభుత్వం భావించిన వేళ డెల్టా వేరియెంట్ విజృంభణతో ఆ దేశం బెంబేలెత్తిపోతోంది. రాజధాని మాస్కోలో శుక్రవారం ఒక్కరోజే 9,056 కేసులు నమోదయ్యాయి. అందులో 89% డెల్టా వేరియెంటేనని నగర మేయర్ సెర్గెయి సొబ్యానిన్ తెలిపారు. గత రెండు వారాల నుంచి కేసులు పెరిగిపోతున్నాయని చెప్పారు. రష్యాలో మూడు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నప్పటికీ 9.9% జనాభాకి మాత్రమే ఇప్పటివరకు వ్యాక్సినేషన్ పూర్తయింది. డెల్టా వేరియెంట్ మరింత విజృంభించకుండా వ్యాక్సినేషన్ మరింత ముమ్మరం చేయాలని వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అమెరికాని కూడా డెల్టా వేరియెంట్ భయపెడుతోంది. ముఖ్యంగా అక్కడ యువతలో ఎక్కువ ప్రభావం చూపించడం ఆందోళన పెంచుతోంది. ఈ వేరియెంట్ అత్యంత ప్రమాదకరమైనదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. యువతకు ఈ వేరియెంట్తో ముప్పు పొంచి ఉందన్న ఆయన అందరూ వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అప్పుడే ఈ వైరస్ని కట్టడి చేయగలమని అన్నారు. -
డెల్టా వేరియంట్ విజృంభణ
-
జడుపు వీడి జాగ్రత్తపడదాం
భయాలను అధిగమించే సాక్షాధారాలు, శాస్త్రీయ సమాచారమే మనిషి మనుగడకు దీపదారి. మానవేతిహాస సుదీర్ఘ గమనంలో కాలపరీక్షకు నిలిచిన నిజాలే మనిషి జీవన గమనాన్ని శాసించాయి. నిష్కారణ భయాలు, నిర్హేతుక ఆందోళనలు కాలం గడిచే కొద్దీ గాలికి కొట్టుకు పోయే దూదిపింజల్లా కనుమరుగయ్యాయి. ఏ కొత్త పరిణామం విషయంలోనైనా... అనిశ్చితి వల్ల భయాందోళనతో గడపటమా? భరోసాతో నిర్భయంగా ఉండటమా అన్నది వాస్తవిక సమాచారాన్ని బట్టే ఉంటుంది. కోవిడ్-19 మూడో అల గురించి, ముఖ్యంగా పిల్లలకు ప్రమాద మని వస్తున్న వార్తలు, వార్తా కథనాలు గగుర్పాటు పుట్టిస్తున్నాయి. ఆయా కథనాలు, అంచనాల వెనుక శాస్త్రీయత ఎంత? సాక్షాధారాలపై అధ్యయనాలు చెబుతున్నదేమిటి? నిపుణుల విశ్లేషణలెలా ఉన్నాయి...? అని చూసినపుడు పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తోంది. వాస్తవికత కన్నా అంచనాలే అధికం. సాక్షాధారాల కన్నా ప్రమాద ఆస్కారపు భయాలే ఎక్కువ ప్రచారం లోకి వచ్చాయి. వీటిని గుడ్డిగా నమ్మకుండా, కాస్త లోతుగా విశ్లేషించినపుడు... కలతతో భయాందోళన చెందాల్సినంత ప్రమాదం లేదనిపిస్తోంది. అప్రమత్తంగా ఉండి, తగు జాగ్రత్తలతో వ్యవహరించడం మంచిది. కొన్ని అధ్యయనాల్లో పౌరుల, పిల్లల మానసిక స్థితి అదుపు తప్పి అరిష్టాలు సృష్టించిన ఉదంతాలున్నాయి. కనుక, ప్రాథమిక అవగాహన, సంపూర్ణ విషయ పరిజ్ఞానంతో మసలుకోవడమే మేలు. అంటే... నిర్లక్ష్యంగానో, ఏదీ పట్టనట్టో ఉండా లని కాదు! అలా అని, లేని భయాలతో పరుగులు పెట్టి స్వయంగాను, ఇతరులను ఆందోళనకు గురిచేయవద్దనేది భావన! కోవిడ్-19 కారణమవుతున్న కరోనా వైరస్ తరచూ ఉత్పరివర్తన చెందుతూ స్వభావాన్ని మార్చుకుంటున్న తీరు, ప్రభావితం చేస్తున్న పోకడ ప్రమాదకరంగానే ఉంది. మొదటి అల కన్నా రెండో అల సృష్టించిన విధ్వంసాన్ని కళ్లారా చూశాం. దేశంలో నిలకడగా రోజూ నాలుగు లక్షలకు తగ్గకుండా కేసులు నమోదైన దుస్థితి! పాతిక రోజుల్లో లక్షమంది మరణించారు. కొత్త వైవిధ్యం ‘డెల్టా’ వల్ల ఇంతటి ఉపద్రవం అనేది విశ్లేషణ! ఇలాగే, ‘డెల్టా ప్లస్’, మరో ఉత్పరి వర్తన- వైవిధ్యంతో వైరస్ రేపు ఇంకో రూపు సంతరించుకుంటే అనివార్యంగా ‘మూడో అల‘ పుట్టొచ్చు! ప్రతికూల ప్రభావమూ చూపొచ్చు. దాన్నెవరూ కాదనలేరు. అది చూపే తీవ్రత, కలిగించే నష్టం మాత్రం, మన వ్యవహార శైలిని బట్టే ఉంటుంది. మొదటి అల ప్రభావం తగ్గిన వెంటనే... మనం ఆంక్షలు సడలించి, నిర్భందం ఎత్తేసి, కట్టడిని తొలగించిన వైనం సవ్యంగా లేకుండింది. మార్గదర్శకాల్ని గాలికి వదిలి... మాస్కులు లేకుండా, భౌతికదూరం పాటించకుండా, గుంపులుగా కలియతిరుగుతూ జనం చేసిన స్వేచ్ఛా విహారం వైరస్ వ్యాప్తిని పెంచింది. ఫలితంగా రెండో అల ఉదృతమైంది. కోవిడ్ సముచిత ప్రవర్తన (సీఏబీ) పూర్తిగా మరిచాం. ప్రమాదస్థితి చెయిదాటి, మూల్యం చెల్లించాల్సి వచ్చింది. మొదటి, రెండో అలల సందర్భంగా దేశంలో, ప్రపంచ వ్యాప్తంగానూ పిలల్లలపై అవి చూపిన ప్రభావం గురించి పలు అధ్యయనాలు జరిగాయి. కోవిడ్ సోకిన పిల్లల్లో (నవజాత శిశువులు కాకుండా పదేళ్ల లోపు వారు) 0.1 నుంచి 1.9 శాతం మంది మాత్రమే ఆస్పత్రుల్లో చేరాల్సి వచ్చింది. ఆస్పత్రి పాలైన వారిలోనూ 1.3 నుంచి 3.2 శాతం మంది మరణించారు. అందులో 40 శాతం మంది, అప్పటికే ఇతరేతర జబ్బుల (కోమార్బిడిటీస్)తో ఉన్నవారు. మన దేశంలో కోవిడ్ వల్ల మరణించిన మొత్తం 3.7 లక్షల మందిలో పిల్లలు 0.1 శాతం అనేది గుర్తించాలి. కారణం ఏమైతేనేం, రెండు అలల సందర్భంగా పిల్లల విషయంలో మనం జాగ్రత్తగా ఉన్నాం. ఇప్పటివరకు పెద్దలకు టీకా మందు ఇప్పిస్తున్నాము. పిల్లల టీకా గురించి ఇంకా ఆలోచించలేదు. టీకా పొందిన వారికి వైరస్ సోకినా ప్రాణాంతక ప్రమాదం లేక, వారు వైరస్ వాహకులుగా పిల్లలకు వ్యాధిని అంటించవచ్చు... ఇలాంటి వేర్వేరు కారణాల వల్ల రేపు, మూడో అల వచ్చి, ఉదృతంగా ఉంటే... పిల్ల లకు అధిక ప్రమాద ఆస్కారం ఉండొచ్చు అనేది ఒక అంచనా. ఇదొక ముందు జాగ్రత్త! అంతే తప్ప, మూడో అలలో వైరస్ పిల్లల కోసమే రాదు! వారికి వైరస్ సోకనీకుండా, సోకే ఆస్కారం తొలగించి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలపై తీవ్రత ప్రభావం అధ్యయనానికి ప్రత్యే కంగా ఏర్పాటైన ‘లాన్సెట్–కోవిడ్ కమిషన్ ఇండియా టాస్క్ఫోర్స్’ నిపుణులు కూడా ఇదే సూచించారు. పిల్లల మానసిక స్థితిపై కోవిడ్ ప్రభావం గురించి 10 దేశాల్లో జరిగిన 15 అధ్యయనాల ప్రకారం... 22,996 మంది పిల్లలు/ కౌమారుల్లో, 79.4 శాతం మంది కోవిడ్కు భయపడి క్వరంటైన్ అయ్యారు. 21.3 శాతం మంది నిద్రలేమి/ నిద్రా భంగానికి గురయ్యారు. 22.5 శాతం మంది భయం వల్ల ఆస్పత్రి పాలు కావాల్సి వచ్చింది. పిల్లలు మానసికంగా ఆందోళనకు గురికాకుండా చూడాలని నిపుణుల సూచన. వైరస్ సోకే ఆస్కారం లేకుండా జాగ్రత్త పడాలి. మంద్రంగా లక్షణాలు కనిపించినా ఇంట్లోనే వేరుగా (ఐసొలేషన్) ఉంచి, జ్వరం మాత్రలు వేయాలి. కొంచెం తీవ్రత, ఇన్ఫెక్షన్ వంటివి వస్తే వెంటనే ఆస్పత్రిలో చేర్చాలి. దేశవ్యాప్తంగా టీకా ప్రక్రియను ముమ్మరం చేయాలి. ప్రస్తుత కట్టడిని దశల వారిగా ఉపసంహరించాలి. పౌరులు కోవిడ్ సముచిత ప్రవర్తనతో మెదలాలి. పిల్లల్ని కాపాడుకోవడమంటే మన భవిష్యత్తును భద్రపరచుకోవడమే! ఇది మనవిధి, అంతకు మించి కర్తవ్యం! -
‘డెల్టా ప్లస్’ పుట్టుకొచ్చింది!
సాక్షి, హైదరాబాద్: కోతిపుండు బ్రహ్మరాక్షసైనట్టు.. కోవిడ్ సమస్య రోజు రోజుకూ జటిలమవుతూ పోతోంది. నిన్నమొన్నటి దాకా ఉన్న ఒక్క వైరస్ ఇప్పుడు పలు రూపాల్లోకి మారిపోవడం ఇందుకు కారణం. తాజా సమాచారం ప్రకారం గత ఏడాది అక్టోబర్లో భారత్లో గుర్తించి డెల్టా వేరియంట్ ఇంకోసారి మార్పులకు గురైంది. ‘డెల్టా +’ గా పిలుస్తున్న ఈ కొత్త రూపాంతరిత వైరస్ మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్సకు లొంగదని వైద్యనిపుణులు అనుమానిస్తున్నారు. యునైటెడ్ కింగ్డమ్కు చెందిన ప్రజారోగ్య విభాగం కరోనా వైరస్ జన్యుక్రమాలపై జరుపుతున్న పరిశీలనల్లో ఈ ‘డెల్టా +’ గురించి తెలిసింది. ఇప్పటివరకూ తాము ‘డెల్టా +’ రూపాంతరిత జన్యుక్రమాలు దాదాపు 63 గుర్తించామని, ఇవన్నీ కే417ఎన్ అనే జన్యుమార్పును కలిగి ఉన్నాయని సంస్థ చెబుతోంది. ఈ నెల ఏడవ తేదీ నాటికి భారత్లో ఆరు ‘డెల్టా +’ కేసులు ఉన్నట్లు సమాచారం. డెల్టా + రూపాంతరితం రోగ నిరోధక వ్యవస్థ కళ్లుగప్పేయగలదని, మోనోక్లోనల్ యాంటీబాడీ మందులు కాసిరివిమాబ్, ఇమ్డెవిమామ్లకు లొంగే అవకాశాలు తక్కువని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీకి చెందిన కంప్యూటేషనల్ బయాలజిస్ట్ డాక్టర్ వినోద్ స్కారియా ఆదివారం ఒక ట్వీట్ చేయడం గమనార్హం. మరోవైపు భారత్లో డెల్టా రూపాంతరితం ఇంకా పరిణమిస్తోందని, కొత్త కొత్త జన్యుమార్పులకు గురవుతోందని ఈయన ఇంకో ట్వీట్ ద్వారా తెలిపారు. కే417ఎన్ జన్యుమార్పులు లేకున్నా డెల్టా రూపాంతరితంలో కొత్త మార్పులు చోటు చేసుకోవడం విశేషమని అన్నారు. వైరస్ కొమ్ము ప్రొటీన్లో కే417ఎన్ జన్యుమార్పు జరిగిందని, ఈ ఏడాది మార్చిలో దీన్ని యూరప్లో తొలిసారి గుర్తించామని యునైటెడ్ కింగ్డమ్ ప్రజారోగ్య విభాగం చెబుతోంది. ఈ ‘కే417ఎన్’ మార్పు ఇప్పటికే గుర్తించిన దక్షిణాఫ్రికా రూపాంతరితంలోనూ ఉండటం గమనార్హం. -
డెల్టా వేరియంట్ ఎంత డేంజరో తెలుసా?
లండన్: భారత్లో గుర్తించిన కరోనా డెల్టా వేరియంట్(బీ1. 617.2) ఇతర వేరియంట్లతో పోలిస్తే 60 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని, వ్యాక్సిన్ల ప్రభావాన్ని సైతం గణనీయంగా తగ్గిస్తుందని యూకే హెల్త్ నిపుణుల నివేదిక వెల్లడించింది. యూకేలో ఈ వేరియంట్ వేగంగా పెరుగుతోందని, ఇతర వేరియంట్ల కన్నా తొందరగా వ్యాపిస్తోందని తెలిపింది.ఢి ల్లీలో కేసులు ఉధృతికి ఈ వేరియంటే కారణంగా వీరి అధ్యయనం తేల్చింది. ఇమ్యూనిటే ఎలివేషన్ లక్షణాలతో ఉన్న ఈ డెల్టా వేరియంట్ ఏప్రిల్లో 60 శాతం కేసులకు కారణమైందని తెలిపింది. డెల్టా వేరియంట్ అమెరికా,యూకెతో సహా కనీసం 60 దేశాలలో ఉందని కోవిడ్ -19 జెనోమిక్స్ యుకే కన్సార్టియం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చైర్ షరోన్ పీకాక్ ది వాల్ స్ట్రీట్ జర్నల్ టెక్ హెల్త్ ఈవెంట్లో పేర్కొన్నారు. ఆల్ఫా వేరియంట్, బీ1.117 కంటే 50 శాతం ఇది ఎక్కువ వ్యాప్తిచెందుతుందని గుర్తించామని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, సీఎస్ఐఆర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ నిపుణులు వెల్లడించారు. ఆల్ఫా వేరియంట్తో పోలిస్తే డెల్టా వేరియంట్ వ్యాక్సిన్ ప్రభావాన్ని బాగా తగ్గిస్తున్నదని, ముఖ్యంగా ఒక డోసు తర్వాత ఇది ఎక్కువగా కనిపిస్తోందని నివేదిక పేర్కొంది. రెండు డోసుల తర్వాత డెల్టా వేరియంట్పై వ్యాక్సిన్ ప్రభావం బాగానే ఉంటోందని, కానీ కాలానుగుణంగా ప్రభావం తగ్గుదల ఆల్ఫా కన్నా ఎక్కువగా ఉందని వివరించింది. ప్రస్తుతం యూకేలో కేసుల పెరుగుదలకు ఈ వేరియంటే కారణమని తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ వల్ల కరోనా ఉధృతి చాలా వరకు అదుపులో ఉందని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సినేషనే ఉత్తమమార్గమని యూకే హెల్త్ ఏజెన్సీ పేర్కొంది. చదవండి : టీకా తీసుకున్న 45 నిమిషాలకే మృతి American Embassy: టీకా తప్పనిసరి కాదు -
Coronavirus: డేంజరస్ డెల్టా ఒళ్లంతా తిష్ట!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ సెకండ్వేవ్లో వ్యాప్తి చెందిన డెల్టా వేరియంట్ శరీరంలోని కీలక భాగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. బి.1.617.2 కోడ్తో ఉన్న వేరియంట్ను డెల్టాగా పిలుస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఎక్కువగా వ్యాప్తి చెందిన ఈ వేరియంట్ మానవ శరీరంలోకి ప్రవేశించాక అవయవాలపై వేగంగా ప్రభావాన్ని చూపడంతో ఎక్కువ మంది ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తోంది. కరోనా మొదటి దశతో పోలిస్తే రెండో దశలో ఎక్కువ మంది ఆస్పత్రిపాలయ్యారు. అస్వస్థతకు గురైన వారిలో చాలా మంది మరణం అంచులవరకు వెళ్లి వచ్చారు. కొందరిలో అవయవాలు దెబ్బతినగా, మరికొందరు జీవితకాల వ్యాధులైన బీపీ, షుగర్ బారినపడ్డారు. మొదటి దశ, రెండో దశలో ఆస్పత్రిలో చేరి.. వారు ఎదుర్కొన్న సమస్యలు, వైరస్ ప్రభావం తదితర అంశాలపై రిషికేష్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) పరిశోధన చేసింది. దీనికి ప్రత్యేకంగా కొన్ని కేటగిరీల రోగులను ఎంపిక చేసుకుని పరిశీలించి ఆ నివేదికను విడుదల చేసింది. అన్ని అవయవాలపైనా ప్రభావం... మొదటి దశ కోవిడ్ వ్యాప్తి సమయంలో ఎక్కువ మంది శ్వాసకోశ సమస్యలు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫె„క్షన్ రావడంతో ఆస్పత్రులకు పరుగులు తీశారు. కానీ, రెండో దశ తీవ్రత ఎక్కువగా ఉంది. ఊపిరితిత్తులతో పాటు మూత్రపిండాలు, కాలేయం, మెదడు తదితర కీలకమైన అవయవాలపై వైరస్ ప్రతాపాన్ని చూపింది. వీలైనంత ఎక్కువ మార్గాలను ఏర్పాటు చేసుకుని వైరస్ వ్యాప్తి చెందిన శరీరాన్ని గుల్ల చేసింది. మొదటి దశతో పోలిస్తే రెండో దశలో మూత్రపిండాలపై ప్రభావం ఆరు రెట్లు అధికంగా ఉంది. కాలేయంపై చూపిన ప్రభావం గతేడాది కంటే రెండు రెట్లు ఎక్కువ. లివర్లోకి వైరస్ వ్యాప్తి చెందడంతో ఆ అవయవం విడుదల చేసే ఎంజైమ్స్ రెట్టింపు చేసి సామర్థ్యాన్ని తగ్గించినట్లు గుర్తించారు. దేశంలో కోవిడ్ బారినపడ్డ 70 శాతం మందిలో డెల్టా వేరియంట్ ఉన్నట్లు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది. బి.1.617.2 రకానికి చెందిన ఈ వేరియంట్ దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో తీవ్ర ప్రభావాన్ని చూపింది. డెల్టా వేరియంట్ తెల్ల రక్తకణాల్లోని లింపోసైట్లపై తీవ్ర ప్రభావం చూపడంతో ఎక్కువ మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ వేరియంట్ వైరస్ వ్యాప్తిని ముందుగా లక్షణాలతో గుర్తించి చికిత్స తీసుకున్న వారు ఇంటివద్దే కోలుకుంటుండగా... కాస్త నిర్లక్ష్యం చేసినా ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. దీని నియంత్రణకు వైద్యులు శ్రమించాల్సి వస్తోంది. మొదటి దశ, రెండో దశలో సివియర్ పేషంట్లలో పరిస్థితి ఇలా(గణాంకాలు శాతాల్లో)... కేటగిరీ మొదటి దశ రెండో దశ ఎస్పీఓ2 సగటు 92 85.5 ఫీవర్ 30 85 దగ్గు 14 78 గొంతులో గరగర 11 05 దమ్ము 15 80 నీరసం 9.5 19.6 లూస్మోషన్స్ 11 5 ► మొదటిదశ చికిత్సలో స్టెరాయిడ్లను 4 శాతం మందికే వాడగా... రెండో దశకు వచ్చే సరికి 72 శాతం మందికి ఇచ్చారు. ఇక యాంటిబయోటిక్స్ వినియోగం రెట్టింపు అయ్యింది. ►బాక్టీరియల్ న్యుమోనియా 1.1 శాతం నుంచి 9 శాతానికి పెరగగా, సివియర్ వైరస్ న్యుమోనియా 6 శాతం నుంచి ఏకంగా 49 శాతానికి ఎగబాకింది. ►సీటీ స్కాన్లో స్కోర్ గతేడాది కంటే ఈసారి భారీగా పెరుగుదల నమోదైంది. డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందిన ఎక్కువ మందిలో ఊపిరితిత్తులపై ప్రభావాన్ని చూపడంతో ఆక్సిజన్ స్థాయిలు భారీగా పడిపోయాయి. కరోనా తొలి దశలో 12 శాతం మందికే ఆక్సిజన్ సప్లిమెంట్ అవసరంపడగా... రెండో దశలో ఏకంగా 82 శాతానికి పెరిగింది. రెమిడెసివిర్ వినియోగం మొదటి దశలో ఒక శాతం కంటే తక్కువ ఉండగా... ప్రస్తుతం ఆస్పత్రిలో చేరిన 12 శాతం మంది వినియోగించారు. సివియర్ కోవిడ్తో ఆస్పత్రుల్లో చేరిన వారిలో గతేడాది 90 శాతం మంది డిశ్చార్జ్ కాగా.. సెకండ్ వేవ్లో 71శాతం మందే డిశ్చార్జ్ అయినట్లు గుర్తించారు. ఈ లెక్కన మొదటి దశలో నమోదైన మరణాల రేటుతో పోలిస్తే రెండో దశలో మరణాల రేటు మూడు రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది. గతేడాది ఆస్పత్రుల్లో చేరిన వారిలో 2.6 శాతం మందికే వెంటిలేటర్ అవసరపడగా ఈసారి 41 శాతానికి పెరిగినట్లు పరిశీలనలో తేలింది. పరిశోధన సాగిందిలా... మొదటి దశ కోవిడ్కు సంబంధించి గత ఏడాది ఏప్రిల్, మే, జూన్లలో ఎయిమ్స్లో అడ్మిట్ అయిన 106 మంది రోగులు.. రెండో దశ తీవ్రంగా ఉన్న ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మేలో చేరిన 104 మందిపై పరిశీలన చేశారు. మైల్డ్, మోడరేట్, సివియర్ కేటగిరీలుగా కోవిడ్ను విభజించి.. వీరిలో వైరస్ చూపిన ప్రభావం, అందించిన చికిత్సను పరిశీలించారు. తొలి దశలో లక్షణాలు లేకున్నా ఆస్పత్రుల్లో చేరగా.. ప్రస్తుతం మోడరేట్ స్టేజి దాటే క్రమం, సివియారిటీకి వచ్చిన తర్వాతే ఆస్పత్రుల్లో చేరారు. . తొలిదశలో 37.5% మందే ఆస్పత్రుల్లో చేరగా.. ప్రస్తుతం 70% మంది చేరారు. గతేడాది ఆస్పత్రుల్లో చేరిన వారి సగటు వయసు 37 యేళ్లు కాగా, ప్రస్తుతం 50.5 యేళ్లు. -
యూకేలో ‘డెల్టా’ ప్రమాద ఘంటికలు
లండన్: భారత్లో మొదటిసారిగా గుర్తించిన కోవిడ్ డెల్టా వేరియంట్ లేదా బి.1.617.2 కేసులు భారీగా పెరుగుతుండటంపై యూకే ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. వారం వ్యవధిలోనే ఈ వేరియంట్ బారిన 5,472 మంది పడగా, మొత్తం బాధితుల సంఖ్య గురువారానికి 12,431కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ వేరియంట్ బాధితుల్లో ఈ వారంలో 278మంది, గత వారం 201 మంది ఆస్పత్రుల్లో చేరారని పేర్కొంది. వీరిలో చాలా మంది కోవిడ్ టీకా వేయించుకోని వారేనని వివరించింది. బోల్టన్, బ్లాక్బర్న్ ప్రాంతాల్లోనే అత్యధిక కేసులు బయటపడ్డాయని పేర్కొంది. డెల్టా వేరియంట్పై ఫైజర్ టీకా ప్రభావం తక్కువే లండన్: ‘ఫైజర్–బయోఎన్టెక్’ టీకా తీసుకున్నవారికి భారత్లో గుర్తించిన డెల్టా వేరియంట్ వైరస్ను ఎదుర్కొనే యాంటీబాడీలు చాలా తక్కువ స్థాయిలో ఉత్పత్తి అవుతున్నట్లు గుర్తించారు. ఈ వివరాలను తాజాగా లాన్సెట్ పత్రికలో ప్రచురించారు. వైరస్ను గుర్తించి, పోరాడే ఈ యాంటీబాడీలు పెద్ద వయస్సు వారిలో మరింత తక్కువగా ఉత్పత్తి అయినట్లు తేలింది. వయస్సు పెరుగుతున్న కొద్దీ యాంటీబాడీలు తగ్గుతున్నాయని నిర్ధారణ అయినట్లు ఆ పత్రిక వెల్లడించింది. దాంతో, రెండు డోసుల మధ్య సమయాన్ని తగ్గించాలన్న వాదనకు, బూస్టర్ డోస్ టీకా వేసుకోవాలన్న వాదనకు మరింత బలం చేకూరుతోంది. యూకేలోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్కు చెందిన పరిశోధకుల బృందం ఈ అధ్యయనం జరిపింది. చదవండి: ఆ వేరియంట్ వల్లే భారీగా కేసులు -
భారత్లో బయటపడిన కోవిడ్ వేరియంట్లు.. కప్పా, డెల్టా
జెనీవా: భారత్లో తొలుత వెలుగుచూసిన కోవిడ్ వేరియంట్లు బి.1.617.1, బి.1.617.2లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) కప్పా, డెల్టా అనే పేర్లు పెట్టింది. గ్రీస్ అక్షరమాల ప్రకారం కరోనా వైరస్ వేరియంట్లకు డబ్ల్యూహెచ్వో పేరు పెడుతోంది. సార్స్కోవ్2 వేరియంట్లను గురించి ప్రజలు సులభంగా చర్చించుకునేందుకు ఇవి ఉపయోగపడతాయని డబ్ల్యూహెచ్వో కోవిడ్ విభాగానికి చెందిన మరియా వాన్ కెర్ఖోవ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రమాదకరమైన ఈ వేరియెంట్లను ‘ఇండియన్ వేరియెంట్లు’గా పేర్కొనడాన్ని భారత ప్రభుత్వం గట్టిగా ఆక్షేపించిన విషయం తెలిసిందే. ఇండియన్ వేరియంట్ అని పేర్కొనవద్దని, రాయవద్దని మీడియా సంస్థలతో సహా అందరికీ సూచించింది. అనంతరం డబ్ల్యూహెచ్వో స్పందిస్తూ... తాము దేశాల పేర్లను కరోనా వేరియెంట్లకు పెట్టబోమని తెలిపింది. ఇన్నాళ్లూ సాంకేతిక నామంతోనే పిలుస్తున్న బి.1.617.1, బి.1.617.2లకు ఇప్పుడు కస్పా, డెల్టాలుగా పేర్లు పెట్టింది. -
డెల్టా కార్ప్- ఎవరెడీ ఇండస్ట్రీస్.. జూమ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ కేసినో, రియల్టీ సంస్థ డెల్టా కార్ప్ కౌంటర్కు డిమాండ్ నెలకొంది. మరోపక్క ఎఫ్ఎంసీజీ దిగ్గజం డాబర్ ప్రమోటర్లు వాటాను పెంచుకున్న వార్తలతో వరుసగా రెండో రోజు లైటింగ్ ప్రొడక్టుల కంపెనీ ఎవరెడీ ఇండస్ట్రీస్ వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. డెల్టా కార్ప్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో డెల్టా కార్ప్ రూ. 28.2 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది క్యూ1లో రూ. 42.5 కోట్ల నికర లాభం ఆర్జించింది. లాక్డవున్ ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 74 శాతం క్షీణించి రూ. 48.3 కోట్లకు పరిమితమైంది. ఈ క్యూ1లో దాదాపు రూ. 22 కోట్లమేర పన్ను వ్యయాలు నమోదుకాగా.. గత క్యూ1లో రూ. 6 కోట్ల రైట్బ్యాక్ లభించినట్లు డెల్టా కార్ప్ తెలియజేసింది. అంతేకాకుండా లాక్డవున్ కారణంగా కేసినో లైసెన్స్ ఫీజును రద్దు చేయవలసిందిగా గోవా ప్రభుత్వాన్ని అర్ధించినట్లు తెలియజేసింది. లాక్డవున్ కాలంలో ఆన్లైన్ గేమింగ్ ఆదాయం భారీగా పెరిగినట్లు వెల్లడించింది. దీంతో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం డెల్టా కార్ప్ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. రూ. 94 సమీపంలో ఫ్రీజయ్యింది. ఎవరెడీ ఇండస్ట్రీస్ ఎఫ్ఎంసీజీ దిగ్గజం డాబర్ ప్రమోటర్లు బర్మన్ కుటుంబం తాజాగా 8.48 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో బ్యాటరీల తయారీ కంపెనీ ఎవరెడీ ఇండస్ట్రీస్ షేరు జోరు చూపుతోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఎవరెడీ షేరు 6 శాతం జంప్చేసి రూ. 94 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 98 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. మంగళవారం సైతం ఈ షేరు 10 శాతం దూసుకెళ్లిన విషయం విదితమే. అదనపు వాటా కొనుగోలు నేపథ్యంలో తాజాగా ఎవరెడీ ఇండస్ట్రీస్లో బర్మన్ కుటుంబ వాటా 19.84 శాతానికి ఎగసినట్లు తెలుస్తోంది. గతంలో ఈ వాటా 11.35 శాతంగా నమోదైంది. -
’నీలి’ నాగు
సాగు, తాగునీరు కలుషితం కాలువలు, చెరువుల్లోకి వ్యర్థ నీరు డెల్టాలో దుస్థితి దెబ్బతింటున్న నారుమళ్లు రైతులు, ప్రజలు బెంబేలు పట్టించుకోని అధికారులు డెల్టాపై నీలినాగు పడగ విప్పింది. ఆక్వా సాగు(నీలివిప్లవం) చాపకింద నీరులా పాకుతోంది. అనుమతి లేకుండా రొయ్యల సాగు యథేచ్ఛగా జరుగుతోంది. అక్రమార్కులు చెరువుల్లోని కాలుష్య నీటిని పంటకాలువల్లోకి తోడేస్తుండడంతో సాగు, తాగునీరు కలుషితమవుతోంది. ఫలితంగా వరి నారుమళ్ల దశలోనే దెబ్బతింటోంది. తాగునీటి చెరువులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. ఆకివీడు : పశ్చిమడెల్టా ఒకప్పుడు పైరు పచ్చని సీమ. ధాన్యాగారం. సుమారు ఆరు లక్షల 20వేల ఎకరాల్లో విస్తరించిన ఈ ఆయకట్టులో ఎంత కష్టించినా.. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయి పెట్టుబడి దక్కకపోవడం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు నిరాశజనకంగా ఉండడంతో రైతులు వరి సాగు నుంచి నీలి విప్లవం(ఆక్వా సాగు) వైపు అడుగులు వేశారు. ఫలితంగా పొలాలు చేలుగా మారాయి. ప్రస్తుతం ఆయకట్టులో సుమారు 54వేల ఎకరాలు చేపలు చెరువులు ఉన్నాయి. మరో లక్ష ఎకరాల్లో చేపల చెరువుల పేరిట అనధికారికంగా రొయ్యల సాగు జరుగుతోంది. ఇవికాక అనుమతి పొందిన రొయ్యల చెరువులు 15వేల ఎకరాలు ఉన్నాయి. పడగ విప్పిన కాలుష్యం ఆక్వా చెరువుల వల్ల కాలుష్యం పడగ విప్పింది. ముఖ్యంగా రొయ్యల చెరువుల నుంచి వెలువడే వ్యర్థ ఉప్పునీరు వల్ల అనర్థం జరుగుతోంది. చెరువుల సాగుదారులు వ్యర్థనీటిని మురుగు కాలువల్లోకి వదలాల్సి ఉండగా, అలా చేయకుండా యథేచ్ఛగా పంట కాలువల్లోకి తోడేస్తున్నారు. ఫలితంగా 11 పంట కాలువలు కలుషితమవుతున్నాయి. ఈ ప్రభావం సాగు, తాగునీటిపై పడుతోంది. పంట కాలువల్లోని ఉప్పునీరు వరి పొలాల్లోకి చొచ్చుకెళ్లి నారుమళ్లు దెబ్బతింటున్నాయి. ప్రస్తుతం డెల్టా వ్యాప్తంగా సుమారు 50వేల ఎకరాల్లో నారుమళ్లు దెబ్బతిన్నట్టు అంచనా. అలాగే డెల్టాలోని తాగునీటి చెరువులకు పంట కాలువల ద్వారానే నీటిని సరఫరా చేస్తున్నారు. దీనివల్ల 300 తాగునీటి చెరువులూ కాలుష్య కాసారాలుగా మారుతున్నట్టు సమాచారం. ఈ నీటిని శుద్ధిచేసినా.. స్వచ్ఛ తాగునీరు సరఫరా సాధ్యం కావడం లేదని, వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని పంచాయతీ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే డెల్టాలో ప్రజల మనుగడే ప్రశ్నార్థకమవుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. కాలువల వ్యవస్థ మారాలి కాలుష్యం నుంచి తప్పించుకోవాలంటే ముఖ్యంగా డెల్టాలోని కాలువల వ్యవస్థను మార్చాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. చేపలు, రొయ్యల చెరువులకు ప్రత్యేకంగా మురుగు బోదెలను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. దీనికోసం అధికారులు తక్షణం చర్యలు చేపట్టాల్సి ఉంది. ప్రత్యేక పైప్లైన్ ఏర్పాటు చేయాలి గోదావరితోపాటు, ప్రధాన పంట కాలువలు పూర్తిగా కాలుష్యానికి గురయ్యాయి. డెల్టాకు వచ్చే 11 కాలువల్లోకి మురుగునీరు, ఫ్యాక్టరీల వ్యర్థ నీరు చొచ్చుకువస్తోంది. రాజమండ్రి నుంచి ప్రధాన మురుగు కాలువ నీరు గోదావరిలోకి రావడం వల్ల ఆ నీరు దిగువ ప్రాంతమైన పశ్చిమ డెల్టాకు సరఫరా అవుతోంది. కాలుష్యం బారి నుంచి కొంతైనా బయటపడేందుకు తాగునీటి కోసం ప్రత్యేక పైప్లైన్లు డెల్టా అంతా ఏర్పాటు చేసి, చెరువుల్లోకి అమర్చాలి. దీనికి రూ.వెయ్యి కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశాం. దీనిని సర్కారు దృష్టికి తీసుకెళ్తాం. ఎం.వి.సూర్యనారాయణరాజు, పర్యావరణ పరిరక్షణ సమితి రాష్ట్ర నాయకులు. మురుగు కాలువల్లోకే వదలాలి ఆక్వా చెరువుల్లోని వ్యర్థ నీటిని మురుగు కాలువల్లోకే వదలాలి. డెల్టాలో 1.54 లక్షల ఎకరాల్లో చేపల చెరువులు ఉన్నాయి. దీనిలో సుమారు లక్ష ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది.15 వేల ఎకరాల్లో మాత్రమే అనుమతి పొందిన రొయ్యల చెరువులు ఉన్నాయి. అనుమతి లేని చెరువులపై సర్వే జరుగుతోంది. ఫణి కిషోర్, డిప్యూటీ డైరెక్టర్, నీటిపారుదల శాఖ, భీమవరం. -
జెట్ ఎయిర్వేస్లో డెల్టాకు వాటాల విక్రయం!
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ .. అమెరికాకు చెందిన ఎయిర్లైన్స్ కంపెనీ డెల్టాకు 24 శాతం దాకా వాటాలు విక్రయించనున్నట్లు సమాచారం. కొత్తగా షేర్ల జారీ ద్వారా ఈ డీల్ ఉండగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. వాటాల విక్రయం ద్వారా జెట్ ఎయిర్వేస్ సుమారు రూ. 2,000 కోట్లు సమీకరించాలని యోచిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం సాకారం కావాలంటే ఎతిహాద్ నుంచి కుడా జెట్ ఎయిర్వేస్ ఆమోదముద్ర పొందాల్సి ఉంటుంది. డీల్ పూర్తయితే ఎతిహాద్ తన 24 శాతం వాటాను స్థిరంగా కొనసాగించుకునేందుకు మరిన్ని నిధులు సమకూర్చాల్సి ఉండనుండటమే ఇందుకు కారణం. వాటా విక్రయం వార్తల నేపథ్యంలో సోమవారం బీఎస్ఈలో జెట్ ఎయిర్వేస్ సుమారు షేరు 3 శాతం పెరిగి దాదాపు రూ. 583 వద్ద ముగిసింది. -
డెల్టాలో కుండపోత
ఏలూరు (ఆర్ఆర్ పేట)/కొవ్వూరు : మేఘం ముసిరింది.. చిటపట చినుకుల కళ్లాపి చల్లింది. కాసేపటికే జల్లుల జావళి జోరెత్తింది. వేడెక్కిన పుడమి పొరల్లోకి ఆకాశ గంగ చొచ్చుకెళ్లింది. వేసవి తాపాన్ని చల్లార్చింది. మట్టి వాసనల్ని ముక్కు పుటాల వరకు వెదజల్లింది. జిల్లా అంతటా ఆవరించిన మేఘాలు రెండు రోజులుగా వర్షిస్తున్నాయి. శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయానికి జిల్లాలో 32.7 మిల్లీవీుటర్ల సగటు వర్షపాతం నమోదైంది. డెల్టాలో కుండపోత వర్షం కురిసింది. శుక్రవారం 8.30 గంటల సమయానికి గడచిన 24 గంటల్లో జిల్లాలో సగటున 32.7 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పాలకోడేరులో 110.6 మిల్లీవీుటర్ల వర్షం కురవగా.. అత్యల్పంగా టి.నరసాపురంలో 2.2 మిల్లీవీుటర్లు నమోదైంది. పెనుగొండలో 87.4, ఆచంటలో 85.2, పోడూరులో 80.4, ఉండిలో 81.8, గణపవరంలో 66.4, పెనుమంట్రలో 60.8, మొగల్తూరులో 56.4, నరసాపురం పట్టణంలో 51 మిల్లీవీుటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఏలూరు నగరంలో 10.8, జీలుగుమిల్లిలో 5.2, బుట్టాయగూడెంలో 22, పోలవరంలో 4.4, తాళ్లపూడిలో 8, గోపాలపురంలో 4.6, కొయ్యలగూడెంలో 8.4, జంగారెడ్డిగూడెం పట్టణంలో 21.2, చింతలపూడిలో 2.6, లింగపాలెంలో 5.4, కామవరపుకోటలో 17.2, ద్వారకాతిరుమలలో 43.4, నల్లజర్లలో 46.8, దేవరపల్లిలో 12.6, చాగల్లులో 14.2, కొవ్వూరు పట్టణంలో 15, నిడదవోలులో 30.2, తాడేపల్లిగూడెం పట్టణంలో 35.8, ఉంగుటూరులో 36.8, భీమడోలులో 25.4, పెదవేగిలో 8, పెదపాడులో 11.4, దెందులూరులో 14, నిడమర్రులో 16, పెంటపాడులో 27.6, తణుకు పట్టణంలో 37.4, ఉండ్రాజవరంలో 43, పెరవలిలో 28, ఇరగవరంలో 43, అత్తిలిలో 38, ఆకివీడులో 37, కాళ్లలో 51, భీమవరం పట్టణంలో 45, వీరవాసరంలో 40, పాలకొల్లు పట్టణంలో 35, యలమంచిలిలో 40.4 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదైంది. -
‘లస్కర్ల’కు లంగరు
దశాబ్దాలుగా భర్తీకి నోచుకోని లస్కర్ పోస్టులు గాడి తప్పుతున్న సాగునీటి సరఫరా శివారు ఆయకట్టుకు తప్పని ఇబ్బందులు ఇప్పటికైనా నియామకాలు చేపట్టాలని రైతుల వేడుకోలు. . ఓ రైల్వే లైను పటిష్టంగా ... ప్రమాదరహితంగా ఉండాలంటే గ్యాంగ్మెన్ల నిరంతర పర్యవేక్షణ అవసరం. రైల్వే పట్టాను ప్రతి అంగుళం నిశితంగా పరిశీలించి లోపాలుంటే సరిచేస్తేనే ఆ రైలు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంటుంది. అలాగే గలగల పారే నీరు కూడా. ఎటువంటి అవరోధాలు లేకుండా చివరి ఆయకట్టు వరకూ నీరు జలజలా పారితేనే పంటకు ఊపిరందుతుంది. చివరి నీటిబొట్టు కడవరకూ చేరాలంటే గ్యాంగ్ మెన్లలాగే పర్యవేక్షించే లస్కర్లుండాలి. కానీ ఈ పోస్టుల నియామకంపై నిషేధం ఉండడంతో సాగుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. . డెల్టా లాకులు మంజూరైన పోస్టులు ఖాళీలు ఈస్ట్రన్ 14 174 92 సెంట్రల్ 17 198 110 వెస్ట్రన్ 27 306 221 హెడ్వర్క్స్ –– 221 131 . రాయవరం (మండపేట): సాగునీటి వ్యవస్థను అజమాయిషీలో కీలకపాత్ర పోషించే లస్కర్ పోస్టుల నియామకంపై నిషేధం ఉండడంతో నీటిపారుదల వ్యవస్థ అస్థవ్యస్తంగా తయారవుతోంది. శివారు పంట పొలాలకు సాగునీరు సక్రమంగా అందడానికి లస్కర్ వ్యవస్థను బ్రిటిష్ వారి హయాంలో ప్రవేశ పెట్టగా నేటి పాలకులు పట్టించుకోకపోవడంతో కాలువల వ్యవస్థ దెబ్బతినే పరిస్థితి నెలకొంది. దీన్ని మళ్లీ పునరుద్ధరిస్తే కాలువలు, గట్లు, స్లూయిస్లు, లాకులు వంటివాటికి రక్షణ ఏర్పడి శివారు ఆయకట్టుకు కూడా నీరందే అవకాశం ఉందని నీటి పారుదలరంగ నిపుణులు చెబుతున్నారు. . ఖాళీల భర్తీలో నిర్లక్ష్యం... నీటి ఎద్దడి సమయంలో ముఖ్యంగా దాళ్వాను సాగునీటి సంఘాలు, రైతులు, అధికారులు కలిసి ఉమ్మడిగా గట్టెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ప్రతి పంటకూ అదేవిధంగా వ్యవహరించాలంటే సాధ్యమయ్యే పనికాదు. గోదావరిలో పుష్కలంగా నీరున్నా కాలువలు, పొలాలకు సక్రమంగా సాగునీరు సరఫరా చేయాలంటే క్షేత్రస్థాయిలో లస్కర్లు, గంటా కళాసీలు ఎంతో కీలకం. ఎప్పటికప్పుడు నీటి ప్రవాహాన్ని రైతుల అవసరరాలను దృష్టిలో ఉంచుకుని సాగునీరు పంపిణీ చేయాల్సి ఉంటుంది. నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తేనే సాగునీరు పొలాలకు సాఫీగా చేరుతుంది. . రైతులతో మిళితమైన లస్కర్ల వ్యవస్థ... రైల్వేలైన్ వెంబడి పర్యవేక్షించే కీమెన్ పోస్టుల మాదిరిగానే పంట కాలువల పరిరక్షణకు లస్కర్ల అవసరం ఎంతో ఉంది. ప్రధాన పంట కాలువలు, మురుగు కాలువలతోపాటు మంచినీటి చెరువులకు కూడా కాపలా ఉండేవారు. పంట సమయంలో రాత్రి సమయాల్లో కూడా వాటర్ మేనేజ్మెంట్ చేయాల్సిన బాధ్యత వీరిపైనే ఉంది. అందుకే బ్రిటిష్ హయాం నుంచి రైతులతో లస్కర్ల వ్యవస్థ మిళితమై ఉండడంతో పంట పండగానే లస్కర్లకు కొంత ధాన్యాన్ని బహుమానంగా ఇచ్చే ఆచారం కూడా ఉంది. ప్రస్తుతం ఇదే పోస్టులో పేరు మార్పు చేసి కొన్ని పోస్టుల్లో హెల్పర్లు, మజ్దూర్లుగా పని చేస్తున్నారు. ప్రధాన కాల్వల పరిధిలోని పలుచోట్ల ఉన్న లాకుల వద్ద లాక్ సూపరింటెండెంట్ ఉండేవారు. ఆయనే దానికి అధిపతి. లాక్ సూపరింటెండెంట్ కింద మైలు కూలీలు, లస్కర్లు, గంటా కళాసీలు పని చేయాల్సి ఉంటుంది. . ప్రధాన విధులివీ.. పంట కాలువలను పరిరక్షిస్తూ వీరు కాలువ వెంబడి పర్యటించడం వీరి విధి. కాలువ పరిధిలో అపారిశుద్ధ్యం, చెత్తా చెదారం వంటి వాటిని ప్రజలు వేస్తే వారి అజమాయిషీతో నిషేధించేంవారు. పంట కాలువలోకి కలుషిత నీటిని వదిలితే చర్యలు తీసుకునే వారు. కాలువల్లో వ్యర్థాలు వేసినా శిక్ష తప్పదనే విధంగా ఉండేది. పంట కాలువల నుంచి అక్రమంగా తూరలు నిర్మించి నీటిని తోడుకోవడం వంటి వాటిని అరికట్టడం వీరి చేతుల్లోనే ఉండేది. గోదావరి, కృష్ణా డెల్టాల్లో ఈ విధానం అత్యంత పకడ్బందీగా అమలు జరిగేది. 1997లో అప్పటి టీడీపీ ప్రభుత్వం నీటి పంపిణీ వ్యవస్థలో భారీ మార్పులు చేసి, నీటి వ్యవస్థపై పెత్తనాన్ని నీటి సంఘాలకు అప్పగించింది. . ఇదీ దుస్థితిదీ... గోదావరి డెల్టాలో ఈస్ట్రన్, సెంట్రల్, వెస్ట్రన్ డెల్టాలున్నాయి. ఈస్ట్రన్ డెల్టాలో 174 లస్కర్ పోస్టులకు 82, సెంట్రల్ డెల్టాలో 198 పోస్టులకు 80 మంది, వెస్ట్రన్ డెల్టాలో 306 పోస్టులకు 85 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ హెడ్వర్క్స్లో 221 మంది లస్కర్లు ఉండాల్సి ఉండగా 90 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ వ్యవస్థలో నియామకాలు జరగకపోవడంతో రిటైరయిన వారి స్థానంలో కొత్త పోస్టుల నియామకం దాదాపుగా నిలిచి పోయింది. . పోస్టులను భర్తీ చేయాలి.. నీటి వ్యవస్థలో లస్కర్ల విదానం రైతులకు ఎంతో మేలు కలిగిస్తుంది. పంట కాలువల పరిరక్షణకు ఈ వ్యవస్థ ఉత్తమం. అక్రమ తూరలు, కలుషిత వ్యర్ధాలు కాలువల్లోకి వదలకుండా పరిరక్షించే లస్కర్ల వ్యవస్థను పునరుద్ధరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వెంటనే ఖాళీగా ఉన్న ఈ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయాలి. – కొవ్వూరి త్రినాథరెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి, పసలపూడి, రాయవరం మండలం. . తాత్కాలిక పద్ధతిపై నియామకాలు.. లస్కర్ల నియామకాలు నిలిపివేశారు.కాలువల వెంబడి పరిరక్షించే ఈ పోస్టులపై నిషేధం ఉంది. గత 17 సంవత్సరాలుగా నియామకం జరగలేదు. అత్యవసర సమయాల్లో తాత్కాలిక సిబ్బందిని నియమిస్తున్నాం. లస్కర్ పోస్టులు ఖాళీగా ఉన్నచోట తాత్కాలిక పద్ధతిపై నియమిస్తున్నారు. – బి.రాంబాబు, ఎస్ఈ, నీటిపారుదల శాఖ. -
ఆరంభంలోనే అవినీతి పర్వం
- నిబంధనలు హుష్కాకీ ... ఇష్టారాజ్యంగా పనులు - రూ.80 లక్షలు కాలువలపాలు - నివ్వెరపోతున్న ఆయకట్టుదారులు అమలాపురం : డెల్టా ఆధునికికీరణ పనుల ఆరంభంలోనే అవినీతి పర్వానికి తెరలేచింది. నిబంధనలకు విరుద్ధంగా కాలువ తవ్వకాలు చేపట్టి నాలుగు రాళ్లు జేబులో వేసుకునేందుకు కాంట్రాక్టర్లు యత్నిస్తుంటే అందుకు అధికారులు వత్తాసు పలుకుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టెండర్లు ఖరారు కాక.. మరమ్మతులు జరగక అధ్వానంగా మారిన అమలాపురం– చల్లపల్లి ప్రధాన పంట కాలువ ఆధునికీకరణ పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.80 లక్షలతో కాలువలో పూడికతీత, రిటైనింగ్వాల్, మూడు స్లూయిజ్ల నిర్మాణాలు ఈ నిధులతో చేపట్టాల్సి ఉంది. కాలువలు మూసివేసిన సుమారు పదిహేను రోజుల తరువాత గత నెల 30 నుంచి పనులు ఆరంభించారు. పనులు ఆరంభించిన తొలిరోజు నుంచే ఇక్కడ అవినీతి అంకానికి తెరలేచింది. కాలువల్లో పూడిక తొలగించేముందు నిబంధనల ప్రకారం నీరు ఉండకూడదు. తీసిన మట్టిని కెనాల్ బ్యాంక్ (కాలువగట్టు )మీద వేసి గట్టును 1:1.5 స్లోపుతో పటిష్టం చేయాల్సి ఉంది. కానీ కాలువలో అడుగున అడుగున్నర లోతున నీరు ఉండగానే ప్రొక్లెయినర్లతో మట్టి తవ్వకాలు చేస్తున్నారు. వచ్చిన బురద, నీరుతో కలిసిన మట్టిని గట్ల మీద వేసి చేతులు దులుపుకుంటున్నారు. నీరు ఉండడం వల్ల నిబంధనల మేరకు లోతున కాలువ తవ్వుతున్నారా? లేదా? అనేది తేలియకుండా పోతోంది. పైగా బురద మట్టి వేయడం వల్ల కాలువ గట్టు పటిష్ఠంగా ఉండడం అటుంచి వచ్చే వర్షాకాలం మట్టి కాలువలోకి కొట్టుకుపోయి పూడుకుపోనుంది. ఇలా చేయకూడదని తెలిసి కూడా కాంట్రాక్టరు మూడు నాలుగు ప్రొక్లెయినర్లు పెట్టి యధేచ్ఛగా పనులు చేసుకుంటూపోతున్న తీరును చూసి రైతులు నివ్వెరపోతున్నారు. రోడ్డు విస్తర్ణ ఉందని తెలిసి కూడా... అమలాపురం ఎర్రవంతెన– నల్లవంతెనల మధ్య ఓఎన్జీసీ చేపట్టిన బైపాస్ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఇంతలోనే ఆదరాబాదరగా కాలువలో పూడికతీత పనులు చేపట్టారు. పూడిక తీసిన మట్టిన ఎన్టీఆర్ మార్గ్ వైపు వేసేందుకు వీలులేకుండా ఉండడంతో ఓఎన్జీసీ విస్తరించనున్న రోడ్డు వైపు గుట్టు మీద వేసి పట్టిష్టం చేస్తున్నట్టుగా హడావిడి చేస్తున్నారు. ఇక్కడ రోడ్డు విస్తరణ పనులు జరిగితే ఈ గట్టును తెంచివేయనున్నారు. కాలువల్లో ప్రొక్లెయిన్లు తిరిగే అవకాశమున్నందున పూడిక తొలగింపు చేపట్టడం వల్ల ప్రయోజనంలేకుండా పోతోంది. పనులు చేశామని బిల్లులు నొక్కేందుకు ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల మేరకే పనులు చేస్తున్నామని ఇరిగేషన్ ఏఈ ఎస్.శివరామకృష్ణ ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. కాలువల్లో నీరు మళ్లించేందుకు బాటలు ఏర్పాటు చేసే పనులు చేస్తున్నామని, తరువాత పక్కాగా పనులు చేస్తామని ఆయన చెప్పారు. -
డెల్టాకు జూన్ 1 కి నీరు విడుదల
అమలాపురం : గోదావరి డెల్టా కాలువలకు జూన్ 1 నుంచి సాగునీరు విడుదలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మే 15 నాటికి సాగునీరు ఇస్తే ప్రకృతి వైపరీత్యాల నుంచి గట్టెక్కవచ్చని... అపరాలు పండించుకునే అవకాశం దక్కుతుందని రైతులు కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఈ నెల 6వ తేదీన ‘ఖరీఫ్పై నీలి నీడలు’ శీర్షికన సాక్షి దినపత్రిక వెలుగులోకి తీసుకువచ్చింది. దీంతో కనీసం జూన్ 1 నాటికైనా సాగునీరు విడుదల చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. బ్రిటీష్ హయాంలో మే 15 నాటికి సాగునీరు విడుదల చేసేవారు. తరువాత రెండు పంటల విధానం రావడంతో నీటి విడుదల జూ¯ŒS 15 తరువాతకు మారింది. ఈ విధానం వల్ల ఖరీఫ్ పంట కోతల సమయంలో భారీ వర్షాలు, తుపాన్ల తో రైతులు రూ.కోట్ల పంటను కోల్పోతున్నారు. అడ్డంకులు ఇవే జూన్ 1 నాటికి నీరు విడుదల చేస్తే జూలై 1 నాటికి నాట్లు పడతాయి. ఈ సమయంలో తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు కనీసం 9 వేల క్యూసెక్కులు విడుదల చేయాలి. నైరుతి ఆలస్యమై వర్షాలు పడకుంటే నీటి ఎద్దడి ఏర్పడుతుంది. 2010 ఖరీఫ్ ఆరంభంలో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో సçహజ జలాలు 2 వేల క్యూసెక్కులు మించి ఉండవు. సీలేరు నుంచి వచ్చే అవకాశం తక్కువ. ∙కాలువలు మూసిన తరువాత పట్టిసీమ ద్వారా నీరు తోడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జూన్ 1 నాటికి నీరు విడుదల చేయాల్సి వస్తే ఆ సమయంలో వర్షాలు ఉండనందున పట్టిసీమ నిలిపివేయాలి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నీరు విడుదలకు అంగీకరిస్తుందా? అనేది చూడాల్సి ఉంది. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం డెల్టాలో మూడు పంటలకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో జూన్ 1 నాటికి నీరు విడుదల చేయాలనే ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఉన్నతాధికారుల నుంచి అనుమతి వచ్చిన వెంటనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాం. – రాంబాబు, ఎస్ఈ, ధవళేశ్వరం -
హరీ కృష్ణ..
–కృష్ణా డెల్టాలో 59 వేల ఎకరాలు సాగుకు దూరం –మూడేళ్లుగా బీళ్లుగానే.. –24 వేల మంది రైతుల జీవితాలు ఛిన్నాభిన్నం –కూలీలు, భవన నిర్మాణ కార్మికులుగా మారిన వైనం –పట్టించుకోని పాలకులు ఏలూరు (మెట్రో) : ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పేరుగాంచిన జిల్లాలో కృష్ణాడెల్టా పరిధిలోని రైతులు కరువు కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్నారు. సాగు నీరు రాక.. వేసిన ఆరుతడి పంటలు చేతికి రాక వేల మంది రైతులు కూలీలుగా, భవన నిర్మాణ కార్మికులుగా, తాపీ పనివారుగా మారుతున్నారు. మరికొందరు ఉపాధి హామీ కూలీలుగా మిగిలిపోయారు. 59 వేల ఎకరాల్లో సాగు హుష్కాకి జిల్లాలో అత్యధిక మండలాల్లోని రైతులు గోదావరి డెల్టా సాగునీటిపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. అయితే ఏలూరు, పెదపాడు, పెదవేగి, దెందులూరు మండలాల్లోని రైతులు సాగునీటి కోసం పూర్తిగా కృష్ణా నది నుంచి వచ్చే నీటిపైనే ఆధారపడాలి. ఈ మండలాల్లో 59 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. 24 వేల మంది రైతులు ఉన్నారు. మూడు సంవత్సరాల క్రితం వరకూ వారు కూడా బాగానే సాగు చేస్తూ జీవనం సాగించేవారు. మూడేళ్ల నుంచి ఈ ప్రాంతంలో ఖరీఫ్ కూడా ఉండటం లేదు. దీంతో కొందరు రైతులు అపరాల సాగు చేస్తూ వ్యవసాయాన్ని వదలలేక నష్టమో, కష్టమో భరిస్తుంటే దాదాపు 20 వేల మంది రైతులు, వారి కుటుంబాలు సాగును వదిలి కూలి పనుల బాట పట్టాల్సి వచ్చింది. కొందరు సమీపంలోని ఏలూరు నగరం వైపు తాపీ పనులకు వచ్చి జీవనం సాగిస్తుంటే, మరికొందరు ఉపాధి హామీ పనులతోనే జీవనం సాగిస్తున్నారు. ప్రయత్నాలు విఫలం గతేడాది పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు వెళ్తున్న సాగునీటిని జానంపేట వద్ద పైపుల ద్వారా (సైఫ¯ŒS సిస్టం) ఎత్తిపోసే యత్నాలు చేశారు. అయితే ఈ నీటి ద్వారా కేవలం 2 వేల 300 ఎకరాలను మాత్రమే కాపాడగలిగారు. ఈ యత్నాలు పూర్తిస్థాయిలో ఫలించకపోవడంతో ఇక ప్రభుత్వం కూడా ఈ డెల్టా వైపు కన్నెత్తి చూడటం లేదు. పూర్తిస్థాయిలో పట్టిసీమ నీటిని మళ్లిస్తే కృష్ణా డెల్టాలో పంటలు పండే అవకాశం ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం కళ్లప్పగించి చూడటం తప్ప ఏమాత్రం కనికరించడం లేదు. ఆరుతడి పంటలతో అవస్థలే గత ఏడాది 15 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలైన మినుములు, పెసలు సాగు చేసేందుకు కొందరు రైతులు యత్నించినా తెగుళ్ల కారణంగా ఈ పంటలు చేతికిరాకుండానే పోయాయి. సాక్షాత్తూ తెగుళ్ల వల్ల కోల్పోయిన పంటలను చేతపట్టుకుని అధికార పార్టీ నేతలే జిల్లా కలెక్టర్ను కలిసి ఈ రైతులకు న్యాయం చేయాలని కోరారు. అయినా ఫలితం శూన్యం. -
నీలినీడలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :డెల్టా ఆధునికీకరణ పనులు ఈ ఏడాది కూడా జరిగే అవకాశం కనబడటం లేదు. ఈ జిల్లా రుణం తీర్చుకోలేనిదంటూ ఇక్కడ పర్యటించినప్పుడల్లా ఉపన్యాసాలు ఇచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాగునీటి సమస్యలపై మాట్లాడిన పాపాన పోలేదు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతానికి, జానంపేట అక్విడెక్ట్ వద్దకు తరచూ రావడం, మీడియాతో మాట్లాడి వెళ్లడం తప్ప జిల్లాలోని సాగునీటి ఇబ్బందులపై ఏనాడూ సమీక్ష చేసిన దాఖలాలు లేవు. ఇలాంటి పరిస్థితుల నడుమ ఈ ఏడాది ఆధునికీకరణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు ఇంకా అమోదానికి నోచుకోలేదు. దీంతో ఈ పనులపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. రూ.136 కోట్లతో 167 పనులను చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొం దించిన జల వనరుల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. వీటికి జనవరి నెలలోనే అమోదం లభించి, టెండర్లు పూర్తవ్వాల్సి ఉంది. అలా జరిగి తేనే కాలువలు మూసివేసిన వెంటనే పనులు ప్రారంభించే అవకాశం ఉండేది. ఈ నెలాఖరు నాటికి కాలు వలు మూసివేసేందుకు యంత్రాంగం నిర్ణయించగా, ఆధునికీకరణ పనుల ప్రతిపాదనలకు ఆమోదం రాలేదు. ఫలితంగా టెండర్లు పిలిచే అవకా శం లేకుం డాపోయింది. ఇప్పటికప్పుడు ప్రభుత్వం ఆమోదం తెలిపినా.. టెండర్లు ఖరారయ్యేందుకు నెల రోజులు పడుతుంది. ఒకవేళ రానున్న రోజుల్లో ఆమోదం లభించినా ఆదరాబాదరాగా పనులు చేపట్టి తూతూమంత్రంగా ముగించే ప్రమాదం ఉంది. గత ఏడాది రూ.72 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలవగా.. అప్పట్లో పనులు చేపట్టలేదు. ఈ ఏడాది ఆ పనులతో సరిపెట్టే అవకాశం కనపడుతోంది. రూ.1,300 కోట్లతో డెల్టా ఆధునికీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించినప్పటికీ ఇప్పటివరకూ రూ.700 కోట్ల విలువైన పనులు కూడా పూర్తికాలేదు. 2012లో దీర్ఘవిరామం (లాంగ్ క్లోజర్) సమయంలో మాత్రమే ఓ మాదిరిగా పనులు జరిగాయి. తర్వాత ఏటా మొక్కుబడి పనులతో సరిపెడుతూ వస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకూ రూ.112 కోట్ల విలువైన పనులు మాత్రమే చేశారు. పంట కాలువలు పూడుకుపోవడంతో చిన్నపాటి వర్షం కురిసినా పొలాలు ముంపునకు గురవుతున్నాయి. సాధారణ రోజుల్లో మాత్రం పంట కాలువల్లో నీరు పారక వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. 2015లో డిసెంబర్లో కురిసిన చిన్నపాటి వర్షాలకు 1.32 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. 2016లోనూ వర్షాలకు నారుమడులన్నీ నీట మునిగి రైతులు ఇబ్బందులు పడ్డారు. కాలువల ఆధునికీకరణ జరగకపోవడం వల్ల ఖరీఫ్తోపాటు రబీలోనూ నీటి సమస్యతో రైతులు కష్టాలు పడుతున్నారు. గడచిన రెండేళ్లలో అయిల్ ఇంజిన్లు, నీటి మోటార్లు ఉపయోగించకుండా రైతులు పంట పండించలేని పరిస్థితి ఏర్పడింది. -
కాలువలకు నీటి విడుదల పెంపు
కొవ్వూరు : పశ్చిమ డెల్టాకు నీటి విడుదలను స్వల్పంగా పెంచారు. ఈనెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 3,540 క్యూసెక్కుల చొప్పున 130 డ్యూటీలో సరఫరా చేస్తున్నారు. ‘వంతు తంతు’ శీర్షికను శివారు ప్రాంత రైతుల ఇబ్బందులపై ‘సాక్షి’లో శనివారం ప్రచురిం చిన కథనానికి అధికారులు స్పందించారు. పశ్చిమ డెల్టాకు 3,830 క్యూసెక్కులకు పెంచి 120 డ్యూటీలో సాగునీరు విడుదల చేస్తున్నారు. జిల్లాలో ఇతర కాలువలకు సైతం నీటి విడుదలను పెంచారు. నరసాపురం కాలువకు 1,437, ఉండి కాలువకు 959, జీ అండ్ వీకి 455, ఏలూరు కాలువకు 539, అత్తిలి కాలువకు 295 క్యూసెక్కుల చొప్పున సాగునీరు అందిస్తున్నారు. ఇప్పటికే ఫాండ్ లెవెల్ తగ్గడం, గోదావరి నదికి నీటి లభ్యత తగ్గిన నేపథ్యంలో నీటి పొదుపు చర్యలు పాటించాలని నీటిపారుదల శాఖ అధికారులు దిగువ స్థాయి సిబ్బందికి రాతపూర్వక ఆదేశాలు జారీ చేశారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఫాండ్ లెవెల్ మూడురోజుల నుంచి 13.38 మీటర్లు వద్ద నిలకడగా ఉంటుంది. దీంతో అప్రమత్తమైన నీటి పారుదలశాఖ అధికారులు ఆదివారం నుం చి వంతుల వారీ విధానం అమలు చేయనున్నారు. ఈనెల 27వ తేదీ ఉదయం వరకు మొదటి వంతు ప్రాంతంలో ఉన్న ఆయకట్టుకు సాగునీరు అందిస్తారు. 27వ తేదీ సాయంత్రం నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు రెండో వంతు ప్రాంతంలోని ఆయకట్టు భూములకు సాగునీరు అందిస్తారు. -
డెల్టా గుండెలపై ’షేల్’ కుంపటి
ప్రకంపనలు సృష్టిస్తున్న చమురు, గ్యాస్ వెలికితీత నిర్ణయం రాతి పొరల నుంచి తీయడం వల్ల పంటలు, పర్యావరణం దెబ్బతింటాయని ఆందోళన హైడ్రో ప్రాక్చరింగ్ విధానం వల్ల ముప్పు తప్పదంటున్న నిపుణులు ఓఎన్జీసీ నిర్ణయానికి వ్యతిరేకంగా నేడు భీమవరంలో భారీ సభ భీమవరం : డెల్టా ప్రాంతంలోని పచ్చటి పొలాలు, గ్రామాల మధ్య రాతి పొరల అడుగున నిక్షిప్తమై ఉన్న చమురు, సహజ వాయు నిక్షేపాలను (షేల్ గ్యాస్) వెలికి తీయాలనే ఓఎన్జీసీ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాతి పొరల మధ్య నుంచి హైడ్రో ఫ్రాక్చరింగ్ విధానంలో ఈ నిక్షేపాలను వెలికి తీయడం వల్ల పంటలతోపాటు పర్యావరణం దెబ్బతింటోందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రజా సంఘాలు ఉద్యమబాట పట్టాయి. నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉ«భయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 4,320 చదరపు మైళ్ల విస్తీర్ణంలో షేల్ రాతి పొర విస్తరించి ఉందనేది నిపుణుల అంచనా. ఆ పొర దిగువ నుంచి గ్యాస్, చమురు నిక్షేపాలను వెలికి తీయడానికి హైడ్రో ఫ్రాక్చరింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తారు. జిల్లాలోని వీరవాసరం మండలం అండలూరు, కాళ్ల మండలంలోని కోలనపల్లి గ్రామాల్లో 4 వేల మీటర్ల దిగువన రాతి పొరను తవ్వి నిక్షేపాలను వెలికితీయాలనేది ఓఎన్జీసీ ప్రణాళిక. రాతి పొరల దిగువకు గొట్టాలను అమర్చి నీరు, ఇసుక వంటి 700 రకాల రసాయనాలను విపరీతమైన పీడనంతో పంపిస్తారు. ఈ చర్యల వల్ల పర్యావరణానికి పెను ముప్పు ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల అతి ప్రమాదకరమైన మీథేన్ వాయువు లీకైతే గ్రామాలు మొత్తం ఖాళీ చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. అమెరికాతోపాటు జర్మనీ, స్కాట్లాండ్, ఫ్రాన్స్, బల్గేరియా, రుమేనియా వంటి దేశాలు షేల్ గ్యాస్ నిక్షేపాల వెలికితీతను నిషేధించాయి. ఎటువంటి నియంత్రణా విధానాలు లేని మన దేశంలో షేల్ గ్యాస్ తవ్వకం ప్రమాదాలకు దారితీస్తుందనేది నిపుణుల వాదన. ఇప్పటికే పరిశ్రమల కారణంగా డెల్టా ప్రాంతం కాలుష్యం బారినపడి ప్రమాదకర స్థితికి చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో షేల్ గ్యాస్ వెలికితీత కార్యకలాపాలు చేపడితే ఈ ప్రాంతంలోని పంటలు, పర్యావరణం పూర్తిగా దెబ్బతింటాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. 8 నెలల క్రితమే రంగం సిద్ధం షేల్ గ్యాస్ వెలికితీసేందుకు నిర్ణయించిన ఓఎన్జీసీ ఇక్కడి ప్రజల అభిప్రాయాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదనేది ప్రజా సంఘాల వాదన. వెలికితీత చేపట్టే గ్రామాల్లోని ప్రజలకు కనీసం సమాచారం ఇవ్వలేదు. ఇదిలావుంటే.. వీరవాసరం మండలం అండలూరు, కాళ్ల మండలం కోలనపల్లి గ్రామాల్లో షేల్ గ్యాస్ వెలికితీసేందుకు ఓఎన్జీసీ అధికారులు 8 నెలల క్రితమే రంగం సిద్ధం చేశారు. అండలూరులో బోరుబావి తవ్వడానికి అనుకూలంగా కాంక్రీటుతో దిమ్మెలు నిర్మించి ఆ ప్రాంతం చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ఈ ప్రాజెక్ట్ విషయమై గ్రామస్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. నేడు మూడు జిల్లాల సదస్సు ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో చేపట్టే షేల్ గ్యాస్ వెలికితీత కార్యకలాపాలపై ఆదివారం భీమవరంలో మూడు జిల్లాల స్థాయిలో సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. డిసెంబర్లో భీమవరంలో విస్తృతమైన పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా షేల్ గ్యాస్ వెలికితీతను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుని తీరతామని పలు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు హెచ్చరించారు. అనంతరం ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో సీపీఐ ఆధ్వర్యంలో షేల్గ్యాస్ తవ్వకాలకు వ్యతిరేకంగా భీమవరం సదస్సు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ భీమవరం, నరసాపురం నియోజకవర్గాల ప్రజలు ఉద్యమ బాట పట్టారు. డెల్టా గుండెలపై ’షేల్’ కుంపటి రగిల్చేందుకు సాగుతున్న ఏర్పాట్లపై ఆక్వా పార్క్ వ్యతిరేక ఉద్యమం తరహాలో మరో పోరాటం చేపట్టేందుకు ప్రజా సంఘాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. -
పశ్చిమ డెల్టాకు 4 వేల క్యూసెక్కులు
కొవ్వూరు : పశ్చిమ డెల్టా కాలువకు 4 వేల క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నట్టు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. గోదావరి ఇన్ఫ్లో కనిష్టస్థాయికి పడిపోయింది. సోమవారం 14,129 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో వస్తుంటే ఉభయ గోదావరి జిల్లాలోని మూడు డెల్టాలకు 6,700 క్యూసెక్కులు విడిచిపెడుతున్నారు. మిగిలిన 7,429 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఏలూరు కాలువకు 695, ఉండి కాలువకు 1,149, నరసాపురం కాలువకు 1,604, జీ అండ్ వీకి 332, అత్తిలి కాలువకి 284 క్యూసెక్కుల చొప్పున సాగునీరు సరఫరా చేస్తున్నారు. -
ఏదీ.. ఆ భరోసా
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పాలనారంగ చరిత్రలో ఆయనది చెరగని సంతకం. ఆయన సాగించిన అభివృద్ధి.. ప్రజాసంక్షేమ ప్రస్థానం మరువలేని జ్ఞాపకం. ఆ మహానేత మరణించి ఏడేళ్లు గడచినా.. జిల్లా ప్రజలు ఆయనకు గుండెల్లో గుడికట్టి నేటికీ పూజిస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా మన జిల్లాపై ఎనలేని మమకారం చూపించేవారు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే రైతన్నకు భరోసా ఉంటుందని నమ్మారు. దాని కోసం ఆయన తపించారు. జలయజ్ఞంలో భాగంగా అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. డెల్టాను ఆధునికీకరించడం ద్వారా లక్షలాది ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని ఆకాంక్షించారు. దానికోసం ఆగమేఘాలపై పనులు ప్రారంభించారు. వైఎస్ మరణంతో ఆ పనులు మూలనపడ్డాయి. తర్వాత పాలకులు డెల్టా ఆధునికీకరణపై దృష్టి పెట్టలేదు. కనీసం నిర్వహణ పనులు కూడా సక్రమంగా జరగకపోవడం డెల్టా రైతులకు శాపంగా మారింది. ఈ ఏడాది గోదావరిలో నీరున్నా డెల్టాలో పంటలు ఎండిపోయే దుస్థితి దాపురించింది. రైతు బాంధవుడిగా.. రైతుల మోములో చిరునవ్వు చూడాలన్న సంకల్పంతో మెట్ట, ఏజెన్సీ ప్రాంత రైతులకు ఉచిత విద్యుత్ అందించడమే కాకుండా ఒకే దఫాలో రైతు రుణాలు మాఫీ చేసిన రైతు బాంధవుడిగా అన్నదాతలంతా ఆయనను నేటికీ కొలుస్తూనే ఉన్నారు. ఆయన మరణానంతరం రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రెండు దఫాల్లో ఇచ్చిన సొమ్ము వడ్డీకి కూడా సరిపోని పరిస్థితి ఉండగా, రైతులకు కొత్తగా రుణాలు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ౖÐð ఎస్ ఏ వర్గం ప్రజలనూ విస్మరించలేదు. ఆరోగ్యశ్రీ పథకంతో వేలాది మందికి పునర్జన్మ ప్రసాదించారు. వైద్యం అందక పేద, మధ్య తరగతికి చెం దిన ఏ ఒక్కరూ మృత్యువాత పడకూడదనే సంకల్పంతో అన్ని వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చారు. వైఎస్ మృతి చెందాక ఆ పథకాన్ని పాల కులు నిర్వీర్యం చేశారు. పథకం పేరు మార్చి అందులో సగానికి పైగా వ్యాధులను తొలగించడంతో ప్రజలకు అందుబాటులో లేకుండాపోయింది. గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు, ఉచితంగా మందులు అందించే 104 పథకం మూలనపడింది. ఫీజు రీయింబర్స్మెంట్తో విద్యార్థులకు మంచి భవిష్యత్ను అందించారు. జిల్లాలో వేలాది పేద విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్తో చదువుకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఈ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం నీరుగార్చింది. దీంతె పేద విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి. వైఎస్హయాంలో జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఒకదానితో ఒకటి పోటీపడి పరుగులు తీశాయి. నిత్య సమీక్షలతో సంక్షేమ ప్రగతిని సామాన్యులకు అందించేందుకు అధికారులను అప్రమత్తం చేశారు. పింఛన్లు, అభయహస్తం, పావలా వడ్డీ పథకం ఏదైనా ప్రస్తుతం నిధుల లేమితో చతికిలపడింది. వీటిలో కొన్నింటికి పేరు మార్చగా, మిగిలిన వాటిని నిధుల లేమి వెంటాడుతోంది. మహిళలకు పావలా వడ్డీకే రుణాలు అందించి వారి కుటుంబాల్లో వైఎస్ వెలుగు నింపితే.. ఇప్పటి ప్రభుత్వం రుణాల మాఫీ పేరుతో డ్వాక్రా మహిళలను డిఫాల్టర్లుగా మార్చిం ది. జీవితంలో ఎప్పుడూ వారికి రుణాలందకుండా చేసింది. చంద్రబాబుకు ఓటు వేసిన పాపానికి డ్వాక్రా మహిళలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. -
కరువు సీమగా డెల్టా
ఇలాంటి పరిస్థితి దురదృష్టకరం ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది తార్కాణం రైతులతో మాట్లాడిన వైఎస్సార్ సీపీ నేత ఎంవీఎస్ నాగిరెడ్డి తెనాలి/ చుండూరు: కృష్ణా పశ్చిమ డెల్టాలో మాగాణి భూముల్లో వరిసాగుకు అన్నదాతలు పడుతున్న అవస్థలు వైఎస్సార్సీపీ రైతువిభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ నాగిరెడ్డిని కదిలించాయి. కరువుసీమ అనంతపురంలో కనిపించే దృశ్యాలను సస్యశ్యామలమైన డెల్టాలో వీక్షించాల్సి రావటం రైతుల దురదృష్టకరమనీ, ప్రభుత్వం నిర్లక్ష్యానికి ఇంతకు మించిన తార్కాణం మరొకటి లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. వరిసాగు సంక్షోభంలో ఉన్న పశ్చిమడెల్టా పరిధిలోని వేమూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ రైతువిభాగం బృందం మంగళవారం పర్యటించింది. పార్టీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మేరుగ నాగార్జున, రైతువిభాగం రాష్ట్ర కార్యదర్శి తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, యలవర్తి నాగభూషణం, పార్టీ నేతల బృందం మంగళశారం ఉదయం తెనాలి నుంచి బయలుదేరి వేమూరు నియోజకవర్గం చుండూరు మండలంలోని మోదుకూరును సందర్శించింది. అక్కడి టీఎస్ చానల్కు విడుదల చేస్తున్న సాగునీరు దిగువ ప్రాంతాలకు చేరటం లేదు. దీంతో ఆ ప్రాంతం రైతాంగం టీఎస్ ఛానల్ నుంచి ఆయిల్ ఇంజిన్లతో నీటిని తోడి బ్రాంచి కాలువలకు మళ్లిస్తున్నారు. నెం.2, నెం.3 బ్రాంచి కాలువల్లో ఇదే తరహాలో ఏడు నుంచి పది వరకు ఆయిల్ ఇంజిన్లను వినియోగిస్తూ బ్రాంచి కాలువలకు నీరు మళ్లించటాన్ని, అక్కడ్నుంచి మళ్లీ ఇంజిన్లతో పంటపొలాలకు కిలోమీటర్ల లెక్కన తరలిస్తుండటాన్ని ప్రత్యక్షంగా చూశారు. గ్రామానికి చెందిన రైతు గోగిరెడ్డి బాపిరెడ్డికి చెందిన ఎండిపోతున్న అయిదెకరాల వెదసాగు పొలానికి వెళ్లి, రైతు దుస్థితిని అడిగి తెలుసుకున్నారు. -
కన్నీటి సీమ
– సాగర్కు 8 టీఎంసీలు తరలించేందుకు అనుమతి – మాట తప్పిన ముఖ్యమంత్రి – కృష్ణా పుష్కరాల్లో నీటి ఇక్కట్లే.. – సాగు, తాగునీటిపైనా ప్రభావం నాడు.. కృష్ణా డెల్టాకు పట్టిసీమ నుంచి గోదావరి జలాలు ఇస్తున్నాం. రాయలసీమకు కష్ణా జలాలు ఇస్తాం. – కర్నూలు కలెక్టరేట్లో సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు హామీ నేడు.. కృష్ణా డెల్టాలో తాగునీటి సమస్య సాకుతో కృష్ణా జలాల తరలింపునకు అదే సీఎం ఆదేశం. పట్టిసీమతో సీమకు ఒరిగేదేమీ లేదని తేలిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మాటల్లో నిజాయితీ నేతిబీర చందం అనే విషయం తేట తెల్లమయింది. ఇన్నాళ్లు ఆ ప్రాజెక్టు పేరుతో చేస్తున్న ప్రచారంలోని అసలు రంగు బయటపడింది. కష్ణమ్మ సాక్షిగా.. సీమను మోసగించేందుకు ప్రభుత్వం సమాయత్తమయింది. కర్నూలు(సిటీ): శ్రీశైలం జలాశయంలోకి ఇప్పుడిప్పుడే వచ్చి చేరుతున్న నీటిని తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామం రాయలసీమపై ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి జలాశయం శ్రీశైలం ప్రాజెక్టుకు గత ఏడాది నుంచి ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో కనీస నీటిమట్టం(854 అడుగులు) చేరుకోలేకపోయింది. ఈ కారణంగా రాయలసీమకు సాగునీరు అందించే ప్రాజెక్టులకు చుక్కనీరు అందక లక్షలాది ఎకరాల భూమి బీడువారింది. గుక్కెడు తాగునీటి కోసం జిల్లా ప్రజలు చుక్కలు చూడాల్సి వచ్చింది. గత ఏడాది జూన్ 18, 19 తేదీల్లో నిర్వహించిన కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశంలో నీటి పంపకాల సందర్భంగా శ్రీశైలంప్రాజెక్టులో నీటిని దిగువనున్న ప్రాంతాల అవసరాల దష్ట్యా 790 అడుగుల వరకు తరలించవచ్చని ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. ఇందులో భాగంగానే శ్రీశైలం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 788 అడుగుల వరకు నీటిని తరలించారు. ఈ ఏడాది కష్ణా పరీవాహక ప్రాంతంలో ఎగువన కురిసిన వర్షాల వల్ల ప్రాజెక్టులు నిండటంతో ఇప్పుడిప్పుడే నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతుంది. 23 టీఎంసీల నుంచి 32 టీఎంసీలకు చేరుకుంటున్న తరుణంతో మరోసారి రాయలసీమను మోసగిస్తూ తెలంగాణ, కష్ణా డెల్టాలకు ఏపీ ప్రభుత్వం 8 టీఎంసీల నీటి తరలింపునకు కృష్ణా యాజమాన్య బోర్డు అనుమతి తీసుకుంది. ఫలితంగా డ్యాంలో నీటి మట్టం 790 అడుగుల దిగువకు పడిపోనుంది. ప్రభుత్వ నిర్ణయంతో సీమకు ఈ ఏడాది కూడా సాగు, తాగునీరు అందడం అనుమానమేననే విషయం అర్థమవుతోంది. జిల్లాలో నాలుగున్నర లక్షల ఎకరాల ఆయకట్టు సాగు ప్రశ్నార్థకం కానుంది. పుష్కరాలకు బురదనీరే గతి.. కృష్ణా పుష్కరాలకు సమయం దగ్గర పడుతోంది. వచ్చే నెల 12 నుంచి మొదలు కానున్న ఈ వేడుక నాటికి కృష్ణా నదిలో నీరు ఉంటుందో, లేదోననే అనుమానం కలుగుతోంది. ప్రభుత్వ చర్యలతోనే ఈ పరిస్థితి తలెత్తుతోంది. ఇప్పుడిప్పుడే జలాశయంలోకి వచ్చి చేరుతున్న నీటిని దిగువకు తరలిస్తే.. మిగిలిన బురద నీటిలోనే భక్తులు మునకలేయాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఈ పరిణామాన్ని చూస్తే రాయలసీమలో పుష్కరాల నిర్వహణ ప్రభుత్వానికి ఇష్టం లేదేమోననే అభిప్రాయానికి కారణమవుతోంది. -
ఏజెన్సీలో భారీ వర్షం - పొంగుతున్న కొండవాగులు
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో కొండవాగులు పొంగి పొర్లు తున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు డెల్టాకు 4800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 7.42 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వస్తుండగా.. ఔట్ ఫ్లో 7.38గా ఉంది. బ్యారేజీ వద్ద వరద నీరు 9.3 అడుగులకు చేరుకుంది. నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
పెరుగుతున్న గోదావరి వరద
ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండంతో.. ఆదివారం రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ఉదృతి పెరుగుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 5,81, 000 క్యూసెక్కులు ఉండగా..ఔట్ ఫ్లో 5,80,000 క్యూసెక్కులు ఉంది. నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉండటంతో.. అధికారులు డెల్టాకు నీటిని విడుదల చేశారు. బ్యారేజీ వద్ద నుంచి 6,300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశామని తెలిపారు. -
నీటి కష్టాలు.. తడిసిమోపెడు
గోదావరి డెల్టాలో రబీ వరి రైతుల నీటి కష్టాలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వరి చేలు పాలుపోసుకుంటున్నందున నీటి విడుదల పెంచాల్సి వస్తుంది. మరోవైపు ఎండలు పెరుగుతున్నందున ఆవిరయ్యే నీటి పరిమాణమూ పెరిగే అవకాశముండడంతో చేలకు తరచూ తడులు పెట్టాల్సి ఉంటుంది. ఈ సమయంలో సీలేరు నుంచి నీటి విడుదల క్రమంగా తగ్గుతుండడం రైతులను, అధికారులను కలవరానికి గురి చేస్తోంది. అమలాపురం : ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం క్రమేపీ తగ్గుముఖం పడుతోంది. మూడు రోజుల క్రితం 8,350 క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో శుక్రవారం సాయంత్రానికి 7,850 పడిపోయింది. దీనితో మూడు డెల్టాలకు నీటి విడుదలను తగ్గించారు. తూరుడెల్టాకు 2,500 క్యూసెక్కుల నుంచి 2,300కు, మధ్యడెల్టాకు 1,600 నుంచి 1,500కు, పశ్చిమ డెల్టాకు 4,250 నుంచి 4,050కి తగ్గించారు. అయితే ముందు ముందు నీటి రాక మరింత పడిపోయే ప్రమాదముంది. ఈనెల 20 నుంచి సీలేరు నుంచి వచ్చే నీటి పరిమాణం తగ్గుతోంది. వేసవి అవసరాల దృష్ట్యా ఏప్రిల్, మే నెలల్లో విద్యుత్ ఉత్పత్తి కోసం సీలేరు ప్రాజెక్టు అధికారులు ముందస్తు జాగ్రత్త తీసుకోవడంతో నీటి విడుదల ఇంతకన్నా పెరిగే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడున్న ఇన్ఫ్లోలో సీలేరు వాటా తీసివేయగా సహజ జలాలు బాగా తక్కువ కావడగం గమనార్హం. నీటి రాక తగ్గితే సాగునీటి ఇక్కట్లు పెరిగే అవకాశముంది. తగు ప్రణాళిక లేకుంటే నష్టమే.. తూర్పు, మధ్యడెల్టాలతోపాటు పిఠాపురం బ్రాంచ్ కెనాల్ ఎగువ ప్రాంతాల్లో వరి చేలు పాలు పోసుకుంటున్నాయి. మధ్య, శివారు ప్రాంతాల్లో మరో పదిపదిహేను రోజుల్లో పాలుపోసుకునే దశకు వస్తాయి. ఈ సమయంలో చేలల్లో నీటిని 5 సెంటీమీటర్ల చొప్పున ఉంచుతారు. దీని వల్ల నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం డెల్టా ప్రధాన పంటకాలువలకు 110 డ్యూటీ (ఒక క్యూసెక్కు 110 ఎకరాలకు చొప్పున) విడుదల చేస్తున్నారు. పాలుపోసుకునే దశలో కనీసం 90 డ్యూటీ చొప్పున విడుదల చేయకుంటే శివారు చేలకు నీరందదు. ఇప్పటికే శివారుల్లో చేలు ఎండిపోయే దుస్థితి నెలకొంది. పాలుపోసుకునే దశలో ఆశించిన స్థాయిలో నీరందించకుంటే ధాన్యం గింజల్లో తాలుతప్పలు ఎక్కువగా వచ్చే అవకాశమున్నందున రైతులు దిగుబడిని కోల్పోయే ప్రమాదముంది. ఇప్పుడు డెల్టా కాలువలకు ఇస్తున్న 7,850 క్యూసెక్కులను కనీసం 10 వేలకు పెంచకుంటే రైతులు నీటి కోసం మరిన్ని పాట్లు పడాల్సి వస్తుంది. డెల్టాలో మూడు దశల్లో రబీ సాగు జరుగుతున్నందున రోజుకు 9 వేల నుంచి 10 వేల క్యూసెక్కుల మధ్య నెల రోజుల పాటు అందించాల్సి ఉంటుంది. పోనీ బ్యారేజ్ వద్ద నిల్వ ఉన్న నీటిని ఇస్తారా అంటే అక్కడ పాండ్ లెవెల్ తగ్గడం అధికారులను కూడా కలవరపరుస్తోంది. బుధవారం సాయంత్రానికి పాండ్ లెవిల్ 13.10 మీటర్ల నుంచి 13.05 మీటర్లకు పడిపోయింది. శుక్రవారం సాయంత్రానికి ఇది 13.01కి తగ్గడం మరింత ఆందోళన కలిగిస్తోంది. పాండ్ లెవెల్ 12.05కు తగ్గితే పరిస్థితి మరింత దిగజారుతుంది. పాండ్ లెవెల్ తగ్గితే విడుదల చేసిన నీటిలో గ్రావిటీ తగ్గి శివారుకు చేరడం ఆలస్యమవుతుంది. సీలేరు నుంచి వచ్చే నీటిని పెంచడంతోపాటు సమర్థమెన నీటి యాజమాన్య పద్ధతులు పాటించకుంటే రబీలో డెల్టా రైతులు నష్టపోయే ప్రమాదముంది. అలాగే మార్చి 31 తరువాత కూడా నీటి సరఫరా చేయాల్సి ఉన్నందున తగు ప్రణాళిక సిద్ధం చేయకున్నా ఇదే పరిస్థితి నెలకొంటుంది. సీలేరు నుంచి నీటి విడుదల ఇలా (క్యూసెక్కుల్లో) 18వ తేదీ : 5,219 19వ తేదీ : 4,930 20వ తేదీ : 5,900 21వ తేదీ : 4,300 22వ తేదీ : 3,800 23వ తేదీ : 3,975 24వ తేదీ : 4,113 25వ తేదీ : 4,100 26వ తేదీ : 4,031.62 -
డెల్టా.. ఉల్టా
ఏలూరు :డెల్టా ఆధునికీకరణ పనులు పల్టీలు కొడుతూనే ఉన్నారుు. దశా దిశా లేకపోవడంతో 2009 నుంచి పనులు పట్టాలెక్కడం లేదు. ఈ విషయంలో టీడీపీ సర్కారు సైతం మన్నుతిన్న పాములానే వ్యవహరిస్తోందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రానున్న ఆర్థిక సంవత్సరంలోనూ అరకొరగానే పనులు చేపట్టేందుకు ప్రతిపాదించారు. రబీ సీజన్ ముగిశాక కాలువలు కట్టివేసే షార్ట్ క్లోజర్ పీరి యడ్లో ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు రూ.39 కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు ఇరిగేషన్ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈసారి ఎక్కువ రోజులు కాలువలు కట్టివేసి (లాంగ్ క్లోజర్ పాటించి) పెద్దఎత్తున పనులు చేయూలని నీటి పారుదల శాఖ అధికారులు భావించారు. రైతులు కూడా ఇదే ఆశతో ఉన్నారు. అరుుతే, సర్కారు ఇందుకు విరుద్ధంగా ముందుకు వెళుతోంది. డెల్టా ఆధునికీకరణ ప్రాజెక్ట్లో భాగంగా ఇంకా రూ.800 కోట్ల విలువైన పనులను చేపట్టాల్సి ఉండగా, కేవలం రూ.39 కోట్ల విలువైన పనులు మాత్రమే చేపట్టేందుకు నిర్ణరుుంచడాన్ని చూస్తే సర్కారు ఎంత ఉదాసీనంగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. షార్ట్ క్లోజర్లో చేపట్టే పనులివే.. అత్తిలి కెనాల్ పరిధిలో రూ.3 కోట్లు, గోస్తనీ-వేల్పూరు (జీ అండ్ వీ) కాలువ అభివృద్ధికి రూ.8.95 కోట్లు, కాకరపర్రు మెయిన్ కెనాల్ ఆదునికీకరణకు రూ.7 కోట్లు, ఉండి మెయిన్ కాలువ అభివృద్ధికి రూ.8.30 కోట్లు వెచ్చించాలని నిర్ణరుుంచారు. వీడబ్ల్యు కెనాల్ ఆదునికీకరణకు రూ.4 కోట్లు, నరసాపురం మెయిన్ కెనాల్ అభివృద్ధికి రూ.2.50 కోట్లు, బ్యాంక్ కెనాల్ అభివృద్ధికి రూ.50 లక్షలు, కాకరపర్రు డ్రెయిన్ ఆధునికీకరణకు రూ.3.50 కోట్లు, యనమదుర్రు డ్రెయిన్ అభివృద్ధికి రూ.1.25 కోట్లు వెచ్చించేందుకు నీటి పారుదల శాఖ ప్రణాళిక రూపొందించింది. గతేడాది చేపట్టిన రూ.150 కోట్ల విలువైన పనుల్లో పూర్తికాని వాటినే ఇప్పుడు తిరిగి ప్రారంభిస్తున్నట్టు సమాచారం. పనుల పూర్తిపై మీనమేషాలు జిల్లాలో ప్రోగ్రెసివ్ కనస్ట్రక్షన్స్ లిమిటెడ్ చేపట్టిన రూ.130.30 కోట్ల విలువైన జీడబ్ల్యు, ఏలూరు, జంక్షన్ కాలువల ఆధునికీకరణ పనుల్లో 10 శాతం కూడా పూర్తి కాలేదు. రూ.134 కోట్లతో ఐవీఆర్సీఎల్ లిమిటెడ్ చేపట్టిన నరసాపురం కాలువ పనుల్లో 25 శాతం, రూ.111.65 కోట్లతో చేపట్టిన యనమదుర్రు డ్రెయిన్ ఆధునికీకరణ పనుల్లో 30 శాతం మాత్రమే పూర్తయ్యూరుు. ఈ పరిస్థితుల్లో మొత్తం మీద రూ.300 కోట్ల విలువైన పనులను రద్దు చేయాలని ప్రభుత్వానికి అధికారులు నివేదిక సమర్పించారు. నిపుణుల కమిటీ నివేదికపై స్పందించని సర్కారు ఆధునికీకరణ పనుల్లో లోపాలను పరిశీలించి సల హాలు ఇచ్చేందుకు రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ డాక్టర్ చెరుకూరు వీరయ్య ఆధ్వర్యంలో నీటి పారుదల శాఖ నిపుణుల బృందం కొద్దినెలల క్రితం డెల్టాలో పర్యటిం చింది. పనులను చిన్నచిన్న ప్యాకేజీలుగా విభజించాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో దాదాపు రూ.800 కోట్ల విలువైన పనులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. 2009 నుంచి నానుతూ వస్తున్న డెల్టా ఆధునికీకరణ పనులను వచ్చే ఆర్థిక సంవత్సరంలోనైనా పూర్తి చేసేందుకు సర్కారు సమగ్ర ప్రణాళిక ప్రకటించాలని ఇంజినీరింగ్ నిపుణులు సూచిస్తున్నారు. -
సమగ్ర సోమశిలే లక్ష్యం
సోమశిల: సోమశిల జలాశయం నుంచి రాష్ట్రమంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పొంగూరు నారాయణ డెల్టాకు శనివారం నీటిని విడుదల చేశారు. తొలుత జలాశయం వద్ద మంత్రితో కలిసి జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఎమ్మెల్యేలు మేకపాటి గౌతమ్రెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, బొల్లినేని రామారావు, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డితో పాటు అధికారులు క్రస్ట్గేట్ల వద్ద సంప్రదాయబద్ధంగా గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. అనంతరం పెన్నార్డెల్టాకు వాయునాలు చెల్లించి నీటి విడుదల ప్రక్రియను ప్రారంభించారు. డెల్టాకు వెయ్యి క్యూసెక్కులు, ఉత్తర కాలువకు 50 క్యూసెక్కులను లాంఛనంగా విడుదల చేశారు. డ్యామ్సైట్ ఆఫీస్లో మంత్రులు, ఎమ్మెల్యేలు,కలెక్టర్తో కలిసి దేవినేని ఉమ విలేకరుల సమావేశం నిర్వహించారు. మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ కృష్ణ, గోదావరి, పెన్నార్డెల్టాలలో పరిస్థితులను సమీక్షించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామన్నారు. వారు నవంబర్లో పరిశీలిస్తారన్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తయితే జిల్లాకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. అనంతపురం జిల్లాకు సాగు,తాగునీరు అందించేందుకు పూర్తి స్థాయిలో సమీక్షిస్తున్నామన్నారు. జలాశయం పరిధిలోని ఆయకట్టు రైతులు తమకు ఎక్కడ ఏ పని కావాలో అధికారులకు విన్నవిస్తే వెంటనే వాటిని పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. నిధులు విడుదల చేసే బాధ్యత తమదేనన్నారు. సమగ్ర సోమశిలకు ప్రధాన అడ్డంకిగా ఉన్న అటవీ అనుమతులపై ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షించి సాధించేందుకు కృషి చేస్తామన్నారు. హైలెవల్ కాలువకు కూడా మొదటి దశ పనులను త్వరలో ప్రారంభిస్తారన్నారు. దీంతో ఈ జిల్లాలో మెట్ట ప్రాంతాలకు సాగు, తాగునీరు అందేలా చర్యలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో ఎస్ఈలు సాబ్జాన్,కోటేశ్వరరావు, ఆర్డీఓ ఎంవీ రమణ పాల్గొన్నారు. రైతు ప్రయోజనాలే ముఖ్యం : మంత్రి దేవినేని ఉమా ఆత్మకూరు/సోమశిల: రాష్ట్రంలో రైతు ప్రయోజనాలే ముఖ్యమని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మం త్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం సోమశిల జలాలను విడుదల చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. గోదావరి,కృష్ణ, పెన్నా డెల్టా ప్రాజెక్ట్లను అభివృద్ధి చేసేందుకు చెరుకూరి వీరయ్య, రోశయ్య, సుబ్బారావులతో కూడిన ట్రిబ్యునల్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఏఎస్పేట మండలంలోని గుడిపాడు వరకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు. హుదూద్ తుపాను బాధితులకు జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ నారాయణ అమోఘమైన సేవలు అందించారని కొనియాడారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ ఐఏబీ సమావేశంలో నిర్ణయించిన మేరకు సాగునీటిని విడుదల చేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్, నీటిపారుదల శాఖలకు సంబంధించి ప్రతి రోజు అరగంట సేపు సమీక్ష సమావేశాలు నిర్వహించడం పరిపాటిగా చేస్తున్నారన్నారు. ఆ కృషి ఫలితంగానే ప్రస్తుతం జలాశయంలో 45 టీఎంసీల నీరు చేరిందన్నారు. భవిష్యత్లో జిల్లాలో సాగు,తాగునీటి సమస్యలు పరిష్కరించడంలో ముందుంటామన్నారు. ఈ ప్రాజెక్ట్ జాతికి అంకితం చేసి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డెల్టాకు, నాన్డెల్టాకు ఒకే పర్యాయం నీటి విడుదల చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర మాట్లాడుతూ ఈ జిల్లాలో కేవలం మూడు స్థానాల్లోనే టీడీపీ గెలవడంతో చంద్రబాబు దగ్గర పనులు చేయించుకునే సమయంలో డిమాండ్ చేయలేకపోతున్నామన్నారు. సమావేశంలో ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ గూటూరు మురళీ కన్నబాబు, తెలుగు రైతు సంఘం అధ్యక్షుడు రాపూరు సుందరరామిరెడ్డి, జెడ్పీ టీడీపీ ఫ్లోర్మెంబర్ వేనాటి రామచంద్రారెడ్డి, టీడీపీ గూడూరు నియోజకవర్గ ఇన్చార్జ్ జ్యోత్స్న, టీడీపీ నేతలు సడ్డా రవీంద్రారెడ్డి, ఇందూరు వెంకటరమణారెడ్డి, ఆరి కట్ల జనార్దన్నాయుడు పాల్గొన్నారు. -
ఆకలిదప్పులు.. ‘ముంపు’ తిప్పలు
- మూడు రోజులుగా ముంపులోనే.. - వరద తగ్గుముఖం పట్టినా తీరని కష్టాలు - పాశర్లపూడిలో ఒకరి మృతి - అప్పనపల్లి కాజ్వే వద్ద దేవస్థాన ఉద్యోగి గల్లంతు - బ్యారేజ్ నుంచి 14.15 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల - జల దిగ్బంధంలోనే లంక గ్రామాలు అమలాపురం : కనురెప్పల మాటున ఉప్పెనగా వచ్చి పడిన గోదావరి వరద లంకవాసులను ఇక్కట్ల పాల్జేస్తోంది. వరద తగ్గుతున్న కొద్దీ లంకవాసుల కష్టాలు రెట్టింపవుతున్నాయి. మూడు రోజులుగా ముంపు బారిన పడడంతో వారు పడుతున్న ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. ఏ లంక గ్రామం చూసి నా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు గోదావరి శాంతిస్తున్నా.. లంక గ్రామాలు జల దిగ్బంధంలోనే చిక్కుకుని ఉన్నాయి. వరదల వల్ల కోనసీమలో మురుగునీటి కాలువలు పొంగిపొర్లుతుండడంతో.. ఇక్కడ ముంపు తీవ్రత పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయానికి 14.70 అడుగులు నమోదు కాగా, బ్యారేజ్ నుంచి 14.15 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. భద్రాచలం వద్ద వరద ఉధృతి వేగంగా తగ్గడంతో బ్యారేజ్ వద్ద రాత్రి రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకునే అవకాశముంది. భద్రాచలం వద్ద వరద వేగంగా తగ్గుతున్నందున గురువారం ఉదయానికి తొలి ప్రమాద హెచ్చరికను సైతం ఉపసంహరించుకునే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని 75 లంక గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. బ్యారేజ్ ఎగువ ప్రాం తంలో ఉన్న దేవీపట్నం, సీతానగరం మండలాల్లోని లంకలతో పాటు రాజమండ్రి బ్రిడ్జి లంక, కేతావారి లంకల్లో ముంపు వీడుతోంది. అయినప్పుటికీ బాధితులు ఇంకా రాజమండ్రిలోనే తల దాచుకొంటున్నారు. బ్యారేజ్ దిగువన ఉన్న లం కల్లో మధ్యాహ్నం వరకు వరద ఉధృతి కని పించింది. మధ్యాహ్నం నుంచి ముంపు వీడుతోం ది. కోనసీమ లంకల్లో రెండు, మూడు అడుగుల మేర ముంపు తగ్గింది. పి.గన్నవరం, అయినవిల్లి, ముమ్మిడివరం, మామిడికుదురు, అల్లవరం మం డలాల్లో లంక గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. ముంపు కొద్దికొద్దిగా తగ్గుతున్నా.. ఇంకా ఇళ్లు, రోడ్లు, పొలాలు నీట మునిగే ఉన్నాయి. గురువారానికి కానీ లోతట్టు ప్రాంతాల్లోని లంకల్లో ముంపువీడే పరిస్థితి కనిపించడం లేదు. ఒకరి మృతి, మరొకరి గల్లంతు మామిడికుదురు మండలం పాశర్లపూడికి చెందిన బూల వెర్రియ్య(60) ఇంటి నుంచి బయటకొ స్తూ.. బుధవారం ముంపులో ఉన్న గోతిలో పడి చనిపోయాడు. ఇంటి చుట్టూ వరదనీరు చేరడం తో గొయ్యిని అతడు గుర్తించకపోవడంతో ఈ సం ఘటన జరిగింది. మామిడికుదురుకు చెందిన కాం డ్రేగుల శ్రీనివాస శాస్త్రి (50) అప్పనపల్లి కాజ్వే వద్ద వరద ఉధృతిలో గల్లంతయ్యాడు. విధులు ముగించుకుని వెళుతున్న అతడు పడవ అం దుబాటులో లేకపోవడంతో.. కాజ్వే మీదుగా నీటి లో దిగివెళుతూ కొట్టుకుపోయాడు. అలాగే మంగళవారం గల్లంతైన పి.గన్నవరం మండలం కె.ముం జవరానికి చెందిన చింతా కృష్ణమూర్తి ఆచూకీ లభ్యం కాలేదు. అతడి కుటుంబాన్ని ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి పరామర్శించారు. కలెక్టర్ నీతూ ప్రసాద్.. బుధవారం కూడా కోనసీమలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. క‘న్నీటి’ కాపురాలు మూడు రోజులుగా ముంపులో చిక్కుకోవడంతో గోదావరివాసులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. ముంపు మధ్యే లంకవాసులు కాలం వెళ్లదీస్తున్నారు. చుట్టూ నీరు ముంచెత్తడంతో.. గుక్కెడు నీటి కోసం తల్లడిల్లుతున్నారు. ముంపులో మునిగిన అనేక పూరిళ్లు కూలిపోయాయి. ముంపు బారి నుంచి ప్రాణాలతో ఒడ్డున పడ్డవారు ఏటిగట్లపై కొబ్బరి తడికెల మాటున కాలం వెళ్లదీస్తున్నారు. అనేక మంది తమ ఆస్తులకు రక్షణగా ఇళ్ల వద్దనే ఉండిపోయారు. పునరావాస కేంద్రాల్లో కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఎప్పుడు తమ ఇళ్లకు రెక్కలు కట్టుకుని వాలిపోదామా అని ఎదురు చూస్తున్నారు. అరకొర వసతుల మధ్య ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో బాధితులు అష్టకష్టాలు పడుతున్నారు. ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల చారుతో ఆకలి తీర్చుకుంటున్నారు. ఇళ్ల వద్ద ఉన్న వారి పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. నిత్యావసర వస్తువులు నిండుకోవడం, బయటకు వెళ్లి తెచ్చుకొనే దారిలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద నీటితో పాటు వచ్చిపడుతున్న విష సర్పాలను చూసి భయాందోళనకు గురవుతున్నారు. పాఠశాలలు మూతపడ్డాయి. బడులు పోతాయన్న ఉద్దేశంతో చిన్నారులు పడవలపై పాఠశాలలకు వెళుతున్నారు. నిన్నటి వరకు వాహనాల రాకపోకలతో సందడిగా ఉండే కాజ్వేలు, రోడ్లు ఇంకా ముంపులోనే ఉన్నాయి. వాటి మీదుగా పడవలతో రాకపోకలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రైతులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఒకవైపు పంట దెబ్బతింటుందన్న ఆందోళన, మరోవైపు మార్కెట్కు కూరగాయలు, పండ్లు పడవలపై తరలించేందుకు నానా ఇక్కట్లకు గురవుతున్నారు. డెల్టాలో పెరుగుతున్న ముంపు డెల్టాలో డ్రెయినేజీలను ఆనుకుని ఉన్న గ్రామాలు సైతం ముంపులో చిక్కుకున్నాయి. ముమ్మిడివరం మండలం అయినాపురం అవుట్ఫాల్ స్లూయిజ్ ధ్వంసం కావడంతో అయినాపురం, ముమ్మిడివ రం, సోమిదేవరపాలెంల్లో 1500 ఎకరాల్లోని వరి చేలు ముంపుబారిన పడ్డాయి. అమలాపురం మం డలం బండార్లంక అప్పర్ కౌశిక గట్టుపై నుంచి ముంపు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. గోరింకల అవుట్ఫాల్ స్లూయిజ్ షట్టర్లు సకాలంలో మూయక పోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. -
డెల్టాకు 3.5 టీఎంసీల నీరు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా డెల్టాకు నీటి విడుదల విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదం ముగిసింది. డెల్టా తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేయాల్సిందేనని కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు తాజాగా నిర్ణయించింది. రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున వారం పాటు నీటి విడుదలకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీన్ని అమలు చేయాలంటూ నాగార్జునసాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్కు సూచించింది. డెల్టాకు 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని రాష్ట్ర స్థాయి కమిటీ ఇంతకుముందు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు రంగంలోకి దిగింది. బోర్డు ఇన్చార్జ్గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ఎ.బి. పాండ్య ఇరు ప్రాంతాల అధికారులతో చర్చించారు. ఆయనే స్వయంగా నిర్ణయం తీసుకుని డెల్టాకు నీటిని విడుదల చేయాలని నాగార్జునసాగర్ చీఫ్ ఇంజనీర్కు సూచించారు. దీని ప్రకారం వారం రోజుల పాటు రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున సాగర్ నుంచి దిగువకు నీటిని విడుదల చేయాలి. ఇలా విడుదల చేసే జలాలు సుమారు 3.5 టీఎంసీల వరకు ఉండొచ్చని అంచనా. వారం తర్వాత ఆయన మళ్లీ ఇక్కడికి వచ్చి పరిస్థితిని సమీక్షించనున్నారు. సీడబ్ల్యూసీకి టీ-సర్కారు లేఖ బోర్డు నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం కూడా సాగుకూలంగా స్పందించింది. బోర్డు ఆదేశాలు వెలువడిన వెంటనే నీటి పారుదల మంత్రి హరీశ్రావు, ముఖ్య కార్యదర్శి అరవిందరెడ్డి, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్రావులు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. నీటి పరిమాణాన్ని 10 టీఎంసీల నుంచి 3.5 టీఎంసీలకు తగ్గించినందున నిర్ణయాన్ని అమలు చేయాల్సిందిగా ఆయన చెప్పినట్లు తెలిసింది. అయితే ఈ నీటిని కేవలం తాగునీటి కోసమే వాడుకునే విధంగా పర్యవేక్షించాలని సూచించినట్టు సమాచారం. ఈ మేరకు సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శి బి.అరవింద్రెడ్డి మంగళవారమే కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్కు లేఖ రాశారు. రాష్ర్ట స్థాయి కమిటీ ఇక లేనట్లే! బోర్డు రంగంలోకి దిగి బాధ్యతలను చేపట్టడంతో ప్రస్తుతమున్న రాష్ర్ట స్థాయి కమిటీ రద్దయినట్లేనని అధికారులు భావిస్తున్నారు. ఈ కమిటీలో రెండు రాష్ట్రాల కార్యదర్శులు, ఇంజనీర్లు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ నిర్ణయం ఇప్పటికే వివాదాస్పదమైనందున భవిష్యత్తులోనూ ఇదే పరిస్థితి ఎదురుకావచ్చని భావించిన కృష్ణా బోర్డు వెంటనే రంగంలోకి దిగి నిర్ణయం తీసుకున్నట్లు సాగునీటి వర్గాలు భావిస్తున్నాయి. కాగా ఈ వ్యవహారాన్ని ఇరు రాష్ట్రాలకూ గవర్నర్గా ఉన్న నరసింహన్ కూడా పర్యవేక్షించారు. బోర్డు నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మకు ఆయన తాజాగా సూచించారు.