Digital classes
-
కొండపర్తి దేశానికి రోల్మోడల్ కావాలి
సాక్షిప్రతినిధి, వరంగల్/ములుగు/ఎస్ఎస్ తాడ్వాయి: మారుమూలన ఉన్న ములుగు జిల్లాలోని కొండపర్తి గ్రామం అభివృద్ధిలో దేశానికి రోల్మోడల్ కావాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ ఆకాంక్షించారు. కొండపర్తిలో 70 గృహాలు 285 మంది ప్రజలు ఉన్నారని, చిన్న గ్రామమైన అభివృద్ధిలో ఆదర్శంగా నిలవాలని చెప్పారు. అటవీ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామంలో డిజిటల్ తరగతులు ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, విద్యార్థులు ఇంగ్లిష్ బాగా మాట్లాడుతున్నారంటూ, వారిని అభినందించారు. మంగళవారం ఎస్ఎస్ తాడ్వాయి మండల పరిధిలోని కొండపర్తిలో గవర్నర్ జిష్ణుదేవ్వర్మ పర్యటించారు. హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గాన కొండపర్తికి చేరుకున్న ఆయన.. తొలుత కొమురంభీం, బిర్సాముండ విగ్రహాలను, పాఠశాలలో డిజిటల్ తరగతులు, అంగన్వాడీ కేంద్రం, మసాలా, కుట్టు మెషీన్ యూనిట్లను ప్రారంభించారు. అనంతరం రిమోట్తో వ్యవసాయ మోటార్లు ప్రారంభించి కొండపర్తి గ్రామస్తులతో మాట్లాడారు.అక్కడి నుంచి నేరుగా మేడారం చేరుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమ్మక్క–సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అంతకుముందు కొండపర్తి, మేడారం ఆలయ ప్రాంగణంలో గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడు ఆదివాసీ గ్రామాలను దత్తత తీసుకున్నానని అందులో, కొండపర్తి కూడా ఉందని చెప్పారు. కొండపర్తిలో మహిళల ఆర్థికాభివృద్ధికి ఇంకా చిన్నచిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. స్వయం ఉపాధి యూనిట్ల ద్వారా ఆర్థికాభివృద్ధి సాధన జరుగుతుందన్నారు. గుజరాత్ రాష్ట్రంలో అమూల్ ఏవిధంగా ప్రసిద్ధిగాంచిందో, అదే తరహాలో కొండపర్తి కారం, పసుపు, మసాలా యూనిట్లకు అంతటి పేరు ప్రఖ్యాతులు సాధించాలని ఆకాంక్షించారు. ములుగు ప్రాంతంలో మిర్చి సాగు బాగుందని.. ఇక్కడి మిర్చి పౌడర్కు మంచి ఇమేజ్ రావాలని, తెలంగాణ వ్యాప్తంగా మిర్చి పౌడర్ బాగా ఫేమస్ కావాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వికసిత్ భారత్ సంకల్పానికి ఈ గ్రామం ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. తాను, రాష్ట్రపతి, రాష్ట్రమంత్రి సీతక్క అందరూ ఆదివాసీ బిడ్డలమని పేర్కొన్నారు. ములుగు జిల్లాలో పర్యటించిన గవర్నర్కు రాష్ట్ర మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ డాక్టర్ పి.శబరిశ్, ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ తదితరులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో గవర్నర్ కార్యాలయ ప్రధాన కార్యదర్శి దానకిషోర్, సంయుక్త కార్యదర్శి భవానిశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల చేరికల్లో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి : విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. 2021 విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో స్థూల నమోదు నిష్పత్తి (పిల్లలు చేరికలు)లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండడమే ఇందుకు నిదర్శనం. ఈ విషయాన్ని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2017తో పోలిస్తే 2021లో దేశంలోని స్థూల నమోదు నిష్పత్తి పెరిగిన టాప్– రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో ఉందని ఆ నివేదిక తెలిపింది. అలాగే, 2021లో జాతీయ స్థూల నమోదును మించి ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక స్థూల నమోదు ఉందని కూడా పేర్కొంది. 2017తో పోలిస్తే.. 2021లో రాష్ట్రంలో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ఎలిమెంటరీ స్థాయిలో స్థూల నమోదు నిష్పత్తి భారీగా పెరిగిందని కూడా నివేదిక తెలిపింది. ‘అమ్మఒడి’ ప్రోత్సాహంతోనే.. అలాగే, స్థూల నమోదు నిష్పత్తిలో టాప్ నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తరువాత ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఉండగా.. స్థూల నమోదు 2017తో పోలిస్తే 2021లో తగ్గిన నాలుగు రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్, గోవా, జార్ఖండ్, బీహార్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2017తో పోలిస్తే 2021లో ప్రైమరీలో 18.4 శాతం, అప్పర్ ప్రైమరీలో 13.4 శాతం, ఎలిమెంటరీలో 16.5 శాతం స్థూల నమోదు పెరిగినట్లు నివేదిక తెలిపింది. ఇందుకు ప్రధాన కారణం బడి ఈడు పిల్లలందరూ బడుల్లోనే ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. అన్ని వర్గాల్లోని పేదల తల్లిదండ్రులకు తమ పిల్లల చదువులు భారం కాకూడదనే దూరదృష్టితో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న అమ్మఒడి పథకం అమలుచేస్తోంది. ఈ పథకం అమలు ద్వారా పేద వర్గాల పిల్లలందరూ స్కూళ్లలో చేరేలా ప్రోత్సాహం అందిస్తోంది. నిజానికి.. పేదలు పిల్లలను బడికి పంపకుండా పనికి పంపిస్తే తమకు ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలుస్తారనే ఆలోచనలో వారుండే వారు. అయితే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగనన్న అమ్మఒడి ద్వారా పిల్లలను స్కూళ్లకు పంపితే ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. దీంతో అన్ని వర్గాల్లోని పేదలు తమ పిల్లలను స్కూళ్లకు పంపుతున్నారు. స్థూల నమోదు వృద్ధికి దోహదపడిన సంస్కరణలు.. ► మనబడి నాడు–నేడు ద్వారా తొలిదశలో.. 15 వేలకు పైగా ప్రభుత్వ స్కూళ్లలో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారు. ► రెండో దశలో మరో 22,221 స్కూళ్ల రూపురేఖలను మార్చే పనులు చేపట్టారు. ► దీంతోపాటు.. పిల్లలు మధ్యలో చదువు మానేయకుండా గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా చర్యలను తీసుకుంటోంది. ఇందులో భాగంగా.. పిల్లలు ఎవరైనా స్కూళ్లకు వెళ్లకపోతే వలంటీర్లు ఆ పిల్లల తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి కారణాలు తెలుసుకుని తిరిగి స్కూళ్లకు వచ్చేలా ప్రభుత్వం చర్యలను తీసుకుంది. ► అంతేకాక.. స్కూళ్లకు వచ్చే పిల్లలకు జగనన్న గోరుముద్ద ద్వారా నాణ్యమైన ఆహారాన్ని అందిస్తోంది. ► పేద పిల్లల చదువులకు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలతో పాటు యూనిఫాం, బూట్లు తల్లిదండ్రులపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే జగనన్న విద్యా కానుక ద్వారా ఉచితంగా కిట్ను అందిస్తోంది. ► ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంను కూడా అమలుచేస్తోంది. ► పిల్లలకు ట్యాబులను కూడా అందిస్తోంది. ఈ చర్యలన్నీ కూడా పాఠశాలల్లో స్థూల నమోదు నిష్పత్తి పెరగడానికి దోహదం చేశాయి. -
రిపబ్లిక్ వేడుకల్లో ఏపీ శకటంగా జగనన్న విజన్!
ఢిల్లీ, సాక్షి: దేశ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో.. తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్ర సృష్టించబోతోంది. రిపబ్లిక్ డే కోసం శకటాల ఎంపికలో వైవిధ్యతను కనబర్చింది. రాష్ట్రంలోని పరిస్థితులకు తగ్గట్లే.. డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్ శకటం ఈసారి రిపబ్లిక్ డే పరేడ్కు సిద్ధమైంది. దేశంలో 62,000 డిజిటల్ క్లాస్ రూమ్ల బోధన ద్వారా ఏపీ చరిత్ర సృష్టించింది. ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యార్థులను అందించాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి లక్ష్యానికి తగ్గట్లుగానే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే అంశాన్ని దేశం మొత్తం చాటిచెప్పేలా.. శకటం రూపకల్పన జరిగింది. డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్తో రూపొందించిన శకటం.. అదీ ఏపీ తరఫున తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సందడి చేయబోతోంది. జనవరి 26వ తేదీన కర్తవ్య పథ్ లో వికసిత్ భారత్ థీమ్లో భాగంగా కనువిందు చేయనుంది జగనన్న విజన్ను ప్రతిబింబించే ఏపీ శకటం. -
తరగతి మారిపోయింది
ఇప్పుడు ఆ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు కూడా అందుబాటులోకి వచ్చాయి. మొదటి దశ ముగిసిన వెంటనే ప్రభుత్వం గతేడాది జూలైలో నాడు–నేడు రెండో దశ పనులను రూ.8 వేల కోట్ల వ్యయంతో చేపట్టింది. 22,217 పాఠశాలలను రెండో దశలో ఎంపిక చేసి, నిర్మాణ పనులు ప్రారంభించింది. ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో 2023 మార్చిలో ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వివిధ ప్రభుత్వ మేనేజ్మెంట్లలో అత్యధిక మార్కులు సాధించి, మొదటి స్థానాల్లో నిలిచిన 22,768 మంది పిల్లలకు అవార్డులు అందించింది. – సాక్షి, అమరావతి నాడు పెచ్చులూడిన స్లాబులు 4 నెర్రలు బారిన గోడలు విరిగిపోయిన బెంచీలు 4 కటిక నేలపై చదువులు వస్తారో రారో తెలియని అయ్యవార్లు మచ్చుకైనా కనిపించని వాష్ రూమ్లు కొన్ని చోట్ల పశువులకు నెలవు ఎక్కడో ఒక చోట మాత్రమే టీవీలు సబ్జెక్ట్ టీచర్లు కరువు విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదనేలా ప్రభుత్వ తీరు నేడు కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా నూతన భవనాలు చిన్నారులను ఆకట్టుకునేలా పెయింటింగ్స్ సైన్స్ ల్యాబ్లు సరికొత్తగా డెస్్కలు, కుర్చీలు, ఇతర పరికరాలు రన్నింగ్ వాటర్తో టాయ్లెట్లు ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు అదనపు తరగతి గదులు, వంటషేడ్లు పరిశుభ్రమైన మంచి నీరు ప్రతి పాఠశాలకూ రక్షణ గోడ ప్రతి తరగతి గది డిజిటలైజేషన్ మొత్తంగా 12 రకాల సదుపాయాలు ఇంగ్లిష్ మీడియం, బైజూస్ పాఠాలు 3వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణ కౌమార దశలోని బాలికలకు స్వేచ్ఛ శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మనబడి నాడు–నేడు’ పథకం మొదటి దశలో రూ.3,700 కోట్లతో 15,715 స్కూళ్లను అభివృద్ధి చేసింది. -
Fact Check: విద్యపై ఎల్లోమీడియా విషపు కథలు
సాక్షి, అమరావతి: పేదింటి పిల్లలు అమ్మ.. ఆవు అనే పదాల దగ్గరే ఆగిపోవాలి గాని.. ఇంగ్లిష్ నేర్చుకోవడమేంటి? ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులు చిరిగిన సంచీలో నాలుగు పుస్తకాలు పట్టుకుపోవాలే తప్ప.. కార్పొరేట్ పిల్లల్లా టై కట్టుకుని, బూట్లు వేసుకుని బడికి వెళ్లడమేంటి? మాలాంటి పెద్దల ఇంట్లో పిల్లలు వాడే ట్యాబ్లు.. డిజిటల్ విద్యను వారికి ఇవ్వడమేంటి? డబ్బున్న బాబులు మాత్రమే కొనుక్కునే ఐబీ కరిక్యులమ్ చదువులను ప్రభుత్వ బడుల్లో ఉచితంగా నేర్పించడమేంటి? నిరుపేద కుటుంబాల్లో పుట్టిన పిల్లలకు అండగా నిలుస్తూ.. ప్రభుత్వం వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దడం నేరమే అంటోంది ఎల్లో మీడియా. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్కరణలపై అవగాహనా రాహిత్యంతో తప్పుడు ప్రచారం చేస్తోంది. ఒకే తరహా సిలబస్ అమల్లో ఉన్నా.. పాఠశాలల్లో ఏ సిలబస్ అమల్లో ఉందో.. ఏ పాఠ్య ప్రణాళికను అమలు చేస్తున్నారో తెలుసుకోకుండా విషపు కథలు అల్లుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ ఒకే తరహా సిలబస్ అమల్లో ఉంది. ఎన్సీఈఆర్టీ టెక్ట్స్బుక్స్ మాత్రమే చదువుతున్నారు. ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ అమలు చేసే పాఠశాలల్లో కూడా ఇవే టెక్ట్స్బుక్స్ ఉంటాయి. స్టేట్ బోర్డు, సీబీఎస్ఈ, ఐబీల్లో బోధన, పరీక్ష విధానాలు మాత్రమే మారుతాయి. ఎన్సీఈఆర్టీ బుక్స్ను మారిస్తే దేశంతో పాటు రాష్ట్రంలోనూ మారతాయిగాని, బోర్డు అనుబంధాన్ని బట్టి పుస్తకాలు మారవు. వర్తమాన కార్యాచరణపై దృష్టి ఆంధ్రప్రదేశ్లోని పాఠ్య పుస్తకాలు వర్తమాన కార్యాచరణ ఆధారిత పాఠ్యాంశాలపై ఎక్కువ దృష్టి సారించి రూపొందించారు. కొత్త పాఠ్య పుస్తకాల్లో 21వ శతాబ్దపు నైపుణ్యాలను పొందడం, పునాది అక్షరాస్యతను ప్రోత్సహించడం, పదజాలం, ద్విభాషా నిర్మాణం, క్యూఆర్ కోడ్స్తో శక్తివంతం చేయడం, గణితం, పర్యావరణ శాస్త్రంలో ప్రపంచ ప్రమాణాలను అందించడం వంటి విభిన్న దృక్కోణాలను ప్రోత్సహించేలా తయారు చేశారు. కాబట్టి పాఠ్యపుస్తకాలు మారతాయి అనేది అపోహ మాత్రమే. మెరుగైన బోధన, అత్యున్నత మూల్యాంకనం అంశాల్లో మాత్రమే మార్పు ఉంటుంది. విద్యార్థికి ప్రపంచ పోకడలపై అవగాహన రాష్ట్రంలో ప్రతి బిడ్డను ప్రపంచంతో పోటీపడేలా తయారు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దాంతో వారి అభ్యాస ఫలితాలను మెరుగుపరిచేందుకు బోధనలో మార్పు తెచ్చింది. విద్యార్థి కేంద్రీకృత బోధనాభ్యసనం ప్రారంభించింది. అందుకు అనుగుణంగా ఇప్పటికే విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన, విద్యార్థులు సులువుగా అర్థం చేసుకునేందుకు బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు అందించింది. డిజిటల్ మాధ్యమం ద్వారా బోధన అమలుచేస్తూ ఆశించిన ఫలితాలను సాధించింది. విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలు పెంచేందుకు ‘ఇఫ్లూ’ వంటి ప్రముఖ విద్యా సంస్థల సహకారంతో ఎస్సీఈఆర్టీ కృషి చేస్తోంది. ప్రపంచంలో 11 వేల వర్సిటీలుఆమోదించిన టోఫెల్ విద్యార్థుల్లో ఆంగ్ల భాషా సామర్థ్యాలను కొలిచేందుకు నిర్వహించే ఓ ప్రామాణిక పరీక్ష. ప్రపంచంలో దాదాపు 90 దేశాల్లోని 11 వేల కంటే ఎక్కువ విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థలు ఈ పరీక్షను ఆమోదించాయి. ప్రపంచంలో ఎక్కడైనా రాణించాలంటే ఈ పరీక్షలో ఉతీర్ణత సాధించాలనే సదుద్దేశంతో 1947లో టోఫెల్ మొదలు పెట్టారు. ఇప్పటికీ ప్రపంచంలో అతిపెద్ద లాభాపేక్షలేని విద్యా పరీక్ష అంచనా సంస్థ అయిన ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీనిప్రకారం మన విద్యార్థుల్లో ఆంగ్ల కమ్యూనికేషన్ నైపుణ్యాలను కొలవడానికి, విద్యార్థుల బలాలు, సవాళ్లను సూచిస్తూ.. వారు ఏ దశలో ఉన్నారో తెలుసుకోవచ్చు. టోఫెల్ జూనియర్ పరీక్షకు విద్యార్థులను సిద్ధం చేసి, భవిష్యత్లో వారు టోఫెల్ పరీక్షను సునాయాసంగా ఎదుర్కొనేలా సిద్ధం చేయడం దీని ముఖ్యోద్దేశం. ఈటీఎస్ సహకారంతో ఎస్సీఈఆర్టీ ప్రతినెలా టోఫెల్ లెర్నింగ్ మెటీరియల్ విడుదల చేస్తోంది. లిక్విడ్ అనే సంస్థ ఉచితంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తోంది. విద్యార్థులు 9వ తరగతిలో టోఫెల్ జూనియర్ పరీక్షకు హాజరవుతారు. దానికోసం మూడో తరగతి నుంచే విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్నారు. దీనికి ప్రభుత్వంపై ఆర్థిక భారం లేదు. టోఫెల్ జూనియర్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఫీజు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది. పిల్లలకు సమాజాన్ని అర్థం చేసుకునే విద్య ప్రభుత్వం రాష్ట్రంలోని వెయ్యి పాఠశాలలను సీబీఎస్ఈకి అనుసంధానించింది. ఆయా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి ఉపాధ్యాయులను నియమించింది. విద్యార్థులు తమ చుట్టూ ఉన్న ప్రపంచ సంక్లిష్టతను అర్థం చేసుకునేందుకు వీలు కల్పించే విద్యనందించాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) కరిక్యులంపై దృష్టి సారించింది. విద్యార్థులలో ప్రస్తుతమున్న కంఠస్థం, ధారణ, పరీక్ష సమయంలో పునశ్చరణ వంటి వాటికి భిన్నంగా ప్రాబ్లెమ్ సాల్వింగ్, క్రిటికల్ థింకింగ్, లేటరల్ థింకింగ్, అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జి ఫర్ లైఫ్ స్కిల్స్, ఫ్యూచర్ స్కిల్స్ వంటివి అందిస్తోంది. దీంతోపాటు సంగీతం, కళ, వ్యాపార పరిపాలన మొదలైన వాటికి సమాన ప్రాధాన్యతనిస్తూ, చక్కటి పాఠ్యాంశాలను అందించే ఐబీ బోర్డు పాఠ్యాంశాలను మన విద్యా విధానంతో అనుసంధానించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. దీనికోసం ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసి.. 2025 నాటికి ఐబీ కరిక్యులంను మన పాఠ్యప్రణాళికలో భాగం చేసేందుకు అడుగులు వేస్తోంది. విద్యార్థుల్లో అభ్యసనా నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం 8వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు ట్యాబులను అందించింది. ఈ సంవత్సరం ట్యాబ్లలో సమస్యలను పరిష్కరించే డౌట్ క్లియరెన్స్ యాప్, విదేశీ భాషలు నేర్చుకునేందుకు డ్యుయోలింగో యాప్ను ఇన్స్టాల్ చేసింది. వీటిపై సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రతి డైట్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మరమ్మతులు వస్తే సచివాలయాల్లో వాటిని బాగుచేసి ఇస్తోంది. అంతేకాక తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ను అమర్చి డిజిటల్ కంటెంట్ను అందించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతిలో సిలబస్లో భాగం కానున్న ఫ్యూచర్ స్కిల్ సబ్జెక్టులు బోధించేందుకు పలు సంస్థల సహకారంతో ప్రణాళిక సిద్ధం చేసింది. -
టీటీఏ ఆధ్వర్యంలో..ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ క్లాస్రూమ్లు
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ సేవాడేస్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లా, సంస్థాన్ నారాయణ్ పూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాసురూమ్లు ఏర్పాటు చేసింది. టీటీఏ ప్రెసిడెంట్ వంశీరెడ్డి ఆధ్వర్యంలో మయూర్ రెడ్డి బండారు 25 పాఠశాలకు డిజిటల్ క్లాస్ రూమ్ సామాగ్రి అందించారు. ప్రభుత్వ పాఠశాలకు విచ్చేసిన టీటీఏ సభ్యులకు చిన్నారులు సాగర స్వాగతం పలికారు. టీటీఏ బృందం ఇచ్చిన ప్రోత్సాహానికి పాఠశాల ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పలువురు టీచర్లను సన్మనించి, మెమంటోలు అందించారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు ఆధునికం.. రక్షణ అధమం
యాలాల: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆధుని క,మెరుగైన బోధన అందించాలనే లక్ష్యంతో ప్రభు త్వం అందజేసిన సామగ్రి రక్షణ.. గాలిలో దీపంలా మారింది. డిజిటల్ క్లాసుల నిర్వహణ కోసం ఒక్కో పాఠశాలకు రూ.లక్షల విలువ చేసే ఎలక్ట్రానిక్ పరికరాలను పంపిణీ చేసింది. కానీ వీటి భద్రతపై ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ‘మన బడి’లో అభివృద్ధి పనులు మన ఊరు– మన బడి కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని ఆరు ఉన్నత పాఠశాలలతో పాటు పలు ప్రాథమిక పాఠశాల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. వీటిలో పగిడియాల, కోకట్, యాలాల, జుంటుపల్లి, అగ్గనూరు, బెన్నూరు పాఠశాలల్లో హైస్కూల్ విద్యార్థులకు డిజిటల్ క్లాసుల నిర్వాహణకు భారీగా అధునాతన పరికరాలను పంపిణీ చేశారు. వీటిలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ బోర్డు(ఐఎఫ్పీబీ)లు బహిరంగ మార్కెట్లో ఒక్కదానికి సుమారు రూ.3 లక్షల పైచిలుకు ధర ఉన్నాయి. ప్యానెల్ బోర్డుతో పాటు ఆధునిక వసతుల కలిగిన డ్యుయల్ డెస్క్ టేబుళ్లు, గ్రీన్ బోర్డు, ఎలక్ట్రానిక్ ప రికరాలను ఏర్పాటు చేశారు.ఇలా ఒక్కో పాఠశాల కు సుమారు రూ.10లక్షల విలువైన పరికరాలను అందించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికి వీ టిని భద్రపరిచే విషయంలో ఆందోళన నెలకొంది. వాచ్మెన్లను కేటాయించాలి.. మండల పరిఽధిలోని చాలా స్కూళ్లను తక్కువ ఎత్తున్న ప్రహరీలు, విరిగిన గేట్లు వెక్కిరిస్తున్నాయి. భద్రత పరంగా సౌకర్యాలతో పాటు ఒక్క పాఠశాలకు నిరంతర నిఘాకు వాచ్మెన్ లేడు. మండలంలోని 10 హైస్కూళ్లతో పాటు 50 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి. కాగా ఈ ఏడాది వేసవి సెలవులో నెల రోజుల పాటు మన ఊరు– మన బడి పథకంలో భాగంగా వాచ్మన్ల ఏర్పాటుకు నెల వేతనాన్ని ఇచ్చేందుకు అంగీకరించారు. నిరంతరం దీన్ని కొనసాగిస్తే బాగుంటుందని టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఉన్నత విద్యకు లిప్
కొండాపూర్(సంగారెడ్డి): రాష్ట్ర ప్రభుత్వం హైస్కూల్ విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కసరత్తు చేస్తోంది. కరోనా నేపథ్యంలో ప్రత్యక్ష తరగతులు లేకపోవడంతో విద్యార్థులలో కనీస అభ్యసన సామర్థ్యం తగ్గింది. ఈ విషయాన్ని పలు సర్వే సంస్థలు సైతం వెల్లడించాయి. ఈ క్రమంలోనే ప్రాథమిక స్థాయిలో తొలిమెట్టు (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇదే తరహాలో ఉన్నత పాఠశాలలో కూడా కనీస అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ విద్యా సంవత్సరం నుండి లిప్ (లర్నింగ్ ఇంప్రూవ్ మెంట్ ప్రోగ్రాం) అమలుకు కసరత్తు చేస్తున్నారు. ● కరోనా కారణంగా 2020–21 సంవత్సరం నుంచి విద్యార్థులు రెండేళ్లు పాఠశాలలకు వెళ్లలేదు. దీంతో డిజిటల్ తరగతులు నిర్వహించారు. ఈ విధానంలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ● తెలుగు, హిందీ, ఆంగ్లం చదవడం, రాయడం రాని వారు కూడా 9వ తరగతిలోనూ ఉన్నారని, అదే విధంగా చిన్నచిన్న కూడికలు, తీసివేతలు, గుణకారాలు, బాగాహారాలు రానివారు కూడా ఉన్నారని పలు సర్వే సంస్థలు వెల్లడించాయి. ● ఇలాంటి విద్యార్థులలో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ఈ లిప్ కార్యక్రమం ఉపయోగపడనుంది. ● గత సంవత్సరం విద్యాశాఖ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే ఇదే తరహాలో తొలిమెట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ప్రస్తుతం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ● విద్యా సంవత్సరం ప్రారంభం నుండే విద్యార్థుల ను చదివించడం, రాయించడం, పాఠాలు వినేలా చేయడం, సాధనల్లో పిల్లల భాగస్వామం, ప్రతి స్పందనలు, స్లిప్ టెస్ట్లు వంటి వాటిని నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించనున్నారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 192 ప్రాథమికోన్నత పాఠశాలలు, 240 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రాథమికోన్నత పాఠశాలలో 6 నుంచి 8వ తరగతి వరకు 11 వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 92 వేల మంది ఉన్నారు. విద్యార్థులకు ఉపయోగకరం కరోనా నేపథ్యంలో విద్యార్థులు రెండు సంవత్సరాలుగా డిజిటల్ తరగతులకే పరిమితమమాయ్యరు. దీంతో చాలా మంది విద్యార్థులకు చదవడం, రాయడం కూడా పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు తొలిమెట్టు కార్యక్రమం ద్వారా రాయడం, చదవడం వంటి వాటిని నేర్పించారు. ఈ తరహాలోనే విద్యా సంవత్సరం నుంచి ఉన్నత పాఠశాల విద్యార్థులకు లిప్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. -
ఏపీలో డిజిటల్ విప్లవం
సాక్షి, అమరావతి: డిజిటల్ డివైడ్ను తొలగించాలన్నా... అంతరాలను తగ్గిస్తూ పోవాలన్నా కావాల్సింది అక్షరాస్యత. అది కూడా... డిజిటల్ అక్షరాస్యత. ఆ సూత్రాన్ని మనసావాచా ఆచరిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అందుకే ఇక్కడ డిజిటల్ డివైడ్ తగ్గుతోంది. శ్రీమంతులకు మాత్రమేననుకున్న డిజిటల్ విద్య పేదలకూ అందుతోంది. డివైడ్ను తగ్గిస్తూ డివైజ్లూ అందిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ ఏడాది 8వ తరగతికి వచ్చిన విద్యార్థులకు ట్యాబ్లు అందించారు. మొత్తం 5.30 లక్షల నాణ్యమైన ట్యాబ్లు ఇవ్వటం ద్వారా రాష్ట్రంలో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టారు. ప్రతి విద్యార్థికీ అందుబాటులో ఉండేలా డిజిటల్ క్లాస్రూమ్లను అందుబాటులోకి తెస్తోంది ఏపీ ప్రభుత్వం. 1వ తరగతి నుంచే స్మార్ట్ టీవీ స్క్రీన్ల ద్వారా డిజిటల్ క్లాస్రూమ్లను అలవాటు చేయటంతో పాటు... ప్రభుత్వ స్కూళ్లలో 6వ తరగతి, ఆపైన ఉన్న ప్రతి తరగతి గదిలోనూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ను (ఐఎఫ్పీ) ఏర్పాటు చేస్తున్నారు. ఇక 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లివ్వటంతో పాటు... 8, ఆ పై తరగతుల వారికి బైజూస్ డిజిటల్ కంటెంట్ను అందిస్తున్నారు. దీంతో ఇంట్లోనూ పిల్లలు ఆడియో, వీడియో, గ్రాఫిక్ ఎలిమెంట్స్ ఉన్న పాఠాలను నేర్చుకునే అవకాశం కలిగింది. ఇంటర్ విద్యార్థులకు కూడా డిజిటల్ సౌలభ్యాన్ని కల్పించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ డిజిటల్ సదుపాయాలతో ప్రయివేటు, కార్పొరేట్ విద్యార్థులకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులూ ఉత్తమ విద్యా ప్రమాణాలను అందుకునే అవకాశముంది. ఐఎఫ్పీలు ఏర్పాటు చేయటమే కాదు. వాటి ద్వారా నిపుణులైన సబ్జెక్టు టీచర్లతో బోధన చేయించే చర్యలు చేపట్టారు. దీనికోసం టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే ‘నాడు–నేడు’ పూర్తయిన స్కూళ్లన్నింటిలోనూ వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఐఎఫ్పీలు అందుబాటులోకి రానున్నాయి. ఇక పుస్తకాల్లోని అంశాలు, ట్యాబుల్లోని బైజూస్ కంటెంట్, ఐఎఫ్పీ కంటెంట్ ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. దీనివల్ల విద్యార్థులు మరింత సమర్థంగా అభ్యసనం కొనసాగించేందుకు ఆస్కారమేర్పడుతోంది. పాలనలోనూ డిజిటల్ సేవలు... విద్యారంగంలోనే కాకుండా ప్రభుత్వ పాలనా వ్యవహారాలన్నీ డిజిటల్ విధానంలోనే కొనసాగేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా అన్ని సంక్షేమ పథకాలనూ అక్రమాలకు, అవినీతికి తావులేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ నేరుగా అందజేయగలుగుతున్నారు. గతంలో లక్షల కోట్ల రూపాయల నిధులను వివిధ పథకాల కింద ఖర్చు చేస్తున్నట్లు చూపించటమే తప్ప ప్రజలకు వాటి ఫలాలు అందలేదు. మధ్యవర్తులు, దళారులు ప్రజాధనాన్ని దోచుకుతిన్నారు. డిజిటలైజేషన్ను ప్రభుత్వం సమర్థంగా వినియోగించుకోవటంతో ఆ పరిస్థితికి పూర్తిగా చెక్ పడింది. రాష్ట్రంలో గ్రామ, వార్డుల వారీగా 2.60 లక్షల మంది వలంటీర్లను నియమించి వారికి స్మార్ట్ ఫోన్లు ఇచ్చారు. తద్వారా అర్హుౖలైన ప్రతి లబ్ధిదారుకూ ప్రభుత్వ పథకాలను నేరుగా అందిస్తున్నారు. గ్రామ స్థాయిలో మహిళలు, శిశువుల సంక్షేమానికి, ఆరోగ్య పరిరక్షణకు వీలుగా అంగన్వాడీ కార్యకర్తలకూ ఫోన్లు అందించారు. 42 వేల మంది ఆశావర్కర్లకు స్మార్ట్ ఫోన్లు... 15వేల మందికి పైగా ఏఎన్ఎంలకు ట్యాబులు పంపిణీ చేయటంతో వారి ద్వారా అందజేస్తున్న సేవల్లో పూర్తి పారదర్శకత సాధ్యమయింది. గ్రామాల్లో విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేయటమే కాక అక్కడ 10,032 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను నియమించి స్మార్ట్ ఫోన్లు అందిస్తున్నారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగానికీ శ్రీకారం చుట్టారు. -
డిజిటల్ తరగతులకు దన్ను
అనంతపురం: ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ), డిజిటల్ ఇన్షియేటివ్స్లో భాగంగా ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ తరగతులు నిర్వహించనున్నారు. ఐసీటీ, స్మార్ట్ తరగతి గదులను ఏర్పాటుకు సమగ్రశిక్ష దన్నుగా నిలుస్తోంది. విద్యారంగంలో ఇప్పటికే విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు అంతర్జాతీయ విద్యనందిస్తోంది. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు సైతం భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో మంచి అవకాశాలు అందుకునేలా డిజిటల్ విద్యను వారికి చేరువ చేస్తోంది. ఆధునిక సాంకేతిక విద్యను అందిపుచ్చుకుని విద్యార్థులను అన్ని విషయాల్లో మేటిగా తీర్చిదిద్దుతోంది. ఈ క్రమంలో దశల వారీగా ఫౌండేషన్ స్కూల్ స్థాయి నుంచి ఇంటర్మీడియెట్ స్థాయి అయిన హైస్కూల్ ప్లస్ స్కూళ్ల వరకు డిజిటల్ తరగతులను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే అత్యున్నత ప్రమాణాలు ఉన్న సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సీబీఎస్ఈ బోధనకు అనుగుణంగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) డిజిటల్ కంటెంట్ను ఇప్పటికే సిద్ధం చేసింది. అడ్మిషన్ల ఆధారంగా స్మార్ట్ తరగతులు 2023–24 విద్యా సంవత్సరంలో విద్యార్థుల అడ్మిషన్ల ఆధారంగా స్మార్ట్ తరగతులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పాఠశాలలో 100లోపు విద్యార్థులు ఉంటే రూ.2.5 లక్షలు, 100 నుంచి 250 మందిలోపు ఉంటే రూ.4.50 లక్షలు, 250 నుంచి 700 మంది ఉంటే రూ.6.4 లక్షల గ్రాంట్ను ప్రభుత్వం అందజేస్తుంది. వచ్చే 5 సంవత్సరాల్లో ఈ గ్రాంట్ను ఉపయోగించాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,061 ఐసీటీ ల్యాబ్ల ఏర్పాటుకు అనుమతులు రాగా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 957 ఐసీటీ ల్యాబ్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ ల్యాబ్లు పూర్తిగా సమగ్రశిక్ష ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్నాయి. వైఫై, హెచ్డీఎంఐ, యూఎస్బీ, వీజే కనెక్టివిటీ, రికార్డెర్డ్ బోర్డు వర్క్, డిజిటల్ బోర్డును బ్లాక్ లేదా గ్రీన్ బోర్డులుగా మార్చుకోవడానికి అవకాశం, ఆడియో, వీడియోలు ప్రదర్శనకు వీలు, ప్యానల్లోనే స్పీకర్ల ఏర్పాటు, స్పెసిఫికేషన్ల ఇంటెల్కోర్ ఐ–5, ఏఎండీ రీజెఎన్5 ప్రాసెసర్, కంప్యూటర్లు ఏర్పాటు చేయనున్నారు. నాడు–నేడు బడుల్లో చకచకా ఏర్పాట్లు మనబడి ‘నాడు – నేడు’ కింద తొలి దశ పనులు పూర్తయిన స్కూళ్లలో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లు (ఐఎఫ్పీ) ఏర్పాటు చేసి డిజిటల్ బోధన చేస్తారు. ఇందులో భాగంగానే స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశారు. 65 ఇంచులతో ఉండే 1,463 స్మార్ట్ టీవీలను ఆయా పాఠశాలల్లో ఏర్పాటు చేశారు. డిజిటల్ తరగతులకు అనుగుణంగా ఆయా పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయం కల్పించారు. డిజిటల్ కంటెంట్ సిద్ధం డిజిటల్ విద్యాబోధనకు వీలుగా విద్యాశాఖ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు డిజిటల్ కంటెంట్ను సిద్ధం చేయిస్తోంది. సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్న నేపథ్యంలో విద్యాశాఖ సిలబస్కు అనుగుణంగా మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో ఈ –కంటెంట్ను సీబీఎస్ఈ విధానంలో రూపొందిస్తోంది. వీటిలో ఆడియో, వీడియో తరహాలో కంటెంట్ ఉండనుంది. స్మార్ట్ తరగతులకు చర్యలు మన బడి ‘నాడు–నేడు’ కార్యక్రమంలో భాగంగా స్మార్ట్ తరగతులు ఇప్పటికే ఏర్పాటయ్యాయి. తక్కిన వాటిలో కొత్తగా ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ టెక్నాలజీ, స్మార్ట్ తరగతుల ఏర్పాటుకు సంబంధించి సమగ్రశిక్ష విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8,061 ఐసీటీ ల్యాబ్లు ఏర్పాటు కానున్నాయి. ఇపుడు ఉన్న విద్యార్థుల సంఖ్యను బట్టి ఉమ్మడి అనంతపురం జిల్లాకు 957 స్మార్ట్ తరగతులు రానున్నాయి. – బి.ప్రతాప్రెడ్డి, ఆర్జేడీ, విద్యాశాఖ -
AP: నాడు-నేడు తొలివిడత స్కూళ్లకు ఈ–కంటెంట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మనబడి నాడు–నేడు కింద మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన బోధనా కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి విద్యార్థులకు అనువుగా ఉండేందుకు ద్విభాషా (బైలింగ్యువల్) పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసింది. ఆంగ్ల మాధ్యమ బోధనకు వీలుగా 1.80 లక్షల మంది టీచర్లకు శిక్షణ కూడా ఇచ్చింది. ఈ స్కూళ్లలో ఇంగ్లిష్ ల్యాబ్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వాటిలో బోధనకు వీలుగా ఈ–కంటెంట్ను ప్రత్యేకంగా రూపొందించి అందిస్తోంది. చదవండి: లాస్ట్ జర్నీ.. లాస్ట్ సెల్ఫీ.. కన్నీరు పెట్టించిన ఫొటోలు, వీడియోలు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలోని సీమ్యాట్ ద్వారా ఈ కంటెంట్ను రూపొందింపచేసి అన్ని స్కూళ్లకు అందుబాటులోకి తెస్తోంది. తొలివిడతగా నాడు–నేడు కింద అభివృద్ధి చేసిన 15,715 స్కూళ్లలోని ఇంగ్లిష్ ల్యాబ్లకు ఈ–కంటెంట్ను సిద్ధం చేసింది. ఇంతకుముందు 1,729 వీడియో కంటెంట్లను అందించగా తాజాగా మరో 2,102 వీడియో కంటెంట్లను పాఠశాలలకు అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కూళ్లలో ఇంగ్లిష్ ల్యాబ్ల్లో డిజిటల్ డివైస్లను ఏర్పాటు చేయించి వాటి ద్వారా విద్యార్థులకు ఈ ఈ–కంటెంట్ను సులభమార్గాల్లో బోధన చేయించనుంది. డిజిటల్ తరగతులకు సన్నాహాలు మరోవైపు.. నాడు–నేడు కింద అభివృద్ధి చేస్తున్న స్కూళ్లలో ఆధునిక విజ్ఞాన బోధనకు వీలుగా డిజిటల్ తరగతుల ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు అందుకు అనుగుణంగా సన్నాహాలు చేపట్టారు. మొత్తం 45,328 స్కూళ్లలో రూ. 511.28 కోట్లతో ఈ డిజిటల్ తరగతులను ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తోంది. మూడు దశల్లో ఈ కార్యక్రమం పూర్తి కానుంది. తొలిదశలో 15,694 పాఠశాలల్లో ముందుగా ఈ డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయనున్నారు. రెండో దశ కింద 2023–24 విద్యాసంవత్సరంలో 14,331 స్కూళ్లలో, మూడో దశలో 15,303 స్కూళ్లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. డిజిటల్ బోధనకోసం ఈ స్కూళ్లలో స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లు, ఏర్పాటు చేయించనున్నారు. డిజిటల్ తరగతులకు అనుగుణంగా ఆయా స్కూళ్లకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కూడా ఇప్పటికే ఏర్పాటు చేయించారు. 2,658 స్కూళ్లలో బ్రాడ్ బ్యాండ్, లీజ్డ్ లైన్, టెలిఫోన్ లైన్ విత్ మోడెమ్, యూఎస్బీ మోడెమ్, పోర్టబుల్ హాట్స్పాట్, వీఎస్ఏటీ తదితరాల ద్వారా ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించారు. -
పాఠాలకు డిజి‘ట్రబుల్’
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ క్లాస్ రూంల ఏర్పాటులో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అతి కీలకమైన నెట్వర్క్ ప్రధాన సమస్యగా మారుతోంది. ఇంటర్నెట్ సదుపాయం లేకుంటే రూ.కోట్లు వెచి్చంచినా ప్రయోజనం ఏమిటని సర్వశిక్షా అభియాన్ సందేహాలు లేవ నెత్తుతోంది. మన ఊరు–మన బడి కార్యక్రమంలో భాగంగా 3 వేల ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి రూ.300 కోట్లు వెచి్చంచాలనుకున్నారు. ఎంపిక చేసిన స్కూల్లో రెండు స్మార్ట్ క్లాస్ రూముల చొప్పున, మొత్తం 6 వేలు ఏర్పాటు చేయాలని భావించారు. దీనిపై ప్రభుత్వం అధికారుల చేత సర్వే చేయించింది. మొబైల్ డేటా కూడా అంతంత మాత్రమే.. ప్రైవేటు స్కూల్స్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందులో భాగంగానే స్మార్ట్ క్లాసు రూంల ఏర్పాటు ప్రతిపాదనను ముందుకు తెచి్చంది. డిజిటల్ క్లాస్ రూంలో ప్రొజెక్టర్, కంప్యూటర్లు, డిజిటల్ తెర, ఇంటరాక్టివ్ వైట్ బోర్డులను అమర్చాల్సి ఉంటుంది. క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా డిజిటల్ పాఠాలను విద్యార్థులకు చేరవేయాలని భావించారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా 3 వేల స్కూల్స్ను డిజిటల్ క్లాసు రూంల ఏర్పాటుకు ఎంపిక చేస్తే 131 మండలాల పరిధిలోని 878 గ్రామాల్లో ఇంటర్నెట్ సదుపాయం లేదని తేలింది. ఈ ప్రాంతాల్లో కనీసం మొబైల్ నెట్వర్క్ కూడా అంతంత మాత్రమేనని అధికారులు గుర్తించారు. కుమ్రుం భీం ఆసిఫాబాద్, నిర్మల్, ములుగు జిల్లాల్లో సమస్య తీవ్రత ఎక్కువగా ఉందని తేలింది. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు. హార్డ్ డిసు్కతో నెట్టుకు రావలసిందేనా? 6 నుంచి 10వ తరగతి వరకూ డిజిటల్ పాఠాలు అందించాలని భావిస్తున్నారు. అవసరమైన పాఠాలను నిపుణుల చేత ముందే రికార్డు చేసి, వాటిని క్లౌడ్లో నిక్షిప్తం చేస్తారు. నెట్వర్క్ ద్వారా ప్రతి పాఠశాల క్లౌడ్కు కనెక్ట్ అవ్వొచ్చు, ఇది వీలుకాని పక్షంలో హార్డ్ డిస్క్ సాయంతో పాఠాలు వినే ఏర్పాటు చేస్తారు. మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం లేనప్పుడు ఇదే సరైన విధానంగా భావిస్తున్నారు. కానీ దీనివల్ల ప్రయోజనం పెద్దగా ఉండదని అధికారులు చెబుతున్నారు. నెట్వర్క్ ఉంటే విద్యార్థి అర్థం కాని పాఠాన్ని మళ్ళీ మళ్ళీ వినే అవకాశం ఉంది. ఇంటి వద్ద కూడా డిజిటల్ లే»ొరేటరీకి కనెక్ట్ అవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. సెంట్రల్ సర్వర్లో ఉంటుంది కాబట్టి డేటా పోయే అవకాశం ఉండదు. అదే హార్డ్ డిస్క్ స్కూల్లో ఒకచోటే ఉంటుంది. డేటా పోయేందుకూ, ఎర్రర్ వచ్చేందుకూ అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసిన గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు విస్తరింపజేయడమా? హార్డ్ డిస్క్ల ద్వారా పాఠాలు చెప్పించడమా? అనే దానిపై విద్యాశాఖ నిర్ణయం తీసుకోవలసి ఉంది. -
స్కూళ్లను కాదని ఆన్లైన్కు వెళితే.. చదువుకు చెద!
నిరంతరాయంగా పాఠశాలల మూసివేత వల్ల విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోంది. పేదలు, అణగారిన వర్గాల పిల్లలు చాలా నష్టపోతారు. అసమానతలు పెరిగి, సమాజంపై దుష్ప్రభావం పడుతోంది. పిల్లల్లో డ్రాపవుట్లకు దారితీస్తోంది. పాఠశాలలు తెరిచిన తరువాత బాలలకు సరైన సామర్థ్యాలు లేక స్కూళ్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపడంలేదు. చివరకు వారు బాల కార్మికులుగా మారే ప్రమాదం ఏర్పడుతోంది. – యునెస్కో (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) నివేదిక సాక్షి, అమరావతి: కరోనా మూడో వేవ్ ఉన్నప్పటికి, విద్యార్థుల భవిష్యత్తు, అభ్యసన సామర్థ్యం దెబ్బతినకుండా విద్యా సంస్థలను తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా ప్రొటోకాల్కు అనుగుణంగా విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎటువంటి సమస్యలు రాకుండా పటిష్టమైన జాగ్రత్తలతో విద్యాసంస్థల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) కూడా పాఠశాలలను తెరవాలనే చెబుతోంది. విద్యా సంస్థలను తెరిచి, ప్రత్యక్ష బోధనే మేలని వెల్లడించింది. పాఠశాలల మూసివేత వల్ల విద్యార్థులు, ముఖ్యంగా పేద, బడుగు బలహీనవర్గాల పిల్లలు తీవ్రంగా నష్టపోతారని తెలిపింది. ఉన్నత, పేద వర్గాలకు మధ్య అసమానతలు మరింత పెరుగుతాయని, ఇది సమాజంపై దుష్ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. దీని పర్యవసానాలపై యునెస్కో అంతర్జాతీయంగా అనేక కోణాల్లో అధ్యయనం చేసి, ఇటీవల ‘కోవిడ్–19 ఎడ్యుకేషన్ రెస్పాన్స్’ పేరిట నివేదికను విడుదల చేసింది. విద్యా సంస్థల మూసివేత వల్ల విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు.. అంతిమంగా సమాజానికి ఎంతటి నష్టమో వివరించింది. ప్రత్యక్ష బోధన లేక సామర్థ్యాలు, నైపుణ్యాలకు దెబ్బ పాఠశాలలు తెరచి ప్రత్యక్ష బోధన చేయడం వల్ల విద్యార్థులకు ఆశించిన మేరకు అభ్యాసన సామర్థ్యాలు లభిస్తాయి. పాఠశాలలు మూసివేస్తే వారిలో ఉన్న అభ్యసన సామర్థ్యాలను కూడా కోల్పోతున్నారు. సందేహాలు తీర్చే వారుండరు. వారిలోని లోపాలను సరిచేసే వారుండరు. దీంతో వెనుకబాటుకు గురవుతున్నారు. గత రెండేళ్లలో పాఠశాలలు మూతపడి ఈ సమస్య చాలా పెరిగిందని అసర్ సర్వే కూడా తేటతెల్లం చేసింది. స్కూళ్ల మూసివేత వల్ల అట్టడుగు వర్గాల పిల్లలు మరింతగా నష్టపోతారని యునెస్కో తెలిపింది. పాఠశాలలకు వచ్చే పిల్లల్లో, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల పిల్లల్లో అత్యధికులు పేద వర్గాల వారే. వీరికి సరైన ఆహారమూ ఇళ్లలో అందదు. పాఠశాలలు తెరిస్తే మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందుతుంది. లేకపోతే ఆ ఆహారమూ లేక ఆకలితో అలమటిస్తారు. సరైన ఆహారం అందక శారీరక ఎదుగుదల కూడా దెబ్బతింటుంది. డిజిటల్ పరికరాల లేమి ఆన్లైన్ బోధనకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా శాఖ తగిన ఏర్పాట్లు చేస్తున్నా, ఈ స్కూళ్లలో చదివేది అత్యధికులు నిరుపేద విద్యార్థులే. వారికి డిజిటల్ పరికరాలు లేక ఆన్లైన్ బోధనను అందుకోలేకపోతున్నారు. మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల పిల్లలు మరింత వెనుకబాటుకు లోనవుతున్నారు. వారి కోసం దూరదర్శన్, ఆలిండియా రేడియోల ద్వారా పాఠాలను ప్రసారం చేయిస్తున్నా, టీవీ లేని వారికి అవీ అందడంలేదు. పాఠాలు ప్రసారమయ్యే సమయాల్లో పిల్లలను టీవీలు, రేడియోల ముందు కూర్చోబెట్టి వాటిని నేర్చుకొనేలా చేసే అవకాశం పనులకు వెళ్లిపోయే ఆ పేద తల్లిదండ్రులకు ఉండడంలేదు. డిజిటల్ పరికరాలు ఉన్న టీనేజ్ పిల్లలు కొన్ని సందర్భాల్లో ఇతర దురలవాట్లకు లోనయ్యే ప్రమాదమూ ఉంటోంది. వాటి ద్వారా పాఠాల అభ్యసనానికి బదులు ఇతర దుష్ప్రభావాలకు లోనవుతున్నారు. అదే స్కూళ్లు తెరిచి ఉన్నప్పుడు పిల్లల చదువు సంధ్యలను టీచర్లు పర్యవేక్షిస్తారు. పాఠశాలలు మూసివేత వల్ల వైరస్ భయంతో పెద్దలు పిల్లలను బయట కూడా తిరగనివ్వడంలేదు. పిల్లలు ఇళ్లలోనే మగ్గిపోయి, మానసికంగా అనారోగ్యం పాలవుతున్నారు. పిల్లల సంరక్షణ, ఆర్థిక సమస్యలు ఇతర కారణాలతో పెద్దల ఆరోగ్యమూ దెబ్బతింటోంది. ఇది ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోందని యునెస్కో అభిప్రాయపడింది. బాల్య వివాహాలు పాఠశాలలు మూతపడి స్కూళ్లకు వెళ్లాల్సిన టీనేజ్ ఆడ పిల్లలు ఇళ్లకే పరిమితమై పోతుండడంతో తల్లిదండ్రులు వారికి పెళిŠల్ చేసే ఆలోచనలు చేస్తున్నారు. ఇది బాల్య వివాహాలకు దారితీస్తోంది. కొన్ని చోట్ల ఇళ్లకే పరిమితమై ఉండే బాలికలపై లైంగిక వేధింపులు కూడా జరుగుతున్నట్లు యునెస్కో వివరించింది. ఉపాధ్యాయులకూ సమస్యే పాఠశాలలు తెరిస్తే ఉపాధ్యాయులు నేరుగా బోధిస్తారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగు పరుస్తారు. పిల్లలతో నేరుగా సంభాషించి, వారిలోని లోపాలను అప్పటికప్పుడు సరిచేస్తారు. సందేహాలను నివృత్తి చేస్తారు. అదే స్కూళ్లు మూతపడితే ఆన్లైన్లోనో, డిజిటల్ విధానం, వాట్సప్, ఇతర ప్రక్రియల ద్వారా బోధించాలి. విద్యార్ధులతో నేరుగా మాట్లాడలేరు. వారి సామర్థ్యాలను అంచనా వేయలేరు. మరోవైపు పాఠ్యాంశాలను ఆన్లైన్, డిజిటల్ ప్రక్రియల్లోకి మార్చడం కూడా టీచర్లకు సమస్యే. వీడియోలో రికార్డు చేసి బోధించడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. డిజిటల్ కంటెంట్లను విద్యార్థులకు సరిగా అందించలేక ఎక్కువ శాతం టీచర్లు నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు. ఆన్లైన్ బోధన వల్ల పరీక్షల నిర్వహణ, ఫలితాలు కూడా సరిగా ఉండవని యునెస్కో వెల్లడించింది. గత రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించినా కోవిడ్ కారణంగా సాధ్యం కాలేదు. అనివార్య పరిస్థితుల్లో పిల్లలందరినీ వారి సామర్థ్యాలు, ప్రతిభతో సంబంధం లేకుండా ఆల్పాస్గా ప్రకటించాల్సి వచ్చింది. తల్లిదండ్రులపైనా తీవ్ర ఒత్తిడి పాఠశాలల మూత వల్ల పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. పిల్లలకు ఆండ్రాయిడ్ ఫోన్లు, కంప్యూటర్లు వంటివి అందించడం పెద్ద సమస్యగా మారింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు వీటి కోసం అప్పుల పాలవుతున్నాయి. చాలామంది వీటిని సమకూర్చలేక పిల్లల చదువులపై ఆందోళనకు గురవుతున్నారు. పిల్లలకు ఆ పరికరాలు సమకూర్చినా, చదువులు ఎలా సాగుతున్నాయోనని పర్యవేక్షణ మరో సమస్య. వాటి వినియోగంలో పిల్లలు సరైన మార్గంలో వెళ్తున్నారో లేదో అర్థంకాక అయోమయంలో పడుతున్నారని యునెస్కో తెలిపింది. పాఠశాలలకూ ఆన్లైన్ వనరులు సమకూర్చడం సమస్యే పాఠశాల తరగతిలో బోధన జరిగితే స్కూళ్ల యాజమాన్యాలు ఉన్న వనరులతో మంచి ఫలితాలు సాధించే వీలుంటుంది. పాఠశాలలు మూసివేస్తే ఆన్లైన్ బోధనకు ఏర్పాట్లు చేయడం స్కూళ్లకూ సమస్యగా మారింది. ఆన్లైన్ బోధనకు అనువుగా పోర్టళ్లు, కంటెంట్ను రూపొందించాలి. ఇవన్నీ యాజమాన్యాలకు తలకుమించిన భారం. వీడియో కంటెంట్లు, లైవ్ ఆన్లైన్ తరగతులు కొన్ని కార్పొరేట్ స్కూళ్లలో కూడా పరిమితంగానే అమలవుతున్నాయి. బడ్జెటరీ పాఠశాలల్లో అదీ ఉండడం లేదు. ఏపీలో అనేక జాగ్రత్తలతో పాఠశాలలు పాఠశాలల మూసివేత వల్ల అనేక నష్టాలు, పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరమయ్యే ప్రమాదం ఉండడంతో రాష్ట్రంలో పాఠశాలలను కొనసాగించడంపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ çపూర్తిస్థాయి జాగ్రత్తలతో విద్యా సంస్థలను నిర్వహిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేసింది. 15 ఏళ్లు పైబడిన పిల్లలకు కూడా యుద్ధప్రాతిపదికన టీకాలు వేస్తోంది. ప్రభుత్వ చర్యలతో సంక్రాంతి సెలవుల అనంతరం సోమవారం నుంచి ప్రారంభమైన స్కూళ్లకు తొలి రోజే 61 శాతం మంది పిల్లలు హాజరవడం విశేషం. ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ మేలు మానసిక కోణంలో ఆలోచిస్తే విద్యార్ధులకు శిక్షణ, క్రమశిక్షణ చాలా అవసరం. పాఠశాలలు చదువు చెప్పే కేంద్రాలే కావు. పిల్లల్లో సమగ్రమైన అభివృద్ధికి, భావి పౌరులుగా తీర్చిదిద్దే సంస్థలు. పిల్లల్లోని ఎమోషన్సును బేలెన్సు చేసేవి స్కూళ్లే. ఎక్కువ సమయం స్కూల్లోనే ఉంటారు కనుక అనేక అంశాలు నేర్చుకుంటారు. టీచర్ నేరుగా చెప్పడం ద్వారానే ఎక్కువగా నేర్చుకోగలుగుతారు. సాధ్యమైన మేరకు తరగతులు నిర్వహించడమే మంచిది. పిల్లలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలతో పాఠశాలలు నిర్వహించడమే మేలు. – డాక్టర్ ఎన్వీఎస్ సూర్యనారాయణ, సైకాలజిస్టు, విజయనగరం స్కూళ్లు మూస్తే నష్టం స్కూళ్లు మూసివేయడం వల్ల గత రెండేళ్లుగా మా పిల్లలు చాలా నష్టపోయారు. ఆన్లైన్ బోధన వల్ల పాఠాలేవీ నేర్చుకోలేదు. వారి పరిస్థితి చూసి మాకే కష్టమనిపించింది. ఇప్పుడు కూడా స్కూళ్లు మూసివేస్తే మరింత నష్టపోతారు. కరోనా ఉన్నా మాస్కులు వేసి స్కూళ్లకు పంపిస్తున్నాం. ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకొని పాఠశాలలు నడిపించడమే మంచిది. – పెద్దిరెడ్డి (విద్యార్థి తండ్రి) పడమటి యాలేరు, ఆత్మకూరు మండలం, అనంతపురం జిల్లా అన్నీ తెరిచే ఉన్నాయిగా.. సినిమా హాళ్లు, షాపులు, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, మార్కెట్లు అన్నీ తెరిచే ఉంటున్నాయి. పండగలు, జాతరలు, ఉత్సవాలూ వేలాది మందితో జరుగుతున్నాయి. వాటివల్ల రాని కరోనా సమస్య పాఠశాలలు తెరిస్తే వస్తుందా? రెండేళ్లుగా పాఠశాలలు సరిగా తెరవకపోవడం వల్ల పిల్లలు చాలా నష్టపోతున్నారు. ఇప్పటికీ స్కూళ్లు మూసే ఉంటే వారి భవిష్యత్తు దెబ్బతింటుంది. అన్ని జాగ్రత్తలు తీసుకొని స్కూళ్లలోనే పాఠాలు చెప్పాలి. – శ్రీధర్, ప్రభుత్వ ఉద్యోగి, అనంతపురం మరింత నష్టపోకూడదు పిల్లలకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకొని స్కూళ్లు తెరవడమే మేలు. ఇప్పటికే రెండు విద్యా సంవత్సరాలు పిల్లలు నష్టపోయారు. వారు మరింత నష్టపోకుండా స్కూళ్లలోనే బోధన జరగాలి. పిల్లలకు వ్యాక్సిన్ వేస్తున్నందున ఎలాంటి ఇబ్బంది రాదు. – ఓబుళపతి, వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి -
సిలబస్ టెన్షన్.. బుర్రకెక్కింది అంతంతే...
సాక్షి, హైదరాబాద్: మళ్లీ ఆన్లైన్ బోధన నేపథ్యంలో సిలబస్ పూర్తి కావడం ప్రశ్నార్థకంగా తయారైంది. ఒకవైపు ఉపాధ్యాయులు, మరోవైపు విద్యార్థుల్లో సిలబస్ టెన్షన్ మొదలైంది. కరోనా నేపథ్యంలో పాఠశాలల పునఃప్రారంభం ఆలస్యం కావడంతో ఉన్నత తరగతులకు సిలబస్ 40 శాతం మించలేదు. గురుకుల విద్యాసంస్థల్లో పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ఇక ప్రభుత్వ విద్యా సంస్థల్లో సిలబస్ కనీసం 20 నుంచి 30 శాతం మించలేదు. గత నెల రోజులుగా ఉపాధ్యాయుల బదిలీల వ్యవహారం ప్రత్యక్ష బోధనపై తీవ్ర ప్రభావం చూపించింది. బుర్రకెక్కింది అంతంతే... ఈ విద్యా సంవత్సరం కూడా పాఠ్యాంశాలపై విద్యార్థులు పట్టు సాధించలేక పోతున్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మొదటి మూడు నెలలు ఆన్లైన్ విధానంలో బోధన కొనసాగగా, ఆ తర్వాత నాలుగు నెలల క్రితం విద్యా సంస్థలు పునఃప్రారంభమై ప్రత్యక్ష బోధనకు శ్రీకారం చుట్టారు. అక్టోబర్ నాటికి పూర్తయిన సిలబస్ ఆధారంగా గత నెలలో ఎస్ఏ– 1 పరీక్షలు నిర్వహించగా పాఠ్యాంశాలపై విద్యార్థుల పట్టు అంతంత మాత్రంగా బయటపడింది. కనీసం పదో తరగతి విద్యార్థులు సైతం పాఠ్యాంశాలపై పెద్దగా పట్టు సాధించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రాజెక్టులకే పరిమితం పదో తరగతి మినహా మిగతా తరగతుల విద్యార్థులు పాఠ్యాంశాలకు బదులు ప్రాజెక్టులకు పరిమితమయ్యారు. పాఠ్యాంశాల బోధన పక్కనపెట్టి ప్రాజెక్టులు ఇవ్వడం సర్వసాధారణమైంది. వాస్తవానికి సిలబస్ 30 శాతం కూడా మించలేదు. ఇక ప్రభుత్వ పాఠశాల పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. గత రెండేళ్లుగా చదువులు సరిగా సాగకపోవడంతో విద్యార్థులు పాఠ్యంశాలపై పట్టు సాధించలేకపోయారు. ఇక ఆన్లైన్ తరగతులే.. ► కరోనా మూడో దశ ఉద్ధృతి నేపథ్యంలో విద్యా సంస్థలు మళ్లీ ఆన్లైన్ సిద్ధమయ్యాయి, సోమవారం నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు వాట్సాప్ సందేశాలు పంపించాయి. తరగతుల షెడ్యూలు కూడా ప్రకటించాయి. (చదవండి: హైదరాబాద్లో ఊపందుకున్న రియల్టీ జోరు) ► సంక్రాంతి సెలవులు ఆదివారంతో ముగియడంతో తాజా కరోనా పరిస్థితుల దృష్ట్యా విద్యాసంస్థలకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. విద్యార్థులు నష్టపోకుండా ఆన్లైన్ తరగతులను నిర్వహించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో విద్యా సంవత్సరం ఆరంభంలో మొదట మూడు నెలల పాటు ఆన్లైన్ పద్ధతిలో కొనసాగినా బోధన వైరస్ ప్రభావం తగ్గుదలతో గత నాలుగు నెలలక్రితం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. దీంతో అప్పటి నుంచి ప్రత్యక్ష బోధన కొనసాగుతోంది. గత నెల చివరి అంకం నుంచి వైరస్ విజృంభిస్తుండటంతో ప్రత్యక్ష బోధన ప్రశ్నార్థకంగా తయారైంది. దీంతో ముందస్తుగా సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. వైరస్ ఉద్ధృతి తగ్గక పోవడంతో సెలవులు పొడిగిస్తూ ఆన్లైన్ తరగతులకు వెసులుబాటు కల్పించింది. (చదవండి: తెలంగాణ కేబినెట్ భేటీ: కొత్త చట్టం కోసం..) -
ఆన్లైన్ పాఠాల్లేవ్.. పనులే
ఆన్లైన్ పాఠాలు అర్థంగాక.. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అనంతగిరికి చెందిన ఈ విద్యార్థి పేరు నరేశ్. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఆన్లైన్ పాఠాలు అర్థంకావడం లేదని ఆవేదన చెందుతున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు అన్నయ్యకు తోడుగా గొర్రెలు మేపేందుకు పంపుతున్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ పనులకు వెళ్తున్న క్రమంలో.. పదేళ్లలోపు పిల్లలను ఇంటివద్ద ఒంటరిగా వదలలేక పోతున్నారు. ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నా తమ వెంట తీసుకెళ్తున్నారు. కరోనాతో ఉపాధి దెబ్బతినడం.. ఆస్పత్రులకు అయిన ఖర్చులతో చాలా కుటుంబాలు అప్పుల పాలయ్యాయి. ఇప్పుడు వ్యవసాయ పనుల సీజన్ కావడం, ఆన్లైన్ క్లాసులు అర్థంకాని పరిస్థితులు ఉండటంతో.. పిల్లలను కూడా పనులకు పంపుతున్నారు. కూలీల కరువు.. రేట్లు పెరగడంతో.. ఈ ఫోటోలో కన్పిస్తున్న విద్యార్థి పేరు పీరబోయిన గణేశ్. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం లింగాలకు చెందిన గణేశ్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కూలి రేట్లు పెరిగిపోయి తల్లిదండ్రులు వ్యవసాయంలో ఇబ్బంది పడుతుండటంతో.. క్లాసులకు హాజరుకాకుండా తల్లిదండ్రులకు సాయం చేస్తున్నాడు. (సాక్షి నెట్వర్క్) కరోనా దెబ్బతో పాఠశాలలు మూసి ఉంచడం, ఆన్లైన్ పాఠాలే దిక్కు అవడం పిల్లల చదువులకు శరాఘా తంగా మారింది. సెల్ఫోన్లు, ట్యాబ్లు లేక, అవి ఉన్నా సిగ్నళ్లు సరిగా అందక, డేటా చార్జీలను భరించలేక, అన్నీ ఉన్నా ఆన్లైన్ పాఠాలు అర్థంగాక.. పిల్లలు చదువులు వదిలి పనుల బాట పడుతున్నారు. ఈ పరిస్థితిపై ‘సాక్షి’ రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల ఉపా ధ్యాయులతో మాట్లాడి పలు అంశాలపై సర్వే చేసింది. ఈ సందర్భంగా విద్యార్థుల ఇబ్బందులను గుర్తించింది. ఆన్లైన్ పాఠాలు, బోధన తీరుపై దాదాపు అందరిలోనూ అసంతృప్తి కనిపించింది. ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు రాయటం, చదవటం సమస్యగా మారిందని.. వారి మానసిక స్థితి ఇబ్బందికరంగా తయారవుతోందని ఆందో ళన వ్యక్తమైంది. ఆన్లైన్ పాఠాలు అర్థమయ్యే పరిస్థితి లేద ని.. పలు కఠిన నిబంధనలు పెట్టి అయినా పాఠశాలలను తెరవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయులు కూడా అభిప్రాయపడటం గమనార్హం. ‘సాక్షి’ నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనపై ప్రత్యేక కథనం.. ఆర్థిక ఇబ్బందులతో.. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఆన్లైన్ క్లాసులు ఓ మోస్తరుగా బాగానే జరుగుతున్నా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పేద కుటుంబాలు కావడంతో స్మార్ట్ఫోన్లు కొనలేకపోవడం, కొన్నా డేటా కోసం అదనపు ఖర్చు, ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నచోట ఒకే ఫోన్ ఉండటంతో వారు మాత్రమే పాఠాలు వినడం వంటివి జరుగుతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తల్లిదండ్రులు పిల్లలను వ్యవసాయం, ఇతర పనులకు తీసుకెళ్తు న్నారు. ఆన్లైన్ పాఠాలు సరిగా అర్థం కావడంలేదని పిల్లలు చెప్తుండటం, ఇంట్లోనే ఉంటుండటం కూడా దీనికి కారణమవుతోంది. వ్యవసాయ సీజన్ కావడంతో కూలీల కొరత నెలకొంది. రేట్లు పెరిగాయి. దీనివల్ల కూడా పిల్లలు ఆన్లైన్ పాఠాలను పక్కనపెట్టి.. కూలిపనులకు వెళ్లడం పెరిగింది. అందని సిగ్నళ్లు.. కరెంటు కోతలు పట్టణప్రాంతాల్లో సెల్ఫోన్ సిగ్నళ్లు బాగానే ఉన్నా.. జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాల్లో సెల్ఫోన్ సిగ్నళ్లు సరిగా అందడం లేదు. కాసింత సిగ్నల్ వచ్చినా అది ఆన్లైన్ పాఠాలకు సరిపడేంతగా డేటా స్పీడ్ రావడం లేదు. పొలాల్లో మంచెలు, చెట్లు ఎక్కి పాఠాలు వినాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల జిల్లా కేంద్రాలకు పది కిలోమీటర్ల దూరంలోనే ఉన్న గ్రామాల్లో కూడా సెల్ఫోన్ సిగ్నల్స్ సరిగా ఉండటం లేదు. అక్కడక్కడా కరెంటు కోతలు కూడా ఉంటున్నాయి. దీంతో పిల్లలు ఆన్లైన్ క్లాసులు వినలేకపోతున్నారు. ఇంట్లో ఖాళీగా ఉండలేక తల్లిదండ్రులతో పనులకు వెళ్తున్నారు. ఆన్లైన్ పాఠాలు అర్థంగాక.. చాలా మంది విద్యార్థులు తమకు ఆన్లైన్ పాఠాలు సరిగా అర్థంకావడం లేదని వాపోతున్నారు. సిగ్నల్ సరిగాలేక తరచూ ఆగిపోతుండటం, ఉపాధ్యాయుల గొంతు సరిగా వినిపించకపోతుండటం వంటి సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. దానికితోడు తమ వద్ద ఉన్న ఫోన్లలో ధ్వని సరిగా రావడం లేదని కొందరు చెప్తున్నారు. ఏదైనా సందేహం వస్తే.. అడిగి తెలుసుకునే అవకాశం లేక పాఠం అర్థంకావడం లేదని వాపోతున్నారు. ఫోన్లలో గేమ్స్ ఆడుతున్నారని.. ఆన్లైన్ పాఠాల కోసమని తల్లిదండ్రులు స్మార్ట్ఫోన్ అప్ప గిస్తే.. పలుచోట్ల పిల్లలు గేమ్స్ ఆడుతూ, యూట్యూబ్లో వీడియోలు చూస్తూ గడిపేస్తున్నారు. ఫోన్కు బానిసలుగా మారుతున్నారు. పిల్లలను ఆన్లైన్ క్లాసుల కోసం ఇంట్లో వదిలి తల్లిదండ్రులు ఇద్దరూ పనులకు వెళ్తున్న చోట ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. అంతేగాకుండా పిల్లలు క్లాసులను పక్కనపెట్టేసి ఆటలు ఆడటానికి వెళ్తున్నారని కొందరు తల్లిదండ్రులు చెప్పారు. అందుకని ఇంట్లో వదలకుండా వ్యవసాయం, ఇతర పనుల కోసం తమ వెంట తీసుకెళ్తున్నామని తెలిపారు. సరైన పర్యవేక్షణ, అవగాహన ఏదీ.. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఆన్లైన్ తరగతులతోపాటు టీవీల్లో డిజిటల్ పాఠాలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఫోన్, టీవీ సదుపాయం లేనివారికి సమీపంలోని తోటి విద్యార్థుల ఇళ్లలోగానీ, గ్రామ పంచాయతీల్లోని టీవీల్లో గానీ తరగతులు వీక్షించేలా ఏర్పాట్లు చేయా లని విద్యా శాఖ గతంలోనే ఆదేశించింది. కానీ ఈ విషయంగా సరైన పర్యవేక్షణ జరగక.. చాలా మంది విద్యార్థులు పాఠాలకు దూరమవుతున్నారు. ఎక్కడిక్కడ 70–80 శాతం మంది విద్యార్థులు ఆన్లైన్/డిజిటల్ తరగతులకు హాజరవుతున్నట్టు అధికారులు చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. పాఠాలు వింటున్నది సగమే! ఆన్లైన్/డిజిటల్ పాఠాలపై ‘సాక్షి’నిర్వహించిన సర్వేలో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. పాఠశాల ల్లో తోటివారితో కలిసి చదువుకునే విద్యార్థులు.. ఇప్పుడు ఒంటరితనం అనుభవిస్తున్నారని, ప్రవర్తనలో మార్పులు వచ్చాయని, క్రమశిక్షణ లేని పరిస్థితి నెలకొందని తల్లిదండ్రులు వెల్లడించారు. విద్యార్థులకు ఫోన్ వ్యసనంగా మారుతోందని, గేమ్స్ ఆడటం, వీడియోలు చూడటం వంటివి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ కారణాలతో పాఠాలు వినడం లేదని.. విన్నా సరిగా అర్థం కావడం లేదని దాదాపు సగం మంది విద్యార్థులు తెలిపారు. ఆన్లైన్ తరగతులు బాగోలేవని విద్యార్థులు, తల్లిదండ్రులతోపాటు టీచర్లు కూడా అభిప్రాయపడ్డారు. తరగతుల కోసం స్మార్ట్ఫోన్/ట్యాబ్ అందుబాటులో లేవని, అప్పులు చేసి కొన్నామని కొందరు తల్లిదండ్రులు తెలిపారు. ఆన్లైన్ పాఠాలకు ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల అభిప్రాయాలు. స్మార్ట్ఫోన్ లేక.. పశువులు కాస్తున్న ఈ చిన్నారి పేరు గణేశ్. మెదక్ మండలం మక్తభూపతిపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఇంట్లో తండ్రి శ్రీశైలం వద్ద ఒక్కటే ఫోన్ ఉంది. ఆయన బయటికి వెళ్తే.. గణేశ్ పాఠాలు వినే పరిస్థితి లేదు. దాంతోపశువులు మేపేందుకు వెళ్తున్నాడు. పాఠాలు సరిగా వినట్లేదని.. ఈ ఫొటోలోని బాలుడి పేరు వినయ్ కుమార్. సూర్యాపేట జిల్లాలోని కుంటపల్లికి చెందిన ఈ బాలుడు ఐదో తరగతి చదువుతున్నాడు. ఆన్లైన్ క్లాసులు అర్థంకావడం లేదంటూ పాఠాలు వినడం లేదు. ఇంట్లోంచి బయటికెళ్లి ఆటలాడుతున్నాడని, ఏదైనా ప్రమాదానికి గురవుతాడోనని ఆందోళన చెందిన తండ్రి మల్లయ్య.. వినయ్ను వ్యవసాయ పనులకు తీసుకెళ్తున్నాడు. స్మార్ట్ఫోన్ కోసం.. ఈ ఫొటోలో వరినారు తీస్తున్న విద్యార్థి పేరు శేఖర్. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సిర్సాకు చెందిన శేఖర్.. ఆసిఫాబాద్ సాంఘిక సంక్షేమ గురుకులంలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. స్మార్ట్ఫోన్ లేక ఆన్లైన్ పాఠాలు వినడం లేదు. ఫోన్ కొనుక్కునేందుకు డబ్బుల కోసం కూలిపనులకు వెళ్తున్నట్టు తెలిపాడు. వారానికి రెండు క్లాసులైనా.. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు వారానికి రెండు క్లాసులైనా తీసుకుంటే మంచిది. దూరదూరంగా కూర్చోబెట్టి బోధన చేయొచ్చు. మిగతా రోజుల్లో వర్క్షీట్ల ద్వారా పాఠాలపై అవగాహన కల్పించవచ్చు. ఆన్లైన్ ద్వారా ఏకబిగిన పాఠాలు బోధించడం వల్ల కంఠశోష తప్ప పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. - జి.నాగభూషణం, ప్రధానోపాధ్యాయుడు, మన్నెంపల్లి, కరీంనగర్ జిల్లా -
పుస్తకాల్లేని చదువులు.. విద్యార్థుల చింత
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అసలే టీవీ పాఠాలు. వాటిని వింటున్న విద్యార్థులు చాలా తక్కువ. అధికారుల లెక్కల ప్రకారం 9, 10 తరగతుల విద్యార్థులు కొంతమేరకు టీవీ పాఠాలను చూస్తున్నా.. ఎక్కువ మంది విద్యార్థులు చదువు లకు దూరమయ్యారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. తమ పిల్లలకు విద్యా బోధన ఎలా? అని ఆవేదన చెందుతున్నారు. టీవీ పాఠాలు పెద్దగా అర్థంకావడం లేదని, కనీసం పుస్తకాలున్నా కొంతవరకు వాటిని చదువుకొని ఉపాధ్యాయులను ఫోన్లలో అడిగి సందేహాలను నివృత్తి చేసుకునే వారమని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో టీచర్లు వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నా.. అవి అత్యధిక మంది విద్యార్థులకు చేరడం లేదు. 8 జిల్లాల్లో అందని పాఠ్య పుస్తకాలు రాష్ట్రంలోని 8 జిల్లాల్లో విద్యార్థులకు ఇంతవరకు పాఠ్య పుస్తకాల పంపిణీనే ప్రారంభించలేదు. ఆదిలాబాద్, జోగుళాంబ, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్నగర్, ములుగు, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లా కేంద్రాలకు పాఠ్య పుస్తకాలు చేరినా వాటిని మండల స్థాయికి, పాఠశాలలకు పంపించి విద్యార్థులకు పంపిణీ చేయడంలో అధికారులు విఫలమయ్యారు. 12 జిల్లాల్లో 20 శాతంలోపే పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు ఇవ్వగా, ఆరు జిల్లాల్లో 20-50 శాతంలోపు పంపిణీ చేశారు. కేవలం ఏడు జిల్లాల్లో మాత్రమే ఎక్కువ మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందినట్లు అధికారులు తేల్చారు. విందామన్నా.. నెట్వర్క్తో ఇబ్బంది చాలా జిల్లాల్లో విద్యార్థులు టీవీ పాఠాలను వినేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. టీవీల్లో ఏయే సమయాల్లో ఆ పాఠాలను బోధిస్తారనే విషయంపై అవగాహన లేక ఇబ్బంది పడుతున్నారు. టీచర్లు కొంత చొరవ తీసుకొని వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి పాఠాలు ప్రసారమయ్యే సమయం తెలియజేస్తున్నారు. దీంతో కొద్దిమంది వాటిని వింటున్నారు. మిగతా విద్యార్థుల్లో స్మార్ట్ ఫోన్లు కలిగిన కొందరు విద్యార్థులు టీశాట్ యాప్లను డౌన్లోడ్ చేసుకొని పాఠాలను విందామనుకుంటే నెట్వర్క్ సమస్యలతో వీడియో పాఠాలను వినలేకపోతున్నారు. పుస్తకాలు ఇవ్వలేదు మా పాప పదో తరగతి రామన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతోంది. ఆన్లైన్ తరగతులు ప్రారంభమై 12 రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు పుస్తకాలు రాలేదు. ఆన్లైన్ తరగతులు జరుగుతున్న నేపథ్యంలో ఏమైనా సందేహాలు చూసుకునేందుకు పుస్తకాలు లేవు. దీంతో ఇబ్బంది పడుతోంది. - సుభద్ర, విద్యార్థిని తల్లి, రామన్నపేట ఏమి అర్థం కావడం లేదు ఆన్లైన్ పాఠాలు జరుగుతున్నా పుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఆన్లైన్లో పాఠాలు చూడటం తప్పæ పుస్తకంలో చదువుకునే వీలులేకుండా పోతోంది. సందేహం వస్తే పుస్తకాలు లేకపోవటంతో ఏమీ అర్థంకావడం లేదు. - రాకేశ్, 10వ తరగతి ,బాలుర ఉన్నత పాఠశాల, మంచిర్యాల పుస్తకాలు లేకుండా విద్య ఎలా? ఆన్లైన్లో బోధించేటప్పుడు విద్యార్థులకు పుస్తకాలు ముందు ఉండాలి. అర్థంకాని అంశాలను అందులో చూసి చదువుకుంటారు. పుస్తకాలు లేకుండా విద్యార్థులకు విద్యనందించడం సాధ్యం కాదు. పుస్తకాలు లేకుండా క్లాస్లు నిర్వహిస్తే ప్రయోజనం ఉండదు. అందరికీ పుస్తకాలు అందేలా చూడాలి. - తుకారం, టీచర్, రెబ్బెన, ఆసిఫాబాద్ జిల్లా -
Telangana: రేపటి నుంచే ఆన్లైన్ తరగతులు
సాక్షి, కాళోజీ సెంటర్(వరంగల్): కరోనా వ్యాప్తి నేపధ్యంలో పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యక్ష బోధన చేపట్టే పరిస్థితి లేదని ప్రభుత్వం గుర్తించి ఈ విద్యాసంవత్సరం (2021–22) కూడా ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఆన్లైన్ తరగతులు నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో 1, 2 తరగతుల విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి డిజిటల్ పాఠాలు ప్రారంభించనున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంగించరాదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థుల ఇళ్లల్లో టీవీ లేకపోతే గ్రామ పంచాయతీ కార్యాలయాలు, గ్రంథాలయాల్లో, స్మార్ట్ ఫోన్లో తరగతులు వినే విధంగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి తెలిపారు. గత ఏడాది అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది అందుకు తగిన ఏర్పాట్లు చేపట్టారు. 6,7,8 తరగతులు చదువుతున్న 44,918 మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. వీరందరికి పాఠశాలలు ప్రారంభం రోజు నుంచి పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. విధులకు 50 శాతమే హాజరు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పాఠశాలలకు రోజుకు 50 శాతం సిబ్బంది హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. విధులకు హాజరైన టీచర్లు విద్యార్థులు ఆన్లైన్ తరగతులు వింటున్నారా? లేదా అనేది పర్యవేక్షణ చేయనున్నారు. డిజిటల్ తరగతుల సందర్భంగా విద్యార్థులకు ఎలాంటి సౌకర్యం లేకపోతే వెంటనే అందుబాటులో ఉన్న విద్యార్థుల ఇంటి వద్ద వినేవిధంగా ఉపాధ్యాయులు చర్య తీసుకోవాలని. గతంలా కాకుండా ఈ ఏడాది మార్కుల ఆధారంగానే ఉత్తీర్ణులను చేసే అవకాశం ఉందని, అందుకు విద్యార్థులను తయారు చేయాలని ఆలోచిస్తున్నారు. ముందుగానే విద్యార్థులకు వర్క్షీట్ అందజేస్తారు. ఏర్పాట్లు పూర్తి.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆన్లైన్ తరగతుల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే విద్యార్థులను సిద్ధం చేశాం. ఈ సారి పిల్లల ప్రొగ్రెస్ను బట్టి మార్కులు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతీ విద్యార్థి డిజిటల్ తరగతులు వినే విధంగా చూసుకుంటే మంచిది. ఉపాధ్యాయులు కూడా పిల్లల ఇళ్లల్లో డిజిటల్ తరగతులు వింటున్నారా?లేదా అనేది పర్యవేక్షణ చేయాలి. – వాసంతి, డీఈఓ చదవండి: కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సిందే: సుప్రీంకోర్టు -
8వ తరగతి వరకు బడులు బంద్!
సాక్షి, హైదరాబాద్: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన కొనసాగింపుపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. స్కూళ్లు, గురుకులాలు, హాస్టళ్లలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో 8వ తరగతి వరకు ప్రత్యక్ష బోధనను నిలిపేసే అం శాన్ని పరిశీలిస్తోంది. ఈ విషయంలో రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ కూడా అసెంబ్లీలో ప్రకటించారు. ఈ లెక్కన 8వ తరగతి వరకు ప్రత్యక్ష బోధనను నిలిపివేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9, 10 తరగతులకు ప్రభుత్వం ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభించింది. 6, 7, 8 తరగతులకు ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ప్రత్యక్ష బోధనకు అనుమతి ఇచ్చింది. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు మాత్రం ప్రత్యక్ష బోధన చేపట్టవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రైవేటు యాజమాన్యాలు 6, 7, 8, 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధన చేపడుతున్నాయి. ఇదే అదనుగా 85 శాతానికిపైగా విద్యార్థులనుంచి ఫీజులు వసూలు చేసుకున్నాయి. మరోవైపు ప్రత్యక్ష బోధన కార ణంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులు, టీచర్లకు కరోనా సోకడంతో ప్రభుత్వం ఆలోచనల్లో పడింది. ఈ వారంలోనే కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులు, టీచర్ల సంఖ్య వందలకు చేరుకుంది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా మరోసారి వేగంగా విజృంభిస్తోంది. బుధవారం అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని ప్రస్తావించగా.. సీఎం కేసీఆర్ స్పందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. తర్వాత అసెంబ్లీలోనూ దీనిపై మాట్లాడారు. కేసుల నమోదు పెరుగుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని.. ఈ నేపథ్యంలో స్కూళ్లు కొనసాగించడంపై రెండుమూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఏయే తరగతులకు ఉండాలి.. ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి వరకు టీవీ/ ఆన్లైన్ పాఠాలే కొనసాగుతున్నాయి. ప్రత్యక్ష బోధన లేదు. 6, 7, 8, 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధన కొనసాగుతోంది. అయితే 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధన నిలిపేస్తే విద్యార్థులకు బోర్డు పరీక్షలు ఇబ్బందిగా మారుతాయన్న అభిప్రాయం అధికారుల్లో ఉంది. పైగా పదో తరగతి పరీక్షల తేదీలను కూడా ప్రకటించారు. విద్యార్థులు పరీక్ష ఫీజులు కూడా చెల్లించారు. ఈ నేపథ్యంలో 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధన కొనసాగించాలన్న వాదన ఉంది. అయితే వారికి ప్రత్యక్ష బోధన కొనసాగించాలా, ఆన్లైన్తోనే సరిపెట్టాలా? అన్న అంశంపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇక 6, 7, 8 తరగతులకు మాత్రం ప్రత్యక్ష బోధన అవసరం లేదన్న భావనకు ఉన్నతాధికారులు వచ్చినట్టు తెలిసింది. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఆన్లైన్/ డిజిటల్ బోధన కొనసాగించేలా.. వారందరిని పరీక్షలు లేకుండా పైతరగతులకు పంపించేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. వీలైతే 9వ తరగతి విద్యార్థులను కూడా పరీక్షలు లేకుండానే పదో తరగతికి పంపించే అవకాశాలనూ పరిశీలిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు పరీక్షలు లేకుండానే కనీస మార్కులతో పాస్ చేయాలని కొన్ని రోజుల కింద ప్రభుత్వం ఆలోచన చేసింది. కానీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఉన్నతాధికారులు మాత్రం అది సరికాదంటూ ప్రతిపాదనను వ్యతిరేకించినట్టు తెలిసింది. సీఎం కేసీఆర్ త్వరలోనే ఈ అంశాలన్నింటిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. -
‘టీ–శాట్ విద్యా, నిపుణ’ యాప్ సరికొత్త రికార్డు
సాక్షి, హైదరాబాద్: కళాశాల, పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్లో విద్యా సంబంధిత విషయాలను అందిస్తున్న టీ–శాట్ నెట్వర్క్ విద్యా, నిపుణ చానెళ్లు సరికొత్త రికార్డు సృష్టించాయి. ఆ యాప్కు ఏకంగా 10 లక్షల డౌన్లోడ్లు నమోదయ్యాయి. వివిధ పోటీ పరీక్షలకు శిక్షణతో పాటు టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ప్రసారం చేస్తున్న ఈ చానెళ్లు కరోనా మహమ్మారి నేపథ్యంలో పాఠశాల, ఇంటర్ విద్యార్థులకు డిజిటల్ తరగతులను కూడా మొదలుపెట్టాయి. 10 లక్షల డౌన్లోడ్ల మైలురాయిని సాధించిన సందర్భంగా టీ–శాట్ సీఈఓ ఆర్.శైలేశ్రెడ్డి నేతృత్వంలోని బృందం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను కలిసింది. వీరు చేసిన కృషిని మున్సిపల్, ఐటీ శాఖ కేటీఆర్ ప్రశంసించారు. కోవిడ్ పరిస్థితుల్లో డిజిటల్ క్లాసుల ద్వారా ప్రత్యామ్నాయ పద్ధతుల్లో నేర్చుకునే విధానాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడాన్ని మంత్రి కేటీఆర్ అభినందించారు. టీ–శాట్ ప్లాట్ఫామ్ కేవలం విద్యా బోధనకే పరిమితం కాకుండా అన్ని ప్రభుత్వ శాఖలు దాని సేవలు ఉపయోగించుకునేలా రూపొందాలని ఆకాంక్షించారు. టీ–శాట్ సేవలు, విస్తృతిని పెంచేందుకు సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా అధికారులకు సూచించా రు. తమ చానెళ్లు ఇప్పటికే ఎయిర్టెల్, టాటా స్కైతో 43 కేబుల్ నెట్వర్క్లతో పాటు సన్ డైరెక్ట్ డీటీహెచ్లోనూ వీక్షించవచ్చునని సీఈఓ శైలేశ్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం ఉన్నారు. -
భోజనం కోసమే వచ్చేవారికి ఆన్లైన్ క్లాసులా!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణాంతక కోవిడ్ వైరస్ను కట్టడి చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా విద్యాసంస్థలను మూసివేయాల్సి రావడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ మీడియా ద్వారా విద్యా బోధన విధానాన్ని అనసరించాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ప్రైవేటు పాఠశాలలను పక్కన పెట్టి, ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యా సంస్థల్లో ఈ విద్యా విధానం ఏ మేరకు విజయవంమైందో తెలుసుకునేందుకు ‘ఆక్స్ఫామ్ ఇండియా’ స్వచ్ఛందంగా ఓ సర్వే నిర్వహించింది. ఈ సంస్థ ప్రతినిధులు సర్వేలో భాగంగా ఇటీవల బిహార్, చత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించి ఉపాధ్యాయులను, విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకుంది. డిజిటల్ విద్యావిధానం తమ పిల్లలకు అందుబాటులోకి రాలేదని 80 శాతం మంది తల్లిదండ్రులు ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 15 శాతం మంది జనాభాకే ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉంది. ఆ జనాభాలో కూడా దళితులు, ఆదివాసీలు, ముస్లింలకు కూడా నెట్ సదుపాయం అందుబాటులో లేదు. ఆన్లైన్ తరగతులు అందుబాటులో ఉన్న విద్యార్థులకు కూడా పెద్ద ప్రయోజనం కలగలేదని, అందుకు కారణం ఆన్లైన్ క్లాసులకు అనుగుణంగా తగిన పాఠ్య పుస్తకాలు అందుబాటులో లేకపోవడమేనని 80 శాతం మంది తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. (చదవండి: ఆన్లైన్ క్లాసుల్లో పరిస్థితి ఇలానే ఉంటుందేమో?) ఆన్లైన్ తరగతులు ప్రారంభానికే ముందే వాటికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు అందుబాటులో ఉండాలని, అలా లేకపోవడం దురదష్టకరమని 71 శాతం మంది టీచర్లు అభిప్రాయపడ్డారు. డిజిటల్ తరగతుల విధానం దేశంలో కొత్త కాకపోయినా, కొన్ని సామాజిక వర్గాలకు నెట్ సదుపాయం అందుబాటులో లేదని ‘ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్’ సీఈవో రుక్మిణి బెనర్జీ తెలిపారు. కఠిన పరిస్థితుల్లో డిజిటల్ తరగతులు ఆయా సామాజిక వర్గాల విద్యార్థులకు అందుబాటులోకి రాలేదని ఆమె వ్యాఖ్యానించారు. ఇంతకాలం పాటు విద్యా సంస్థలు మూత పడతాయని ఎవరూ ఊహించలేక పోయారని ఆమె చెప్పారు. గత మార్చి నెలలో లాక్డౌన్ కారణంగా పాఠశాలలను మూసివేయగా, జూన్ నెలలో ఆన్లైన్ క్లాసులను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలకు వెనక బడిన వర్గాల పిల్లల్లో ఎక్కువ మంది మధ్యాహ్న భోజన పథకం కోసమే వస్తారు. ఇక వారు ఆన్లైన్ క్లాసులకు హాజరవుతారనుకోవడం కలలోని మాటే. మధ్యాహ్న భోజనంతోపాటు వారికిచ్చే లర్నింగ్ పరికరాలను కూడా పునరుద్ధరించాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ 35 శాతానికి మించి పిల్లలకు ఈ సదుపాయం అందడం లేదని సర్వేలో తేలింది. (చదవండి: ఇంటివద్దకే బడి) -
సందేహాలు తీరేదెలా?
సాక్షి, హైదరాబాద్: ‘మెజారిటీ విద్యార్థులు గణి తంలో కొద్దిగా వీక్గా ఉంటారు. టీశాట్ ద్వారా ఆన్లైన్లో తరగతులు బోధిస్తామంటున్నారు. మరి విద్యార్థులకు వచ్చే సందేహాలను ఎలా నివృత్తి చేస్తారు?’అని హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆన్లైన్ క్లాసులను నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ ప్రైవేట్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్రెడ్డి లతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. సెప్టెం బర్ 1 నుంచి ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ పాఠ శాలల విద్యార్థులకు తరగతులు బోధించాలని నిర్ణయించామని, గురువారం (ఈనెల 27) నుంచి ఉపాధ్యాయులు విధులకు హాజరుకావా లని ప్రభుత్వం ఆదేశించిందని స్పెషల్ జీపీ సంజీవ్ కుమార్ నివేదించారు. టీశాట్ ద్వారా 1–5వ తరగతి మధ్య విద్యార్థులకు 90 నిమిషాల పాటు, 6–8వ తరగతి మధ్య విద్యార్థులకు 2 గంటలపాటు, 9–10వ తరగతి విద్యార్థులకు 3 గంటలపాటు ఆన్లైన్ పాఠాలు ఉంటాయని, శని, ఆదివారాలు సెలవులు ఉంటాయని తెలిపారు. టీవీ అందుబాటులో లేని విద్యార్థులకు గ్రామ పంచాయతీ, సమీపంలోని అంగన్వాడీ కేంద్రాల్లోని టీవీలో పాఠాలు వినే ఏర్పాటు చేశామని, ప్రతి విద్యార్థి పాఠాలు విలేనా ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటారని వివరించారు. ‘ఆన్లైన్ క్లాసులకు హాజరు తప్పనిసరా? హాజరుకాకపోతే ఎటువంటి పరిణామాలుంటాయి? ఒకే ఇంట్లో 5వ, 8వ, 11వ తరగతి చదివే ముగ్గురు విద్యార్థులుంటే వారు టీశాట్లో ఒకేసారి తరగతులు ఎలా వినాలి? ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేని ఆదిలాబాద్, ములుగు వంటి గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు తరగతులు ఎలా బోధిస్తారు? పేద విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థికభారం పడకుండా ఏం చర్యలు తీసుకుంటారు? ఆన్లైన్ క్లాసుల నిర్వహణకు సంబంధించి మీరు చెబుతున్నది ఆచరణ సాధ్యమేనా?’అంటూ ధర్మాసనం పలు సందేహాలు వ్యక్తం చేసింది. న్యాయస్థానం ఆదేశిస్తే వేరు వేరు సమయాల్లో తరగతులు నిర్వహిస్తామని, ఈ మేరకు చర్యలు తీసుకుంటామని సంజీవ్కుమార్ వివరణ ఇచ్చారు. విద్యార్థులను ఇళ్లలో ఖాళీగా ఉంచకుండా ఆన్లైన్ క్లాసుల రూపంలో వారిని బిజీగా ఉంచేందుకే క్లాసులు నిర్వహిస్తున్నామని సీబీఎస్ఈ తరఫు న్యాయవాది ఛాయాదేవి నివేదించారు. 9–12 తరగతులకు సిలబస్ తగ్గిస్తామని, తగ్గించిన సిలబస్ నుంచే పరీక్షల్లో ప్రశ్నలు వచ్చేలా చూస్తామని వివరించారు. (తెరుచుకున్న బడులు ) ఎన్ని పాఠశాలలకు చర్యలు తీసుకున్నారు? ఫీజుల కోసం వేధించరాదన్న ప్రభుత్వ జీవో 46కు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలలు ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులను వేధింపులకు గురిచేస్తున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది వై.షీలు నివేదించారు. ఆన్ లైన్ క్లాసులకు హాజరుకాకపోయినా, ఫీజులు కట్టని వారి అడ్మిషన్లు రద్దు చేశారని తెలిపారు. ఫీజుల వసూలుకు సంబంధించి అనేక పాఠశాలలపై ఫిర్యాదులు వచ్చాయని, వీటిపై ఆయా పాఠశాలలకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని, వారిచ్చే వివరణ ఆధారంగా పాఠశాల గుర్తింపు రద్దు చేయడం లాంటి తీవ్రమైన చర్యలు తీసుకుంటామని సంజీవ్కుమార్ అన్నారు. ‘ఎన్ని పాఠశాలలు ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించాయి ? ఎన్ని పాఠశాలలకు నోటీసులు జారీచేశారు ? ఎన్ని పాఠశాలలు వివరణ ఇచ్చాయి ? ఆయా స్కూళ్ల వివరణ సంతృప్తికరంగా లేకపోతే ఏం చర్యలు తీసుకున్నారు ?’తదుపరి విచారణ 18వ తేదీలోగా పూర్తి వివరాలు సమర్పించండి అని ధర్మాసనం ఆదేశించింది. అలాగే ఆన్ లైన్ క్లాసుల నిర్వహణకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా తీసుకొని ఉంటే బాగుండేదని స్పష్టం చేసింది. ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలంటూ సీబీఎస్ఈ బోర్డు ఇచ్చిన సర్క్యులర్ చట్టబద్ధం కాదని న్యాయవాది వై.షీలు వివరించారు. అయితే ఆ సర్క్యులర్ను కొట్టివేయాలంటూ పిటిషన్ లో మార్పులు చేయాలని, అప్పుడు ఆ అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం సూచించింది. పేరెంట్స్పై నాన్ బెయిలబుల్ కేసులా ? ఫీజులు వసూలు చేయడాన్ని ప్రశ్నించేందుకు పాఠశాలకు వెళ్లిన పేరెంట్స్పై బోయిన్ పల్లి పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది నివేదించారు. విద్యార్థుల తల్లిదండ్రులపై కేసులు ఎలా నమోదు చేస్తారని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ను ధర్మాసనం ప్రశ్నించింది. ఎందుకు వారిపై కేసులు నమోదు చేయాల్సి వచ్చిందో తదుపరి విచారణ నాటికి వివరణ ఇవ్వాలని ఏజీని ఆదేశించింది. ఏపీలో సక్సెస్.... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 30 రోజులుగా దూరదర్శన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విజయవంతంగా ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నారని, అదే తరహాలో ఇక్కడా నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించిందని న్యాయవాది సంజీవ్కుమార్ నివేదించారు. జీరో విద్యా సంవత్సరం కాకుండా ఉండేందుకే ఈ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆన్ లైన్ తరగతులు వినని వారికి వర్క్షీట్స్ ఇస్తామని, వీటిని పూర్తి చేసేలా ఉపాధ్యాయులు చూస్తారని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్తారని, వారికున్న సందేహాలను నివృత్తి చేస్తారని పేర్కొన్నారు. -
డిజిటల్ పాఠాలు రెడీ
సాక్షి, హైదరాబాద్: సర్కారు బడి పిల్లలకు డిజిటల్ పాఠాలు సిద్ధమయ్యాయి. కోవిడ్–19 నేపథ్యంలో విద్యాసంస్థలు మూతపడటంతో అవి పునఃప్రారంభమయ్యే వరకు డిజిటల్/ఆన్లైన్ పద్ధతిలో పాఠ్యాంశ బోధన సాగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. 3 నుంచి 10 తరగతుల వరకు డిజిటల్ పాఠాలను టీశాట్, దూరదర్శన్ యాదగిరి చానల్ ద్వారా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేసింది. సాధారణంగా కొత్త విద్యా సంవత్సరం జూన్ మొదటి వారంలో ప్రారంభమవుతుంది. ఈ లెక్కన మరో వారం గడిస్తే విద్యా సంవత్సరం తొలి త్రైమాసికం పూర్తయ్యేది. కానీ కోవిడ్–19 కారణంగా పాఠశాలలు ఇప్పటికీ తెరుచుకోలేదు. ఈ క్రమంలోనే ఆన్లైన్/డిజిటల్ పద్ధతిలో పాఠ్యాంశ బోధనకు విద్యాశాఖ రూపకల్పన చేసింది. తొలుత జూన్, జూలై నెలల్లో జరగాల్సిన బోధనకు సంబంధించి వీడియో పాఠాలను స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీస్(ఎస్ఐఈటీ) ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. అరగంటకో పీరియడ్ డిజిటల్ పాఠాల బోధనకు విద్యాశాఖ ప్రత్యేక సమయాన్ని నిర్దేశించింది. దీని ప్రకారం ఒక్కో పీరియడ్ (సెషన్) కనీసంగా అరగంట పాటు కొనసాగుతుంది. ఈ లెక్కన ఉన్నత తరగతులకు రోజుకు గరిష్టంగా 6 పీరియడ్లు కొనసాగుతాయి. డిజిటల్ పాఠాలను తెలంగాణ మోడల్ స్కూల్ సొసైటీతో పాటు ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారు. ఇందుకు నిపుణులకు మూడు రోజుల పాటు వెబినార్ ద్వారా శిక్షణ ఇచ్చారు. దూరదర్శన్ యాదగిరి చానల్లో మాత్రం రోజుకు గంటన్నర పాటు ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు డిజిటల్ పాఠాలు ప్రసారమవుతాయి. ఇందుకు 3 స్లాట్లను బుక్ చేసినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నా రు. డిజిటల్ పాఠాల రూపకల్పనకు రూ.30 లక్షల వ్యయ అంచనాతో అధికారులు ప్రతిపాదించారు. దీనిని ప్రభుత్వం ఆమోదించా ల్సి ఉంది. కాగా, ఆన్లైన్/డిజిటల్ పాఠాలను ఏయే తరగతులకు ఎంత సమయం పాటు బోధించాలనే దానిపై విద్యాశాఖ ఒక షెడ్యూల్ను కూడా రూపొందించింది. కాలేజీ విద్యార్థులకూ ఆన్లైన్ పాఠాలు సాక్షి, హైదరాబాద్: కళాశాల విద్యార్థులకూ డిజిటల్/ఆన్లైన్ పాఠాలు నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. డిజిటల్, టీవీ, టీశాట్æ మాధ్యమాల ద్వారా వీడియో పాఠాలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు, కాలేజీ విద్య కమిషనర్, అన్ని యూనివర్సిటీలకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 27 నుంచే బోధన సిబ్బంది విధులకు హాజరై డిజిటల్, ఈ–లెర్నింగ్ ప్రణాళికలు తయారు చేయాలని స్పష్టం చేశారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఇంటర్ సెకండియర్తోపాటు డిగ్రీ, పీజీ సీనియర్ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. -
సెప్టెంబర్ 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: కరోనా ఉధృతి నేపథ్యంలో విద్యా సంస్థలు ఇప్పట్లో తెరుచుకునే అవకాశాలు కనిపించడం లేవు. దీంతో తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ బోధన ద్వారా ఆన్లైన్ క్లాసులు నిర్వహించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో వచ్చే నెల 1 నుంచి పాఠశాలల్లో 2020-2021 విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. విద్యార్థులకు ఆన్లైన్ లేదా టీవీ/టీశాట్ ద్వారా బోధన సదుపాయం కల్పించనుంది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. (24 నుంచే ఇంజనీరింగ్, ఫార్మసీ క్లాసులు ) మూడో తరగతి, ఆపై స్థాయి విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపింది. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే ఈ తరగతులు ఉంటాయని పేర్కొంది. అయితే ఈ తరగతుల ప్రారంభానికి ముందే ఈ నెల 27 నుంచి ఉపాధ్యాయులు స్కూళ్లకు రావాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది. కాగా విద్యా సంవత్సరం ప్రారంభంపై మంత్రివర్గ ఉపసంఘం ఈ నెల 5న భేటీ జరిపిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో విద్యా సంవత్సర ప్రారంభం సహా అడ్మిషన్ల ప్రక్రియ, విద్యా బోధన ఎలా జరపాలి అన్న అంశాలపై ప్రభుత్వం చర్చించింది. (జెండా పండుగ : బోసిపోయిన చిన్నారులు) -
6 నుంచి 10 తరగతులకు డిజిటల్ బోధన
సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో విద్యా బోధన ప్రారంభంపై పాఠశాల విద్యాశాఖ సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఉన్నత తరగతులైన 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు డిజిటల్ పాఠాలను (వీడియో పాఠాలను) ప్రసారం చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. ప్రాథమిక తరగతుల విద్యార్థులను ఖాళీగా ఉంచకుండా వారికి వర్క్షీట్లు అందజేసి, అసైన్మెంట్స్ ఇవ్వడం ద్వారా విద్యా కార్యక్రమంలో భాగస్వాములను చేసేలా ప్రతిపాదనలను రూపొందించింది. అన్ని తరగతులకు సంబంధించి 900కు పైగా డిజిటల్ పాఠాలు ఇప్పటికే రూపొందించి ఉన్నందున వాటిని టీశాట్, దూరదర్శన్ (యాదగిరి) చానళ్ల ద్వారా ప్రసారం చేస్తూ విద్యా బోధనను అందించేందుకు ఏర్పాట్లుచేస్తోంది. ఆగస్టు 15 నుంచి వీడియో పాఠాల బోధనకు కసరత్తు చేస్తోంది. ఈలోగా కేంద్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వస్తే వాటి ప్రకారం ముందుకుసాగాలని, లేదంటే ఆగస్టు 15 నుంచి ప్రత్యామ్నాయ అకడమిక్ కేలండర్ అమలుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించింది. ప్రభుత్వం సరేననగానే వీడియో పాఠాల ద్వారా విద్యా బోధనను కొనసాగించాలన్న నిర్ణయానికి వచ్చింది. ప్రత్యక్ష విద్యా బోధనపై విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేయలేదు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష విద్యా బోధనపై స్పష్టత, సమగ్ర మార్గదర్శకాలు జారీ అయ్యాకే, వాటికి అనుగుణంగా నిర్ణయం తీసుకొని ముందుకుసాగాలని భావిస్తోంది. డిజిటల్ పాఠాల టైం టేబుల్ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘ప్రజ్ఞత’పేరుతో జారీచేసిన ఆన్లైన్, డిజిటల్ ఎడ్యుకేషన్ మార్గదర్శకాల ప్రకారం పాఠశాల విద్యాశాఖ టైంటేబుల్ను సిద్ధంచేసింది. తరగతుల వారీగా, రోజువారీగా ఏయే సమయాల్లో ఏయే సబ్జెక్టు పాఠాలను ప్రసారం చేయాలనే వివరాల్ని ఇందులో పొందుపరిచింది. రోజూ ప్రతి తరగతికి 2 నుంచి 3 గంటలు మాత్రమే ఈ విద్యా బోధన ఉండాలని కేంద్రం స్పష్టంచేసిన నేపథ్యంలో ఆ దిశగానే చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఉన్నత తరగతులకు గరిష్టంగా నాలుగు సెషన్లు మాత్రమే బోధించేలా చర్యలు చేపట్టనుంది. అదీ ఒక్కో సెషన్ 30 నుంచి 45 నిమిషాలే ఉండేలా టైంటేబుల్లో పేర్కొన్నట్లు తెలిసింది. ప్రైమరీ తరగతులకు వర్క్షీట్స్, అసైన్మెంట్స్ ప్రాథమిక తరగతులను (1 నుంచి 5వ తరగతి వరకు) వర్క్షీట్స్, అసైన్మెంట్స్ పద్ధతుల్లోనే కొనసాగించాలని ప్రభుత్వానికి పంపించిన ప్రతిపాదనల్లో పేర్కొన్నట్లు తెలిసింది. వారికిప్పుడు రెగ్యులర్ తరగతుల నిర్వహణ సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చింది. మరోవైపు వీడియో పాఠాలు ప్రసారం చేసినా ప్రాథమిక తరగతుల విద్యార్థులు శ్రద్ధగా వినే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రాథమిక తరగతుల విద్యార్థులకు వర్క్షీట్స్, అసైన్మెంట్స్ ఇవ్వడం వంటి యాక్టివిటీని పెంచాలని ప్రతిపాదించింది. ఇందుకోసం కొంత మంది టీచర్లను స్కూళ్లకు పంపించడం ద్వారా ప్రాథమిక తరగతులకు కూడా విద్యా కార్యక్రమాలను కొనసాగించవచ్చని పేర్కొంది. అనుమానాల నివృత్తికి ప్రత్యేకంగా ఒకరోజు టీవీ చానళ్ల ద్వారా వీడియో పాఠాలను వినే క్రమంలో విద్యార్థులకు ఆయా పాఠ్యాంశాలకు సంబంధించిన అనుమానాల నివృత్తికి ఒక్కో తరగతికి ప్రత్యేకంగా ఒకరోజును కేటాయించేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఆయా పాఠశాలల్లో టీచర్లతో పాటు వారి ఫోన్ నంబర్లను విద్యార్థులకు అందుబాటులో ఉంచనుంది. పాఠశాల స్థాయిలో ఫోన్ సదుపాయం ఉన్న విద్యార్థులు, సబ్జెక్టు టీచర్లతో వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసి అందుబాటులో ఉంచేలా, మండల స్థాయిలో సబ్జెక్టు గ్రూపులను ఏర్పాటుచేసేలా ప్రణాళికలు వేసింది. గ్రామాల్లో టీవీ, ఫోన్ సదుపాయం లేని విద్యార్థులుంటే వారు స్కూల్కు వెళ్లి నేర్చుకునేలా కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం పాఠశాలల్లో టీచర్లను రొటేషన్ పద్ధతిలో స్కూళ్లలో అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతోంది. మరోవైపు గ్రామపంచాయతీ సౌజన్యంతో అలాంటి విద్యార్థుల కోసం ఒక టీవీని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేయించడం ద్వారా ఆయా విద్యార్థులకు వీడియో పాఠాలను అందించవచ్చని భావిస్తోంది. ఇక పాఠశాలల్లో టీచర్లను ఎంతమందిని అందుబాటులో ఉంచాలి?, లేదా అందరినీ స్కూళ్లకు పంపించాలా? అన్నది ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. విద్యార్థుల కోసం మాత్రం రొటేషన్ పద్ధతిలో కొంతమంది టీచర్లను మాత్రం కచ్చితంగా పాఠశాలల్లో ఉంచాలని పేర్కొంది. -
విద్యా బోధన.. వయా వీడియో పాఠాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యా బోధన ప్రారంభానికి సంబంధించిన కసరత్తును విద్యాశాఖ వేగవంతం చేసింది. హైకోర్టుకు తమ విధానపర నిర్ణయాన్ని తెలియజేయాల్సి ఉన్నం దున కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. ఇటీవల ప్రజ్ఞత పేరుతో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన డిజిటల్ ఎడ్యుకేషన్ మార్గదర్శ కాల ప్రకారమే ముందుకు సాగాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చి నట్లు తెలిసింది. అయితే అందులో ఆన్లైన్ బోధనతో పాటు రికార్డెడ్ వీడియో పాఠాల విధానం కూడా ఉంది. ఈ నేపథ్యంలో రెండింటి పైనా విద్యాశాఖ ఆలోచనలు చేస్తోం ది. వీలు కలిగిన పట్టణ ప్రాంతాల్లో ఆన్లైన్ బోధన చేపట్టాలని, వీలుకాని గ్రామీణ ప్రాంతాల్లో వీడియో పాఠాలను టీశాట్, దూర దర్శన్ (యాదగిరి), ఎస్సీఈఆర్టీ యూట్యూబ్ చానల్ వంటి వాటి ద్వారా బోధనను చేపట్టే అంశంపైనా పరిశీలన జరుపుతోంది. ఆన్లైన్ బోధన చేపట్టాలంటే విద్యార్థులకు మొబైల్/ట్యాబ్ వంటివి అవసరం. అయితే విద్యార్థుల ఇళలో ఏ మేరకు ఆయా పరికరాలున్నాయో అనధికారిక సర్వే చేయాలని కేంద్రం ప్రజ్ఞతలో పేర్కొన్న నేపథ్యంలో ఆ దిశగా విద్యా శాఖ చర్యలు చేపట్టాలని భావి స్తోంది. కరోనా కొంత అదుపు లోకి వచ్చే వరకు ఆన్లైన్, వీడియో పాఠాలనే కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత మాత్రం షిఫ్ట్ పద్ధతుల్లో బోధన చేపట్టే అంశాలను పరిశీలిస్తోంది. అందులోనూ ముం దుగా 9, 10 తరగతులకు బోధన నిర్వహించడం, కొన్ని రోజుల తర్వాత 6, 7, 8 తరగతులకు బోధన ప్రారంభించే అంశంపైనా పరిశీలన జరుపుతోంది. ఇక రెండు, మూడు నెలల తరువాతే ఒకటి నుంచి 5వ తరగతి వరకు బోధనను చేపట్టే అంశంపై దృష్టి సారించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వ స్కూళ్లలో 90% వీడియో పాఠాలే.. రాష్ట్రంలోని 30 వేల ప్రభుత్వ పాఠ శాలలుంటే అందులో 28 లక్షల మంది విద్యార్థులు చదువు తున్నారు. గురుకులాలు, ఇతర ప్రత్యేక విద్యా సంస్థలను మినహాయిస్తే 23 లక్షల మందికి పైగా విద్యార్థులు జిల్లా పరిషత్, ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చదువుతున్నారు. వీటిల్లో 90% మంది విద్యార్థులకు వీడియో పాఠాలే బోధించే అంశంపై పరిశీలన జరుపు తున్నట్లు తెలిసింది. స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్న విద్యార్థులకు మాత్రం ఆన్లైన్లో పాఠాలు బోధించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఇంతవరకు దేనిపైనా ఓ కచ్చితమైన నిర్ణయానికి రాలేకపోయారు. వివిధ కోణాల్లో పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. ప్రైవేటులోనూ ఎక్కువ శాతం వీడియో పాఠాలవైపే.. రాష్ట్రంలోని 10 వేలకు పైగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో 31 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో 2 వేలకు పైగా ఉన్న కార్పొరేట్, సెమీ కార్పొరేట్, ఇంటర్నేషనల్, ప్రముఖ పాఠశాలలు మాత్రమే ఆన్లైన్ పాఠాలను ప్రారంభించాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని గ్రామీణ ప్రాంతాలు, ఇతర జిల్లా కేంద్రాల్లోని మెజారిటీ ప్రైవేటు పాఠశాలలు ఇంకా ఆన్లైన్ బోధన చేపట్టలేదు. ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నా ఆచరణ ఎంత మేరకు సాధ్యమవుతుందన్న విషయంపై తర్జన భర్జన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పాఠశాలలు కూడా కొన్నాళ్ల వరకు వీడియో పాఠాల వైపే మొగ్గు చూపే అవకాశముంది. ఆన్లైన్ కష్టసాధ్యం.. అమలు చేసినా కొద్దిసేపే.. రాష్ట్రంలో వీలున్న స్కూళ్లలో ఆన్లైన్ తరగతులను ప్రారంభిస్తే కేంద్రం ఆదేశాల ప్రకారం ప్రతి తరగతికి 2 నుంచి 3 గంటలే ఆన్లైన్ బోధన చేపట్టే అవకాశముంది. ఉన్నత పాఠశాల్లో గరిష్టంగా 4 సెషన్లలోనే, 1 నుంచి 8 తరగతులకు రెండు సెషన్లలోనే బోధనను నిర్వహించేలా చర్యలు చేపట్టాల్సి ఉంటుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. అంతకుమించి ఎక్కువ బోధన చేపట్టే వీలుండదని, పైగా ఆన్లైన్ బోధనకు టీచర్లను గుర్తించి, వారికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని, ఇది కష్టసాధ్యమని పేర్కొన్నారు. వీటన్నింటికంటే వీడియో పాఠాలే ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుందని వెల్లడించారు. -
రేపటి నుంచి లెక్చరర్లకు ఆన్లైన్ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్లకు ఆన్లైన్లో శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి 15 రోజుల పాటు ‘డిజిటల్ దిశ’ పేరుతో ఆన్లైన్ క్లాసులు జరుగనున్నాయి. ఇందులో భాగంగా 5300 మంది లెక్చరర్లను 12 బ్యాచ్లుగా విభజించి డిజిటల్ తరగతులు, ఆన్లైన్ విద్యా బోధనపై శిక్షణ ఇవ్వనున్నారు. కాగా మహమ్మారి కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా విధించిన లాక్డౌన్ కారణంగా విద్యాసంస్థలన్నీ మూతపడిన విషయం తెలిసిందే. అదే విధంగా కరోనా విజృంభణ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడప్పుడే విద్యా సంస్థలు తెరిచే అవకాశం కనబడటం లేదు. దీంతో డిజిటల్ తరగతులకు ప్రాధాన్యం పెరగడంతో ఆ దిశగా లెక్చరర్లను సమాయత్తం చేసేందుకు ఈ శిక్షణా కార్యక్రమం ఉపయోగపడనుంది.(ఆన్లైన్ పాఠాలు; ఆసక్తికర అంశాలు) -
చేతులు కలిపిన సెంట్రల్ బుక్స్, ఎడ్యుబ్రిక్స్ సంస్థలు
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో విద్యార్ధులకు డిజిటల్ విధానంలో పాఠాలు చెప్పడానికి సెంట్రల్బుక్స్, ఆన్లైన్ లెర్నింగ్ సంస్ధ ఎడ్యుబ్రిక్స్ టెక్నాలజీ సంస్ధలు చేతులు కలిపాయి. ఇందులో భాగంగా సీబీఎస్ఈ. ఐసీఎస్ఈ, స్టేట్బోర్డ్ విధానాల్లో ఆన్లైన్ పాఠాలను అనుసంధానిస్తున్నట్లు ఎడ్యుబ్రిక్స్ సీఈవో సైజు అరవింద్, సెంట్రల్బుక్స్ సీఈవో సుధీర్ ముంగాలా పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరంలో ఏపీ. తెలంగాణా రాష్ట్రాల్లో కనీసం 1మిలియన్ విద్యార్ధులకు పాఠాలు చెప్పాలనే లక్ష్యంతో పనిచేస్తన్నట్లు వారు పేర్కొన్నారు. సెంట్రల్ బుక్స్ సంస్థ ఎడ్యుబ్రిక్స్ నాలెడ్జ్ సొల్యూషన్స్తో భాగస్వామిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సెంట్రల్ డిజిటల్ లెర్నింగ్ను ప్రారంభించనుంది. డిజిటల్ విభాగంలో పేరుగాంచిన ఎడ్యుబ్రిక్స్ తో కలిసి కె -12 విభాగంలో సెంట్రల్ బుక్స్ సంస్థ ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలను అందిచేందుకు, సులభతరమైన అభ్యాసానికి అనుగుణంగా ఈ సెంట్రల్ డిజిటల్ లెర్నింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సెంట్రల్ బుక్స్ అందిస్తున్న సేవల నేపథ్యంలో ఈ భాగస్వామ్యం ద్వారా ఆయా పాఠశాలలకు మరింత లాభం చేకూరనుంది. ఎడ్యుబ్రిక్స్ సీఈవో సైజు అరవింద్ మాట్లాడుతూ.. బోధన, అభ్యాసానికి శాస్త్రీయ విధానం ద్వారా నాణ్యమైన, అందరికి అందుబాటులో ఉండే విద్యను అందిచాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఈ నేపథ్యంలోనే సెంట్రల్ బుక్స్ భాగస్వామిగా కావడం చాలా ఆనందంగా ఉంది. దేశంలోని 1,000కి పైగా విద్యా సంస్థలకు విద్యలో స్థిరమైన, నాణ్యమైన సేవలను సెంట్రల్ బుక్స్ అందిస్తుంది. శక్తివంతమైన, సాంకేతిక పరిజ్ఞానంతో కలిపి ఇప్పుడు విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేస్తుందని సీఈఓ ఎడుబ్రిస్క్ సైజు అరవింద్ చెప్పారు. సెంట్రల్ బుక్స్ సీఈవో మిస్టర్ సుధీర్ ముంగాలా మాట్లాడుతూ.. విద్యతో అనుబంధం ఉన్న వాటాదారుల అవసరాన్ని తీర్చడానికి మాత్రమే కాకుండా, ముఖ్యంగా ఈ కరోనా కష్ట సమయాల్లో విద్యార్థులు తమ అభ్యాసాన్ని తేలికగా కొనసాగించడానికి వీలు కల్పించడం తమ లక్ష్యమని సుధీర్ ముంగాలా చెప్పారు. -
మీ పిల్లలను ఇలా చదివించండి
సాక్షి, అమరావతి: కోవిడ్–19 ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పిల్లలను డిజిటల్/ ఇ–లెర్నింగ్ ఫ్లాట్ఫారమ్స్ ద్వారా చదివించుకోవాల్సిందిగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సూచించింది. ఈ మేరకు తమ తమ రాష్ట్రాల్లోని విద్యార్ధులకు ఈ సమాచారం అందేలాగ చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. ఈ డిజిటల్/ఇ–లెర్నింగ్ ఫ్లాట్ఫారŠమ్స్ అన్నీ కూడా ఉచితంగానే లభ్యమవుతాయని స్పష్టం చేసింది. (కరోనా ఎఫెక్ట్: బాధ్యత లేని మనుషులు) స్కూలు విద్య: దీక్ష వెబ్సైట్లో సీబీఎస్ఈ, ఎన్సీఈఆర్టీ, రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన సిలబస్లతో కూడిన పాఠ్యపుస్తకాలు బహుళ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. 1వ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు 80,000కు పైగా ఈ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందుకు సంబంధించిన యాప్ను ఐఒఎస్ లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. వెబ్సైట్ చిరునామా: https://diksha.gov.in/ ► ఇ–పాఠశాల వెబ్సైట్లో 1వ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు బహుళ భాషల్లో 1,886 ఆడియోలు, 2,000 వీడియోలు, 696 ఇ–బుక్స్, 504 ఫ్లిప్ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. వెబ్సైట్ చిరునామా: http://epathshala.nic.in/ ► ఎన్ఆర్ఓఇఆర్ పోర్టల్లో వివిధ భాషల్లో మొత్తం 14,527 ఫైల్స్ ఉన్నాయి. ఇందులో 401 కలెక్షన్స్, 2,779 డాక్యుమెంట్స్, 1,345 ఇంటరాక్టివ్స్, 1,664 ఆడియోలు, 2,586 ఇమేజెస్, 6,153 వీడియోలు ఉన్నాయి. వెబ్సైట్ చిరునామా https://nroer.gov.in/welcome ► స్వయం నేషనల్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫాంలో తొమ్మిదవ తరగతి నుంచి 12వ తరగతి వరకు గ్రాడ్యుయేషన్, పీజీ, ఇంజనీరీంగ్, మానవ వనరులు, సోషల్ సైన్స్, లాకు చెందిన 1,900 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వెబ్ చిరునామా: http://swavam.qov.in/ -
ఆధునిక విద్యాబోధనకు శ్రీకారం
సాక్షి, గుంటూరు : ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న విద్యాబోధనలో ప్రభుత్వం కాలానుగుణమైన మార్పులను ప్రవేశపెడుతోంది. విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్యను చేరువ చేసేందుకు రూపొందించిన పర్సనలైజ్డ్ అడాప్షన్ లెర్నింగ్ (పాల్) ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా అమలు పర్చేందుకు నిర్ణయించింది. ఈ పథకం అమలుకు గుంటూరు, ప్రకాశం జిల్లాలను పైలెట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. గుంటూరు జిల్లాలోని 20 ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసిన ప్రభుత్వం ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు పాల్ ప్రాజెక్టులో భాగంగా ఆధునిక విద్యాబోధన అందించేందుకు ట్యాబ్లను అందజేసింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏమాత్రం తీసిపోని విధంగా విద్యార్థులకు సకల సదుపాయాలతో ఆధునిక విద్య అందించేందుకు నిర్ణయించిన ప్రభుత్వం ఆర్థిక పరమైన వనరులను సమకూర్చడంలో రాజీ పడకుండా చర్యలు చేపట్టింది. హైస్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు మెళకువలు నేర్పేందుకు ఆరు నుంచి పదో తరగతి వరకూ చదువుతున్న విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు పాల్ కార్యక్రమం ద్వారా ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలను ఎంపిక చేసింది. తొలి విడత 20 పాఠశాలల్లో అమలు జిల్లా వ్యాప్తంగా 296 హైస్కూళ్లలో వర్చువల్ క్లాస్రూమ్స్, మరో 410 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్రూమ్స్ ద్వారా విద్యార్థులకు ఆధునిక విద్యాబోధన అందిస్తున్న ప్రభుత్వం దీనిని విస్తతం చేస్తూ పాల్ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. తొలి విడతలో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు అధిక సంఖ్యలో ఉన్న 20 హైస్కూళ్లను ఎంపిక చేసింది. ఇందుకు గానూ ట్యాబ్ల ద్వారా సబ్జెక్టుల వారీగా నిపుణులతో విద్యాబోధన చేస్తారు. ట్యాబ్ల వినియోగంపై శిక్షణ ఇచ్చేందుకు జిల్లా నుంచి సీనియర్ సబ్జెక్టు నిపుణులను ఎంపిక చేసి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి జాబితా పంపే పనిలో జిల్లా విద్యాశాఖాధికారులు నిమగ్నమయ్యారు. ఒక్కో పాఠశాలకు 30 చొప్పున ట్యాబ్లను అందించనుండగా ఇద్దరు, ముగ్గురేసి విద్యార్థులు కలిసి ఒక ట్యాబ్ను వినియోగించనున్నారు. ఉన్నత చదువులకు సమాయత్తమయ్యేలా.. పాఠశాలస్థాయిలోనే ఆధునిక విద్యాబోధన పద్ధతులను అమలు పర్చడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత చదువులకు దోహదం చేసే విధంగా పాల్ ప్రాజెక్టును తీర్చిదిద్దిన ప్రభుత్వం విద్యార్థి కేంద్రంగా అమలుచేయనుంది. పాల్ ప్రాజెక్టు కింద జిల్లాలో ఎంపిక చేసిన 20 ఉన్నత పాఠశాలల్లో ముందుగా గణితశాస్త్రంలో బోధన చేయనున్నారు. అనంతరం మిగిలిన సబ్జెక్టులను ప్రవేశపెట్టనున్నారు. పాల్ కార్యక్రమాన్ని విడతల వారీగా జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో అమలు పర్చేందుకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. పాల్కు ఎంపికైన పాఠశాలలు ఇవే.. వేమవరం, మాచర్లలోని పీడబ్ల్యూడీ కాలనీ, పిడుగురాళ్ల మండలంలోని పిన్నెల్లి, బ్రాహ్మణపల్లి, రాజుపాలెంలోని కూబాడ్పురం, బొల్లాపల్లి మండలంలోని వెల్లటూరు, నకరికల్లు, మాదల, సాతులూరు, చిరుమామిళ్ల, గణపవరం, శంకరభారతీపురం, యల్లమంద, ఉప్పలపాడు, కోటప్పకొండ, రెడ్డిపాలెం, బొగ్గరం, నడిగడ్డ, సీజే పాలెంలోని జెడ్పీ హైస్కూళ్లతో పాటు వినుకొండలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలు ఎంపికయ్యాయి. సక్రమంగా అమలు చేస్తాం పర్సనలైజ్డ్ ఆడాప్షన్ లెర్నింగ్ ప్రోగ్రాం ద్వారా ఎంపిక చేసిన పాఠశాలల్లో ట్యాబ్ల ద్వారా విద్యాబోధన సక్రమంగా జరిగేలా పర్యవేక్షిస్తాం. పాఠశాలలకు ట్యాబ్లను చేర్చి ఉపాధ్యాయులను సన్నద్ధం చేయడం ద్వారా విద్యార్థి కేంద్రంగా ఆధునిక బోధన అందిస్తాం. పాల్ ప్రాజెక్టు కింద జిల్లాను ఎంపిక చేయడం మంచి పరిణామం. – ఆర్.ఎస్ గంగాభవాని, డీఈఓ -
‘ప్లేస్టోర్’లో పుస్తకం!
సాక్షి, చీరాల (ప్రకాశం): విద్యావిధానంలో కొత్త మార్పులు వస్తున్నాయి. బట్టీ విధానానికి స్వస్తి పలికేందుకు వస్తున్న మార్పులు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు విద్యార్థులకు ప్రభుత్వం అందించే ఉచిత పాఠ్యపుస్తకాలపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. క్యూఆర్ కోడ్ వలన సమగ్ర సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోవచ్చు. దీని వరిశోధానాత్మక బోధన, పూర్తిస్థాయిలో అభ్యసనకు అవకాశం కలుగుతుంది. పాఠ్యాంశాలను విద్యార్థుల వీక్షించేందుకు దీక్షా యాప్ను అందుబాటులోకి తెచ్చారు. గత ఏడాది గణితం, భౌతికశాస్త్రం, సాంఘికశాస్త్రం పుస్తకాలపై ముద్రించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి తెలుగు, హిందీ, ఆంగ్ల సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలపై కూడా క్యూఆర్ కోడ్ను ముద్రించారు. ఈ విధానం వలన విద్యార్థులు తమ పాఠ్యాంశాలను ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా చూసుకోవచ్చని ఉపాధ్యాయులు చెబుతున్నారు. విద్యార్థులు పాఠ్యాంశాలపై త్వరితగతిన అర్థం చేసుకోవచ్చు. ఎలా? గూగుల్ ప్లేస్టోర్ నుంచి దీక్షాయాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్లో విద్యార్థి లేదా ఉపాధ్యాయుడు అనేది ఎంపిక చేసుకున్న అనంతరం భాషను ఎంపిక చేసుకోవాలి. తర్వాత పాఠ్యాంశం పైన ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే సమగ్రసమాచారం ఫోన్లో ప్రత్యక్షమవుతుంది. ఇలా చేయడం వలన ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు నల్లబజారుకు తరలివెళ్లకుండా ఉంటుంది. క్యూఆర్ కోడ్ను పుస్తకం మొదటి, చివరి పేజీల్లో ముద్రించేవారు. ప్రస్తుతం ముఖ్యమైన పాఠ్యాంశాలపై కూడా ముద్రించడంతో విద్యార్థులకు మరింత సులభతరం అయింది. మెరుగైన ఫలితాలు వస్తాయి... ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నాం. డిజిటల్ తరగతులు, క్యూఆర్ కోడ్ వలన విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వస్తాయి. పాఠ్యాంశాలను బోధన ద్వారా వినడం కంటే దృశ్యరూపంలో తిలకించడం వలన మార్చిపోయే అవకాశం ఉండదు. - నాగేశ్వరరావు, ఎంఈఓ -
వచ్చే ఏడాదీ జూన్ 12నే స్కూళ్లు
సాక్షి, హైదరాబాద్: ఈ విద్యాసంవత్సరానికి సం బంధించి విద్యా శాఖ క్యాలెండర్ ఖరారైంది. వచ్చే ఏడాది కూడా వేసవి సెలవుల తరువాత జూన్ 12వ తేదీ నుంచే (2020–21 విద్యా సంవత్సరంలో) పాఠశాలలను ప్రారంభించాలని రాష్ట్ర విద్యా శాఖ నిర్ణయిచింది. గత సంవత్సరం జారీ చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల ఒకటవ తేదీ నుంచే పాఠశాలలను ప్రారంభించాల్సి ఉన్నా వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా ఉన్న దృష్ట్యా ఈ నెల 12వ తేదీ నుంచి(బుధవారం) స్కూళ్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వచ్చే ఏడాది కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని విద్యాశాఖ నిర్ణయిం చింది. ఈ మేరకు 2019–20 అకడమిక్ క్యాలెండర్ను డీఈవోలకు మంగళవారం జారీ చేసింది. పాఠశాలల వేళలు ఈసారి పాఠశాలల సమయాల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు, ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి. ఇతర కార్యక్రమాలు.. స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను(ఆరు) జూన్, అక్టోబర్, మార్చి నెలల్లో మినహా మిగిలిన అన్ని నెలల్లోనూ నిర్వహించాలి. పాఠశాల వార్షికోత్సవాలను జనవరి, ఫిబ్రవరిల్లో నిర్వహించాలి. బాలసభలను ప్రతినెలా మొదటి శనివారం నిర్వహించాలి. ప్రతి శుక్రవారం మాస్డ్రిల్, యోగా కార్యక్రమాలు నిర్వహించాలి. క్రీడల నిర్వహణ... పాఠశాల స్థాయి క్రీడలు ఆగస్టు రెండోవారం లోపు, జిల్లాస్థాయి పోటీలు సెప్టెంబర్ 3వ వారంలోపు, రాష్ట్రస్థాయి పోటీలు సెప్టెంబర్ 4వ తేదీలోపు నిర్వహించాలి. డిజిటల్ తరగతులు డిజిటల్ తరగతులకు సంబంధించిన టైంటేబుల్ను అధికారులు నిర్ణయించారు. పదో తరగతి వారికి 10.40 గంటలకు రెండో పీరియడ్లో నిర్వహించాలి. తొమ్మిదో తరగతి వారికి మూడో పీరియడ్లో 11.40 గంటలకు, 8వ తరగతి వారికి 5వ పీరియడ్లో 1.50 గంటలకు, 7వ తరగతి వారికి ఆరో పీరియడ్లో 2.40 గంటలకు, ఆరో తరగతి వారికి ఏడో పీరియడ్లో 3.30 గంటలకు నిర్వహించాలి. క్యాలెండర్ ప్రకారం... - ఈ ఏడాది(వచ్చే) సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 13 వరకు దసరా సెలవులు ఉంటాయి. - మిషనరీ స్కూళ్లకు డిసెంబర్ 22 నుంచి 28 వరకు క్రిస్మస్ సెలవులు - ఇతర స్కూళ్లకు 2020 జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు - 2019–20 విద్యా సంవత్సరంలో చివరి పనిదినం 2020 ఏప్రిల్ 23 - 2020 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఆయా తరగతుల పరీక్షల షెడ్యూలు.. ఫార్మేటివ్ అసెస్మెంట్(ఎఫ్ఏ)–1 పరీక్షలు జూలై 31 నాటికి, ఎఫ్ఏ –2 సెప్టెంబర్ 27వ తేదీ నాటికి నిర్వహించాలి. సమ్మెటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ)–1 పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించాలి. ఎఫ్ఏ–3 నవంబర్ 30 నాటికి, ఎఫ్ఏ–4 పరీక్షలను 2020 జనవరి 31 లోపు పదో తరగతి వారికి, ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వారికి ఫిబ్రవరి 29 లోపు నిర్వహించాలి. పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 29లోపు నిర్వహించాలి. ఎస్సెస్సీ బోర్డు పరీక్షలు మార్చి నిర్వహిస్తారు. ఏప్రిల్ 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు 1 నుంచి 9వ తరగతి వరకున్న విద్యార్థులకు ఎస్ఏ–2 పరీక్షలు నిర్వహించాలి. అదే నెల 10వ తేదీన ప్రోగ్రెస్ కార్డులు విద్యార్థులకు అందించాలి. 11న తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేయాలి. 12వ తేదీన ప్రోగ్రెస్ కార్డులను విద్యార్థుల నుంచి తీసుకోవాలి. జనవరి 31లోగా పదో తరగతి సిలబస్ పూర్తి చేసి, ఫిబ్రవరి నుంచి రివిజన్ క్లాసులు నిర్వహించాలి. 9వ తరగతిలోపు విద్యార్థులకు సిలబస్ను ఫిబ్రవరి 28 వరకు పూర్తిచేయాలి. -
చిన్నారులకు ఎంతకష్టం
చిత్తూరు, తిరుపతి రూరల్: డిజిటల్ క్లాస్రూంలో యాసి డ్ పొగలు చిమ్మాయి. చీకటి గదిలో సల్ఫ్యూ రిక్ యాసిడ్ బాటిల్స్ ప్రమాదవశాత్తూ పగిలిపోయి ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. సోమవారం తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లి జెడ్పీ హైస్కూల్లో దుర్ఘటన జరిగింది. ఈ హైస్కూల్లో 11 గదులున్నాయి. మరో మూడు అవసరమని ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని కోరారు. అయినా స్పందన లేదు. దీంతో డిజిటల్ క్లాస్ రూంలోనే సైన్స్ ల్యాబ్ను నిర్వహిస్తున్నారు. సోమవారం సా యంత్రం 8వ తరగతి విద్యార్థులను డిజిటల్ క్లాస్ రూమ్కు తీసుకెళ్లారు. తలుపులు మూసిప్రొజెక్టర్ ద్వారా పాఠాలు చూపించారు. విద్యార్థులను వదిలేసి ఉపాధ్యాయులు బయటకు వెళ్లారు. చీకటిలో ఓ విద్యార్థి చేయి తగిలి బల్ల మీదున్న సల్ఫూరిక్ యాసిడ్ బాటిల్స్ కింద పడ్డాయి. యాసిడ్ దగ్గరలోని విక్రమ్కృష్ణ(పుదిపట్ల చైతన్యపురం), తరుణ్(అరుణమ్మ కాలనీ) శివ(నం దమూరి కాలనీ), వంశీ(మంగళం), దినేష్(వెదురుకుప్పం మండలం)పై పడ్డాయి. వంశీకి తీవ్రగాయాలయ్యా యి. వారిని తిరుపతి రుయాకు తరలించి తర్వాత ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. తరగతి గదుల కొరత వల్లే... జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చాలా చోట్ల తరగతి గదుల కొరత ఉంది. చెర్లోపల్లె తరహాలోనే చాలాచోట్ల తరగతి గదిలో సైన్స్ ల్యాబ్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రమాదమని తెలిసినా మరో మార్గం లేకపోవటంతో తప్పడం లేదు. దీని వల్ల తమ పిల్లల ప్రాణాలతో ప్రభుత్వం, ఉపాధ్యాయులు చెలగాటమాడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. గదుల కొరత ఉంటే ప్రమాదంలోకి నెడతారా? అని ప్రశ్నిస్తున్నారు. యాసిడ్ బాధితులను తిరుపతి సబ్ కలెక్టర్ మహేష్కుమార్, అర్బన్ తహసీల్దార్ చంద్రమోహన్, రూరల్ ఎంఈఓ ప్రేమలత పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను ఆరా తీశారు. చెర్లోపల్లె హైస్కూల్ క్లాస్ రూమ్, సైన్స్ ల్యాబ్ను కూడా పరిశీలించారు. తరగతి గదిలోనే ల్యాబ్ను నిర్వహించటం వల్లే ఈ యాసిడ్ ఘటన జరిగినట్లు నిర్ధారించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. -
ఆకట్టుకుంటున్న గోపాలపురం పాఠశాల
ఖమ్మంఅర్బన్ : నగరంలోని 8వ డివిజన్ గోపాలపురం పాఠశాల వివిధ ప్రత్యేకతలతో ఆకట్టుకుంటోంది. ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవతో ఆవరణలో మొక్కలు నాటి..వాటిని సంరక్షిస్తూ ఆహ్లాదాన్ని నింపారు. దాతల సహకారంతో డిజిటల్ తరగతుల బోధన సాగుతోంది. బడి నగరంలో ఉండడంతో వికలాంగ ఉపాధ్యాయులు సమీపంలో ఉంటుందని ప్రత్యేక విజ్ఞప్తితో ఇక్కడ పనిచేస్తుండగా..వీరు ఎంతో శ్రద్ధతో పాఠశాల రూపురేఖలనే మార్చి..శెభాష్ అనిపించుకుంటున్నారు. పాఠశాలలో 1నుండి 5వ తరగతి వరకు 69మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రధానోపాధ్యాయులు వీవీ.సత్యనారాయణ, ఉపాధ్యాయులు బండి నాగేశ్వరరావు, కె.శ్రీనివాసరావు, సీహెచ్.శివరామకృష్ణ పర్యవేక్షణలో విద్యా బోధన, పాఠశాల పర్యవేక్షణ సాగుతోంది. తరగతి గదుల గోడలన్నీ వివిధ దేశనాయకులు, విద్యావంతుల చిత్రపటాలు, వాల్ రైటింగ్లు, పాఠశాలకు సంబంధించిన వివరాలతో నిండి ఉంటాయి. పద్మశ్రీ వనజీవి రామయ్య చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. ఇంకుడు గుంతను రూపొందించి నీటి పొదుపు ప్రాధాన్యం వివరిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలను చూస్తే కార్పొరేట్ స్కూల్ ఏమో అనేట్లు తీర్చిదిద్దారు. డిజిటల్ తరగతుల కోసం ఎల్ఈడీ టీవీ ఉంది. రోజూ డిజిటల్ పాఠాలు బోధిస్తున్నారు. పాఠశాలలో ప్రతి ఏటా విద్యార్థులకు అవసరమైన నోట్ పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, షూలను అందించేందుకు ఉపాధ్యాయుడు బండి నాగేశ్వరరావు విశేషంగా కృషి చేస్తున్నారు. హరితహారంలో భాగంగా పాఠశాలలో మొక్కలు నాటడమే కాకుండా ప్రతి విద్యార్థి ఇంట్లో ఒక గులాబీ, ఒక పండ్ల, ఒక నీడనిచ్చే మొక్కలను నాటించారు. బడిలో వాటిని కాపాడుకోవడంతో అవన్నీ పెరిగి పచ్చదనం నింపాయి. ఉపాధ్యాయుడు నాగేశ్వరరావుతోపాటు అంటెండర్గా తాత్కలికంగా పనిచేస్తున్న ఎస్కె.రషీద్ చొరవ కూడా ఎంతో ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అందరి సమష్టి కృషి వల్లనే నగరంలోనే ఉన్నా..ప్రైవేట్ స్కూల్కు వెళ్లకుండా ఈ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో చదువుకుంటున్నారని స్థానికులు అంటున్నారు. -
కేరళలో డిజిటల్ చదువులు
తిరువనంతపురం: దేశంలోనే అక్షరాస్యతలో ముందుండే కేరళ మరో అడుగు ముందుకేసి డిజిటల్ తరగతుల ఏర్పాటు శ్రీకారం చుట్టింది. హైటెక్ స్కూల్ ప్రాజెక్టులో భాగంగా అధునాతన గ్యాడ్జెట్స్, ల్యాప్టాప్స్, మల్టీమీడియా ప్రొజెక్టర్ల వంటి సదుపాయాలతో 40వేల తరగతులను డిజిటల్ తరగతులుగా మార్చేస్తోంది. ఇందుకోసం కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్(కైట్) 40,083 తరగతులను ఎంపిక చేసింది. ప్రభుత్వ పాఠశాలతోపాటు ఎయిడెడ్ స్కూళ్లను కూడా ఇందుకు ఎంపిక చేశారు. అయితే పాఠశాలల్లో ఈ ప్రాజెక్టు ద్వారా ఐటీ విద్యను మరింత ప్రోత్సహించేందుకే ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు కైట్ వైస్చైర్మన్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్వర్ సాదత్ తెలిపారు. మలప్పురం జిల్లాలో అత్యధికంగా 5,096 తరగతులను ఎంపిక చేయగా, కోజికోడ్లో4,105, త్రిశూర్ 3,497 తరగతులను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఇప్పటికే ల్యాప్టాప్లు, మల్టీమీడియా ప్రొజెక్టర్లు, మౌంటింగ్ కిట్లు, యూఎస్బీ స్పీకర్లను ఆయా పాఠశాలలకు పంపినట్లు చెప్పారు. -
డిజిటల్ తరగతులు డీలా!
బాన్సువాడటౌన్ నిజామాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ పాఠాలు డీలా పడిపోయాయి. ప్రభుత్వ పాఠాశాలల్లోని విద్యార్థులకు డిజిటల్ తరగతుల ద్వారా బోధన నిర్వహించాలని ప్రభుత్వం 2016 నవంబర్లో కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో, బాన్సువాడలో మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి 2016 నవంబర్ 17న ప్రారంభించారు. మొదట విడత కింద ఉన్నత, కేజీవీబీలు, మోడల్స్కూల్లలో డిజిటల్ పాఠాలను ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వహించాలని ఏర్పాటు చేసిన డిజిటల్ పాఠాల బోధన ఉమ్మడి జిల్లాలో ఎక్కడ అమలుకు నోచుకోవడం లేదు. డిజిటల్ బోధన ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను మెరుగుపర్చవచ్చని ప్రభుత్వ భావించింది. హింది, వ్యాయామ టీచర్లు మినహా మిగత ఉపాధ్యాయులకు గతంలో శిక్షణ కూడా ఇచ్చారు. సుమారు 650 పాఠాలు కలిగిన హర్డ్డిస్క్లను పాఠశాలలకు అందజేశారు. హర్డ్డిస్కులు సరిపోను పాఠశాలలకు మండల కోఆర్డినేటర్ల సహయంతో కంప్యూటర్లలో ఇన్స్టాల్ చేశారు. కాగా జూన్ 1న వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. కానీ ఇప్పటి వరకు ఎంపిక చేసిన పాఠశాలల్లో డిజిటల్ పాఠాల బోధన దఖలాలు లేవు. నిరుపయోగంగా పరికరాలు విద్యుత్ సౌకర్యం, కేబుల్ సౌకర్యం ఉన్న పాఠశాలల్లో మాత్రమే తొలివిడత కింద డిజిటల్ తరగతుల బోధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీటి కోసం ప్రత్యేకంగా టైం టేబుల్ను కూడా ఏర్పాటు చేశారు. డిజిటల్ తరగతుల బోధన కోసం ఏర్పాటు చేసిన కేబుల్, డిష్లు, కేబుల్ ద్వారా తీసుకున్న కనెక్షన్ల నుంచి ప్రస్తుతం సిగ్నల్ రాకపోవడంతో మన టీవీలో డిజిటల్ తరగతులకు సంబంధించిన ప్రసరాలు రావడం లేదు. ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో పరికరాలు అలంకరప్రాయంగా మిగిలిపోయాయి. ప్రతి రోజు 6, 7, 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఒక పిరియడ్ చొప్పున డిజిటల్ తరగతుల ద్వారా బోధన ఉంటుంది. ప్రస్తుతం ఈ కార్యక్రమం అంతగా అమలు కాకపోవడంతో విద్యార్థులు ఆయా పిరియడ్లలో క్లాస్కే పరిమితం అవుతున్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. -
మాట్లాడే పుస్తకాలు!
సాక్షి, పాన్గల్ (వనపర్తి) : కంటికి శ్రమ ఉండదు.. పెదవులు కదిలించాల్సిన అవసరం లేదు.. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఆ పుస్తకాల్లో అక్షరాలపై డాల్ఫియా పెడితే చాలు.. భావయుక్తంగా స్పష్టంగా అర్థమయ్యేలా మాటల రూపంలో వినిపిస్తాయి. ఇది కోడింగ్, డీకోడింగ్ ద్వారా ముద్రించిన మాట్లాడే పుస్తకాల (టాకింగ్ బుక్స్) ప్రత్యేకత. దీంతో విద్యార్థులకు పదాలను ఎలా ఉచ్చరించాలో స్పష్టంగా తెలియడంతోపాటు సులభంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సరికొత్త పరిజ్ఞానం తో చదువుపై విద్యార్థులకు ఆసక్తి పెరుగుతుంది. ప్రస్తుతం సీసీఈ పద్ధతిలో విద్యార్థులు బట్టీ పట్టి చద వుతున్నారు. ఈ విధానానికి స్వస్తి పలికేలా డిజిటల్ విద్యా విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఎలా మాట్లాడుతాయంటే.. యునిసెఫ్, సర్వశిక్ష అభియాన్ ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో కోడింగ్, డీకోడింగ్ విధానాన్ని అనుసరించి మాట్లాడే డాల్ఫియాను తయారు చేశారు. ఈ డాల్ఫియా లేదా డాల్ఫిన్ బొమ్మను ప్రతి పుస్తకం కవర్ పేజీపై ఉన్న గెట్ స్టార్ గుర్తుపై ఉంచాలి. తర్వాత పుస్తకంలోని పదాలపై డాల్ఫియాన్ కదిలిస్తూ ఉంటే డీకోడ్ విధానంలో పదాలు వినిపిస్తాయి. ఆ కథలో ఉన్న పాత్రలకు అనుగుణంగా మనకు మాటలు వినపడం వల్ల ఒక నాటికను చూస్తున్న అనుభూతిని విద్యార్థులు పొందుతారు. -
బాలలే.. రోబోలు కాదు!
క్లాసులో ఎప్పుడూ ముందుంటే సాయిరాం ఈమధ్య ముభావంగా ఉండడం.. ఇంట్లో పనివాళ్లను హేళనగా మాట్లాడడం.. పెద్దలంటే లెక్కచేయకపోవడం.. చిన్నవయసులోనే మొబైల్ ఫోన్లలో కాలక్షేపం చేయడం.. క్లాసులో ఒక వర్గం వారితోనే స్నేహం చేయడం లాంటివి సాయిరాం తల్లిదండ్రులు గమనించి నిపుణుల వద్దకు కౌన్సెలింగ్కు తీసుకెళ్లారు.. పరీక్షించి వారు చెప్పిన సమాధానం విని వారికి మతిపోయింది.. స్మార్ట్ క్లాసులు, డిజిటల్ క్లాసులు, ఒలింపియాడులు, డిజిటల్ పాఠాలు అంటూ చిన్నారులపై మోపుతున్న భారానికి వారిలో గ్రాహ్యశక్తి నశించి బట్టీపెట్టుకుంటేనే గుర్తుండే స్థాయికి దిగజారిపోయారని, చెప్పేవారు ఎవరూ లేక ఏది మంచి ఏది చెడు, ఏది చెయ్యాలి.. ఏది చెయ్యకూడదు తదితర విషయాలను కూడా పక్కన పెట్టి, తాము ఏం చేయదల్చుకున్నారో దాన్ని చేసేందుకు సిద్ధపడతారని, ఈక్రమంలో సరిగా జాగ్రత్తలు తీసుకోకుంటే మానవతా విలువలు సైతం వదిలేస్తారని చెప్పడంతో తల్లిదండ్రులకు తమ కాళ్ల కింద భూమి కంపించినట్లయింది.. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆటపాటలతో విద్యాభ్యాసం చిన్నారులకు మానసికోల్లాసాన్ని కలిగిస్తుంది. గురువు బోధన చేస్తే శోధించి సాధించే మనస్తత్వాన్ని అలవర్చుకున్నప్పుడే విద్యార్థి పరిపూర్ణవంతుడుగా ఎదుగుతాడు. పరిశోధనాత్మకంగా ఆలోచిస్తూ దేనినైనా సాధించాలనే గుణాలను కలిగి వుంటారు. కానీ నేడు ఆటపాటలకు దూరమై, ఆధునిక టెక్నాలజీతో విద్యార్థులు సిలబస్నే బట్టి పడుతూ జిరాక్స్ మిషన్లు,.. రోబోల్లాగా మారుతున్నారనేది విద్యావేత్తల ఆందోళన. స్మార్ట్క్లాస్లు, డిజిటల్ క్లాస్లు, ఆన్లైన్ పాఠాలు వుండాల్సిందేనని, కానీ అవి పరిమిత అవర్స్ మాత్రమే వుండాలని నిపుణులు అంటున్నారు. ఈ రకమైన బోధనతో గురువుతో ప్రత్యక్ష సంబంధాలు కోల్పోతున్నారని నిపుణులు అంటున్నారు. నేటి విద్యార్థులు మెమరీ ఎక్కువుగా వుంటున్నా. ఇంటిలిజెన్స్ తక్కువుగా వుంటుందని చెబుతున్నారు. మానవ సంబంధాలకు పాతర.. విలువలనేవి నేర్చుకుంటే వచ్చేవి కావు. గురువులు, తల్లిదండ్రుల ద్వారా సమాజ స్థితిగతులను తెలుసుకుని విలువలను పెంపొందించుకోవాలి. ప్రస్తుతం తల్లిదండ్రులు బిజీ లైఫ్తో పిల్లలతో గడిపే సమయం కూడా వుండటం లేదు. దీంతో స్కూల్లో స్మార్ట్ క్లాసులు, ఇంటికి వచ్చిన తర్వాత ఆన్లైన్ పాఠ్యాంశాలతో పిల్లలు గడిపేస్తూ, ఆట పాటలకు దూరమవుతున్నారు. దీంతో వారిలో ఒక రకమైన మైండ్సెట్ ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు.ఎప్పుడూ కంప్యూటర్, పాఠాలు, ఫేస్బుక్లతో వారిలో విభిన్నమైన మనస్తత్వం ఏర్పడుతుందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనిషి ఎప్పుడు సంఘాన్ని చూసి నేర్చుకోవాలని, ప్రస్తుతం తరం విలువలు, మాన వ సంబంధాలు కోల్పోతున్నారని చెపుతున్నారు. చిన్న సమస్యనూ పరిష్కరించుకోలేరు నిత్యం కంప్యూటర్, ఆన్లైన్ పాఠాలు, పర్యవేక్షణతో బలవంతపు చదువులతో తీవ్రఒత్తిడికి గురవుతున్న చిన్నారులు చిన్న సమస్య ఎదురైనా పరిష్కరించుకోలేరు. అలాంటి సమయంలో సమస్య నుంచి తప్పించుకునేందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు చెపుతున్నారు. విద్యా విధానంలో మార్పు రానంత కాలం ఇవి కొనసాగుతూనే ఉంటాయనేది నిపుణులు వాదన. జీవితంలో ఎదురయ్యే అతిసాధారణ సమస్యను సాధించడానికి కావాల్సిన మానసిక శక్తి ప్రస్తుత విద్యార్థుల్లో వృద్ధి చెందడం లేదు. ప్రస్తుత విద్యావిధానంతో జీవన విధానాన్ని నేర్పే పద్ధతులను కోల్పోతున్నారు. స్వీయ ఆలోచన కోల్పోతున్నారు నేటివిద్యా విధానం ద్వారా విద్యార్థులు స్వీయ ఆలోచనను కోల్పోతున్నారు. ఎంతవరకూ పాఠ్యాంశాలను బట్టిపడుతూ జిరాక్స్ మిషన్లాగా ఎదుగుతున్నారు. వారిలో రీసెర్చ్ మైండ్ డెవలప్ కావడం లేదు. ర్యాంకులు, మార్కులు సా«ధించడం మినహా ఊహాజనిత సమస్యలను సాధన చేయడంలేదు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోగలిగే ఆత్మస్థైర్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించాలి. నిత్యం కంప్యూటర్, ఫేస్బుక్, ట్విట్టర్లకు అలవాటు పడుతూ మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. అలాంటి వారిలో కోపం, చిరాకు ఎక్కువుగా వుంటుంది. నేను అనే భావన వారిలో వుంటుంది. దీంతో సోదరుల్ని సైతం బయటివారిలా భావిస్తూ వ్యవహరిస్తుంటారు. నిత్యం పాఠ్యాంశాలను బట్టీపట్టడం ద్వారా చెప్పింది చేసే రోబోల్లా మారుతున్నారు. ఈ విధానం మారాలి. – డాక్టర్ టీఎస్రావు, సైకాలజిస్ట్, రాష్ట్రప్రభుత్వ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్ కమిటీ సభ్యుడు -
ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్రూంలు
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలన్నింటిలో డిజిటల్ క్లాస్ రూంలు ఏర్పాటు చేసేందుకు ప్రవాసాంధ్రులను సమన్వయపరచుకుని ముందుకు వెళుతున్నామని ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం తెలిపారు. మార్కెట్ సెంటర్లోని హిందూ కాలేజీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్రూంను ఆల్బనీ ఆంధ్రా సంఘం (న్యూయార్క్) అధ్యక్షుడు, పాఠశాల పూర్వ విద్యార్థి నిడమానూరి వెంకట శ్రీనివాస్, శైలజ దంపతులు శుక్రవారం ప్రారంభించారు. ముఖ్య అతిధి కోమటి జయరాం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచి, ఆధునిక విద్యాబోధన అందించేందుకు ఎన్నారైలు చిత్తశుద్ధితో ముందుకు వస్తున్నారన్నారు. 160 ఏళ్ల చరిత్ర కలిగిన హిందూ హైస్కూల్లో చదివిన ఎన్వీ శ్రీనివాస్ అమెరికాలో స్థిరపడినప్పటికీ తన మూలాలను మరచిపోకుండా పాఠశాలలో డిజిటల్ క్లాస్రూం ఏర్పాటు చేయించడం అభినందనీయమన్నారు. ఐదు వేల ప్రభుత్వ పాఠశాలల్లోడిజిటల్ క్లాస్రూములు అమెరికాలో స్థిరపడిన ప్రవాసాంధ్రులను సమన్వయపరచుకుని రాష్ట్రంలోని ఐదు వేల ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్రూమ్స్ ఏర్పాటు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. ఇ ప్పటివరకు మూడు వేల పాఠశాలల్లో పూర్తయిదని, మిగిలిన లక్ష్యాన్ని వచ్చే విద్యా సంవత్స రం ముగింపు నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. భావి జీవితానికి బాటలు వేసిన పాఠశాల డిజిటల్ క్లాస్రూం దాత ఎన్వీ శ్రీనివాస్ మాట్లాడుతూ హిందూ కాలేజీ హైస్కూల్లో విద్యార్థి దశలో వేసిన పునాది తన భావి జీవితానికి బాటలు వేసిందని చెప్పారు. అమెరికాలో స్థిరపడినప్పటికీ తాను చదివిన పాఠశాల అభివృద్ధిలో భాగస్వామిని కావాలనే ఆశయంతో ఈ కార్యక్రమం కోసమే న్యూయార్క్ నుంచి వచ్చానన్నారు. పాఠశాల విద్య ఆర్జేడీ కేవీ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఘన చరిత్ర కలిగిన హిందూ కాలేజీ హైస్కూల్లో డిజిటల్ క్లాస్రూం ఏర్పాటుకు యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ కనబరిచిందని చెప్పారు. విలువలతో కూడిన విద్యాబోధనతో విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దుతోందని అన్నారు. హిందూ కాలేజీ హైస్కూల్ కార్యదర్శి మాజేటి వీఆర్కే ముత్యాలు, పాఠశాల పాలక మండలి అధ్యక్షుడు జి. శివరామకృష్ణ ప్రసాద్, కార్యదర్శి జీవైఎన్ బాబు, ప్రధానోపాధ్యాయుడు ఎస్. శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
12% పెరగనున్న డిజిటల్ విద్య
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం దేశంలో ఎడ్యుకేషన్ మార్కెట్ విలువ 97.8 బిలియన్ డాలర్లు కాగా దాన్లో డిజిటల్ ఎడ్యుకేషన్ వాటా రెండు బిలియన్ డాలర్లకు చేరిందని ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ సిస్కో ఇండియా, సార్క్ కమర్షియల్ సేల్స్ ఎండీ సుధీర్ నాయర్ చెప్పారు. రెండేళ్లలో డిజిటల్ ఎడ్యుకేషన్ 11 నుంచి 12 శాతం మేర వృద్ధి సాధించే అవకాశం ఉందన్నారు. ఇక్కడి ఐఎస్బీ ప్రాంగణంలో ‘బ్లూ ప్రింట్ ఫర్ డిజిటల్ ఎడ్యుకేషన్’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో సిస్కో సంస్థ పలు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా సుధీర్ నాయర్ మాట్లాడుతూ ప్రస్తుతం డిజిటలైజేషన్ ప్రభావానికి గురవుతున్న 14 రంగాల జాబితాలో విద్యా రంగం ఏడో స్థానంలో ఉందని, దీన్ని బట్టే విద్యా రంగంలో డిజిటల్ నైపుణ్యాలు పెంచుకోవాల్సిన ఆవశ్యకత వెల్లడవుతోందని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే తాము పలు సాఫ్ట్వేర్ ప్రొడక్ట్లను రూపొందించినట్లు తెలియజేశారు. ‘‘దీన్లో స్పార్క్ యాప్ విభిన్నమైనది. దీని ద్వారా విద్యార్థులకు వర్చువల్ క్లాస్ రూమ్స్, లెక్చర్స్ అరచేతిలో అందుబాటులోకి వస్తాయి’’ అన్నారాయన. తెలంగాణ ప్రభుత్వంతోనూ ఒప్పందం: డిజిటల్ ఎడ్యుకేషన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కోణంలో తెలంగాణ ప్రభుత్వంతోనూ ఒప్పందం చేసుకున్నట్లు ఈ సందర్భంగా సుధీర్ చెప్పారు. ‘‘ఈ ఒప్పందంలో భాగంగా టి–హబ్ ప్రాంగణంలో ఇన్నోవేషన్ హబ్, లివింగ్ ల్యాబ్లను నెలకొల్పాం. హైటెక్ సిటీ ప్రాంతంలో 2.2. కి.మీ. మేర డిజిటల్ జోన్ ప్రాజెక్ట్ను రూపొందించాం. దీనిలో భాగంగా స్మార్ట్ వై–ఫై, స్మార్ట్ లైటింగ్, ట్రాఫిక్ ఎనలిటిక్స్, స్మార్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ తదితర సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి’’ అని వివరించారు. డెలివరింగ్ రిమోట్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో నెలకొన్న పది పాఠశాలల్లో వర్చువల్ క్లాస్ రూమ్స్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. -
జియో సిమ్లిచ్చారు.. సిగ్నల్ లేదు
కొత్తగూడెం: ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న డిజిటల్ తరగతుల్లో అంతరాయాలను నిరోధించేందుకు ప్రభుత్వం జియో హాట్స్పాట్కు చెందిన రూటర్, సిమ్లను పంపిణీ చేసింది. జిల్లాలో తొలి విడతగా 95 ప్రభుత్వ, 8 కస్తూర్బా పాఠశాలలకు అందించింది. కానీ కొన్ని మండల కేంద్రాలతోపాటు గ్రామాల్లో జియో నెట్వర్క్ సేవలు అందటం లేదు. కరకగూడెం, గుండాల, ఆళ్లపల్లి, దుమ్ముగూడెం, చర్ల తదితర మండలాల్లో అసలు జియో నెట్ వర్క్ను ఆ కంపెనీ ఇంకా ప్రారంభించలేదు. ములకలపల్లి, దమ్మపేట, పినపాక, టేకులపల్లి, అన్నపురెడ్డిపల్లి వంటి చోట్ల మండల కేంద్రాల్లో తప్ప ఇతర గ్రామాల్లో జియో ఊసే లేదు. ఈ క్రమంలో జియో సిమ్, హాట్స్పాట్లను పంపిణీ చేసినా ఉపయోగంలేకుండా పోయింది. జియో సిగ్నల్స్ లేని చోట ఇతర నెట్వర్క్ సిమ్లను ఉపయోగించే అవకాశం లేకపోవడంతో ఇవి వృథాగా మారనున్నాయి. ప్రజాధనమూ ఖర్చయిపోయింది. సమయమూ వృథా.. జిల్లాలోని కొన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇప్పటికే డిజిటల్ తరగతులు నడుస్తున్నాయి. ఇంటర్నెట్ సిగ్నల్స్ సరిగ్గా అందకపోవడంతో డిజిటల్ పాఠాల్లో అంతరాయం కలుగుతోంది. పాఠశాలల సమాచారం కూడా ఆన్లైన్లోనే ఎంఈవో, డీఈఓ కార్యాలయాలకు అందజేస్తున్నారు. పాఠశాలల్లో ఇంటర్నెట్ సేవలు అందకపోవడంతో సమాచారం పంపేందుకు హెచ్ఎంలు, ఉపాధ్యాయులు మండల కేంద్రాలకు రావాల్సి వస్తోంది. దీంతో విలువైన బోధన సమయం వృథా అవుతోంది. ఈ సమస్యలను అధిగమించేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం రిలయన్స్ నెట్వర్క్కు చెందిన జియో సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని వైపై హాట్స్పాట్ రూటర్ను, జియో నానో సిమ్లను జిల్లా కేంద్రాలకు పంపిణీ చేసింది. పాఠశాలల్లో ఉన్న కంప్యూటర్, ల్యాప్ట్యాప్లకు అనుసంధానం చేసి ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చని ఆదేశాలను జారీ చేసింది. కానీ సిగ్నల్స్ లేనికారణంగా మళ్లీ అదే సమస్య ఏర్పడింది. సిగ్నల్స్ ఉంటే ఉపయోగమే.. పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయి. మిగిలిన కొద్దిరోజులు విద్యార్థులకు చాలా అమూల్యమైనవి. మోడల్ టెస్టుల అనంతరం వెనుకబడిన సబ్జెక్టులలో పునశ్చరణ, ముఖ్యమైన పాయింట్లు, బిట్లు, ఇతర సబ్జెక్టు వివరాలను బోధించేందుకు డిజిటల్ తరగతులు చాలా ఉపయోగపడతాయి. సైన్స్, మ్యాథ్స్ ఇతర సబ్జెక్టులను ప్రాక్టికల్గా, యానిమేషన్ చిత్రాల ద్వారా సులభరీతిలో బోధించేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అందచేసిన వైఫై సేవలు కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ఉపయోగపడుతుండగా, మరికొన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు ఉపయోగపపడం లేదు. జిల్లాలో వైఫై సేవలు పాక్షికంగానే మిగిలిపోనున్నాయి. వైఫై సామగ్రిఅందచేసిన పాఠశాలలు ఇవే: కరకగూడెం – 02 కొత్తగూడెం –06 పినపాక –04 లక్ష్మీదేవిపల్లి –04 చర్ల –04 పాల్వంచ –10 దుమ్ముగూడెం –03 బూర్గంపాడు –07 అశ్వాపురం –04 భద్రాచలం –03 మణుగూరు –02 ములకలపల్లి –03 గుండాల –01 దమ్మపేట –07 ఆళ్లపల్లి –01 అశ్వారావుపేట –06 ఇల్లెందు –06 టేకులపల్లి –06 జూలూరుపాడు –04 చండ్రుగొండ –03 అన్నపురెడ్డిపల్లి –02 చుంచుపల్లి –04 సుజాతనగర్ –03 -
‘శిక్ష’ణకు సడలింపు !
♦ నేషనల్ ఓపెన్ స్కూల్ ద్వారా ప్రైవేట్ టీచర్లకు ట్రైనింగ్ ♦ ఉపాధ్యాయ అభ్యర్థి ఇంటి వద్దకే ‘డిజిటల్ తరగతులు’ ♦ జిల్లాలో 110 పాఠశాలలకు నిబంధనలు వర్తింపు ♦ ప్రైవేట్లో ‘అసలు’ లెక్కలు తేల్చేందుకు ప్రభుత్వ కమిటీలు నాణ్యమైన విద్యనందించే అవకాశం ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు టెట్ను మినహాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నిర్ణయం ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు శుభ పరిణామం. ఓపెన్ స్కూలింగ్ శిక్షణ ద్వారా పిల్లలకు నాణ్యతతో కూడిన విద్యను అందించే అవకాశం ఉంటుంది.– సానికొమ్ము బ్రహ్మారెడ్డి, ప్రైవేట్ పాఠశాలల సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్తగూడెం : ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు కూడా ‘టెట్’ తప్పనిసరి అని ఇటీవల పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం ఆ నిబంధనను సడలించింది. కేంద్ర, రాష్ట్ర ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ల వినతి మేరకు టెట్ నిబంధనను తొలగించి 2019 మార్చి 31 లోపు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా ట్రైనింగ్ పూర్తి చేయాలని పేర్కొంది. దీంతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఊపిరి పీల్చుకున్నాయి. కాగా, జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు.. వాటిలోని ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్య గురించి ఆయా పాఠశాలల యాజమాన్యాలు తెలిపే వివరాలు వాస్తవానికి భిన్నంగా ఉండడంతో ప్రభుత్వం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి ‘అసలు’ లెక్క తేల్చాలని నిర్ణయించింది. శిక్షణ, నాణ్యత తప్పనిసరి.. ఇటీవలి కాలంలో ప్రైవేట్ పాఠశాలలు బాగా విస్తరిస్తున్నాయి. పోటీ పరీక్షల కోసం ప్రత్యేక విభాగాలుగా పేర్కొంటూ చిన్న తరగతుల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కూడా అధిక ఫీజులను వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఫీజులు భారీగానే తీసుకుంటున్నప్పటికీ కొన్ని పాఠశాలల్లో పది, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వారితోనే పాఠాలు చెప్పిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. విద్యాహక్కుచట్టం ప్రకారం ఒకటి నుంచి 8వ తరగతి వరకు పాఠాలను భోదించే ఉపాధ్యాయులు తప్పనిసరిగా శిక్షణ పూర్తి చేసి ఉండాలి. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా టెట్ను తప్పనిసరి చేయాలని భావించింది. కానీ పాఠశాలల్లో దీర్ఘకాలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉండటంతో పాటు పదో తరగతి, ఇంటర్ అర్హతతోనే కొనసాగే వారు అనేక మంది ఉన్నారు. టెట్ నిర్ణయాన్ని అమలు చేస్తే అనేక మంది, వారిపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని జాతీయ, రాష్ట్ర ప్రైవేట్ పాఠశాలల సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నాయి. ఈ నేపథ్యంలో సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం టెట్ నుంచి మినహాయింపు ఇచ్చింది. అన్ట్రైన్డ్ టీచర్లకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా ఆన్లైన్లో డిజిటల్ తరగతులు నిర్వహించి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. జిల్లాలో 110 పాఠశాలల్లో శిక్షణ... జిల్లాలో ప్రస్తుతం ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు 110 ఉన్నాయి. వీటిలో 2900 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా ప్లే స్కూల్స్ చిన్నారులు కాకుండా సుమారు 50 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. 2900 మంది ఉపాధ్యాయులలో సుమారు 60 శాతం అన్ట్రైన్డ్ వారే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో 2019 మార్చి 31 నాటికి అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ట్రైనింగ్ టీచర్లు అందుబాటులోకి రానున్నారు. కాగా వీరంతా ఈనెల 15లోపు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే వ్యవధి చాలా తక్కువగా ఉండటంతో గడువు పొడిగించాలని ప్రైవేట్ యాజమాన్యాలు వేడుకుంటున్నట్లు తెలిసింది. ఉపాధ్యాయ అభ్యర్థి ఇంటి వద్దకే డిజిటల్ తరగతులు... నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా రెండేళ్ల పాటు నిర్వహించే ఈ శిక్షణను ఉపాధ్యాయ అభ్యర్థి తన ఇంటి వద్దనే డిజిటల్ తరగతుల ద్వారా నేర్చుకుంటారు. ఇంటర్ పూర్తి చేసిన వారు, పదో తరగతి ఉత్తీర్ణులయి ఓపెన్ డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ శిక్షణకు అర్హులు. రెండేళ్ల తర్వాత జిల్లా కేంద్రంలో పరీక్షలు నిర్వహించి ట్రైనింగ్ సర్టిఫికెట్ అందజేస్తారు. రెండేళ్ల శిక్షణకు ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 6 వేలు ఫీజు వసూలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో రూ.4500 ఫీజుగా, రూ.1500 విలువైన సెట్అప్ బాక్స్ను అభ్యర్థికి అందిస్తారు. తద్వారా ఇంటి వద్దనే నిర్దేశిత సమయం ప్రకారం డిజిటల్ తరగతుల ద్వారా శిక్షణ పూర్తి చేసేలా ఎన్ఈఓఎస్ ప్రణాళిక రూపొందించింది. దీని ప్రకారం పదో తరగతి అర్హతతో ప్రైవేట్ పాఠశాలల్లో భోదించే ఉపాధ్యాయులు ఇక ఇంటి దారి పట్టాల్సిందే. ‘అసలు’ లెక్కలు తేల్చేందుకు ప్రభుత్వ కమిటీలు... ఇప్పటి వరకు డీఈఓ కార్యాలయంలో ప్రైవేట్ పాఠశాలలు, వాటి వివరాలు ఉండేవి. అనేక పాఠశాలల్లో ట్రైన్డ్ ఉపాధ్యాయులు లేకపోయినా ఉన్నట్లుగా లెక్కలు చూపి పాఠశాలలను నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో పది, ఇంటర్ పూర్తి చేసిన ఉపాధ్యాయులతోనే అనేక పాఠశాలలు నడుస్తున్నట్లు విద్యాశాఖ భావిస్తోంది. దీంతో అసలు ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్న ఉపా«ధ్యాయులు, వారి విద్యార్హతలతో పాటు ట్రైన్డ్ టీచర్ల లెక్కను తేల్చాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ప్రతి మండలంలో ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులతో కమిటీలు ఏర్పాటు చేసి ‘అసలు’ లెక్కలను తేల్చేందుకు కసరత్తు చేస్తోంది. -
6 వేల స్కూళ్లలో డిజిటల్ తరగతులు
మరో 6 వేల పాఠశాలల్లో బయోమెట్రిక్ మెషీన్లు: కడియం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 6 వేల పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి తరగతులు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లోని ఎస్ఎస్ఏ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన డీఈఓల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మరో 6వేల పాఠశాలల్లో బయోమెట్రిక్ మెషీన్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఇందుకు సంబంధించి జిల్లాల వారీగా పాఠశాలల వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలకు స్కూల్ గ్రాంట్లు, మెయింటెనెన్స్ గ్రాంట్లు ఇకపై వేర్వేరుగా ఇస్తామని, జూన్ నెలాఖరు నాటికి నిధులు విడుదల చేస్తామని చెప్పారు. ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ వేగం పెంచామన్న మంత్రి కడియం.. కొత్త టీచర్లు వచ్చేందుకు ఆర్నెల్ల సమయం పడుతుందని, అప్పటి వరకు విద్యా వలంటీర్లు నియమించుకునేలా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. కొన్ని పాఠశాలల్లో టీచర్లు సెలవులో ఉన్నప్పుడు బోధన ఆగిపోతోందని, మున్ముందు అలా జరగకుండా 20మంది ఉపాధ్యాయులను అదనంగా నియమించి అందుబాటులో ఉంచుతామన్నారు. నెలాఖరులోగా ప్రభుత్వ పథకాలు, ఇతర అంశాలకు సంబంధించి డీఈఓలకు శిక్షణ ఇవ్వాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్యను మంత్రి ఆదేశించారు. జూన్ 12లోపు మరోసారి డీఈఓల సదస్సు నిర్వహిస్తామనని, సమగ్ర సమాచారంతో అధికారులు హాజరు కావాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4,637 స్కూళ్ల విలీనం! 20 మంది లోపు విద్యార్థులున్న ప్రభుత్వ పాఠశాలలను సమీప పాఠశాలల్లో విలీనం చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి పాఠశాలలు 4,637 ఉన్నట్లు తేల్చింది. వాస్తవానికి ఈ పాఠశాలల విలీన ప్రతి పాదనలు ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం ఎస్ఎస్ఏ సమావేశ మందిరంలో జరిగిన డీఈఓల భేటీలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ మేరకు ప్రకటించినట్లు తెలిసింది. జీరో ఎన్రోల్మెంట్, 20 మంది లోపు విద్యార్థులున్న పాఠశాలలను సమీప పాఠశాలల్లో విలీనం చేస్తే మెరుగైన ఫలితాలుంటాయని, పాఠశాలలు తెరిచే నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. -
204 పాఠశాలల్లో ఎర్నెట్ డిజిటల్ తరగతులు
శ్రీకాకుళం : జిల్లాలోని 204 ఉన్నత పాఠశాలల్లో ఎర్నెట్ డిజిటల్ తరగతులు జరుగుతున్నాయని సర్వశిక్షా అభియాన్ పీఓ ఎస్.త్రినాథరావు తెలిపారు. శనివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ 204 పాఠశాలల్లో ప్రభుత్వ, జిల్లా పరిషత్, గిరిజనాభివృద్ధితోపాటు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పైలట్ ప్రాజెక్టుగా డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాలకొండ డివిజన్లో 72, శ్రీకాకుళం డివిజన్లో 55, టెక్కలి డివిజన్లో మిగిలిన పాఠశాలలు ఉన్నాయని వివరించారు. ప్రతి పాఠశాలకు 10 కంప్యూటర్లు, ప్రింటర్, యూపీఎస్, ప్రొజెక్టర్, కుర్చీలు సరఫరా చేశామని తెలిపారు. 146 ప్రాథమికోన్నత పాఠశాలలను గుర్తించి సర్వశిక్షా అభియాన్ ద్వారా కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగ్ కోసం అవసరమైన సామగ్రిని సమకూర్చినట్లు చెప్పారు. ఫైబర్ గ్రిడ్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన వెంటనే దశల వారీగా పాఠశాలల్లో డిజిటల్ తరగతులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. గతంలో బోధనోపకరణాలు, ప్రయోగశాలలు ఉపయోగించి బోధించేవారని, ప్రస్తుత సీసీఈ విధానంలో పై రెండింటితోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఉపాధ్యాయులు లేకపోయినా డిజిటల్ తరగతుల ద్వారా విద్యార్థులు అన్ని విషయాలను తెలుసుకోగలుగుతున్నారని, సైన్స్ ప్రయోగాలను,క్విజ్ పోటీలను, పోటీ పరీక్షలను సమర్థంగా ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. -
‘డిజిటల్ బోధన’ లో గొల్లప్రోలు ప్రథమ స్థానం
రాష్ట్రంలో ద్వితీయస్థానం గొల్లప్రోలు : జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ బోధనలో గొల్లప్రోలు జెడ్పీ బాలుర పాఠశాల రాష్ట్రంలో ద్వితీయస్థానం, ల్లాలో ప్రథమ స్థానం సాధించింది. జిల్లా వ్యాప్తంగా గత నవంబర్లో వందపాఠశాలల్లో డిజిటల్ తరగతులు ప్రారంభించారు. ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు సులభమైన, ఆసక్తికరమైన పద్ధతుల్లో బోధన చేయడానికి డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేశారు. అందులోభాగంగా గొల్లప్రోలు జెడ్పీసూ్కల్ 188 గంటల పాటు డిజిటల్ క్లాసులు నిర్వహించినట్టు జిల్లావిద్యాశాఖ వెలువడించింది. రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా మందస మండలం వీరగున్నమాపురం ప్రథమస్థానంలో నిలిచింది. జిల్లాలో కరప హైసూ్కల్ ద్వితీయస్థానంలో నిలిచింది. ఈమేరకు పాఠశాలలో డిజిటల్ క్లాసుల నిర్వహణకు కృషి చేసిన ఇ¯ŒSచార్జి జే.కామేశ్వరరావును, ప్రధానోపాధ్యాయులు జీఏ ప్రశాంతిని పలువురు అభినందించారు. -
ఇక రోజూ డిజిటల్ తరగతులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో రోజూ డిజిటల్ తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు అకడమిక్ కేలండర్లో నిబంధనలు పొందుపర్చింది. ప్రస్తుతం ఉన్నత పాఠశాలల్లో ఒక తరగతికి ఉదయం, మరో తరగతికి మధ్యాహ్నం డిజిటల్ పద్ధతిలో బోధన నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు మరింత మెరుగైన బోధన అందించాలనే ఉద్దేశంతో ప్రతి రోజూ ఉదయం పాఠశాల ప్రారంభం కాగానే ఒక్కో తరగతికి ఒక రోజు చొప్పున పూర్తిగా డిజిటల్ తరగతులు నిర్వహిస్తారు. 6–10వ తరగతి విద్యార్థులకు వారంలో కనిష్టంగా 30 తరగతులు ఇలా బోధన జరగాల్సిందిగా 2017–18 విద్యా కేలండర్లో రూపొందించింది. మార్చి 21న విద్యాసంవత్సరం ప్రారంభం కానుండటంతో బోధన పక్కాగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. -
జిల్లాలో 75 పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు
– డీఈఓ రవీంద్రనాథ్రెడ్డి మహానంది: జిల్లాలో ఇప్పటి వరకు 75 పాఠశాలల్లో డిజిటల్ క్లాసులను ప్రారంభించామని జిల్లా విద్యాశాఖాధికారి కె.రవీంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు. మహానందీశ్వరుడి దర్శనార్థం బుధవారం ఆయన మహానందికి వచ్చారు. అనంతరం తిమ్మాపురంలోని ఏపీ మోడల్ స్కూల్ను తనిఖీ చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రిన్సిపాల్ ఫర్హానాబేగంను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. విద్యార్థులకు ఎంసెట్లో మంచి ఫలితాలు సాధించేందుకు ప్రతి మోడల్ స్కూల్లో కొంత మంది విద్యార్థులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 14 పీఈటీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏపీ మోడల్ స్కూల్ హాస్టళ్లను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ప్రాథమిక పాఠశాలలు మినహా మిగిలిన పాఠశాలల్లో విద్యార్థులకు కూడా బయోమెట్రిక్ హాజరు విధానాన్ని త్వరలో మొదలు పెడతామన్నారు. జిల్లాలో సుమారు 200 మంది ఉపాధ్యాయుల కొరత ఉందని డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామన్నారు. మహానందిలో పూజలు డీఈఓ రవీంద్రనాథ్రెడ్డి బుధవారం కుటుంబ సమేతంగా శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేపట్టారు. ఆలయ పండితులు రవిశంకర అవధాని, తదితరులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు చేశారు. ఆయన వెంట మహానంది, శిరివెళ్ల మండలాల ఎంఈఓలు రామసుబ్బయ్య, శంకరప్రసాద్ ఉన్నారు. -
పాఠ్యాంశాలకు డిజిటల్ బ్రేక్
ప్రొజెక్టర్తో రెగ్యులర్ క్లాసులు ► 6నుంచి 9వ తరగతుల విద్యార్థులకు ఇబ్బందులు ► కామన్ టైంటేబుల్తో కొంచెం మేలు నేరడిగొండ : ‘ముందచ్చిన చెవులకంటే వెనకొచ్చిన కొమ్ములే వాడి’ అన్న చందంగా డిజిటల్ తరగతులు మారారుు. దీంతో రెగ్యూలర్ పాఠ్యాంశాలు పెండింగ్లో పడిపోతాయా? ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డిజిటల్ ప్రక్రియతో ఉపాధ్యాయులు డిజిటల్ పైనే పూర్తిగా దృష్టి సారిస్తున్నారు. దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పాడింది. గతనెల 16వ తేదిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యా విధానాన్ని ప్రారంభించింది. విద్యార్థులకు ప్రొజెక్టర్ ద్వారా చదవడం, చూడగలగడం (రీడ్ ఓన్లీ టర్మినల్)తో పాటు హార్డ్ డిస్క్ ద్వారా బోధన అందిస్తుంది. అరుుతే ఈ విధానంలో ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి వరకు విద్యా శాఖ ప్రణాళిక ప్రకారం రోజువారిగా పాఠశాలల్లో ఉదయం రెండు, సాయంత్రం రెండు తరగతులను 20 నిమిషాల పాటు ఈ రెండు ప్రక్రియల ద్వారా విద్యాబోధనకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పది రోజులుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియతోతో ప్రభుత్వ పాఠశాలల సమయపాలనకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రొజెక్టర్ విద్యా విధానానికి మధ్య వ్యత్యాసం ఏర్పడింది. పాత విద్యా ప్రణాళికకు స్వస్తీ ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు పూర్తవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఏడాది పాటు విద్య ప్రణాళికను ఇదివరకే రూపొందించుకొని బోధన కొనసాగిస్తున్నారు. ఇంతలో ప్రొజెక్టర్ విధానం ద్వారా విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన నూతన ప్రక్రియ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు తలనొప్పిగా మారిందని పలువురు వాపోతున్నారు. వార్షిక పరీక్షలు ఓవైపు, సిలబస్ పూర్తికాకపోవడంతో మరోవైపు ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. క్రమం తప్పకుండా సిలబస్ పూర్తి చేసుకునేందుకు తరగతి గదుల్లోనే ఉపాధ్యాయులు ఉంటున్నారు. ఇంతలో ఈ డిజిటల్ విద్యా విధానంతో పది రోజులుగా సిలబస్ ముందుకు సాగడం లేదు. సామాన్య, గణితం, ఆంగ్ల పాఠాలు ఉన్న సమయంలోనే ఈ ప్రొజెక్టర్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థుల సిలబస్కు అడ్డంకులు ఏర్పడుతున్నారుు. ఇప్పటికై నా ప్రభుత్వం ఆరు ఉంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు సిలబస్ పూర్తయ్యే వరకు వారికి విద్యాబోధనకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండాలని, ఈ ప్రొజెక్టర్ ద్వారా విద్యా బోధనపై పక్కా ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. కామన్ టైమ్టేబుల్ రూపొందించాలి.. పాఠశాలల్లో డిజిటల్ విద్యా విధానంతో విద్యార్థులకు మేలు కలుగుతున్నా, కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. ఈ విధానంలో కొద్దిపాటి మార్పులు చేస్తే అందరికీ ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ప్రసారం అయ్యే ఆర్ఓటీ ద్వారా అందించే విద్యా బోధనకు పాఠశాలల సమయ పాలనకు కొద్దిపాటి వ్యత్యాసాలు ఉన్నారుు. దీంతో ఉపాధ్యాయుల నుంచి సిలబస్ విషయంలో ఫిర్యాదులు వస్తున్నాయని పలువురు ప్రధానోపాధ్యాయులు చర్చించుకుంటున్నారు. -
మెరుగైన ఉత్తీర్ణత సాధించాలి
► కలెక్టర్ జ్యోతి బుద్ధప్రకాశ్ ► డిజిటల్ తరగతుల తనిఖీ తలమడుగు : విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని మె రుగైన ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ జ్యోతి బుద్ధప్రకాశ్ అన్నారు. బుధవారం ఆయన మం డల కేంద్రంలోని జెడ్పీ పాఠశాల, లింగి గ్రామంలోని కేజీబీవీని జిల్లా విద్యాధికారి లింగయ్యతో కలిసి తనిఖీ చేశారు. తరగతి గదుల్లో కూర్చుని ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించారు. డిజిటల్ తరగతులను పరిశీ లించి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మా ట్లాడుతూ గత ఏడాది పదో తరగతి పరీక్షల ఫలి తాల కంటే ఈసారి అధిక ఉత్తీర్ణత సాధించాలని చెప్పారు. పరీక్షల కోసం ఇప్పటి నుంచే కష్టపడి చదవాలని అన్నారు. అనంతరం ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. ఉత్తీర్ణత సాధనకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారా అని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో కౌసల్య, తహసీల్దార్ చిత్రు పటేల్, ఎంపీడీవో సునీత, ప్రధానోపాధ్యాయుడు బండి రమేష్, కేజీబీవీ ప్రిన్సిపాల్ అల్మూన్ పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయం తనిఖీ మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయూ న్ని కలెక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. మండల జనాభా, వ్యవసాయంపై తహసీల్దార్ చిత్రు పటేల్ను అడిగి తెలుసుకున్నారు. కార్యాలయూనికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు లే కుండా చూడాలని, రైతుల భూ సమస్యలు వెం టనే పరిష్కరించాలని ఆదేశించారు. దళితబస్తీ లో పంపిణీ చేసిన భూములకు రుణాలు ఇప్పిం చాలని తలమడుగు గ్రామ మహిళలు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. వారంలోగా సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్ హామీనిచ్చా రు. ఎంపీడీవో సునీత, ఆర్ఐ లచ్చిరామ్ పాల్గొన్నారు. -
డిజిటల్ విధానంతో కొత్త వెలుగులు
• అందరూ సద్వినియోగం చేసుకోవాలి • రాష్ర్ట విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి డిజిటల్ విద్యా విధానంతో విద్యార్థుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ తోపాటు యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ, సూర్యాపేట పట్టణం, గాజుల మల్కాపురం ఉన్నత పాఠశాలల్లో బుధవారం ఆయన డిజిటల్ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్లగొండలో మొత్తం 191 పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ప్రారంభించామన్నారు. త్వరలో మిగతా అన్ని పాఠశాలల్లోనూ డిజిటల్ తరగతులు ప్రారంభిస్తామన్నారు. నకిరేకల్ : డిజిటల్ విద్యా విధానం ద్వారా విద్యార్థుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ జెడ్పీ పాఠశాలల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ విద్యా తరగతులను నకిరేకల్లోని జెడ్పీహైస్కూల్లో బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డిజిటల్ తరగతులపై పదవ తరగతి విద్యార్థులతో మంత్రి ముచ్చటించారు. ఈ డిజిటల్ తరగతుల ఉపయోగం ఏమిటి అని విద్యార్థులను అడిగారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో వస్తున్న శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్ధులకు ఉపయోగించాలనే ఆలోచనలతో ముఖ్యమంత్రి కేసీఆర్ డిజిటల్ విద్యా తరగతులను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. నల్లగొండ జిల్లాలో మొత్తం 191 పాఠశాలల్లో ఈ డిజిటల్ తరగతులను ప్రారంభించామన్నారు. త్వరలోనే మిగితా పాఠశాలలో కూడా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ డిజిటల్ తరగతులపై 1400మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. వీరు విద్యా పాఠ్యాంశాలను ఎలా బోధించాలన్న విషయాలను ఈ తరగతుల ద్వారా వెల్లడిస్తారన్నారు. విద్యార్థులకు ఈ డిజిటల్ విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. చదువు అనేది కేవలం ఉద్యోగాల కోసం, పరీక్షల మార్కుల కోసం కాకుండా జీవితంలో ఎప్పటికి గుర్తుండిపోయే విధంగా ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ నోట్లకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక విశ్లేషకులతో చర్చిస్తున్నారని.. త్వరలోనే తన అభిప్రాయాన్ని వెల్లడిస్తారని తెలిపారు. ఐదారు సంవత్సరాలుగా నల్లధనానికి సంబంధించిన చర్చ జరుగుతోందన్నారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు నల్లధనాన్ని బయటకు తీసుకురావడం కోసం కొన్ని పార్టీలు హామీలు ఇచ్చాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, అటవీశాఖ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ పూల వీరందర్, ఏజేసీ వెంకట్రావు, ఆర్డీఓ వెంకటాచారి, డీఈఓ చంద్రమోహన్, నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ మొగిలి సుజాతయాదయ్య, జె డ్పీటీసీ పెండెం ధనలక్ష్మి సదానందం, నార్కట్పల్లి ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, ఎంపీటీసీలు ఎల్లపురెడ్డి సైదారెడ్డి, రాచకొండ వెంకన్నగౌడ్, తండు మమత, బచ్చుపల్లి పద్మ రవీందర్రావు తదితరులు ఉన్నారు. డిజిటల్ తరగతులతో విద్యార్థులకు ఎంతో మేలు : జేసీ నల్లగొండ టూటౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశ పెట్టిన డిజిటల్ తరగతులతో విద్యార్థులకు ఎంతో మేలు కలగనుందని జేసీ నారాయణరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలో మాధవనగ ర్లో గల జేబీఎస్ స్కూల్లో డిజిటల్ తరగతులను ప్రారంభించి మాట్లాడారు. దృశ్యరూపం ద్వారా విద్యాబోధనతో విద్యార్థులకు సులభంగా అర్థం అవుతదన్నారు. అనంతరం విద్యార్థులకు నల్లధనం వల్ల దేశానికి నష్టంపై అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ అభిమన్యు శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మారెడ్డి అంజిరెడ్డి, ఉపాధ్యాయులు శంకర్, కేసాని వేణుగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బియ్యం మార్పిస్తాం.. డిజిటల్ తరగతులు ప్రారంభించడానికి జేబీఎస్ స్కూల్కు వచ్చిన జేసీ నారాయణరెడ్డి పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాలకు వచ్చే బియ్యం నల్లగా ఉండడంతో పాటు దుమ్ము ఉంటుందని ప్రధానోపాధ్యాయుడు వివరించారు. బియ్యం వెంటనే మార్పిస్తానని జేసీ హామీ ఇచ్చారు. -
సులభతర బోధన కోసమే డిజిటల్ విధానం
- దీనికి, ఉపాధ్యాయుల సంఖ్యకు సంబంధం లేదు - వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రతి పాఠశాలను డిజిటలైజేషన్ చేస్తాం - బంజారాహిల్స్ ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాస్రూమ్ ప్రారంభించిన కడియం - రెండేళ్లలో ఇంటింటికీ ఇంటర్నెట్: కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సులభంగా బోధించడం కోసమే డిజిటల్ విధానాన్ని తీసుకొచ్చాం. దీనికి, ఉపా ధ్యాయుల సంఖ్యకు సంబంధం లేదు. టీచర్ల సంఖ్యను తగ్గిస్తామనే ఆందోళన వద్దు’’అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నా రు. బుధవారం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 8 లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డిజిటల్ క్లాస్రూమ్ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ‘‘రాష్ట్ర వ్యాప్తంగా 5,415 ఉన్నత పాఠశాలలున్నారుు. వీటిలో ప్రస్తుతం 3,352 పాఠశాలల్లో డిజిటల్ తరగతుల్ని ప్రారంభించాం. దేశంలో ఇంతపెద్ద సంఖ్యలో డిజిటల్ తరగతుల బోధన చేపట్టింది మన రాష్ట్రమే. వచ్చే ఏడాది మిగతా అన్ని పాఠశాలల్లో ఈ విధానాన్ని తీసుకొస్తాం. మనటీవీ ద్వారా ప్రసారాలు అందిస్తున్నాం. ఇందులో రెండు సౌకర్యాలున్నారుు. ఇంటర్నెట్ ఉన్నప్పుడు ఆన్లైన్ పద్ధతిలో, లేనప్పుడు ఆఫ్లైన్ పద్ధతిలో పెన్డ్రైవ్ వినియోగించి పాఠ్యాంశ బోధన చేపట్టవచ్చు’’అన్నారు. డిజిటల్ క్లాస్రూమ్ను ప్రారంభించిన ఆయన.. ఎనిమిదో తరగతిలో జీర్ణవ్యవస్థ, దంత వ్యవస్థకు సంబంధించిన పాఠాన్ని విద్యార్థులతో కలసి విన్నారు. పేదలకు మెరుగైన విద్య కోసం: కేటీఆర్ పేద, మధ్యతరగతి విద్యార్థులే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని, వారికి మెరుగైన విద్య అందించేందుకు డిజిటల్ క్లాస్లను అందుబాటులోకి తెచ్చామని ఐటీశాఖ మంత్రి కె.తారకరామా రావు పేర్కొ న్నారు. బుధవారం ఉదయం మనటీవీ కార్యాలయంలో డిజిటల్ క్లాస్ ప్రారంభో త్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియంతో పాటు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ ‘‘వచ్చే రెండే ళ్లలో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తాం. రాష్ట్రంలో కోటి మందిని డిజిటల్ అక్షరా స్యులుగా తీర్చి దిద్దుతాం’’అని అన్నారు. మనటీవీ ద్వారా రాష్ట్రంలో 250 గంటల పాటు ఐదున్నర లక్షల మందికి గ్రూప్-2 పాఠాలను ప్రసా రం చేశామని, మనటీవీ సేవల్ని మరింత విస్తృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జనార్దన్రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, పాఠశాల విద్యాశాఖ సంచా లకులు కిషన్, గురుకుల ఆశ్రమ పాఠశాలల కార్యదర్శి ప్రవీణ్కుమార్, హైదరాబాద్ డీఈవో రమేశ్ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో సబ్జెక్టు నిపుణులతో ఫోన్ ఇన్! డిజిటల్ తరగతుల్లో భాగంగా పాఠశాల విద్యాశాఖ కసరత్తు సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యాశాఖ విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 3,352 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, గురుకులాలు, మోడల్ స్కూళ్లలో డిజిటల్ తరగతులను ప్రారంభించిన విషయం తెలిసిందే. డిజిటల్ తరగతులకు తోడు విద్యార్థుల సందేహాల నివృత్తికి సబ్జెక్టు నిపుణులతో ఫోన్ఇన్ వంటి కార్యక్రమాలు ప్రారంభించాలని భావిస్తోంది. ప్రస్తుతం 6 నుంచి 9వ తరగతి వరకు సామాన్య, సాంఘిక, గణిత శాస్త్రాల్లో డిజిటల్ పాఠాలను రూపొందించింది. వచ్చే ఏడాది పదో తరగతికి డిజిటల్ పాఠాల రూపకల్పనకు ఏర్పాట్లు చేస్తోంది. డిజిటల్ పాఠాలను 3 మార్గాల్లో (మన టీవీ, కేయాన్, హార్డ్ డిస్క్) అందిస్తోంది. ముందుగా రికార్డు చేసిన పాఠాలను వీటి ద్వారా విద్యార్థులకు బోధించేలా చర్యలు చేపట్టింది. ఆన్లైన్లో లైవ్ పాఠాలను అందించాలని యోచిస్తోంది. ఇప్పటికే వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసింది. విద్యార్థులకు ఏదైనా సందేహం తలెత్తితే ఆయా నంబర్లకు మెసేజ్ పంపించి నివృత్తి చేసుకునే ఏర్పాట్లు చేస్తోంది. తరగతి గదిలో బోధించిన పాఠాలను యూట్యూబ్లోనూ అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టింది. ప్రత్యేకంగా వెబ్సైట్ను రూపొందించి అందులో డిజిటల్ పాఠాలను పొందుపరిచేందుకు కసరత్తు చేస్తోంది. భవిష్యత్తులో త్రీడీ యానిమేషన్ రూపంలోనూ పాఠాలను రూపొందించేందుకు కసరత్తు చేస్తోంది. -
నేటి నుంచి డిజిటల్ బోధన
నిజామాబాద్ అర్బన్ : నేటి నుంచి ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యాబోధన ప్రారంభం కానుంది. ఇందుకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. వారం రోజులుగా ఆర్మూర్లో డిజిటల్ విద్యాబోధనకు సంబంధించి ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. మొదట 241 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేయగా సౌకర్యాల ఏర్పాటులో ఆలస్యం కావడంతో ప్రస్తుతం 141 పాఠశాలల్లో బోధించనున్నారు. గతంలోనే డిజిటల్ విద్యాబోధన ప్రారంభం కావల్సి ఉండేది. జిల్లాల పునర్ విభజన ప్రక్రియతో ఆటంకం ఏర్పడింది. అనంతరం మళ్లీ ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యాబోధనకు సర్కారు శ్రీకారం చుట్టింది. కామారెడ్డి జిల్లాలో కూడా 111 పాఠశాలల్లో డిజిటల్ విద్యా ప్రారంభం కానుంది. 141 పాఠశాలలు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 283 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నారుు. ఇందులో 141 పాఠశాలల్లో డిజిటల్ విద్యాబోధన ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ప్రొజెెక్టర్లు, కంప్యూటర్ ఏర్పాటు, హార్డ్డిస్క్లు, ఎల్ఈడీలను విద్యాశాఖ ఆయా పాఠశాలల్లో ఏర్పాటు చేసింది. ఉన్నత పాఠశాలల్లో ఈ డిజిటల్ విద్యాబోధనను ఏర్పాటు చేస్తున్నారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మన టీవీ ద్వారా ప్రసారమయ్యే విద్యాబోధనను చేపట్టనున్నారు. ఆయా పాఠశాలల్లో ప్రొజెక్టర్, హార్డ్డెస్క్లను అందుబాటులో ఉంచనున్నారు. దీని ద్వారా మన టీవి కార్యక్రమం రోజూ ఏ సమయంలోనైతే పాఠాలు ప్రసారమవుతాయో దానికి సంబంధించి సమయానికి ముందుగానే తెలియజేస్తారు. ఆ సమయంలో సంబంధిత ఉపాధ్యాయుడు పాఠాలను బోధించనున్నారు. తరగతుల వారిగా షెడ్యుల్ను కేటారుుంచనున్నారు. సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులకు సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ కూడా పూర్తి చేశారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులకు సాంకేతిక పరిజ్ఞానంపై అనుభవం లేదు. నెట్వర్క్ సమస్యలు వంటి తలెత్తనున్నారుు. ఆ సమయంలో ప్రసారం అయ్యే విద్యాబోధన మళ్లీ అందుబాటులో ఉండదు. తదనంతరం ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఏలా బోధిస్తాడన్నది అధికారులు పేర్కొనలేదు. మరో వైపు జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నారుు. సంబంధిత పాఠశాలల్లో డిజిటల్ విద్యాబోధన పరికరాలకు సరైన రక్షణ లేకుండా పోరుుంది. ఇదివరకే పాఠశాలల్లో కంప్యూటర్లు, వంట సామగ్రిని దొంగలించడం తరచుగా జరుగుతుంది. ప్రస్తుతం విలువైన పరికరాలకు సరైన రక్షణ లేకుండా పోవడం ఉపాధ్యాయకులకు ఆందోళన కలిగిస్తోంది. దీనిపై కూడా ఉన్నతాధికారులు రక్షణకు సంబంధించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కాగా, డీఈవో రాజేశ్ను అడగగా.. నేటి నుంచి డిజిటల్ విద్య ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. -
టెన్త్ తర్వాత కూడా చదువుకుంటాం..పెళ్లి చేసుకోం!
సిద్దిపేట: పదో తరగతి పూర్తయిన వెంటనే పెళ్లిళ్లు చేసుకోబోమని, ఉన్నత చదువులు చదువుకుంటామని కస్తూరిభా గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ప్రమాణం చేశారు. నగర పంచాయతీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, ఎంపీపీ భూక్య మంగ, వ్యవసాయ చైర్మన్ లింగాల సాయన్న పాఠశాలలో బుధవారం ఉదయం డిజిటల్ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎంఈవో అర్జున్ మాట్లాడారు. పాఠశాల విద్యార్థినులు తమకు ఒక హామీ ఇవ్వాలని కోరారు. పేద కుటుంబాల వారు తమ బిడ్డలు మంచి చదువులు చదివి ప్రయోజకులు కావాలని కలలు కంటున్నారని అన్నారు. అయితే, ఎక్కువ మంది పదో తరగతి పూర్తి కాగానే పెళ్ళిళ్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలా కాకుండా, ఉన్నత చదువులు చదివిన తర్వాతే వివాహం చేసుకొనేలా తమకు మాట ఇవ్వాలని కోరారు. దీంతో విద్యార్ధినులంతా ఒక్కసారిగా తాము టెన్త్ అయిపోగానే ఎట్టి పరిస్ధితుల్లో వివాహం చేసుకోమని, ఉన్నత చదువులు పూర్తి చేసే వరకూ పెళ్ళి మాట ఎత్తమని, మాటే కాదు ప్రమాణం చేసి చెబుతున్నామని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. -
16 నుంచి స్కూళ్లలో డిజిటల్ తరగతులు
2 వేలకు పైగా స్కూళ్లలో అమలు ► ఈ నెల 11 నుంచి 14 వరకు ట్రయల్ రన్ ► డిజిటలైజేషన్కు సదుపాయాలు కల్పించండి ► కలెక్టర్లకు, డీఈవోలకు డిప్యుటీ సీఎం కడియం శ్రీహరి ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో డిజిటల్ తరగతులను ఈ నెల 16 నుంచి ప్రారంభించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లు, డీఈవోలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. పాఠశాలల డిజిటలైజేషన్పై బుధవారం కడియం శ్రీహరి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే గుర్తించిన 2 వేలకు పైగా పాఠశాలల్లో డిజిటల్ తరగతుల బోధనకు అవసరమైన అన్ని సదుపాయాలు, సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు ఆయా పాఠశాలల్లో ట్రయల్న్ర్ నిర్వహించాలన్నారు. ప్రతి స్కూల్లో కంప్యూటర్లు, విద్యుత్తు సరఫరా, ఆర్వోటీలు, కేబుల్ కనెక్షన్లు సరిగ్గా ఉండేలా చర్యలు చేపట్టాలని, టీచర్ల శిక్షణ పూర్తయ్యేలా చూడాలన్నారు. ఒకసారి ప్రారంభించిన తరువాత సాంకేతిక, ఇతర కారణాలతో మధ్యలో ఆగిపోయే పరిస్థితి రావద్దన్నారు. మొదటి దశలో 2 వేలకు పైగా స్కూళ్లలో ప్రారంభిస్తామని, ఆ తరువాత దశల వారీగా మిగతా పాఠశాలలకు విస్తరిస్తామన్నారు. 16వ తేదీన కార్యక్రమం ప్రారంభానికి జిల్లాల్లో ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, లేనిచోట అధికారులు ప్రారంభించాలన్నారు. డిజిటలైజేషన్కు చర్యలు చేపట్టాలి డిజిటలైజేషన్లో సంక్షేమ పాఠశాలలు ముందంజలో ఉన్నాయని, మిగతా స్కూళ్లు కూడా అందుకు అనుణంగా చర్యలు చేపట్టాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య పేర్కొన్నారు. ఈనెల 11కల్లా కార్యక్రమం ప్రారంభించేం దుకు సిద్ధంగా ఉన్న స్కూళ్ల తుది జాబితాను అందజేయాలన్నారు. హార్డ్వేర్కు సంబంధించి ఏమైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించేం దుకు జిల్లాల్లో జిల్లా మేనేజర్లు అందుబాటులో ఉన్నారని ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. వారితోపాటు ఎంఐఎస్ కోఆర్డినేటర్లు కూడా అందుబాటులో ఉన్నారని, వారికి శిక్షణ ఇచ్చామన్నారు. అన్ని జిల్లాల్లో డిసెంబర్ 31కల్లా కేబుల్ ఆపరేటర్లతో ఒప్పందాలు పూర్తవుతాయన్నా రు. హైదరాబాద్లో ప్రతి స్కూల్కు ఈ కార్యక్రమం కోసం కేబుల్ ఆపరే టర్లు ముందుకువచ్చి వారి ఖర్చుతో కేబుల్ కనెక్షన్లు, సెట్ టాప్ బాక్సులు అందిస్తున్నా రన్నారు. మిగిలిగిన జిల్లాల్లో కూడా కలెక్టర్లు ఇలాంటి ప్రయత్నాలు చేయాలన్నారు. ప్రాథమికంగా డిజిటల్ తరగతులు ప్రారంభించే స్కూళ్ల సంఖ్య ► 1,769 ప్రభుత్వ, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు ► 391 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు ► 192 మోడల్ స్కూళ్లు ► 48 విద్యాశాఖ గురుకులాలు ► 234 సంక్షేమ శాఖల గురుకులాలు. -
ఆంగ్లమాద్యమాన్ని ప్రోత్సహించేందుకే డిజిటల్ తరగతులు
జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి మాణిక్యం నాయుడుపేట: ఆంగ్లమాద్యమాన్ని ప్రోత్సహించేందుకే డిజిటల్ తరగతులు ప్రవేశ పెడుతున్నట్లు జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి పీ మాణిక్యం పేర్కొన్నారు. నాయుడుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం డిజిటల్ తరగతులు ప్రారంభించిన ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అధిక భాగం జూనియర్ కళాశాలలు తెలుగు మీడియం ఉండటంతో ఆంగ్లమాద్యమాన్ని ప్రవేశ పెట్టి ఆంగ్లంపై మక్కువ పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా ఆరు ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో డిజిటల్ తరగతులు ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా నాయుడుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తొలిసారిగా ప్రారంభిస్తున్నట్లు వివరించారు. జిల్లా కేంద్రంలోని రెండు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, విడవలూరు, కోవూరు, గూడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా డిజిటల్ తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో ఆంగ్ల అధ్యాపకుడు డాక్టర్ కల్లూరు గురవయ్య పాల్గొన్నారు. -
కళ్లకు కట్టినట్లుగా..
సాంకేతిక బోధన కోసం కసరత్తు పాఠశాలల వారీగా వివరాల సేకరణ నవంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న క్లాస్లు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్న విద్యాశాఖ అధికారులు సాక్షి, జనగామ : తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ రానుంది. బ్లాక్ బోర్డు పాఠాల నుంచి విద్యార్థులకు డిజిటల్ తరగతులను బోధించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. పూర్తిగా కంప్యూటర్ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో అధికారులు ముందుకుసాగుతున్నారు. దృశ్య రూపంలో పాఠాలపై అవగాహన కల్పించేందుకు డిజిటల్ క్లాస్ రూమ్లను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా, జపాన్, సింగపూర్లో అమలవుతున్న డిజిటల్ తరగతులను మన రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టేందుకు అధికారులు కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఐటీ రంగంలో రోజురోజుకు వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు మెరుగైన విద్యాబోధనలు అందించేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు డిజిటల్ తరగతులు నవంబర్ 14వ తేదీ నుంచి లాంఛనంగా ప్రారంభించేందుకు రాష్ట్ర విద్యాశాఖ తీవ్రంగా కృషి చేస్తోంది. వివరాల సేకరణ.. జిల్లాలోని 13 మండలాల్లో 108 జిల్లా పరిషత్, 70 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. అయితే 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు డిజిటల్ విధానంలో తరగతులను బోధించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటు న్నారు. ఇందులో భాగంగా జనగామ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల వివరాలను కొద్ది రోజులుగా సేకరిస్తున్నా రు. అలాగే డిజిటల్ క్లాస్ రూమ్లకు కావాల్సిన వాతావరణం, విద్యార్థుల సంఖ్య, విద్యుత్ సౌకర్యాలపై ఆయా పాఠశాలల హెచ్ఎంల నుంచి నివేదికను కోరారు. వారం రోజుల్లో పాఠశాలలను ఎం పిక చేసి తరగతుల నిర్వహణకు కావాల్సిన నిర్మాణ పనులను చేపట్టనున్నారు. ఇప్పటికే కొన్ని స్కూళ్లలో దాతల సహకారంతో ప్రొజెక్టర్తో తరగతులను కొనసాగిస్తున్నారు. తొలి విడతలో 9 మోడల్ స్కూళ్లు, 11 కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, 4 గురుకులాల్లో డిజిటల్ క్లాస్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే వసతులు ఉన్న మరికొన్ని పాఠశాలల్లో కూడా తరగతులు నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, కంప్యూటర్లు ఉన్న స్కూళ్లకు 1 టీబీ కెపాసిటీ కలిగిన ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లలో డిజిటల్ సమాచారాన్ని నింపి ఇచ్చి విద్యార్థులకు సాంకేతిక బోధనలు అందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. డిజిటల్ క్లాస్తో ప్రయోజనాలు.. పూర్తిగా వర్ణించలేని పాఠ్యాంశాలను కంప్యూటర్ సాయంతో బోధించవచ్చు. ద్ద స్కీ్ర¯ŒSపై చిత్రాల ప్రదర్శనతోపాటు సబ్జెక్ట్లోని అంశాలను సులువుగా వివరించే అవకాశం ఉంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ విషయాలను విద్యార్థులకు తెలియజేయవచ్చు. డిజిటల్ విధానంలో ఒక్కసారి చదివిన పాఠం విద్యార్థులకు ఎప్పటికి గుర్తుకు ఉండడంతోపాటు త్వరగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కష్టతరమైన ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, గణితం వంటి సబ్జెక్ట్లు, సోషల్కు సంబంధించిన ప్రపంచ, దేశ, రాష్ట్ర పటాలు, దేశాల సరిహద్దులను వివరించడం కోసం డిజిటల్ తరగతులు ఉపయోగపడుతాయి. పాఠశాలల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది.. డిజిటల్ తరగతుల నిర్వహణ కోసం అనువైన పాఠశాలల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తరగతుల ఏర్పాటు కోసం సమాచారం ఇవ్వాలని కోరాం. అధికారికంగా ఎలాంటి ఆదేశాలు అందకపోయిన నవంబర్ 14ను టార్గెట్గా పెట్టుకుని ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో ప్రొజెక్టర్ సాయంతో కొన్ని పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. ప్రత్యేకంగా ఇ¯ŒSస్టక్టర్లు అంటూ ఎవరు లేరు. డిజిటల్ బోధనలో ప్రావీణ్యం ఉన్న ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకుంటాం. –యాదయ్య, జిల్లా విద్యాశాఖాధికారి -
అన్ని పాఠశాలల్లో డిజిటల్ తరగతులు
కరప : ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు డీఈఓ ఆర్.నరసింహారావు తెలిపారు. నక్కా సూర్యనారాయణమూర్తి జెడ్పీ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన సందర్శించి డిజిటల్ తరగతిని పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ చత్రాతి రామచంద్రుడు మహాలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సీహెచ్ రామచంద్రరావు సహకారంతో జిల్లాలో 100 డిజిటల్ తరగతులు, ప్రభుత్వ నిధులతో 17 డిజిటల్ తరగతులు ప్రారంభిస్తున్నామన్నారు. జిల్లాలో 660 పాఠశాలలున్నాయని, దశలవారీగా అన్నింటిలో డిజిటల్ తరగతులు ప్రారంభిస్తామన్నారు. ఒక డిజిటల్ తరగతికి రూ.1.50 లక్షలు ఖర్చవుతుందని రెండు కంప్యూటర్లు, ప్రొజెక్టర్, మానిటర్ సమకూరుస్తామన్నారు. దాతలు ముందుకువచ్చి రూ.45 వేలు విరాళంగా ఇస్తే ప్రభుత్వం రూ.1.05 లక్షలు ఇస్తుందన్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు అన్నిసబ్జెక్టులకు 3డీలో విద్యాబోధన జరుగుతుందన్నారు. 10వ తరగతి పరీక్షలకు కార్యాచరణ ఈ ఏడాది కొత్తపద్ధతి (సీసీ మెథడ్)లో 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నందున మంచిఫలితాలు సాధించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్టు డీఈఓ తెలిపారు. పాతపద్ధతిలో ఇచ్చినట్టుగా స్టడీమెటేరియల్ ఇవ్వబోమన్నారు. రామచంద్రపురం డీవై ఈఓ ఆర్ఎస్ గంగాభవానీ, ఎంఈఓ ఎంవీవీ సుబ్బారావు, హెచ్ఎం ప్రసాద్, స్టాప్సెక్రటరీ కె.సాంబశివరావు, పీఎ¯ŒSవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. -
డిజిటల్ తరగతుల ప్రారంభం వాయిదా
అనంతపురం ఎడ్యుకేషన్ : రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో శనివారం అధికారికంగా ప్రారంభం కావాల్సిన డిజిటల్ తరగతులు వాయిదా పడ్డాయి. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు సమాచారం అందింది. ఈ నెల 20న ప్రారంభమవుతాయని ఇక్కడి అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఇప్పటికి 18 పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే వాయిదా పడటంతో అరకొర సదుపాయాలున్న 80 మోడల్ ప్రైమరీ పాఠశాలల్లోనూ వసతులు కల్పించి ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
డిజిటల్ విద్యా విధానానికి నాంది
–జిల్లాలో 90పాఠశాలల్లో త్వరలో ప్రారంభం. –డీ.ఈ.ఓ మధుసూధనరావు. నల్లజర్ల: మారుతున్న విధ్యావిధానానికి అనుగుణంగా ప్రభుత్వం విద్యారంగంలో సాంకేతికతను జోడించి విద్యార్ధులను ఆకట్టుకునే రీతిలో నూతన బోధనా విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి డి.మధుసూధనరావు వెల్లడించారు.శుక్రవారం ఆయన సాక్షితో మాట్లాడారు.జిల్లా వ్యాప్తంగా 90 పాఠశాలల్లో ఈవిధానం అమల్లోకి తీసుకువచ్చామని ఈనెల 15 నుండి ప్రారంభం కావాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్టు ఆయన వివరించారు.ఎంపిక చేసిన పాఠశాలల్లో ఈసిస్టమ్ అమర్చడం జరిగిందన్నారు.నూతన విద్యా విధానంలో 6నుండి 10తరగతుల వరకు అన్ని పాఠ్యాంశాలకు సంబంధించి 500 జీబీ సామర్ధ్యంతో లోడ్ చేసినట్టు చెప్పారు. డిజిటల్ తరగతుల వల్ల విద్యార్ధులకు అవగాహన,ఏకాగ్రత,జ్ణాపక శక్తి పెరుగుతుందన్నారు.జిల్లాలోని మిగిలిన పాఠశాలల్లో ఈవిద్యా విధానం ప్రవేశపెట్టడానికి సన్నాహలు జరుగుతున్నాయన్నారు. –కొత్త విధానానికి ఆహ్వనం. స్మార్ట్ తగరతి గదుల ఏర్పాటు వల్ల కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ నూతన సాంకేతిక పరిజ్ణా అందించి ఆధునిక బోధనా పద్ధతుల్లో విద్యార్ధులకు పాఠాలు బోధించే అవకాశం కల్గుతుంది.డిజిటల్ విధానానికి స్వాగతం పలుకుతున్నాం.ప్రాధమిక స్ధాయి నుంచే ఈవిధానం ప్రవేశపెడితే విద్యా ప్రమాణాలు పెరుగడుతాయి.పోటీ పరీక్షలకు ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు ధీటుగా ఎదుర్కొని విజయాలు సాధిస్తారు. నెక్కలపూడి ప్రతాప్.పాధ్యాయుడు.నల్లజర్ల జడ్పీహైస్కూలు. -
సాంకేతికతపై టీచర్లకు పాఠాలు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులు సాంకేతికతపై పాఠాలు నేర్వనున్నారు. ఈ మేరకు డిజిటల్ క్లాసుల నిర్వహణపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని 6 వేలకుపైగా ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, గురుకుల విద్యాలయాల్లో డిజిటల్ తరగతులు ప్రారంభించాలని భావిస్తోంది. ప్రతి టీచర్కు కనీస సాంకేతిక నైపుణ్యాలు ఉండాలని నిర్దేశించింది. డిజిటల్ తరగతుల నిర్వహణపై జేఎన్టీయూహెచ్ ప్రొఫెసర్ల బృందం నివేదించిన అంశాలపై పాఠశాలల విద్యా శాఖ చర్యలు చేపడుతోంది. . ఈ నెల 14వ తేదీ నుంచి మొదటి దశ డిజిటల్ తరగతులను 1000 పాఠశాలల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సబ్జెక్టులవారీగా డిజిటల్ కంటెంట్ రూపకల్పన విధానం, బోధనాపద్ధతులతోపాటు టీచర్లకు కనీస సాంకేతిక నైపుణ్యాలుంటేనే డిజిటల్ తరగతుల బోధన పక్కాగా నిర్వహించడం సాధ్యం అవుతుందని ప్రొఫెసర్ల బృందం సూచనల చేసింది. ఈ మేరకు తదుపరి కార్యాచరణకు విద్యాశాఖ సిద్ధమైంది. సర్వ శిక్షాఅభియాన్- యూనిసెఫ్ సంయుక్తాధ్వర్యంలో అభివృద్ధి చేసిన డిజిటల్ కంటెంట్ను విద్యాశాఖ జేఎన్టీయూహెచ్లోని వివిధ విభాగాల ప్రొఫెసర్లతో అధ్యయనం చేయించింది. ఆరు నుంచి పదో తరగతి వరకు సబ్జెక్టులవారీగా బోధించేందుకు రూపొందించిన డిజిటల్ కంటెంట్ను ప్రొఫెసర్లు అధ్యయనం చేసి పలు సిఫారసులు చేశారు. విద్యార్థులకు డిజిటల్ తరగతుల బోధన పకట్బందీగా చేపడితే విద్యార్థుల్లో సామర్థ్యాలు మరింతగా పెరుగుతాయని సూచించారు. డిజిటల్ కంటెంట్ను వెబ్సైట్లోనూ అందుబాటులో ఉంచాలని, తద్వారా బోధించే టీచర్లే కాకుండా భవిష్యత్తులో బోధించబోయే టీచర్లు, ఇతర టీచర్లు కూడా వాటిపై అవగాహన పెంచుకునేందుకు వీలు ఏర్పడుతుందని పేర్కొన్నారు. దీంతో డిజిటల్ కంటెంట్ మొత్తాన్ని విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. టీచర్లు డిజిటల్ కంటెంట్ను సిద్ధం చేసేందుకు వీలుగా తరచూ వర్క్షాప్లు నిర్వహించాలని ప్రొఫెసర్ల బృందం సూచించింది. టీచర్లకు ఇచ్చే ల్యాప్టాప్లలో కంటెంట్ను మరింతగా డెవలప్ చేసేందుకు వీలుగా ఉచిత, ఓపెన్ సోర్సు సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసి ఇవ్వాలని సూచించింది. వీటితోపాటు సబ్జెక్టులవారీగా డిజిటల్ కంటెంట్కు సంబంధించిన అన్ని రకాల సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సూచించింది. -
15న డిజిటల్ తరగతుల ప్రారంభం
అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లాలో ఈ నెల 15న కనీసం 20 ప్ర భుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ప్రారంభించాల్సి ఉంటుందని, ఇందుకు సంబంధించి ఏర్పాట్లు సిద్ధం చేసుకోవా లని డీఈఓ అంజయ్య, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ అధికారి దశరథరామయ్య ఎంఈఓలకు సూచించారు. స్థానిక సైన్స్సెంటర్లో గురువారం ఎంఈఓలతో సమావేశం నిర్వహిం చారు. డీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో 15న డిజి టల్ తరగతులను రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి అధికారి కంగా ప్రారంభిస్తారన్నారు. ప్రతి జిల్లాలోనూ కనీసం 20 పాఠశాలల్లో తరగతులను ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. 6–10 తరగతులకు సంబంధించి సమ్మేటివ్–1 పరీక్షలకు సంబంధించి ఈ నెల 14 నుంచి 18 వరకు మండల స్థా యిలో 5 శాతం జవాబుపత్రాలను పునర్మూల్యాంకనం చే యాల్సి ఉంటుందన్నారు. ఎస్ఎస్ఏ పీఓ మాట్లాడుతూ విద్యార్థుల ఆధార్సీడింగ్ వెంటనే పూర్తి చేయాలన్నారు. ఎమ్మార్సీ ఉద్యోగులు క్లెయిమ్లు సకాలంలో పంపితే జీతాలు ఆలస్యం కా కుండా ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకుంటామన్నా రు. ఏడీలు పగడాల లక్ష్మీనారాయణ, చంద్రలీల, సెక్టోరియల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. -
డిజిటల్ వైపు అడుగులు
– ప్రభుత్వ బడుల్లో ఏసీ డిజిటల్ తరగతులు – తిరుపతిలో నాలుగు పాఠశాలల ఎంపిక – శరవేగంగా పనులు తిరుపతి ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలలంటే ప్రతి ఒక్కరికీ లోకువే. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులన్నా వసతులుండవని తల్లిదండ్రుల భావన. అన్నీ ఉచితమైనప్పటికీ కార్పొరేట్ హంగుల మాయలో పడి ఫీజులకు వెనుకాడక తమ పిల్లలను ప్రై వేట్ స్కూల్లో చేర్పించడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి కార్పొరేట్కు దీటుగా డిజిటల్ తరగతులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తిరుపతి నగరంలో 30నగరపాలక ప్రాథమిక పాఠశాలలున్నాయి. వీటిలో సింగాలగుంట, ఎస్టీవీ నగర్, చెన్నారెడ్డికాలనీ, ఉప్పొంగి హరిజనవాడల్లోని నగరపాలక ప్రాథమిక పాఠశాలలను మొదటి విడతలో డిజిటల్ తరగతులకు ఎంపికయ్యాయి. ఒక్కో పాఠశాలలో రూ.45లక్షలతో ఆధునీకరణ పనులు చేపట్టారు. డిజిటల్ తరగతులను సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేపట్టడంతో సింగాలగుంట నగరపాలక ప్రాథమిక పాఠశాలలో శరవేగంగా పనులు చేపట్టారు. పాక నుంచి కార్పొరేట్ స్థాయికి.. 2007కు ముందు సింగాలగుంట నగరపాలక ప్రాథమిక పాఠశాల కేవలం ఏడుగురు విద్యార్థులతో పూరిపాకలో నడిచింది. కొత్తగా భవనం నిర్మించి, అందులోకి పాఠశాలను మార్చారు. అక్కడ పనిచేస్తున్న హెడ్మాస్టర్ దొరస్వామయ్య సొంత నిధులతో పాటు ఇతర ఉపాధ్యాయులు, దాతల సహకారంతో కార్పొరేట్కు తగ్గట్టు తీర్చిదిద్దారు. క్రమక్రమంగా విద్యార్థుల సంఖ్య 7నుంచి 135కి చేరింది. ప్రస్తుతం డిజిటల్ తరగతికి ఎంపికవ్వడంతో ప్రభుత్వమే రూ.45లక్షలతో అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది. ప్రతి తరగతిలో ఆకట్టుకునేలా బొమ్మలు, పాఠ్యాంశాలకు సంబంధించిన బొమ్మలు, ప్రొజెక్టర్, ఏసీని ఏర్పాటు చేస్తోంది. కొత్తగా పై అంతస్థులో అదనపు తరగతి గదుల భవనాన్ని నిర్మిస్తోంది. త్వరలోనే సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. -
జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు
తాడేపల్లిగూడెం రూరల్ : జిల్లాలోని అన్ని జెడ్పీ హైస్కూళ్లలో డిజిటల్ క్లాస్రూమ్లను ఏర్పాటు చేస్తామని జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అన్నారు. కడియద్ద జిల్లా పరిషత్ హైస్కూల్లో గోదావరి విద్యా వికాస్ చైతన్య వేదిక సౌజన్యంతో బయోమెట్రిక్ విధానంలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బాపిరాజు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా జిల్లా పరిషత్ హైస్కూల్స్లో డిజిటల్ విధానంలో విద్యాబోధన చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గోదావరి విద్యావికాస్ చైతన్య వేదిక చేస్తున్న విద్యాసేవలను ఆయన అభినందించారు. జిల్లాలోని 100 పాఠశాలలను దత్తత తీసుకుని ఆయా పాఠశాలలకు మధ్యాహ్న భోజనం, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముందుకు రావడం ప్రశంసనీయమన్నారు. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు (రంగరాజు) మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన చేయనున్నట్టు తెలిపారు. ఏఎంసీ చైర్మన్ పాతూరి రామ్ప్రసాద్ చౌదరి, డీసీసీబీ డైరెక్టర్ దాసరి అప్పన్న, తాడేపల్లిగూడెం, పెంటపాడు ఎంపీపీలు పరిమి రవికుమార్, పెదపోలు వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ పాకనాటి నాగదీప్తి పాల్గొన్నారు. -
అన్ని హైస్కూళ్లలో డిజిటల్ తరగతులు
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హసన్పర్తి పాఠశాలలో ప్రారంభం హసన్పర్తి : రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో సేవ్ చిల్ర్డన్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూంలను మంగళవారం ఆయన ప్రారంభించారు. సంస్థ 20 ప్రొజెక్టర్లను మండలంలోని 20 ప్రాథమిక పాఠశాలలకు బహూకరించింది. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యాజమాన్యాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది నుంచే డిజిటల్ క్లాస్లు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచి స్తోందని చెప్పారు. ఇందుకోసం రూ. 50 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో కూడా దశల వారీగా తరగతులు నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం టీసీఎస్, విప్రో కంపెనీల సహకారం తీసుకుంటామని వివరించారు. ప్రభుత్వ స్కూళ్లను బతికించుకోవాలి పభుత్వ స్కూళ్లను బతికించుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని కడియం శ్రీహరి అన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం చేయడంతో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాల్లోనే నాణ్యమైన విద్య అందిస్తున్నారని తల్లిదండ్రులకు నమ్మకం కలిగించాలని ఆ బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, స్వచ్చంధ సంస్థలపై ఉందన్నారు. పాఠశాలలకు విడుదల చేస్తున్న కాంటీంజెన్సీ నిధులను రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు పెంచినట్లు తెలిపారు. ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గ అభివృద్ధి కింద విడుదలవుతున్న నిధుల్లో నుంచి రూ.కోటి ఇస్తే మరో రూ. 4 కోట్లు కలిపి మొత్తం రూ. 5 కోట్లతో పాఠశాల అభివృద్ది కోసం మంజూరు చేస్తామని చెప్పారు. హసన్పర్తిని ఇతర మండలాలు ఆదర్శంగా తీసుకోనేలా విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని శ్రీహరి సూచించారు. మన బడి–మన బాధ్యత అనే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అరూరి రమేష్ ముందుకు వెళ్తున్నారని, ఆయనకు పూర్తి సహకారం అందిస్తానన్నారు. ‘వర్ధన్నపేట’లో ప్రణాళిక... వర్ధన్నపేట నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో డిజిటల్ క్లాస్లు నిర్వహించడాకి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. విద్యాభివృద్ధిలో నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ప్రధమ స్థానానికి తీసుకెళ్లడానికి శ్రమిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని పాఠశాలల్లో కనీస మౌలిక సౌకర్యాలు కల్పించినట్లయితే మిగతా కావాల్సిన వాటిని సమకూర్చుకుంటామని కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లారు. నగర మేయర్ నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ను డిజిటల్ నగరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. తొలుత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్పొరేటర్ నాగమళ్ల ఝాన్సీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ జి.పద్మ, ఎంపీపీ కె.సుకన్య, జెడ్పీటీసీ సభ్యుడు కొత్తకొండ సుభాష్, కార్పొరేటర్లు సర్వోత్తంరెడ్డి, కల్పన, ఆర్జేడీ బాలయ్య, డీఈఓ రాజీవ్, విద్యాకమిటీల చైర్మన్లు యాదగిరి, కుమార్, మల్లేశం, ఉదయ్కుమార్రెడ్డి, రవీందర్, శివరాం, శ్రీనివాస్రెడ్డి, రాజేశ్వర్రవు పాల్గొన్నారు. -
ఇక ఎన్టీఆర్ వర్సిటీలో డిజిటల్ మూల్యాంకనం
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఇక నుంచి డిజిటల్ మూల్యాంకనం జరగనుంది. తొలివిడత పీజీ మెడికల్ పరీక్ష జవాబు పత్రాల దిద్దివేతలో ఈ పద్ధతి అనుసరించేందుకు వర్సిటీ పాలకమండలి ఆమోదం తెలిపింది. వర్సిటీలో వైస్ చాన్స్లర్ టి.రవిరాజు అధ్యక్షతన సోమవారం పాలకమండలి సమావేశం జరిగింది. వైద్య ప్రమాణాలు మరింత పెంచేందుకు సమావేశంలో నిర్ణయించారు. దీనికోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. బెంగళూరు రాజీవ్గాంధీ హెల్త్ వర్సిటీలో మాదిరి ఎన్టీఆర్ వర్సిటీలోనూ అన్ని కోర్సులకూ డిజిటల్ మూల్యాంకనం అమలు చేసేందుకు కసరత్తు చేయాలని తీర్మానించారు. తొలుత పీజీ మెడికల్ పరీక్షలకు డిజిటల్ మూల్యాంకనం చేయనున్నారు. అలాగే వర్సిటీ ప్రాంగణంలోని సిల్వర్జూబ్లీ బిల్డింగ్పై రూ.1.25 కోట్లతో మరో అంతస్తు నిర్మించాలని పాలకమండలి నిర్ణయించింది. సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఎక్స్ అఫీషియో సభ్యులు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. -
‘డిజిటల్’ చదువులు
► ఉన్నత పాఠశాలల్లో పకడ్బందీగా అమలు చేయాలి ► వీడియో కాన్ఫరెన్స్లో హెచ్ఎంలకు డీఈఓ ఆదేశం తెలంగాణలోనే మొదటిసారిగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ క్లాసుల బోధన సోమవారం జిల్లాలో ప్రారంభమైంది. ప్రైవేట్కు తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలతోపాటు విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు డీఈఓ రమేష్ డిజిటల్ క్లాసుల బోధనకు శ్రీకారం చుట్టారు. - తాండూరు తాండూరు: తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో దృశ్యశ్రవణం ద్వారా పాఠ్యాంశాల (డిజిటల్ క్లాసుల) బోధ న జిల్లాలో సోమవారం మొదలైంది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలతోపాటు విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు జిల్లా విద్యాధికారి రమేష్ డిజిటల్ క్లాసుల బోధనకు శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని ఈనెల 15న ‘సాక్షి’ దినపత్రికలో జిల్లాలో ఇక ‘డిజిట ల్ చదువులు’ శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. రాష్ట్ర మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్ఎంఎస్ఏ) నుంచి ఇందుకోసం సుమారు రూ.50 వేల నిధులను కేటాయించారు. ఇందులో భాగంగా వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హైదరాబాద్ నుంచి తెర, ప్రొజెక్టర్, రెండు స్పీకర్లు తదితర సాంకేతిక పరికరాలను కొనుగోలు చేశారు. కొన్ని ఉన్నత పాఠశాలల్లో సోమవారం లాంఛనంగా డిజిటల్ క్లాసులను ప్రధానోపాధ్యాయులు ప్రారంభించారు. డిజిటల్ క్లాసుల అమలుపై డీఈఓ రమేష్ సోమవారం ప్రధానోపాధ్యాయులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డిజిటల్ క్లాసులను ప్రధానోపాధ్యాయులు పక్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. తాండూరులోని ప్రభుత్వ నంబ ర్-1 పాఠశాలలో డిజిటల్ క్లాసులను ప్రధానోపాధ్యాయుడు ప్రారంభించారు. యాలాల బా లుర ఉన్నత పాఠశాలలో ఎంఈఓ ప్రారంభిం చారు. బషీరాబాద్, యాలాల, తాండూరు, పెద్దేముల్ మండలాల పరిధిలోని దామర్చెడ్, బెన్నూర్, యాలాల (బాలికల), దేవనూర్, రెడ్డిఘనాపూర్, మంతట్టి, బషీరాబాద్ (ఉర్దూమీడియం), నవల్గ, గోటిగ, జీవన్గీ, పెద్దేముల్ పాఠశాలలకు సాంకేతిక పరికరాలు వచ్చాయి. అందరికీ డిజిటల్ విద్య అవసరం: యాంకర్ సుమ శంషాబాద్: నేటి సమాజంలో అందరికీ డిజి టల్ విద్య అవసరమని యాంకర్ సుమ అ న్నారు. శంషాబాద్ పట్టణంలోని జిల్లా పరి షత్ బాలికల ఉన్నత పాఠశాలకు సోమవా రం సొంత ఖర్చులతో డిజిటల్ విద్యకు సం బంధించిన పరికరాలను ఆమె అందజేశారు. గతంలో పాఠశాలలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న యాంకర్ సుమ పాఠశాల అభివృద్ధికి చేయూతనందించేం దుకు సిద్ధమయ్యారు. ఇటీవలే పాఠశాలకు కొంత మొత్తాన్ని ఆర్థిక సాయంగా అందజేసిన సుమ తాజాగా డిజిటల్ పరికరాలను అందజేయడంతో పాఠశాల హెచ్ఎం ఉమామహేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మేలు.. డిజిటల్ క్లాసులతో ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు మేలు జరుగుతుంది. దృశ్యశ్రవణబోధనతో విద్యార్థులకు పాఠ్యాంశాలపై అవగాహన పెరుగుతుంది. త ద్వారా విద్యాప్రమాణాలు మెరుగుపడతాయి. - డి.రమేష్, హెచ్ఎం, రెడ్డి ఘనాపూర్, ఉన్నత పాఠశాల -
డిజిటల్ చదువులు
- ప్రభుత్వ పాఠశాలల్లో దృశ్యశ్రవణంతో విద్యాబోధన - ఈ నెలాఖరునుంచి అమలుకు విద్యాశాఖ నిర్ణయం - ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ పాఠాలు - ఆర్ఎంఎస్ఏ నుంచి రూ.50వేల చొప్పున నిధులు - రాష్ట్రంలో మొదటిసారిగా జిల్లాలో అమలు తాండూరు ఎలక్ట్రాన్లు..ప్రోటాన్లు..న్యూట్రాన్లతో పరమాణువు నిర్మాణం గురించి ఉపాధ్యాయుడు బోధించినా అర్థంకాక పుస్తకాలతో విద్యార్థులు కుస్తీ పట్టే పనిలేదు. గుండె ఎలా పనిచేస్తుంది...దాని నిర్మాణం..రక్తం గుండెకు ఎలా చేరుతుంది...శరీరంలోని మిగతా భాగాలకు ఎలా పంపిస్తుందో బుర్రకు ఎక్కక జుట్టుపీక్కునే పరిస్థితి ఉండదు. పాఠ్యాంశాలను బట్టీ పట్టాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి ఒత్తిళ్ల నుంచి విముక్తి కల్పించి...సులువుగా, ఆసక్తికరమైన బోధనలతో విద్యార్థుల అవగాహన పెంపొందించేందుకు జిల్లా విద్యాశాఖ సన్నాహాలు చేస్తుం ది. దృశ్యశ్రవణం ద్వారా ఉత్సాహవంతమైన వాతావరణంలో విద్యార్థుల నైపుణ్యత పెంచి, ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్టం చేసేందుకు నడుం బిగించింది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి విద్యాప్రమాణాలు, విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు జిల్లా విద్యాశాఖ కొత్తగా ప్రొజెక్టర్లతో ‘డిజిటల్ క్లాస్’ల విధానం అమలుకు సిద్ధమైంది. ]రాష్ట్రంలోనే మొదటిసారిగా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్లకు విద్యాశాఖ అధికారులు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల చివరి నుంచి డిజిటల్ క్లాస్లను జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ హెచ్ఎంలకు ఆదేశాలు ఇచ్చింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 480 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాల్లో డిసెంబర్ చివరికి డిజిటల్ క్లాస్లను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని డీఈఓ రమేష్ ఆదేశాలిచ్చారు. డిజిటల్ క్లాస్ల బోధనకు పాఠశాలల్లో ప్రత్యేకంగా ప్రొజెక్టర్లు, స్క్రీన్లతోపాటు అవసరమైన సాంకేతిక పరికరాల కొనుగోలుకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్(ఆర్ఎంఎస్ఏ) నుంచి రూ.50వేల చొప్పున నిధులను డీఈఓ కేటాయించారు. తెలుగు, గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రం తదితర సబ్జెక్టుల్లోని పాఠ్యాంశాలను విద్యార్థులకు దృశ్యశ్రవణం ద్వారా బోధిం చనున్నారు. ముఖ్యంగా ఆయా సబ్జెకుల్లో కష్టతరమైన పాఠ్యాంశాలను డిజిటల్ క్లాస్లో విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే విధంగా దృశ్యాల రూపంలో చూపిస్తూ, ఇందు కు అవసరమైన వివరాలు ఆడియో(శ్రవణం) ద్వారా తెలియజేస్తారు. దీంతో తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పిన దానికంటే విద్యార్థులకు ఎంత కఠినమైన పాఠ్యాంశమైనా కదిలే దృశ్యాల ద్వారా బాగా అర్థమవుతుందని, అవగాహన, జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. డిజిటల్ క్లాసుల్లో చూసి న, విన్న పాఠ్యాంశాలను విద్యార్థులు ఎంత కాలమైనా వాటిని మరిచిపోయే పరిస్థితి ఉండదని ఉపాధ్యాయులు అంటున్నారు. ఈ విధానం వల్ల ప్రభుత్వ పాఠశాల్లో విద్యాప్రమాణాలు మరింత పెరుగుపడతాయనే అభిప్రాయం ఉపాధ్యాయుల్లో వ్యక్తమవుతోంది. సబ్జెకుల వారీగా నిపుణులైన ఉపాధ్యాయులతో పాఠ్యాంశాలకు సంబంధించిన క్యాసెట్లు, సీడీలను జిల్లా అధికారులు రూపొందిస్తున్నారని చెబుతున్నారు. నెలాఖరునుంచి.. ఉన్నత పాఠశాలల్లో కొత్తగా డిజిటల్ క్లాసులను బోధించాలని డీఈఓ నుంచి ఆదేశాలున్నాయి. ఈ నెల చివరి నాటికి అమలు చేయాలని జిల్లా అధికారులు చెప్పారు. విద్యార్థుల నైపుణ్యత, సామర్థ్యాలు పెంచడమే ఈ విధానం లక్ష ్యం. - వెంకటయ్య,హెచ్ఎం, తాండూరు ప్రాక్టికల్గా చూపిస్తాం గుండె ఎలా పనిచేస్తుందో తరగతిలో చెప్పిన దానికంటే దృశ్యాలతో ప్రాక్టికల్గా విద్యార్థులకు చూపించడం వల్ల అవగాహన స్థాయి పెరుగుతుంది. డిజిటల్ క్లాస్లతో విద్యార్థులు సులువుగా పట్టు సాధించేందకు దోహదపడుతుంది. -వాసుదేవ్, టీచర్,తాండూరు పాఠాలు మరిచిపోం... ఆడియో, వీడియో ద్వారా పాఠాలు సులువుగా అర్థమవుతాయి. ముఖ్యంగా సామాన్య శాస్త్రా నికి సంబంధించిన పాఠ్యాంశాలు మరిచిపోకుండా డిజిటల్ క్లాస్ల బోధన ఉపయోగపడుతుంది. -మణిచందన, 10వ తరగతి, పగిడ్యాల్ బట్టీకి చెక్ దృశ్యశ్రవణం ద్వారా పాఠ్యాంశాల బోధనతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పాఠ్యాంశాలను బట్టీ పట్టాల్సిన అవసరముండదు. డిజిటల్ క్లాసులవల్ల పాఠాలు మదిలో గుర్తుండిపోతాయి. -నర్సింహులు, విద్యార్థి, పగిడ్యాల్ -
తెరపై పాఠం.. ఏకాగ్రతకు నేస్తం
డోకులూరు ఆశ్రమంలో డిజిటల్ క్లాస్ రూమ్ అందుబాటులోకి తెచ్చిన తెలుగు పండిట్ పాడేరు: మారుతున్న విద్యా విధానాలకు అనుగుణంగా ఆధునిక బోధన పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయి. కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో డిజిటల్ క్లాస్రూమ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి దృశ్య శ్రవణ విధానంలో బోధిస్తున్నారు. కార్పొరేట్ విద్యాలయాలకే ఇది పరిమితం. ప్రభుత్వ పాఠశాలలకు ఇంకా అందుబాటులోకి రాలేదు. మండలంలోని డోకులూరు ఆశ్రమ విద్యార్థులకు ఈ విధానంలో బోధించాలని గిరిజన ఉపాధ్యాయుడు సంకల్పించారు. ఈ పాఠశాలలో తెలుగు పండితుడిగా మూడేళ్లుగా పని చేస్తున్న శోభ నారాయణ సుమారు రూ.70 వేలు సొంత ఖర్చుతో ఇందుకు అవసరమైన ప్రొజెక్టర్, ల్యాప్టాప్, సౌండ్సిస్టం, స్క్రీన్ వంటి ఆధునిక పరికరాలతో డిజిటల్ క్లాస్ రూంను ఏర్పాటు చేశారు. 8,9,10 తరగతుల విద్యార్థులకు గురువారం నుంచి ఈ దృశ్య విద్యాబోధన ప్రారంభించారు. తెలుగు, సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల బోధనకు అవసరమైన డిజిటల్ సామగ్రిని సిద్ధం చేశారు. పాఠ్యపుస్తకాలలోని అంశాలను దృశ్య, శ్రవణ పద్ధతిలో రూపొందించిన స్టడీమెటీరియల్ అంతర్జాలం నుంచి సేకరించి బోధిస్తున్నారు. ఇది విద్యార్థుల్లో ఏకాగ్రతను, ఆసక్తిని పెంచేవిధంగా ఉంది. రోజూ బోధనకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేశారు. విద్యుత్ అంతరాయం కూడా లేకుండా ఇన్వెర్టర్ సమకూర్చారు. దిగువస్థాయి తరగతుల పిల్లలకు స్టడీ అవర్స్లో నీతిని బోధించే పంచతంత్ర కథలను దృశ్య, శ్రవణం ద్వారా బోధించేందుకు ఏర్పాట్లు చేశారు. అభినందనీయం, ఆదర్శనీయం... ఆశ్రమ పాఠశాలలో దృశ్య శ్రవణ విద్యాబోధనను అందుబాటులోకి తెచ్చిన తెలుగు పండిట్ శోభ నారాయణ అభినందనీయులని, డిజిటల్ క్లాస్రూం ప్రారంభోత్సవానికి వచ్చిన ఏటీడబ్ల్యూవో శ్రీనివాసరావు, ఎంఈవో బాబూరావు, గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్.సూర్యనారాయణ, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మాణిక్యాలరావు ప్రశంసించారు. మన్యంలోనే ప్రథమంగా ఒక ఆశ్రమ పాఠశాలలో ఈ విద్యాబోధనను ప్రారంభించి నారాయణ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తారన్నారు. పాఠాలు గుర్తుండిపోతాయి.. దృశ్య, శ్రవణ విద్యాబోధన వల్ల విద్యార్థులకు పాఠాలు గుర్తుండిపోతాయి. పిల్లల్లో చదువుపట్ల అవగాహన, ఏకాగ్రతను పెంచుతుంది. ఈ దృశ్య విద్యను తరగతిలో విద్యార్థులను కట్టిపడేస్తుందనడంలో సందేహం లేదు. తెలుగు సబ్జెక్టులో పాఠ్యాంశాలను దృశ్య, శ్రవణ పద్ధతిలో బోధించడమే కాకుండా బోర్డు మీద రాసి చెప్పే వ్యాకరణం, పద్యాలు వంటి వాటిని కూడా విద్యార్థులకు అర్థమయ్యేరీతిలో సులువుగా బోధించడానికి ఎంతో ఆస్కారం ఉంది. అలాగే సైన్స్ పాఠ్యాంశాలను కూడా దృశ్య, శ్రవణ విద్య ద్వారా బోధించడం వల్ల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఏడాది పొడవునా పిల్లలకు ఈ దృశ్య, శ్రవణ విద్యాబోధనకు అవసరమైన ఏర్పాట్లు చేశాం. - శోభ నారాయణ, తెలుగు పండిట్, డోకులూరు. -
‘డిజిటల్’ చదువులు
మోర్తాడ్: మొన్నటి వరకు అ.. అమ్మ, ఆ.. ఆవు, ఇ.. ఇల్లు, ఈ.. ఈగ అంటూ బొమ్మలను చూపిస్తూ చిన్నారులకు ఉపాధ్యాయులు అక్షరాలను నేర్పించేవారు. ప్రస్తుతం విద్యా విధానంలోనూ, పరీక్షల నిర్వహణలోనూ భారీ మార్పులు చోటుచేసుకోవడంతో నల్ల బల్లకు బదులు తెల్లని తెరను వినియోగించాల్సిన అ వసరం ఏర్పడింది. విద్యార్థులకు అన్ని పాఠాలు అలవోకగా నేర్పించడం కోసం డిజిటల్ (దృశ్యం, శ్రవణం) తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తొమ్మిది, పదో తరగతి పరీక్షల్లో బట్టీ విధానానికి స్వస్తి పలకడంతో డిజిటల్ క్లాస్లకు ప్రాధాన్యత పెరిగింది. ప్రైవేటు పాఠశాలల్లోనే డిజిటల్ క్లాస్లను అప్పుడప్పుడు నిర్వహిస్తున్నారు. అయితే కొందరు దాతల సహకారంతో కొన్ని ప్ర భుత్వ పాఠశాలల్లోనూ డిజిటల్ క్లాస్ల నిర్వహణ సాగుతోంది. బట్టీ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయడంతో ఉపాధ్యాయులపైన, విద్యార్థులపైన భారం ఏర్పడింది. భారాన్ని అధిగమించడం కోసం డిజిటల్ క్లాస్ తోడ్పాటును అందిస్తాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అయితే డిజిటల్ క్లాస్ల నిర్వహణ ఏదో ఒక పాఠానికి కాకుండా అన్ని పాఠాలకు వర్తింప జేస్తే, విద్యార్థులకు మేలు కలుగుతుందని ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 461 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 25 వరకు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో తొమ్మిది, పది తరగతులు చదివే విద్యార్థులు దాదాపు 40 వేల మంది ఉంటారు. బట్టీ విధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు పరీక్షల విధానంలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకటి, రెం డు సబ్జెక్టులు అని కాకుండా అన్ని సబ్జెక్టులలోనూ డిజిటల్ విధానంలో తరగతులను నిర్వహించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు పాఠ్యాంశాలపై పూర్తి అవగాహన కలిగితేనే పరీక్షలను రాసి ఉత్తీర్ణులు అవుతారు. పుస్తకంలో పాఠ్యాంశం తరువాత ఉండే ప్రశ్నలకు జవాబులను రాసే విధానం ఇప్పుడు లేదు. పాఠ్యాంశాన్ని విద్యార్థి ఆకళింపు చేసుకుని పరీక్షను రాయాల్సి ఉంటుంది. డిజిటల్ విధానంలో పాఠ్యాంశాన్ని విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోగలరు. ఈ విధానంలో పాఠ్యాంశం కథలాగా విని అర్థం చేసుకునే అవకాశం ఉంది. డిజిటల్ తరగతులకు అవసరమైన సీడీలను టూనీ ఆర్ట్స్, పెబ్బెల్స్ కాంప్రింట్స్ సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. ఆంగ్ల మాధ్యమం విద్యార్థులకు సీడీలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం స్పందించి తెలుగులోనూ సీడీలను తయారు చేయిస్తే విద్యార్థులకు సులభంగా విద్యా బోధన అందించవచ్చని ఉపాధ్యాయులు చెబుతున్నారు. నిధులు మంజూరు చేయాలి దాతల సహకారంతో కొన్ని పాఠశాలల్లోనే డిజిటల్ క్లాస్లు కొనసాగుతున్నాయి. డిజిటల్ సౌకర్యం లేని పాఠశాలల్లో ప్రభుత్వమే నిధులను మంజూరు చేసి ఏర్పాట్లు చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.