dream
-
Year Ender 2024: అత్యంత ప్రజాదరణపొందిన వెడ్డింగ్ డెస్టినేషన్స్
గత కొన్నేళ్లుగా డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ పెరిగింది. సెలబ్రిటీలే కాదు సామాన్యులు కూడా వెడ్డింగ్ డెస్టినేషన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందుకోసం మనదేశంలోని అందమైన ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. 2024లో పలు వెడ్డింగ్ డెస్టినేషన్లు అమితమైన ప్రజాదరణపొందాయి. 2024లో ప్రముఖులతో పాటు జనం మెచ్చిన వెడ్డింగ్ డెస్టినేషన్ల జాబితా ఇదే..1. ఉదయపూర్వెడ్డింగ్ డెస్టినేషన్ల జాబితాలో రాజస్థాన్లోని ఉదయపూర్ అగ్రస్థానంలో ఉంది. రాచరిక వివాహాలకు ప్రసిద్ధి చెందిన ఈ నగరంలోని వాస్తుశిల్పం ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ప్రశాంతమైన సరస్సులు ఉదయపూర్కు ఎంతో అందాన్ని తీసుకువచ్చాయి. ఇక్కడ వివాహం చేసుకున్న జంటలకు జీవితాంతం ఈ మధురానుభూతులు వారిలో నిలిచివుంటాయనడంలో సందేహం లేదు.2. పుష్కర్రాజస్థాన్లోని మరొక అమూల్య రత్నం పుష్కర్. రాయల్ వెడ్డింగ్ దిశగా ఆలోచించేవారికి ఇదొక వరం. పుష్కర్కు ఘటనమైన చరిత్ర ఉంది. అలాగే అద్భుతమైన వారసత్వ భవనాలు ఇక్కడ ఉన్నాయి. ప్రశాంత వాతావరణం కలిగిన ఈ పట్టణం వివాహలకు అనువైనదిగా పలువురు భావిస్తున్నారు. ఇక్కడి రోజ్ గార్డెన్, పుష్కర్ బాగ్ ప్యాలెస్, వెస్టిన్ రిసార్ట్లు వివాహాలను అత్యంత అనువైనవని చెబుతారు.3. జైసల్మేర్అందమైన ఎడారులలో పెళ్లి చేసుకోవాలనుకునేవారిని రాజస్థాన్లోని జైసల్మేర్ ఎంతో అనువైనది. బంగారు వర్ణంలోని ఇసుక దిబ్బలతో కూడిన ఐకానిక్ సూర్యగఢ్ జైసల్మేర్కు ఆణిముత్యంలా నిలిచింది. ఈ ప్రదేశం రాచరిక వాతావరణం కోసం వెతుకుతున్న వారికి తగిన డెస్టినేషన్. బాలీవుడ్ తారలు కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా తమ వివాహాన్ని ఇక్కడే చేసుకున్నారు.4. కేరళచుట్టూ పచ్చదనం, బ్యాక్ వాటర్స్, ప్రశాంతమైన బీచ్లు కలిగిన కేరళ వివాహాలకు అనువైన ఒక అద్భుత ప్రదేశం. ప్రశాంత వాతావరణంలో పెళ్లి చేసుకోవాలనుకునేవారికి సరైన డెస్టినేషన్గా కేరళ నిలుస్తుంది. కేరళలోని కుమరకోమ్ బీచ్, చెరాయ్ బీచ్లు అద్భుతమైన వివాహాలకు గమ్యస్థానాలుగా నిలిచాయి. డెస్టినేషన్ వెడ్డింగ్లకు నిలయంగా కేరళ మారుతోంది.5. గోవాబీచ్ వెడ్డింగ్ కోసం ఎదురు చూస్తున్నవారికి గోవా అత్యంత ఉత్తమమైన ప్రదేశం. అద్భుతమైన సూర్యాస్తమయం, సముద్రపు వ్యూ మధ్య వివాహం చేసుకోవాలనుకునేవారికి గోవా తగిన ప్రాంతం. విలాసవంతమైన రిసార్ట్ల నుండి సాధారణ బీచ్సైడ్ వేడుకల వరకు గోవాలో పలు వేదికలు అందుబాటులో ఉన్నాయి. నటులు రకుల్ప్రీత్- జాకీ భగ్నానీ ఇక్కడే వివాహం చేసుకున్నారు.6. సిమ్లాహనీమూన్కే కాదు పెళ్లికి కూడా సిమ్లా అత్యంత అనువైన ప్రదేశం. సిమ్లాలోని అందమైన కట్టడాలు, వాస్తుశిల్పం, మంచు దుప్పటి పరుచుకున్న పర్వతాలు అడుగడుగునా కనిపిస్తాయి. ఇవి హిల్ స్టేషన్లో వివాహం చేసుకోవాలకునేవారి కలలను నెరవేరుస్తాయి. సిమ్లాలో విలాసవంతమైన రిసార్ట్ల నుండి అన్ని బడ్జెట్లకు సరిపోయేలాంటి వివాహ వేదికలు అందుబాటులో ఉన్నాయి.7. మాండూమధ్యప్రదేశ్లోని మాండూ వివాహాల డెస్టినేషన్గా మారుతోంది. మాండూకు ఘనమైన చరిత్ర ఉంది. అందమైన కట్టడాలు ఇక్కడ అనేకం ఉన్నాయి. పురాతన స్మారక కట్టడాలు, హిల్ స్టేషన్ వైబ్లు కలిగిన ఈ ప్రాంతం ఎప్పుడూ సందడిగా ఉంటుంది. విభిన్నరీతిలో వివాహం చేసుకోవాలనుకునేవారికి మాండూ తగిన ప్రాంతమని చెప్పుకోవచ్చు.8. జైపూర్రాజస్థాన్లోని పింక్ సిటీగా పేరొందిన జైపూర్.. గ్రాండ్ వెడ్డింగ్లకు పర్యాయపదంగా మారింది. ఇక్కడి అద్భుతమైన కోటలు, రాజభవనాలు, విలక్షణ సంస్కృతి సెలబ్రిటీ జంటలను ఇట్టే కట్టిపడేస్తోంది. సామాన్యులు కూడా ఇక్కడ తమ బడ్జెట్కు అనువైనరీతిలో వివాహం చేసుకోవచ్చు. జైపూర్లో వివాహం చేసుకుంటే ఆ మధురానుభూతులు జీవితాంతం మదిలో నిలిచివుంటాయని అంటుంటారు.ఇది కూడా చదవండి: రానున్నది తాతల కాలం.. 2050 నాటికి వృద్ధ జనాభా మూడింతలు -
ఏడు ఖండాలను చుట్టి వచ్చిన వందేళ్ల బామ్మ..!
మన దేశంలో ఉండే పర్యాటక ప్రదేశాలను చుట్టిరావడమే కష్టంగా ఉంటుంది. ఎందుకంటే బడ్జెట్, జర్నీ ప్లాన్ అన్నీ అనుకూలంగా ఉంటేనే సాధ్యం. ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు.. ఏ మూడో.. నాలుగో చుట్టి వచ్చి హమ్మయ్యా అనుకుంటాం. కానీ ఈ బామ్మ మాత్రం ఏకంగా ఏడు ఖండాలను చుట్టి రావాలనుకుంది. అక్కడ విభిన్న సంప్రదాయాలు, ప్రజల జీవనశైలిని గురించి తెలుకోవాలని ఆరాటపడింది ఈ బామ్మ. వృద్ధాప్యం సమీపిస్తున్న వెనక్కి తగ్గలేదు. చివరకు తాను అనుకున్నట్లుగానే ఏడు ఖండాలు చుట్టివచ్చి..అందిరిచే ప్రశంసలందుకుంది. ఆమె ఎవరంటే..102 ఏళ్ల డోరతీ స్మిత్ అత్యంత సాహసోపేతమైన కలను నిజం చేసుకుని.. అద్భతమైన ఘనతను సాధించింది. మొత్తం ఏడు ఖండాలను సందర్శించి శెభాష్ అనిపించుకుంది. చాలాకాలంగా ఈ బామ్మ భూగోళాన్ని చుట్టిరావాలని కలలు కంది. ఆ కలను నిజం చేసుకునేలా..సుమారు ఆరు ఖండాలను సందర్శించింది. అయితే చివరి ఖండం వచ్చేటప్పటికీ వృద్ధరాలైపోవడంతో.. ఎలా? అని కలవరపడింది. అయితే "యస్ థియరీ" అనే యూట్యూబ ఛానెల్ క్రియేటర్స్ అమ్మర్ కందిల్, స్టాపన్ టేలర్ ఈ బామ్మ డ్రీమ్కు సాయం అందించారు. ఈ క్రియేటర్స్ కాలిఫోర్నియాలోని రెడ్వుడ్స్ రిటైర్మెంట్ విలేజ్లో ఒక కథను చిత్రీకరిస్తుండగా .. బామ్మ స్మిత్ని కలిశారు. ఆమె జీవిత అభిరుచుకి ఫిదా అయ్యి..ఆమెకు సాయం చేసేందుకు ముందుక వచ్చారు. ఆమె చూడాల్సిన చివరి ఖండమైన ఆస్ట్రేలియాను తన కూతరు అడ్రియన్తో కలిసి వెళ్లేలా జర్నీ ప్లాన్ చేశారు ఈ క్రియేటర్స్. ఆ బామ్మ జర్నీలో కందిల్, టేలర్ కూడా చేరారు. ఇక 102 ఏళ్ల బామ్మ క్వాంటాస్ విమానంలోని బిజినెస్ క్లాస్లో ప్రయాణించి ఆస్ట్రేలియా చేరుకుంది. అక్కడ చూడవల్సిన స్మిత్ సిడ్నీ హార్బర్ క్రూయిజ్, వైల్డ్ లైఫ్ సిడ్నీ జూ, ఒపేరా హౌస్, బోండి బీచ్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలన్నింటిని సందర్శించింది. తనకు ఈ సిడ్నీ పర్యటన అత్యంత మనోహరంగా ఉందని, అక్కడి ఆహారం, ప్రజల జీవనశైలి అత్యద్భుతంగా ఉన్నాయంటోంది స్మిత్. అంతేగాదు ఆస్ట్రేలియాలో టేకాఫ్కు ముందు పైలట్లు, సిబ్బంది ఆమెను సత్కరించడం విశేషం. అందుకు సంబంధించిన వీడియోని కూడా కందిల్, టేలర్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడంతో నెట్టింట తెగ వైరల్గా మారింది. (చదవండి: ప్రపంచంలోనే చెత్త ఎయిర్లైన్స్.. ఇండిగో స్థానం ఇది!) -
Dream Wedding Destination ఇక్కడ పెళ్లి జరగాలంటే అదృష్టం ఉండాలి!
హరహర మహదేవ శంభో అంటూ చార్ధామ్ యాత్రలో పరవశించిపోతారు భక్తులు. ఈ మార్గంలో చాలా తక్కువ మందికి తెలిసిన మరో విశిష్టమైన ఆలయం కూడా ఉంది. అదే త్రియుగినారాయణ దేవాలయం. ఇది చాలామందికి డ్రీమ్ వెడ్డింగ్ డెస్టినేషన్ కూడా. దీని గురించి విశేషాలు తెలుసుకుందాం రండి.ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది సుందరమైన గ్రామంలో కొలువు తీర ఉన్నది త్రియుగినారాయణ ఆలయం.దీని విష్ణువు అని భావిస్తున్నారు. ఇది ఎత్తు సముద్ర మట్టానికి 1,980 మీటర్లు (6,500 అడుగుల ఎత్తులో ప్రకృతి రమణీయ దృశ్యాలతో చూడముచ్చటగా ఉండే పవిత్ర వైష్ణవ దేవాలయం. చార్ధామ్ ప్రదేశాలలో ఒకటైన బద్రీనాథ్ ఆలయాన్ని పోలి ఉంటుంది ఇది కూడా. ఈ ఆలయంలో స్వామివారి నుండి ఆశీర్వాదం తీసుకోవడంతో పాటు, గర్వాల్ హిమాలయాల ఉత్కంఠ భరితమైన దృశ్యాలను వీక్షించవచ్చు. త్రియుగినారాయణ ఆలయం వెనుకున్న కథ ఏమిటి?మూడు యుగాలుగా లేదా "త్రియుగం"గా ఉన్న వైష్ణవ పుణ్యక్షేత్రం ఇది. పార్వతి దేవి , శివుడు వివాహం చేసుకున్న ప్రదేశంగా ఇది ప్రతీతి. ఇక్కడ విష్ణువు ముందు శివపార్వతుల కళ్యాణం జరిగిందట. అందుకే వారి గౌరవార్థం త్రియుగి నారాయణ్ ఆలయం నిర్మించారని చెబుతారు.శ్రీ మహావిష్ణువు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కూడా ప్రజలు విశ్వసిస్తారు. పార్వతీ దేవికి సోదరుడిగా, తల్లిగా విష్ణుమూర్తి వ్యవహరిస్తే, బ్రహ్మ దేవుడు వివాహంలో పూజారి పాత్రను పోషించాడట. హోమగుండం, బ్రహ్మశిలపార్వతీ పరమేశ్వరుల పెళ్లి సమయంలో వెలిగించిన హోమగుండం మూడు యుగాలుగా నిర్విరామంగా వెలుగుతోంది. ఈ ఆలయం ముందు పవిత్రమైన అగ్ని అనంతంగా వెలుగుతూ ఉంటుంది. అందుకే ఈ ఆలయాన్ని అఖండ ధుని ఆలయం అని కూడా పిలుస్తారు పెళ్లి చేసుకునే జంటలు ఏడడుగులు వేసి (సాత్ ఫేర్)పవిత్ర బంధంతో ఏకమవ్వాలని ఎదురు చూస్తారు. పెళ్లి కావాల్సిన అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్లి కావాలని మొక్కుకుంటారట. ఇక్కడ కలపను నైవేద్యంగా సమర్పించి, విభూతిని ప్రసాదంగా స్వీకరిస్తారు. త్రియుగినారాయణ ఆలయంలో బ్రహ్మ శిల ఒక ప్రత్యేక ఆకర్షణ. ఇదే శివపార్వతుల కళ్యాణానికి వేదిక. దేవాలంయంలోకి అడుగు పెట్టగానే విష్ణువు, లక్ష్మీదేవి, సరస్వతి దేవి వెండి విగ్రహాలను ఇక్కడ చూడవచ్చు.దేవతలు వివాహం చేసుకున్నటువంటి పవిత్రమైన,గౌరవప్రదమైన ప్రదేశంలో వివాహం చేసుకోవాలని ఎవరు కోరుకోరు? దేశ విదేశాలకు చెందిన జంటలు ఇక్కడ ఏడు అడుగులువేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతారు. అలాగే కొత్త జంటలు, వేలాదిమంది భక్తులు, పర్యాటకులు త్రియుగినారాయణ ఆలయాన్ని సందర్శించి విష్ణువు ఆశీర్వాదం పొందుతారు. కేదార్నాథ్కు సుమారు 25 కి.మీ.దూరం. అలాగే రుద్రప్రయాగ నుండి 70 కిలోమీటర్ల దూరం. ఈ ప్రాంతం ట్రెక్కింగ్కు కూడా చాలా ప్రసిద్ధి చెందింది.ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4-8 గంటల వరకు త్రియుగినారాయణ ఆలయాన్ని సందర్శించుకోవచ్చు. -
నిద్రపోనివ్వని కల అంటే ఇదే! శభాష్ మల్లవ్వ!
చిన్నప్పుడు మల్లవ్వ భీమప్పకు చదువు ఒక కల. ఉద్యోగం ఇంకాస్త పెద్ద కల. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆమె కన్న ఆ రెండు కలల్ని నెరవేరనివ్వలేదు. మల్లవ్వ పెరిగి పెద్దదైంది. ఊరికి సర్పంచ్ గా కూడా పనిచేసింది. ఆమె కలలు మాత్రం కలలు గానే ఉండిపోయాయి. వాటిని సాకారం చేసుకోటానికి అక్టోబర్ 13న ఊళ్ళో ఒక లైబ్రరీని ప్రారంభించింది మల్లవ్వ.తను చదువుకోలేకపోవచ్చు. తను ఉద్యోగం చేయలేకపోవచ్చు. చదువుకునే పిల్లల కోసం, ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధమవాలనుకున్న యువతీయువకుల కోసం.. వారికి పనికొచ్చే పుస్తకాలను లైబ్రరీలో అందుబాటులో ఉంచింది. ఇంకా కొన్ని పుస్తకాలను తెప్పిస్తోంది. వాళ్ళలో తనను చూసుకుంటోంది. లైబ్రరీ ఏర్పాటు కోసం మల్లవ్వ ఖర్చు చేసిన 1.50 లక్షల రూపాయల్లో.. గృహలక్ష్మి యోజన కింద ప్రభుత్వం నెలనెలా ఇస్తున్న 2000 రూపాయలను దాచిపెట్టగా జమ అయిన 26 వేల రూపాయలు కూడా ఉన్నాయి. కల అంటే నిద్రలో వచ్చేది కాదు, నిద్ర పోనివ్వకుండా చేసేది అనే మాట మల్లవ్వ విషయంలో నిజమైంది. రుజువైంది. -
కలలో పాములు కనిపిస్తే దేనికి సంకేతం ?
నాకు తరచు కలలో పాములు కనిపిస్తుంటాయి. ఇది దేనికి సంకేతం?కలలో పాములు కనిపిస్తున్నాయని మీరు ఆందోళన పడనక్కరలేదు. ఇది శుభానికే సంకేతం. మీకు త్వరలో ఆకస్మిక ధన ్రపాప్తి కలగబోతోందనడానికి సూచన అది. అంతేకాదు, మీకు సంతానం కలగబోతోందనడానికి కూడా సంకేతం కావచ్చు. సాధారణంగా కలలో పాములు కనిపించడం అనేది తీరని కోరికలకు సంకేతం. ఒకోసారి ఆ కోరికలు కార్యరూపం దాల్చబోతున్నాయనడానికి కూడా సూచికగా తీసుకోవచ్చు.దిష్టి తీయడానికి ఎర్రనీళ్లనే ఎందుకు ఉపయోగిస్తారు?వివాహాది శుభకార్యాలలో, నూతన వధూవరుల గృహప్రవేశ సమయంలోనూ, ఇంటిలో ఎవరైనా జబ్బుపడి లేచి స్వస్థత చేకూరి ఇంటికి వచ్చేటప్పుడూ ఎర్రనీళ్లతో దిష్టితీస్తారు. పసుపు, సున్నం నీళ్లు కలిపితే ఎర్రనీళ్లు తయారవుతాయి. ఈ ఎర్రనీళ్లను పళ్లెంలో పోసి దిష్టి తీస్తారు. ఆ నీళ్లను ఎవరూ తొక్కనిచోట పారబోస్తారు. గృహప్రవేశానికి ముందు తియ్యగుమ్మకు చిన్న రంధ్రం చేసి పారాణి ముద్దను ఉంచుతారు. దాన్ని దిష్టితీసి పగలగొడతారు. కొంతమంది ఎండుమిరపకాయలతో, మరికొందరు నూనెలో తడిపి వెలిగించిన గుడ్డపీలికలతోటీ దిష్టి తీస్తారు. ఘాటైన పదార్థాలు, ఎర్రని వస్తువులు దిష్టిని పోగొట్టడంలో శక్తిమంతంగా పని చేస్తాయని ఇలా చేస్తారు.ఇంటిలోకి దుష్ట శక్తులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?తులసి చెట్టు, నిమ్మ, వేప వంటివి ఇంటిలోకి దుష్టశక్తులను రానివ్వకుండా చేస్తాయని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా దిష్టి తగలకుండా ఉండడం కోసం వాకిలి వద్ద కొంతమంది బూడిద గుమ్మడి కాయలు కట్టుకుంటారు. అదేవిధంగా పటికను ఎర్ర లేదా నల్లటి వస్త్రంలో మూటగట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీస్తారు. ఇష్టదైవానికి సంబంధించిన చిన్న పటాలను గుమ్మానికి తగిలించడం కూడా మంచిదే. -
చీర కాల కోరిక నెరవేరింది ఇలా...
చీరకట్టుకోవాలనేది ఆ బామ్మ కల. బామ్మది ఇండియా అయితే ఆమె కల గురించి ఆశ్చర్యపోవాల్సిందే. ‘అదేం భాగ్యం!’ అనుకోవాల్సిందే. అయితే బామ్మగారిది ఇండియా కాదు ఇటలీ. ఇటాలియన్ డీజె, ఇన్ఫ్లు్లయెన్సర్ వోలీ ఎస్సే బామ్మ ఇరవై సంవత్సరాల క్రితం తన కుటుంబంతో మన దేశానికి వచ్చింది. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు ఆమెకు బాగా నచ్చాయి. ముఖ్యంగా చీర ఆమెకు బాగా నచ్చింది. అప్పటినుంచి చీర ధరించాలనే కోరిక మనసులో ఉండిపోయింది. ‘ఈరోజు నీ కలను నిజం చేస్తాను’ అని బామ్మను చీరతో సర్ప్రైజ్ చేసింది మనవరాలు వోలీ. చీర ధరించి తన చిరకాల కోరిక నెరవేర్చుకున్న బామ్మ కళ్లలోని వెలుగు చీరకు కొత్త అందం తెచ్చింది. -
‘బంగారం’లాంటి కలగన్నాడు.. మృత్యువు ఒడికి చేరాడు!
ప్రతీ మనిషి కల కంటాడు. ఆ కలల్ని నిజం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. అవి నెరవేరితే.. సంతోషం. నెరవేరకపోతే!. అయితే.. ఆ కల ఆధారంగా అత్యాశకి పోతేనే అసలు సమస్య మొదలయ్యేది. ఆ ప్రయత్నంలో.. ప్రాణం కూడా పోవచ్చు. అలాంటిదే ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన. పేరాశకు పోయి ప్రాణం పొగొట్టుకున్నాడు ఇక్కడో పెద్దాయన. ఆయన వయసు ఏడు పదులపైనే. ఓరోజు నిద్రలో తన ఇంటి నేల కింద బంగారం ఉన్నట్లు కలగన్నాడట. అంతే.. అప్పటి నుంచి వంట గదికే పరిమితం అయ్యాడు. ఏడాది కాలం అదే పనిగా ఆ గదిలో తవ్వుకుంటూ పోయాడు. అలా.. 130 అడుగుల లోతుదాకా పోయాడు. ఈ మధ్యలో రాళ్లు అడ్డుపడితే డైనమెట్లను కూడా ఉపయోగించాడట. దీంతో చుట్టుపక్కల వాళ్లకు విషయం తెలిసింది. అది ప్రమాదకరమని హెచ్చరించినా.. అధికారులతో చెప్పించినా ఆ పెద్దాయన వినలేదు. చివరకు.. ఆ భారీ గొయ్యిలోనే అదుపు తప్పి పడిపోయి ప్రాణం విడిచాడు. దాదాపు 12 అంతస్థుల భవనం లోతు ఉన్న గొయ్యలో పడి తల పగిలి.. కాళ్లు చేతులు విరిగి అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అలా.. కలను నిజం చేసుకోవాలని.. అదీ ఈ వయసులో అత్యాశకు పోయి ప్రాణం విడిచిన ఆ పెద్దాయన పేరు జోయో పిమెంటా. ఊరు.. బ్రెజిల్లోని మినాస్ గెరైస్. అందుకే.. పేరాశ ప్రాణాంతకం అని ఈయనలాంటి పెద్దలు ఊరికే అనలేదు. ఇదీ చదవండి: మాల్దీవులు-భారత్ వివాదం.. ఇదే మార్గం! -
25 ఏళ్లు..23 అటెంప్ట్లు..చివరికి సాధించాడు
భోపాల్: అతడొక సెక్యూరిటీ గార్డు.. అతడి నెల సంపాదన రూ.5 వేలు. కానీ అతడిప్పుడు పట్టుదలకు, ధృడ నిశ్చయానికి, చెక్కు చెదరని ఆత్మ విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్గా మారాడు. మధ్యప్రదేశ్ జబల్పూర్లో నివిసించే 56 ఏళ్ల ఆసెక్యూరిటీ గార్డు పేరు రాజ్కరణ్ బారువా. ఇంతకీ అతడి గొప్పేంటంటే ఎమ్మెస్సీ మ్యాథ్స్ పీజీ డిగ్రీలో పాసవ్వాలనే కల కోసం 25 ఏళ్లు వేచి చూశాడు. 25 ఏళ్లలో 23 సార్లు అటెంప్ట్ చేసి ఫెయిలయ్యాడు. 24వసారి విజయం సాధించాడు. మ్యాథ్స్లో పీజీ సాధించి కల నెరవేర్చుకున్నాడు. నిజానికి 1996లోనే అతనికి ఆర్కియాలజీలో మొదటి పీజీ వచ్చింది. అప్పుడే అతడు పోస్ట్ గ్రాడ్యుయేట్. కానీ మ్యాథ్స్లో రెండో పీజీ సాధించడం అతడి కల. కల కోసం పట్టు వదలని విక్రమార్కునిలా కష్టపడి చివరకు అనుకున్నది సాధించాడు. ఈ 25 ఏళ్లలో అతడు రాత్రి సెక్యూరటీగార్డుగా, పగలు ఇళ్లలో పనిమనిషిగా చేస్తూ చదివాడు. ‘నాకు ఇంఘ్లీష్ పెద్దగా రాదు. ఇదే నాకు మ్యాథ్స్ పీజీ పాసవడానికి అడ్డంకిగా మారింది. ప్రతిసారి ఒక్క సబ్జెక్టు తప్ప అన్నింటిలో ఫెయిల్ అయ్యేవాడిని. కానీ చివరికి ఇండియన్ ఆథర్ రాసిన పుస్తకాలు చదవి పాసయ్యాను. నేను పరీక్షలు రాస్తున్నట్టు పనిచేసే చోట ఎవరికీ చెప్పే వాడిని కాదు. ఎవరికి తెలియకుండా రాత్రి వేళల్లో చదువుకునేవాడిని. అప్పుడు కూడా ఎవరైనా పని ఉందని పిలిస్తే వెళ్లి పనిచేసేవాడిని. నేను పెళ్లి చేసుకోలేదు. కానీ నా కలలతోనే నాకు పెళ్లి జరిగింది’అని బారువా చెప్పుకొచ్చాడు. ఇదీచదవండి..ఉత్తరాఖండ్ టన్నెల్: ఉద్వేగ క్షణాలు, పూలదండలు ,గ్రీన్ కారిడార్ -
పాక్లో అది ‘కలల రహదారి’ ఎందుకయ్యింది?
పాకిస్తాన్లో రహదారుల భద్రత, ప్రమాణాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక నియమనిబంధనలను రూపొందింది. వీటిని జనం అనుసరించేలా పర్యవేక్షిస్తుంటుంది. కొన్ని రోడ్లు పర్యాటక రంగాలలో వృద్ధికి అవకాశాలను అందిస్తున్నాయి. అయితే పాకిస్తాన్లో కలల రహదారి అని పిలిచే ఒక రోడ్డు ఉందనే విషయం మీకు తెలుసా? ఎందుకు ఆ రోడ్డును అలా పిలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. పాక్లోని ఉత్తర హిమాలయ ప్రాంతాలను కలిపే కరకోరం హైవేని ‘హైవే ఆఫ్ డ్రీమ్స్’ అని పిలుస్తారు. ఇది 1300 కిలోమీటర్ల పొడవు కలిగివుంది. పాకిస్తాన్ రైల్వే నెట్వర్క్ను ఆనుకొని ఈ మార్గం ఉంటుంది. ఈ రహదారిని బాని ములాకాత్ అనే అంతర్జాతీయ ప్రాజెక్టులో భాగం చేశారు. ఈ మార్గం హిమాలయాలలోని అత్యున్నత పర్వత శ్రేణిని దాటుతుంది. ఈ మార్గంలోని దృశ్యాలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి. ఈ రహదారిలో ప్రయాణించాలని పర్యాటకులు తహతహలాడుతుంటారు. కరకోరం హైవే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారులలో ఒకటిగా పేరొందింది. ఈ రోడ్డు నిటారుగా ఉన్న రాళ్లపై నిర్మితమయ్యింది. ఇవి బలహీనపడుతున్న కారణంగా తరచూ మరమ్మతులు చేయల్సి వస్తుంటుంది. కారకోరం హైవేలో ప్రయాణం ప్రత్యేక అనుభూతులను అందిస్తుందని అంటారు. ఈ సరిహద్దు రహదారిలో మంచు పర్వతాలు, లోయలు, నదులు, అందమైన సరస్సులు కనిపిస్తాయి. ఇది కూడా చదవండి: మెట్రోలో యువతిపై లైంగిక వేధింపులు.. పట్టించుకోని ప్రయాణికులు! -
డబ్బున్న భర్త దొరకాలన్న ఆమె కోరిక ఎలా తీరింది? అందుకోసం ఏం చేసింది?
చాలామంది యువతులు తమ అభిరుచులను నెరవేర్చుకునేందుకు ధనవంతుడైన భర్త రావాలని కోరుకుంటుంటారు. ఇదేవిధంగా అమెరికాలో నివాసం ఉంటున్న ఇజీ అనాయా తన 7 ఏళ్ల వయసులో తను ఎలాగైనా ధనవంతుడి భార్యని కావాలని నిర్ణయించుకుంది. ఇది ఆమె ముందున్న కల. ఆమె పెరిగి పెద్దయ్యాక ఈ కలను నెరవేర్చుకోవడానికి మార్గాలను అన్వేషించి, చివరికి విజయం సాధించింది. నేడు ఆమె ఒక ధనవంతునికి భార్యగా మారి, అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది. ప్రతిరోజూ ఉదయం ఆమె జిమ్కి వెళ్లే ముందు తన తన పిల్లలను అత్యంత ఖరీదైన జీపు రాంగ్లర్ రూబికాన్లో ఎక్కించుకుని, వారిని స్కూల్లో దింపుతుంది. ఆమె ఖరీదైన దుస్తులు కొనుగోలు చేసేందుకు తరచూ షాపింగ్ చేస్తుంటుంది. ప్రతిరోజూ విలాసవంతమైన భోజనాల కోసం ఖరీదైన రెస్టారెంట్లకు వెళ్తుంది. ఆమె తాజాగా తన వ్యక్తిగత జీవితంలోని పలు రహస్యాలను బయటపెట్టింది. బ్రూక్లిన్లో నివాసముంటున్న అనాయాకు ప్రస్తుతం 43 ఏళ్లు. ఆమె కేటర్స్ న్యూస్తో మాట్లాడుతూ ‘నేను నా జీవనశైలి గురించి నా 7 సంవత్సరాల వయస్సులోనే కలలుగన్నాను. నా చిన్నతనంలో ధనవంతులైన ఆడవాళ్లను చూసినప్పుడు ఏదో ఒక రోజు నేను కూడా వాళ్లలా మారాలి అని అనుకునేదాన్ని. ఎలాగైనా అలాంటి విలాసవంతమైన జీవితాన్ని గడపాలని భావించేదానిని. నా 33 ఏళ్ల వయస్సులో ఈ కల నెరవేరింది. నేను అనుకున్నవన్నీ నిజం అయ్యాయి’ అని తెలిపింది. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం అనయ ఒక ధనవంతుడిని తన ‘షుగర్ డాడీ’గా మార్చుకుంది. యూరోపియన్, అమెరికన్ దేశాలలో డేటింగ్లో వచ్చిన కొత్త కాన్సెప్ట్ ఇది. తమ అవసరాలను తీర్చుకునేందుకు కాలేజీకి వెళ్లే యువతులు ధనవంతులతో డేటింగ్ చేస్తారు. ఇందుకు బదులుగా వారు ఆ ధనవంతుల నుంచి డబ్బు, బహుమతులను పొందుతారు. ఈ విధంగా వచ్చిన సొమ్ముతో వారు తమ అభిరుచులను నెరవేర్చుకుంటారు. అయితే అనాయా విషయంలో ఇందుకు భిన్నంగా జరిగింది. దీని గురించి అనాయా మాట్లాడుతూ ‘నేను నా షుగర్ డాడీని 10 సంవత్సరాల క్రితం ఆన్లైన్లో కలిశాను. మేము దాదాపు ఆరు నెలల పాటు డేటింగ్ చేశాం. ఆ తర్వాత వివాహం చేసుకున్నాం. ఈ రోజు నేను అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నాను’ అని చెప్పింది. అదేవిధంగా ఆమె టిక్టాక్లో తన కథను వివరించింది. ‘నేను ఉదయాన్నే నిద్ర లేస్తాను. తరువాత మా పిల్లలను పాఠశాలకు తీసుకువెళతాను. అనంతరం నేను జిమ్కి వెళ్తాను. నాకు నచ్చినది ఏదైనా వెంటనే కొంటాను. ఎంత ఖరీదు అయినా వెనుకాడను. మా దగ్గర డబ్బుకు లోటు లేదు కాబట్టి నాకు ఇష్టమైనవన్నీ కొనుక్కోవచ్చు. మేము ప్రతి వారాంతంలో పారిస్ లాంటి విలాసవంతమైన ప్రదేశాలలో గడుపుతాం. నేను పుట్టుకతో ధనవంతురాలిని కాదు. పేద కుటుంబంలో పుట్టారు. నాకు కార్పొరేట్ ప్రపంచానికి చెందిన కొందరి నుండి సాయం లభించింది. దీంతో నేను అన్ని విషయాల్లోనూ అభివృద్ధి చెందాను. అయితే నేను దీని కోసం నేను నా స్నేహితులకు దూరం కావాల్సి వచ్చింది. నేను మాన్హాటన్కు వెళ్లి, కార్పొరేట్ ప్రపంచంలో పని చేయడం మొదలుపెట్టాను. స్వచ్ఛంద కార్యక్రమాలకు, ఇతర కార్యక్రమాలకు వెళ్లాను. అప్పుడే నేను ఒక వ్యక్తిని కలుసుకున్నాను అతనిని నా ‘షుగర్ డాడీ’గా మార్చుకున్నాను. మనం ఎలా జీవించాలనుకుంటున్నామో, అలా మనల్ని మనమే నిలబెట్టుకోవాలి’ అని తెలిపింది అనాయా. ఇది కూడా చదవండి: గాంధీ హత్య కుట్రను వంటవాడు ఎలా భగ్నం చేశాడు? -
రోజు కూలీ.. విమానం లాంటి ఇంటిని కట్టుకున్నాడు
విమానంలో ప్రయాణించాలనే ముచ్చట చాలామందికే ఉంటుంది. కానీ, అతడికి విమానంలో నివాసం ఉండాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉండేది. ఎగిరే విమానంలో నివాసం ఏర్పరచుకోవడం ఎలాగూ కుదిరే పని కాదు కనుక విమానంలాంటి ఇంటిని నిర్మించుకున్నాడు. తన కలల నివాసాన్ని నిర్మించుకోవడానికి కంబోడియాకు చెందిన ఆండ్ క్రాచ్ పోవ్ దాదాపు ముప్పయ్యేళ్లు కష్టపడ్డాడు. మొత్తానికి ఇన్నాళ్లకు నేలకు ఇరవై అడుగుల ఎత్తున ఎగురుతున్న విమానంలాంటి భవంతిని నిర్మించుకున్నాడు. దీని నిర్మాణం కోసం తన పదమూడో ఏట నుంచి డబ్బు కూడబెట్టడం ప్రారంభించాడు. చిన్నప్పుడు తల్లిదండ్రులు ఖర్చుల కోసం ఇచ్చిన చిల్లర డబ్బు మొదలుకొని పెద్దయ్యాక భవన నిర్మాణాలు సహా రకరకాల పనులు చేసి 7.84 కోట్ల రియెల్స్ (రూ.15.63 లక్షలు) పోగు చేశాడు. ఆ డబ్బుతోనే ఈ ఇంటిని నిర్మించుకుని, తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. భవన నిర్మాణంలో అనుభవం ఉన్న పోవ్ ఈ ఇంటిని నిర్మిస్తున్నప్పుడు చుట్టుపక్కల జనాలు ఇతడిని ఒక పిచ్చోడిలా చూశారు. నిర్మాణం పూర్తవుతున్న దశలో ఈ ఉదంతం పోవ్ నివాసం ఉండే సీమ్ రీప్ ప్రావిన్స్లో సంచలన వార్తగా మారింది. తన ఇంటికి దగ్గర్లోనే ఒక కాఫీ షాపును ఏర్పాటు చేయాలనుకుంటున్నానని, త్వరలోనే అసలు విమానంలో ఎగరాలనే తన కలను కూడా నిజం చేసుకుంటానని పోవ్ మీడియాకు చెబుతున్నాడు. -
నిద్రలో హఠాత్తుగా లేచి తుపాకీతో కాల్చుకున్నాడు.. కారణం తెలిస్తే షాక్..
వాషింగ్టన్: నిద్రలో కలలు రావడం సాహజం. ఒక్కోసారి అవి కలలా కాకుండా నిజ జీవితంలో జరిగినట్లు అనిపిస్తుంటుంది. ఒక పీడ కలల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవి వస్తే చాలు దెబ్బకు భయపడి లేచి చూసేసరికి మంచం మీద నుంచి కిందపడిపోయి ఉంటాం. ఇలాంటి వింత అనుభవాలు ఎప్పుడో ఒకప్పుడు మనకి ఎదురై ఉంటాయి. ఇదే తరహాలోనే ఓ వ్యక్తికి విచిత్రమైన కల కని.. నిజం తుపాకితో తననే కాల్చుకున్నాడు. అమెరికాలోని ఇల్లినాయిస్లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు ఆ కల ఏంటంటే... నిద్ర మత్తులో అలా జరిగిపోయింది అమెరికా ఇల్లినాయిస్లోని లేక్ బారింగ్టన్లో మార్క్ డికారా నివసిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అతను నిద్రపోతుండగా ఓ కల వచ్చింది. ఆ కలలోజ... ఎవరో ఓ వ్యక్తి తలుపులు బద్దలుకొట్టుకుని ఇంట్లోకి చొరబడినట్లు అనిపించింది. దీంతో డికారా భయాందోళనకు గురయ్యాడు. దొంగ నుంచి కాపాడుకోవాడానికి కాల్పులు జరిపేందుకు సిద్ధమయ్యాడు. అయితే నిద్ర మత్తులో ఉన్న డికారా తన దగ్గర ఉన్న 357-క్యాలిబర్ రివాల్వర్తో నిజంగానే కాల్చాడు. అయితే అది నేరుగా అతని కాలిలోకే దూసుకెళ్లింది. దెబ్బకు అతని నిద్రంతా ఎగరిపోయింది. బుల్లెట్ కారణంగా తీవ్ర రక్తస్రావం అయ్యింది. గాయం కారణంగా విలవిల్లాడుతూ.. గట్టి అరవడం మొదలుపెట్టాడు. మరో వైపు రివాల్వర్ పేలిన శబ్దం విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. చివరకు దొంగతనం జరిగినట్లు కల రావడం.. ఆ నిద్ర మబ్బులోనే కాల్పులు జరిపినట్లు నిర్ధారించుకున్నారు. ఆ ప్రాంతంలో తుపాకీ కలిగి ఉండాలంటే ప్రభుత్వం నుంచి ఫైర్ఆర్మ్ ఓనర్స్ ఐడెంటిఫికేషన్ కార్డు తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. కానీ చాలా రోజుల కిందటే అతని ఐడెంటిఫికేషన్ డికార కార్డు రద్దయ్యింది. అయినా అతను రివాల్వర్ను వాడుతుండడంతో అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండటం నేరాల కింద పోలీసులు అతనిపై కేసులు నమోదు చేశారు. చదవండి: ఈ దీవుల్లో హాయిగా ఉండండి.. రూ. 70 లక్షల అందుకోండి! -
ఇప్పటికీ ఆమెనే నా ఫేవరేట్ హీరోయిన్: నాని కామెంట్స్ వైరల్
టాలీవుడ్ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా ఎదిగి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. కెరీర్లో తొలిసారిగా పాన్ ఇండియా చిత్రం దసరాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దివంగత నటి శ్రీదేవిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు నాని. ఆమెకు ఇప్పుటికీ తాను వీరాభిమానిని అని చెప్పుకొచ్చారు. రామ్ గోపాల్ వర్మ మూవీ క్షణ క్షణం (1991)లో ఆమెను చూడటం తనకు ఇప్పటికీ కలగానే అనిపిస్తుందని అన్నారు. ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ..'తన జీవితంపై శ్రీదేవి ప్రభావం ఎక్కువగా పడింది. ఎందుకంటే నా డ్రీమ్ డేట్ కచ్చితంగా శ్రీదేవినే. కానీ దురదృష్టవశాత్తు ఆమె ఈ రోజు మన మధ్య లేరు. నేను ఎదిగే కొద్దీ శ్రీదేవికి వీరాభిమానిగా మారిపోయా. ఇప్పటికీ కూడా ఆమెకు పెద్ద అభిమానిని. క్షణ క్షణం సినిమాలో ఆమెను చూస్తుంటే ఇప్పటికీ నాకు కలగానే అనిపిస్తోంది.' అని అన్నారు. కాగా.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా సినిమాలో నాని ధరణి అనే పాత్రలో కనిపించనున్నారు. ధరణి పాత్ర తన కెరీర్లో మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్గా నిలుస్తుందన్నారు నాని. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో మార్చి 30న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ జంటగా నటిస్తోంది. -
సూపర్ స్టార్తో నిఖత్ జరీన్.. కల నెరవేరిందట!
ముంబై: బాక్సర్ నిఖత్ జరీన్ ఎట్టకేలకు తన కలను నెరవేర్చుకుందట. అదీ ఆటల పరంగా కాదు. ఫ్యాన్మూమెంట్ను తీర్చుకోవడం ద్వారా. తన ఫేవరెట్ స్టార్ హీరోను కలవడమే కాదు.. ఏకంగా ఆయనతో ఓ రీల్ వీడియోను సైతం చేసిందామె. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ను కలిసిన నిఖత్ జరీన్.. ఆయన ఐకానిక్ సాంగ్ ‘సాథియా తూనే క్యా కియా’ను రీక్రియేట్ చేసింది. ఈ మేరకు తన ట్విట్టర్ హ్యాండిల్లో ఆమె వీడియోను పంచుకున్నారు. వీడియోలో సల్మాన్తో పాటు ఆమె కూడా పాటకు పెదాలు కదిలిస్తూ.. మూమెంట్లు ఇచ్చారు. .. ఇంతేజార్ ఖతం హువా అంటూ ట్విటర్లో ఆమె వీడియోను పోస్ట్ చేశారు. సౌత్ డైరెక్టర్ సురేష్ కృష్ణ డైరెక్షన్లో సల్మాన్ ఖాన్, రేవతి జోడిగా రూపొందిన ‘లవ్’(1991) మ్యూజికల్ హిట్గా నిలిచింది. తెలుగులో వెంకటేష్ రేవతిల ‘ప్రేమ’(1989) చిత్రానికి ఇది హిందీ రీమేక్. Finallyyyyy intezar khatam hua❤️@BeingSalmanKhan #fanmoment#dreamcometrue#salmankhan pic.twitter.com/pMTLDqoOno — Nikhat Zareen (@nikhat_zareen) November 8, 2022 Just don’t knock me out 😂😁. Lots of love .. Keep doing what u doing n keep punching like my hero Sylvester Stallone…. https://t.co/u8C74LpgMp — Salman Khan (@BeingSalmanKhan) May 20, 2022 -
డ్రీమ్ఫోక్స్ ఐపీవోకు రిటైలర్ల క్యూ
న్యూఢిల్లీ: విమానాశ్రయ సర్వీసులు పొందేందుకు వీలు కల్పించే అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ డ్రీమ్ఫోక్స్ పబ్లిక్ ఇష్యూకి రిటైలర్ల నుంచి భారీ డిమాండ్ నెలకొంది. ఇష్యూ తొలి రోజు(బుధవారం) రిటైల్ విభాగంలో 5.4 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. షేరుకి రూ. 308–326 ధరలో చేపట్టిన ఇష్యూలో భాగంగా కంపెనీ 94,83,302 షేర్లను విక్రయానికి ఉంచింది. 1.03 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. వెరసి 1.1 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. ఇష్యూ శుక్రవారం(26న) ముగియనుంది. ఐపీవోలో భాగంగా మంగళవారం యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్ల జారీ ద్వారా రూ. 253 కోట్లు సమకూర్చుకుంది. ఆఫర్లో భాగంగా ప్రమోటర్లు మొత్తం 1.72 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచారు. ఐపీవో తదుపరి చెల్లించిన మూలధనంలో ఇది 33 శాతం వాటాకు సమానం! రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 46 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. -
మనోబలం: బామ్మలందరూ కలిసి బాల్యంలోకి వెళ్లొచ్చారు!
‘అదిగదిగో విమానం’ అంటూ ఆకాశాన్ని చూస్తూ పరుగులు తీశారు చిన్నప్పుడు. వృద్ధాప్యంలోకి వచ్చాక పరుగులు తీసే శక్తి లేదు. అయినా ఆ ఉత్సాహం ఎక్కడికీ పోలేదు. ‘ఒక్కసారైనా విమానం ఎక్కలేకపోయామే’ అని నిట్టూర్చేవారు. అయితే అల్లావుద్దీన్ అద్భుత దీపం దొరకకుండానే వారి చిరకాల కల నెరవేరింది... చిన్నప్పుడు ఆకాశంలో వినిపించీ, వినిపించని శబ్దం చేస్తూ కనిపించే చిట్టి విమానాన్ని చూసి మౌనిక ఎంత ముచ్చటపడేదో! పెద్దయ్యాక ఎలాగైనా విమానం ఎక్కాలని చిన్నారి మౌనిక ఎంతో బలంగా అనుకుంది. అయితే వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ ఆమె కోరిక నెరవేరలేదు. ఆరుబయటకు వచ్చినప్పుడు ఆకాశంలో కనిపించే విమానాన్ని చూస్తూ ‘చిన్నప్పుడు ఎన్నో అనుకుంటాం’ అని తనలో తాను నవ్వుకునేది మౌనిక. నిజానికి మౌనికలాంటి ‘విమాన కల’ బామ్మలు ఎందరో ఉన్నారు. కోచి(కేరళ)లోని ‘హెల్ప్ఏజ్ ఇండియా’ అనే స్వచ్ఛందసంస్థ, కోచి మున్సిపల్ కార్పోరేషన్తో కలిసి 27 మంది బామ్మల సుదీర్ఘకాల విమానప్రయాణ కలను నెరవేర్చింది. ఎంతసేపు ప్రయాణించాం, ఎంత దూరం వెళ్లాం అనేది ముఖ్యం కాదు... ఆ అనుభూతి ముఖ్యం! బామ్మలు కోచి నుంచి కన్నూర్కు విమానంలో ప్రయాణించి కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకున్నారు. ‘ఇంకో వారంలో రోజుల్లో విమానం ఎక్కబోతున్నాం’ అనే ఆనందం రోజీమేరీ, మారియాలను ఒక దగ్గర ఉండనివ్వలేదు. ఎందరికో ఎన్నోసార్లు చెప్పుకొని మురిసిపోయారు. ‘విమానం ఎక్కడం కాదు... అసలు నేను విమానాశ్రయం అనేది చూడడం ఇదే మొదటిసారి’ నవ్వుతూ అంటుంది 67 సంవత్సరాల రోజీమేరి. ‘చిన్నప్పటి కోరిక నెరవేరిందనే సంతోషంతో నా మనోబలం రెట్టింపు అయింది’ అంటుంది 61 సంవత్సరాల మారియా. ఇక విమానంలో బామ్మల సందడి చూస్తే... వారు విమానం ఎక్కినట్లుగా లేదు. టైమ్మిషన్లో బాల్యంలోకి వెళ్లినట్లుగా ఉంది. ఏ బామ్మను కదిలించినా.... వారి కళ్లలో... మాటల్లో సంతోషమే సంతోషం! వీరి విషయంలో మాత్రం ‘సంతోషం సగం బలం’ కానే కాదు. సంపూర్ణబలం! కోరిక గట్టిదైతే, ఎప్పుడో ఒకప్పుడు అది తప్పకుండా నెరవేరుతుంది... అనే మాటను విన్నాను. అది నా విషయంలో నిజమైంది. వినేవాళ్లు ఉండాలేగానీ నా విమానప్రయాణం గురించి కొన్ని రోజుల వరకు చెప్పగలను. – మౌనిక (88) -
అదృష్టమంటే అది.. కలలో వచ్చిన నెంబర్తో రెండు కోట్లు గెలుచుకున్నాడు..
ఇష్టమైన కలలు వచ్చినప్పుడు.. అవి నిజమవ్వాలని చాలా మందే కోరుకుంటారు. అవేవీ జరగవు. కానీ యూఎస్లో ఓ వ్యక్తి కల నిజమైంది. రెండు డాలర్లు పెట్టి టికెట్ కొంటే రెండు కోట్ల లాటరీ గెలుచుకున్నాడు. అదెలా ఆశ్చర్యపోతున్నారా? అయితే ఇది చదివేయండి. వర్జీనియాలోని హెన్రికో కౌంటీకి చెందిన అలోంజో కోల్మాన్ రిటైర్డ్ ఉద్యోగి. అతనికి 13–14–15–16–17–18–19నంబర్ల లాటరీ కొంటే, అది గెలిచినట్టు కల వచ్చింది. కలే కదా అని కొట్టి పారేయలేదు. గ్రేటర్ రిచ్మండ్ రీజియన్లోని తన స్వస్థలమైన కార్నర్ మార్ట్ నుంచి కలలో వచ్చిన నంబర్లతోనే ఉన్న లాటరీ టికెట్ 13–14–15–16–17–18ను రెండు డాలర్లు పెట్టి కొన్నాడు. అప్పటినుంచి డ్రా తేదీ జూన్ 11కోసం ఎదురుచూస్తున్నాడు. ఆరోజురానే వచ్చింది. వెళ్లి చూస్తే... స్క్రీన్ మీద అతని లాటరీ నంబర్ 13–14–15–16–17–18, రెండున్నర లక్షల డాలర్లు గెలుపొందినట్టుగా ఉండటంతో అతని ఆనందానికి అవధులు లేవు. రూ.1,97,37,725లు, అంటే దాదాపు రెండు కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. అయితే తన కలలో వచ్చిన నంబర్ సెట్స్నే తాను కొన్నానని, ఆ లాటరీ టికెట్ తగలడం నిజంగా నమ్మలేకున్నానని చెప్పాడు కోల్మాన్. ఇటీవల, ఒక ట్రక్ డ్రైవర్కూడా ఇలాగే 7.9 కోట్ల జాక్పాట్ కొట్టాడు. -
కోట్లు విలువ చేసే కారు కొన్న విశ్వక్ సేన్.. డైరెక్టర్ రియాక్షన్
Hero Vishwak Sen Bought Luxurious Car: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, రుక్సార్ దిల్లాన్ జంటగా కలిసి నటించిన చిత్రం 'అశోకవనంలో అర్జున కల్యాణం'. మే 6న విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఈ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు విశ్వక్ సేన్. తనకిష్టమైన బెంజ్ జీక్లాస్ 2022 మోడల్ కారుని కొని తన కల సాకారం చేసుకున్నాడు విశ్వక్. నా డ్రీమ్ కారుని కొనుకున్నాను. మీరు నాపై చూపిస్తున్న స్థిరమైన ప్రేమాభిమానాల వల్లే ఇది సాధ్యమైంది. నా జీవితంలో జరుగుతున్న ప్రతి విషయానికి ఎంతో ఆనందంగా ఉన్నా. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అని తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు విశ్వక్ సేన్. అయితే ఈ కారు విలువ రూ. 1.5 కోట్లు ఉంటుందని సమాచారం. కారుతో దిగిన విశ్వక్ సేన్ ఫొటోలు చూసి అభిమానులు సంబరపడుతున్నారు. విశ్వక్కు అభినందనలు చెబుతున్నారు. ఇక ఈ పోస్ట్పై డైరెక్టర్ తరుణ్ భాస్కర్ రియాక్ట్ అయ్యారు. 'ఆ కారు నాదే. ఫొటోలు తీసుకుంటా అంటే ఇచ్చా' అని సరదాగా కామెంట్ చేశారు. కాగా కుటుంబా కథా చిత్రమైన అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాకు రవికిరణ్ కోలా దర్శకత్వం వహించగా, జే క్రిష్ సంగీతం అందించారు. చదవండి: ఆ విషయంపై 'సారీ' చెప్పిన విశ్వక్ సేన్ View this post on Instagram A post shared by Vishwak Sen (@vishwaksens) -
అందరి చూపు ‘ఆంధ్రా’వైపే
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, పురాతనమైన ఆంధ్రా మెడికల్ కాలేజీ (ఏఎంసీ)కి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికీ వైద్యవిద్యార్థులు నీట్లో మంచి ర్యాంకు వస్తే ఎక్కడ సీటు తీసుకుంటావని అడిగితే టక్కున విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ అని చెబుతారు. రాష్ట్రంలో మొత్తం 11 ప్రభుత్వ వైద్యకాలేజీలు ఉండగా.. అభ్యర్థులు ఆంధ్రా మెడికల్ కాలేజీలోనే చదవాలని కలలుకంటారు. కొన్నేళ్లుగా ర్యాంకుల పరంగా చూసినా చివరి సీటు పొందిన అభ్యర్థుల కటాఫ్ చూస్తే ఆంధ్రా మెడికల్ కాలేజీలో మంచి ర్యాంకులు వచ్చిన వారు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రా మెడికల్ కాలేజీలో 250 సీట్లున్నాయి. ఏఎంసీలో సీటు రాకపోతే రెండో ఆప్షన్గా గుంటూరు మెడికల్ కాలేజీ వైపు చూస్తున్నారు. గుంటూరు మెడికల్ కాలేజీలో చదివిన వందలాదిమంది విదేశాల్లో మంచి స్థానాల్లో ఉన్నట్టు పలు నివేదికల్లోనూ వెల్లడైంది. మంచి ఫ్యాకల్టీ, మెరుగైన వైద్య వసతులు, ఔట్పేషెంట్లు ఎక్కువమంది రావడం, మౌలిక వసతులతో ఆయా కాలేజీలు వైద్యవిద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. జాతీయ కోటాలో భర్తీచేసే 15 శాతం సీట్లకు సైతం ఏఎంసీ, గుంటూరు వైద్యకళాశాలలకే ఇతర రాష్ట్రాల విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. తరువాత కర్నూలులోని కర్నూలు మెడికల్ కాలేజీ, తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని రంగరాయ ప్రభుత్వ మెడికల్ కాలేజీ సమ ఉజ్జీలుగా పోటీపడుతున్నాయి. మంచి ర్యాంకులు సాధించిన వారు ఏఎంసీ, గుంటూరు కాలేజీల్లో సీటు రాకపోతే కర్నూలు, కాకినాడ ప్రభుత్వ వైద్యకళాశాలల వైపు ఆసక్తి చూపుతున్నారు. పుంజుకున్న రిమ్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి సీఎం డాక్టర్ వైఎస్సార్ 4 రిమ్స్ (రాజీవ్గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఏర్పాటు చేశారు. రాష్ట్రం విడిపోయాక ఒంగోలు, శ్రీకాకుళం, కడప రిమ్స్ ఏపీలో ఉన్నాయి. తాజాగా వైద్యుల భర్తీ, మౌలిక వసతుల కల్పనతో మెరుగు పడ్డాయి. గతంతో పోలిస్తే రిమ్స్ భారీగా పుంజుకున్నాయి. ప్రైవేటులో పేరున్న నారాయణ, ఎన్ఆర్ఐ వంటి కాలేజీల్లో కన్వీనర్ కోటా సీటుకు కాకుండా రిమ్స్కు (ఇప్పుడు జీఎంసీలుగా మారాయి) వస్తున్నారు. నారాయణ కాలేజీలో 55,046 ర్యాంకు చివరి సీటు కాగా, అదే ఒంగోలు రిమ్స్లో 33,332కే ముగిసింది. సాధారణ కాలేజీలైనా ప్రభుత్వ వైద్యకళాశాలలపైనే విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో సీటు రాకపోతేనే ప్రైవేటులో కన్వీనర్ సీటుకు వెళుతున్నారు. -
స్వప్న లోకంలో విహరిస్తున్నా అనుకున్నా: నీరజ్ చోప్రా
సాక్షి, న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పతకాన్ని గెల్చుకుని భారత్ అథ్లెట్స్లో వందేళ్ల కల సాకారం చేయడమే కాదు, అథ్లెటిక్స్లో ఒలింపిక్ స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడిగా నిలిచిన జావెలిన్ త్రో సంచలనం నీరజ్ చోప్రా(23) ఆనందంలో మునిగి తేలుతున్నాడు. బంగారు పతకం సాధించడం ఇంకా కలగానే ఉంది. ఏదో స్పప్నలోకంలో విహరిస్తున్న అనుభవం కలిగిందంటూ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. ఒలింపిక్ క్రీడల్లో అథ్లెటిక్స్లో బంగారు పతకంతో హీరోగా నిలిచిన నీరజ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన మీడియా ఇంటరాక్షన్లో మంగళవారం మాట్లాడాడు. పతకాన్ని సాధించడం ప్రతీ అథ్లెట్ కల..అందులోనూ ఒలింపిక్ స్వర్ణం గెలవడం అంటే మామూలు విషయం కాదని నీరజ్ పేర్కొన్నాడు. అందుకే తాను బంగారు పతకాన్ని సాధించాను అన్న విషయాన్ని నమ్మలేకపోతున్నాను, కలగా ఉంది. దేశం కోసం గొప్ప పని చేశానని ఇండియాలో అడుగుపెట్టినపుడు, ఎయిర్పోర్ట్లో కోలాహలం చూసినపుడు మాత్రమే అర్థమైందన్నారు. భారత అథ్లెట్లలో ఆలోచన ఈసారి చాలా భిన్నంగా ఉందనీ, కేవలం పాల్గొనడంతోనే సరిపెట్టకుండా, అందరూ పతకం కోసం పోటీ పడ్డారని వ్యాఖ్యానించాడు. (Naresh Tumda: రోజుకూలీగా మారిన క్రికెట్ వరల్డ్ కప్ విన్నర్) గత వారం టోక్యోలో 87.58 మీటరలు విసిరి పురుషుల ఫైనల్లో సంచలనాత్మక విజయాన్ని సాధించాడు నీరజ్ చోప్రా. ఒలింపిక్స్లో స్వర్ణం సాధించి భారత గడ్డ మీద అడుగుపెట్టిన నీరజ్ చోప్రాతోపాటు అథ్లెట్లు, ఇతర పతక విజేతలకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పానిపట్ ఖండ్రా గ్రామానికి చెందిన నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో 87.58 మీటర్లు విసిరి తన ఒలింపిక్ రికార్డును బద్దలు కొట్టి భారతదేశానికి అథ్లెటిక్స్లో చారిత్రాత్మక మొదటి ఒలింపిక్ స్వర్ణాన్ని సాధించిన సంగతి తెలిసిందే. చదవండి : షాకింగ్: పార్కింగ్ టిక్కెట్లు విక్రయిస్తున్న యువ బాక్సర్ -
తండ్రి కూరగాయాల వ్యాపారి.. కొడుకు కోరుకున్న కొలువు సాధించాడు
పూణె (ముంబై): కలలు కనండి, వాటిని నిజం చేసుకోండనే మాట వినే ఉంటాం. కాకపోతే కలలను నిజం చేసుకోవాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అలా ఓ వ్యక్తి తన కలల కోసం పట్టువదలకుండా శ్రమించి చివరికి సాధించాడు మహరాష్ట్రలోని ఓ కూరగాయల వ్యాపారి కుమారుడు. వివరాల్లోకి వెళితే.. పూణెలోని కూరగాయల వ్యాపారి కుమారుడు హృషీకేష్ రస్కర్ తన కలలను నిజం చేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఈకామర్స్ దిగ్గజం అమెజాన్లో తాను కోరుకున్న జాబ్ కొట్టేశాడు. కాగా ఈ ఉద్యోగం కోసం ఎంతో కష్టపడ్డ రస్కర్ చివరకు ఎన్నో వ్యయప్రయాసలు దాటుకుని సాధించాడు. అతను.. ఐఐటీ రూర్కీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు. మొదట తాను ఆశించిన ఉద్యోగం లభించకపోవడంతో సాఫ్ట్వేర్ కంపెనీల్లో పలు ఉద్యోగాలను వదిలేశాడు. తన కుటుంబ ఆర్థిక పరిస్ధితి తెలుసుకాబట్టి ఆన్లైన్లో ట్యూషన్లు చెప్పడం ప్రారంభించాడు. అలా వచ్చిన సొమ్ముతో తన ఉన్నత విద్యను అభ్యసించి ఆపై తన కల నెరవేర్చుకున్నాడు. బ్యాకెండ్ ఇంజనీర్లో నైపుణ్యాలు సాధించిన రస్కర్ తాను కలలను నిజం చేసుకోవడానికి రోజుకు 12 నుంచి 14 గంటలు కష్టపడ్డాడు. తన విజయానికి మొదట నుంచి మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు తెలిపారు. తాను అభ్యసించిన ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ను మెరుగ్గా తిరిగి నేర్చుకోవడం కూడా తనకు బాగా ఉపయోగపడిందని చెప్పుకొచ్చాడు. అమెజాన్ లాంటి అంతర్జాతీయ కంపెనీలో రస్కర్ ఉద్యోగం సాధించడంతో తమ కష్టాలు తీరనున్నాయని అతని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
చుట్టూ ఉన్నవాళ్లు ఏం చేస్తారో చూద్దామని ‘చనిపోయింది’!
సాధారణంగా కోరికలనేవి ప్రతి ఒక్కరికీ ఉంటాయి. అందులో కొన్ని వింతవి కూడా ఉంటాయి. ఇలాంటి వింత కోరికే ఓ మహిళకు కలిగింది. మనిషి బతికిఉన్నప్పుడు ఒకలా మరణించన తరువాత మరోలా సన్నిహితులు, ఇతరులు ప్రవర్తిస్తారని అంటారు కదా. అందుకే ఓ మహిళ తాను చనిపోతే ఎవరెవరు వస్తారు, వారు ఏం చేస్తారో చూడాలనుకున్నదంట.. అందుకు తానే మరణించినట్లు అందరినీ నమ్మించడానికి పడరాని పాట్లు పడిందో మహిళ. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఇలాంటి వారు కూడా ఉన్నారంటే నమ్మడం కొంచెం కష్టమైనా నమ్మాలి మరీ. వివరాల్లోకి వెళితే.. చిలీ రాజధాని శాంటియాగోకు చెందిన మైరా అలోంజో అనే మహిళ తాను చనిపోతే తరువాత తన చుట్టు జరిగే పరిణామాలను చూడాలనుకుందంట. అదేంటి చనిపోతే ఎలా చూస్తాం అనే సందేహం వస్తుంది కదా. అదే సందేహం ఆమెకు వచ్చింది. దీంతో ఎలాగైనా తన కోరికను నేరవేర్చుకోవాలనుకుంది. అందుకని ఆమెది డెత్ రిహార్సల్ చేయాలని నిర్ణయానికి వచ్చింది. అదే తడవుగా అద్దెకు లభించే లగ్జరీ శవపేటికను తెప్పించింది. ఫొటోగ్రాఫర్లను కూడా పిలిపించుకుంది. అంతా సిద్ధం చేసుకుని తెల్లటి దుస్తులతో మైరా.. తలపై పువ్వుల కిరీటం, ముక్కులో దూదిని పెట్టుకుని.. సంతాప సభ జరుగుతున్నట్లుగా ఏర్పాట్లు కూడా చేయించింది. అలా ఆమె దాదాపు మూడు గంటలపాటు శవపేటికలో పడుకుని చనిపోయినట్లు నటిస్తూనే ఉందంట. మహాతల్లి ఇదే నటన సనిమాల్లో ఇలా నటిస్తే ఆస్కార్ అయిన దక్కేదేమో అని అంటున్నారు చూసిన వాళ్లంతా. ఇందులో ఇంకో వింత ఏంటంటే.. ఈ డ్రామాలో ఆమె కుటుంబం, స్నేహితులు కూడా పూర్తి మద్దతుగా నిలిచి సహకరించడం. అంత్యక్రియల నాటకం మొదలుకాగానే కుటుంబ సభ్యులు నకిలీ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికంతటికి ఆ మహిళ దాదాపు 710 యూరోలు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఇలా ఉండగా, మైరా తీరును కొందరు ప్రశంసిస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. ఇటీవల ఎక్కడ చూసిన కరోనాతో చనిపోయినవారే ఎక్కువగా ఉన్నారు, ఇలా ప్రవర్తించి వారిని ఎగతాళి చేయడంలా ఉందని అది సరికాదని మైరా స్థానికులు అంటున్నారు. ( చదవండి: మరణం అంచున కన్నీటి వర్షంలో తల్లి.. చిన్నారికి చెప్పేదెలా! ) -
ఆమెను చంపాలనుకోలేదు.. కల కన్నాను
లండన్ : తాగుబోతు ప్రియుడు.. ప్రియురాలిపై హత్యాయత్నానికి ప్రయత్నించిన 2019న నాటి కేసుకు సంబంధించి ఇంగ్లాండ్లోని డెర్బీ క్రౌన్ కోర్టు తాజాగా విచారణ చేపట్టింది. నిందితుడు, బాధితురాలి వాదనలను కోర్టు విన్నది. ప్రియురాలు జాక్సన్పై తాను ఉద్ధేశ్యపూర్వకంగా హత్యా ప్రయత్నం చేయలేదని, కలకంటూ ఆమె గొంతునులిమానని నిందితుడు డెర్బీ నగరానికి చెందిన 31 ఏళ్ల బ్రాడ్లే సౌతో కోర్టుకు విన్నవించాడు. నిందితుడు మాట్లాడుతూ.. ‘‘ నేను అప్పుడు కలకంటున్నాను. ఫైటింగ్ రింగులో ఉండి ఓ వ్యక్తితో తలపడుతున్నాను. ఆ వ్యక్తి గొంతు నులుముతున్నాను. ఆ వెంటనే నేను కలలోంచి బయటపడి జాక్సన్(ప్రియురాలు) శ్వాస తీసుకోవటం కోసం ఇబ్బంది పడటం గుర్తించాను. దేవుడా! ఆమెకు ఏమీ కాకూడదు అనుకున్నా.. ఆ వెంటనే బెడ్ మీదనుంచి పైకి లేచి గదిలోని లైటు వేశాను.( విద్యార్థినులను వేధించిన టీచర్కు 49 ఏళ్ల జైలు) అంతే! నా గుండె ఒక్కసారిగా ఆగినట్లయింది. జాక్సన్ కదలికలేకుండాపడి ఉంది. మా అమ్మకు ఫోన్ చేసి విషయం చెప్పాను. అంబులెన్స్కు ఫోన్ చేయమని ఆమె నాకు చెప్పింది. చేశాను. అంబులెన్స్ వచ్చి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లింది. జాక్సన్ క్షేమంగా బయటపడింది’’ అని తెలిపాడు. దీనిపై బాధితురాలు జాక్సన్ మాట్లాడుతూ.. ‘‘ అతడు నా గొంతు చుట్టూ తన చేతిని బిగించాడు. చాలా బలంగా .. ఊపిరి పీల్చుకోవటనానికి ఇబ్బందిపడ్డాను. చచ్చిపోతానేమోనని భయపడ్డాను. పిల్లల్ని ఒంటరిగా వదిలేసి వెళతానేమోనని బాధేసింది. అతడు నన్ను చంపటానికి ప్రయత్నించటం నమ్మలేకపోయాను’’ అని అంది. కాగా, ఇద్దరి వాదనలను విన్న కోర్టు విచారణను వాయిదా వేసింది. -
కోహ్లి ట్వీట్పై నెట్ఫ్లిక్స్ సంబరం
సిడ్నీ:నచ్చిన వ్యక్తితో ఫోటో దిగితే మనకు కలిగే ఆనందం అంతాఇంతా కాదు. అసలు ఆ రోజ నిద్ర పడితే ఒట్టు..! అలాంటి గొప్ప అనుభూతి నెట్ఫ్లిక్స్కు శనివారం ఎదురైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో క్వారంటైన్లో ఉన్న కెప్టెన్ కోహ్లీ .. ‘ క్వారంటైన్ డైరీస్.. ఇస్త్రీ చేయని టీ షర్ట్, సౌకర్యవంతమైన సోఫా, చూడటానికి మంచి సిరీస్’ అంటూ వెబ్ సిరీస్ చూస్తున్న ఫొటోను ట్విటర్లో షేర్ చేశాడు. దీనిపై స్పందించిన నెట్ఫ్లిక్స్ ఇండియా విరాట్ కోహ్లీతో ఫోటో దిగాలనే కల నిజమైందంటూ ట్విటర్లో పేర్కొంది. ఈ ట్వీట్కు మూడు వేలకు పైగా లైక్లు వచ్చాయి. ఇక నెట్ఫ్లిక్స్లో అదిరిపోయే వెబ్ సీరిస్లు ఉన్నాయంటూ కోహ్లి అభిమానులు చెప్తున్నారు. మీర్జాపూర్ , డార్క్ , వంటి వెబ్ సిరీస్లు చూడాలంటూ కామెంట్లు చేస్తున్నారు. Quarantine diaries. Un-ironed T-shirt, comfortable couch and a good series to watch. 👌 pic.twitter.com/Yr26mHYCOL — Virat Kohli (@imVkohli) November 17, 2020 -
అక్కడే పెళ్లాడతా!
సాధారణంగా అందరికీ కలలు ఉంటాయి. ఆ కలల గురించి ఓ లిస్ట్ రాసి పెట్టుకుంటారు. చిట్టీ మీద కాకపోయినా మనసులో అయినా రాసుకుంటారు. హీరోయిన్ త్రిషకి కూడా పెళ్లి విషయంలో ఓ డ్రీమ్ ఉందట. ఈ మధ్య త్రిష తన అభిమానులతో సోషల్ మీడియాలో సరదాగా కాసేపు చాట్ చేశారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ‘మీ డ్రీమ్ లిస్ట్లో ఉన్న ఓ క్రేజీ డ్రీమ్ ఏంటి?’ అని ఓ అభిమాని అడగ్గా – ‘‘వేగాస్లో వివాహం చేసుకోవాలని అనుకుంటున్నా’’ అని చెప్పారు త్రిష. అయితే ‘వివాహ వ్యవస్థను నమ్ముతారా?’ అంటే ‘‘లేదనుకుంటున్నాను’’ అన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’, చిరంజీవి 152వ చిత్రం, మోహన్లాల్తో ‘రామ్’ సినిమాలు చేస్తున్నారు త్రిష. ‘పొన్నియిన్ సెల్వన్’లో కుందవై మహారాణి పాత్రను చేయనున్నారు. కల్కీ కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సినిమాలో తన పాత్రను పూర్తిగా అవగాహన చేసుకోవడానికి ‘పొన్నియిన్ సెల్వన్’ నవలను త్రిష చదువుతున్నారు. త్వరలో ఆమె పాత్ర చిత్రీకరణ ప్రారంభం కానుంది. -
అలా ‘కల’ రావటం శుభసూచకమే...
డ్యాన్స్ ఒక కళ, కానీ కొంతమందికి డాన్స్ చేయడం అనేది ఒక కల. అయితే ఈ రెండు రకాల వ్యక్తులు నిద్రలో డ్యాన్స్ చేస్తున్నట్టు కల కంటారు. ఇలాంటి కలలు మీకు వచ్చే ఉంటాయి. అయితే నిద్రలో డ్యాన్స్ చేసినట్టు కల రావటం శుభసూచకమే. అది మీ ఆనందాన్ని, స్వేచ్ఛను తెలియజేస్తుంది, మనిషి భావోద్వేగాలను ప్రతిబింబిస్తుంది. మనిషి జీవితం ఎలా కొనసాగుతుందో చెప్తుంది. ఇక నిద్రలో మీరు డ్యాన్స్ చేస్తున్నట్టు కలగంటే మీరు మీ భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరుస్తున్నట్లు భావించాలి. భవిష్యత్తులో మీరు విజయాన్ని అందుకోనున్నారనే దానికి సంకేతం. కానీ కొంతమంది మాత్రం నిజ జీవితంలో డ్యాన్స్ చేయలేక.. కలలో చేస్తున్నారని అర్థం. కలలు- రకాలు: ఒంటరిగా డ్యాన్స్ : జీవితంలో స్పాంటేనియస్గా ముందుకెళుతున్నారు. ఇద్దరూ లేదా ఎక్కువ : మీ చుట్టూ ఎవరైనా ఉండాలని కోరుకుంటున్నారు. తికమక డ్యాన్స్ : జీవితానికి దూరంగా ఉన్నారు లేదా జీవితంలోని దగ్గరి వ్యక్తులతో ఎడబాటుకు సంకేతం. చుట్టూ పొగ, మధ్యలో డాన్స్ : జీవితాన్ని అభద్రతగా భావిస్తున్నారు. పార్ట్నర్తో డ్యాన్స్ : భాగస్వామిపై మీ ప్రేమను వ్యక్తపరుస్తున్నారు లేదా మీ బంధం ఇప్పుడిప్పుడే గూడు కట్టుకుంటోంది. బ్యాలెట్ డ్యాన్సర్లతో కలిసి డ్యాన్స్ : సమాజంలో మీ ఎదుగుదలకు సంకేతం. పిల్లలతో కలిసి డ్యాన్స్ : వైవాహిక జీవితం సంతోషంగా సాగుతోంది. ఒంటరిగా ఆనందంగా డ్యాన్స్ : ఊహించని విజయం అందనుంది. అమ్మాయితో డ్యాన్స్ : త్వరలో పెళ్లి లేదా ఒక అమ్మాయితో సాన్నిహిత్యం ఏర్పడనుంది. సాధారణంగా ఏదైనా సాధించినప్పుడు, సంతోషంగా అనిపించినప్పుడు చాలామందికి మొదటగా డ్యాన్స్ చేయాలని అనిపిస్తుంది. డ్యాన్స్.. మీ భావాలను ప్రదర్శించే వేదిక.. సంతోషానికి సూచిక. కాబట్టి డ్యాన్స్ చేయాలనిపిస్తే.. వెంటనే ఎగిరి గంతేయండి, నచ్చినట్టు చిందేయండి. పక్కవాళ్లేమనుకుంటారోనన్న సంకోచాన్ని వీడండి. -
పాత్ర కోసం మార్పు
ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో ‘డ్రీమ్’ ఫేమ్, ప్రవాసాంధ్రుడు భవానీశంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘క్లైమ్యాక్స్’. నాషా సింగ్, రమేష్, చందు కీలక పాత్రధారులు. పి. రాజేశ్వర్ రెడ్డి, కె.కరుణాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సందర్భంగా భవానీ శంకర్ మాట్లాడుతూ– ‘‘ఇందులో రాజేంద్రప్రసాద్గారి పాత్ర పేరు మోడీ. ఆయన పాత్రకు మోడీ అనే పేరు ఎందుకు పెట్టాం అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ పాత్ర కోసం రాజేంద్రప్రసాద్ కొత్తగా మారారు’’ అన్నారు. ‘పొలిటిక్ సెటైర్ నేపథ్యంలో నడిచే మర్డర్ మిస్టరీ ఇది. మా సంస్థకు గొప్ప పేరు తెచ్చిపెట్టే సినిమా అవుతుంది’’ అన్నారు పి. రాజేశ్వర్రెడ్డి. ఈ సినిమాకు రాజేష్ సంగీతం అందిస్తున్నారు. -
బంగారు కల
మగధపుర రాజ్యంలో ధర్మపురం ఒక చిన్న పల్లెటూరు. అక్కడ రాజమ్మ, రంగయ్య అనే దంపతులున్నారు. వారు చాలా పేదవారు. రెక్కాడితేకాని డొక్కాడని జీవితం. వారికి ఒక కూతురు ఉంది. ముద్దులు మూటగట్టినట్లు ఉన్న ఆ అమ్మాయికి బంగారు అని పేరు పెట్టారు. ఆ పల్లెలో కనకయ్య అనే పెద్దాయన ఉన్నాడు. ఆయన కొడుకులకు పొలం పనులను అప్పజెప్పి, విద్యాదానాన్ని మించిన దానం లేదని తన వద్దకు పచ్చే వారికి ఉచితంగా చదువుచెప్పేవాడు. ఆడపిల్లల చదువు గురించి ఎవ్వరూ పట్టించుకోని ఆ పల్లెలో ఆడపిల్లలందరూ పనులకు పోతూంటే బంగారు మాత్రం పట్టుబట్టి యుక్తవయస్సు వచ్చేవరకు ఆయన వద్ద చదువుకుంది. ఆడపిల్ల చదువుకొని ఏం ఉద్ధరించాలని అందరూ అన్నా కూడా ఆమె వెనుకడుగు వేయలేదు. ఆయన చదువుతో పాటు అనేక మంచిమంచి విషయాలు, కథలు చెప్పేవాడు. బంగారుకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఒకరోజు బంగారుకు బంగారంలాంటి కల వచ్చింది. ఆమె పట్టువస్త్రాలు ధరించి, ఒంటినిండా వజ్ర వైఢూర్యాలున్న బంగారు నగలు ధరించి ఉంది. ఒక అందమైన రాజకుమారుడు రెక్కలగుర్రంపై వచ్చాడు. ఆమె దగ్గరగా గాలిలో గుర్రాన్ని నిలిపి, పరిచయం చేసుకుని వివాహమాడుతానన్నాడు. ఠక్కున కళ్లు తెరిచి చూసింది. ఎవ్వరూలేరు. ఆ కల అలా వరుసగా నాలుగు రోజులు రావటంతో ఆశ్చర్యంతో అమ్మ, నాన్నలకు చెప్పింది. ‘‘కలలు నిజమవుతాయా? పూరిగుడిసెలో ఉండే నిన్ను రాకుమారుడు పెళ్ళి చేసుకోవటమేంటి? పిచ్చిపిచ్చి ఆలోచనలేంటి?’’ అని మందలించారు. బంగారును ఆ కల వెంటాడుతూనే ఉంది. బంగారు అమ్మమ్మ గౌరమ్మ, రాజధానిలో ఉంటోంది. పూలతో రకరకాల అలంకరణలు చేయడంలో ఆమెది అందెవేసిన చెయ్యి. తోటలో పూలతో రాజభవనాన్ని, రాజ దర్భార్ను అలంకరించటం, రాణికి పూలజడలు తయారు చేయటం చేసేది. అందుకు కూలి అందేది. వయస్సు పైబడటంతో ఆమెకు రోజురోజుకూ ఓపిక తగ్గిపోతోంది. తోడుగా వుంటుందని మనవరాలిని రమ్మని కబురంపింది. బంగారం అమ్మమ్మ దగ్గరకు వచ్చింది. ప్రతిరోజూ అమ్మమ్మతో కలిసి రాజభవనానికి వెళ్లేంది. పనిలో ఆమెకు బాగా సహాయపడేది. మగధపురాన్ని పరిపాలించే జయవర్ధనుడు అనారోగ్యంతో మరణించటంతో, ఆయన కుమారుడు చక్రధరుడు రాజయ్యాడు. ఆయన సభ కవి పండితులతో కళకళలాడుతుండేది. ఒకరోజు ప్రభాకరుడనే పండితుడు రాజసభకు వచ్చాడు. తాను మూడు ప్రశ్నలడుగుతానని, మూడు ప్రశ్నలకూ ఒకే సమాధానం చెప్పాలని, సరైన సమాధానం చెప్పగల మేధావి ఈ రాజ్యంలో ఉన్నాడా? అంటూ సవాలు విసిరాడు. అడగమన్నాడురాజు. ప్రభాకరుడు చిరునవ్వుతో సభ అంతటా కలియచూసి ... ‘‘ఈ భూమిమీద నిర్లక్ష్యానికి గురవుతున్న మహావృక్షం ఏది? కోరని కోర్కెలు కూడా తీర్చే కల్పవృక్షం ఏది? గరళాన్ని మింగి అమృతాన్ని పంచే విశిష్టమైన ప్రాణి ఏది?’’అని ప్రశ్నించాడు. ప్రభాకరుడి ప్రశ్నలు ఎంత ఆలోచించినా ఎవ్వరికీ అర్థంకాలేదు. పండితులందరూ తలలు పట్టుకుని కూర్చున్నారు. చాలాసేపటి తర్వాత ప్రభాకరుడు ‘‘మీకు సమాధానం తోచటానికి కొన్ని సూచనలిస్తాను. నేను ఈ ప్రశ్నలడగటానికి ముందుగా మీరాజ్యంలో తిరిగాను. పాఠశాలల్లో గోరువంకలున్నాయి. చిలుకలులేవు. పూజించవలసిన పూలు నేలపై పడున్నాయి. తుమ్మెదలేమో పైపైన ఎగురుతున్నాయి.ఎక్కడ చూసినా పుష్పకవిమానాలు నేలపైకూలిపోయి ఉన్నాయి. వెలుగును పంచే జ్యోతులకు నూనె కరువైంది’’ అన్నాడు. ‘‘ఇవేమి సూచనలండీ... ప్రశ్నలకంటే కఠినంగా ఉన్నాయి’’ అనుకుంటూ దిక్కు తోచక మౌనంగా ఉండిపోయారు. ఎవ్వరూ సమాధానం చెప్పకుంటే రాజ్యం పరువు మంటగలిసిపోతుందని అందరూ బాధపడసాగారు. ఆ సమయంలో అమ్మమ్మతో బంగారు అక్కడే ఉంది. అప్పుడు బంగారు రెండుక్షణాలు ఆలోచించి, ముందుకువచ్చి ‘మీ ప్రశ్నలకు సమాధానం ‘స్త్రీ’అంది. ప్రభాకరుడు ఆ సమాధానం సరియైనదని చెప్పి నమస్కరించాడు. అక్కడ ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదు. వివరించమన్నాడు రాజు. బంగారు చిరునవ్వుతో ‘‘మహారాజా!పాఠశాలల్లో గోరింకలున్నాయి, చిలుకల్లేవంటే అబ్బాయిలున్నారు, అమ్మాయిల్లేరని అర్థం. పూజించవలసిన పూలు నేలపై పడున్నాయి. తుమ్మెదలు పైపైన ఎగురుతున్నాయంటే గౌరవించవలసిన పూలవంటి స్త్రీలుఅణచివేతకు గురవుతున్నారు. తుమ్మెదల్లా పితృస్వామ్య వ్యవస్థలో పురుషులు అధికారం చలాయిస్తున్నారని అర్థం. ఎంతమంది సంతానమున్నా పుష్పక విమానంలా మోయగలదు స్త్రీ. ఆమె గౌరవించబడటం లేదని అర్థం. వెలుగును పంచే జ్యోతులకు నూనె కరువైందంటే స్త్రీలకు ఆదరణ కరువైందని భావం. ఈనూచనల ప్రకారం మూడుప్రశ్నలకూ సమాధానం స్త్రీ అని గుర్తించాను. వృక్షం నీడ, ఆహారం, గాలినిచ్చి తన సర్వస్వం ఇతరులకోసం ఎలా అర్పిస్తుందో అలా కుటుంబం కోసం తన జీవితాన్ని అర్పించే స్త్రీ అనే మహావృక్షం నిరాదరణకు గురవుతోంది. అమ్మగా, అక్కగా, భార్యగా, కూతురిగా కోరని కోర్కెలు కూడా గుర్తించి తీర్చే కుటుంబ కల్పవృక్షం స్త్రీ.గరళంలాంటి కష్టాలను దిగమింగి కుటుంబం కోసం అమృతంలాంటి సుఖాలను పంచే ప్రాణి స్త్రీ . అలాంటి స్త్రీ మనరాజ్యంలో నిరాదరణకు, అసమానతకు గురవుతోందని చెప్పటం కోసం ఆయన ఈ ప్రశ్నలడిగారు’’ అని వివరించింది. రాజు బంగారు నేర్పుకు, తెలివితేటలకు, అందానికి ఆకర్షితుడయ్యాడు. ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఆమెను వివాహం చేసుకుంటానని సభలో ప్రకటించాడు. రాజు ప్రభాకరుడి ప్రతిభను ప్రశంసించి సత్కరించబోయాడు. ప్రభాకరుడు రాజసన్మానాన్ని తిరస్కరిస్తూ ‘‘మహారాజా! ఈ సృష్టికి మూలం’ స్త్రీ’! స్త్రీ విద్యను ప్రోత్సహించండి. స్త్రీల కష్టాలను తొలగించే పథకాలను, వారిని ఆదరించి, గౌరవించే శాసనాలను ప్రవేశపెట్టండి. అదే నాకు సత్కారం’’ అనిచెప్పి, మరో రాజ్యంవైపు బయలుదేరాడు ప్రభాకరుడు. వజ్రవైఢూర్యాలు పొదిగిన నగలతో బంగారు పెళ్లికూతురైంది. చక్రధరుడితో బంగారు వివాహం వైభవంగా జరిగింది. అందరి కలలూ నిజంకావుగాని, బంగారు కల నిజమైంది. కనకయ్య గురువు తనకు చెప్పిన చదువు, కథలు తన ఆలోచనా పరిధిని పెంచి, జ్ఞానాన్ని ఇవ్వటంవల్లే తాను సమాధానం చెప్పగలిగానని కుటుంబ సభ్యులతో చెప్పింది బంగారం. చదువు చాలా విలువైనదని ఆమె తల్లితండ్రులు, అమ్మమ్మ గ్రహించారు. బంగారం అదృష్టానికి సంతోషించారు. - డి.కె.చదువులబాబు -
దశాబ్దాల కల నెరవేరింది!
సాక్షి,ఖిల్లాఘనపురం: పల్లెటూర్లు, గిరిజన తండాలు ఎక్కువగా ఉన్న ఖిల్లాఘనపురం మండలంలో పలు గ్రామాలకు, గిరిజన తండాలకు నేటికీ బీటీ రోడ్డు సౌకర్యం లేదు. బీటీ రోడ్లు వేయించాలని గ్రామాలకు, గిరిజన తండాలకు వచ్చే ప్రజా ప్రతినిధులు, అధికారులకు ప్రజలు పలుసార్లు మొరపెట్టుకున్నప్పటికి ఫలితం లేకపోయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత దశాబ్ధాలుగా బీటీ రోడ్ల కోసం ఎదురు చూస్తున్న పల్లెప్రజలు, గిరిజనుల కల నెరవేరింది. రూ.3.35 కోట్లతో బీటీ రోడ్లు మండలంలోని పలు గ్రామాలు, గిరిజన తండాలకు బీటీ రోడ్ల కోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో పలు గ్రామాలు, గిరిజన తండాలకు బీటీ రోడ్లు మంజూరయ్యాయి. ఇటీవల పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ వేగంగా పనులు చేపట్టి పూర్తి చేశారు.ఇందులో రూ.0.85 కోట్లతో అంతాయపల్లి నుంచి కొత్తపల్లి వరకు కిలోమీటర్, కోటి రూపాయలతో కమాలోద్ధీన్పూర్ అడ్డరోడ్డు నుంచి భూత్పూర్ మండలం పోల్కంపల్లి వరకు 2 కిలోమీటర్లు, రూ. 1.5 కోట్లతో సోళీపురం నుంచి కోతులకుంట తండా వరకు 1.5 కిలో మీటర్ బీటీ రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. ఇలా మండలంలోని మూడు రోడ్లకు బీటీ వేసేందుకు ప్రభుత్వం రూ.3.35 కోట్ల నిధులు మంజూరు చేసిందని అధికారులు తెలిపారు. తగ్గిన దూరభారం మండలంలోని కమీలోద్దీన్పూర్ అడ్డరోడ్డు నుంచి భూత్పూర్ మండలం పోల్కంపల్లి వరకు బీటీ రో డ్డు వేయడం వలన మండల ప్రజలకు జాతీయ రహదారి దగ్గర కావడంతో పాటు మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు దూరభారం తగ్గింది. గాజులపేట, తాటికొండ తదితర గ్రామాలకు వెళ్లేందుకు అనువుగా ఉంటుంది. అంతాయపల్లి నుంచి కొత్తపల్లి గ్రామానికి రోడ్డు సౌకర్యమే లేదు. పొలాలగుండా, పొలం గట్ల వెంట ప్రజలు కాలినడకన వెళ్లేవారు. 5ఏళ్ల కిత్రం ఫార్మేషన్ రోడ్డు వేశారు. నేడు బీటీ రోడ్డుగా మార్చారు. సోళీపురం నుంచి కోతులకుంట తండాకు వరకు మట్టిరోడ్డు మాత్రమే ఉండేది. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తరువాత గిరిజనుల కోరిక మేరకు మంత్రి నిరంజన్రెడ్డి బీటీ రోడ్డు మంజూరు చేయించడంతో కాంట్రాకర్టర్ ఇటీవలే పనులు పూర్తి చేశారు. -
కలను ఇలా నిజం చేసుకున్నాడు!
బీజింగ్: ప్రతి మనిషికీ ఒక కల ఉంటుంది. దాన్ని నిజం చేసుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో దారి వెతుక్కుంటారు. అయితే మన స్తోమతకు మించిన కలలు కంటే మాత్రం అవి ఎప్పటికీ అలాగే మిగిలిపోతాయి. కానీ చైనాకు చెందిన ఓ రైతు మాత్రం తన తాహతుకు మించిన కలను సైతం నిజం చేసుకున్నాడు. ఇంతకీ విషయమేంటంటే... చైనాకు చెందిన జుయీ అనే రైతుకు జీవితంలో ఎలాగైనా ఓ విమానం కొనుక్కోవాలనే ఆశ ఉండేది. అయితే, ఏ దేశంలో అయినా రైతుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కదా. మహా అయితే కొంచెం ఖరీదైన కార్లు మాత్రమే కొనగలరు. ఇక విమానమంటే అసాధ్యమే. దీనికి జుయీ సైతం అతీతుడు కాదు. అందుకే ఎలాగైనా తన కలను నిజం చేసుకోవాలనుకున్న జుయీ ఏకంగా విమాన ఆకారంలో ఓ నిర్మాణం చేపట్టాడు. ఎయిర్బస్ ఏ320 విమానాన్ని పోలి ఉండే నమూనా తయారు చేయించుకుంటున్నాడు. రెండేళ్ల నుంచి సాగుతున్న ఈ నిర్మాణం దాదాపు తుదిదశకు చేరింది. దీనికోసం జుయీ ఇప్పటి వరకూ 2.6 మిలియన్ యువాన్లు (సుమారు రూ.2 కోట్లు) వెచ్చించాడు. 124 అడుగుల పొడవు, 118 అడుగుల వెడల్పుతో 40 అడుగుల ఎత్తుతో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ విమానం గాలిలోకి ఎగరలేకపోయినా.. తన కల నెరవేరుతున్నందుకు తృప్తిగా ఉందని జుయీ చెబుతున్నాడు. నిర్మాణం పూర్తయ్యాక దీనిలో ఓ రెస్టారెంటును పెడతానని అంటున్నాడు. -
విమానం ఎక్కాలన్న ముచ్చట తీరింది..
గన్నవరం: బోన్ కేన్సర్తో బాధపడుతున్న ఓ బాలుడు విమానం ఎక్కాలన్న కోరికను విజయవాడకు చెందిన ‘యువర్ విష్ అవర్ డ్రీమ్’ అనే స్వచ్ఛంద సంస్థ నెరవేర్చింది. కృష్ణా జిల్లా కంకి పాడుకు చెందిన సంతోష్(8) కేన్సర్తో బాధపడుతూ విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విమానం ఎక్కాలనే ఆ బాలుడి కోరికను వైద్యులు ద్వారా తెలుసుకున్న యువర్ విష్ అవర్ డ్రీమ్ సంస్థ ప్రతినిధులు గన్నవరం ఎయిర్పోర్టు అధికారులను సంప్రదించారు. ఎయిర్పోర్టు డైరెక్టర్ మధుసూదనరావు, ఏసీపీ రాజీవ్కుమార్లు బాలుడిని విమానం ఎక్కించేందుకు అంగీకరించారు. దీంతో సంస్థ అధ్యక్షురాలు కె.ఉమామహేశ్వరి, ఉపాధ్యక్షులు శనివారం బాలుడిని కొద్దిసేపు విమానం ఎక్కించారు. -
8 ఏళ్లనాటి కల.. 88 ఏళ్ల వయసులో సాకారం.!
-
8 ఏళ్లనాటి కల.. 88 ఏళ్ల వయసులో సాకారం.!
సాక్షి, చెన్నై: కలలు కనండీ.. వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడండీ అని మాజీ రాష్ట్రపతి, స్వర్గీయ అబ్దుల్ కలాం చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఓ వ్యవసాయదారుడు రూపాయి రూపాయి కూడబెట్టి తన ఎనిమిదేళ్లనాటి కళను 88 ఏళ్ల వయసులో సాకారం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు కాంచీపురానికి చెందిన రైతు పేరు దేవరాజన్. ప్రస్తుతం ఆయన వయసు 88 సంవత్సరాలు. అయితే ఆయన 8 ఏళ్ల వయసులో ఉండగా తొలిసారి ఓ బెంజ్ కారుని చూసి, ఎలాగైనా దానిని కొనాలనుకున్నారు. అప్పుడు అతనికి కనీసం ఆ కారు పేరు కూడా తెలియకపోవడంతో లోగోను మనసులో పదిలపరుచుకున్నారు. ఇటీవల దేవరాజన్ చెన్నైలోని బెంజ్ కారు డీలర్ అయిన ట్రాన్స్ కార్ ఇండియాలో ఈ మధ్యే రూ.33 లక్షలు పెట్టి మెర్సిడీజ్ బెంజ్ బీ క్లాస్ కారును కొన్నారు. దేవరాజన్ కథ తెలిసిన ట్రాన్స్ కార్ ఇండియా దీనిని ఓ వీడియో తీసి యూట్యూబ్లో షేర్ చేసింది. ఆయనతో ఓ కేక్ కూడా కట్ చేయించారు. ‘దేవరాజన్ లైఫ్టైమ్ అచీవ్మెంట్’ అంటూ ఈ స్ఫూర్తిదాయకమైన స్టోరీని రూపొందించింది. ఆశయం గొప్పదైతే ఎప్పటికైనా విజయం వరిస్తుందని ఈ రైతు నిరూపించారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
బంగారం కలలో వస్తుందని..
కర్నూలు జిల్లా, కొలిమిగుండ్ల: బంగారంతో తయారు చేసిన పీర్లు బావిలో ఉన్నట్లు ఓ యువకుడికి తరచూ కల వస్తోంది. ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్పాడు. ఒకవేళ అది నిజం కావచ్చేమోనని..బావిలో నీరు తోడుతున్నారు. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల గ్రామంలో ఈ వింత చోటు చేసుకుంది. గ్రామానికి సమీపంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం వెనుక భాగంలో పురాతన బావి ఉంది. అందులో బంగారంతో చేసిన చిన్నకాశీం, పెద్ద కాశీం, దస్తగిరిస్వామి పీర్లు ఉన్నాయని గ్రామానికి చెందిన వంశీ అనే యువకుడికి తరచూ కల వస్తోందట! ఆలయం వెనుక భాగంలో వందల ఏళ్ల క్రితం పాత ఊరు(కొత్తకోట అనే గ్రామం) ఉండేది. అక్కడే ఈ పురాతన బావి ఉండటంతో ఆ యువకుడికి వచ్చిన కల నిజం కావచ్చేమోనని గ్రామస్తులు భావిస్తున్నారు. దీంతో వారం రోజుల నుంచి బావి వద్దకు చేరి పీర్ల కోసం అన్వేషిస్తున్నారు. మూడు రోజుల పాటు వరుసగా రాత్రి, పగలూ బావిలోకి దిగి శతవిధాలా ప్రయత్నం చేశారు. నీళ్లు ఎక్కువగా ఉండటంతో బుధవారం రాత్రి నుంచి ఏకధాటిగా డీజిల్ ఇంజిన్ సాయంతో పంపింగ్ చేస్తున్నారు. బావిలో ఊట కారణంగా నీళ్లు తగ్గుముఖం పట్టడం లేదు. పదుల సంఖ్యలో జనాలు అక్కడికి చేరుకొని పరిశీలిస్తున్నారు. అయితే వచ్చే గురువారం వచ్చి ప్రయత్నిస్తే తప్పక పీర్లు బయట పడుతాయని యువకుడు చెప్పడంతో ప్రస్తుతం నీటిని పంపింగ్ చేయడం నిలిపివేశారు. -
బంగారు కల
కొలిమిగుండ్ల: బంగారంతో తయారు చేసిన పీర్లు బావిలో ఉన్నట్లు ఓ యువకుడికి తరచూ కల వస్తుండటంతో విషయాన్ని గ్రామస్తులకు చెప్పాడు. ఒకవేళ అది నిజం కావచ్చేమోనని గ్రామస్తులు బావిలో నీరు తోడుతున్నారు. ఈ వింత ఘటన కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి సమీపంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం వెనుక భాగంలో పురాతన బావి ఉంది. అందులో బంగారంతో చేసిన చిన్నకాశీం, పెద్ద కాశీం, దస్తగిరిస్వామి పీర్లు ఉన్నాయని గ్రామానికి చెందిన వంశీ అనే యువకుడికి తరచూ కల వస్తోందట! ఆలయం వెనుక భాగంలో వందల ఏళ్ల క్రితం పాత ఊరు (కొత్తకోట అనే గ్రామం) ఉండేది. అక్కడే ఈ పురాతన బావి ఉండటంతో ఆ యువకుడికి వచ్చిన కల నిజం కావచ్చేమోనని గ్రామస్తులు భావిస్తున్నారు. దీంతో వారం రోజుల నుంచి బావి వద్దకు చేరి పీర్ల కోసం అన్వేషిస్తున్నారు. మూడు రోజుల పాటు వరుసగా రాత్రి, పగలూ బావిలోకి దిగి శతవిధాలా ప్రయత్నం చేశారు. నీళ్లు ఎక్కువగా ఉండటంతో బుధవారం రాత్రి నుంచి ఏకధాటిగా డీజిల్ ఇంజిన్ సాయంతో పంపింగ్ చేస్తున్నారు. బావిలో ఊట కారణంగా నీళ్లు తగ్గుముఖం పట్టడం లేదు. -
కల వచ్చిందని గొంతు కోసుకున్నాడు..
సాక్షి, కేకే.నగర్(చెన్నై): మనం నిద్రలో ఉన్నప్పుడు కలలు రావడం సహజం. మన ఊహలకు అందనివి మన కలలో జరుగుతుంటాయి. అందులో కొన్ని సంతోష పెట్టేవి ఉంటాయి. మరికొన్ని భయబ్రాంతులకు గురి చేసేవీ ఉంటాయి. అలాంటి ఓ కల ఓ యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది. కలలో తన గొంతును తానే కోసుకుని మృతిచెందినట్లు భావించిన ఓ యువకుడు నిజ జీవితంలో అలాగే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నై తాంబరం సమీపంలో శుక్రవారం జరిగింది. బంధువుల కథనం మేరకు.. తాంబరం సమీపంలోని బాలాజీనగర్కు చెందిన బాలకృష్ణన్(35) ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగి. ఇతను కత్తితో తన గొంతును తానే కోసుకుని చనిపోయినట్లు తరచూ కలలు కనేవాడు. వేరే ఇంట్లో ఉంటే కలలు రావని బాలకృష్ణన్ వారం క్రితం పల్లావరం ఇస్మాయిల్ రోడ్డు సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. శుక్రవారం ఉదయం వంట గదిలో గొంతు కోసుకున్న స్థితిలో స్పృహ తప్పి పడి ఉన్నాడు. గమనించిన బంధువులు అతన్ని పల్లావరంలోని ఆస్పత్రికి తరిలిస్తుండగా మృతిచెందాడు. పల్లావరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ కలతో..అపార నిధికి అన్వేషణ!
► చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ ప్రాచీన భవనాల్లో నిక్షేపాలు ► తుమకూరు యువకునికి కల ► సీఎంకు లేఖతో కార్యాచరణ శివాజీనగర(కర్ణాటక): ప్రాచీన భవనాలలో అపార స్థాయిలో నిధి ఉందని తుమకూరుకు చెందిన ఓ యువకుడు కన్న కల నిధి వేటకు దారితీసింది. అది కూడా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కార్యదర్శి ఎల్.కే.అతీక్, పురావస్తు శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసి, రహస్య నిధి కోసం గాలించాలని సూచించారు. చిత్రదుర్గ జిల్లా ఇన్చార్జి మంత్రి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్.ఆంజనేయ కూడా దీనిపై కన్నడ సంస్కృతి శాఖకు లేఖ రాసినట్లు వెలుగు చూసింది. ఇంతకీ ఏం జరిగిందంటే... ‘చిత్రదుర్గ జిల్లాలోని హొసదుర్గ తాలూకాలో ప్రాచీన భవనాల్లో అపారమైన నిధి ఉంది. 2 బంగ్లాల్లో ఆరు గదుల్లో అపారమైన బంగారు ఆభరణాలు ఉన్నట్లు’ నాకు కలలో వచ్చింది. ఈ రహస్య బంగ్లాలో శోధిస్తే లభించే అపారమైన నిధిని రాష్ట్ర సంక్షేమానికి ఉపయోగించుకోవచ్చు’ అని తుమకూరుకు చెందిన 29 ఏళ్ల ప్రద్యుమ్న యాదవ్ అనే యువకుడు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కొంతకాలం కిందట లేఖ రాశాడు. దాని ఆధారంగా జరుగుతోంది. 300 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని పాలించిన యదునందనా చిత్ర భూపాల సామ్రాట్ తన సామ్రాజ్యంపై శత్రువుల దాడి జరగడానికి ముందు అపారమైన బంగారు ఆభరణాలను ఈ భవనాల్లో దాచిపెట్టినట్లు కల వచ్చిందని యాదవ్ చెబుతున్నాడు. యువకుడు చెప్పిన కలలో నిజమెంతో తెలుసుకోవాలనుకున్న ప్రభుత్వం ప్రాచీన బంగ్లాల్లో పరిశీలనలను జరపాలని ఆదేశించినట్లు సమాచారం. -
పూర్ణిమకు వచ్చిన కల వల్లే భయపడుతోంది
-
జీవిత కల కోసం 99వ ఏట జైలుకి..
సాధారణంగా 99 ఏళ్లంటే కదిలే ఓపిక కూడా ఉండదు.. రామా కృష్ణా అంటూ ఓ మూలకు మూలుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువవుతాడు. అదీ కాకుండా అంతపెద్ద వయసులో పెద్దగా లక్ష్యాలు, కోరికలు అస్సలే ఉండవు.. పోతే బావుండు బోడి ప్రాణం అనిపించడం తప్ప. కానీ, డచ్ దేశంలో ఎన్నియే అనే 99 ఏళ్ల బామ్మ తాను చక్కగా ఆరోగ్యంగా ఉండటమే కాదు.. ఆ కదలలేని వయసులో జైలు కెళ్లింది. పోలీసులు తనకు బేడీలు వేస్తుంటే చిరునవ్వులు చిందించింది. వారికి ధన్యవాదాలు తెలిపింది. అయితే, అదేదో నేరం చేసి ఆమె జైలుకు వెళ్లలేదు. అలా ఒకసారైన జైలుకు వెళ్లాలనుకోవడం తన జీవితకాల కోరిక అంట. తన జీవితంలో చేయాలనుకున్నవన్నింటిని చేసిన ఆ పెద్దవ్వకు జైలు బేడీలు వేయించుకోవాలని, జైలు గదిలో గడపాలని కోరిక ఉండేదట. ఈ విషయాన్ని ఆమె ఉంటున్న నిజ్మెజెన్ జూయిడ్ పోలీసులకు తెలియజేయడంతో ఆమె చివరి కోరికను మన్నించి డచ్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తీసుకెళ్లారు. బేడీలు వేశారు. ఆ తర్వాత ఆమె సరదాగా కొద్ది సేపు జైలుగదిలో గడిపింది. దీనికి సంబంధించి లెఫ్టినెంట్ పీటర్ స్మిత్ వివరాలు తెలియజేస్తూ ‘తన మొత్తం జీవితకాలంలో కూడా ఎన్నియే ఒక్క నేరం కూడా చేయలేదు. ఆమెకు జైలు జీవితం ఎలా ఉంటుందో అస్వాధించాలని అనిపించింది. మేం మా పోలీస్ సైట్లో పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తే ఆమె ఎంత ఉల్లాసంగా జైలు గదిలో ఉందో మీకే అర్థం అవుతుంది’ అని చెప్పారు. -
గేట్లెత్తితేనే కల సాకారమైనట్లా?
- ప్రాజెక్టులకు ఆద్యుడు వైఎస్ఆర్ - పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి హితవు కర్నూలు(ఓల్డ్సిటీ): గేట్లెత్తినంత మాఽత్రాన కల సాకారమైనట్లు చంద్రబాబు భావించడం విడ్డూరంగా ఉందని.. ప్రాజెక్టులకు ఆద్యుడు వైఎస్ రాజశేఖర్రెడ్డి అనే విషయం ప్రజలకు తెలియంది కాదని పీఏసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. గురువారం ఆయన స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పాణ్యం శాసన సభ్యురాలు గౌరు చరితారెడ్డి, నందికొట్కూరు శాసనసభ్యుడు ఐజయ్య, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య, కోడుమూరు మాజీ శాసనసభ్యుడు మురళీకృష్ణలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ హయాంలోనే 90 శాతం పూర్తయిన ప్రాజెక్టులను ప్రారంభించి కల నిజమైందనడంలో అర్థం లేదన్నారు. ఐటీ రంగానికి సంబంధించి ఏపీ దేశంలోనే మూడో స్థానంలో ఉండేదని, చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలన తర్వాత రాష్ట్రానికి ఐదో స్థానం లభించిందన్నారు. అయితే చంద్రబాబు మాత్రం హైదరాబాద్ను తానే అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. మిగతా పార్టీలను బ్రేక్చేసి, మీ పార్టీని మేక్ చేస్తున్నారా, అవినీతి పునాదిపై రాజధాని కడుతున్నారా అంటూ ‘ఇండియాటుడే’ ప్రశ్నిస్తే ప్రతిపక్ష నేత అనే గౌరవం కూడా లేకుండా ‘హూ ఈజ్ దట్ ఫెలో’ అనడం చంద్రబాబు సంస్కారానికి నిదర్శనమన్నారు. పట్టుదల, దూరదృష్టికి అర్థం చెప్పిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, ఆయన స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కులమతాలకు తావులేదన్నారు. రైతులతోనే దేశం సుభిక్షం.. ఎక్కడైతే రైతులు సుభిక్షంగా ఉంటారో ఆ దేశం సిరిసంపదలతో తులతూగుతుందని నమ్మి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞానికి శ్రీకారం చుట్టారని పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు జిల్లాపై చిన్నచూపు చూస్తున్నారని, ఏ పనులూ ముందుకు వెళ్లడం లేదన్నారు. 2019లోనూ అధికార దాహం తీర్చుకునేందుకే అసత్యాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రెడ్డి సామాజిక వర్గంలో చిచ్చుపెట్టేందుకే జేసీ దివాకర్రెడ్డి చేత రెచ్చగొట్టే ప్రసంగాలు చేయిస్తున్నారన్నారు. ఇలాంటి కుయుక్తులపై ప్రజలు తిరగబడే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. ప్రాజెక్టులన్నీ వైఎస్ హయాంలోనివే.. ఒక్క ప్రాజెక్టుకూ శంకుస్థాపన చేయకపోగా వైఎస్ రాజశేఖరరెడ్డి 80, 90 శాతం పూర్తిచేసిన ప్రాజెక్టులకు గేట్లు ఎత్తి గొప్పలు చెప్పుకోవడం చంద్రబాబుకే చెల్లిందని నందికొట్కూరు శాసనసభ్యుడు ఐజయ్య అన్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతలకు వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.120 కోట్లు మంజూరు చేశారని.. ఇందులో 4 పంపుల ద్వారా కేసీకి నీరు అందించాల్సి ఉండగా, చంద్రబాబు రెండింటినే ప్రారంభించారన్నారు. ఈ కారణంగా సాగునీరు 1000 క్యూసెక్కులు అందాల్సిన చోట 500లకే పరిమితమైందన్నారు. ముఖ్యమంత్రికి నిజంగా రాయలసీమపై, జిల్లాపై ప్రేమే ఉంటే సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలని సవాల్ చేశారు. మాటలతో మభ్యపెడుతున్నారు టీడీపీ పాలనలో మాటలతో మభ్యపెట్టడమే తప్పిస్తే అభివృద్ధి లేదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య అన్నారు. తమ నేత వైఎస్ జగన్కు లభిస్తున్న ప్రజాదరణను చూసి చంద్రబాబుకు దిక్కుతోచడం లేదన్నారు. రౌడీ ఎంపీని దగ్గర పెట్టుకొని సంస్కారం లేకుండా మాట్లాడించడం సీఎం హోదాకు తగదన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టడంలో చంద్రబాబు సిద్ధహస్తుడన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెర్నేకల్ సురేందర్రెడ్డి, నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్, లీగల్సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాటి పుల్లారెడ్డి, సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యం యాదవ్, మహిళా, మైనారిటీ విభాగాల జిల్లా అధ్యక్షులు శౌరి విజయకుమారి, ఫిరోజ్, విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు గోపినాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
కళ్లముందే కరిగిన కల
సందర్భం పేదలకు నాణ్యమైన వైద్యం కోసం కలగన్న మనిషి అర్ధంతరంగా అంతర్థాన మయ్యాడు. ఒక గొప్ప స్వప్నం కళ్లముందే ఆవిరైపోయింది. ప్రపంచానికే ఆద ర్శంగా నిలవాల్సిన ఓ అద్భుత పథకం కొందరి నిర్వాకాలకు నీరుగారిపోయింది. కారు నడుపుతున్న సుశీల భర్త ఉన్నట్టుండి కారు పక్కకు తీసి స్టీరింగుపై వాలిపో యాడు. చీకటి ప్రదేశంలో దిక్కుతోచని స్థితి ఆమెది. ఏం చెయ్యాలి? పీతాంబరం స్థితి మంతుడు. మనుమడికి నీళ్ల విరోచనాలు మొదలైనాయి. ఊళ్లో ఫోన్లు ఉన్నా ఆసుపత్రే లేదు. ఆసుపత్రికి వెళ్లడానికి బస్సులు లేవు. ఏం చెయ్యాలి? ఏకాంబరం ఊళ్లో ఆసుపత్రి వుంది. డాక్టరు ఉండడు. రోగం రొష్టూ వస్తే మళ్లీ నాటువైద్యమే గతి. సోమయ్య ఊళ్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. డాక్టరు ఊళ్లోనే ఉన్నా.. రక్తపరీక్షకు, ఎక్స్రేలకు పక్కన వున్న బస్తీకి వెళ్లాలి. తీరా వెడితే కరెంటు ఉండదు. అది ఉన్నా ఎక్స్రే తీసేవాడు ఉండడు. ఏం చెయ్యాలి? ఇవన్నీ వైద్య సమస్యలే. కాని పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదని నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి నమ్మకం. స్వయానా డాక్టరు కావడంతో పరిష్కారం దిశగా ఆలోచన చేశారు ప్రజా రోగ్యం విషయంలో ఆదర్శాలు కలిగిన మరికొంత మంది వైద్యులు జత కలిశారు. నిబద్ధతగల అధికారులు తోడయ్యారు. ఆ విధంగా అప్పటికే జనాదరణ పొందిన 108కి తోడుగా 104 రూపు దిద్దుకుంది. అయితే వైఎస్ఆర్ కల అంతటితో ఆగలేదు. గుండెజబ్బుల వంటి పెద్ద సమస్యలు ఎదురయితే చిన్న వాళ్లు ఏమైపోవాలి? ఆ ఆలోచనలోంచే ఆరోగ్యశ్రీకి అంకురార్పణ జరిగింది. చిన్నా చితకా రోగాలకు వైద్య సలహా కోసం నిత్యం అందుబాటులో ఉండే 104 ఉచిత కాల్ సెంటర్. నిర్దేశిత దిన వైద్య పరీక్షలు నిర్వహించే 104 సంచార వాహనం, అత్యవసర వైద్యసాయం కోసం 108 అంబులెన్సు, ఇక పెద్ద రోగాల పాలబడి ఎవరు కాపాడుతారని ఎదురుచూసేవారి కోసం ఆరోగ్యశ్రీ.. ఇవన్నీ పూర్తిగా ఉచితం. అన్నీ ఒక్క గొడుగులో. 108 అంబులెన్సు ప్రమాదం అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించినదయితే ఈ 104 సంచార వైద్య వాహనం - పేద పల్లె ప్రజల ప్రాణాలు ప్రమాదం అంచుకు చేరకుండా చూస్తుంది. ఇంతా చేసి ఈ పథకం కింద లబ్ధి పొందేవారి సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే- ఒక్కొక్కరిపై పెట్టే ఖర్చు ఏడాదికి కేవలం ఎనభై రూపాయలు మాత్రమే. అంటే వైద్య ఆరోగ్య రంగం బడ్జెట్లో పది శాతం కన్నా తక్కువన్నమాట. ఆ రోజుల్లో జరిగిన సమావేశాల్లో సీఎం వైఎస్ అనేవారు.. కడుపుతో వున్న ఆడపిల్లలను పుట్టింటికి తీసుకువచ్చి, పురుడు పోయించి, తిరిగి తల్ల్లీ బిడ్డను క్షేమంగా అత్తారింటికి పంపడం తల్లిదండ్రుల బాధ్యత. ఇక నుంచీ ప్రతి పేదింటి ఆడపిల్లకూ ప్రభుత్వమే పుట్టిల్ల్లు. వాళ్ల బాధ్యత ప్రభుత్వానిదే. ఇంతేకాదు. 104కాల సెంటర్కు ఇంకా విస్తృత మైన లక్ష్యాలు నిర్దేశించారు. రాష్ర్టంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలు, నర్సింగ్ హోమ్లు, ప్రైవేట్ క్లిని క్లు ఔషధ దుకాణాలు, బ్లడ్బ్యాంకులు ఇలా వైద్య రంగానికి సంబంధించిన సమస్త సమాచారం సేకరించి ఒక్కచోటే నిక్షిప్తం చేశారు. అర్ధరాత్రి, అపరాత్రి అన కుండా రాష్ర్టంలో ఏమూల నుంచి ఫోన్ చేసినా వారు ఉండే ప్రదేశానికి ఇవన్నీ ఎంత దూరంలో ఉన్నాయి, ఏ సమయాల్లో పనిచేస్తాయి అనే వివరాలు తెలియచేయడా నికి వీలుగా ఈ ఏర్పాటు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. నాణ్యత కలిగిన ైవైద్య చికిత్సలను కలిగిన వారికే కాదు, పేదసాదలకు కూడా అందుబాటులోకి తేవాలనేది మొత్తం ఆరోగ్య శ్రీ లక్ష్యం. ఆ దార్శనికుడు కన్న కల సాకారం అయ్యే కృషి మొదలయింది. అందులోని వైశిష్ట్యం ఎలాంటిదో ప్రజ లకు క్రమంగా అవగతమవుతోంది. దురదృష్టం. అప్పుడే విధి వక్రించింది. దొంగచాటుగా మృత్యుపాశం విసిరింది. పేదలకు ఉచిత వైద్యంపై కలగన్న మనిషి అర్ధంతరంగా అంతర్థానమయ్యాడు. కంటున్న కల ఆయన కనురెప్పల్లోనే కరిగిపోయింది. ఒక గొప్ప స్వప్నం ఆవిష్కారానికి ముందే ఆవిరి అయిపోయింది. అంత చక్కటి పథకం అరకొరగా మిగిలి పోయింది. రాజకీయ విషక్రీడకు బలయిపోయింది. కార్పొరేట్ ఆసుపత్రులకు దోచి పెట్టే పథకంగా ముద్రవేసి, అసం పూర్తిగా దాన్ని అటక ఎక్కించారు. కారణం ఎవరయినా జరగరానిది జరిగిపోయింది. మొత్తం ప్రపంచానికే ఆదర్శంగా నిలవాల్సిన ఓ అద్భుత పథకం కొందరి నిర్వాకాలకు నీరుకారిపోయింది. మరి కొందరి స్వార్థాలకు బలయిపోయింది. ఇంకొందరి అహాలను చల్ల్లార్చడానికి మాడి మసైపోయింది. రాజ కీయ చదరంగంలో చిక్కుకుపోయి ఎత్తులు, పై ఎత్తు లకు చిత్తయిపోయింది. ఇప్పుడీ పథకం ఉందా అంటే ఉన్నట్టు, లేదా అంటే లేనట్టుగా ఉంది. ఆయన అదృష్టవంతుడు, దాటిపోయాడు. ఊళ్లకు దూరంగా, వైద్య సౌకర్యాలకు నోచుకోకుండా కొండలు, కోనల్లో నివసించే వారు దురదృష్టవంతులు. వారి బతు కుల్ని మార్చే గొప్ప పథకానికి వారు దూరం అయ్యారు. - భండారు శ్రీనివాసరావు (వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా...) వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు 9849130595 -
కలలు .. కల్లలాయే..!
‘ముఖ్యమంత్రి మనకంటే ఎవరికి దగ్గర... ఒక ఎమ్మెల్సీ పోస్టు ఖాళీ అవుతోంది. ఆ సీటు మనదే. మీరంతా కొద్దిగా ఓపిక పట్టండి. నెల తిరక్కుండానే హోం మంత్రినై తిరిగొస్తా...’ అంటూ మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ నేత కలల్లో తేలిపోతూ తన అనుచరగణానికి అదే విషయం ఊదరగొట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన సదరు నేతను ఇప్పటికే ఓ నామినేటెడ్ పదవి వరించింది. అయినా ఆయన చట్టసభల్లో కాలుమోపాలని తెగ ప్రయత్నం చేస్తున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. శాసనమండలి సభ్యుడిగా ఉండి పాలేరు అసెంబ్లీ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించడంతో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఒక ఖాళీ ఏర్పడింది. ఇక ఆ స్థానం తనదేనన్న ధీమాతో సదరు పాలమూరు నేత అయినవారికి, అనుచరులకు తనకు వరించ బోయే పదవుల గురించి చెప్పుకున్నారు. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని రాజీనామా చేయిస్తారని, ఆయనను రాజ్యసభకు పంపుతారని రీజనింగూ ఇచ్చారు. ఎమ్మెల్సీగా ఎంపికకావడం, ఆ వెంటనే హోం శాఖ పగ్గాలు చేపట్టడం చకచకా జరిగిపోతాయని అనుచరులకు రంగుల సినిమా చూపించారు. కానీ, ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి ఫరీదుద్దీన్ పేరును అధినాయకత్వం ప్రకటించింది. మరోవైపు రెండు రాజ్యసభ స్థానాలకూ అభ్యర్ధులను ప్రకటించగా అందులో నాయిని లేరు. మరి తమ నేత హోంమంత్రి అయ్యేదెట్టబ్బా అని తలలు బద్దలు కొట్టుకోవడం కార్యకర్తల వంతైంది. -
పారా సైక్లిస్ట్ కల తీర్చేందుకు అభిమానుల ఫండింగ్
న్యూ ఢిల్లీః అతడి కల తీర్చడమే ధ్యేయంగా అభిమానులు నడుం బిగించారు. సమర్థతను గుర్తించి సహకరించేందుకు ముందుకు వచ్చారు. ఫ్యాన్స్ సూపర్ సింగ్ అంటూ ముద్దుగా పిలుచుకునే జగ్వీందర్ సింగ్ 2014 ఏషియన్ పేరా గేమ్స్ కు అర్హత సాధించాడు. అయితే ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో హాజరు కాలేకపోయాడు. విషయాన్ని తెలుసుకున్న అభిమానులు చేతులు కలిపారు. నిధులు సేకరించి ఒలింపిక్స్ కు పంపేందుకు సిద్ధమయ్యారు. అభిమాన జనం దృష్టిలో అతడో సూపర్ సింగ్. రెండు చేతులూ లేకుండా పుట్టాడు. అయితేనేం అవరోధాలను అధిగమించి ఇండియా టాప్ పారా సైక్లిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు. 23 ఏళ్ళ జగ్వీందర్ సింగ్ 2014 లోనే ఏషియన్ పారా గేమ్స్ కు ఎంపికయ్యాడు. అయితే ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో పాల్గోలేక కాలేకపోయాడు. పాటియాలా సమీపంలోని పట్రాన్ గ్రామ నివాసి అయిన జగ్వీందర్ సింగ్ ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన పారా ఒలింపిక్స్ పై దృష్టి సారించాడు. అయితే గతంలో అతడు ఎదుర్కొన్న ఇబ్బందులనుంచి గట్టెక్కించి ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు అభిమానులు ఫండ్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. దీంతో అతడు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. అయితే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గోవాలనుకున్న క్రీడాకారులకు.. ట్రైనింగ్, కోచింగ్, పోషణ, అస్థాపన వంటి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు అవసరం. అవి తీరాలంటే తగిన ఆర్థిక పుష్టి కూడ అవసరం. అదే విషయాన్ని సింగ్ ఓ పత్రికా ప్రకటనలో తెలిపాడు. దీంతో ధనికులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజలనుంచి నిధులను సేకరించి సృజనాత్మక రంగంలోని వారికి సహకరించే వేదిక... 'డిసైర్ వింగ్స్ డాట్ కామ్' జస్వీందర్ కు సహకరించేందుకు ముందుకొచ్చింది. ఈ విరాళాల ద్వారా తనకు కావలసిన డబ్బు సమకూరవచ్చని, దీంతో తన కోరిక, కల నెరవేరవచ్చని భావిస్తున్నానని జగ్వీందర్ చెప్తున్నాడు. మీ అందరి సహకారం ఇలాగే ఉంటే నేను ఒలింపిక్స్ లో మన దేశానికి స్వర్ణం సాధించడం ఖాయం అని కూడ స్పష్టం చేశాడు. 2014లో పాటియాలాలో గ్రీన్ బైకర్ అసోసియేషన్ నిర్వహించిన 212 కిలోమీటర్ల సైక్లోథాన్ ను 9.15 నిమిషాల్లో జగ్వీందర్ సింగ్ పూర్తి చేశాడు. ఛండీగడ్ అసోసియేషన్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. అనంతరం 2015 ఒరిస్సాలో నిర్వహించిన ఇంటర్నేషనల్ సైక్లో థాన్ లోనూ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. తల్లిదండ్రుల ఇష్టాన్ని వ్యతిరేకించి మరీ ఈ మార్గంలోకి వచ్చిన ఈ సైక్లిస్గ్ తనకు ఎదురైన ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ ఈసారి ఒలింపిక్స్ కు సిద్ధమౌతున్నాడు. కెనడాకు చెందిన సైక్లిస్ట్ జోసెఫ్ వెలోస్ తనకు స్ఫూర్తి అని, ఆయనలాగే తానుకూడ ఒలింపిక్స్ లో స్వర్ణాన్ని సాధించి, దేశానికి, తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలవాలన్న ఆశయంతో ఉన్నానని చెప్తున్నాడు. -
నా జీవితమే నాకొక కల
జరిగినవే తలచితివా శాంతి లేదు నీకూ అన్న మహాకవి గీతం గుర్తుకొస్తుంది నటి తమన్నా చెప్పింది విన్న వారెవరికైనా. ఈమె బహుభాషా నటి. పలు చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇంకా మంచి నటిగా గుర్తుంపు తెచ్చుకోవాలంటున్నారు. అదే తన లక్ష్యం అంటున్న తమన్నా మనసు విప్పిన వేళ చదవండి.నటినైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇప్పటి వరకూ నటించిన చిత్రాలన్నిటికీ ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందాను. ఇకపై కూడా మంచి కథా పాత్రల్లోనే నటిస్తాను.తొలి రోజుల్లో తమిళం, తెలుగు భాషలు తెలియక షూటింగ్ స్పాట్లో చాలా కష్టపడ్డాను. ఇతరులతో చెప్పించుకుని నటించే దానిని. తరువాత భాష తెలుసుకోవడంపై ఆసక్తి కనబరచాను. ఇప్పుడు ఈ రెండు భాషలు చక్కగా మాట్లాడగలుగుతున్నాను. అనుకున్నది సాధించాలన్న విషయంలో దృఢనిశ్చయంతో ఉంటాను.అదే నా బలం.ఇక జరిగిన విషయాల గురించి తలచుకుంటూ బాధ పడుతుంటాను.ఇదే నా బలహీనం.నాకు దైవ నమ్మకం చాలా ఉంది.నిత్యం ఉదయాన్నే శారీరక కసరత్తులు చేస్తాను. డబ్బు అవసరాలకు తగినంతే ఉండాలి. దీనికి మించి ఉంటే మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఇక అందం అనేది చూసే కళ్లల్లో ఉండదనేది నా భావన. అది మనసుకు సంబంధించింది. మంచి మనసు కలిగిన వారే అందమైనవారు. నేను కలలు కనను. నటిగా ఈ జీవితమే నాకొక కల. నటి జ్యోతిక అంటే చాలా ఇష్టం. నేనామె వీరాభిమానిని. బాలీవుడ్లో హృతిక్రోషన్, మాధురీ దీక్షిత్, ప్రీతిజింతా, కరీనాకపూర్ అంటే నాకు చాలి ఇష్టం అని ఈ మిల్కీ బ్యూటీ తన మనసులోని భావాలను బయట పెట్టింది. -
పెళ్లికి అప్పిస్తారు కానీ..
వంద అబద్ధాలాడయినా ఓ పెళ్లి చేయమంటారు. అంటే వివాహ బంధానికి అంతటి ప్రత్యేకత ఉందన్నమాట. అందుకే కాబోలు స్వాన్ లవ్ పేరిట ఓ కంపెనీ ఏకంగా పెళ్లిళ్ళకు ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమైంది... కానీ నిర్వాహకులు దానికి కొన్ని కండిషన్లు మాత్రం పెట్టారు. అప్పు తీసుకున్నవారు వివాహ బంధాన్ని సజావుగా కొనసాగించారా సరి... విడాకులకు సిద్ధపడ్డారో అంతే.. తీసుకున్న డబ్బును వడ్డీతో కలిపి అణాపైసాలతో సహా చెల్లించాల్సిందే.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు పెళ్లి చేసుకోడానికి అష్ట కష్టాలు పడుతుంటారు. అధిక వడ్డీరేట్లను చెల్లించి అప్పులపాలౌతుంటారు. అటువంటివారితో పాటు.. ప్రేమ జంటలకూ ఆర్థికంగా అండగా నిలిచేందుకు వినూత్న ఆలోచనతో సీటెల్ లోని స్వాన్ లవ్ కంపెనీ ముందుకొచ్చింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి పెళ్లి చేసుకోవాలనుకుంటే వారికి పదివేల డాలర్లను సహాయంగా ఇస్తుంది. అయితే వారి కాపురం సజావుగా సాగిందా ఫర్వాలేదు. తీసుకున్న అప్పునుంచీ ఒక్క పైసా కూడ తిరిగి చెల్లించాల్సిన అవసరరం లేదు. ఒకవేళ విడాకులకు దారి తీసిందంటే మాత్రం... అప్పుతీసుకున్ననాటినుంచీ వడ్డీతో సహా చెల్లించాల్సిందే. అందుకు ఎంత వడ్డీ కట్టాలి అన్నది కంపెనీ ముందుగానే నిర్ణయిస్తుంది. చట్టబద్ధమైన నిబంధనలతో కూడిన డాక్యుమెంట్లపై సంతకాలు కూడ చేయించుకుంటుంది. కంపెనీ పెట్టే షరతులన్నింటికీ ఒప్పుకుంటేనే డబ్బును ఇచ్చేందుకు ఆ జంటను ఎంపిక చేస్తారు. స్వాన్ లవ్ సీఈవో స్కాట్ యావీకి ఈ వినూత్న ఆలోచన తన స్నేహితుడి పెళ్లి సందర్భంలో వచ్చిందట. ఇది క్రేజీగానే ఉన్నా ఆచరించడానికి ఎంతో ఆనందంగా ఉందంటున్నాడతడు. ఓ వ్యవస్థను రక్షించేందుకు ఈ విషయాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నానని, వివాహ జీవితంలో అసమానతలు చోటు చేసుకున్నపుడు రుణభారం ఒక్కరిపైనే పడుతోందని, అంతేకాక సమాన బాధ్యతలు పంచుకొని సమస్యలను అధిగమిస్తారనే ఆలోచనతోనే ఈ విధానాన్ని పరిచయం చేస్తున్నామని స్కాట్ సావీ చెప్తున్నారు. అయితే తమ కంపెనీకి ఇన్వెస్టర్లు వస్తారా లేదా అన్నవిషయం ఇంకా తేలలేదన్నారు. ఇప్పుడిప్పుడే ధరఖాస్తులు స్వీకరిస్తున్న సంస్థ... అనుకున్నట్లుగా అన్నీ జరిగితే ఫిబ్రవరినాటికి చెల్లింపులు ప్రారంభించే అవకాశం ఉంది. అయితే కంపెనీకి రాబడి వచ్చేందుకు చాలా సంవత్సరాలు పట్టొచ్చని, భవిష్యత్తులో లాభదాయకంగా నడిచే అవకాశం ఉందని స్కాట్ ఎంతో నమ్మకంగా ఉన్నాడు. వ్యక్తుల ప్రవర్తనలు, ఆలోచనలను ఆధారంగా చేసుకుని వ్యాపారం చేయడం స్కాట్ కు ఇదే మొదటిసారి కాదు. మొబైల్ యాప్ కంపెనీ అటాక్ టచ్, యాప్ అనలిటిక్స్ కంపెనీ... వై స్లైడ్స్, స్నాప్ డేర్ స్నాప్ ఛాట్ వంటివెన్నో స్థాపించాడు. అయితే ఇప్పుడు వీటన్నింటికీ భిన్నంగా... పూర్తిగా వివాదాస్పదమైన స్వాన్ లవ్ సంస్థను స్థాపించి బిజినెస్ మోడల్ గా నిలుస్తున్నాడు. భవిష్యత్తులో వివాహాలు విచ్ఛిన్నం అవుతాయన్న గట్టి నమ్మకంతోనే అతడీ సంస్థను స్థాపించాడన్న విమర్శలూ వస్తున్నాయి. ఇది వ్యక్తుల జీవితాలతో వ్యాపారం చేయడం కాదా అని స్కాట్ ను అడిగితే మాత్రం... తాను పరిశీలించినంతలో ఇప్పటివరకూ సానుకూల స్పందనే ఉందని చెప్తున్నాడు. -
త్రిష ఇప్పుడు నెగటివ్!
ఎప్పట్నుంచో త్రిష కంటున్న ఓ కల నెరవేరనుంది. కథానాయికగా దక్షిణాదిన తిరుగులేదనిపించుకున్న ఈ బ్యూటీకి ఒక్కసారైనా నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర చేయాలనే కోరిక ఉంది. పన్నెండేళ్ల కెరీర్లో ఈ విషయాన్ని త్రిష పలుమార్లు వ్యక్తపరిచారు. చివరికి ఇప్పుడు త్రిష కల నెరవేరే సమయం ఆసన్నమైందని చెన్నయ్ టాక్. ధనుష్ హీరోగా త్వరలో ఓ చిత్రం ఆరంభం కానుందట. ఇందులో ధనుష్ అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేయనున్నారని వినికిడి. అన్న పాత్ర సరసన త్రిషను ఎంపిక చేశారట. తమ్ముడి పాత్ర సరసన ‘షామిలి’ (‘ఓయ్’ చిత్రం ఫేం)ని తీసుకున్నారని వినికిడి. త్రిష పాత్ర నెగటివ్ షేడ్స్తో ఉంటుందట. ఈ పాత్ర గురించి చెప్పగానే త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని బోగట్టా. దురై సెంథిల్కుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం నవంబర్లో ఆరంభం అవుతుందట. -
కల వరం
‘‘ రాత్రి... భలే కలొచ్చింది. ఎక్కడున్నానో తెలియదుగానీ... చుట్టూ బంగారం. వజ్రవైఢూర్యాలు రాశులు పోసి ఉన్నాయి. ఏదెంత విలువ చేస్తుందో... అంత డబ్బు వస్తే ఏమేం చేయాలో లెక్కలేస్తూ ఉన్నాను. కానీ... పక్కనే ఐదు తలల నాగుపాము! బంగారు ముట్టుకుందామంటే... కస్సున బుసకొడుతోంది. నాగస్వరం ఊది దాని దృష్టి తప్పిద్దామనుకుంటున్నా... ఇంతలో.... ఛా... మెలకువ వచ్చేసింది’’. కలలు ఇలాగే ఉంటాయి. కొన్ని అసలు అర్థం కావు.. ఇంకొన్ని సగం సగం తెలిసినట్టుగా, మరికొన్ని కళ్లకు కట్టినట్టుగా స్పష్టంగా! యుగాలుగా మనిషి మెదడు ప్రతిరోజూ వేస్తున్న ఈ ‘నైట్ షో’లకు ఎంతో కొంత అర్థం లేకపోలేదు. అసలు నిజానికి కలలు ఎందుకు వస్తాయి? వాటివల్ల ప్రయోజనమేమిటి? మనకు నచ్చినట్టు కలలు కనవచ్చా? అన్న ప్రశ్నలకు శాస్త్రవేత్తలు స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేకపోతున్నారు. వందేళ్ల క్రితం సిగ్మండ్ ఫ్రాయిడ్, కార్ల్జంగ్ లాంటి సైకాలజీ శాస్త్రవేత్తలు కలలనేవి అణచివేతకు గురైన మనిషి ఆలోచనలు, కోరికలకు ప్రతిరూపాలని సిద్ధాంతీకరిస్తే... అవి మెదడులోని విద్యుత్ ప్రేరణల కాకతాళీయ మేళవింపు మాత్రమేనని అలన్ హాబ్సన్, రాబర్ట్ మెకార్లీ వంటివారు కొత్త సూత్రాన్ని ప్రతిపాదించారు. ఫ్రాయిడ్ సిద్ధాంతం ప్రకారం.. కొన్ని సమస్యల పరిష్కారానికి, మనం బాగా దృష్టి పెట్టాల్సిన అంశాలు, సంఘటనలను గుర్తు చేసుకునేందుకు కలలు ఉపయోగపడతాయి. హాబ్సన్, మెకార్లీల అంచనాల ప్రకారం మెదడులోని న్యూరాన్ల కనెక్షన్లకు వ్యాయామం కల్పించేందుకు, తద్వారా ఎదో ఒకటి నేర్చుకునేందుకు కలలు ఉపయోగపడతాయి! ఏది సత్యమన్నది ఇప్పటికీ మిస్టరీనే. కలలు... నిద్రలో రకాలు! స్థూలంగా చెబితే నిద్ర రెండు రకాలు. కొంచెం వివరంగా ఆలోచిస్తే మాత్రం ఐదు రకాలని శాస్త్రవేత్తలు చెబుతారు. ముందుగా రెండు రకాల నిద్ర గురించి చూద్దాం. ఇందులో మొదటిది రాపిడ్ ఐ మూవ్మెంట్ (ఆర్ఈఎం) స్లీప్. రెండోది నాన్ ఆర్ఈఎం. దీంట్లో మరో నాలుగు చిన్నదశలు ఉంటాయి. కలతనిద్ర, మగత నిద్ర, దీర్ఘనిద్ర లాంటివన్నమాట! ప్రతిరోజూ మనం మన నిద్రను నాన్ ఆర్ఈఎం స్లీప్తో మొదలుపెడతాం. ఈ దశ దాదాపు 90 నిమిషాలపాటు ఉంటుంది. ఆ తరువాతి దశ ఆర్ఈఎం స్లీప్ది. కలలు ఎక్కువగా వచ్చేది ఈ దశలోనే. ఈ దశలో శరీరం మొత్తం చచ్చుబడిపోయినట్లు ఉన్నా... మెదడుమాత్రం మెలకువగా ఉన్నప్పటి మాదిరిగా చురుకుగా ఉంటుంది. గుండెకొట్టుకునే, ఊపిరి తీసుకునే వేగం కూడా ఈ దశలో ఎక్కువగా ఉంటుంది. మెదడు విడుదల చేసే గ్లైసీన్ అనే అమినోయాసిడ్ కారణంగా ఇదంతా జరుగుతుంది. అందువల్లనే ఆర్ఈఎం నిద్రలో ఎంతటి భయంకరమైన కలలు వచ్చినా... వాటికి మన శరీరం స్పందించదు. లేదంటే... మీ కలల్లో మీరు ఫుట్బాల్ ఆడుతూంటే... మీ కాళ్లూ ఎడాపెడా పక్కనున్న వారిని తన్నేస్తూంటాయి! మెలకువతో జ్ఞాపకాలు మాయం మంచి కల కంటున్నప్పుడు అకస్మాత్తుగా ఏ కారణం చేతనైనా మీకు మెలకువ వచ్చిందనుకుండి. ఆ వెంటనే... మీ కల దేనికి సంబంధించిందన్నది భేషుగ్గా గుర్తుంటుంది. ఐదు నిమిషాలు గడిస్తే మాత్రం సగం అంశాలు మరచిపోతారు. పదినిమిషాల తరువాత మిమ్మల్ని నిద్రలేపి అడిగితే ఏమో... గుర్తులేదన్న సమాధానం రావడం గ్యారెంటీ! ఎందుకిలా జరుగుతుందంటే... అవన్నీ అణచివేతకు గురైన ఆలోచనలు కాబట్టి అంటాడు ఫ్రాయిడ్. అలా ఏం కాదు.. పొద్దున్న లేవగానే మిగతా పనులు మన ఆలోచనలను తరుముతూంటాయి కాబట్టి కలలు గుర్తుండవని ఇతర శాస్త్రవేత్తల అంచనా. పైగా కలలు చాలా అస్పష్టంగా మొదలవుతాయి కాబట్టి, రెండు మూడు సార్లు వాటిని అనుభూతి పొంది అర్థం చేసుకోవడం వీలుకాదు కాబట్టి అవి గుర్తుండవని ఫ్రాయిడ్ కాలంలోనే పనిచేసిన ఎల్.స్ట్రంపెల్ వంటి వారు అంటారు. కలలను కంట్రోల్ చేయవచ్చా? శ్రమతో కూడినదైనా... ప్రాక్టీస్ చేస్తే మీకు నచ్చినట్లు కలలు కనడం సాధ్యమేనని అంటోంది ఈ కాలపు సైన్స్. ఈ రకమైన కలలను లూసిడ్ డ్రీమింగ్ అంటారు. కలలను గుర్తుపెట్టుకునేందుకు ఉపయోగించిన టెక్నిక్ల మాదిరివే దీనికి పనికొస్తాయని ‘ది లుసిడిటీ ఇన్స్టిట్యూట్’ వ్యవస్థాపకుడు స్టీఫెన్ లాబార్జ్ (స్టాన్ఫర్డ్ యూనివర్శిటీ) అంచనా. కలలను నియంత్రించడం ద్వారా... మనకు కావాల్సిన విధంగా కల కనడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చునని ఈయన అంటున్నారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు మాత్రమే కాకుండా... మానసిక ఆరోగ్యాన్ని పెంచుకునేందుకు, పీడకలల ప్రభావం నుంచి బయటపడేందుకు నియంత్రిత కలలు సాయపడతాయని ఈయన అంటున్నారు. అసాధ్యాలను సుసాధ్యం చేసిన అనుభూతి పొందడం లూసిడ్ డ్రీమింగ్ ద్వారా సాధ్యమని ఉదాహరణకు... హార్ట్స్ట్రోక్ వల్ల పక్షవాతం వచ్చినవారు కలల్లో తమకిష్టమైన పని (నడవడం కావచ్చు, డ్యాన్స్ చేయడం కావచ్చు) చేయడం ద్వారా సెన్సరీ మోటార్లకు పనిచెప్పి త్వరగా కోలుకునే అవకాశం ఏర్పడుతుందని లాబార్జ్ అంచనా. - గిళియార్ గుర్తు పెట్టుకోవాలంటే.... కలల్ని గుర్తుపెట్టుకోవడం కష్టమే. కానీ అసాధ్యం మాత్రం కాదు. ఇందుకు సంబంధించి నెట్లో బోలెడంత సమాచారం ఉంది. అది కాకుండా..పడుకునే ముందు ఈ రోజు నాకు వచ్చే కలల్ని గుర్తుంచుకోవాలి అని గట్టిగా అనుకోవడం.90 నిమిషాలకు ఒకసారి మోగేలా అలారం పెట్టుకుని... మెలకువ వచ్చినప్పుడల్లా మీ కల సారాంశాన్ని రాసుకోవడం. పీడకలలు ఎందుకొస్తాయి? నిద్రల్లోంచి ఉలిక్కిపడి లేచేసే స్థాయిలో పీడకలలు రావడం మనందరికీ అనుభవమే. ఈ రకమైన కలల్లో ఆప్తుల మరణం మొదలుకొని... అనూహ్య పరిస్థితుల్లో ప్రమాదాలు మనల్ని వెంటాడటం వరకూ అనేక థీమ్లు కనిపిస్తూంటాయి. ఈ రకమైన కలలు వచ్చేందుకు మన మానసిక పరిస్థితి కొంతవరకూ కారణం కావచ్చునని శాస్త్రవేత్తలు అంటారు. కొన్ని రకాల మందులు కూడా కారణమవుతాయని, అకస్మాత్తుగా మందులు వాడటం ఆపేసినప్పుడూ పీడకలలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణుల అంచనా. కలలను నియంత్రించుకునేందుకు ఉపయోగించే టెక్నిక్లను వాడటం ద్వారా పీడకలలను మనకు అనుకూలంగా మార్చుకుని నిజజీవిత సమస్యలను అధిగమించవచ్చునని వీరు అంటారు. కలల అద్భుతాలు రసాయన మూలకం బెంజీన్ ఆకారాన్ని కనుక్కున్నది జర్మనీ శాస్త్రవేత్త కెకూలే. పాములు తమనోటితో తోకలను పట్టుకుని గుండ్రటి ఆకారంలో తిరుగుతున్నట్లు ఆయనకు ఒక కల వచ్చింది. దాంతో అప్పటివరకూ బెంజీన్ ఆకృతిని అంచనా వేసేందుకు నానా కష్టాలు పడ్డ కెకూలే.. ఆ వెంటనే బెంజీన్ గుండ్రంగా ఉంటుందని తేల్చేశాడు! ఎలియాస్ హోవే పేరెప్పుడైనా విన్నారా? 1884లో కుట్టుమిషన్ను ఆవిష్కరించింది ఈయనే. సూదిని ఓ యంత్రంలా ఎలా వాడుకోవాలని తర్జనభర్జన పడుతున్న సమయంలో ఆయనకు ఓ కల వచ్చింది. అందులో ఆయన్ను కొందరు గిరిజనులు బరిసెలతో చుట్టుముట్టారు. ప్రతి బరిసెలోనూ ఓ చిన్న రంధ్రం ఉందట. మేలుకున్న తరువాత... సూది చివరలో చిన్న రంధ్రం ఏర్పాటు చేస్తే కుట్టుమిషన్ సిద్ధమవుతుందని ఆయన లెక్కేశాడు. తయారు చేశాడు కూడా.పాల్ మెకార్టినీ, బిల్లీజోయెల బీతోవెన్ వంటి సంగీత కళాకారులు కలల ద్వారా స్ఫూర్తిపొందారని అంటారు. వీరిలో కొందరికి కలల్లో రకరకాల ఆర్కెస్ట్రా అమరికలు కనిపిస్తే... కొందరికి అందమైన పాటలు కలల్లో వినిపించేవట! -
నిద్రలో కలల స్క్రీన్ ప్లే
స్వప్నలోకం కల జీవితానికి స్ఫూర్తి. ఆ మాటకొస్తే బతకడానికి ఓ ఆర్తి! అసలు కలలు కనని వారుంటారా? పగటి కలలు, రాత్రి కలలు... ఎన్ని అందమైన అనుభూతులను మిగులుస్తాయి! ఇంకెన్ని భయాలను కలిగిస్తాయి! మన ప్రమేయం లేకుండానే మస్తిష్కం నుంచి ప్రొజెక్ట్ అయి మూసిన కనురెప్పల మాటున కలర్ఫుల్ సినిమాను చూపిస్తాయి. ఒక్కోసారి కథానాయకుడిగా స్టోరీనంతా నడిపిస్తుంటాం! మరోసారి ప్రతినాయకుడిగా కత్తి పట్టుకొని కనిపిస్తాం! మన మరణానికి మనమే చింతిస్తుంటాం! నిజ జీవితంలో సాధ్యంకాని సాహసాలన్నిటినీ చేసేస్తుంటాం! కొన్ని కలలు మన ఆశయాలకు ప్రేరణనిస్తూ.. ఇంకొన్ని రాబోయే కీడును హెచ్చరిస్తూ జీవనమార్గాన్ని చూపెడతాయంటారు స్వప్నశాస్త్ర పండితులు. అందులో నిజానిజాలెలా ఉన్నా లక్ష్యసిద్ధికి కలలు కనాల్సిన అవసరం ఉందని నొక్కివక్కాణిస్తారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్. అలా కలలు కని జీవితాశయాన్ని ఏర్పర్చుకున్న వాళ్లు ఉన్నారు.. భవిష్యత్ గమ్యం గురించి కలలు కని దాన్ని చేరుకున్న వాళ్లూ ఉన్నారు. ప్రముఖ శాస్త్రవేత్త ఇలియాస్ హోవే తనకు చిన్నప్పడు వచ్చిన కల వల్లే ‘కుట్టు మిషన్’ కనుక్కున్నానని చెప్పారట. అలాగే ‘ఏసీ ఇండక్షన్ మోటార్’ పుట్టడానికి కారణం సైంటిస్ట్ ‘నికోలా టెస్లా’కు వచ్చిన కలే! ప్రపంచాన్నంతా తన చుట్టే తిప్పుకుంటున్న ‘గూగుల్’ ఐడియాను ‘లారీ పేజ్’కు అందించింది ఈ కలామతల్లే! ఈ అద్భుతాలన్నీ మనిషికి కలల కురిపించిన వరాలు. ప్రమాద సంకేతాలుగా... అయితే కొందరికి భవిష్యత్తులో తమకు ఎదురయ్యే ప్రమాద సంకేతాలు కూడా కలలుగా వస్తాయట. అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్కు ఓ కల వచ్చిందట. అతణ్ని ఎవరో హత్య చేసినట్టు. అచ్చం అతను కలకన్నట్టే తన భార్యతో ఓ థియేటర్లో ఉన్నప్పుడు బూత్ అనే వ్యక్తి లింకన్ను గన్తో కాల్చి చంపాడు. కల నిజమైన విషాదం ఇది. అలాగే 9/11 సంఘటన బాధితులు కూడా తమకు ఏదో ప్రమాదం జరగనున్నట్టు కల కన్నామని చెప్పారట. కలలకున్న ప్రాధాన్యం ఇది మరి. ఏమైనా కలలు రావడం ఆరోగ్యకరమని, కలల ఆధారంగా తమ మానసిక పరిస్థితిని ఎవరికి వారు అంచనా వేసుకోవచ్చని మానసిక వైద్యులూ చెప్తున్నారు. తరచూ పీడ కలలు వచ్చేవారికి మనసులో ఏదో ఆందోళనగా ఉంటుందని, వారు తప్పక నిపుణులను సంప్రదించాల్సిన అవసరం ఉందంటున్నారు. కలల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు - గురక పెడుతున్నప్పుడు కలలు రావడం అసాధ్యం (ట). - నిద్ర లేచిన మొదటి నిమిషంలోనే 90 శాతం కలను మరచిపోతారు. - మూడు సంవత్సరాలలోపు పిల్లలు తమ గురించి కలలు కనలేరు. - మనుషులు ఒక రాత్రి 3-7 కలలు కంటారు. మొత్తం రాత్రిలో రెండు నుంచి మూడు గంటలు కలల్లోనే ఉంటారు. - ప్రతి ఒక్కరు తమ జీవిత కాలంలో దాదాపు 6 ఏళ్లు కలల్లోనే ఉంటారు. - పురుషుల కలల్లో 70 శాతం పురుషులే వస్తారట. కానీ మహిళల కలల్లో పురుషులు, మహిళలూ సమానంగా వస్తారట. - 12 శాతం మందికి కలలు బ్లాక్ అండ్ వైట్లో వస్తాయట. - అంధులూ కలలు కంటారు. జన్మతః అంధులకు వారి కలల్లో కేవలం మాటలు మాత్రమే వినిపిస్తాయట. అలాగే మధ్యలో చూపు కోల్పోయిన వారికి వారు చూసిన వ్యక్తులు, దృశ్యాలు కలలోకి వస్తాయట. -
కలలో ఆకలేల?
స్వప్నలిపి కడుపు పట్టుకుంటూ నిద్ర నుంచి టక్కుమని లేస్తాం. ఆకలిగా అనిపిస్తుంది. ఇంతలోనే అది భ్రమ అని తేలిపోతుంది. మరి ఆకలిగా ఎందుకు అనిపించింది? అది కల ఫలితం! కలలో మీరు ఆకలితో అలమటిస్తుంటారు. చేతిలో డబ్బులు ఉంటాయి. కాని భోజనం ఎక్కడా దొరకదు. మరోసారేమో... ఎటు చూస్తే అటూ నోరూరించే వంటకాలు కనిపిస్తుంటాయి. కానీ... చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు. ఇలా ‘ఆకలి’ నేపథ్యంగా రకరకాల కలలు వస్తుంటాయి. ‘ఈ నెల రోజుల కాలంలో ఒక్కరోజు కూడా ఆకలితో పడుకోలేదు. రోజూ సుష్టుగా భోజనం చేస్తున్నాను. మరి ఈ ఆకలి కల ఏమిటి?’ అనే సందేహం రావచ్చు. నిజానికి కలలో మన అనుభవంలోకి వచ్చే ఆకలి అనేది ఆహారానికి సంబంధించినది కాదు.. రకరకాల విషయాలకు అది సూచనప్రాయమైన వ్యక్తీకరణ మాత్రమే. ఆర్థిక సంక్షోభాలు, సమస్యలు చుట్టుముట్టినప్పుడు, అనుకున్న స్థాయిలో జీవనప్రమాణాలు లేవనుకున్నప్పుడు, ప్రేమరాహిత్యంతో బాధ పడుతున్నప్పుడు ఇలాంటి కలలు సాధారణంగా వస్తుంటాయి. చేస్తున్న పనిలో సంతృప్తి లభించనప్పుడు, చేయబోయే పనిలో సంతృప్తి ఉండదనే ఆలోచన వచ్చినప్పుడు, నేర్చుకోవాల్సిన విషయమేదో ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ నిరాశ కలిగిస్తున్నప్పుడు... సాధారణంగా ఇలాంటి కలలు వస్తుంటాయి. -
చెప్పులు చెప్పే మర్మం ఏమిటి?
స్వప్నలిపి చెప్పులే కదా అని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. కలలో కనిపించే ‘చెప్పులు’ కూడా ఎన్నో అర్థాలు చెబుతాయి. ఒకవిధంగా చెప్పాలంటే జీవితం పట్ల మన దృక్పథానికి, నమ్మక అపనమ్మకాలకు ఇవి అద్దం పడతాయి. చెప్పులు పాత పాడి, మరీ పాతబడి... నడవడానికి ఇబ్బంది పడడం అనే దృశ్యం తరచుగా కలలోకి వస్తే మీ వృత్తిలోనో, మీరు ఎంచుకున్న మార్గంలోనో ఆటంకాలు ఎదురవుతున్నట్లు. ఇక తరచుగా చెప్పులు మార్చడానికి కూడా ఒక అర్థం ఉంది. మనం ఏర్పర్చుకున్న అభిప్రాయాల్లో స్థిమితం కోల్పోవడాన్ని సూచిస్తుంది. చాలామందికి ఎక్కువగా వచ్చే కల... చెప్పులు పోవడం! ఒక దేవాలయంలోకి వెళ్లివస్తాం. బయట విడిచిన చెప్పులు కనిపించవు. ఏదో విందుకు హాజరవుతాం. బయట అందరి చెప్పులు ఉంటాయి... మన చెప్పులు కనిపించవు... ఇలా చాలా సందర్భాల్లో మన చెప్పులు మిస్ అవుతూ ఉంటాయి. ఇలా మాయం కావడం వెనుక ఏదైనా అర్థం ఉందా? ఉందనే అంటున్నాయి రకరకాల స్వప్నవిశ్లేషణలు. ముఖ్యకారణం చెప్పుకోవాల్సి వస్తే మనలోని ‘అతి జాగ్రత్త’ను, దాని గురించే చేసే పదేపదే ఆలోచన పరంపరకు ఇది అద్దం పడుతుంది. ఆత్మవిశ్వాసం కోల్పోవడం, లేని ప్రమాదాన్ని ఊహించుకునే సందర్భాల్లో కూడా ఇలాంటి కలలు వస్తుంటాయి. -
ఆశలు పట్టాలెక్కేనా?
రైల్వే బడ్జెట్ మరి కాసేపట్లో పట్టాలెక్కనుంది. తమ ఆశలు నెరవేరుస్తుందా ? లేక ఆనవాయితీగా కొద్దిపాటి కూతలకే పరిమితమవుతుందా ..? అని జిల్లా వాసులు ఎదురుచూస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న రైల్వేస్టేషన్కూడా అభివృద్ధికి నోచుకోని పరిస్థితి.... కనీసం ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కూడా ముందుకు సాగని దుస్థితి... సాధారణ బోగీలతో విశాఖ నుంచి హౌరా ఎక్స్ప్రెస్ను నడపాలన్న 16 ఏళ్ల డిమాండ్కు మోక్షమే లేదు. సుమారు రూ.కోటీ 55లక్షలతో విజయనగరంలో నిర్మించిన రైల్వే మామిడి యార్డ్కు ప్రత్యేక లైన్ ఏర్పాటు డిమాండ్ అలాగే ఉండిపోయింది. ప్రతిసారీ నేతలు హామీలిస్తున్నారే తప్పా అవి నెరవేరడం లేదు. ఈ సారైనా బీజేీపీ సర్కార్ జిల్లాపై దృష్టి సారించాలని, చిరకాలంగా ఉన్న డిమాండ్లు నెరవేర్చాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. విజయనగరం టౌన్ : జిల్లా ప్రయాణికుల ఆశలు ఏటా ఆవిరవుతున్నాయి. ప్రతీ రైల్వే బడ్జెట్లో జిల్లాకు మొండిచేయి ఎదురవుతోంది. ఏటా గంపెడు ఆశలు పెట్టుకోవడమే తప్ప సాకారం కావడం లేదు. రైల్వే మంత్రులు ఎంతమంది మారినా జిల్లాకొచ్చే ప్రయోజనం కనిపించడం లేదు. గత యూపీఏ ప్రభుత్వం కూడా జిల్లా వాసులకు నిరాశే మిగిల్చింది. కంటితుడుపు చర్యగా కొన్నింటిని కేటాయించి చేతులుదులిపేసుకుంది. ఇక కేటాయింపులైనా అమలయ్యాయంటే అదీ లేదు. ప్రకటించిన ఏ ఒక్కటీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. విజయనగరం నుంచి రాజాం మీదగా పలాసకు ప్రత్యేక రైల్వే లైను, బొబ్బిలి రైల్వే స్టేషన్ ఆధునీకరణ, విజయనగరం రైల్వే స్టేషన్లో అవుట్ పేషెంట్ విభాగం, డయోగ్నస్టిక్ సెంటర్ల ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. అయితే వీటిలో ఏ ఒక్కటీ ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. ఇక ఏళ్ల నాటి సమస్యలు అనేకం ఉన్నాయి. సాధారణ బోగీలతో విశాఖ నుంచి హౌరా ఎక్స్ప్రెస్ను నడపాలన్న 16 ఏళ్ల డిమాండ్కు మోక్షమే లేదు. సుమారు రూ.కోటీ 55లక్షలతో విజయనగరంలో నిర్మించిన రైల్వే మామిడి యార్డ్కు ప్రత్యేక లైన్ ఏర్పాటు డిమాండ్ అలాగే ఉండిపోయింది. దీనికి ప్రత్యేక లైన్ లేకపోవడం వల్ల యార్డ్ నిరుపయోగంగా మిగిలిపోయింది. ఏటా రూ.10 కోట్లకు పైగా ఆదాయాన్ని తీసుకొస్తున్న గూడ్స్ షెడ్ అభివృద్ధిపైనా దృష్టిసారించడం లేదు. విజయనగరం రైల్వేస్టేషన్లో ఐదో నంబర్ ఫ్లాట్ఫామ్ నుంచి తొమ్మిదో నంబర్ ఫ్లాట్ఫామ్ వరకూ ఫుట్ ఓవర్ బ్రిడ్జి ప్రతిపాదన పెండింగ్లోనే ఉంది. ‘లోకో మోటివ్ షెడ్(రైలు బయలుదేరు ప్రదేశం)’పరిస్థితి కూడా ఒక డిమాండ్గానే మిగిలిపోయింది. ఈ విధంగా ఏళ్ల నాటికి సమస్యలకు మోక్షం కలగకపోగా గత బడ్జెట్లో చేసిన కేటాయింపులు (కేటాయింపులూ)అమలుకు నోచుకోని దుస్థితి నెలకొంది.అదేవిధంగా ప్రత్యేక రైల్వేజోన్ కేటాయిస్తామంటూ ఊరించిన యూపీఏ ప్రభుత్వం జిల్లావాసుల ఆశలు నీరుగార్చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న రైల్వే బడ్జెట్పై జిల్లా ప్రజలు మరోసారి ఆశలు పెట్టుకున్నారు. కేంద్రమంత్రి సురేష్ ప్రభు మంత్రిగా తొలిసారిగా ప్రవేశపెట్టబోయే రైల్వే బడ్జెట్లో జిల్లాకు ఏ మే రకు ప్రాధాన్యం కల్పిస్తారో వేచిచూడాలి. గత కేటాయింపులకు కొనసాగింపుగా నిధులిస్తారా? ఏళ్ల నాటి డిమాండ్లకు పరిష్కారం చూపుతారా? కొత్తగా వేటినైనా ప్రకటిస్తారా? అనేది చూడాల్సి ఉంది. -
మోక్షమెప్పుడో..!
జమ్మలమడుగు: జిల్లా ప్రజలకు ఎర్రగుంట్ల - నంద్యాల రైలు ఓ కలగా మారుతోంది. ఈ రైలుకు మోక్షమెప్పుడు వస్తుందా అని ఈ ప్రాంత వాసులు ఎదురుచూస్తున్నారు. ఎర్రగుంట్ల-నంద్యాల రైలుమార్గం 1996-97లో మంజూరైంది. 126 కిలోమీటర్ల పరిధిలో రూ.883 కోట్ల అంచనా వ్యయంతో మార్గం పనులు ప్రారంభమయ్యాయి. 2012 వరకు రూ.558 కోట్లు ఖర్చు చేశారు. పెండింగ్లో 30 కిలోమీటర్ల లైను మిగిలి ఉంది. ఇరవై శాతం పనులు ఈ మార్గం కోసం చేపట్టాల్సి ఉంది. 2012-13లో రూ.63కోట్లు కేటాయించారు. 2013-14లో రూ.30కోట్లు కేటాయించారు. బనగానపల్లె వరకు రైలుపట్టాలు నిర్మితమయ్యాయి. నంద్యాల వరకు పనులు పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం నొస్సం వరకు పనులు జరుగుతున్నాయి. రైలు మార్గం మంజూరై 17 ఏళ్లు దాటినా ఇంతవరకు పూర్తికాలేదు. పెండింగ్ పనులు పూర్తి కావాలంటే రూ.300 కోట్లు కావాల్సి ఉంది. ఈ పనులు పూర్తయితే కడప - కర్నూలు జిల్లాల మధ్య ప్యాసింజర్ రైలు నడవనుంది. 2012 మార్చి నాటికే పనులు పూర్తి చేసి రైళ్ల రాకపోకలు కొనసాగించాలని రైల్వే మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయినా పనులు మాత్రం మందకొడిగా సాగుతూనే ఉన్నాయి. కనీసం ఎర్రగుంట్ల - బనగానపల్లె వరకు ప్యాసింజర్ రైలు నడిపే అవకాశం ఉన్నా దీని గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. 1996-1997లో అప్పటి రైల్వే మంత్రి రాంవిలాస్పాశ్వాన్ హయాంలో రూ.167 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభం కాగా ప్రస్తుతం ఈ అంచనా రూ.470 కోట్లకు చేరింది. గత బడ్జెట్లో ఈ రైలు మార్గానికి రూ. 40కోట్ల కేటాయింపులు జరిగాయి. జిల్లాలో యర్రగుంట్ల నుంచి కర్నూలు జిల్లా సంజామల మండలం నొస్సం సమీపం వరకు లైన్ నిర్మాణం, ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, రైల్వేస్టేషన్లు, సిబ్బంది క్వార్టర్స్ పూర్తయ్యాయి. 50 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ రూపుదిద్దుకుంది. ఈ మార్గంలో యర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఉప్పలపాడు, నొస్సం, సంజామల, కోవెలకుంట్ల, బనగానపల్లె, మద్దూరు, నంద్యాల ప్రాంతాల్లో రైల్వేస్టేషన్లు ఉంటాయి. నొస్సం నుంచి నంద్యాల వరకు రైల్వేలైన్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. క్రాసింగ్ వంతెనలు, స్టేషన్ల నిర్మాణంలో పురోగతి అటకెక్కింది. నొస్సం నుంచి బనగానపల్లె మండలంలోని పండ్లాపురం వరకు ఎర్త్ పనులు పూర్తికాలేదని సమాచారం. జుర్రేరు, పాలేరు, కుందూ నదులపై వంతెనలతో పాటు, 45 లెవల్ క్రాసింగ్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇవన్నీ పూర్తికావాలంటే రెండేళ్లు పడుతుందని రైల్వే వర్గాలు అంటున్నాయి. కోవెలకుంట్ల వరకు పూర్తి చేసిన 82 కిలోమీటర్ల రైల్వేలైనులో పలుమార్లు ట్రయల్న్ ్రవిజయవంతంగా నిర్వహించారు. దాల్మియా కోసం.. ఎర్రగుంట్ల - నంద్యాల మధ్య ప్యాసింజర్ రైలు వస్తుందని గత నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రాంతవాసులు ఆశపడ్డారు. అయితే ప్యాసింజర్ రైలు రాలేదు గాని దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం కోసం రైల్వే అధికారులు గూడ్స్రైలు నడుపుకోవటానికి అనుమతులు ఇచ్చారు. దీంతో అప్పుడప్పుడు ఈప్రాంత వాసులకు గూడ్స్రైలు దర్శనమిస్తోంది. మరి ప్యాసింజర్ రైలు ఎప్పుడు వస్తుందోననే ఆతృతతో ప్రజలు ఎదురుచూస్తున్నారు. -
సోనాక్షి డ్రీమ్!
పెద్ద పెద్ద స్టార్స్తో సినిమాలు చేస్తున్నా... బాలీవుడ్ అందాల భామ సోనాక్షి సిన్హాకు తీరని కల ఒకటుందట. రీసెంట్గా ఆ కల నెరవేరిందని ఈ సొగసరే చెప్పుకుంది. బిగ్స్క్రీన్పై సల్మాన్తో అరంగేట్రం కంటే పెద్ద డ్రీమేముంటుంది హీరోయిన్ కావాలనుకుంటున్న ఏ భామకైనా! కానీ... సోనాక్షి అసలు కోరిక మాత్రం తాజాగా కాస్మోపాలిటన్ ఇండియా మ్యాగజైన్ కవర్పేజీపై వచ్చిన తన ఫొటోతో తీరిందట. ‘ఆ మ్యాగజైన్కు థ్యాంక్స్. అది కేవలం ఫొటోనే అయినప్పటికీ... కనీసం అలాగన్నా నా డ్రీమ్ నెరవేరింది’ అంటూ సదరు క్లిక్ను పోస్ట్ చేసింది సోనాక్షి. ఈ ఫొటోలో ఈ వయ్యారి రాక్స్టార్లా డ్రమ్స్ వాయిస్తుంటుంది. ఇంతకీ అమ్మడి అసలు కల... రాక్స్టార్ కావాలనా? టాప్ డ్రమ్మర్ అవ్వాలనా! -
ఆ కల నన్ను భయపెడుతుంటుంది!
‘‘ఆ కల వస్తే చాలు.. ఇక ఆ తర్వాత నా కంటి మీద కునుకు ఉండదు. ఆ రోజంతా ఆ భయం నన్ను వెంటాడుతుంటుంది’’ అని చెప్పారు తమన్నా. ఈ రేంజ్లో చెబుతున్నారంటే తమన్నా కలలో ఏ దెయ్యాలో, భూతాలో కనిపిస్తున్నాయేమో.. లేకపోతే అయినవాళ్లకు ఏదో అయినట్లుగా కలలు వస్తున్నాయేమో... ఇలా రకరకాల ఊహలు కలగడం సహజం. కానీ, తమన్నాకి వచ్చిన కల చాలా సింపుల్. ఈ కల గురించి తెలుసుకుంటే దీనికి ఇంత భయపడాలా? అని ఎవరైనా నవ్వేస్తారు. ఇంతకీ ఆ కల ఏంటో తెలుసా? జుత్తు ఊడిపోయినట్లుగా కల వస్తుంటుందట. దాని గురించి తమన్నా చెబుతూ -‘‘ఇంకా నేను మూడు పదుల వయసు కూడా టచ్ కాలేదు. అప్పుడే జుత్తు ఊడిపోదని నాకు తెలుసు. కానీ, ఆ కల వస్తే చాలు భయపడిపోతుంటాను. ఎందుకంటే.. ఓ వ్యక్తి అందంలో కురులకు చాలా ప్రాధాన్యం ఉంటుంది’’ అన్నారు. మహా అయితే ఇంకో నాలుగైదేళ్లల్లో 30వ పడిలోకి అడుగుపెట్టేస్తారు కదా.. అప్పుడు జుత్తు సంగతెలా ఉన్నా.. మూడు పదుల్లో ఉన్న తారలకు అవకాశాలు తగ్గుతాయేమో? అనే ప్రశ్న తమన్నా ముందుంచితే -‘‘ట్వంటీస్లో ఉన్న తారల కోసం పాత్రలు రాసినట్లుగా థర్టీస్లో ఉన్నవాళ్లకి రాయరు. ఆ సంగతలా ఉంచితే.. 30 ఏళ్లకు చేరుకున్న తర్వాత చాలామంది హీరోయిన్లు పెళ్లి చేసుకుని, సెటిల్ కావాలనుకుంటున్నారు. అలాంటివాళ్లు అవకాశాల గురించి ఆలోచించరు’’ అని చెప్పారు. -
అరెరే... పై నుంచి కింద పడ్డారా!
స్వప్నలిపి దిగ్గున... నిద్రలో నుంచి లేచి కూర్చుంటాం. నుదుటికి పట్టిన చెమటలు ‘కల’ తీవ్రతను తెలియజేస్తాయి. ‘‘హమ్మయ్య...నాకు ఏమీ కాలేదు’’ అనుకోవడం కంటే ఆ కలనే ఎక్కువగా గుర్తు చేసుకుంటాం. డాబా మీది నుంచో, కొండ మీది నుంచో లేదా ఎత్తై ప్రదేశం నుంచో జారి కిందపడడం అనేది చాలా ఎక్కువమందికి వచ్చే కల. ఈ కలకు సంబంధించిన కొన్ని వివరణలు తెలుసుకుందాం: జీవితం అనేది మనదే అయినప్పటికీ అది కొన్నిసార్లు మన చేతుల్లో ఉండదు. చేజారిపోతున్న జీవితాన్ని ఒక పద్ధతిలో పెట్టడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నా... ఫలించే ఆశ ఏదీ కనిపించదు. ఇలాంటి పరిస్థితులలో నిరాశానిస్పృహలు చుట్టుముడతాయి. ఈ స్థితిని ప్రతిబించించేదే... చాలా ఎత్తు నుంచి పడి పోతున్నట్లుగా వచ్చే కల.వెనక నుంచి ఎవరో తోస్తే కిందపడిపోయినట్లు కల వస్తుంటుంది కొన్నిసార్లు. నమ్మినవాళ్లు, ఆత్మీయులు అనుకున్నవాళ్ల ఉన్నట్టుండి మోసం చేయడాన్ని లేదా ఇబ్బందులకు గురి చేయడాన్ని ఈ కల ప్రతిబింబిస్తుంది.కొండ చివర వేలాడుతూ, ఏ క్షణాన కింద పడతామో తెలియని భయంలో కొట్టుమిట్టాడుతున్నట్లు కల రావడం అనేది, కుటుంబం, వ్యాపారం, ఉద్యోగం... ఏదైనా కావచ్చు పరిస్థితుల మీద పట్టు తప్పిన విషయాన్ని సూచిస్తుంది. కష్టకాలంలో ఆత్మవిశ్వాసం లోపించడం, వ్యక్తిగత సంబంధాల్లో పెను మార్పులు రావడాన్ని సూచిస్తుంది. మీతో పాటు ఎవరైనా కింద పడినట్లు కల వస్తే... ఇద్దరూ ఒకేలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారని అర్థం. జీవితంలో వివిధ సందర్భాల్లో కొన్ని ప్రమాద సంకేతాలు అందుతుంటాయి. జాగ్రత్త పడడం వల్ల ఆ ప్రమాదం నుంచి బయటపడడం అనేది ఒక విధానం. అలా కాకుండా... ప్రమాదం పొంచి ఉందని తెలిసినా ఏం చేయాలో తోచని గందరగోళస్థితిలో కూడా చాలా ఎత్తు నుంచి కిందపడబోతున్నట్లు కలలు వస్తుంటాయి. -
ఛల్ ఛల్ గుర్రం... కలలో గుర్రం!
స్వప్నలిపి గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు, గుర్రంతో కలిసి ఈత కొడుతున్నట్లు, గుర్రం పరుగెడుతున్నట్లు...ఇలా రకరకాలుగా మీ కలలో గుర్రం ఎప్పుడైనా కనిపించిందా? అలా కనిపించడం వెనకాల ఉన్న అర్థం ఏమిటో తెలుసుకుందాం... గుర్రం అనేది హుందాతనానికి, శక్తిసామర్థ్యాలకు ప్రతీక.కలలో గుర్రం కనిపించడం అనేది విస్తృత పరిధిలో సానుకూల ఆలోచనలను ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా స్వాతంత్య్రం, అధికారం, లైంగిన స్వేచ్ఛ తదితర భావాలకు కలలో గుర్రం ప్రతీకగా నిలుస్తుంది. వివిధ సందర్భాలు, సన్నివేశాలను బట్టి కూడా కలల అర్థాలు మారుతుంటాయి. శ్వేత గుర్రం మీద స్వారీ చేస్తున్నట్లు కల వస్తే... మీరు ఆర్థికంగా, మానసికంగా ఆనందంగా ఉన్నారని, కుటుంబ బంధాలు గట్టిగా ఉన్నాయని అర్థం. భూమి మీద ఏ వస్తువునైనా తాకి ఉన్నట్టుండి ఆ శ్వేత గుర్రం పడబోయినట్లు కల వస్తే... మీ సుఖసంతోషాల పట్ల మీ శత్రువులో, మిత్ర శత్రువులో ఈర్ష్యాద్వేషాలతో ఉన్నారనేది ఒక అర్థం. రెండోది... సజావుగా సాగుతున్న మీ జీవితంలోకి ఊహించని మార్పు ఏదో వచ్చి, అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లు రెండో అర్థం. నల్లగుర్రం మీద స్వారీ చేస్తున్నట్లుగా కల వస్తే... ఆర్థిక పరంగా మీరు ఉన్నతస్థితిలో, ఏ లోటు లేని స్థితిలో ఉన్నా... మానసికంగా మాత్రం ఎక్కడో అసంతృప్తితో ఉండడాన్ని లేదా జీవనోత్సాహం తగ్గడాన్ని సూచిస్తుంది. వర్తమాన జీవితంలో ప్రతికూల ప్రభావం చూపే గత చేదు జ్ఞాపకాలను కూడా ఈ కల ప్రతిబింబిస్తుంది. గుర్రాలు పోట్లాడుకుంటున్నట్లుగా కల వస్తే... మీ సన్నిహితులతోనో, స్నేహితులతోనో విభేదాల వల్ల కలిగే మానసిక అశాంతిని సూచిస్తుంది. పరుగెడుతున్న గుర్రం వెనకాల పరుగెత్తి దాన్ని అందుకొని సవారీ చేయాలనుకునే కల వస్తే... మీరు లేనిపోని ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారని, రిస్క్ చేస్తున్నారని అర్థం. నీటిలో మీతో పాటు గుర్రం ఈత కొడుతున్నట్లు కల వస్తే... మీరు కోరుకున్నవి నిజమైనట్లు అర్థం. ఇదే కల ఒక వాప్యారస్థుడికి వస్తే వ్యాపారంలో భారీ లాభం గడించబోతున్నట్లు, లేదా గడించినట్లు అర్థం. -
కలలో చిలుకా... కాస్త చెప్పవా!
స్వప్నలిపి చిలకది చూడచక్కని రూపం. ఏ చెట్టుపైనో చిలకను చూసీ చూడగానే ‘ఆహా’ అనుకుంటాం. మరి కలలో కనిపిస్తే? ‘ఆహా’ అనడం మాట అలా ఉంచి, కాస్త ఆలోచించాల్సిందే అంటున్నారు స్వప్నవిశ్లేషకులు. వారి విశ్లేషణల్లో కొన్ని... చిలక మీ కలలో కనిపించింది అంటే, మీరు చేయకూడని వారితో స్నేహం చేస్తున్నారని అర్థం. చిలక ఈకలు కలలో కనిపించడం అనేది... మీకు ఉన్న స్నేహితులలో బూటకపు స్నేహితులు, పక్కదారి పట్టించే స్నేహితులు ఎక్కువ ఉన్నారనేదాన్ని ప్రతిబింబిస్తుంది. ‘పంజరంలో చిలక’ కలలో కనిపిస్తే ... మీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని పక్కదోవ పట్టిస్తున్నాయని లేదా ఊపిరి సలపని పనితో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అర్థం. చిలక మిమ్మల్ని కొరికినట్లు కల వస్తే... మిమ్మల్ని చూసి కొందరు ఈర్ష్యపడుతున్నారని అర్థం. వేరే వాళ్లను చిలక కొరికినట్లు కల వస్తే... ఏదో విషయంలో ఆ వ్యక్తిని మీరు అప్రతిష్ఠపాలు చేస్తున్నట్లు అర్థం. రెక్కలు దెబ్బతిన్న చిలక... ఎగరలేక ఇబ్బంది పడుతున్న దృశ్యం మీ కలలోకి వస్తే, మీరు మార్పు కోరుకుంటున్నప్పటికీ, ఆ మార్పుకు అవసరమైన పరిస్థితులు మీకు అనుకూలంగా లేవని అర్థం. ఏం మాట్లాడినా...వల్లె వేసే చిలక కలలోకి వస్తే... మీకంటూ సొంత అభిప్రాయం లేకుండా ఉన్నారని, ఎవరు ఏది చెప్పినా దాన్ని గుడ్డిగా సమర్థించడం తప్ప, వాస్తవ ప్రాతిపాదికగా మీరు అభిప్రాయ ప్రకటన చేయడం లేదని అర్థం చేసుకోవాలి. చేతిపైన చిలక వచ్చి కూర్చున్నట్లు యువతులకు కల వస్తే వారి ప్రేమ ఫలించడానికి సూచనగా అర్థం చేసుకోవాలి. -
అమ్మాయే.. కలలో కాదు 'కళ'లో..!!
-
నగరంపై వ్యాధుల పంజా
వారం రోజులో డెంగీతో ముగ్గురు మృతి విస్తరిస్తున్న స్వైన్ ఫ్లూ వైరస్ సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్పై సీజనల్ వ్యాధులు మళ్లీ పంజా విసురుతున్నాయి. వర్షాకాలం ఆరంభం కావడంతో డెంగీ, మలేరియా, స్వైన్ ఫ్లూ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వారం రోజుల్లోనే డెంగీతో ముగ్గురు మృతి చెందడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మృతుల్లో యాకుత్పుర బాలాజీనగర్కు చెందిన స్వప్న(23), నందనవనం ఆదర్శ్నగర్లో ప్రశాంత్(28)తో పాటు జీడిమెట్లకు చెందిన మరో వ్యక్తి ఉన్నారు. మృతుడు ప్రశాంత్ పిల్లులు సందీప్(3), సింధూజ(4)కు ఓవైసీ ఆస్పత్రిలో చికిత్స అందించి, రెండు రోజుల క్రితం డిశ్చార్జ్ చేయగా, మున్నా(7) నిలోఫర్లో చికిత్స పొందుతున్నాడు. పేదల బస్తీల్లో డెంగీ, మలేరియా దోమలు స్వైర విహారం చేస్తున్నా అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. చాపకింద నీరులా ‘స్వైన్ ఫ్లూ’ నాలుగేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన స్వైన్ఫ్లూ వైరస్ నగరంలో మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు తొమ్మిది కేసులు నమోదు కాగా, కేవలం పదిహేను రోజుల్లోనే ఏడుగురు బాధితులు గాంధీ ఆస్పత్రిలో చేరడం సర్వత్రా చర్చ నీయాంశంగా మారింది. తీవ్రమైన జర్వం, దగ్గు, తలనొప్పితో బాధపడుతున్న వారిని అనుమానిత స్వైన్ఫ్లూ కేసుగా భావించి చికిత్స అందించారు. వీరి నుంచి రక్తనమూనాలు సేకరించి ల్యాబ్కు పంపగా, బాధితుల్లో ఒకరికి స్వైన్ఫ్లూ ఉన్నట్లు ఇప్పటికే నిర్ధారణ అయింది. మునుపెన్నడూ లేని విధంగా ఒకే రోజు భిన్న వాతావరణం నెలకొనడంతో స్వైన్ఫ్లూ కారక వైరస్ వ్యాప్తికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉన్నట్టుండి వాంతులు, విరేచనాలు, గొంతు నొప్పి, ఒంటిపై బొబ్బలు, తీవ్రమైన జ్వరం, ముక్కు దిబ్బడ, ముక్కు నుంచి నీరు కారడం, ఒళ్లు నొప్పులు, వంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే ఫ్లూగా అనుమానించి, వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. దోమల స్వైరవిహారం.. వర్షాల వల్ల నివాసాల మధ్య మురుగు నీరు నిల్వ ఉండటంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. దోమల నియంత్రణకు బస్తీల్లో ఫాగింగ్ కూడా చేయక పోవడంతో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పగలే కాదు అర్ధరాత్రి కరెంట్ సరఫరా నిలిపివేస్తుండడంతో ఇంట్లో ఫ్యాన్లు పని చేయకపోవడం లేదు. ముఖ్యంగా మూసీ పరివాహాక ప్రాంతాలైన కూకట్పల్లి, లోయర్ట్యాంక్ బండ్, అంబర్పేట్, సుల్తాన్బజార్, ముసారంబాగ్, మలక్పేట్, కొత్తపేట్, నాగోలు, ఉప్పల్, రామంతాపూర్, గోల్నాక, ఉస్మానియా క్యాంపస్, తదితర బస్తీల్లో దోమల బెడద ఎక్కువగా ఉంది. -
లార్డ్స్ డబుల్ సెంచరీ
క్రికెట్ మక్కా... లార్డ్స్ మైదానం గురించి చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు. ప్రపంచంలో ప్రతి క్రికెటర్కీ కనీసం ఒక్కసారైనా అక్కడ ఆడాలనేది కల. ప్రతి క్రికెట్ అభిమానికీ అక్కడ మ్యాచ్ చూడటం ఓ ఆశ. ఎందుకంటే ఇది క్రికెట్కు పుట్టినిల్లు. చరిత్రలో అత్యంత పురాతనమైన మైదానం కూడా ఇదే. ఎన్నో రికార్డులకు, క్రికెట్లో మరెన్నో మార్పులకు వేదికైన లార్డ్స్ మైదానం ఇప్పుడు మరో ఘనతను సొంతం చేసుకోబోతోంది. 1814లో స్థాపించిన ఈ గ్రౌండ్కు ఇప్పుడు 200 ఏళ్లు పూర్తి కానున్నాయి. అక్కడ ఆడటం ఓ కల లార్డ్స్ మైదానంలో 1814 జూన్ 22న మెరిల్బోన్ క్రికెట్ క్లబ్, హెర్ట్ఫోర్డ్షైర్ మధ్య తొలి మ్యాచ్ జరిగినట్లుగా చెబుతుంటారు. అయితే తొలి అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ జరిగింది మాత్రం 1884లోనే. జూలై 21న లార్డ్స్లో ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. ఇప్పటిదాకా లార్డ్స్ 127 టెస్టు మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చింది. ఇక్కడ 55 వన్డేలు, 8 టి20 మ్యాచ్లు జరిగాయి. ఇక ప్రతీ క్రికెటర్ తన కెరీర్లో కనీసం ఒక్కసారైనా ఇక్కడ ఆడాలని..ఇదే మైదానంలో వ్యక్తిగతంగా సత్తా చాటి మధురానుభూతులను సొంతం చేసుకోవాలని కలలుకంటారు. కానీ ఈ మైదానం అందరికీ మధురానుభూతులను పంచలేదు. కొందరు మాత్రమే ఈ మైదానంలో సత్తా చాటడం ద్వారా తమ కలను నెరవేర్చుకున్నారు. ఇక్కడ టెస్టుల్లో సెంచరీ చేసే బ్యాట్స్మెన్ పేరును అలాగే ఒక ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు, టెస్టు మ్యాచ్లో పది వికెట్లు తీసే బౌలర్ పేరును డ్రెస్సింగ్ రూమ్లో బోర్డుపై రాయడం ఆనవాయితీగా వస్తోంది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన క్రికెట్ జీవితంలో లార్డ్స్లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. అయితే అజిత్ అగార్కర్ తన టెస్టు కెరీర్లో చేసిన ఏకైక సెంచరీ ఇక్కడే నమోదు చేయడం విశేషం. ఇక వన్డేల్లో ఇక్కడ ఏ ఒక్క భారత బ్యాట్స్మెన్ కూడా సెంచరీ చేయలేకపోయాడు. ఆ పేరు వెనక... ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) కార్యకలాపాలు లార్డ్స్ మైదానం నుంచే నడుస్తున్నప్పటికీ ఈసీబీ మాత్రం ఈ మైదానంలో కిరాయిదారు మాత్రమే. ప్రపంచంలో పురాతన క్రికెట్ గ్రౌండ్ అయిన లార్డ్స్కు యజమాని మెరిల్బోన్ క్రికెట్ క్లబ్. ఈ మైదానం వ్యవస్థాపకులు థామస్ లార్డ్. అతను ఇంగ్లిష్ ప్రొఫెషనల్ క్రికెటర్. అతని పేరే ఈ మైదానానికి పెట్టారు. ఇంగ్లండ్ రాజధాని లండన్లోని సెయింట్ జాన్స్ వుడ్ ప్రాంతంలో ఉంది. ప్రముఖ క్రికెట్ మ్యూజియం లార్డ్స్లోనే ఉంది. ఐసీసీ ప్రధాన కార్యాలయం 2005లో దుబాయ్కి మార్చకముందు ఇక్కడే ఉండేది. ఇప్పటికీ అదే పెవిలియన్ 200 ఏళ్ల చరిత్ర ఉన్న లార్డ్స్లో ఇప్పటిదాకా ఎన్నో మార్పులు జరిగాయి. కాలానుగుణంగా ఈ మైదానం మారుతూ వచ్చింది. అయితే 1889-90లో ఇక్కడ నిర్మించిన పెవిలియన్ (విక్టోరియన్ ఎరా పెవిలియన్) ఇప్పటికీ అలాగే ఉంది. స్టేడియం రూపురేఖలు మారినా ఈ పెవిలియన్ మాత్రం అలాగే ఉంది. ప్రపంచకప్ విజేత అయినా... యాషెస్ సిరీస్ విన్నర్ అయినా... లేక మరే సిరీస్ గెలిచినా... లార్డ్స్ పెవిలియన్లో షాంపేన్ విరజిమ్మడాన్ని గర్వంగా భావిస్తారు. అంతేకాదు ఆ మధురానుభూతిని ఎప్పటికీ మరిచిపోరంటే అతిశయోక్తి కాదేమో. 1983లో ప్రుడెన్షియల్ ప్రపంచకప్ను కపిల్దేవ్ అందుకున్న మధుర జ్ఞాపకాలు ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటాయి. -
సంగీత వంశీ
కళ ఒక సంగీత దర్శకుడిగా ఎక్కువకాలం నిలబడాలంటే, సంగీతం మీద పిపాస, మంచి ట్యూన్స్ చేయాలనే ఆసక్తి, వృత్తి పట్ల నిబద్ధత, దీక్ష, కృషి, పట్టుదల ఇవన్నీ ఉండితీరాలి. వంశీకి ఇటువంటి బలమైన కోరికలు ఉంటే, ఉత్తమసంగీత దర్శకుడు అవడానికి అంతకన్నా ఇంకేం కావాలి. మ్యూజిక్... వెస్ట్రన్... రాక్... పాప్... నేటి తరానికి ఇదొక ప్యాషన్... ఇంటర్నెట్లో మ్యూజిక్ నోట్స్ డౌన్లోడ్ చేసుకుంటూ... వాద్యపరికరాలను కూడా అందులోనే తీసుకుంటూ... స్వయంగా సంగీత దర్శకత్వం చేస్తున్నారు... పట్టుమని పాతికేళ్లు కూడా నిండకుండానే సంగీత ప్రపంచంలో... చిన్నదో పెద్దదో... తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకుంటున్నారు. లఘుచిత్రాలతో కెరీర్ ప్రారంభించి... చలనచిత్రాల స్థాయికి ఎదుగుతున్నారు... ‘ఓ సఖీ’ ఆల్బమ్ (టాప్ టెన్లో ఉంది) తో 2011లో సంగీత జీవితం ప్రారంభించి, చలనచిత్రాలకు అసిస్టెంట్ డెరైక్టర్గా చేసే స్థాయికి ఎదిగాడు వంశీ. ‘‘నాకు చిన్నప్పటి నుంచి కీబోర్డ్ అంటే చాలా ఇష్టం. కీబోర్డులో సరిగమల అభ్యాసానికి నాన్నగారే శ్రీకారం చుట్టారు. నాకు చదువు మీద అంతగా శ్రద్ధ లేదు. అందువల్ల చదువు మానేసి హైదరాబాద్ వచ్చాను. హిందుస్థానీ, పాశ్చాత్యం... ఈ రెండు సంప్రదాయ సంగీతాలనూ నేర్చుకున్నాను. సంగీతంతో పాటు డిజిటల్ రికార్డింగ్, మ్యూజిక్ ప్రొడక్షన్ నేర్చుకున్నాను. సంగీతం మీద ఉన్న అభిరుచి కొద్దీ, కొద్దిమంది మిత్రులతో కలసి ‘వేవ్ బ్యాండ్’ అని ఒక మ్యూజికల్ బ్యాండ్ ఏర్పాటుచేశాను’’ అంటూ వంశీ తన సంగీత ప్రయాణాన్ని వివరించారు. ‘పెళ్లి పుస్తకం’ లోని పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది’’ అంటున్న వంశీ యూ ట్యూబ్లో ప్రముఖుల సంగీత కచ్చేరీలు చూసి పరిజ్ఞానం పెంచుకుంటున్నారు. ఇప్పటి వరకు అనేక చలనచిత్రాలకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశాడు. కొన్ని చిత్రాలకు అసిస్టెంట్గానూ చేశాడు. ఒక పక్కన సంగీతం నేర్చుకుంటూనే మరో పక్క అతి కష్టం మీద పదవ తరగతి పూర్తి చేశాడు. ‘స్వామిరారా’, ‘ఉయ్యాలా జంపాలా’ వంటి చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిన సన్నీ దగ్గర అసిస్టెంట్ ఆడియో ఇంజనీర్గా కొన్ని నెలలు పనిచేశాక, తాను చేస్తున్న పని పట్ల అంత సంతృప్తి కలగలేదు. ‘‘కీ బోర్డు నేర్చుకోవాలనే కోరిక నానాటికీ పెరుగుతూ వచ్చింది. దాంతో ఉద్యోగం వదిలేసి, పూర్తి సమయాన్ని కీ బోర్డు నేర్చుకోవడం కోసం కేటాయించాను’’ అని చెబుతాడు వంశీ. సినిమా సంగీతానికి ఎంతో అవసరమైన పాశ్చాత్య సంప్రదాయ సంగీతం తనకు తానుగా నేర్చుకున్నారు. పెద్దపెద్ద సంగీత దర్శకుల దగ్గర కీబోర్డు ప్లేయర్గా పనిచేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో... ఋషి, కెమిస్ట్రీ, సరదాగా అమ్మాయితో, రొమాన్స్, నువ్వలా నేనిలా, పట్టపగలు... చలనచిత్రాలకు నేపథ్య సంగీతం అందించారు. ‘‘పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే మంచి సంగీతం చేయాలి. నా వరకు నేను మెలొడీలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నాను. సంగీతం, సాహిత్యం, ఆర్కెస్ట్రా... ఒకదాన్ని ఒకటి డామినేట్ చేయకుండా ఉండేలా చూస్తున్నాను. ఆర్కెస్ట్రా తగ్గించి, భావం అర్థమయ్యేలాగ చేస్తున్నాను’’ అని చెప్పే వంశీకి ఇళయరాజా అంటే చాలా ఇష్టం. పరోక్షంగా ఆయన ప్రభావం తన మీద ఉందనీ, త్వరలోనే తనకు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చేలాంటి పాటలు చేస్తానని అంటున్నారు. సంగీతం చేస్తున్నప్పుడు అందరితోనూ స్నేహంగా ఉంటూ తనకు కావలసిన విధంగా వాళ్ల దగ్గర నుంచి రాబట్టుకుంటున్నారు. ఎంఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వచ్చిన జనగణమన, పెళ్లి పుస్తకం, ప్రేమపకోడీ, హూ ఆర్ దే? పొసెసివ్నెస్, మధురమే, చిట్టితల్లి... లఘుచిత్రాలకు సంగీతం చేశారు వంశీ. ‘‘పెళ్లిపుస్తకం’ పాటకు 2.5 లక్షల హిట్స్ వచ్చాయి. నాకు మంచి పేరు కూడా వచ్చింది’’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు వంశీ. - డా. వైజయంతి -
ఎవరో వెంటాడుతున్నారా?
స్వప్నలిపి ప్రపంచ వ్యాప్తంగా సాధారణంగా వచ్చే కల....మనల్ని ఎవరో వెంటాడడం. ‘‘నాకెవరూ శత్రువులు లేరు...ఎందుకిలాంటి కల వచ్చింది?’’ అని కొందరు, ‘‘గత జన్మలో నా శత్రువులెవరైనా ఇలా వెంటాడుతున్నారా?’’ అని మరికొందరు ఆలోచిస్తుంటారు. నిజానికి ఆ శత్రువులు మనలోనే ఉన్నారు. ‘‘ఎగ్జామ్స్ దగ్గరపడుతున్నాయి. అయ్యో! అసలేమీ ప్రిపేర్ కాలేదు’’ ఒక స్టూడెంట్ భయం ఇది. ఆ భయానికి పెద్ద మీసాలు వస్తాయి. కండలు వస్తాయి. ఆ భయం ఒక రౌడీలా తయారై కలలోకి వస్తుంది. ‘‘అప్పు అంతకంతకూ పెరిగిపోతుంది. ఎలా తీర్చాలిరా దేవుడా’’ ఇది ఒక మిడిల్ క్లాస్ సుబ్బారావు ముందస్తు ఆందోళన. ఆ ఆందోళన అనకొండగా మారి మన అంతఃచేతనలోకి వెళ్లిపడుకుంటుంది. సమయం చూసి వెంటాడుతుంది. మనల్ని నిద్రలో పరుగెత్తించే శక్తులు రకరకాలుగా ఉంటాయి. మనం భయపడే విషయాలు, ఒప్పుకోవడానికి మనస్కరించని వాస్తవాలు, రాజీపడేలా నడిపించే పద్ధతులు, నచ్చని వాటిని నచ్చినట్లు తలకెత్తుకునే బరువులు...ఇవన్నీ రకరకాల రూపాలు ధరించి కలలో మనల్ని వెంటాడుతుంటాయి. అంతేతప్ప పూర్వజన్మకు ఈ కలకు ఎలాంటి సంబంధం లేదు. -
పెళ్లి రోజే.. మహిళ బలవన్మరణం
* వరకట్న వేధింపులు భరించలేక ఆత్మహత్య * విచారణ చేపట్టాలని పోలీసులకు మృతురాలి తండ్రి ఫిర్యాదు వెంకటాపురం, న్యూస్లైన్ : పెళ్లిరోజు వేడుకలు నిర్వహించుకోవాల్సిన ఆ ఇల్లాలు ఆదనపుకట్నం వేధింపులకు బలైపోయింది. భర్త వేధింపులు భరించలేక పెళ్లి రోజునే క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని వెలుతుర్లపల్లిలో సోమవారం జరిగింది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. వెలుతుర్లపల్లి గ్రామానికి చెందిన తౌట్పర్తి ప్రవీణ్రావుకు, గోదావరిఖనికి చెందిన వెలిశాల స్వప్న(27)తో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వారి దాంపత్య జీవితంలో కుమారులు వర్షిత్, అర్జున్ జన్మించారు. పెళ్లయిన మూడేళ్ల తర్వాత ప్రవీణ్రావు ఆదనపు వరకట్నం కావాలని స్వప్నను వేధించడం మొదలుపెట్టాడు. పెద్ద మనుషుల సమక్షంలో పలుసార్లు పంచాయితీ నిర్వహించినా అతడిలో మార్పు రాలేదు. దీంతో స్వప్న ప్రవీణ్రావుపై గోదావరిఖని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి పంపించివేశారు. అయినా వేధిస్తుండడంతో స్వప్న ఏడాదిపాటు తల్లిగారింటివద్దనే ఉంది. ఆ తర్వాత పెద్దమనుషులు పంచాయితీ నిర్వహించి స్వప్నను అత్తగారింటికి పంపించారు. కట్నం కోసం కుటుంబంలో తర చూ గొడవలు జరుగుతుండేవని బంధువులు పేర్కొన్నారు. ఆదివారం మేడారం జాతరకు స్వప్న, ప్రవీణ్రావుతోపాటు కుటుంబసభ్యులు వెళ్లి రాత్రి తిరిగి వచ్చారు. మేడారంలో దంపతుల మధ్య గొడవ జరిగిందా లేదా కట్నం కోసం కుటుంబ సభ్యులు రాత్రివేళ వేధింపులకు గురిచేశారో తెలియదుకాని సోమవారం పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవాల్సిన స్వప్న తెల్లవారుజామునే నిద్రలేచి క్రిమిసంహారక మందు తాగింది. కుటుంబ సభ్యులు స్వప్నను ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందింది. తన కూతురు ఆత్మహత్యపై తమకు అనుమానాలు ఉన్నాయని, విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరు తూ మృతురాలి తండ్రి రాజేశ్వర్రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
నవయువం : కలలే ఆమె విజయానికి సోపానాలు..!
ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన 14 యేళ్ల అమ్మాయికి, ఒక ఫైన్ మార్నింగ్ ‘‘నాకూ ఒక కారు ఉంటే బావుంటుంది కదా..’’ అనే ఆలోచన వచ్చింది. కొన్ని రోజుల్లోనే అది ఆశగా మారి.. బలీయమైన కోరిక అయ్యింది. అలాంటప్పుడు దాన్ని సాధించినట్టుగా ఒక కలగనడమో లేక జీవితంలో ఏదో ఒక దశకు చేరేసరికి దాన్ని సాధించాలనే దీర్ఘకాలిక ఆశయాన్ని పెట్టుకొని మిన్నకుండి పోవడమో సులభమైన పరిష్కారమార్గాలు. అయితే ఇసబెల్లా ఇలాంటి పరిష్కారాలను కోరుకోలేదు. సొంత కారులో ధీమాగా కూర్చోవడమే కరెక్ట్ అనుకుంది. దాన్ని సాధించడం కోసం తన వద్దనున్న మార్గాల గురించి ఆలోచన మొదలెట్టింది.. తర్వాత ఏం జరిగిందంటే... ఇసబెల్లా కలలు నిద్రలో వచ్చినవి కాదు, నిద్రను లేకుండా చేసేవి. ఒక ఇంట్లో బేబీ సిట్టర్గా పనిచేసి సంపాదించుకున్న 350 డాలర్లతో ఇసబెల్లా బిజినెస్ మొదలైంది. తన సొంత ఐడియాతో కొన్ని గోల్డెన్ లాకెట్లను డిజైన్ చేయించి వాటిని స్నేహితురాళ్లకు అమ్మసాగింది. ఇసబెల్లా డిజైన్లకు ఆమె స్నేహితురాళ్లంతా ఫ్లాటయ్యారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించగల చేవ ఉంటే కుటుంబ నేపథ్యం అవసరం లేదు.. పెద్ద పెద్ద చదువులు అబ్బాల్సిన పనిలేదు. ప్రతి ఒక్కరికీ ఆశలు, కోరికలతో పాటు ఐడియాలు కూడా పుడతాయి. అలాంటి ఐడియాలతో చొచ్చుకుపోయే సామర్థ్యం ఉంటే చాలు. లక్ష్యాన్ని సాధించడం, కలలను నిజం చేసుకోవడం పెద్ద విషయం కాదని నిరూపిస్తోంది ఇసబెల్లా వూమ్స్. ‘‘ఉన్నతస్థానం దిశగా నా ప్రయాణం కలలతోనే మొదలైంది. జీవితంలో అనుభవించాలనుకున్న సౌకర్యాలు నా చేత కష్టపడేలా చేశాయి’’ అంటోంది ఈ టీనేజర్. అయితే ఇసబె ల్లా కలలు నిద్రలో వచ్చేవి కాదు, నిద్రను లేకుండా చేసేవి. ఒక ఇంట్లో బేబీ సిట్టర్గా పనిచేసి సంపాదించుకొన్న 350 డాలర్లతో ఇసబెల్లా బిజినెస్ మొదలైంది. తన సొంత ఐడియాతో కొన్ని గోల్డెన్ లాకెట్లను డిజైన్ చేయించి వాటిని స్నేహితురాళ్లకు అమ్మసాగింది. ఇసబెల్లా డిజైన్లకు ఆమె స్నేహితురాళ్లంతా ఫ్లాటయ్యారు. అయితే దాన్ని ఆమె కేవలం తన పాకెట్మనీ కోసమో, తాత్కాలిక ఖర్చుల సంపాదనా మార్గం కోసమో పరిమితం చేసుకోవాలని అనుకోలేదు. ఆ మార్గంలోనే మరింతగా కష్టపడితే తను సక్సెస్ కాగలను అనే విశ్వాసంతో ముందుకు వెళ్లింది. లాకెట్ల వ్యాపారానికి నవ్యతను జోడించింది. ఔత్సాహిక డిజైనర్ల దగ్గర ఉన్న డిజైన్లను కొనుగోలు చేసి.. వాటి రూపంలో లాకెట్లను రూపొందించి అమ్మకాలు మొదలు పెట్టింది. చాలా మందికి నగల డిజైనింగ్లో ప్రావీణ్యత ఉన్నప్పటికీ ఆ డిజైన్లను మార్కెటింగ్ చేసుకొనే అవకాశం ఉండదు అనే విషయాన్ని గ్రహించి ఇసబెల్లా డిజైనర్ల నుంచి రకరకాల డిజైన్లను సేకరించి అమ్మకాలు మొదలుపెట్టింది. దీనికోసం ఒరిగమి ఓల్.కామ్ అనే వెబ్సైట్ను ప్రారంభించింది. ఈ పేరులోనే ఇసబెల్లూ వూమ్స్ క్రియేటివిటీ ఉంది. ప్రాచీన జపనీస్ కళ ఒరిగమి. కాగితాన్ని కత్తిరించకుండా, చించకుండా కేవలం మడవ టం ద్వారానే చక్కటి ఆకృతులు రూపొందించడమే ఒరిగమి. ఈ స్ఫూర్తితో తన డిజైనింగ్ కంపెనీకి ఒరిగమి అని పేరు పెట్టుకొంది. మూడేళ్లలో ఇసబెల్ల కంపెనీకి మంచి పేరొచ్చింది. విస్తృతమైన ప్రచారం వచ్చింది. ఇప్పుడు దాదాపు 50 వేలమంది డిజైనర్లు ఒరిగమీ ఓల్ కోసం పనిచేస్తున్నారు. లక్షలాది మంది కస్టమర్లున్నారు. ఫలితంగా ఇసబెల్ల కంపెనీకి కోట్ల డాలర్ల ఆదాయం వస్తోంది. 2012లో ప్రఖ్యాత ఫోర్బ్స మ్యాగజైన్ అంచనా ప్రకారం ఒరిగమి ఓల్ 24 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించింది. 2013లో ఇది దాదాపు పది రెట్లు పెరిగి 250 మిలియన్ డాలర్లకు చేరుతుందని ఫోర్బ్స్ అంచనా వేసింది. ఇప్పుడు ప్రపంచంలోని ప్రముఖ మహిళా వ్యాపారవేత్తల్లో ఇసబెల్ల్లా ఒకరు. అది కూడా ఈమె 18 యేళ్లకే ఈ స్థాయికి చేరింది. స్నేహితుల మధ్య సరదాగా మొదలుపెట్టిన బిజినెస్ ఈ స్థాయికి వచ్చిందీ అంటే అది ఇసబెల్లా తెలివితేటలకు, ఆమె చేసిన కృషికి దక్కిన ఫలితం. ఇప్పుడు ఇసబెల్లా లక్షల డాలర్లకే కాదు.. త నను ఒకనాడు ఎంతోగానో ఊరించిన లగ్జరీ కారుకు కూడా ఓనర్ అయ్యింది!