Fertilizer production
-
గార్బేజ్ ఎంజైమ్ : పండ్లు, కూరగాయ మొక్కలకు ఈ ద్రవం ఇచ్చారంటే!
కూరగాయల వ్యర్థాలను మురగ బెడితే గార్బేజ్ ఎంజైమ్ తయారవుతుంది. భూసార వర్థినిగా, పురుగుల మందుగా ఉపయోగపడుతుంది. థాయ్లాండ్కు చెందిన డాక్టర్ రోసుకాన్ పూమ్ పాన్వాంగ్ ఈ ఎంజైమ్ను తొలుత తయారు చేశారు. కూరగాయలు, పండ్ల తొక్కలు, ముక్కలు.. మార్కెట్లలో చెత్తకుప్పలో పోసిన మిగలపండిన పండ్లు, కూరగాయలు వంటివి ఎందుకూ పనికిరాని వ్యర్థాలే కదా అని అనుకోనక్కర్లేదు. వీటికి కొంచెం నల్లబెల్లం లేదా మొలాసిస్ లేదా సేంద్రియ పంచదార కలిపితే 90 రోజుల్లో గార్బేజ్ ఎంజైమ్ తయారవుతుంది.గార్బేజ్ ఎంజైమ్ తయారీ ఇలా.. మూత బిగుతుగా పెట్టడానికి వీలుండే గాజు లేదా పలాస్టిక్/ఫైబర్ డ్రమ్ముల్లో దీన్ని తయారు చేయవచ్చు. కావాల్సిన పదార్థాలు : కూరగాయలు, పండ్ల వ్యర్థాలు (తొక్కలు, ముక్కలు, కుళ్లినవి) 3 పాళ్లు + నల్ల బెల్లం లేదా మొలాసిస్ లేదా సేంద్రియ (బ్రౌన్) పంచదార 1పాలు + నీరు 10 పాళ్ల చొప్పున కలపాలి.మార్కెట్లు, దుకాణాల్లో మిగిలిపోయిన, కుళ్లిపోయిన కూరగాయలు, పండ్లను ముక్కలు చేసి వాడుకోవచ్చు. మిగిలిపోయిన అన్నం, కూరలు కూడా కలపవచ్చు. అయితే, జారుగా ఉండే గ్రేవీ కలపకూడదు. మాంసం, మందంగా ఉండే పనస పండ్ల తొక్కలు కలపకూడదు. ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్ డబ్బాలో వేసి గాలి చొరబడకుండా గట్టిగా మూత బిగించాలి. ఎండ తగలకుండా సాధారణ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచాలి. 90 రోజులకు గార్బేజ్ ఎంజైమ్ సిద్ధమవుతుంది. మొదటి 30 రోజుల పాటు.. రోజుకోసారి మూత తీసి వాయువులు బయటకు వెళ్లాక, మళ్లీ గట్టిగా మూత బిగించాలి. ఆ తర్వాత 60 రోజుల పాటు మూత తీయనక్కర్లేదు. ద్రావణం పులియటం వల్ల తెల్లటి పొర ఏర్పడుతుంది. మొత్తం 90 రోజులు గడిచాక ద్రావణాన్ని వడకట్టి, నిల్వ చేసుకొని అక్కడి నుంచి 60 రోజుల వరకు వాడుకోవచ్చు. వడపోతలో వచ్చే వ్యర్థాలను ఎండబెట్టి మొక్కలకు ఎరువుగా వాడవచ్చు లేదా మళ్లీ గేర్బేజ్ ఎంజైమ్ తయారీకి వాడుకోవచ్చు. (ఫ్యామిలీ ఫార్మింగ్ : విద్యార్థులకు ప్రకృతి సేద్య శిక్షణ)పలు ప్రయోజనాలుగార్బేజ్ ఎంజైమ్ లో ఉన్న సూక్ష్మజీవరాశి, ఔషధ గుణాలు నేలను సారవంతం చేస్తాయి. ఇది సహజ భూసార వర్థినిగా, కీటకనాశనిగా పనిచేస్తుంది. తెగుళ్లు బారి నుంచి పంటలను కాపాడుకోవచ్చు. దీన్ని వాడితే పంట మొక్కల్లో నత్రజనిని గ్రహించే శక్తి పెరుగుతుంది. గార్బేజ్ ఎంజైమ్ను నీటిలో తగినపాళ్లలో కలిపి వాడుకోవాలి. ఎరువుగా.. 1:1000 పాళ్లలో(అంటే.. 1 మిల్లీలీటరు ఎంజైమ్కు 100 మిల్లీలీటర్ల నీరు) కలిపి నేలలో పోయవచ్చు లేదా పిచికారీ చేయవచ్చు. పురుగులు/ తెగుళ్ల నాశినిగా.. 1:100 మోతాదులో కలిపి పిచికారీ చేయాలి. దిగుబడి పెంపుదలకు.. 1:500 పాళ్లలో కలిపి పిచికారీ చేయాలి. -
కోరమాండల్ రూ.800 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీ సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్ రూ.800 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు ప్రకటించింది. ఇందులో రెండు నూతన ప్లాంట్ల ఏర్పాటుకు రూ.677 కోట్లు వెచ్చించాలని గురువారం సమావేశమైన బోర్డు నిర్ణయం తీసుకుంది. మిగిలిన మొత్తాన్ని మూలధన అవసరాలకు వినియోగిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ ప్లాంటును రూ.513 కోట్లతో విస్తరిస్తోంది. ఇందులో భాగంగా 7,50,000 టన్నుల వార్షిక సామర్థ్యం గల గ్రాన్యులేషన్ ట్రైన్ను 24 నెలల్లో ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే కాకినాడ కేంద్రం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 22,50,000 టన్నులు ఉంది. వినియోగం 93 శాతానికి చేరిందని కంపెనీ తెలిపింది. ‘ఈ విస్తరణతో కాకినాడ ప్లాంట్ను భారత్లో అతిపెద్ద ఎరువుల తయారీ కేంద్రాల్లో ఒకటిగా మారుస్తుంది. ఎరువుల రంగంలో సంస్థ నాయకత్వాన్ని సుస్థిరం చేస్తుంది’ అని కోరమాండల్ తెలిపింది. ఫంగిసైడ్స్ మల్టీ ప్రొడక్ట్.. అలాగే గుజరాత్లోని అంకలేశ్వర్ వద్ద 600 టన్నుల వార్షిక సామర్థ్యంతో ఫంగిసైడ్స్ మల్టీ ప్రొడక్ట్ ప్లాంట్ను రూ.164 కోట్లతో నెలకొల్పాలని నిర్ణయించింది. 18 నెలల్లో ఇది కార్యరూపంలోకి రానుంది. క్రాప్ ప్రొటెక్షన్ టెక్నికల్స్ను ఇక్కడ తయారు చేస్తారు. కోరమాండల్ క్రాప్ ప్రొటెక్షన్ ఫిలిప్పైన్స్లో (సీసీపీపీ) అదనంగా 6.67 శాతం వాటాను రూ.76 లక్షలతో కొనుగోలు చేయాలని బోర్డు నిర్ణయించింది. తద్వారా సీసీపీపీ పూర్తి అనుబంధ కంపెనీగా మారుతుందని వివరించింది. తగ్గిన నికర లాభం.. సెప్టెంబర్ త్రైమాసికంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 13 శాతం క్షీణించి రూ.659 కోట్లకు చేరింది. ఎబిటా 8 శాతం తగ్గి రూ.975 కోట్లు నమోదైంది. టర్నోవర్ 6.4 శాతం ఎగసి రూ.7,433 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కోరమాండల్ షేరు ధర 2.46 శాతం లాభపడి రూ.1,640 వద్ద స్థిరపడింది. -
కోరమాండల్ కాకినాడ ప్లాంట్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ కాకినాడ యూనిట్లో ఫాస్ఫరిక్, సల్ఫరిక్ యాసిడ్ ప్లాంట్ల ఏర్పాటుకు బోర్డు ఆమోదం పొందింది. రోజుకు ఫాస్ఫరిక్ యాసిడ్ 750 టన్నులు, సల్ఫరిక్ యాసిడ్ 1,800 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నూతన కేంద్రాలను జోడించనున్నారు. ఇందుకోసం రూ.1,029 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు సంస్థ ప్రకటించింది. 24 నెలల్లో ఈ విస్తరణ పూర్తి కానున్నట్టు వెల్లడించింది. కాకినాడ యూనిట్ సామర్థ్యం రోజుకు ఫాస్ఫరిక్ యాసిడ్ 1,550 టన్నులు, సల్ఫరిక్ యాసిడ్ 4,200 టన్నులు ఉంది. ప్రస్తుతం పూర్తి సామర్థ్యాన్ని కంపెనీ వినియోగించుకుంటోంది. ఎరువుల తయారీలో ఈ యాసిడ్స్ను ఉపయోగిస్తారు. దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం, తయారీ సామర్థ్యం పెంపొందించుకునేందుకు విస్తరణ చేపడుతున్నట్టు కంపెనీ వెల్లడించింది. పూర్తి స్థాయి ప్లాంటుగా.. పాస్ఫేటిక్ ఎరువుల తయారీ, విక్రయంలో భారత్లో కోరమాండల్ రెండవ స్థానంలో నిలిచింది. ముడిసరుకు, ఎరువుల తయారీలో పూర్తి స్థాయి ప్లాంటుగా కాకినాడ కేంద్రాన్ని తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమని కోరమాండల్ ఇంటర్నేషనల్ తెలిపింది. ప్రతిపాదిత విస్తరణతో కంపెనీ వ్యయ సామర్థ్యాలను, ముడిసరుకు భద్రతను మరింత మెరుగుపరుస్తుందని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అరుణ్ అలగప్పన్ వివరించారు. డ్రోన్స్ తయారీలో ఉన్న తమ అనుబంధ కంపెనీ ధక్ష బలమైన ఆర్డర్ బుక్ నమోదు చేసిందని చెప్పారు. రక్షణ రంగం, వ్యవసాయంతోపాటు వివిధ కంపెనీల నుంచి ఆర్డర్లు పొందామన్నారు. గ్రోమోర్ డ్రైవ్ కార్యక్రమం ద్వారా వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని కంపెనీ ప్రోత్సహిస్తోంది. -
కోరమాండల్ నానోటెక్నాలజీ సెంటర్
చెన్నై: ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ తాజాగా నానోటెక్నాలజీ సెంటర్ను కోయంబత్తూరులో ఏర్పాటు చేసింది. ఇది మొక్కల పోషణ, పంటల రక్షణ కోసం నానో ఆధారిత ఎరువులు, సస్య రక్షణ ఉత్పత్తుల అభివృద్ధికి తోడ్పడుతుందని కంపెనీ శుక్రవారం తెలిపింది. ఐఐటీ ముంబైలో సైతం కంపెనీకి నానోటెక్నాలజీ కేంద్రం ఉంది. కోయంబత్తూరు సెంటర్ కోరమాండల్కు ఆరవ పరిశోధన, అభివృద్ధి కేంద్రంగా నిలిచింది. -
ద్రవరూప డీఏపీ, యూరియా వాడండి
న్యూఢిల్లీ: రైతులు సాగులో ద్రవరూప నానో డీఏపీ, యూరియాను వినియోగించాలని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్షా సూచించారు. ఈ ఉత్పత్తులను విరివిగా ఉపయోగించడం ద్వారా ఎరువుల తయారీలో దేశాన్ని స్వావలంబన భారత్గా మార్చాలని రైతులకు పిలుపునిచ్చారు. దీనివల్ల దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుందన్నారు. ఇఫ్కో నానో (ద్రవరూప) డీఏపీ వాణిజ్య విక్రయాలను మంత్రి బుధవారం ఢిల్లీలో ప్రారంభించి, మాట్లాడారు. ఇఫ్కో ద్రవరూప నానో డీఏపీ 500 ఎంఎల్ బాటిల్ను రూ.600కు విక్రయించనున్నారు. అదే సంప్రదాయ 50 కిలోల డీఏపీ బస్తా ధర రూ.1,350గా ఉంది. సాగులో ద్రవరూప ఉత్పత్తులను వినియోగించడం వల్ల నాణ్యతతోపాటు దిగుబడి కూడా పెరుగుతుందని మంత్రి అమిత్షా అన్నారు. భూసారాన్ని కాపాడుకోవచ్చన్నారు. ద్రవరూప డీఏపీతో సాగు ఖర్చులు 6 శాతం నుంచి 20 శాతం వరకు తగ్గుతాయని చెప్పారు. అలాగే ద్రవరూప ఎరువుల రవాణా, నిల్వ కూడా సులభం. ద్రవరూప ఎరువులు భారత్ను స్వావలంబన దిశగా నడిపిస్తాయన్నారు. 2021–22లో 91.36 లక్షల టన్నుల యూరియా, 54.62 లక్షల టన్నుల డీఏపీ, 24.60 లక్షల టన్నుల ఎంవోపీ, 11.70 లక్షల టన్నుల ఎన్పీకే ఎరువులను దిగుమతి చేసుకున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇఫ్కో తయారు చేసిన నానో డీఏపీకి 20 ఏళ్ల కాలానికి పేటెంట్ వచ్చినట్టు మంత్రి అమిత్షా తెలిపారు. -
చెత్త నుండి సంపద సృష్టిస్తున్న కోవెలకుంట్ల గ్రామపంచాయతీ
-
సిద్దిపేట ‘సేంద్రియ ఎరువు’.. పేరేంటో తెలుసా?
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట మున్సిపాలిటీలో సేకరించిన తడి చెత్త ద్వారా తయారైన నాణ్యమైన సేంద్రియ ఎరువు త్వరలో మార్కెట్లోకి రానుంది. మున్సిపాలిటీలో సేకరించిన తడి చెత్తను సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్లోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఈ తడి చెత్తతో ఇప్పటికే సీఎన్జీని తయారు చేసి విక్రయిస్తుండగా.. తాజాగా ఎరువును కూడా తయారు చేసి విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సేంద్రియ ఎరువును సిద్దిపేట కార్బన్ లైట్స్ బ్రాండ్ పేరుతో ఈ నెల 21న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు చేతుల మీదుగా మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ప్రతి ఇంటినుంచి చెత్త సేకరణ.. సిద్దిపేట పట్టణంలోని 43 వార్డుల్లో 41,322 కుటుంబాలు ఉండగా 1,57,026 మంది నివసిస్తున్నారు. ఇక్కడ తడి, పొడి, హానికర చెత్తను ఇంటింటి నుంచి సేకరించడాన్ని డిసెంబర్ 2020లో ప్రారంభించారు. ఈ చెత్తను సేకరించేందుకు 52 వాహనాలను ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ పరిధిలో రోజుకు 60 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా ఇందులో 70 శాతం తడి, 30 శాతం పొడి చెత్త ఉంటోంది. ఈ లెక్కన 42 మెట్రిక్ టన్నుల తడి చెత్త, 18 మెట్రిక్ టన్నుల పొడి చెత్తను సేకరిస్తున్నారు. తడి చెత్తతో ఎరువు తయారీ బుస్సాపూర్ డంపింగ్ యార్డులో రూ.6 కోట్ల వ్యయంతో బయో – సీఎన్జీ ప్లాంట్, సేంద్రియ ఎరువుల కేంద్రం నిర్మించారు. ఈ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలను కార్బన్ లైట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అప్పగించారు. రాష్ట్రంలోనే మొదటిదైన ఈ ప్లాంట్ను 2021 డిసెంబర్ 20న బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్తో కలసి మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఇళ్ల నుంచి సేకరించిన 42 మెట్రిక్ టన్నుల తడి చెత్త నుంచి ఆహార వ్యర్థాలు, కురగాయలు, ఇతర వ్యర్థాలను వేరు చేస్తున్నారు. ఇలా వేరుచేసిన తర్వాత 10 మెట్రిక్ టన్నుల తడి చెత్తను బయో–సీఎన్జీ తయారు చేయడానికి మిగతా 32 మెట్రిక్ టన్నుల చెత్తను సేంద్రియ ఎరువులను తయారు చేయడానికి వినియోగిస్తున్నారు. సిద్ధం చేసిన సేంద్రియ ఎరువును 40 కేజీల చొప్పున బ్యాగుల్లో ప్యాక్ చేసి విక్రయించేందుకు సిద్ధం చేశారు. ఒక్కో బ్యాగు అసలు ధర రూ.600 కాగా సిద్దిపేట రైతులకు రూ.300కే విక్రయించనున్నారు. 21న రైతులకు అవగాహన సదస్సు సేంద్రియ ఎరువుల ఆవశ్యకతపై రైతులకు ఈ నెల 21న సిద్దిపేట వ్యవసాయ మార్కెట్లోని పత్తి యార్డులో అవగాహన కల్పించనున్నారు. అనంతరం మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేయనున్నారు. సిద్దిపేట బ్రాండ్తో సేంద్రియ ఎరువు: మంత్రి హరీశ్రావు మంత్రి హరీశ్రావు ఆదివారం సాయంత్రం సిద్దిపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సిద్దిపేట బ్రాండ్తో చెత్త ద్వారా తయారు చేసిన ఎరువును రైతులకు అందించబోతున్నామన్నారు. సిద్దిపేట ప్రజలు రోజు వేసే చెత్తతో ఒక గొప్ప సంపదను తయారు చేసి రైతులకు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ సేంద్రియ ఎరువుతో అన్నీ పంటల నుంచి అధిక దిగుబడి, నాణ్యమైన ఉత్పత్తులు పొందే అవకాశం ఉందని చెప్పారు. -
ఆహార వ్యర్థాల్ని ఎరువుగా మార్చే హైటెక్ డస్ట్ బిన్!
ఇది చూడటానికి కాస్త ఆకర్షణీయమైన డస్ట్బిన్లా కనిపిస్తుంది గాని, నిజానికిది అధునాతనమైన ఎరువు తయారీ పరికరం. వంటింట్లో మిగిలిపోయిన ఆహార వ్యర్థాలను ఇందులో వేసి, స్విచాన్ చేసుకుంటే చాలు, కొద్దిసేపట్లోనే ఆ వ్యర్థాలన్నీ ఎరువుగా మారిపోతాయి. ‘మిల్’ అనే అమెరికన్ కంపెనీ ఈ హైటెక్ ఫుడ్ స్క్రాప్ కంపోస్టర్ బిన్ను ఇటీవల మార్కెట్లోకి తెచ్చింది. వృథా అయిన ఆహారాన్ని చెత్తకుప్పల్లో పడవేయకుండా, ఇలా ఈ ఫుడ్ కంపోస్టర్లో పడేస్తే, ఇంచక్కా ఎరువుగా మారిపోతుంది. ఈ ఎరువును పెరటి తోటలకు, ఇళ్లల్లో ఏర్పాటు చేసుకునే పూలమొక్కల కుండీల్లోకి భేషుగ్గా వాడుకోవచ్చు. ఇంట్లో ఆహార వ్యర్థాల వల్ల తయారయ్యే ఎరువు పరిమాణం ఎక్కువగా ఉంటే, ఇతరులకు ఆ ఎరువును అమ్ముకోవచ్చు కూడా! ‘మిల్’ ఫుడ్ స్క్రాప్ కంపోస్టర్ ధర 396 డాలర్లు (రూ.32,415) మాత్రమే! -
పంటపొలం.. ఎరువులమయం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటపొలం ఎరువులమయంగా మారింది. మితిమీరిన ఎరువుల వాడకం వల్ల నేల భూసారం కోల్పోతోంది. పంటలకు పనికి రాకుండాపోయే ప్రమాదకరస్థితి ఏర్పడుతోంది. పంటపొలంలో సాధారణంగా ఉండాల్సిన గాఢత గాడితప్పింది. చీడపీడల నివారణ, పంట దిగుబడులను పెంచే క్రమంలో ప్రారంభమైన ఎరువుల వినియోగం ఇప్పుడు ప్రతిపంట సాగులోనూ తప్పనిసరైపోయింది. దీనికితోడు రసాయన మందులు సైతం వినియోగిస్తుండటంతో ఒకవైపు రైతుకు సాగుభారం తడిసి మోపెడవుతుండగా, మరోవైపు పోషకవిలువలతో ఉండాల్సిన దిగుబడులు రసాయనాలతో కలుషితమవుతున్నాయి. ఫలితంగా మానవాళి ఆరోగ్యంపై అనేక రకాల దుష్ప్రభావాలకు కారణమవుతున్నాయి. 2021–22 వార్షిక వ్యవసాయ నివేదిక ప్రకారం దేశంలో సగటున హెక్టారు పంటకు 127.87 కిలోగ్రాముల ఎరువులను వినియోగిస్తున్నారు. ఇందులో 83.42 కిలోల నత్రజని, 33.6 కిలోల ఫాస్ఫరస్, 10.85 కిలోల పొటాషియాన్ని వినియోగిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అయితే పలు రాష్ట్రాలు జాతీయ సగటును మించి ఎరువులను వినియోగిస్తున్నాయి. అత్యధికంగా ఎరువులు వాడుతున్న రాష్ట్రాల జాబితాలో వరుసగా పుదుచ్చేరి, పంజాబ్, హరియాణా, తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలున్నాయి. తెలంగాణలో ఒక హెక్టారుకు సగటున 206.69 కిలోల చొప్పున వినియోగిస్తున్నారు. ఆ తర్వాతి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో హెక్టారుకు 199.67 కిలోల ఎరువులను వాడుతున్నారు. సారమంతా ఎరువులమయం... ఎరువుల వినియోగం పెరగడంతో భూసారం ఆందోళనకరంగా మారుతోంది. పంటమార్పిడి విధానంతో సహజసిద్ధమైన సాగువిధానాలను అనుసరించాల్సిన రైతులు ఎరువులు, పురుగుమందులపై ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో దిగుబడుల సంగతి అటుంచితే నేల సహజస్థితిని కోల్పోయి చివరకు ఉప్పు నేలగా మారిపోతోందంటూ పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాలవారీగా ఎరువుల వినియోగాన్ని ఉటంకిస్తూ వినియోగాన్ని తగ్గించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలంటూ పలు సూచనలు చేశారు. అధిక వినియోగంతో అనర్థాలే... సాధారణంగా ఎరువుల వినియోగం 4:2:1 నిష్పత్రితలో ఉంటే పరవాలేదు. దేశంలో ఎరువుల వినియోగం 7:2.3:1.5 నిష్పత్తికి చేరింది. రాష్ట్రాలవారీగా పరిశీలిస్తే ఈ నిష్పత్తిలో వత్యాసాలు కనిపిస్తున్నాయి. మితిమీరిన ఎరువుల వినియోగంతో భవిష్యత్తులో సాగువిధానం తీవ్ర సంకటస్థితిని ఎదుర్కొంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఎరువుల వినియోగం మితిమీరితే భూసారం దెబ్బతింటుంది. భూమిలోని వాస్తవ పోషకాలు గల్లంతై ఉప్పునేలగా మారుతుంది. దీంతో సేంద్రియ పదార్థం, హ్యూమస్, ప్రయోజనకరమైన జాతులు, మొక్కల పెరుగుదల కుంటుపడతాయి. తెగుళ్ల పెరుగుదలతోపాటు గ్రీన్హౌస్ వాయువుల విడుదలకు దారితీస్తుంది. ఫలితంగా పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది. -
ఎరువుల కొనుగోళ్లకు సమాయత్తం
ఖమ్మం వ్యవసాయం: ప్రస్తుత వ్యవసాయ సీజన్లో ఎరువుల కొనుగోళ్లకు రూ.700 కోట్లు రుణం తీసుకునేందుకు రాష్ట్రప్రభుత్వం అనుమతి ఇచ్చిందని మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి తెలిపారు. రాష్ట్ర మార్క్ఫెడ్ 23వ పాలకవర్గ సమావేశం సోమవారం ఖమ్మంలోని డీపీఆర్సీ సమావేశ మందిరంలో చైర్మన్ గంగారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022–23 ఏడాది వానాకాలంలో 4.57 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు సరఫరా చేసినట్లు తెలిపారు. ప్రస్తుత యాసంగికి 95 వేల మెట్రిక్ టన్నుల ఎరువుల అవసరముంటుందని వెల్లడించారు. దీంతో పలు కంపెనీల నుంచి కొనుగోలుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు. అలాగే కనీస మద్దతు ధరతో పెసలు కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ను నోడల్ ఏజెన్సీగా నియమించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం 3,397 మెట్రిక్ టన్నుల పెసలు, 4 వేల మెట్రిక్ టన్నుల మినుముల కొనుగోళ్లకు అనుమతించిందని, ఈ పంట కొనుగోళ్లపై జిల్లా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశామని గంగారెడ్డి పేర్కొన్నారు. కనీస మద్దతు ధరతో 72,387 మెట్రిక్ టన్నుల సోయాబీన్ కొనుగోలుకు అనుమతి కోసం కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించామని తెలిపారు. సమావేశంలో మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మేనేజింగ్ డైరెక్టర్ యాదిరెడ్డి, డైరెక్టర్లు రంగారావు, విజయ్, గంగాచరణ్, జగన్మోహన్రెడ్డి, మర్రి రంగారావు తదితరులు పాల్గొన్నారు. -
చెరువు మట్టి.. భూమికి బలం
ఎల్.ఎన్.పేట: పంట దిగుబడి కోసం రైతులు విచక్షణా రహితంగా ఎరువులు, పురుగు మందులు వినియోగిస్తుంటారు. దీని వలన భూసారం క్షీణిస్తోందని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూసారం పెంచాలంటే కొత్తమట్టిని వేయడం ద్వారా సత్ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. చెరువుల్లోని పూడిక మట్టి వేస్తే పొలం సారవంతంగా మారుతుందని సూచిస్తున్నారు. ఈ మట్టి వేయడం ద్వారా భూసారంతో పాటు పోషక విలువలు పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. పురుగు మందులు, ఎరువులు ఎక్కువగా వాడటం వలన భూమి పొరల్లో ఉండే మిత్ర పురుగులు నశించడం వలన రైతుకు నష్టం ఉంటుందంటున్నారు. పూడిక మట్టిలో పోషకాలు చెరువులో నీరు నిల్వ ఉన్నప్పుడు ఆకులు, గడ్డి వంటి వ్యర్థాలు కుళ్లి మట్టిలో చేరుతాయి. వేసవలి సమయంలో చెరువులు అడుగంటుతాయి. ఈ సమయంలో చెరువు పూడిక మట్టిలో తగినంత పాళ్లలో నత్రజని, భాస్వరం, పొటాషియం, జింకు, బోరాన్, సేంద్రియకార్భన్ పదార్థాలు, మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే సూక్ష జీవులు, పంటకు మేలు చేసే మిత్ర పురుగులు వృద్ధి చెందుతాయి. భూమి పొరల్లో తేమను ఎక్కువ రోజుల పాటు ఉండేలా చేసే గుణం ఈ మట్టికి ఉంది. కిలో పూడిక మట్టిలో నత్రజని 720 మి.గ్రా, భాస్వరం 320 మి.గ్రా, పోటాషియం 810 మి.గ్రా, సేంద్రియకార్భనం 308 మి.గ్రాలతో పాటు మైక్రోబియల్ బయోమాన్ కార్బన్లు ఉంటాయి. ఎరువుల ఖర్చు తక్కువ ఎకరా పొలంలో వరి పండించాలంటే తక్కువగా అనుకున్నా ఒక బస్తా డీఏపీ, రెండు బస్తాల యూరియా, బస్తా పోటాష్, బస్తా జింక్ తప్పనిసరి అవుతుంది. వీటితో పాటు పంటను ఆశించే తెగుళ్లను నివారించేందుకు పురుగు మందుల పిచికారీ తప్పటం లేదు. ఎరువులు, పురుగు మందుల కోసం సుమారు రూ. 6 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. చెరువు మట్టి వేసుకోవటం వలన ఎరువుల ఖర్చు తగ్గుతుంది. రైతులకు పెట్టుబడి తగ్గటంతో పాటు భూమి సారవంతం అవుతుంది. ఎరువులు, పురుగుల మందుల్లేని పంటను సాధించవచ్చు. చెరువు మట్టి వేసే వాళ్లం గతంలో చెరువుల్లో లభ్యమయ్యే పూడిక మట్టిని పొలాలకు వేసేవాళ్లం. దీంతో భూసారం పెరిగి పంటదిగుబడి బాగా వచ్చేది. వేసవిలో చెరువు మట్టిని నాటుబళ్ల పెరిగి పొలంలో వేసేవాళ్లం. వర్షాల తరువాత పొలంలో వేసిన మట్టి నేలలో కలిసేలా దుక్కి దున్నేవాళ్లం. ఎరువులు వేయకుండానే పంట ఏపుగా పెరిగేది. ఇప్పుడు రైతులెవ్వరూ చెరువు మట్టి వేయటం లేదు. ఎరువుల వినియోగంతో పెట్టుబడి పెరిగిపోతుంది. భూసారం తగ్గిపోతుంది. లావేటి నర్సింహులు, రైతు, కృష్ణాపురం భూసారం పెరుగుతుంది చెరువు మట్టి వేసుకోవటం వలన భూమి సారవంతంగా మారుతుంది. చౌడు భూముల్లో కూడా పచ్చని పంటలు పండించవచ్చు. చెరువు మట్టిలో తేమ ఎక్కువగా ఉండటం వలన పంటకు నీటినిల్వలు బాగా ఉంటాయి. సేంద్రియ శాతం ఎక్కువగా ఉండటంతో ఎరువులా ఉపయోగపడుతుంది. ఒక సంవత్సరం చెరువు మట్టి వేయటం వలన మూడేళ్ల వరకు భూమి సారవంతంగా ఉంటుంది. పంటకు మేలు చేస్తుంది. పైడి లతశ్రీ, ఏఓ, ఎల్.ఎన్.పేట -
మీ గార్డెన్లో గులాబీలు విరగ బూయాలంటే?
ఉదయం లేవగానే బాల్కనీలోని మొక్కల పచ్చదనం చూస్తే భలే హాయిగా ఉంటుంది కదా. మరి అరవిచ్చిన మందారమో, విచ్చీవిచ్చని రోజా పువ్వు మొగ్గలు పలకరిస్తేనో.. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. పువ్వుల్లో రాణి స్థానం గులాబీదే. రెడ్, వైట్, ఎల్లో, పింక్, ఆరెంజ్, బ్లూ , గ్రీన్, బ్లాక్ రంగుల్లో గులాబీలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. గ్లాడియేటర్, సర్పంచ్, డబుల్ డిలైట్ కలర్, హైబ్రీడ్, మార్నింగ్ గ్లోరీ, సన్సెట్, కశ్మీర్, కాకినాడ, రేఖ, ముద్ద, తీగజాతి ఇలా పలు రకాల గులాబీలున్నాయి. అయితే నర్సరీనుంచి తెచ్చినపుడు మొగ్గలతో కళకళలాడుతూండే గులాబీ మొక్క మన గార్డెన్లో నాటిన తరువాత మొగ్గలు వేయడం మానేస్తుంది. ఆరోగ్యంగా ఎదగదు. ఒకవేళ మొక్క బాగా విస్తరించినా, పెద్దగా పూలు పూయదు. దీనికి కారణంగా మొక్కకు అవసరమైన పోషకాలు అందకపోవడమే. మరి ఏం చేయాలి. చక్కగా గుత్తులుగా గుత్తులుగా పూలతో మన బాల్కనీలోని గులాబీ మొక్క కళ కళలాడాలంటే ఏం చేయాలి. సేంద్రీయంగా ఎలాంటి ఎరువులివ్వాలి లాంటి వివరాలు తెలుసుకోవడం అవసరం. (Almonds Benefits: బాదాం ఎలా తింటే మంచిది? పోషకాలు పుష్కలంగా లభించాలంటే?) పెరటి తోటల్లో చిన్న చిన్న కుండీలలో పెంచే మొక్కలు ఏపుగా ఎదగాలన్నా, పువ్వులు విరగ బూయాలన్నా కిచెన్ కంపోస్ట్ ఎరువు, వర్మీ కంపోస్ట్ ఎక్కువగా ఉపయోగ పడతాయి. వీటితోపాటు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఫలితాలనిస్తాయి. ఫెర్మింటెడ్ ఫ్రూట్స్, బెల్లంతో కలిపి పులియ బెట్టిన పళ్లు, లేదా తొక్కలు ద్వారా తయారు చేసుకున్న లిక్విడ్ ఫెర్టలైజర్స్ వాడటం వల్ల వచ్చే ఫలితాలను గమనిస్తే ఆశ్చర్య పోక తప్పదు. మొక్కలకు నత్రజని, భాస్వరం, పొటాషియం మూడు పోషకాలలో చాలా. అవసరం. వీటన్నింటిలోకి రాణి లాంటిది ముఖ్యంగా గులాబీ మొక్కలకు బాగా ఉపయోగపడేది అరటి పళ్ల తొక్కలతో చేసే ఎరువు. ఈ లిక్విడ్ను మొక్కలకిచ్చిన వారంరోజుల్లోనే చక్కటి ఫలితం కనిపిస్తుంది. నైట్రోజన్ ఇతర రూపాల్లో లభించినప్పటికీ ముఖ్యమైన పొటాషియం అరటి తొక్కల ఫెర్టిలైజర్ ద్వారా లభిస్తుంది. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. బనానా పీల్ ఫెర్టిలైజర్ బాగా మగ్గిన అరటి పళ్ల తొక్కలను తీసుకోవాలి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకొని, గిన్నెలోకి తీసుకొని ముక్కలు మునిగేలా నీళ్లు పోసుకోవాలి. దీన్ని రెండు మూడు పొంగులు వచ్చే దాకా మరిగించుకోవాలి. బాగా చల్లారిన తరువాత ఆ మిశ్రమాన్ని వడపోసుకుని కుండీకి ఒక కప్పు చొప్పున గులాబీ మొక్క మొదట్లో పోసుకోవాలి. పెద్ద కుండీ అయితే కొంచెం ఎక్కువ పోసుకున్నా ప్రమాదమేమీలేదు. కానీ మొక్కకిచ్చిన ఫెర్టిలైజర్ బయటికి పోకుండా చూసుకోవాలి. అంటే మనం అందించిన పోషకం మొత్తం వృధాకా కుండా మొక్క కందేలా చూసుకోవాలన్నమాట. వారం రోజుల్లో కొత్త చిగుర్లు, చిగుర్లతోపాటు కొత్తబడ్స్ మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. మరొక విధానంలో ముక్కలుగా కట్ చేసిన అరటి పళ్ల తొక్కల్ని 24 గంటలపాటు నీళ్లలో నానబెట్టి, ఆ తరువాత ఆ నీరును మొక్కలకు వాడవచ్చు. ఏ మొక్కకైనా పూత పిందె దశలో ఈ ఫెర్టిలైజర్ను అందిస్తే చక్కటి ఫలితం ఉంటుంది. అలాగే అరటి తొక్కలను మొక్క మొదట్లో పాతిపెట్టినా ఉపయోగమే.సేంద్రీయంగా పండించిన అరటి పళ్ల తొక్కలను ఉపయోగిస్తే మరీ మంచిది. పొటాషియం మొక్కలు కాండాన్ని బలంగా చేయడమే కాదు, వ్యాధుల నుండి రక్షిస్తుంది. పుష్పించే ప్రక్రియ వేగవంతం చేస్తుంది. పండ్ల మొక్కల్లో పండ్ల నాణ్యతను మెరుగు పరుస్తుంది. కాల్షియం, పొటాషియం, మాంగనీసు లాంటివాటికి అద్భుతమైన మూలం అరటి తొక్కలు. ఇవి మొక్కలు ఎక్కువ నత్రజనిని తీసుకోవడానికి, కిరణజన్య సంయోగ క్రియకు సహాయపడతాయి. -
గ్రామస్థాయిలో ఎరువుల గోదాములు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామస్థాయిలో ఎరువుల పంపిణీని మరింత పగడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో సాగువేళ రైతులు పడిన ఇబ్బందులకు చెక్పెడుతూ వారి ముంగిటకే కావాల్సిన ఎరువులను అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా ఎరువుల నిల్వకోసం గ్రామస్థాయిలో గోదాములు నిర్మించాలని సంకల్పించింది. ఆర్బీకేల ద్వారా ఎరువుల పంపిణీకి శ్రీకారం చుట్టిన తర్వాత రైతుల ఇబ్బందులకు తెరపడింది. గతంలో ఎరువుల కోసం గంటల తరబడి సహకార సంఘాలు, వ్యాపారుల వద్ద పడిగాపులు పడాల్సి వచ్చేది. కానీ నేడు ఎరువులు రైతులు కోరిన వెంటనే లభిస్తున్నాయి. 10,778 ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన ఎరువుల పంపిణీతో రైతులకు భరోసా లభించింది. గత రెండేళ్లలో ఆర్బీకేల ద్వారా 6.9 లక్షలమంది రైతులకు 3.25 లక్షల టన్నుల ఎరువులను సరఫరా చేశారు. నకిలీ ఎరువులకు చెక్ పేరున్న కంపెనీల ఎరువులన్నింటిని ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచడమేకాదు.. సీజన్లో రాష్ట్రానికి కేటాయించిన ప్రతి ఎరువును ముందుగా సమగ్ర పరీక్ష కేంద్రంలో పరీక్షించిన తర్వాతే రైతులకు సరఫరా చేస్తుండడంతో నకిలీలకు చెక్ పడింది. శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన మోతాదు మేరకు ఎంపిక చేసుకున్న ఎరువులను ఎమ్మార్పీకి పొందే వెసులుబాటు లభించింది. గతంలో మాదిరిగా అవసరంలేని ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన ఇబ్బందులు పోయాయి. దూరాభారం తగ్గింది. సమయం ఆదా అవుతోంది. రవాణా, ఇతర ఖర్చుల భారం లేకుండా తమ ముంగిటే కొనుగోలు చేసే అవకాశం ఏర్పడింది. కృత్రిమ కొరత, అక్రమ నిల్వలతో రైతులను దోచుకునే ప్రైవేటు డీలర్ల ఆగడాలకు అడ్డుకట్టపడింది. ఆర్బీకేల ద్వారా ఎరువుల లభ్యత, ఎమ్మార్పీ పట్టిక అమలుతో మార్కెట్లో ఎరువుల ధరల స్థిరీకరణ సాధ్యమవుతోంది. ఆర్బీకేలకే లైసెన్సు ఎరువుల లభ్యతను మరింత సులభతరం చేసేందుకు ఆర్బీకేల పేరిట ఎరువుల లైసెన్సు జారీచేస్తున్నారు. వివిధ పంటలు సాగవుతున్న 10,698 ఆర్బీకేల పరిధిలో ఎరువులు అవసరమని గుర్తించారు. ఇప్పటివరకు రిటైల్ ఫెర్టిలైజర్ లైసెన్సుల కోసం 10,592 ఆర్బీకేలు దరఖాస్తు చేశాయి. వీటిలో 10,454 ఆర్బీకేలకు లైసెన్సు జారీచేశారు. 138 ఆర్బీకేలకు లైసెన్సు ఇవ్వాల్సి ఉంది. మరో 106 ఆర్బీకేలు ఇంకా దరఖాస్తు చేయాల్సి ఉంది. జాప్యం నివారణ కోసం హబ్ల నుంచి ఆర్బీకేలకు ఎరువుల సరఫరాలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు ఆర్బీకేలకు అనుబంధంగా ప్రత్యేకంగా గోదాములు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కనీసం 20 మెట్రిక్ టన్నుల (ఎంటీల) ఎరువులు నిల్వచేసేందుకు వీలుగా 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటిని నిర్మించనున్నారు. ఈ ప్రతిపాదనలకు ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదముద్ర వేశారు.ఉపాధిహామీ పథకం కింద వీటిని నిరి్మంచేందుకు అంచనాలు రూపొందించాలని గ్రామీణాభివృద్ధి శాఖను ఆదేశించారు. కరువు తీరా ఎరువులు గత రబీ సీజన్లో 23.47లక్షల ఎంటీల ఎరువులు వినియోగం కాగా ఈ ఏడాది 23,44,780 టన్నులు అవసరమని అంచనా వేశారు. ఖరీఫ్లో వాడగా మిగిలిన 6,96,938 ఎంటీల నిల్వలుండగా, కేంద్రం నుంచి గత మూడు నెలల్లో 7,51,706 ఎంటీల ఎరువులు రాష్ట్రానికి కేటాయించారు. ఇప్పటివరకు 8,32,011 ఎంటీల విక్రయాలు జరిగాయి. ప్రస్తుతం 6,16,632 ఎంటీల ఎరువులు (యూరియా 2,53,953 ఎంటీలు, డీఏపీ 27,420, ఎంఒపీ 21,581, ఎస్ఎస్పీ 50,681, కాంప్లెక్స్ 2,58,521, ఇతర ఎరువులు 4,476 ఎంటీలు) అందుబాటులో ఉన్నాయి. డిసెంబర్ నెలకు మరో 3,59,774 ఎంటీల ఎరువులను కేంద్రం కేటాయించింది. ఎరువులకు బెంగలేదు 4 ఎకరాల్లో వరి, 3 ఎకరాల్లో ఇతర పంటలు సాగుచేస్తున్నా. గతంలో ఎరువులు కావాలంటే ఉయ్యూరు వెళ్లి ప్రైవేట్ డీలర్ వద్ద కొని ఆటోలో తెచ్చుకునేవాడిని. పైగా అడిగిన ఎరువులుండేవి కావు. వారు ఇచ్చినవి తెచ్చుకోవాల్సి వచ్చేది. నాణ్యత తెలిసేది కాదు. కానీ నేడు మా గ్రామంలో ఆర్బీకే పెట్టిన తర్వాత ఎరువుల విషయంలో బెంగలేదు. మాకు కావాల్సిన ఎరువులు ముందుగానే టెస్ట్ చేసినవి ఎమ్మార్పీకే దొరుకుతున్నాయి. ఆటో ఖర్చులు మిగిలుతున్నాయి. – బసివిరెడ్డి, చిన్న ఓగిరాల, కృష్ణా జిల్లా బస్తాకు రూ.30 ఖర్చయ్యేది నేను నంబూరులో 3 ఎకరాల్లో వరి, పెసర సాగుచేస్తున్నా. సీజన్లో ఎరువులు కావాలంటే గతంలో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రానికి వెళ్లే వాళ్లం. రవాణా కోసం బస్తాకు రూ.30 ఖర్చయ్యేది. మా నంబూరులో ఏర్పాటు చేసిన ఆర్బీకే ద్వారా నాణ్యమైన ఎరువులు తక్కువ ధరకే సరఫరా చేస్తున్నారు. రవాణా ఖర్చులు తగ్గడమే కాదు.. సమయం కూడా ఆదా అవుతోంది. ఎరువుల దొరకవనే ఆందోళన లేదు. – నంబూరి రాంబాబు, నంబూరు, గుంటూరు జిల్లా -
కోరమాండల్ గ్రోశక్తి ప్లస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ తాజాగా గ్రోశక్తి ప్లస్ అనే ఉత్పాదనను బుధవారం ప్రవేశపెట్టింది. జింక్తోపాటు నత్రజని, భాస్వరం, పొటాషియంతో ఈ ఎరువు తయారైంది. సంక్లిష్ట ఎరువుల్లో అత్యధిక పోషకాలు, ఎన్పీకే ఎరువుల్లో అధిక భాస్వరం గ్రోశక్తి ప్లస్ కలిగి ఉందని కంపెనీ తెలిపింది. తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, పండ్లు, కూరగాయల వంటి పంటలకు ఇది అనుకూలం అని వివరించింది. ఎన్ఫోస్ టెక్నాలజీతో రూపొందిన ఈ ఉత్పాదన ద్వారా పంటలకు సమతుల పోషకాలు అందుతాయని కోరమాండల్ మాతృ సంస్థ మురుగప్ప గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అరుణ్ అలగప్పన్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. -
తీరనున్న ఎరువుల కొరత
సాక్షి పెద్దపల్లి: వ్యవసాయరంగంలో దూసుకుపోతున్న రాష్ట్రానికి ఎరువుల కొరత తీరనుంది. తెలంగాణ సిగలో మరో కలికితురాయిగా నిలవనున్న రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్ఎఫ్సీఎల్)తో ఎరువుల లభ్యత పెరగనుంది. ఈనెల 9న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ఈ కర్మాగారాన్ని అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. దేశీయంగా ఎరువుల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని మూతపడిన ఐదు ఎరువుల కర్మాగారాలను పునరుద్ధరించి మళ్లీ ఉత్పత్తి ప్రారంభించడానికి 2015లో పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రామగుండంలో మూతపడిన ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) పేరుతో పునరుద్ధరించాలని నిర్ణయించింది. 2016 ఆగస్టు 7న ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ఆర్ఎఫ్సీఎల్ పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. ప్లాంట్ నిర్మాణాన్ని తొలుత రూ.5,254 కోట్ల అంచనాలతో చేపట్టినా.. అది పూర్తయ్యేనాటికి రూ.6,120.55 కోట్లకు చేరుకుంది. ఈ కర్మాగారంలో నేషనల్ ఫెర్టిలైజర్స్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, రాష్ట్ర ప్రభుత్వం, ఎఫ్సీఐ భాగస్వామ్యులుగా ఉన్నాయి. పునరుద్ధరణ పనులు పూర్తయ్యాక ప్లాంట్లో ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన లాంఛనంగా ఉత్పత్తి ప్రారంభించారు. అనంతరం మార్చి 22 నుంచి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించారు. ఇందులో ఉత్పత్తి చేసిన యూరియా, అమ్మోనియాను ‘కిసాన్ బ్రాండ్’పేరుతో నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ మార్కెటింగ్ చేస్తోంది. తొలి ఉత్పత్తిని తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా ఇచ్చారు. ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తి చేసే 45 కిలోల యూరియా బస్తా ధరను రూ.266.50గా నిర్ణయించి వాణిజ్య అవసరాల నిమిత్తం మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కర్మాగారం పునరుద్ధరణతో రాష్ట్రంలో యూరియా, అమ్మోనియా కొరత పూర్తిగా తీరిపోనుంది. తగ్గనున్న దిగుమతి భారం దేశవ్యాప్తంగా ఏటా 300 నుంచి 350 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరంకాగా.. 250 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఉత్పత్తి అవుతోంది. మిగతా దాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఎఫ్సీల్ ఉత్పత్తి ప్రారంభించడంతో ఈ కొరత చాలావరకు తీరనుంది. విదేశాలనుంచి దిగుమతి భారాన్ని తగ్గించడంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా మూతపడిన ఐదు కర్మాగారాలను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఆర్ఎఫ్సీఎల్ (అప్పటి ఎఫ్సీఐ), గోరఖ్పూర్ (ఉత్తరప్రదేశ్), సింద్రీ (జార్ఖండ్), తాల్చేర్ (ఒడిశా), బరౌనీ(బిహార్) ఎరువుల కర్మాగారాల పునరుద్ధరణ చేపట్టింది. వీటిలో మొదట రాష్ట్రంలోని రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారంలో ఎరువుల ఉత్పత్తి ప్రారంభమైంది. ఇక గోరఖ్పూర్, సింద్రీ యూనిట్లలో 2022 మార్చి నాటికి, తాల్చేర్ ప్లాంట్లో 2023లో యూరియా ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎఫ్సీఐ ఏర్పడింది ఇలా.. ►1970 అక్టోబర్ 2న నాటి కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి త్రిగున్సేన్ రామగుండంలో ఎఫ్సీఐ ఎరువుల కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. ►గడువు కంటే ఆరేళ్లు ఆలస్యంగా ప్రారంభమైన ఎఫ్సీఐ.. 1980 నవంబర్ ఒకటి నుంచి స్వస్తిక్ బ్రాండ్ పేరుతో యూరియాను మార్కెట్లోకి విడుదల చేసింది. ►అనంతర కాలంలో పలు కారణాలతో 1999 మార్చి 31న కంపెనీ మూతపడింది. నాడు బొగ్గు.. నేడు సహజవాయువు రామగుండంలో మూతపడిన ఎఫ్సీఐ కర్మాగారం అప్పట్లో బొగ్గు, విద్యుత్తు ఆధారంగా నడిచేది. ప్రస్తుతం కర్మాగారాన్ని పునరుద్ధరించాక సహజవాయువును ఇంధనంగా వినియోగిస్తున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా మల్లవరం నుంచి రాజస్తాన్కు వెళ్లే గ్యాస్ పైప్లైన్ నుంచి రామగుండం వరకు 363 కిలోమీటర్ల మేర ప్రత్యేక గ్యాస్ పైప్లైన్లను నిర్మించారు. ఈ కర్మాగారంలో కిసాన్ బ్రాండ్ పేరిట యూరియా, అమ్మోనియా ఎరువులను ఉత్పత్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్రానికి 50 శాతం యూరియూ ఆర్ఎఫ్సీఎల్ కర్మాగారంలో వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి ప్రారంభం కావడంతో రాష్ట్రానికి 50 శాతం, మిగిలిన ఎరువులను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు కేటాయించనున్నారు. ఐదు నెలలుగా ఇక్కడ ఉత్పత్తి అయిన యూరియాను తెలంగాణకే సరఫరా చేశారు. త్వరలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు రవాణా చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విదేశీ సాంకేతికతతో ఉత్పత్తి ఆర్ఎఫ్సీఎల్లో అమ్మోనియాను డెన్మార్క్ దేశానికి చెందిన హల్డోర్ కంపెనీ, యూరియాను ఇటలీ దేశానికి చెందిన సాయ్పేమ్ కంపెనీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేస్తున్నారు. గ్యాస్ను ఇంధనంగా మార్చి నీటి నుంచి ఆవిరి ఉత్పత్తి చేయడం, ఆ నీటి ఆవిరినే యూరియా, అమ్మోనియా ఉత్పత్తి కోసం వినియోగించడం ఆర్ఎఫ్సీఎల్ ప్రత్యేకతల్లో ఒకటి. ప్లాంటుకు కావాల్సిన ఒక టీఎంసీ నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కేటాయించారు. -
కరువుతీరేలా ఎరువులు
సాక్షి, అమరావతి: ఖరీఫ్లో ఎరువుల కొరత తలెత్తకుండా మార్క్ఫెడ్ ముందస్తు వ్యూహంతో అడుగులు వేస్తోంది. సాగు విస్తీర్ణం, పంటల సాగు వివరాల ఆధారంగా ఎరువులు కొనుగోలు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మునుపెన్నడూ లేని«విధంగా ఆర్బీకేలు, సొసైటీలు ఎరువుల విక్రయాలను చేపడుతున్నాయి. సీజను ప్రారంభానికి ముందే రైతులు ఎక్కువగా వినియోగించే యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను అందుబాటులోకి తెస్తున్నారు. లక్ష్యానికి మించి నిల్వలు.. ఖరీఫ్లో దాదాపు 20 లక్షల టన్నుల ఎరువులు అవసరమని అధికారులు అంచనా వేశారు. రైతుల అవసరాలకు అనుగుణంగా మార్క్ఫెడ్ ప్రతి నెలా కంపెనీల నుంచి ఎరువులను కొనుగోలు చేసి ఆర్బీకేలు, సొసైటీలకు సరఫరా చేస్తోంది. రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడకుండా ఆర్బీకేలు, సహకార సంఘాల్లో కనీసం 1.50 లక్షల టన్నులను నిల్వ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే మార్క్ఫెడ్ ప్రభుత్వ లక్ష్యానికి మించి 1.77 లక్షల టన్నులను నిల్వ చేసింది. ఎరువుల రవాణాలో జాప్యం జరిగినా, కొరత ఏర్పడినా ఈ బఫర్ స్టాక్ను వినియోగించనున్నారు. రైతు భరోసా కేంద్రాలు, మార్క్ఫెడ్ గోదాముల్లో 1,52,449 టన్నులు నిల్వ ఉండగా సహæకార సంఘాల గోదాముల్లో 25 వేల టన్నులు నిల్వ ఉన్నాయి. గత సర్కారు హయాంలో ధర్నాలు గత ప్రభుత్వ హయాంలో ఎరువుల కోసం రైతులు పలుదఫాలు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. అధిక ధరలు, ఎరువుల కొరత సమస్యలతో సతమతమయ్యారు. ఈ బాధల నుంచి రైతన్నలకు విముక్తి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న సహకార సంఘాల్లోనూ ఎరువుల విక్రయాలను కొనసాగిస్తోంది. ఇప్పటికే పది వేల టన్నులు కొనుగోలు ఇప్పటి వరకు ఆర్థికంగా పటిష్టంగా ఉన్న 577 సహకార సంఘాల్లో 25 వేల టన్నులు, 4,166 రైతు భరోసా కేంద్రాల్లో 68 వేల టన్నులు, మార్క్ఫెడ్ గోదాముల్లో 84 వేల టన్నుల ఎరువులను నిల్వ చేశారు. ప్రైవేట్ మార్కెట్ కంటే ఆర్బీకేలు, సంఘాల్లో ఎరువుల ధరలు తక్కువగా ఉండటంతో రైతులు ఇప్పటికే 10 వేల టన్నులను కొనుగోలు చేశారు. ఎరువుల కొరత రానివ్వం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఖరీఫ్లో ఎరువుల కొరత రాకుండా ముందస్తు వ్యూహంతో చర్యలు తీసుకుంటున్నాం. రైతులు ఎప్పుడు కోరినా ఎరువులు విక్రయించేందుకు వీలుగా ఆర్బీకేలు, సహకార సంఘాల్లో ఎరువుల నిల్వలు అధికంగా సిద్ధం చేస్తున్నాం. కనీసం 1.50 లక్షల బఫర్ స్టాక్ ఉండాలని ప్రభుత్వం ఆదేశిస్తే అంతకు మించి నిల్వలున్నాయి. రాష్ట్రంలో దాదాపు 1,950 సహకార సంఘాలకుగానూ ఆర్ధికంగా, క్రియాశీలకంగా ఉన్న 577 సంఘాలను తొలి విడత ఎంపిక చేసి ఎరువులు సరఫరా చేశాం. మిగిలిన సంఘాల పరిస్థితిని సమీక్షించి విక్రయాలను చేపడతాం. – ఎం.ఎస్. ప్రద్యుమ్న, మార్క్ఫెడ్ ఎండీ తప్పిన ఇబ్బందులు గ్రామస్థాయిలోనే ఎరువులు అందుబాటులోకి రావడంతో రైతులకు వ్యయ ప్రయాసలు తొలగాయి. గతంలో వ్యవసాయ పనులు మానుకుని మండల కేంద్రాలు, పట్టణాలకు వెళ్లి ఎరువులను కొనుగోలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామంలోనే కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల రవాణా ఖర్చులు తగ్గడంతోపాటు రైతుకు సమయం ఆదా అవుతోంది. -
పంటకు పులకింత.. రైతుకు నిశ్చింత
సాక్షి, అమరావతి: గతంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఎరువులు దొరక్క రైతులు పడరాని పాట్లు పడేవారు. బ్లాక్లో అధిక ధరలకు కొనుగోలు చేయడమే కాదు.. పంటకాలంలో విలువైన సమయాన్నీ వృథా చేసుకునేవారు. ఇప్పుడా పరిస్థితి మారింది. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఎరువుల కొరత అనే మాట ఎక్కడా వినిపించడం లేదు. ఎరువుల అందుబాటు విషయంలో రైతాంగం నిశి్చంతగా ఉంటోంది. సీజన్ ప్రారంభానికి ముందే అవసరమైన నిల్వలను సిద్ధం చేస్తుండడంతో ఏ దశలోనూ ఇబ్బందులు తలెత్తడం లేదు. ప్రస్తుత రబీ సీజనే ఇందుకు నిదర్శనం. ఈ రబీ సీజన్కు సంబంధించి రైతులకు అవసరమైన దానికంటే ఎక్కువ మొత్తంలో ఎరువుల నిల్వలను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. దీంతో రైతులు ఎరువుల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరమే రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలే ఇందుకు కారణమంటూ రైతులు ప్రశంసలు కురిపిస్తున్నారు. రబీ కోసం ఎరువుల నిల్వలు ఇలా.. ఏటా రాష్ట్రంలో 35 లక్షల టన్నుల ఎరువుల వాడకం జరుగుతుంది. నిజానికి ఖరీఫ్ కంటే రబీ సీజన్లోనే ఎరువుల వాడకం ఎక్కువ. రబీ సీజన్కు సంబంధించి 22.60 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు ఎరువులు అవసరమవుతాయని అంచనా. అయితే ఈసారి రబీ సీజన్ ప్రారంభానికి ముందు 7,50,260 మెట్రిక్ టన్నుల మేరకు ఎరువుల నిల్వలున్నాయి. ఈ సీజన్ కోసం రాష్ట్రానికి మార్చి 15వ తేదీ వరకు 20,94,044 మెట్రిక్ టన్నుల ఎరువులను కేంద్రం కేటాయించింది. ఆ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 23 బఫర్ గిడ్డంగులు, 154 హబ్లలో 28,44,304 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలు సిద్ధం చేయగా.. గడిచిన ఐదు నెలల్లో 21,81,737 మెట్రిక్ టన్నుల మేరకు ఎరువుల అమ్మకాలు జరిగాయి. మిగిలిన 6,62,567 మెట్రిక్ టన్నులకు అదనంగా కంపెనీల నుంచి మరో 30,004 మెట్రిక్ టన్నుల మేరకు సేకరించారు. దీంతో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో 6,92,572 మెట్రిక్ టన్నుల మేరకు ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధానంగా 3,11,375 ఎం.టీ.ల యూరియా, 30,865 ఎం.టీ.ల డీఏపీ, 63,971 ఎం.టీ.ల ఎంఓపీ, 59,469 ఎం.టీ.ల ఎస్ఎస్పీ, 2,22,037 ఎం.టీ.ల కాంప్లెక్స్, 195 ఎం.టీ.ల అమ్మోనియా సల్ఫేట్, 4,659 ఎం.టీ.ల సిటీ కాంపోస్ట్ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. రబీ సీజన్కు సంబంధించి మార్క్ఫెడ్ వద్ద 6,16,324 ఎం.టీ.ల నిల్వలుండగా, ఇప్పటివరకు 5,46,536 మెట్రిక్ టన్నుల మేరకు అమ్మకాలు జరిపారు. ప్రస్తుతం మార్క్ఫెడ్ వద్ద డీఎపీ 6,245 ఎం.టీ.లు, ఏపీకే 2,366 టన్నులు, యూరియా 61,161 టన్నులు కలపి 69,772 ఎం.టీ.ల నిల్వలున్నాయి. వీటిని పాత ధరలకే విక్రయిస్తున్నారు. అదే సమయంలో రబీ సీజన్లో ఆర్బీకేల్లో 1,00,125 మెట్రిక్ టన్నుల ఎరువులను నిల్వ చేయగా, ఇప్పటివరకు 19,900 మెట్రిక్ టన్నులను రైతులు కొనుగోలు చేశారు. రికార్డు స్థాయిలో రబీ సాగు ప్రస్తుత రబీ సీజన్లో ఎరువుల కొరత లేకపోవడంతోపాటు అన్ని విధాలా అనుకూల పరిస్థితులు నెలకొనడంతో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంటలు సాగయ్యాయి. సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం 56.19 లక్షల హెక్టార్లు కాగా, ఈ ఏడాది 58.92 లక్షల హెక్టార్లలో రబీ సాగు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 59.06 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. 21.75 లక్షల హెక్టార్లలో వరి, 23.74 లక్షల హెక్టార్లలో అపరాలు, 3.55 లక్షల హెక్టార్లలో ఆయిల్సీడ్స్, 2.67 లక్షల హెక్టార్లలో ఇతర పంటలు సాగయ్యాయి. ఇంత ఈజీగా ఎరువులు దొరుకుతాయనుకోలేదు.. నేను 15 ఎకరాలు కౌలుకు తీసుకుని రబీలో వరిసాగు చేశా. గతంలో ఎరువుల కోసం చాలా ఇబ్బందులు పడేవాళ్లం. మండల కేంద్రానికి, కొన్ని సందర్భాల్లో విజయవాడకు వెళ్లి తెచ్చుకునేవాళ్లం. మొట్టమొదటిసారి మా ఊళ్లోనే కావాల్సినన్ని ఎరువులుంచారు. గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రంలో 15 బస్తాల యూరియా, 5 బస్తాల డీఏపీ తీసుకున్నా. ఇంత ఈజీగా ఎరువులు దొరుకుతాయని కలలో కూడా ఊహించలేదు. సకాలంలో ఎరువులు వేయడంతో పంట ఏపుగా పెరిగింది. – కలపాల ఇసాక్, కాటూరు, ఉయ్యూరు మండలం, కృష్ణా జిల్లా రాష్ట్ర ప్రభుత్వ కృషితో ఎరువుల కొరత లేదు.. రబీ సీజన్లో ఏ దశలోనూ ఎరువుల కొరత తలెత్తలేదు. రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలితంగా సీజన్ ముందుగానే కేంద్రం మన రాష్ట్రానికి అవసరమైన ఎరువులను కేటాయించింది. ఆర్బీకేల్లోనూ అందుబాటులో ఉంచడంతో ఎక్కడా ఎరువులకోసం రైతులు ఇబ్బంది పడలేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిల్వలను పాత ధరలకే విక్రయిస్తున్నారు. –హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, వ్యవసాయశాఖ -
విచ్చలవిడి ‘బయో’కు బ్రేక్
సాక్షి, అమరావతి: అడ్డగోలుగా మార్కెట్లోకి వస్తున్న బయో ఉత్పత్తులకు బ్రేక్ పడనుంది. వీటి తయారీ, అమ్మకాలను నియంత్రిస్తూ కేంద్రం ఎరువుల నియంత్రణ చట్టం–1985 షెడ్యూల్–6ను సవరించింది. బయో ఉత్పత్తులను ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా గెజిట్ విడుదల చేసింది. బయో ఉత్పత్తుల పేరు చెప్పి దేశ వ్యాప్తంగా ఏటా వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది. జీవ ఉత్ప్రేరకాలు (బయోస్టిమ్యులెంట్) తయారీ విషయంలో ప్రత్యేకంగా ఎలాంటి ప్రొటోకాల్ లేకపోవడంతో కంపెనీలు ఏ మిశ్రమాలతో తయారు చేస్తున్నారో? ల్యాబొరేటరీ, ఫీల్డ్ ట్రయిల్స్ ఫలితాలేమిటో? తెలిసేది కాదు. పైగా ప్యాకింగ్స్పై లేబుల్స్ ఉండేవి కావు. పురుగులు, ఎరువుల మందుల నియంత్రణ చట్టాల పరిధిలో లేకపోవడంతో కంపెనీలను ప్రభుత్వాలు నియంత్రించలేకపోయేవి. ఎలాంటి పన్నులు కూడా చెల్లించే వారు కాదు. ఏపీలో ఏటా రూ. 200 కోట్ల వ్యాపారం తెలుగు రాష్ట్రాల్లో 1,200కు పైగా ఉన్న ఈ కంపెనీల ద్వారా లెక్కకు మించి బయో ఉత్పత్తులు ఏటా మార్కెట్లోకి వచ్చేవి. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడంతో 264 కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. ఈ కంపెనీలు తరచూ కోర్టులను ఆశ్రయించడం, చట్టపరిధిలో లేనందున నియంత్రించే అధికారం లేదంటూ కోర్టులు ప్రభుత్వ ప్రయత్నాలకు బ్రేకు లేయడంతో వీటిని నియంత్రించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ కంపెనీల ద్వారా మన రాష్ట్రంలోనే రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకూ వ్యాపారం జరిగేదని అంచనా. పభుత్వ ఒత్తిడితోనే గెజిట్ విడుదల రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి మేరకు కేంద్రం వీటిని ఎరువుల నియంత్రణ చట్టం పరిధిలోకి తీసుకురావడమే కాకుండా.. ఆ మేరకు ప్రత్యేకంగా గెజిట్ను విడుదల చేసి ఉత్పత్తుల రకాలను వర్గీకరించింది. సముద్రపు కలుపు మొక్కలతో సహా వివిధ రకాల మొక్కల నుంచి సంగ్రహించిన జీవసంబం«ధ పదార్థాలు, జీవ రసాయనాలు (బయో కెమికల్స్), ప్రొటీన్ హైడ్రోలైసేట్స్, అమైనో ఆమ్లాలు, విటమిన్లు, కణరహిత సూక్ష్మ జీవుల ఉత్పత్తులు, యాంటీ ఆక్సిడెంట్లు, బాష్పోచ్చేక నియంత్రణలు (యాంటీ ట్రాన్స్పిరెంట్స్) హ్యూమిక్, ఫల్విక్ ఆమ్లం వాటి ఉత్పన్నాలను ఈ షెడ్యూల్లో చేర్చారు. ఫారం జీ–3 తప్పనిసరి ► ఎరువుల చట్టం పరిధిలోకి తీసుకురావడంతో తయారీదారులు, దిగుమతిదారులు ఫారం–జీ ద్వారా రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ఎరువుల నియంత్రణాధికారికి దరఖాస్తు చేసుకోవాలి. ► ఎక్కడైతే తయారు చేస్తున్నారో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వ్యవసాయ శాఖ నుంచి ఫారమ్–జీ–2ను పొందాలి. ► దీని ద్వారా ఎరువుల కంట్రోలర్ నుంచి ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఫారం జీ–3)ను తీసుకోవాలి. ఈ సర్టిఫికెట్ ఆధారంగా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ నోటిఫైడ్ అథారిటీ నుంచి పొందే ధ్రువీకరణపత్రం ద్వారా రెండేళ్ల కాలపరిమితితో తయారీ, అమ్మకాలను కొనసాగించుకోవచ్చు. ► ఈ కొత్త చట్టం ప్రకారం ప్రతి బయో ఉత్పత్తికి నాణ్యతా నిర్ధారణ పరీక్ష తప్పనిసరి. ► ఇందుకోసం ప్రతీ రాష్ట్రానికి ప్రత్యేక ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయబోతున్నారు. ► ఈ చట్టం ద్వారా ఇక నుంచి నాణ్యమైన, నమ్మకమైన బయో ఉత్పత్తులు రైతులకు అందుబాటులోకి రావడమే కాదు జీఎస్టీ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోట్లాది రూపాయల ఆదాయం సమకూరే అవకాశాలున్నాయి. నిబంధనలను ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలు బయోస్టిమ్యులెంట్ తయారీ, పంపిణీ దారులే కాదు అమ్మకాలు చేపట్టే వ్యక్తులు కూడా ఇక నుంచి సవరించిన ఎరువుల నియంత్రణ చట్టం–2021లో నియమాలకు లోబడే నడుచుకోవాలి. అతిక్రమిస్తే చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. – అరుణ్కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
నవంబర్ నుంచి ఎరువుల ఉత్పత్తి
సాక్షి, పెద్దపల్లి: రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) నిర్మాణం చివరి దశ పనులు త్వరగా పూర్తి చేస్తామని, నవంబర్ నుంచి ఎరువుల ఉత్పత్తి ప్రారంభించాలని కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ సహాయ మంత్రి మాన్సుఖ్ మాండవ్య అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్మిస్తున్న ఆర్ఎఫ్సీఎల్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డితో కలసి శనివారం సందర్శించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రూ.6,120.5 కోట్లతో చేపట్టిన ఎరువుల కర్మాగార పునరుద్ధరణ పనులు 99 శాతం పూర్తయ్యాయన్నారు. కరోనా కారణంగా ప్లాంట్ పనులు మూడు నెలలు ఆలస్యం అయ్యాయని చెప్పారు. ప్లాంట్లో ఏటా 12.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుందని, అందులో 6.25 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణకే కేటాయిస్తామని తెలిపారు. కర్మాగారం పూర్తయ్యాక ఎరువుల కొరత సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా రైతులు దాదాపు 4 కోట్ల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగిస్తారని, 2.5 కోట్ల యూరియా దిగుమతి చేసుకుంటామని వివరించారు. దేశవ్యాప్తంగా ఐదు ఎరువుల కర్మాగారాలు నిర్మిస్తున్నామని తెలిపారు. రైతులు వినియోగించే ఎరువుల బస్తాపై కేంద్ర ప్రభుత్వం రూ.600 నుంచి రూ.700 సబ్సిడీ అందిస్తుందన్నారు. ఈ కర్మాగారం ద్వారా స్థానికంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర ఎరువుల శాఖ అదనపు కార్యదర్శి ధర్మాపిల్, కలెక్టర్ భారతి హోళికేరి, ఆర్ఎఫ్సీఎల్ ఈడీ రాజన్ థాపర్ పాల్గొన్నారు. తమాషా చూస్తున్నారా? పోలీసులపై కిషన్రెడ్డి ఆగ్రహం రాష్ట్రంలో ఎక్కడ ప్రతిపక్షాలు ధర్నాలు చేసినా ముందే హౌస్ అరెస్ట్ చేసే పోలీసులు, అధికార పార్టీ నాయకుల విషయంలో పక్షపాతంగా వ్యవహరించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎఫ్సీఎల్ గేటు ఎదుట టీఆర్ఎస్ నాయకులు గంటసేపు ధర్నా చేసినా పట్టించుకోకుండా తమాషా చూస్తున్నారా అని పోలీసులను నిలదీశారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్న క్రమంలో జనాల వద్దకు మంత్రులు వెళ్లొద్దని కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా.. తాము వాహనాలను దిగివచ్చి స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేతో మాట్లాడామన్నారు. అక్క డ పెద్దసంఖ్యలో గుమికూడిన ప్రజలను నియంత్రించడంలో పోలీసులు విఫలమ య్యారని విమర్శించారు. రాజకీయం కావా లా? ఫ్యాక్టరీ కావాలా? తెలంగాణ రైతులకు ఉపయోగపడే యూరియా కావాలా? అని ఆయన ప్రశ్నించారు. ఈ నెలాఖరుకు ప్లాంట్లో ట్రయల్రన్ నిర్వహిస్తామని, నవంబర్లో ప్రధాని మోదీ చేతులు మీదుగా ఆర్ఎఫ్సీఎల్ ప్రారంభిస్తామని తెలిపారు. ఆర్ఎఫ్సీఎల్లో ‘లోకల్ ఫైట్’ కేంద్ర మంత్రుల పర్యటన సందర్భంగా రామగుండం ఎరువుల కర్మాగారం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఫ్యాక్టరీని సందర్శించేందుకు వచ్చిన కేంద్ర మంత్రులు మాండవ్య, కిషన్రెడ్డిని స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఆర్ఎఫ్సీఎల్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించడంతో కేంద్ర మంత్రులు వాహనాలు దిగి వారి వద్దకు వెళ్లారు. ఈ సమయంలో మంత్రులకు, ఎంపీ వెంకటేశ్, ఎమ్మెల్యే చందర్ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఆర్ఎఫ్సీఎల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని, ఫ్యాక్టరీని ఆనుకుని ఉన్న వీర్నపల్లి గ్రామాన్ని తరలించాలంటూ టీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. ఇదే క్రమంలో అక్కడకు చేరుకొన్న బీజేపీ నాయకులు కూడా ప్రతిగా నినాదాలు చేశారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఒకదశలో అసహనానికి గురైన కేంద్రమంత్రులు వెనక్కివెళ్లి వాహనాల్లో కూర్చున్నారు. ఈ సమయంలో ఎంపీ వెంకటేశ్ వారివద్దకు వెళ్లి కేంద్రమంత్రులతో మాట్లాడారు. తర్వాత మంత్రులు ఫ్యాక్టరీ లోపలికి వెళ్లారు. ఎంపీ వెంకటేశ్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
సిద్ధమవుతున్న రామగుండం ప్లాంటు
న్యూఢిల్లీ: రామగుండం ఫెర్టిలైజర్ ప్లాంటు తిరిగి ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇక్కడ 99.58 శాతం పనులు పూర్తి అయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గోరఖ్పూర్ (యూపీ), సింద్రి (జార్ఖండ్), తాల్చేర్ (ఒడిషా) వద్ద ఉన్న ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఇతర ఖాయిలా పడ్డ యూనిట్లలో పనులు జరుగుతున్నాయని వివరించింది. గోరఖ్పూర్, సింద్రి యూనిట్లలో 2021లో, తాల్చేర్ ప్లాంటులో 2023లో యూరియా ఉత్పత్తి కార్యకలాపాలు తిరిగి మొదలు కానున్నాయి. బిహార్లోని బరౌనిలో హిందుస్తాన్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్కు చెందిన యూనిట్ను సైతం పునరుద్ధరిస్తున్నారు. 77.60 శాతం పనులు పూర్తి అయిన ఈ ప్లాంటు వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఒక్కో ప్లాంటు వార్షిక సామర్థ్యం 1.27 మిలియన్ టన్నులు ఉండనుంది. దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా యూరియా తయారీ చేపట్టాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ నేపథ్యంలో మూతపడ్డ ఈ అయిదు ప్లాంట్లను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరిస్తోంది. -
ఫెర్టిలైజర్ స్టాక్స్కు భారీ డిమాండ్
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడికి లాక్డవున్ అమలులో ఉన్నప్పటికీ ఎరువుల అమ్మకాలు భారీగా పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో పీవోఎస్ ద్వారా రైతులకు 111.61 లక్షల మెట్రిక్ టన్నుల(ఎంటీ) ఎరువులను విక్రయించినట్లు ఎరువులు, రసాయనాల శాఖ పేర్కొంది. ఇదే కాలంలో గతేడాది(2018-19) విక్రయించిన 61.05 లక్షల ఎంటీతో పోలిస్తే ఇవి 83 శాతం అధికమని వెల్లడించింది. తాజా క్వార్టర్లో 64.82 లక్షల ఎంటీ యూరియా(67 శాతం అధికం), 22.46 లక్షల ఎంటీ(100 శాతం) డీఏపీ, 24.32 లక్షల ఎంటీ కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్ (120 శాతం అప్) ఎరువులను విక్రయించినట్లు వివరించింది. లాక్డవున్ నేపథ్యంలోనూ ఎరువుల తయారీ, పంపిణీ సవ్యంగా జరిగినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఫెర్టిలైజర్ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. ఇదీ తీరు ఎరువుల అమ్మకాలు ఊపందుకున్న వార్తలతో సుమారు 16 ఎరువుల కంపెనీల షేర్లు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో నేషనల్ ఫెర్టిలైజర్స్(ఎన్ఎఫ్ఎల్) 20 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. రూ. 37 సమీపంలో ఫ్రీజయ్యింది. ఈ బాటలో చంబల్ ఫెర్టిలైజర్స్ 5 శాతం జంప్చేసి రూ. 154ను తాకింది. తొలుత రూ. 157కు చేరింది. ఇక రాష్ట్రీయ కెమికల్స్(ఆర్సీఎఫ్) 5.3 శాతం పెరిగి రూ. 49 వద్ద కదులుతుంటే.. ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్(ఫ్యాక్ట్)5.5 శాతం ఎగసి రూ. 50.6ను తాకింది. ఇతర కౌంటర్లలో గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్(జీఎస్ఎఫ్సీ)3.5 శాతం పెరిగి రూ. 56.5 వద్ద, దీపక్ ఫెర్టిలైజర్స్ 3.5 శాతం పుంజుకుని రూ. 116.5 వద్ద, జువారీ గ్లోబల్ 4 శాతం లాభపడి రూ. 56 వద్ద ట్రేడవుతున్నాయి. టాటా కెమికల్స్ 1 శాతం బలపడి రూ. 311 వద్ద కదులుతోంది. తొలుత రూ. 314 వరకూ ఎగసింది. -
సెప్టెంబర్ నుంచి రామగుండం ఎరువుల ఉత్పత్తి!
సాక్షి, న్యూఢిల్లీ: రామగుండం ఎరువులు, రసాయనాల కర్మాగారం(ఆర్ఎఫ్సీఎల్) సెప్టెంబరు నెలాఖరు నుంచి ఎరువుల ఉత్పత్తి ప్రారంభించనున్నట్టు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయమంత్రి మన్ సుఖ్ మాండవీయకు సంబంధిత అధికారులు నివేదించారు. దేశంలోని ఐదు ఎరువుల కర్మాగారాల పునరుద్ధరణ ప్రక్రియపై మంత్రి ఆ శాఖ అధికారులతో కలసి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. గోరఖ్ పూర్, బరౌనీ, సింధ్రీలోని హిందూస్తాన్ ఉర్వరక్ రసాయన్ లిమిటెడ్ ప్లాంట్లు, రామగుండం ఎరువులు రసాయనాల సంస్థ, తాల్చేర్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ప్లాంట్లపై సమీక్ష జరిగింది. కర్మాగారాల ఆర్థిక ప్రగతి, ఇతర అభివృద్ధి అంశాలపై మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కర్మాగారాల పునరుద్ధరణ పనులను సత్వరం పూర్తి చేసేందుకు సాధ్యమైన అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రామగుండం ఎరువుల రసాయనాల కర్మాగారం అభివృద్ధి పనులు ఇప్పటికే 99.53% పూర్తయ్యాయని, కరోనా వైరస్ సంక్షోభం తలెత్తిన కారణంగా కొన్ని చిన్న పనుల్లో కాస్త జాప్యం జరిగిందని ఈ సమావేశంలో అధికారులు మంత్రికి తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరుకల్లా రామగుండం ప్లాంట్లో ఎరువుల ఉత్పాదన మొదలవుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. అలాగే గోరఖ్పూర్ ఎరువుల కర్మాగారం పనులు 77%, సింధ్రీ ప్లాంట్ పనులు 70%, బరౌనీ కర్మాగారం పనులు 69% పూర్తయ్యాయని అధికారులు వివరించారు. గోరఖ్ పూర్, సింధ్రీ, బరౌనీ ప్లాంట్లు వచ్చే ఏడాది మే నెలలోగానే పూర్తవుతాయన్నారు. ఒడిశాలోని తాల్చేర్ ఎరువుల కర్మాగారంలో ప్రస్తుతం ప్రాజెక్టు అవకాశాలపై అంచనా, డిజైన్ల రూపకల్పన పని కొనసాగుతోందని చెప్పారు. -
ప్రతీ పైసా లబ్ధిదారుడికే
తాల్చేర్/ఝార్సుగూడ/జాంజగీర్–చంపా: కాంగ్రెస్ హయాంలో పథకాల అమల్లో అవినీతి చోటుచేసుకుందని, ఇప్పుడు ప్రతీ పైసా పేదలకు అందుతోందని ప్రధాని మోదీ అన్నారు. సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని ఛత్తీస్గఢ్లోని బీజేపీ సర్కారు నిరూపించిందని ఆయన పేర్కొన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న ఛత్తీస్గఢ్లో శనివారం పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని దాదాపుగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’ లక్ష్యంతో ముందుకు.. ‘నక్సలైట్లు, పేలుళ్లు, రక్తపాతానికి పేరుపడ్డ ఛత్తీస్గఢ్.. బీజేపీ హయాంలో అన్ని సవాళ్లను అధిగమించింది. అభివృద్ధి పథంలో నడుస్తున్న రాష్ట్రాల నడుమ స్థానాన్ని సంపాదించుకుంది’ అని మోదీ అన్నారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రాలకు అందే నిధులు సక్రమంగా ఖర్చయ్యేవి కాదని, ఇప్పుడు ప్రతీ పైసా లబ్ధిదారుడికి చేరుతోందని అన్నారు. ‘ఎన్నికల్లో గెలుపు కోసమో లేదా ఓటు బ్యాంకు కోసమో పథకాల రూపకల్పనపై ఎన్డీఏ ప్రభుత్వానికి నమ్మకం లేదు. ఓటు బ్యాంకు కోసం కాకుండా అందరి లబ్ధికే మా ప్రభుత్వం పథకాలు రూపొందిస్తోంది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ లక్ష్యంతో ముందుకెళ్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో రూ. 1607 కోట్లతో నిర్మించనున్న బిలాస్పూర్–పత్రపాలి రహదారికి, రూ. 1,697 కోట్లతో బిలాస్పూర్–అనుప్పుర్ మూడో రైల్వే లైన్కు ఆయన శంకుస్థాపన చేశారు. నవీన్ పట్నాయక్కు విజ్ఞప్తి ఒడిశాలోని తాల్చేర్లో రూ.13 వేల కోట్ల ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తూ.. ‘ఆయుష్మాన్ భారత్తో ఒడిశా ప్రజల్ని అనుసంధానం చేయాలని సీఎం నవీన్ పట్నాయక్కు విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల పేద ప్రజలు పథకం లబ్ధిని కోల్పోతారు’ అని ఆందోళన వెలిబుచ్చారు. తమ రాష్ట్రంలో అమలు చేస్తున్న బిజూ స్వాస్థ్య కల్యాణ్ యోజన పథకమే మెరుగైనదిగా పేర్కొంటూ ఆయుష్మాన్ భారత్లో ఒడిశా చేరలేదు. వచ్చే ఏడాది ఒడిశాలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో పర్సంటేజ్, కమిషన్ల రాజ్యమేలుతున్నాయని ఆయన విమర్శించారు. ఝార్సుగూడలో వీర్ సురేంద్ర సాయ్ విమానాశ్రయాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. డబ్బులివ్వకపోతే మరుగుదొడ్ల నిర్మాణం వంటి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి ప్రజలకే చేరడం లేదని విమర్శించారు. తాల్చేర్ ఎరువుల కర్మాగారంలో బొగ్గు నుంచి ఉత్పత్తి చేసిన గ్యాస్ ద్వారా వేపపూతతో కూడిన యూరియాను తయారుచేస్తారు. మోదీకి అరటి శాలువా జాంజగీర్ సభలో ప్రధాని మోదీకి స్వయం సహాయక గ్రూపులకు చెందిన మహిళలు అరటి, అవిసె చెట్ల ఉత్పత్తుల నుంచి తయారు చేసిన జాకెట్, శాలువాను బహూకరించారు. ఆ జాకెట్ ధరించే సభలో మోదీ ప్రసంగించారు. -
రాష్ట్రంలో యూరియా సంక్షోభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యూరియా సంక్షోభం తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది. రాష్ట్రానికి యూరియా సరఫరా చేసే ప్రముఖ ఎరువుల కంపెనీలో ఉత్పత్తి నిలిచిపోవడంతో దాదాపు 6 లక్షల టన్నుల కొరత ఏర్పడింది. ఎరువుల కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతో మార్క్ఫెడ్ అధికారులు సమావేశమై చర్చిస్తున్నారు. ఇందుకు సంబంధించి మార్క్ఫెడ్ బుధవారం ప్రత్యేకంగా సమావేశమవుతోంది. యూరియా సంక్షోభం ఉందని తెలిస్తే రైతులు కంగారు పడతారని భావించిన అధికారులు అంతా బాగుందనే ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు. మార్క్ఫెడ్ వద్ద బఫర్స్టాక్ 2 లక్షల టన్నుల వరకు సిద్ధంగా ఉండాలి. కానీ ఈ నెల మూడో తేదీ నాటికి నీమ్ కోటెడ్ యూరియా 91,367 టన్నులే ఉండటంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎందుకీ పరిస్థితి?: రాష్ట్రానికి యూరియాను సరఫరా చేసే కంపెనీల్లో నాగార్జున ఫెర్టిలైజర్స్ ప్రధానమైంది. దేశవ్యాప్తంగా యూరియా తయారీ కంపెనీలు ఎదుర్కొంటున్నట్టే ఈ సంస్థ కూడా తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఈ సంస్థ నుంచి 15 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుంది. ఇందులో 6 లక్షల టన్నులు రాష్ట్రానికి సరఫరా అవుతుంది. ఇప్పుడు ఆ యూరియా నిల్వలు నిలిచిపోయే ప్రమాదం నెలకొంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ అత్యంత కీలక దశలో ఉంది. తెలంగాణలో 1.08 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. అందుకోసం రాష్ట్రానికి 8 లక్షల టన్నుల యూరియా అవసరం. నాగార్జునలో ఉత్పత్తి నిలిచి పోవడంతో రాష్ట్రంలో 6 లక్షల టన్నుల యూరియా కొరత ఏర్పడనుంది. పరిస్థితిని పసిగట్టిన అధికారులు కోరమాండల్, ఇఫ్కో, క్రిబ్కో, జువారీ, స్పిక్ గ్రూపు సంస్థల ప్రతినిధులతో మంతనాలు జరుపుతున్నారు. యూరియా కొరతను నివారించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా లేవు. ఈ పరిస్థితుల్లో రైతులకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. దేశంలో 32 యూరియా తయారీ కంపెనీలు ఉంటే వాటిల్లో 29 నష్టాల్లో ఉన్నాయి. వీటికి కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు రూ.70 వేల కోట్ల వరకు సబ్సిడీ బకాయిలు ఉన్నాయి. -
సీఎస్సీ విలేజ్ లెవల్ సెంటర్ ప్రారంభం
సాక్షి, అల్గునూర్(మానకొండూర్) : ప్రభుత్వ, ప్రైవేటు సేవలను పౌరులకు అందించేందుకు ప్రభుత్వ అనుబంధంగా ఏర్పాటు చేసిన సిటిజన్ సర్వీస్ సెంట్ విలేజ్ లెవల్ కార్యాలయం తిమ్మాపూర్ మండలం అల్గునూర్లో ఏర్పాటయింది. రైతులకు అవసరమైన ఎరువులను ఈ సర్వీస్ సెంటర్ ద్వారా అందించేందుకు ఏర్పాటు చేసిన గోదామును కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటురంగ సేవలు ఈ సిటిజన్ సర్వీస్ సెంటర్ ద్వారా అందుబాటులోకి వస్తాయన్నారు. దేశంలో ఇప్పటివరకు సీఎస్సీ ఆధ్వర్యంలో ఒకేఒక్క ఫర్టిలైజర్ గోదాముందని, రెండోది, రాష్ట్రంలో మొట్టమొదటి గోదాం అల్గునూర్లో ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. సీఎస్సీ సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం సేవలన్నీ ఈ సెంటర్లో అందుబాటులో ఉంటాయని, హైదరాబాద్లో ఉన్న డాక్టర్ సేవలను కూడా ఇక్కడి నుంచి పొందొచ్చని తెలిపారు. రైతులకు కావాల్సిన ఎరువులన్నీ సీఎస్సీ కేంద్రంలో అందుబాటులో ఉంటాయ ని పేర్కొన్నారు. ఈ కేంద్రం ద్వారా త్వరలో మరిన్ని సేవలు పౌరులకు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. సీఎస్సీ హైదరాబాద్ ఇన్చార్జి మంజుల వీఎల్ఈ శానిటరీ నాప్కిన్ యూనిట్ను ప్రారంభించారు. సీఎస్సీ జిల్లా మేనేజర్ శ్రీరాం శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర బ్యాధుడు శివకుమార్, సొసైటీ అధ్యక్షుడు రాజు, అల్గునూర్ సర్పంచ్ చిందం కిష్టయ్య, ఎంపీటీసీ స్వామిరెడ్డి, తహసీల్దార్ జగత్సింగ్, కంది రాంచంద్రారెడ్డి, చల్ల మహేందర్రెడ్డి, జాప శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
శరవేగంగా ఆర్ఎఫ్సీఎల్ పనులు
గోదావరిఖని(రామగుండం): రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్ఎఫ్సీఎల్) పునరుద్ధరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పునరుద్ధరణ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 77 శాతం పనులు పూర్తయినట్లు ఆర్ఎఫ్సీఎల్ డీజీఎం విజయ్కుమార్ భంగార్ తెలిపారు. రూ.5,260 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కర్మాగారంలో డెన్మార్క్కు చెందిన అల్దర్టాప్ అనే సంస్థ యూరియాను ఉత్పత్తి చేసే యంత్రాలను సమకూరుస్తోందని శుక్రవారం ఆయన ప్లాంట్లో విలేకరులకు తెలిపారు. ఎరువుల ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా నిర్మిస్తున్న ప్రిల్లింగ్ టవర్ను 134 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఇందులో ప్రస్తుతం లిప్ట్ పనులు, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ పనులు జరుగుతున్నాయి. 32 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్.. ఆర్ఎఫ్సీఎల్ కర్మాగారంలో అంతర్గత అవసరాల కోసం 32 మెగావాట్ల క్యాప్టివ్ విద్యుత్ ప్లాంట్ను బీహెచ్ఈఎల్ సంస్థ నిర్మించింది. క్వార్టర్లు, ఇతర అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 మెగావాట్ల విద్యుత్ను వినియోగించనున్నారు. కర్మాగారంలో ఎరువుల ఉత్పత్తి ప్రక్రియ కోసం 220 కేవీ స్విచ్ యార్డును నిర్మించారు. దీనికి ట్రాన్స్కో నుంచి విద్యుత్ లైన్లు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఏటా 0.5 టీఎంసీల నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్లాంట్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లంపల్లి పంప్హౌస్ నుంచి ఈ నీటిని తీసుకువచ్చేందుకు పైపులైన్లు బిగిస్తున్నారు. అలాగే ప్లాంట్లో ఎల్లంపల్లి నీటిని శుద్ధిచేసి వాడేందుకు వీలుగా ప్రత్యేక పంప్ హౌస్ను నిర్మించారు. ఉత్పత్తి చేసిన ఎరువులను రవాణా చేయడానికి వీలుగా రైల్వే లైన్ను ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. కర్మాగారానికి అవసరమైన అత్యాధునిక యంత్రాలు వారంలోగా రామగుండం చేరుకోనున్నాయి. సిబ్బంది కోసం క్వార్టర్లు సిద్ధం చేస్తున్నామని డీజీఎం విజయ్కుమార్ భంగార్ తెలిపారు. విధులు బహిష్కరించిన కార్మికులు ఆర్ఎఫ్సీఎల్లో వివిధ కాంట్రాక్టర్ల కింద పనిచేస్తున్న కార్మికులకు గత 3 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని పేర్కొంటూ శుక్రవారం విధులు బహిష్కరించారు. ఆర్ఎఫ్సీఎల్ గేట్ వద్ద ఉదయం బైఠాయించి నిరసన తెలిపారు. -
గ(క)ల్తీ.. ఎరువులు
నందిమల్ల్లగడ్డ గ్రామానికి చెందిన రైతు లక్ష్మణ్ రెండు మళ్లలో వంకాయ తోట సాగుచేశాడు. 15 రోజుల క్రితం వనపర్తిలోని ప్రియాంక ఎరువుల దుకాణంలో కొనుగోలు చేసిన ఎరువును పంటకు వేశాడు. తడి ఆరకుండా నీళ్లు పెడుతున్నా ఎరువు కరగడం లేదు. అందులో సున్నపురాళ్లు, గులకరాళ్లు ఉన్నట్లు బాధిత రైతు గుర్తించి లబోదిబోమన్నాడు. ఇలా చాలామంది రైతులను నకిలీ ఎరువులు నిలువునా ముంచాయి. సాక్షి, వనపర్తి : జిల్లాలోని వీపనగండ్ల మండలంలో ఓ వ్యాపారి నుంచి రైతులు వరి విత్తనాలను కొనుగోలుచేసి నాటితే నారుకు బదులు మొత్తం తుంగనే మొలిచింది. దీనిని తుంగ దశలోనే గుర్తించడంతో కోట్ల రూపాయల పంటనష్టం నుంచి రైతులు బయటపడగలిగారు. ఇదే కోవలో వనపర్తి మండలంలోనూ నకిలీ ఎరువులను విక్రయించడంతో అన్నదాతలు పూర్తిగా నష్టపోయారు. ఇలా కల్తీ ఎరువులు రైతులను నిలువునా ముంచుతున్నాయి. అక్రమ సంపాదన రుచిమరిగిన వ్యాపారు లు వాటిని యథేచ్ఛగా అంటగడుతున్నారు. నకిలీ ఎరువు లు, విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని సీఎం కేసీఆర్ హెచ్చరించినా క్షేత్రస్థాయిలో మార్పు కనిపించడం లేదు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు ముందు నుంచే ప్రభుత్వం అక్రమ వ్యాపారులపై పీడీ యాక్ట్ కేసులు నమోదుచేసి కఠినచర్యలు తీసుకునేలా ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ అమలుకాలేదు. ‘నకిలీ’ దుకాణం వనపర్తి పట్టణంలో కేశవులు అనే వ్యాపారి ప్రియాంక ఫర్టిలైజర్స్ పేరుతో ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తున్నాడు. ఈ దుకాణంలో వనపర్తి మండలంలోని నందిమళ్ల గడ్డకు చెందిన కొందరు రైతులు చాలారోజులుగా ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేస్తున్నారు. తెలిసిన వ్యాపారి కావడంతో పెద్దగా నిరక్షరాస్యులైన రైతులు ఏటా వ్యాపారి చెప్పిన ఎరువులనే తీసుకెళ్లేవారు. గత ఖరీఫ్లో విత్తనాలు, ఎరువులనే కొనుగోలుచేసినా పెద్దగా పంట దిగుబడి రాలేదు. ప్రస్తుతం ఈ ప్రాంతంలోని చాలా మంది రైతులు వేరుశనగ, వరి, వంకాయ, చిక్కుడు, టమాట పంటలను సాగుచేశారు. రెండు నెలల క్రితం పంటలు సాగుచేసే సమయంలో వ్యాపారి కేశవులు వద్ద మందు 20–20రకం అడుగు మందును సుమారు 20మంది రైతులు కొనుగోలుచేశారు. సదరు వ్యాపారి జిల్లాలోని చాలామంది రైతులకు ఇలాంటి విత్తనాలు, ఎరువులనే విక్రయించినట్లు తెలిసింది. వెలుగులోకి వచ్చింది ఇలా.. చేనులో ఎదుగుదల లోపించడంతో ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకోక రైతులు మరోసారి మరోసారి అడుగు మందు చల్లారు. అయినా పంటలో మార్పు లేకపోవడంతో మోసపోయామని గ్రహించిన రైతులు వ్యవసాయశాఖ అధికారులు, పోలీసులను ఆశ్రయించారు. రైతులు రెండు రోజులు క్రితం నాణ్యత లేని ఎరువులను విక్రయించిన వ్యాపారి దుకాణం ఎదుట ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న వ్యవసాయశాఖ అధికారులు, పోలీసులు దుకాణాన్ని తనిఖీ చేయగా విస్తుగొలిపే వాస్తవాలు బయటపడ్డాయి. ఎలాంటి అనుమతి లేకుండా గ్రీన్గోల్డ్ అనే కంపెనీకి చెందిన 20–20 అడుగు మందు, 3–15, 20–20–0 ఎరువులు బస్తాల కొద్దీ పట్టుబడ్డాయి. వీటి శాంపిళ్లను సేకరించిన అధికారులు నివేదిక కోసం ఎరువుల ప్రయోగశాలకు పంపించారు. రిపోర్టు వస్తే సదరు ఎరువుల వ్యాపారిపై కేసు నమోదుచేస్తామని అధికారులు స్పష్టంచేశారు. ఈ –పాస్ వచ్చినా అదేతీరు.. ప్రభుత్వం జనవరి 1వ తేదీ నుంచి ఈ పాస్ యంత్రాల ద్వారానే ఎరువులు విక్రయించాలని నిబంధనలు కఠినతరం చేసింది. ఇందుకు సంబంధించి కలెక్టర్ శ్వేతామహంతి, వ్యవసాయ శాఖ అధికారులు వరసుగా డీలర్ల దుకాణాల వద్దకు వెళ్లి పరిశీలిస్తున్నారు. అయినా ప్రియాం క ఫర్టిలైజర్ దుకాణం నిర్వాహకుడు ఎరువుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయలేదు. అతని వద్ద ఎన్ని కంపెనీలకు చెందిన ఎరువులు ఉన్నా యో కూడా లెక్కచెప్పడం లేదు. రిపోర్టు రాగానే చర్యలు రైతుల ఫిర్యాదు మేరకు నష్టపోయిన పంటలను పరిశీలించాం. రైతులకు అమ్మిన ఎరువుల శాంపిళ్లను ల్యాబ్కు పంపించాం. ప్రియాంక ఫర్టిలైజర్ దుకాణాన్ని తాత్కాలికంగా మూసివేశాం. రెండు రోజుల్లో తెరిపించి మొత్తం లెక్కగట్టి 6 ఏ సెక్షన్ కింద కేసునమోదు చేసి జేసీ కోర్టులో హాజరుపరుస్తాం. నకిలీ ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అమ్మితే కఠినచర్యలు తీసుకుంటాం. – సుజాత, వ్యవసాయశాఖ అధికారి, వనపర్తి జిల్లా -
ఎరువుల అమ్మకంలో ‘డీబీటీ’ తప్పనిసరి
అనంతపురం అగ్రికల్చర్: డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) విధానంలో ఎరువుల అమ్మకాలు తప్పనిసరి చేయాలని స్టేట్ కన్సల్టెంట్ సంతోష్కుమార్ తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఇందులో ఎలాంటి అలసత్వానికి తావులేదన్నారు. శుక్రవారం స్థానిక వ్యవసాయశాఖ జేడీ చాంబర్లో మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ ఎ.బాలభాస్కర్, డీసీఎంఎస్ జిల్లా మేనేజర్ విజయభాస్కర్, టెక్నికల్ ఏవో చెన్నవీరస్వామి తదితరులతో సమావేశం నిర్వహించారు. అక్టోబర్ నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయడానికి వీలుగా లైసెన్సు కలిగిన ఎరువుల అంగళ్లకు బయోమెట్రిక్, స్వైప్ మిషన్లు అందజేయాలన్నారు. అయితే అక్కడక్కడ సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నందున ఆధార్బేస్డ్ బయోమెట్రిక్ పద్ధతికి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. సాంకేతిక పరిజ్ఞానం మెరుగుపరచడంతో పాటు దీనిపై పూర్తిగా అవగాహన పెంచుకుంటే సమస్యలు తగ్గుతాయని తెలిపారు. -
ఖరీఫ్కు 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు
అనంతపురం అగ్రికల్చర్ : ప్రస్తుత ఖరీఫ్లో జిల్లాకు 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాకు కేటాయించాలని కోరగా కమిషనరేట్ నుంచి అనుమతులు లభించినట్లు వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి ‘సాక్షి’కి తెలిపారు. అందులో అత్యధికంగా కాంప్లెక్స్ ఎరువులు 86,662 మెట్రిక్ టన్నులు, యూరియా 52,574 మెట్రిక్ టన్నులు, 3,456 మెట్రిక్ టన్నులు డీఏపీ, 6,364 మెట్రిక్ టన్నులు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (ఎంవోపీ), 1,626 మెట్రిక్ టన్నులు సింగిల్ సూపర్ పాస్ఫేట్ (ఎస్ఎస్పీ) కేటాయించినట్లు తెలిపారు. ఈ ఎరువులు వివిధ కంపెనీల నుంచి నెలవారీ కోటా ప్రకారం జిల్లాకు సరఫరా అవుతాయన్నారు. అందులో ఏప్రిల్ కోటాలో 12,064 మెట్రిక్ టన్నులు, మేలో 22,616 మెట్రిక్ టన్నులు, జూన్లో 27,139 మెట్రిక్ టన్నులు, ఆగస్టులో 36,695 మెట్రిక్ టన్నులు, సెప్టెంబర్లో 18,088 మెట్రిక్ టన్నులు మేర జిల్లాకు సరఫరా కానున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 40 వేల మెట్రిక్ టన్నుల వరకు నిల్వలు ఉన్నందున ఖరీఫ్ రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. అంతేకాకుండా జూన్ నుంచి ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ విధానంతో ఎరువుల అమ్మకాలు (డీటీబీ) సాగించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. -
కల్తీ చేస్తే.. కటకటాలే!
విత్తనాలు, ఎరువుల్లో కల్తీకి పాల్పడేవారిపై ఉక్కుపాదం ► అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం ► కఠిన చట్టం తెచ్చి త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేస్తాం ► ఆహార పదార్థాలు కల్తీ చేసేవారిపైనా కఠిన చర్యలు ► పండించిన కూరగాయలు, పండ్లను రైతులే అమ్మాలి ► ఈ నెల 10 నుంచి ఏఈవోలు గ్రామాల్లో పర్యటించాలి సాక్షి, హైదరాబాద్: రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందాలని, నకిలీ, కల్తీకి అవకాశం లేకుండా చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నకిలీ, కల్తీకి పాల్పడే వ్యక్తులపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపేలా కఠిన చట్టం రూపొందించాలని స్పష్టంచేశారు. ఇందుకు సంబంధించి త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆహార పదార్థాలను కల్తీ చేసే వారిపైనా ఉక్కుపాదం మోపేలా విధానం రూపొందించాలని ఆదేశించారు. కూరగాయలు, పండ్లు మన రైతులే పండించి అమ్మేలా తగిన సహకారం అందించాలని సూచించారు. పండించిన పంటను కూడా రైతులతోనే ఆహార పదార్థంగా ప్రాసెసింగ్ చేయించాలని పేర్కొన్నారు. రైతులకు పెట్టుబడి వ్యయాన్ని అందించే విధానంతోపాటు ఎరువులు, విత్తనాల సరఫరా, రైతు సంఘాల ఏర్పాటు తదితర అంశాలపై సోమవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పెట్టుబడి నుంచి గిట్టుబాటు ధర కల్పించే వరకు వ్యవసాయానికి సంబంధించిన ప్రతీ ప్రక్రియలో రైతుకు వెన్నుదన్నుగా ఉండాలని అధికారులకు సూచించారు. ఈ వానాకాలం పంటలకు సరిపడా ఎరువులు అందించాలని కేంద్ర ఎరువులు, రసాయన శాఖ మంత్రి అనంత్ కుమార్ను కోరారు. ఈ భేటీలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ముఖ్య కార్యదర్శులు నర్సింగరావు, పార్థసారథి, ఎంపీ కె.కేశవరావు, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్ రావు, ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎరువులు ఇప్పుడే నిల్వ చేయండి వర్షాకాలానికి అవసరమయ్యే ఎరువులన్నీ వేసవిలోనే సేకరించి నిల్వ పెట్టుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో 16 లక్షల టన్నుల ఎరువులు అవసరమని, ఇప్పటికే 8 లక్షల టన్నులు సిద్ధంగా ఉన్నాయని అధికారులు సీఎంకు చెప్పారు. కొంత ఎరువు స్థానికంగానే లభ్యమవుతుందన్నారు. 2 లక్షల టన్నుల యూరియా, 50 వేల టన్నుల డీఏపీ, 2 లక్షల టన్నుల ఎన్పీకే సేకరించి పెట్టుకుంటే వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. ఇందుకు స్పందించిన సీఎం వెంటనే కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంతకుమార్కు ఫోన్ చేసి ఎరువులుS సరఫరా చేయాలని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. మంగళవారం వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి ఢిల్లీ వెళ్లి ప్రతిపాదనలు అందించనున్నారు. ‘‘రాష్ట్రంలో కేవలం వరి ధాన్యం విషయంలో మాత్రమే స్వయం సమృద్ధి సాధించాం. ఇతర ఆహార ధాన్యాలు, కూరగాయలు, పండ్లు ఇంకా దిగుమతి చేసుకుంటున్నాం. తెలంగాణ అవసరాలు ఏమిటి? కూరగాయలు ఎన్ని కావాలి? పండ్లు ఎన్ని కావాలి? ఏది ఎంత కావాలో నిర్ధారించి అంత మేరకు ఉత్పత్తి చేసుకోవాలి. దీని ద్వారా ప్రజల అవసరాలు తీరుతాయి. మన అవసరాలు పోను మిగతా సరుకును ఎగుమతి చేస్తే రైతులు బాగుపడతారు. ఇందుకు అధికారులు ఏ పంట వేయాలనే విషయంలో రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం, సూచనలు అందించాలి. ఏ పంటకు డిమాండ్ ఉందో గుర్తించి మార్కెట్ అవసరాలకు తగ్గట్టు ఉత్పత్తి చేయాలి’’ అని సీఎం చెప్పారు. గ్రామాల్లో రైతు సంఘాలు ఏర్పాటు చేయాలని, వారికి సరైన శిక్షణ ఇవ్వాలని సూచించారు. గ్రామంలో రైతులంతా ఒకే పంట కాకుండా వేర్వేరు పంటలు వేసేలా ప్రోత్సహించాలన్నారు. మిర్చి వేసిన రైతులే కారం పట్టి అమ్మేలా, పసుపు కొమ్ములను పసుపుగా మార్చేలా రైతులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. తెలంగాణ అవసరాలకు తగినట్లుగా వ్యవసాయ శాఖ కూడా స్వరూపం మార్చుకోవాలని, అసవరమైన సిబ్బందిని నియమించుకోవాలని, ఏ ఉద్యోగి ఏ పని చేయాలనే విషయంలో జాబ్ చార్ట్ రూపొందించాలని ఆదేశించారు. భూముల లెక్కలు తీయండి వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవో) ఈ నెల 10 నుంచి జూన్ 10 వరకు గ్రామాల్లో పర్యటించి, భూముల వివరాలు సేకరించా లని సీఎం ఆదేశించారు. ‘‘ఏ రైతు దగ్గర ఎంత భూమి ఉంది? అందులో ఏ పంట సాగుచేస్తున్నారు? నీటి వసతి ఉందా? వానా కాలంలో ఏం పండిస్తారు? యాసం గిలో ఏం పండిస్తారు? సూక్ష్మ సేద్యం చేస్తు న్నారా? యంత్రాలు వాడుతున్నారా? భూ సార పరీక్ష చేయించారా? చేయిస్తే ఎలాంటి రకం నేల అని తేలింది? తదితర వివరాలన్నీ సేకరించాలి. ఇలా సేకరించిన వివరాల ఆధారంగానే రైతుకు పెట్టుబడి అందించ డంతో పాటు భవిష్యత్తులో రైతుకు సంబం ధించిన ఇతర కార్యక్రమాలు అమలు చే స్తాం. కాబట్టి వివరాలు కచ్చితంగా ఉండాలి. వాస్తవాలే ఉండాలి. తప్పుడు వివరాలు సేక రించినా.. తప్పుడు సమాచా రం అందిం చినా ప్రభుత్వం కఠినంగా వ్యవ హరిస్తుంది. వ్యవసాయాధికా రులు ప్రతీ రైతు దగ్గరికి వస్తారు. రైతులు పూర్తి సమాచారం ఇచ్చి సహకరించాలి’’ అని పేర్కొన్నారు. -
ఎరువులపై సబ్సిడీ కంపెనీలకే
పీవోఎస్ మెషీన్ల ద్వారా ఎరువులు కొంటేనే ఇక రాయితీ - కేంద్ర ప్రభుత్వం నిర్ణయం న్యూఢిల్లీ: ఎరువుల రంగంలో ఈ ఏడాది జూన్ నుంచి ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషీన్ల ద్వారా రైతులు ఎరువుల కొలుగోలుపై చెల్లింపులు చేసినట్లయితే, నేరుగా కంపెనీ ఖాతాలోకే సబ్సిడీ మొత్తాన్ని వేయాలని కేంద్రం ప్రణాళికలు రూపొందించింది. దేశంలోని 17 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ విధానం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా ఈ డీబీటీ విధానాన్ని దశల వారీగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా అక్రమ మళ్లింపులు, లీకేజీలకు చెక్పెట్టి ఎరువులపై ఇస్తున్న సబ్సిడీని 20 శాతం వరకు తగ్గించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం జిల్లాల్లో రసీదులను సమర్పించడం ద్వారా లేక ప్లాంటు నుంచి ఎరువులు బయటకు వెళ్తే కంపెనీలకు సబ్సిడీ అందేది. అయితే ఈ ఏడాది ఖరీఫ్ కాలం నుంచి మాత్రం పీవోఎస్ మెషీన్ల ద్వారా ఎరువుల అమ్మకాలు జరిగితే నేరుగా కంపెనీ ఖాతాలోకి సబ్సిడీ మొత్తం చేరుతుందని ఎరువుల శాఖ కార్యదర్శి భారతి శివస్వామి సిహాగ్ తెలిపారు. కేంద్రం ఇప్పటికే రిజిస్టర్ అయిన 2 లక్షల రిటైల్ ఔట్లెట్లను మే 31 నాటికి పీవోఎస్ మెషీన్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. దీంతో జూన్ నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తామని శివస్వామి తెలిపారు. అలాగే కొనుగోలు విధానాన్ని త్వరలోనే రూపొందిస్తామని, ఇందులో భూసార కార్డులు, భామి పత్రాలను రాబోయే మూడేళ్ల కాలానికి అనుసంధానం చేస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే లబ్ధిదారుడిని ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ విధానం, ఓటర్ గుర్తింపు కార్డు, కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా గుర్తిస్తామన్నారు. రైతుల వివరాలు సెంట్రల్ సర్వర్కు అనుసంధానించడం పీవోఎస్ మెషీన్లు కొనుగోలుదారుడి వివరాలను గుర్తిస్తాయని వివరించారు. ఈ నూతన విధానంపై కంపెనీలు అంగీకరిస్తాయా అనే ప్రశ్నకు వాటికి ఎన్ని సమస్యలు ఉన్నా, ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది కాబట్టి, ఈ విధానాన్ని పాటించాల్సిందేనన్నారు. -
ఎరువుల షేర్లకు యూరియా పాలసీ బూస్ట్
ముంబై: నేషనల్ యూరియా పాలసీలో మార్పులకు శుక్రవారం క్యాబినెట్ ఆమోదించనందనే అంచనాలతో ఫెర్టిలైజర్స్ కౌంటర్కు డిమాండ్ పుట్టింది. యూరియా ఉత్పత్తిని గణనీయంగా పెంచాలనే ప్రధాన లక్ష్యంతో కేంద్రం నేషనల్ యూరియా పాలసీలో మార్పులు తేనుంది. దేశీయ యూరియా ఉత్పత్తిలో ఎనర్జీ సామర్ద్యం, ప్రోత్సాహం, ప్రభుత్వంపై సబ్సిడీ భారం హేతుబద్ధీకరించడం లాంటి చర్యలపై దృష్టిపెట్టనుంది. జాతీయ యూరియా విధాన సవరణను కేంద్ర కేబినెట్ చేపట్టనున్నట్లు వెలువడ్డ వార్తలతో ఎరువుల కంపెనీ షేర్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్ కోర్ (ఫ్యాక్ట్ ) 17 శాతం దూసుకెళ్లగా.. మద్రాస్ ఫెర్టిలైజర్స్ 14 శాతం, ఆర్సీఎఫ్ 13 శాతం, చంబల్ 8 శాతం, దీపక్ 8 శాతం చొప్పున ఎగశాయి. ఈ బాటలో 3.1 శాతం కోరమాండల్ ఇంటర్నేషనల్ 3.4శాతం పెరిగింది, దీపక్ ఫెర్టిలైజర్స్ 3.2శాతం , సదరన్ పెట్రోకెమ్ 7 శాతం, జువారీ ఆగ్రో, మంగళూర్ కెమ్, ఎన్ఎఫ్సీఎల్ 5 శాతం, జీఎన్ఎఫ్సీ 4 శాతం చొప్పున దూసుకుపోయాయి. కాగా మే 2015 లో, యూనియన్ క్యాబినెట్ తరువాతి నాలుగు ఆర్థిక సంవత్సరాలకుగాను (జూన్ 2015-మార్చి 2019) ఒక సమగ్ర న్యూ యూరియా విధానాన్ని ఆమోదించింది తాజాగా ఎరువుల సబ్సిడీలను వాస్తవిక అమ్మకాల ఆధారంగా బదిలీ చేసేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
రూ.4 లక్షల ఎరువుల సీజ్
శింగనమల : ఎరువుల దుకాణలలో బయోపెస్టిసైడ్స్ అమ్మితే చర్యలు తీసుకుంటామని ఏఓ పవన్కుమార్ తెలిపారు. గురువారం మండలంలోని నాయనపల్లిక్రాస్ వద్ద నున్న సాయిబాబా, ఆదిత్య ఎంటర్ప్రైజర్, లక్ష్మినరసింహా ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. జేడీఏ ఆదేశాల మేరకు ఈతనిఖీలు చేపట్టామని పవన్కుమార్ చెప్పారు. ఈమూడు షాపులలో నిల్వ ఉంచిన రూ. 4 లక్షల స్టాక్ను సీజ్ చేశామన్నారు. -
కరీంనగర్లో భారీ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన
-
ఎరువుల ఫ్యాక్టరీ పునఃప్రారంభంతో ఉపాధి
l ఎన్టీపీసీ నుంచి విద్యుత్అందించడం హర్షణీయం l బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి పాలకుర్తి టౌన్ : రామగుండంలో 20 సంవత్సరాల క్రితం మూతపడిన ఎరువుల ఫ్యాక్టరీని ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగ స్టు 7న పునఃప్రారంభం చేయబోతుండడం హర్షణీయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎరువుల ఫ్యాక్టరీ కోసం కేంద్రం రూ.600 కోట్లు నిధులు ఇచ్చిందన్నారు. ఫ్యాక్టరీ వలన ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. ఎన్టీపీసీ నుంచి 4000 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంను జాతికి అంకితం చేయడం జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజే పీ బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమ్మేళనంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారని అశోక్ రెడ్డి అన్నారు. నాయకులు, కార్యకర్తలు ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పెదగాని సోమయ్య, జిల్లా కార్యదర్శి శ్రీమాన్, దొంగరి మహేందర్, పల్లె కుమార్, శ్రీకాంత్, అనిల్, సునిల్, సోమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్ణీత ధరకే ఎరువుల విక్రయం
–డీలర్లను ఆదేశించిన ఏడీ రమేష్ –నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు చిత్తూరు(రూరల్) : నిర్ణీత ధరకే ఎరువులు విక్రయించాలని దుకాణదారులను ఏడీ రమేష్ ఆదేశించారు. స్థానిక మండల వ్యవసాయశాఖ కార్యాలయంలో శనివారం ఆయన ఎరువుల దుకాణ డీలర్లతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. వ్యవసాయ రంగంలో రైతులు పలు కష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. దీని దృష్ట్యా ప్రభుత్వం ఎరువుల ధరలు తగ్గించిందని పేర్కొన్నారు. అయినా డీలర్లు పాతధరలకే ఎరువులను విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇకపై ప్రభుత్వం అమలు చేసిన కొత్త ధరలకే విక్రయించాలని, పాత ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఎరువుల దుకాణంలోను ఫ్లెక్సీ బోర్డుపై ఎరువుల ధరలు తెలియజేయాలని, రైతులకు ఇచ్చే ప్రతి బిల్లుపై వారి సంతకం, ఫోన్ నంబర్ నమోదు చేసుకోవాలన్నారు. సమావేశంలో మండల వ్యవసాయశాఖ అధికారి శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బిగుస్తున్న ఉచ్చు
► ఎరువుల కుంభకోణంపై వ్యవసాయశాఖ డైరెక్టర్ ధనుంజయరెడ్డి సీరియస్ ► కలెక్టర్, విజిలెన్స్ రిపోర్ట్తో పాటు శాఖాపరమైన విచారణకు నిర్ణయం ► మరో ఇద్దరు కీలక అధికారులపై చర్యలకు రంగం సిద్ధం సాక్షిప్రతినిధి, అనంతపురం : ఎరువుల కుంభకోణంలో సూత్రధారులు, పాత్రధారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ‘అనంత’లో జరిగిన వ్యవహారంపై కలెక్టర్ కోన శశిధర్ పంపిన నివేదిక వ్యవసాయ శాఖ డైరెక్టర్ ధనుంజయరెడ్డికి చేరింది. విజిలెన్స్ నివేదిక నేడో, రేపో అందనుంది. ఈ రెండు నివేదికలతో పాటు శాఖాపరంగా ఉన్నతస్థాయి విచారణ చేపట్టేందుకు డైరెక్టర్ సిద్ధమైనట్లు తెలిసింది. వ్యవహారంలో ఏడీఏ పీపీ మల్లికార్జున, అనంతపురం ఏడీఏ రవికుమార్ను బాధ్యులను చేస్తూ వారిద్దరినీ విధుల నుంచి తప్పించి కలెక్టర్ ప్రాథమిక నిర్ణయం తీసుకున్నారు. నివేదికను డైరెక్టర్కు పంపారు. ఈ క్రమంలో వ్యవసాయశాఖ ఉద్యోగుల సంఘం నాయకులు బుధవారం గుంటూరులో డైరెక్టర్ను కలినట్లు తెలిసింది. ఫర్టిలైజర్స్ డీలర్ల సమావేశంలో ఉండగా.. వీరు డైరెక్టర్ను కలిసినట్లు తెలుస్తోంది. వ్యవహారంలో ఏడీఏలకు సంబంధం లేదని, వారు విధులకు హాజరయ్యేలా చూడాలని, అసలు బాధ్యులు వేరే ఉన్నారని డైరెక్టర్ను కోరినట్లు సమాచారం. దీంతో డైరెక్టర్ తీవ్రంగా స్పందించినట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ‘రైతులకు చేరాల్సిన సబ్సిడీ ఎరువులు మిక్సింగ్ప్లాంటుకు ఎలా చేరతాయి? పైగా ‘సాక్షి’లో వరుస కథనాలు వచ్చి నేను చూసేదాకా సమాచారం ఎందుకు ఇవ్వలేదు? ఈ వ్యవహారంలో ఎంతమంది బాధ్యులు ఉన్నారో అందరిపైనా కఠిన చర్యలు తీసుకుంటాం. ఏఒక్కరినీ వదిలేది లేదు. పైగా అనంతపురం కరువు జిల్లా. ఇలాంటి జిల్లాలో రైతులకు ఉపయోగపడాల్సింది పోయి ఎరువులను ప్లాంటుకు తరలిస్తారా?’ అని తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. దీనిపై శాఖాపరంగా కూడా విచారణ చేయించేందుకు డైరెక్టర్ సిద్ధమైనట్లు తెలిసింది. తెరపైకి మార్క్ఫెడ్ ఎరువుల కుంభకోణంలో మార్క్ఫెడ్లోని ఓ అధికారి పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రేక్ రైల్వేస్టేçÙన్కు వస్తూనే 50 శాతం ఎరువులు మార్క్ఫెడ్కు చేరాలి. ఈ నెల 4న వచ్చిన రేక్లో 2,600 టన్నుల ఎరువులు ఉన్నాయి. ఇందులో 1300 టన్నులు మార్క్ఫెడ్కు చేరాలి. అయితే పక్కాప్రణాళికతో మార్క్ఫెడ్ అధికారి, వ్యవసాయశాఖలోని మరో ఇద్దరు అధికారులు కలిసి ఎరువుల లెక్కలను పరిగణనలోకి తీసుకోకుండా ప్లాంటుకు తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత బయటపడేందుకు మార్గాలు వెతికే ప్రయత్నం చేశారు. తనవద్ద బఫర్స్టాకు అధికంగా ఉందని, ఎరువులు తనకు అవసరం లేదని మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ బాల భాస్కర్ క్రిబ్కో కంపెనీకి చెప్పినట్లు చెబుతున్నారు. అయితే ఈనెల 3వ తేదీ వరకూ 5వేల టన్నుల బఫరే ఉన్నట్లు తెలుస్తోంది. కానీ 6,560 టన్నులు బఫర్ ఉన్నట్లు భాస్కర్ చెబుతున్నారు. మార్క్ఫెడ్ గోదాముల్లో ఎంత స్టాకు ఉన్నా రేక్లోని ఎరువులు వద్దనే ప్రస్తావన వస్తే లిఖిత పూర్వకంగా జేడీకి సమాచారం అందించాలి. లేఖ ఆధారంగా ఎరువులను ఎవరికి ఇవ్వాలనేది జేడీఏ నిర్ణయం తీసుకుంటారు. అయితే మార్క్ఫెడ్, జేడీఏ ఇద్దరికీ తెలీకుండా ఎరువులు ఎలా మిక్సింగ్ప్లాంటుకు వెళ్లాయనేది తేలాల్సి ఉంది. పైగా మార్క్ఫెడ్కు వెళ్లాల్సిన 1300 టన్నుల్లో 812 టన్నులు తీసుకున్నామని మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ బాలభాస్కర్ చెబుతున్నారు. మార్క్ఫెడ్ చెప్పేది నిజమే అయితే భాస్కర్ ఫర్టిలైజర్స్లో సీజ్ చేసిన 1300 టన్నులు ఎలా వచ్చాయనేది తేలాలి. అంటే మార్క్ఫెడ్ నుంచి 488 టన్నుల ఎరువులు, డీలర్లకు వెళ్లాల్సిన 812 టన్నులు దారి మళ్లాయని తెలుస్తోంది. మరి ఈ లెక్కల గుట్టు తేలాలంటే మార్క్ఫెడ్తో పాటు డీలర్లకు కేటాయించిన ఎరువుల రికార్డులను తనిఖీ చేయాల్సి ఉంది. మిక్సింగ్ ప్లాంటుకు రూ.1.87 కోట్ల ఆదాయం ఒక యూరియా బస్తా విలువ వెయ్యి రూపాయలకు పైగానే ఉంటుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం రూ.720 సబ్సిడీ ఇస్తుంది. మార్కెట్లో రైతులకు రూ.280కి విక్రయిస్తారు. 1300 టన్నుల ఎరువులు అంటే 26 వేల బస్తాలు. ఈ లెక్కన 26 వేల బస్తాలపై సబ్సిడీ రూపంలో రూ.1.87 కోట్ల ఆదాయం మిక్సింగ్ప్లాంటుకు చేకూరిన ట్లే! -
ఎరువుల కర్మాగారాన్ని సీజ్ చేయండి
మచిలీపట్నం(ఈడేపల్లి) : అనుమతులు, అక్రమ నిల్వలు ఉన్న కర్మాగారాన్ని తక్షణమే సీజ్ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య(నాని), కలెక్టర్ బాబు.ఎ ను డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం శనివారం నిర్వహించారు. పేర్ని మాట్లాడుతూ రేషన్ డిపోలో ఈ పోస్ విధానాన్ని ఏర్పాటు చేసి ఒక్క బస్తా బియ్యం తేడావస్తేనే సదరు డీలరుపై క్రిమినల్ కేసు నమోదు చేసే కలెక్టర్, దాదాపు రూ.85 లక్షల విలువ చేసే నకిలీ ఎరువులు పట్టుకున్న అతనిపై క్రిమినల్ కేసు ఎందుకు నమోదు చేయలేదని మండిపడ్డారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం మండలం రుద్రవరంలోనే అనుమతులు లేకుండా రెండేళ్ల క్రితం నిర్మించినకర్మాగారాన్ని ఎం దుకు పట్టించుకోలేదని ప్రశ్నిం చారు. ఈ నెల 12వ తేదీlవిజిలె¯Œæ్స దాడులు నిర్వహించగా రికార్డులను పరిశించి అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్ల మేరకు తిరిగి వెళ్లి మళ్లీ అధికారులు 14వ తేదీ మరోసారి దాడిచేయడంపై విస్మమయం వ్య క్తం చేశారు. అంతేకాకుండా 12వ తేదీ నుంచి 14వ తేదీ రాత్రి వరకు మంత్రి కొల్లు రవీంద్ర, 80 నుంచి వంద సార్లు విజిలెన్స్ అధికారులకు ఫోన్లు చేసి ఒత్తిడి చేసినట్లు ఆరోపించారు. కలెక్టర్కు ఫిర్యాదు.. రైతులను మోసం చే సి అమ్మకాలు జరిపే ఫ్యాక్టరీలో వాటా ఎంత అని మంత్రిని ప్రశ్నించారు. బ్లాక్లో ఎరువులు తయారీ, బెల్టుషాపుల వలన ఎంత కమీషన్ తీసుకుంటున్నారో మంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. క్రిమినల్ కేసు నమోదు చేయాలని సోమవారం కలెక్టర్ను కలవనున్నట్లు చెప్పారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలార్ దాదా, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బొర్రా విఠల్రావు, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ బాలజోషి, కౌన్సిలర్లు మేకల సుధాకర్ బాబు, శీలం మారుతీరావు(బాబ్జి), లంకా సురిబాబు, ఆస్గర్అలీ పాల్గొన్నారు. -
‘కుంభకోణం’లో కొత్త కోణం
భాస్కర్ ఫర్టిలైజర్స్లో 1,300 టన్నుల యూరియా నిల్వలు ప్రత్యక్షం డీలర్ల పేర్లతో రికార్డులు సృష్టించి గోదాములోకి తరలించిన వైనం సహకరించిన ఇద్దరు వ్యవసాయాధికారులు అనంతపురం : ఎరువుల కుంభకోణంలో కొత్తకోణం వెలుగు చూసింది. ఖరీఫ్లో రైతుల అవసరాల కోసం వచ్చిన ఎరువులను తప్పుడు రికార్డులు సృష్టించి భాస్కర్ ఫర్టిలైజర్స్ మిక్సింగ్ ప్లాంట్కు దారి మళ్లించారు. ప్రభుత్వ చీఫ్విప్ కాలవ శ్రీనివాసులు బినామీగా భావిస్తున్న ఈ మిక్సింగ్ ప్లాంటులో 1,300 నుంచి 1,600 టన్నుల మేర ‘క్రిబ్కో’ యూరియా నిల్వలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎరువులు దారి మళ్లడంపై ‘సాక్షి’లో కథనాలు రావడంతో జిల్లా కలెక్టర్ శశిధర్ విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నెల 4న ‘క్రిబ్కో’ కంపెనీకి సంబంధించిన 2,400 టన్నుల యూరియా రేక్ జిల్లాకు వచ్చింది. ఇందులో 50 శాతం మార్క్ఫెడ్కు, మరో 50 శాతాన్ని డీలర్లకు సరఫరా చేయాలి. ఇందులో మార్క్ఫెడ్ పేరు చూపుతూ 50శాతం ఎరువులను భాస్కర్ ఫర్టిలైజర్స్కు చేర్చినట్లు తెలుస్తోంది. ఇంతటితో ఆగకుండా తక్కిన 50శాతం ఎరువుల్లో 300 టన్నులు మాత్రమే డీలర్లకు చేరవేసి.. మిగిలిన స్టాకును గుట్టుచప్పుడు కాకుండా మిక్సింగ్ ప్లాంటుకు తరలించినట్లు సమాచారం. ఈ విషయం ఈ నెల 11నlవెలుగు చూసింది. దీనిపై సమగ్ర విచారణకు కలెక్టర్ ఆదేశించడంతో జాయింట్æకలెక్టర్–2 ఖాజామొహిద్దీన్ బుధవారం ప్లాంటును ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఎరువుల నిల్వలు గుర్తించినట్లు తెలుస్తోంది. వ్యవసాయాధికారులకు తెలిసే తతంగం జూన్ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. వాస్తవానికి జూలైలో ఎరువులను మిక్సింగ్ప్లాంట్లకు తరలించకూడదు. అయితే.. జిల్లాలో డిమాండ్ లేదంటూ ఉన్నతాధికారులకు జిల్లా వ్యవసాయాధికారులు తప్పుడు నివేదికలు అందజేసి ఎరువులను దారి మళ్లిస్తున్నట్లు తెలుస్తోంది. రెండేళ్లుగా వ్యవసాయాధికారులు ఇదే తంతు కొనసాగిస్తునట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ నెల 4వ తేదీ జిల్లాకు చేరిన రేక్లోని ఎరువులను దారిమళ్లించారు. భాస్కర్ ఫర్టిలైజర్స్కు చీఫ్విప్ కాలవ శ్రీనివాసుల సహకారం సంపూర్ణంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు మరింత ధైర్యంగా వ్యవహారాన్ని నడిపించినట్లు తెలిసింది. మార్క్ఫెడ్కు వెళ్లాల్సిన 50 శాతం ఎరువులు ప్లాంటుకు తరలడంపై విచారణ అధికారులకు స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. తక్కిన ఎరువులు ఏయే డీలర్లకు వెళ్లాయి? అక్కడి నుంచి బీక్లాస్ డీలర్లకు ఎలా చేరాయి? రైతులకు విక్రయించినట్లు బిల్లులు ఉన్నాయా? విక్రయాలు లేకపోతే స్టాకు రిజిస్టర్లో వివరాలు ఎలా ఉన్నాయి? అనే దిశగా అధికారులు విచారణ చేస్తే గుట్టరట్టయ్యే అవకాశముంది. ఎరువుల కుంభకోణం వ్యవసాయశాఖలో ఇద్దరు అధికారులకు తెలిసే జరిగినట్లు తెలుస్తోంది. ఈ తంతుకు సహకరించినందుకు వీరు రూ.22 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం కలెక్టర్ దీనిపై దృష్టి సారించడంతో వ్యవహారం నుంచి గట్టెక్కేందుకు ఆ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రికార్డుల తారుమారుకు ఉపక్రమిస్తున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా వెలుగుచూసిన కుంభకోణంతో పాటు రెండేళ్లుగా జిల్లాకు వచ్చిన ఎరువులు, కేటాయింపులపై కూడా విచారణ జరిపితే మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశముంది. చోద్యం చూస్తున్న విజి ‘లెన్స్’ ఎరువుల కుంభకోణం వ్యవసాయశాఖలో కలకలం రేపుతున్నా.. వాస్తవాలు నిగ్గుతేల్చాల్సిన విజిలెన్స్ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ ఘటనపై విజిలెన్స్ ఎస్పీ అనిల్బాబును ‘సాక్షి’ వివరణ కోరగా.. పత్రికల్లో చూశానని, దానికి సంబంధించి ఎలాంటి విచారణ చేయలేదని చెప్పారు. త్వరలోనే విచారణ చేపడతామన్నారు. -
ఎరువుల ధరలు తగ్గించిన కేంద్రం
ఏరువాక సమయంలో ఉన్న రైతులకు తీపి కబురు.. కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల ఎరువుల ధరలను తగ్గించింది. టన్ను డీఏపీకి రూ. 2500 చొప్పున తగ్గింది. అలాగే 50 కిలోల డీఏపీ బస్తా మీద రూ. 125 చొప్పున తగ్గించారు. టన్ను ఎంఓపీపై రూ. 5000 చొప్పున తగ్గించారు. అంటే 50 కిలోల ఎంఓపీ బస్తాకు రూ. 250 చొప్పన తగ్గింది. ఒక టన్ను ఎన్పీకే కాంప్లెక్స్ ఎరువు మీద రూ. వెయ్యి చొప్పున తగ్గించారు. అంటే 50 కిలోల ఎన్పీకే కాంప్లెక్స్ ఎరువు మీద రూ. 50 తగ్గింది. -
గుళికల బ్యాగ్లో ఇసుక..?
ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని ఓ ఎరువుల కంపెనీలో కొనుగోలు చేసిన గుళికల మందులో అధిక శాతం ఇసుక బయటపడింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చాడ గ్రామానికి చెందిన దొంతి శ్రీనివాస్ వరి చేనులో గుళికలను చల్లడానికి ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని ఓ ఎరువుల సెంటర్కు ఈ నెల 1న వె ళ్లాడు. ఓ కంపెనీకి చెందిన మాక్సిమాక్స్ ఆర్గానిక్ ప్లాంట్ ఎనిమిది కిలోల గుళికల ప్యాకెట్ను రూ.289ల ధర చెల్లించి కొనుగోలు చేశాడు. దీంతో తాను శుక్రవారం ఉదయం వరి చేనులో చల్లడానికి విప్పి చూడగా గుళికల బ్యాగ్లో అధిక శాతం ఇసుక ఉంది. ఇసుక అధికంగా ఉండడంతో ఎరువుల సెంటర్కు వెళ్లి నిలదీయగా కంపెనీ ప్రతినిధులకు తెలియజేస్తామని సమాధానమిచ్చినట్లు బాధితుడు తెలిపారు. సదరు ఎరువుల కంపెనీపై చర్యలు తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారిణి ఎస్. లావణ్యకు ఫిర్యాదు చేసినట్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. -
దగాపడుతున్న రైతన్న
తూకంలో మోసం చేస్తున్న ఎరువుల కంపెనీలు 50 కేజీల బస్తాలో 3 నుంచి 6 కేజీల వరకు తగ్గుదల అధికారుల తనిఖీలో వెల్లడైన వాస్తవం అన్నం పెట్టే రైతన్న అడుగడుగునా దగా పడుతున్నాడు. అన్నదాతల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఎరువుల కంపెనీలు సైతం మోసాలకు పాల్పడుతున్నాయి. ఈ విషయం తూనికలు, కొలతల శాఖ జిల్లా అధికారులు శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో వెల్లడైంది. నరసరావుపేట వెస్ట్ : సాధారణ తనిఖీల్లో భాగంగా తూనికలు, కొలతల శాఖ జిల్లా ఇన్స్పెక్టర్ చల్లా దయాకరరెడ్డి వినుకొండ రోడ్డులోని సెంట్రల్ వేర్హౌసింగ్ గోడౌన్లను శుక్రవారం సాయంత్రం తనిఖీ చేశారు. ఆ సమయంలో గోడౌన్లో స్పిక్, కోరమాండల్ కంపెనీకి చెందిన గ్రోమోర్ పారీ సూపర్, ఎంవోపీ (పోటాషియం), పీపీఎల్ నవరత్న (డీఏపీ) ఎరువులకు చెందిన వేలాది బస్తాలు షాపులకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటి నుంచి ప్రతి రకానికి చెందిన 32 బస్తాలను ఎలక్ట్రానిక్ కాటా సహాయంతో తూకం వేయగా దిమ్మె తిరిగే వాస్తవం బయటపడింది. కాటాల్లో కోరమాండల్ పారీ సూపర్ కంపెనీకి చెందిన 50 కేజీల 32 బస్తాలను కాటా వేయగా వాటిలో 16 బస్తాల్లో తూకంలో తేడాలు ఉన్నట్టు గుర్తించారు. ఒక్కో బస్తాలో 1 నుంచి 6 కేజీల వరకు తక్కువగా ఉన్నాయి. అలాగే కోరమాండల్ ఎంవోపీ (పొటాషియం) 32 బస్తాలను తూకం వేయగా ఒక్కో బస్తాలో 3 కేజీల వరకు త గ్గుదల ఉందని ఇన్స్పెక్టర్ దయాకరరెడ్డి చెప్పారు. పీపీఎల్ నవరత్న డీఏపీ బస్తాలను తూకం వేయగా 8 బస్తాల్లో 5 కేజీల వరకు తూకం తగ్గిందన్నారు. ప్రతి బస్తా గోనె సంచితో కలిపి 50 కేజీల 120 గ్రాములు ఉండాల్సి ఉండగా 49.600 గ్రాములే ఉన్నాయన్నారు. కంపెనీలకు నోటీసులు ఇచ్చి కేసులు నమోదు చేస్తాం తనిఖీల్లో బయటపడిన వాస్తవాలపై ఆయా కంపెనీలకు నోటీసులు జారీచేసి, ఆ కంపెనీలపై కేసు నమోదు చేస్తామని ఇన్స్పెక్టర్ దయాకరరెడ్డి విలేకర్లకు చెప్పారు. రైతులు కొనుగోలు చేసే సమయంలో ప్రతి బస్తాను కాటా వేసుకొని తూకాన్ని నిర్థారించుకున్న తర్వాతనే తీసుకోవాలని ఆయన సూచించారు. -
రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తాం
సాక్షి, హైదరాబాద్: ‘ఎరువుల అధిక వినియోగంతో సిరులు కురిపించిన పంజాబ్, హర్యానా పంట భూములు క్రమంగా బంజరు భూములుగా మారాయి. ఈ నేపథ్యంలో రసాయన ఎరువుల ఉత్పత్తి, దిగుమతులు తగ్గించాలని నిర్ణయించాం. అదే సమయంలో ఇక్కడి ఎరువుల తయారీ పరిశ్రమను కాపాడతాం’ అని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి హన్స్రాజ్ గంగారాం అహిర్ స్పష్టం చేశారు. ఫ్ట్యాప్సీ ఆధ్వర్యంలో మంగళవారం పారిశ్రామికవేత్తలతో జరిగిన ముఖాముఖిలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ‘ప్రస్తుతం దేశంలో 310 లక్షల టన్నుల యూరియా అవసరం కాగా, 90 లక్షల టన్నులు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో చెత్త నుంచి కంపోస్ట్ ఎరువు తయారు చేసి రైతులకు ఉచితంగా అందించాలని నిర్ణయించాం. మీరూ అదే దిశగా పనిచేస్తే ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సుముఖంగా వుందని’ ఎరువుల పరిశ్రమల ప్రతినిధులకు స్పష్టం చేశారు. ‘గ్యాస్ను దేశానికి పైపులైను ద్వారా రప్పించి, రసాయన ఎరువులను ఉత్పత్తి చేసి సబ్సిడీలు ఇవ్వడం వ్యయ ప్రయాసలతో కూడుకుంది. ఈ నేపథ్యంలో గ్యాస్ లభ్యత వున్న ఇరాన్ నుంచి ఎరువుల దిగుమతి కోసం త్వరలో ఒప్పందం కుదుర్చుకునేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయని’ మంత్రి వెల్లడించారు. తద్వారా ఎరువులపై 80 శాతం మేర సబ్సిడీ ఇచ్చేందుకు వీలవుతుందన్నారు. ప్లాస్టిక్ పరిశ్రమకు ఉజ్వల భవిష్యత్తు ‘ప్లాస్టిక్ పరిశ్రమను దేశీయంగా ప్రోత్సహించేందుకు ముడి సరుకు దిగుమతులపై సుంకాన్ని 5 నుంచి 7 శాతానికి పెంచాం. ప్రస్తుతం దేశంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ సంస్థలు 27 వుండగా, మూడేళ్లలో 40కి పెంచుతాం. మొత్తం 100 సంస్థలు ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. ప్లాస్టిక్ పార్కు ఏర్పాటుతో పాటు ప్లాస్టిక్ పాలసీపైనా కసరత్తు చేస్తున్నాం’ అని కేంద్ర మంత్రి హన్స్రాజ్ గంగారాం అహిర్ ప్రకటించారు. బల్క్డ్రగ్ తయారీ కోసం త్వరలో ప్రత్యేక పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. పెన్గంగా, ప్రాణహిత ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో వ్యవసాయం, పారిశ్రామిక ప్రగతి మెరుగవుతుందన్నారు. డిసెంబర్ ఐదున దేశంలోని ఎంపిక చేసిన 5 జిల్లాల్లో రైతులకు మట్టి నమూనా విశ్లేషణలకు సంబంధించిన కార్డులు అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు. రుణమాఫీ హామీ టీఆర్ఎస్దే: కిషన్రెడ్డి రైతులకు లక్ష కోట్లు రుణమాఫీ చేస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్, ఇప్పుడు మోదీ ప్రభుత్వం సహాయం చేయడం లేదని చెప్తోందని బీజేపీ శాసనసభా పక్షం నేత కిషన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఓ వైపు కొత్త పరిశ్రమలు వస్తుండగా, పాతవి ఎందుకు మూ త పడుతున్నాయో ప్రభుత్వం ఆలోచించాలన్నారు. ఎరువులు, ప్లాస్టిక్ తదితర రంగాలకు చెందిన పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను ఫ్ట్యాప్సీ అధ్యక్షుడు వెన్నం అనిల్రెడ్డి వివరించారు. సమావేశంలో ఫ్ట్యాప్సీ ఉపాధ్యక్షులు రవీంద్రమోడీ, గౌర శ్రీనివాస్ పాల్గొన్నారు. చట్టసభల్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు! చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని సీరియస్గా పరిశీలిస్తున్నామని కేంద్రమంత్రి హన్స్రాజ్ గంగారాం అహిర్ చెప్పారు. హైదరాబాద్లో మంగళవారం జరిగిన మహిళా మోర్చా సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధిలోనూ, పురోగతిలోనూ మహిళల పాత్ర చాలా కీలకమన్నారు. మహిళా సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని, దీనికి చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరుగుతున్నాయన్నారు. బేటీ బచావో-బేటీ పడావో పథకం ద్వారా బాల్య దశ నుంచి మహిళలకు బాసటగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా గంగారాం వివరించారు. తెలంగాణలోనే మహిళల ఆత్మహత్యలు జరుగుతున్నాయని, వీటిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం తరపున తగిన చర్యలను తీసుకుంటామన్నారు. మగవారితో సమానంగా మహిళా రైతులకు రుణాలను అందిస్తామని గంగారాం ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి మాట్లాడారు. -
కృష్ణపట్నంలో క్రిభ్కో ఎరువుల ప్లాంటు
న్యూఢిల్లీ: ఎరువుల తయారీ సంస్థ క్రిషక్ భారతీ కోఆపరేటివ్ (క్రిభ్కో) తాజాగా రూ. 1,000 కోట్ల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఫాస్ఫరిక్, పొటాషిక్ ఎరువుల ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఇప్పటిదాకా యూరియా మాత్రమే ఉత్పత్తి చేస్తున్న క్రిభ్కోకి ఇది తొలి పీఅండ్కే ఎరువుల ప్లాంటు కానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదేళ్ల పాటు రూ. 1కే యూనిట్ విద్యుత్ను, ఏడేళ్ల పాటు విలువ ఆధారిత పన్ను (వ్యాట్) నుంచి మినహాయింపుతో పాటు పలు ప్రోత్సాహకాలు అందించేందుకు ముందుకొచ్చిందని క్రిభ్కో చైర్మన్ చంద్రపాల్ సింగ్ తెలిపారు. వీటివల్ల సంస్థకు దాదాపు రూ. 500 కోట్ల మేర ప్రయోజనం చేకూరగలదని, అందుకే ప్లాంటు ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ను ఎంచుకున్నామని ఆయన వివరించారు. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే స్థలాన్ని కేటాయించిందని పేర్కొన్నారు. ప్లాంటు వార్షిక సామర్థ్యం 6 లక్షల టన్నులుగా ఉంటుం దని, ప్రాజెక్టు అందుబాటులోకి రావడానికి 4-5 సంవత్సరాలు పడుతుందని సింగ్ తెలిపారు. -
జూన్లో మౌలిక వృద్ధి 3 శాతమే..
న్యూఢిల్లీ : ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్ ఉత్పత్తి జూన్లో నిరాశను మిగిల్చింది. 2014 జూన్లో జరిగిన ఉత్పత్తితో పోల్చి చూస్తే... కేవలం 3 శాతమే వృద్ధి నమోదయింది. అదే 2013తో పోల్చినపుడు 2014 జూన్లో ఈ వృద్ధి రేటు 8.7 శాతంగా ఉండటం గమనార్హం. గత నెల అంటే 2015 మేలో ఆరు నెలల గరిష్ట స్థాయిలో 4.4 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా... జూన్లో 3 శాతానికే పరిమితమయింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 4న పాలసీ సమీక్ష సందర్భంగా మరో దఫా రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేట్లు తగ్గించాలని పారిశ్రామిక వర్గాలు కోరుతున్నాయి. వాణిజ్య, పరిశ్రమల శాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం... ఎనిమిది రంగాల పరిస్థితినీ వేర్వేరుగా చూస్తే... ఒక్క రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువుల రంగాలు మినహా మిగిలినవన్నీ నిరాశను కలిగించాయి. ఈ కీలక రంగాలకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల(ఏప్రిల్-జూన్) వృద్ధి రేటును 2014 నాటి ఇదే కాలంతో పోలిస్తే 6% నుంచి 2.4 శాతానికి పడిపోయింది. -
55 శాతం తగ్గిన కోరమాండల్ లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికర లాభం క్రితం కాలంతో పోలిస్తే 55 శాతం తగ్గి రూ.14.47 కోట్లకు పడిపోయింది. టర్నోవరు 16 శాతం పెరిగి రూ.2,181 కోట్లకు చేరింది. ఇండిపెండెంట్ డెరైక్టర్గా ఉన్న ఉదయ్ చందర్ ఖన్నాను కంపెనీ చైర్మన్గా నియమించింది. -
ఎరువుల ధరలు పెరగవు..
- ఈ ఏడాదిలో 3వేల జెనరిక్ మెడికల్ షాపులు ఏర్పాటు - వరంగల్లో కాటన్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేస్తా - వచ్చే నెలలో కాజీపేట నుంచి ముంబై ప్రత్యేక రైలు - కేంద్ర మంత్రి హన్సరాజ్ గంగారామ్ అహిర్ పోచమ్మమైదాన్ : బీజేపీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా లక్ష్యంతో ముందుకు సాగుతోందని, ఇందులో భాగంగానే దేశంలో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి హన్సరాజ్ గంగారామ్ అహిర్ తెలిపారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎనిమిది ఎరువుల ఫ్యాక్టరీలు మంజూరు చేశామని, ఇందులో ఒకటి తెలంగాణలోని రామగుండంలో పునఃప్రారంభిస్తున్నామని, దీంతో రానున్న నాలుగేళ్లు ఎరువుల ధరలు పెరగవని పేర్కొన్నారు. వరంగల్ నగరంలోని వెంకటేశ్వరగార్డెన్లో వరంగల్ మహానగర ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా బీజేపీ పోరుసభ బుధవారం రాత్రి జరిగింది. ముఖ్య అతిథిగా హన్సరాజ్ గంగారామ్ అహిర్ హాజరై మాట్లాడారు. జనస్తుతి పథకంలో భాగంగా ఈ సంవత్సరం ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద 3వేల జనరిక్ మెడికల్ షాపులు, రానున్న మూడు సంవత్సరాల్లో 55 వేల జెనరిక్ మెడికల్ షాపులను ప్రారంభిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగిన కోల్ స్కామ్ వెలికితీయడం ద్వారా దేశానికి రూ.2లక్షల కోట్లు కలిసి వచ్చాయన్నారు. హైదరాబాద్లో ఐటీ పార్క్, రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ, వరంగల్లో కాటన్ పరిశ్రమ ఏర్పాటుకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. త్వరలో జరగనున్న గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీని అధిక మెజార్టీతో గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తుందన్నారు. వచ్చే నెలలో కాజీపేట నుంచి ముంబైకి ప్రత్యేక రైలును ప్రారంభిస్తామన్నారు. గవర్నర్ సమాధానం చెప్పాలి.. టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని, ఇది పార్టీ ఫిరాయింపు చట్టం పరిధిలోకి రాదా అనే దానిపై గవర్నర్ సమాధానం చెప్పాలన్నారు. అన్ని మాఫియాలకు కేరాఫ్గా టీఆర్ఎస్ పార్టీ మారిందన్నారు. ఓయూ భూములను లాక్కోవడంపై మాట్లాడిన విద్యార్థులను అవమాన పరుస్తున్నారని ధ్వజమెత్తారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛహైదరాబాద్ను కేసీఆర్ మొదలుపెట్టారని విమర్శించారు. మిషన్ కాకతీయ ఎంత ఫలితాలు ఇస్తాయో ఇంకా తెలియాల్సి ఉందన్నారు. వరంగల్లో నాలుగురోజుల ఉన్న సీఎం కనీసం రూ.నాలుగు లక్షల అభివృద్ధి పనులనైనా చేయలేదని విమర్శించారు. ప్రజాసమ్యలపై వినతిపత్రాలు ఇచ్చేందుకు సీఎం అపాయింట్మెంట్ అడిగితే నెలలు గడిచినా ఇవ్వడం లేదని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు చాడ శ్రీనివాస్ రెడ్డి నగర సమస్యలపై తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈసభలో బీజేపీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ డాక్టర్ టి.రాజేశ్వర్రావు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్మారావు, జిల్లా ఇన్చార్జి కాసం వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మాందాటి సత్యనారాయణరెడ్డి, వన్నాల శ్రీరాములు, నాయకులు రావు పద్మ, విజయలక్ష్మి, వంగాల సమ్మిరెడ్డి, దొంతి దేవేందర్రెడ్డి, ఎడ్ల అశోక్రెడ్డి, విజయ్చందర్రెడ్డి, బొడిగె గట్టయ్య, మాచర్ల సాంబయ్య, నరహరి వేణుగోపాల్రెడ్డి, నాగపురి రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. -
ఖరీఫ్ ప్రణాళిక సిద్ధం
⇒ 3.71 లక్షల హెక్టార్లలో పంటల సాగు లక్ష్యం ⇒ సాధారణ సాగు కన్నా సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ⇒ వరిసాగు విస్తీర్ణం 1.40 లక్షల హెక్టార్లు ⇒ పత్తి సాగు విస్తీర్ణం 1.60 లక్షల హెక్టార్లు ⇒ 9.5 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు సిద్ధం! ⇒ వరి, ఇతర పంటల విత్తనాలు రెడీ చేస్తున్న ఏపీ సీడ్స్ ⇒ ఎరువుల నిల్వలు పెంచేందుకు కృషి ఖమ్మం వ్యవసాయం: ఖరీఫ్ కాలం సమీపిస్తుండటంతో వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది(2015-16) కూడా ఖరీఫ్ సాగు విస్తీర్ణం ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించింది. జిల్లాలోని ఏడు మండలాలు వీ.ఆర్.పురం, కూనవరం, చింతూరు, కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడుతో పాటు భద్రాచలం పట్టణం మినహా మండలం అంతా రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయటంతో 41 మండలాల సాగు విస్తీర్ణాన్ని నిర్ధారించింది. ప్రణాళికను రూపొందించింది. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 3,48,292 హెక్టార్లు కాగా ఈ ఏడాది 3,71,143 హెక్టార్లలో పంటలు సాగు చేసే అవకాశం ఉందని అంచనాలు రూపొందించారు. గత ఏడాది సాధారణ సాగు విస్తీర్ణం 3,36,047 హెక్టార్లు కాగా 3,71,257 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేశారు. ప్రధానంగా పత్తిని 1.57 లక్షల హెక్టార్లు, వరి 1.10 లక్షల హెక్టార్లు, దాదాపు లక్ష హెక్టార్లలో మొక్కజొన్న, పెసర, కంది, వేరుశనగ, మినుము, మిర్చి, చెరకు తదితర పంటలను సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల్లో వేసిన పంటల నుంచి దిగుబడులు రైతులు పొందలేక పోయారు. గత ఏడాదితో పోలిస్తే పత్తి, వరి విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రణాళికలో పేర్కొన్నారు. పత్తి దాదాపు 1.70 లక్షల హెక్టార్లు, వరి 1.40 హెక్టార్లు, మిగిలిన దాదాపు 60 వేల హెక్టార్లలో మిర్చి, వేరుశనగ, మొక్కజొన్న, పెసర, కంది, చెరకు తదితర పంటలు సాగు చేసే లక్ష్యంగా ప్రణాళికను రూపొందించారు. గత ఏడాది కన్నా వరి, పత్తి సాగు విస్తీర్ణం పెంచాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. జిల్లాలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం ఇప్పటికే పెరిగింది. అయితే ఈ ఏడాది ఆ పంట సాగు విస్తీర్ణాన్ని కూడా పెంచాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. వర్షపాతాన్ని బట్టి వచ్చే ఖరీఫ్లో పంటల సాగు విస్తీర్ణంలో తేడాలు ఉంటాయని వ్యవసాయ శాఖ భావిస్తోంది. వర్షాలు అనుకూలంగా కురిస్తేనే ప్రణాళికకు అనుగుణంగా పంటలు సాగవుతాయని పేర్కొంటోంది. విత్తన ప్రణాళిక ... ఖరీఫ్ ప్రణాళికకు అనుగుణంగా విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయశాఖ రంగం సిద్ధం చేస్తోంది. అవసరమయ్యే విత్తన వివరాలను వ్యవసాయశాఖ ఖరీఫ్ ప్రణాళికతో పాటు వ్యవసాయశాఖ కమిషనర్కు సమర్పించింది. క మిషనర్ వ్యవసాయశాఖ పేర్కొన్న విధంగా విత్తనాలను అందుబాటులో ఉంచాలని తెలంగాణ సీడ్స్ ను ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణ సీడ్స్ సంస్థ ఇప్పటికే పలు రకాల విత్తనాలను అం దుబాటులో ఉంచింది. మరికొన్ని విత్తనాలను తెప్పించే పనిలో ఉన్నారు. వివిధ కంపెనీలకు చెందిన పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచే విధంగా వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుం డా చూడాలని అధికారులు నిర్ణరుుంచారు. ఎరువులు వచ్చే ఖరీఫ్ కాలానికి 2.23 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉంటాయని వ్యవసాయశాఖ ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం కేవలం 23,500 మెట్రిక్ టన్నుల ఎరువులు మాత్రమే నిల్వ ఉన్నాయి. అవసరమైన సమయంలో ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. గత ఏడాది యూరియాను బ్లాక్లో విక్రరుుంచారు. ఈసారి ఆ పరిస్థితి తలెత్తకుండా చూడాలని భావిస్తున్నారు. -
తెలంగాణకు ఎరువుల ఫ్యాక్టరీ
- ముందుకు వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం హన్మకొండ(వరంగల్ జిల్లా): కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణలో ఎరువుల ఫ్యాక్టరీ నెలకొల్పేందుకు ముందుకు వచ్చిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి తెలిపారు. శుక్రవారం హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రేమేందర్రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో మూసి వేసిన కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించేందుకు మోదీ ప్రభుత్వం రూ.5 వేల కోట్లు కేటాయించిందన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకొంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇక్కడ ఉత్పత్తి కానున్న ఎరువులను కిసాన్ బ్రాండ్తో మార్కెట్లోకి విడుదల చేయనున్నారని చెప్పారు. ఫ్యాక్టరీ ప్రాంతాన్ని త్వరలో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి హన్సరాజ్ గంగారామ్ అహీర్, బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి రామగుండం సందర్శించనున్నట్లు తెలిపారు. మిషన్ కాకతీయలో అధికార పార్టీ నాయకులు అక్రమాలకు తెరలేపారని ఆరోపించారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలన్నారు. విపత్తు సహాయ నిధుల నుంచి నిధులు వాడుకోవడానికి కేంద్రం సడలింపు ఇచ్చిందని పేర్కొన్నారు. -
అన్ని ఔషధాల ధరలపై నియంత్రణ
పార్లమెంటరీ కమిటీ సూచన న్యూఢిల్లీ: దేశంలో లభ్యమవుతున్న అన్ని రకాల ఔషధాలను ధరల నియంత్రణ కిందకు తీసుకురావాలని కెమికల్స్, ఫర్టిలైజర్స్ స్టాండింగ్ కమిటీ సోమవారం పార్లమెంట్లో పేర్కొంది. ప్రాణాధార ఔషధాలతో పాటు అన్ని రకాల ఔషధాలను అందుబాటు ధరల్లో మార్కెట్లోకి తీసుకురావాలని సూచించింది. జాతీయ అత్యవసర ఔషధాల జాబితా ఆధారంగా ఔషధ ధరల నియంత్రణ సంస్థ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) 509 ఫార్ములేషన్ ప్యాక్స్కు ధరలను నిర్ణయించింది. జాతీయ అత్యవసర ఔషధాల జాబితాలో అన్ని ఔషధాలు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని కమిటీ పేర్కొంది. ‘ప్రతి ఔషధం అవసరమైనదే. అవసరాన్ని బట్టి రోగులు వాటిని వినియోగిస్తారు. వాటిని అందుబాటు ధరల్లో అందించడం సమంజసంగా ఉంటుందని వివరించింది. -
రామగుండం ఎరువుల ప్లాంటుకు జేవీ ఏర్పాటు
న్యూఢిల్లీ: రామగుండం ఎరువుల ప్లాంటు పునరుద్ధరణ కోసం ప్రభుత్వ రంగ ఎన్ఎఫ్ఎల్, ఈఐఎల్, ఫెర్టిలైజర్ కార్పొరేషన్ కలసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశాయి. ఈ నెల 17న జేవీని ఏర్పాటు చేసినట్లు బీఎస్ఈకి నేషనల్ ఫెర్టిలైజర్స్ (ఎన్ఎఫ్ఎల్) తెలియజేసింది. కొత్తగా ఏర్పడిన సంస్థలో ఎన్ఎఫ్ఎల్, ఇంజినీర్స్ ఇండియా (ఈఐఎల్) కంపెనీలకు చెరి 26 శాతం, ఫెర్టిలైజర్ కార్పొరేషన్కి 11 శాతం వాటాలు ఉంటాయి. జేవీలో భాగం అయ్యేందుకు ముందుకొచ్చే ఇతర సంస్థలకు మిగతా వాటాలు దక్కనున్నాయి. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉన్న రామగుండం ఎరువుల యూనిట్లో 1999 నుంచి యూరియా, అమ్మోనియా ఉత్పత్తిని నిలిపివేశారు. లాభదాయకత లేకపోవడమే ఇందుకు కారణం. తాజాగా మూతబడిన ఎరువుల ప్లాంట్లను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా రామగుండం ప్లాంటుకు కూడా మోక్షం లభించింది. దాదాపు రూ. 5,000 కోట్ల వ్యయంతో దీన్ని పునరుద్ధరించనున్నారు. -
ఎరువుల ప్లాంట్లు అన్నిటికీ ఒకే స్థాయి గ్యాస్ ధర!
న్యూఢిల్లీ: ఎరువుల ప్లాంట్లన్నింటికీ ఒకే రేటుపై, అందుబాటు ధరలో గ్యాస్ను అందించే దిశగా కేంద్ర చమురు శాఖ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. దేశీ సహజ వాయువు, దిగుమతి చేసుకున్న ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) రేట్ల సగటు ఆధారంగా గ్యాస్ ధరను నిర్ణయించాలని (పూలింగ్) ప్రతిపాదించింది. ఇందుకోసం గాను ఎరువుల ప్లాంట్ల కోసం దిగుమతి చేసుకునే ఎల్ఎన్జీపై కస్టమ్స్ సుంకాన్ని, సర్వీస్ ట్యాక్స్ మొదలైన వాటి నుంచి మినహాయింపునివ్వాలని యోచిస్తున్నట్లు తెలిపింది. ఈ విధానాన్ని ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తేవాలని చమురు శాఖ భావిస్తోంది. ప్రస్తుతం దేశీయంగా ఉత్పత్తయ్యే గ్యాస్ ధర యూనిట్కు 4.2 డాలర్లుగా ఉంది. దిగుమతి చేసుకునే ఎల్ఎన్జీ ధరలో ఇది మూడో వంతు స్థాయిలో ఉంది. ప్రస్తుతం దేశంలో 30 ఎరువుల ప్లాంట్లు ఉండగా.. వీటిలో 27 గ్యాస్ ఆధారితమైనవి, మూడూ నాఫ్తా ఆధారంగా పనిచేసేవి. దేశీయంగా ఏటా 30 మిలియన్ టన్నుల మేర యూరియా వినియోగమవుతుండగా 23 మిలియన్ టన్నుల దేశంలోనే ఉత్పత్తి అవుతోంది. -
ప్రయోగాత్మక వ్యవసాయానికి ప్రాధాన్యత
సీఎం చంద్రబాబు వెల్లడి సాక్షి,హైదరాబాద్: రబీలో ప్రయోగాత్మక వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని వ్యవసాయ, అనుబంధ శాఖలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. భూసార పరీక్షలను పెద్ద ఎత్తున చేపట్టాలని, ఎరువుల పరిశ్రమలు కూడా ఈ పరీక్షలకు సహకరించి సూక్ష్మ పోషకాల నిర్ధారణకు తోడ్పడాలని కోరారు. రాష్ర్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రాథమిక రంగం అభివృద్ధిపై బుధవారం సచివాలయంలో వర్క్షాప్ నిర్వహించారు. ఇందులో ఇక్రిశాట్, వ్యవసాయం, అనుబంధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ వర్క్షాపులో సీఎం మాట్లాడుతూ వచ్చే ఏడాదిలో ఎలాంటి వ్యవసాయ విధానాలతో ముందుకెళ్లాలో త్వరలో ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని చెప్పారు. అన్నీ ఆన్లైన్లోనే ప్రభుత్వ నిధులు మంజూరు, చెల్లింపులన్నీ ఇక ఆన్లైన్లో విధానంలోనే జరగనున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆర్థిక శాఖ ప్రారంభించిన సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్) ఇప్పుడు అమల్లోకి వస్తోంది. ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరులోగా ప్రయోగాత్మకంగా గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. -
ఎరువు సొమ్ము.. వడ్డీ మేత !
విజయనగరం: సహకార సంఘాల్లో బినామీ రుణాల సొమ్ము మాత్రమే కాదు, ఎరువుల పైసలు కూడా పక్కదారి పడుతున్నాయి. విజయనగరం జిల్లాలో ఇప్పటికే ఎరువులు విక్రయించగా వచ్చిన రూ.కోటీ 50 లక్షలకు పైగా మొత్తం అనధికారికంగా పీఏసీఎస్ పెద్దల చేతుల్లో చెలామణి అవుతోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆ మొత్తాన్ని దర్జాగా సంఘాల పెద్దలు అనుభవిస్తున్నారు. సొమ్ము చెల్లించాలని అడుగుతున్న మార్క్ఫెడ్కు మాయమాటలు చెప్పి కాలం గడిపేస్తున్నారు. డీసీసీబీ ఇచ్చిన గ్యారంటీ మేరకు విజయనగరం జిల్లాలోని సహకార సంఘాల(పీఏసీఎస్)కు ప్రతీ ఏడాది మార్క్ఫెడ్ ఎరువుల్ని సరఫరా చేస్తోంది. వీటిని విక్రయించి, ఆ మొత్తాన్ని మార్క్ఫెడ్కు జమ చేయాలి. పైసా పెట్టుబడి లేకుండా వ్యాపార లావాదేవీలు నిర్వహించి ఆ సంఘాలు కమీషన్ పొందుతాయి. దీనివల్ల సిబ్బంది జీత భత్యాలు కొంతమేర గట్టెక్కుతాయి. అలాగే, రైతులకు అందుబాటులోనే ఎరువుల్ని విక్రయంచినట్టు అవుతుంది. ఇంత సదుద్దేశంతో సహకార సంఘాలకు మార్క్ఫెడ్ ఎరువుల్ని సరఫరా చేస్తుంటే ఆ స్థాయిలో తిరిగి చెల్లింపులు జరగడం లేదు. విక్రయాలు జరిపి నెలలు, ఏళ్లు గడుస్తున్నా మార్క్ఫెడ్కు సొమ్ము జమచేయకుండా కొన్ని సంఘాల్లో ఆ మొత్తాన్ని సొంతానికి వాడుకుంటున్నారు. మరికొన్ని సంఘాల పెద్దలు వడ్డీలకిచ్చి లాభాలు పొందుతున్నారు. ప్రతీ ఏడాది ఇదే తంతు నడుస్తోంది. కానీ, అధికారులు నియంత్రించలేకపోతున్నారు. జిల్లాలో పలు పీఏసీఎస్లు గత ఏడాది రూ.2కోట్ల84లక్షల 52వేల మేర మార్క్ఫెడ్కు సంఘాలు బకాయి పడ్డాయి. అలాగని ఆ మేరకు స్టాక్ ఎక్కడా లేదు. దాదాపు విక్రయాలు జరిగిపోయాయి. ఆ సొమ్ము దాదాపు సంఘాల పెద్దల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ ఏడాది విషయానికి వస్తే సహకార సంఘాలకు రూ. 25.53 కోట్ల విలువైన ఎరువుల్ని మార్క్ఫెడ్ సరఫరా చేసింది. గత ఏడాది బకాయితో కలిపి దాదాపు రూ.28.38 కోట్ల మేర మార్క్ఫెడ్కు సహకార సంఘాలు చెల్లించాల్సి ఉంది. ఇదే సందర్భంలో సహకార సంఘాల బినామీ రుణాల భాగోతం వెలుగు చూస్తుండడం, పలు సంఘాలపై ప్రాథమిక విచారణ, స్టాట్యూటరీ విచారణలు పడుతుండడంతో ఎరువులు సొమ్ము వాడుకుంటున్న సంఘాలు ఉలిక్కిపడ్డాయి. ఈ సమయంలో ఎరువుల వ్యవహారం బయటపెడితే ఇబ్బందులొస్తాయని ఆ సంఘాల పెద్దలు చెల్లింపులు చేయడం వేగవంతం చేశారు. ఈ క్రమంలో గత సెప్టెంబర్ నాటికి రూ.4.40 కోట్లు బకాయి ఉండగా, అక్టోబర్ నాటికి రూ.3.89 కోట్లకు, నవంబర్ నాటికి రూ.2.81కోట్లకు తగ్గింది. కానీ, చివరిగా మిగిలిన రూ.2.49కోట్ల బకాయికి సంబంధించిన వివరాలు అధికారుల వద్ద లేవు. విక్రయాలు జరిగినదెంత? స్టాక్ ఉన్నదెంత? అనేది ఎవరికీ తెలియదు. కానీ, సహకార శాఖ అధికార వర్గాల సమాచారం ప్రకారం స్టాక్ విలువ రూ.కోటి లోపే ఉంటుందని తెలుస్తోంది. అంటే దాదాపు రూ.కోటీ 50 లక్షలు వ్యక్తుల జేబుల్లోనే ఉన్నట్టు ఆరోపణలొస్తున్నాయి. బకాయిలున్న సంఘాల్లో ఇప్పటికే స్టాట్యూటరీ విచారణ జరుగుతున్న రావివలస, చెముడు సొసైటీలున్నాయి. వాటితో పాటు విక్రయాలు జరిపి మార్క్ఫెడ్కు సొమ్ము చేయని సంఘాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఇంత జరుగుతున్నా మార్క్ఫెడ్ అధికారులు ఏం చేయలేకపోతున్నారు. దీనికి పర్యవేక్షణ లోపమే కారణమని తెలుస్తోంది. ఆ శాఖలో నలుగురే ఉద్యోగులుండటం, వారిలో ఇద్దరు కార్యాలయానికి పరిమితం కావలసి వస్తుండగా, మరొకరు మార్కెటింగ్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఇంకొకరు డివిజనల్ మేనేజర్గా అన్ని వ్యవహారాలను పర్యవేక్షించవలసి ఉంది. దీన్నిబట్టి మార్క్ఫెడ్ పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి సంఘాలకు సరఫరా చేసిన ఎరువుల్లో ఎంత స్టాక్ను విక్రయించారు ? ఎంత స్టాక్ ఉంది? అన్న వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. దీనికోసం తనిఖీలు జరపాలి. విక్రయాలు జరిగిన మేరకు మార్క్ఫెడ్కు సొమ్ము జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలి. కానీ, జిల్లాలో అటువంటి పర్యవేక్షణ, తనిఖీలు జరగకపోవడంతో ఎక్కడేం జరుగుతుందో? ఎక్కడెంత విక్రయాలు జరిగాయో? ఎక్కడెంత స్టాక్ ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ సంఘాల సిబ్బంది చెప్పే వివరాలు, లెక్కల్నే మార్క్ఫెడ్ సిబ్బంది పరిగణలోకి తీసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని పలు సంఘాల్లో విక్రయాలు చేపట్టినా... ఆ మొత్తాన్ని మార్క్ఫెడ్కు జమ చేయడం లేదు. సదరు మొత్తాన్ని తమ సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. వడ్డీలకు తిప్పుకుని లబ్ధిపొందుతున్నారు. కొందరికి ఇదొక టర్నోవర్గా తయారైంది. -
రామగుండం ఎరువుల యూనిట్ పునరుద్ధరణకు ఒప్పందం
అమ్మోనియా, యూరియా ప్లాంట్ల ఏర్పాటు మూడు ప్రభుత్వ రంగ సంస్థల సంతకాలు ప్రాజెక్టు వ్యయం రూ. 5,000 కోట్లు 2016లో నిర్మాణం మొదలు న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో రామగుండం ఎరువుల ప్లాంటు పునరుద్ధరణ కోసం ప్రభుత్వ రంగ సంస్థలు నేషనల్ ఫెర్టిలైజర్స్ (ఎన్ఎఫ్ఎల్), ఇంజినీర్స్ ఇండియా (ఈఐఎల్), ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐఎల్) కలిసి జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ‘రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్’ పేరుతో ఒక కొత్త కంపెనీని ప్రారంభించేందుకు జరిగిన ఈ ఒప్పందంపై కేంద్ర ఎరువుల మంత్రి అనంతకుమార్, పెట్రోలియం శాఖ సహాయ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ల సమక్షంలో బుధవారం నోయిడాలో సంతకాలు జరిగాయి. ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయం సుమారు రూ. 5,000 కోట్లుగా ఉండవచ్చని ఇంతకుముందే ఎన్ఎఫ్ఎల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భాగంగా గ్యాస్ ఆధారిత అమ్మోనియా, యూరియా ప్లాంట్లను ఏర్పాటుచేస్తారు. 2200 మెట్రిక్ టన్నుల రోజువారీ సామర్థ్యంతో అమ్మోనియా, 3850 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో యూరియా ప్లాంటు ఏర్పాటవుతాయి. వెంచర్లో ఎన్ఎఫ్ఎల్, ఈఐఎల్లకు చెరో 26 శాతం వాటా వుంటుంది. మిగిలిన వాటా రామగుండం ప్రాజెక్టుకు ప్రస్తుత మౌలిక సదుపాయాల్ని అందిస్తున్న ఎఫ్సీఐఎల్ చేతిలో వుంటుంది. ప్రాజెక్టు నిర్మాణాన్ని ఈపీసీ కాంట్రాక్టు పద్ధతిన ఇంజనీర్స్ ఇండియా చేపడుతుంది. 2018కల్లా ప్రాజెక్టు పూర్తవుతుందని అంచనా. ప్లాంటుకు అవసరమైన సహజ వాయువును ప్రతిపాదిత మల్లవరం-భిల్వారా పైప్లైన్ ద్వారాను, నీటి వనరులను గోదావరి నదిపై నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి అందించనున్నారు. -
మరో ముందడుగు
గోదావరిఖని : రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణలో మరో ముందడుగు పడింది. 1999లో మూసివేసిన ఈ కర్మాగారాన్ని గ్యాస్ ఆధారంగా పునరుద్ధరించే క్రమంలో ఇందుకు సంబంధించి బుధవారం కీలక ఘట్టం ముగిసింది. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్సీఐఎల్), నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్), ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) సంస్థలతో భాగస్వామ్య (జాయింట్ వెంచర్) సంస్థ ఏర్పాటైంది. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో గల ఎఫ్సీఐఎల్ కార్యాలయంలో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంత్కుమార్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేందర్ప్రధాన్తో పాటు ఆయా సంస్థల ఉన్నత స్థాయి అధికారులు సమావేశమై జాయింట్ వెంచర్పై చర్చించి సంస్థను ఏర్పాటు చేస్తూ ఆయా కంపెనీల అధికారులు సంతకాలు చేశారు. దీనికి రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్గా నామకరణం చేశారు. ఈ ప్లాంట్కు కాకినాడ తీరంలోని మల్లవరం నుంచి గుజరాత్లోని బిల్వారాకు పైప్లైన్ ద్వారా తీసుకెళ్లే గ్యాస్ను సమీపంలోని పాయింట్ నుంచి సరఫరా చేయనున్నారు. 2018 నాటికి ఎరువుల ఉత్పత్తి లక్ష్యంగా కర్మాగారం పనులు పూర్తి చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏప్రిల్లో నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అంగీకరించారు. రూ.5వేల కోట్ల పెట్టుబడి రూ.5వేల కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్ను ఏర్పా టు చేస్తుండగా, ఇందులో 70 శాతం రుణంగా తీసుకోనున్నారు. మిగతా 30 శాతం ఈక్విటీని ప్రకటించనుండగా, ఎన్ఎఫ్ఎల్ 26 శాతం, ఈఐఎల్ 26 శాతం, ఎఫ్సీఐఎల్ 11 శాతం, మరో 37 శాతం షేర్హోల్డర్ల నుంచి సేకరించనున్నారు. ఈ రోజుకు 2,200 టన్నుల అమ్మోనియా, 3,850 టన్నుల యూరియా ఉత్పత్తి చేసే లక్ష్యంతో ప్లాంట్ను నిర్మించనున్నారు. పర్యావరణ అనుమతి రాగానే ప్రాథమికంగా పనులు చేపట్టనున్నారు. సంక్రాంతి పండుగ కానుగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ పునరుద్ధరణకు జాయింట్ వెంచర్ను ప్రారంభించినట్టైంది. ఎన్డీఏ హయాంలోనే మూసివేత.. పునరుద్ధరణ బొగ్గు ఆధారంగా రామగుండం ఎరువుల కర్మాగారం నిర్మాణ పనులు 1970 అక్టోబర్ 2న ప్రారంభం కాగా.. 1980 నవంబర్ ఒకటిన యూరియాను ఉత్పత్తి చేసింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం, నాణ్యతలేని బొగ్గు సరఫరా, నూతన టెక్నాలజీలో ఏర్పడిన లోపాలు, కేంద్రం సకాలంలో ఆర్థిక వనరులను సమకూర్చకపోవడం, ఉన్నతస్థాయి కమిటీలు చేసిన సిఫారసులను అమలు చేయకపోవడం, తదితర కారణాలు ఎరువుల కర్మాగారానికి నష్టాలను తెచ్చిపెట్టాయి. దీంతో 1999 మార్చి 31న అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం ఎరువుల కర్మాగారాన్ని మూసివేసింది. అప్పటికి 16.89 లక్షల టన్నుల యూరియాను ఉత్పత్తి చేసింది. ఆనాటి నుంచి ఎరువుల కార్మాగారాన్ని తెరిపించాలని అనేక పార్టీలు, సంఘాలు చేసిన ఆందోళనల ఫలితంగా నూతన ప్లాంట్ను నిర్మించేందుకు కేంద్రం సమ్మతించింది. బీఐఎఫ్ఆర్ నుంచి విముక్తి కల్పించడంతో పాటు రూ.10,400 కోట్ల రుణాన్ని కేంద్రం మాఫీ చేసింది. నెలాఖరులోగా ప్రజాభిప్రాయసేకరణ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించేందుకు మూడు కంపెనీలతో జాయింట్ వెంచర్ ఏర్పాటు కాగా... జనవరి నెలాఖరులోగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించే అవకాశాలున్నాయి. స్థానికులతో చర్చించి వారి అభిప్రాయాన్ని సేకరించి ఏప్రిల్లో పనులు మొదలుపెట్టేలా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. కర్మాగారం పునరుద్ధరణ కోసం మాజీ ఎంపీ జి.వివేక్ శాయశక్తులా కృషి చేయగా, ప్రస్తుత ఎంపీ బాల్క సుమన్ పలుమార్లు లోక్సభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. స్థానిక ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, అధికారుల సంఘం, కాంట్రాక్టు కార్మికుల సంఘం ప్రతినిధులు ఎం.సుందర్రాజు, కంది శ్రీనివాస్ తదితరులు పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రులను కలిసి ఎఫ్సీఐ పునరుద్ధరణ కోసం వినతిపత్రాలు అందజేశారు. -
కృష్ణపట్నంలో క్రిబ్కో ఎరువుల ప్లాంటు!
రూ.1000 కోట్ల పెట్టుబడికి సన్నాహాలు న్యూఢిల్లీ: క్రిషక్ భారతీ సహకార సంస్థ (క్రిబ్కో) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం వద్ద రూ.1000 కోట్ల పెట్టుబడితో ఫాస్ఫరస్ అండ్ పొటాష్ (పీఆండ్కే) ఎరువుల ప్లాంటును ఏర్పాటుచేయనుంది. ఇప్పటివరకూ యూరియా ప్లాంట్లు మాత్రమే కలిగివున్న తాము తొలిసారిగాఫాస్ఫరస్, పొటాష్ను ఉత్పత్తి చేయనున్నట్లు క్రిబ్కో ఎండీ ఎన్.సాంబశివ రావు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్లాంటు ఏర్పాటుకు భూముల్ని కేటాయించిందన్నారు. ప్లాంటు వార్షిక సామర్థ్యం 6 లక్షల టన్నులు ఉంటుందని తెలిపారు. దీన్ని భవిష్యత్తులో రెట్టింపు(12 లక్షల టన్నులు) చేసే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. క్రిబ్కో ఇప్పటికే 22 లక్షల వార్షిక సామర్థ్యమున్న యూరియా ప్లాంటును గుజరాత్లోని హజీరాలో ఏర్పాటుచేసింది. అలాగే శ్యాం గ్రూప్ భాగస్వామ్యంతో 10 లక్షల వార్షిక సామర్థ్యమున్న ఒక ప్లాంటు ఉత్తరప్రదేశ్లో, మరో ప్లాంటు ఒమన్లో ఉన్నాయి. -
ఎరువుల దుకాణాలపై దాడులు
6 ఏ కేసు నమోదు ఆత్మకూరురూరల్: పట్టణంలోని మూడు ఎరువుల దుకాణాలపై రెవెన్యూ అధికారులు శనివారం మెరుపుదాడులు చేశారు. ఆర్డీవో వెంకటరమణ ఆధ్వర్యంలో తహశీల్దార్ బీకే వెంకటేశులు, వ్యవసాయశాఖ ఏడీ గోపినాయక్ తదితరులు మూడు బృందాలుగా ఏర్పడి షాపులు తనిఖీ చేశారు. కొన్ని దుకాణాల్లో రికార్డులు కంటే అధికంగా ఎరువులు ఉండగా, మరికొన్ని చోట్ల బిల్లులు లేకుండా విక్రయించడాన్ని గుర్తించారు. దాడులు అనంతరం ఆర్డీవో వెంకటరమణ విలేకర్లతో మాట్లాడుతూ వ్యాపారులు ఎరువులను కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్ముతున్నారని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డివిజన్లోని పలు దుకాణాలపై దాడులు చేశామన్నారు. అధిక ధరలకు విక్రయిస్తున్నారని పలువురు రైతులు ఆర్డీవోకి ఫిర్యాదు చేశారు. మూడు దుకాణాల్లో ఎక్కువ ఉన్న 396 బస్తాల ఎరువులను సీజ్ చేసి 6 ఏ కేసు నమోదు చేశారు. 577 బస్తాలను విక్రయించినా వాటికి సంబంధించిన బిల్లులు లేవని తేల్చారు. ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేసే రైతులు తప్పనిసరిగా బిల్లులు పొందాలని ఆర్డీవో సూచించారు. ఆత్మకూరు, అనంతసాగరం ఏవోలు ఎ.వాసు, కిశోర్బాబు, ఆర్ఐలు భాగ్యలక్ష్మి, సంధ్య తదితరులు పాల్గొన్నారు. ఉదయగిరిలో దాడులు ఉదయగిరి : పట్టణంలోని బాలాజీ ఫెర్టిలైజర్స్ ఎరువుల దుకాణాన్ని శనివారం కావలి ఆర్డీవో ఎన్. వెంకటరమణ తనిఖీ చేశారు. రికార్డుల ఆధారంగా గోదాము, దుకాణంలోని ఎరువులు, పురుగుమందుల నిల్వలు లెక్కించి స్వల్ప తేడాలున్నట్లు గుర్తించారు. తహశీల్దారు కుర్రా వెంకటేశ్వర్లు, వ్యవసాయాధికారి ఐ.సుబ్రహ్మణ్యం రెండుసార్లు గోదాములో ఉన్న ఎరువుల బస్తాలను పరిశీలించారు. యూరియా 11 బస్తాలు, 20:20:0:13 11 కట్టలు తేడా ఉన్నందున 6 ఏ కేసు నమోదు చేశారు. ఆర్డీవో మాట్లాడుతూ ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలో అనేక ఎరువుల దుకాణాలు ఉన్నప్పటికీ కేవలం ఒక్క దాన్లోనే తనిఖీలు చేయడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. -
ఎరువు.. బరువు
ధరలపై కేంద్రప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో ఎరువుల కంపెనీల ఇష్టారాజ్యంగా మారింది. ఒక్కో కంపెనీ ఒక్కోలా ధర పెంచేశాయి. రబీసాగులో దుక్కిలో వేయాల్సిన కాంప్లెక్స్ ఎరువుల ధర బస్తాకు సుమారు రూ.127కు పైగా పెరిగింది. ఖరీఫ్ సాగులో వచ్చిన నష్టాన్ని రబీలోనైనా పూడ్చుకుందామనుకున్న రైతన్నకు ఎరువుల ధరలు అశనిపాతంలా మారాయి. బ్యాంకుల నుంచి రబీ సీజన్లోనైనా వ్యవసాయ రుణాలు వస్తాయా, రావా అనే సందిగ్ధంలో రైతులున్నారు. ఊహించని విధంగా ఎరువుల ధరలు పెరగడంతో పెట్టుబడి భారంగా మారింది. పంట సాగు చేయాలంటేనే అన్నదాతలు భయపడుతున్నారు. నెల్లూరు(హరనాథపురం) జిల్లాలో రబీసీజన్లో 2.76425 హెక్టార్లలో వరి, మినుము, వేరుశనగ, చెరకు, పత్తి తదితర పంటలను సాగుచేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. వరి అత్యధికంగా 1.98295 లక్షల హెక్టార్లు, మినుము 27,316 హెక్టార్లు, వేరుశనగ 4910 హెక్టార్లు, చెరకు 70,100 సాగవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ప్రతి రైతూ దుక్కిలో హెక్టారుకు రెండున్నర బస్తాల డీఏపీని కచ్చితంగా వేయాలి. రెండు రోజుల కిందట డీఏపీ బస్తా రూ.1181 ఉండగా, ఈ ధర ప్రస్తుతం రూ.1249కు చేరింది. డీఏపీ బస్తాపై రూ.68 పెరిగింది. 14:35:14 ధర రూ.1120 నుంచి రూ.1207కు చేరింది. బస్తాపై రూ.127 పెరిగింది. అదేవిధంగా 10: 26: 26 ధర రూ.1083 ఉండగా, రూ.1139 అయింది. 20:20:0:13 ధర రూ.919 నుంచి రూ.956కు పెరిగింది. ఒక్కో హెక్టారుకు రైతుపై రూ.200 నుంచి రూ.300 అదనపు భారం పడుతోంది. జిల్లాలో సాగవుతున్న 2.78 లక్షల హెక్లార్లకు రూ.2 కోట్లకు పైగా భారం పెరగనుంది. ఇందులో ప్రధానంగా నత్రజని మొక్క పెరుగుదలకు, భాస్వరం వేర్ల అభివృద్ధికి, పోటాష్ గింజ నాణ్యతకు, బరువు పెరుగుదలకు, పురుగులు, తెగుళ్లు తట్టుకునే వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు ఉపయోగపడుతుంది. దీంతో కాంప్లెక్స్ ఎరువులను రైతులు కచ్చితంగా వాడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో పెరిగిన ఎరువుల ధరలు రైతులకు భారంగా మారనున్నాయి. అధిక ధర వసూలు చేస్తోన్న దుకాణదారులు పెరిన ధరలు రైతులకు పెనుభారం కాకగా మరోవైపు వ్యాపారులు ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఎరువుల దుకాణాల్లో అధిక ధరలు వసూలు చేస్తున్నారు. దీంతో రైతులు ఇబ్బదులు పడుతున్నారు. రబీ సీజన్కు 52,500 మెట్రిక్ టన్నులు కాంప్లెక్స్ ఎరువులు అవసరం కాగా, అందుబాటులో కేవలం రూ.11,200 మెట్రిక్ టన్నులు ఉన్నాయి. యూరియా 8 వేలు, డీఏపీ 3500, ఎంఏపీ 3500 మెట్రిక్ టన్నులు ఆవసరం ఉండగా ప్రస్తుతం కొరత ఏర్పడటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎంఆర్పీ ప్రకారం యూరియా బస్తా రూ.283, వేప నూనె కలిపిన యూరియా రూ.298కి విక్రయించాల్సి ఉంది. జిల్లాలో పలు ప్రాంతాల్లో 50 కిలోల బస్తాను రూ.360 నుంచి రూ.400 వరకు వ్యాపారులు అమ్ముతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా బస్తాకు రూ.100 అదనంగా చెల్లించాల్సి రావడం రైతులకు పెను భారంగా మారింది. జిల్లాలోని 99 పీఏసీఎస్లు ఉండగా 95 మాత్రమే ఎరువుల అమ్మకాలు సాగిస్తున్నాయి. ఎరువుల ధరలను దృష్టిలో ఉంచుకుని రైతులకు విక్రయించాల్సిన ఎరువులను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీనిపై వ్యవసాయ అధికారులు స్పందించక పోవడం విమర్శలకు తావిస్తోంది యూరియా కోసం పడిగాపులు సూళ్లూరుపేట: స్థానిక సహకార సంఘ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. రబీ సాగుకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దఫా యూరియా కొరత ఏర్పడింది. రాష్ట్రంలో యూరియా ఉత్పత్తి తగ్గిపోవడంతో కొరత నెలకొందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యూరియాను ప్రభుత్వం కేవలం సహకార సంఘాలకు మాత్రమే పంపిణీ చేస్తుందని తెలిపారు. సూళ్లూరుపేట, తడ మండలాల రైతులు బస్తా యూరియా కోసం రెండు రోజులుగా సహకార సంఘ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. సహకార సంఘానికి లారీలకు లారీలు యూరియా తెప్పిస్తున్నా రైతులకు సరిపడే పరిస్థితి కనిపించడం లేదు. ప్రైవేట్ డీలర్లు తమిళనాడులోని కొరతను దృష్టిలో ఉంచుకుని వ్యాపారం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూరియా కొరత తీవ్రంగా ఉండడంతో రైతులు ఆందోళనతో సాగు చేపట్టక ముందే కార్యాలయానికి క్యూ కడుతున్నారు. ఈ కొరతను తీర్చేందుకు వ్యవసాయాధికారులు పట్టాదారు పాసుపుస్తకాలు తెచ్చిన వారికే యూరియా ఇస్తామని చెబుతుండడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ధరలు తగ్గించాలి ఇప్పటికే ఖరీఫ్ సీజన్లో బ్యాంకుల నుంచి రుణాలు అందక బయట అప్పులు తెచ్చుకుని పంటలు సాగు చేశాం. రబీ సీజన్లో ఎరువుల కంపెనీలు తమ ఇష్టానుసారంగా ఎరువుల ధరలు పెంచడం మంచిది కాదు. ఇలా అయితే రైతులు వ్యవసాయం నుంచి పక్కకు వెళ్లే అవకాశం ఉంది. తద్వారా ఆహార కొరత ఏర్పడుతుంది. ప్రభుత్వం జోక్యం చేసుకుని పెంచిన ధరలు తగ్గించాలి. - కోటపూరి రమణయ్య, రైతు, పడుగుపాడు అధిక ధరకు విక్రయిస్తే చర్యలు కృత్రిమ కొరత సృష్టించి ఎంఆర్పీకంటే అధిక ధరకు ఎరువుల బస్తా విక్రయిస్తే వ్యాపారులపై చర్యలు తీసుకుంటాం. జిల్లాలో సొసైటీల ద్వారా రైతులకు అవసరమైన కాంప్లెక్స్ ఎరువులను ఎంఆర్పీ ధరకే విక్రయిస్తున్నాం. సొసైటీలకు కేటాయించిన ఎరువులు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తే వారిపై శాఖా పరమైన చర్యలను తీసుకుంటాం. రబీ సీజన్కు అవసరమైన 52,500 మెట్రిక్ టన్నులు అవసరం కాగా ప్రస్తుతం 11వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయి. సీజన్కు అవసరమైన ఎరువుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. జిప్సమ్, జింకు సల్ఫేటు 50 శాతం సబ్సిడీతో అందజేస్తున్నాం. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. - కేవీ సుబ్బారావు, జేడీ, వ్యవసాయ శాఖ -
పోర్టులో కరిగిన యూరియా!
40 వేల టన్నుల యూరియా, పొటాషియం నీటి పాలు నిల్వలు బూస్టర్ డోస్కి సరిపోతాయి రబీకి గడ్డు కాలం.. సాక్షి, హైదరాబాద్: హుదూద్ తుపాను ప్రభావం ఎరువుల కంపెనీలనూ తాకింది. తుపానుతో కురిసిన భారీ వర్షాలు, పెనుగాలులకు విశాఖ హార్బర్లో నిల్వ చేసిన వేలాది టన్నుల ఎరువులు తడిసి ముద్దయ్యాయి. ఏయే కంపెనీకి ఎంత నష్టం వాటిల్లో ఇంకా స్పష్టం కానప్పటికీ ప్రధాన ఎరువుల కంపెనీలన్నీ తుపాను నష్టాన్ని చవిచూశాయి. నష్టం అంచనాకు ఆయా కంపెనీల అధికారులు ఆందోళనతో విశాఖపట్నం వైపు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఇండియన్ పొటాష్ లిమిటెడ్ (ఐపీఎల్), కోరమాండల్ ఇంటర్నేషనల్, ఇఫ్కో, క్రిబ్కో, నాగార్జున వంటి ప్రముఖ ఎరువుల కంపెనీలన్నీ ప్రధాన ఓడరేవుల ద్వారా ఎరువుల్ని దిగుమతి చేస్తుంటాయి. వచ్చిన సరుకును ఆయా కేంద్రాలకు పంపే వరకు నిల్వ చేసుకునేలా ఓడరేవుల్లో ఎరువుల కంపెనీలకు గిడ్డంగులు కూడా ఉంటాయి. ఎగసిపడిన అలలకు విశాఖ హార్బర్ గోడలు కూలడంతో ఎరువుల కంపెనీలకు ఇచ్చిన గిడ్డంగులూ ధ్వంసమైయ్యాయి. ఫలితంగా వాటిల్లో నిల్వ ఉంచిన డిఎపీ, పొటాషియం, యూరియా వంటి ఎరువులు పాడై పోగా ఓడల నుంచి కంటైనర్ల నుంచి దించని ఎరువులు మాత్రం సురక్షితంగా ఉన్నాయి. పాడైన ఎరువుల విలువ సుమారు సుమారు రూ.30 కోట్ల దాకా ఉండొచ్చని అంచనా. నష్టం విషయం తెలుసుకున్న ఎరువుల కంపెనీల ప్రతినిధులు హుటాహుటిన విశాఖ బయల్దేరారు. కాకినాడ నుంచి ఇఫ్కో కంపెనీ అధికారులు ఇప్పటికే విశాఖ పట్నం చేరుకుని తమ గిడ్డంగిలో నిల్వ ఉంచిన సూక్ష్మపోషకాల ఎరువులకు కలిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. తమ వద్ద యూరియా నిల్వలు లేవని తేల్చినట్టు ప్రాథమిక సమాచారం. ఐపీఎల్ కంపెనీకి విశాఖ హార్బర్లో మూడు గిడ్డంగులున్నాయి. వాటిల్లో ఏయే సరకు నిల్వ ఉన్నది ఇంకా తేలలేదు. గుజరాత్ నుంచి ప్రతినిధులు రానున్నారు. నీటిపాలైన క్రిబ్కో యూరియా.. ఈ తుపానులో క్రిబ్కో కంపెనీ ఎక్కువగా నష్టపోయినట్టు తెలుస్తోంది. ఈ కంపెనీ ఇటీవలే ఒమన్లోని తన కర్మాగారం నుంచి 32 వేల టన్నుల యూరియాను తెప్పించింది. ఓడ నుంచి సరకును దించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్న దశలో తుపాను వచ్చింది. దీంతో ఏ ఒక్క బస్తా బయటకు వెళ్లలేదు. నీటిలో నాని కొంత మొత్తం కరిగిపోగా, మరికొంత గడ్డకట్టుకుపోయింది. దీనివల్ల ఈ కంపెనీకి రూ.17 కోట్లకు పైగా నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా. ఇదేమాదిరిగా మిగతా కంపెనీల గిడ్డంగుల్లో నిల్వ ఉంచిన 8 వేల టన్నుల పొటాషియం, డీఏపీ తదితర ఎరువులకు నష్టం వాటిల్లింది. దీని విలువ సుమారు రూ.12 నుంచి 13 కోట్ల రూపాయలకుపైగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. రబీ సీజన్లో యూరియా కొరత తప్పదా? తుపాను పీడిత ప్రాంతాల్లో వరి, ఇతర ఉద్యానవన పంటలకు బూస్టర్ డోస్ కింద యూరియా, పొటాష్ను వాడతారు. ఎకరాకు 20 కిలోల యూరియా, పది కిలోల పొటాష్ అవసరం. అనుకోని ఈ విపత్తుకు ప్రస్తుత నిల్వల నుంచి ఈ ఎరువుల్ని వినియోగించమని వ్యవసాయ శాఖ ఆదేశించింది. ఇంతవరకు సజావుగానే ఉన్నా అక్టోబర్ నుంచి మొదలయిన రబీ సీజన్ పంటలకు యూరియా కొరత తప్పేలా లేదు. ప్రస్తుత అవసరాల కోసం తెప్పించిన యూరియా తడిసిపోవడంతో ఇప్పటికిప్పుడు తిరిగి తయారుచేయడం కష్టం. దీని ప్రభావం రబీ పంటలపై పడుతుందని వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
యూరియా...మాఫియా
సాక్షి, ఒంగోలు: ఎరువుల విక్రయాల బ్లాక్మార్కెట్ దందా జిల్లాలో జోరుగా సాగుతోంది. యూరియా బస్తాలను అక్రమంగా నిల్వ చేస్తూ దొంగచాటు విక్రయాలకు కొందరు పాల్పడటంపై ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. బ్లాక్మార్కెట్లో ఎరువుల విక్రయాల్ని అరికట్టేందుకు వ్యవసాయ శాఖకు చెందిన యంత్రాంగం, ప్రత్యేక తనిఖీ బృందాలు, విజిలెన్స్ అధికారులు వరుస దాడులకు సిద్ధపడ్డాయి. దీంతో డీలర్లు కొత్తమార్గాలను ఎంచుకుంటున్నారు. ఎమ్మార్పీ ధరకే యూరియా బస్తాలను అమ్ముకోలేని కొందరు డీలర్లు అసలు నిల్వల్నే తెప్పించకుండా మిన్నకుంటున్నారు. మరికొందరేమో తమకు పరిచయమున్న రైతులకే విక్రయిస్తున్నారు. కంపెనీలు రవాణా చార్జీలను రిటైల్ డీలర్లపైనే మోపడంతో, లింకు ఉత్పత్తులు కొనుగోలు చేస్తేనే యూరియా సరఫరా చేస్తామనడంతో డీలర్లు తప్పనిసరి పరిస్థితుల్లో ఎమ్మార్పీ కన్నా అధిక ధరకు విక్రయిస్తున్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. జిల్లాలో ఎరువుల కొరతను నివారించి రైతులందరికీ సకాలంలో వాటిని అందించాలనే ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తగా బఫర్స్టాక్ను మార్క్ఫెడ్ గోడౌన్లో నిల్వచేశారు. ఇప్పటికే జిల్లాలో రైతులకు అవసరమైన 9 వేల క్వింటాళ్ల యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. వీటిని సకాలంలో సొసైటీలకు పంపి రైతులకు అందజేయడంలో ఆలస్యమవుతోంది. ఈ క్రమంలో ఎరువులు వినియోగానికి పనికిరాకుండా వృథా అవుతున్నాయి. ఇటీవల విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో విభిన్న ప్రాంతాల్లో 46 బస్తాల యూరియా పొడిగా మారినట్లు గుర్తించారు. అక్కడి సిబ్బందిని ప్రశ్నిస్తే.. గత ఏడాది నిల్వలు పాడయ్యాయని చెప్పారు. ప్రణాళిక ప్రకారం ఎరువులు కొరత లేకుండా చూడాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా, ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎరువుల విక్రయాల్లో సొసైటీలు సైతం క్రియాశీలకంగా వ్యవహరించకపోవడం రైతులకు శాపంగా మారింది. సొసైటీలు సక్రమంగా పనిచేస్తే జిల్లాలోని అన్ని మండలాల్లో కేంద్రాలు ఏర్పాటుచేసి ఎరువులు విక్రయిస్తే, ప్రయివేటు డీలర్ల హవాకు అడ్డుకట్ట పడేది. వీటితోపాటు సొసైటీలు లేని మండలాలు, పెద ్ద గ్రామాల్లో డీసీఎంఎస్ కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఎరువులు అందిస్తే కొరత నివారించవచ్చునని పలువురు రైతులు సూచిస్తున్నారు. అనధికార అమ్మకాలపై నిఘా శూన్యం జిల్లాలో రీటైల్ ఎరువుల డీలర్లు ఎమ్మార్పీకి యూరియాను విక్రయిస్తే నష్టాలు వస్తాయని, అదే సమయంలో ఎమ్మార్పీకంటే అదనంగా అమ్మితే దాడుల్లో పట్టుబడతామని భావించి కొత్తమార్గాల్ని అన్వేషిస్తున్నారు. కంపెనీ ఎమ్మార్పీ ధర ఒక్కో బస్తా రూ.285కు అందజేయాల్సి ఉంది. అయితే, రిటైల్ డీలర్ వద్ద ఉన్న ఎరువుల నిల్వలను తమకు తెలిసిన రైతులకే ఒక్కొక్కరి పేరుతో 20 నుంచి 30 బస్తాల యూరియాకు బిల్లులు రాసి గోప్యంగా నిల్వలు దాచేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతుల ఇళ్లల్లోనే బస్తాలను నిల్వ పెడుతున్నారు. కొత్తవారు యూరియా కొనుగోలుకు వస్తే స్టాక్ లేదంటూ వెనక్కితిప్పి పంపుతున్నారు. రెగ్యులర్గా వచ్చే రైతులు, ముఖ పరిచయం ఉన్నవారికి మాత్రమే బస్తా రూ.350 నుంచి రూ.370 వరకు విక్రయించి రైతుల ఇళ్లనుంచి సరఫరా చేస్తున్నారు. అద్దంకిలో ఒక డీలర్ 450 బస్తాల యూరియాను తొమ్మిదిమంది రైతుల పేర్లతో బిల్లులు రాసి గోడౌన్లో నిల్వచేశారు. దీనిపై సమాచారమున్న అధికారులు దాడులకు సిద్ధపడగా, స్థానిక అధికారపార్టీ నేతల వత్తిళ్ల నేపథ్యంలో వెనుకంజవేసినట్లు సమాచారం. దీన్ని దృష్టిలో ఉంచుకుని మిగతాచోట్ల డీలర్లు జాగ్రత్తపడ్డారు. విజిలెన్స్ అధికారులు దాడులు చేయడంతో జిల్లాలో రెండుప్రాంతాల్లో ఇలాంటి అక్రమాలు వెలుగులోకొచ్చాయి. గిట్టుబాటు లేకనే అధిక దరలు.. ప్రస్తుత పరిస్థితుల్లో యూరియా ఎమ్మార్పీకి అమ్మితే నష్టపోవాల్సి వస్తుందని డీలర్లు వాపోతున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో సహకార సంఘాలు క్రియాశీలకంగా నడవకపోవడం, ప్రయివేటు డీలర్లు యూరియాను తెప్పించకపోవడంతో రైతులు ఇతరప్రాంతాలకు వెళ్లి కొనుగోలు చేయాల్సి వస్తోంది. జిల్లాలో కొందరు వ్యాపారులు అనుమతులు లేకుండానే ఎరువులు విక్రయిస్తున్నారు. కనిగిరి, మార్కాపురంలోని తొమ్మిది దుకాణాల యాజమాన్యాలు అనుమతిలేకుండానే పురుగు మందులు, ఎరువులు విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో దుకాణాలకు ఎరువులు సొసైటీల నుంచి వచ్చినట్లు తేలిపోయింది. దాడుల్లో పట్టుబడుతున్న ఎరువుల్లో అత్యధికశాతం డీసీఎంఎస్ నుంచి కొనుగోలు చేసినట్లు తేలింది. సొసైటీలకు రవాణా చేసిన ఎరువులు అనుమతిలేని డీలర్ల వద్దకు ఎలా వచ్చాయనేది వ్యవసాయాధికారులు దృష్టిపెడితే..అక్రమాలు బహిర్గతమయ్యే అవకాశం ఉంది. ఎరువులు చేతులు మారడం వెనుక కొందరు అధికారులతోపాటు దళారులు కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రైతులకు సేవ ముసుగులో వ్యాపారం చేస్తున్నారన్న ఫిర్యాదులు విజిలెన్స్ అధికారులకు అందడమే పరిస్థితికి నిదర్శనం. ప్రభుత్వజోక్యంతో ఎమ్మార్పీ అమలు జిల్లాలో ప్రయివేటు డీలర్లకు ఎరువులు సరఫరా చేస్తున్న కంపెనీలు రవాణాచార్జీలను డిస్ట్రిబ్యూటర్లు, రిటైల్ డీలర్లపై భారం మోపుతున్నాయి. మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, యరగొండపాలెం, దర్శి తదితర ప్రాంతాలకు బస్తాకు రూ.20వరకు రవాణాచార్జీ అవుతుంది. దీనికి తోడు లింకు ఉత్పత్తులు అంటగట్టడం మరింత ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో డీలర్లు బస్తాకు రూ.50 నుంచి రూ.70వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. అధిక ధరకు అమ్మలేని డీలర్లు యూరియా తీసుకోవడానికి వెనుకంజవేస్తున్నారు. లింకు ఉత్పత్తులు లేకుండా యూరియా సరఫరా చేయాలంటే డిస్ట్రిబ్యూటర్కు బస్తా రూ.10 అదనంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వ జోక్యం చేసుకుని రవాణా చార్జీలను కంపెనీలే చెల్లించేలా వత్తిడి తెచ్చి, లింకు ఉత్పత్తులు అంటగట్టనప్పుడే జిల్లాలో ఎమ్మార్పీ అమలవుతోందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. -
తీరనున్న రైతుల కష్టాలు
- మంచిర్యాలలో ఎరువుల దిగుమతి కేంద్రం - పది రోజుల్లో దిగుమతి కానున్న ఎరువులు మంచిర్యాల రూరల్ : తూర్పు ప్రాంత రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఎరువుల దిగుమతి కేంద్రం(రాక్ పాయిం ట్)ను మంచిర్యాలలో నెలకొల్పేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎరువులను దిగుమతి చేసేందుకు అవసరమైన గోదాములను మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్లో గల స్టేట్ వేర్హౌస్ కార్పొరేషన్కు చెందిన గోదాముల్లో ఎరువులను నిల్వ చేసేందుకు అనుమతులు పూర్తయ్యాయి. రైల్వే వ్యాగన్ల ద్వారా వచ్చిన ఎరువులను రవాణా చేసేందుకు లారీ ట్రాన్సుపోర్టు, బస్తాలను వ్యాగన్ల నుంచి లారీలో వేసేందుకు హమాలీల సంఘంతో అగ్రిమెంట్లు పూర్తి చేసి, ఎరువుల కంపెనీల నుంచి ఎరువులను దిగుమతి చేసుకునేందుకు అన్ని రకాల అనుమతులను అవంతి వేర్ హౌస్ అనే హ్యాండ్లింగ్ సంస్థ పొందినట్లు మండల వ్యవసాయాధికారి చంద్రన్ కుమార్ తెలి పారు. మరో పది రోజుల్లో మంచిర్యాల రేక్ పాయింట్కు ఒక రేక్లో 2500 మెట్రిక్ టన్నులు(50 వేల బస్తాలు) ఎరువులు దిగుమతి కానున్నట్లు తెలిపారు. నాలుగేళ్లకు మోక్షం జిల్లా కేంద్రంలో ఉన్న ఎరువుల దిగుమతి కేంద్రం నుంచి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు రవాణా చేయడం ఖర్చుతో కూడుకున్నది. ఫలితంగా రైతులకు ఒక్క బస్తాపై రూ.40 నుంచి రూ.60 వరకు అదనంగా భారం పడుతోంది. జిల్లా కేంద్రం నుంచి తూర్పు ప్రాంతాలకు దాదాపు 350 కిలోమీటర్లు ఉం డటం, కవ్వాల్ అభయారణ్యంలో రాత్రి సమయాల్లో భారీ వాహనాలకు అనుమతులు లేకపోవడంతో లారీల్లో లోడ్ చేసిన ఎరువులు రెండు రోజులకు గానీ జిల్లాలోని చివరి మండలాలైన బెజ్జూరు, సిర్పూరు, కౌటాల, కోటపల్లి, వేమనపల్లి మండలాలకు చేరడం లేదు. దీంతో రవాణా ఖర్చుతోపాటు, లారీలకు అదనంగా అద్దె చెల్లించడంతో ఎరువులను రవాణా చేసేందుకు అధికంగా ఖర్చవుతుంది. తూర్పు ప్రాంతం కేంద్రంగా ఉన్న మంచిర్యాలలో ఎరువుల దిగుమతి కేంద్రంను ఏర్పాటు చేయడం వల్ల తూర్పు ప్రాంతంలోని ఐదు నియోజకవర్గాల్లోని 24 మండలాల రైతులకు మేలు చేకూరుతుందని ఈ ప్రాంత ఎమ్మెల్యేలు, రైతులు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు. నాలుగేళ్ల క్రితం ప్రభుత్వం ఎరువుల దిగుమతి కేంద్రంకు అనుమతి విషయమై సానుకూలంగా స్పందించిం ది. రైలు ద్వారా పెద్దపల్లిలోని రాక్ పాయింట్ వరకు ఎరువులను సరఫరా చేస్తున్న కంపెనీలు, దగ్గరలోని మంచిర్యాల వరకు సరఫరా చేయడం కష్టమేమి కాకున్నా, ఇక్కడి స్థానిక సమస్యలతో ఇన్నాళ్లు పూర్తిస్థాయి అనుమతులు రావడంలో ఆలస్యం జరిగింది. ఇన్నాళ్లు ఎరువులను నిల్వ చేసేందుకు గోదాములను గుర్తించడం, హమాలీలు, లారీట్రాన్సుపోర్టు వారితో అగ్రిమెంటు చేసుకునే విషయంలో హ్యాండ్లింగ్ ఏజెన్సీతో ఒప్పందాలు జరిగేందుకు నాలుగేళ్ల సమయం పట్టింది. ఎట్టకేలకు అన్ని రకాల అనుమతులు రావడంతో మరో పది రోజుల్లోగా మొదటి దశ ఎరువులు మంచిర్యాలకు దిగుమతి కానున్నట్లు వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. తగ్గనున్న ధరలు జిల్లా కేంద్రం నుంచి ఎరువులను దిగుమతి చేసుకోవడం కోసం రవాణా, హమాలీ చార్జీల కింద ఒక్కో ఎరువుల బస్తాపై రూ.40 నుంచి రూ.60 వరకు దుకాణదారులు రైతుల నుంచి అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ చార్జీలు తప్పే అవకాశం ఉంది. దీంతో పాటు ఎరువులు దిగుమతైన వెంటనే అదేరోజు మారుమూల ప్రాంతాల్లోని మండలాలకు రవాణా చేసేందుకు అవకాశం ఉంటుంది. -
యూరియా కేటాయింపులో పక్షపాతం
రాయచూరు టౌన్: జిల్లా రైతులకు అవసరమైన యూరియా కేటాయింపులో పాలకులు చూపుతున్న పక్షపాతంపై పలువురు విమర్శిస్తున్నారు. జిల్లాకు కేటాయించిన 75 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఎరువుల్లో ఇప్పటి వరకు 55 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే విడుదలైంది. నెలరోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాల ఫలితంగా ఉన్నఫళంగా యూరియాకు డిమాండ్ పెరిగింది. గ్రామీణ వ్యవసాయ సహకార సంఘాలు, ఎరువుల దుకాణాల ఎదుట రైతులు రాత్రింబవళ్లు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. జిల్లాకు వచ్చిన 55 వేల టన్నుల ఎరువుల్లో సగం బీఎస్ఎన్ఎస్ ద్వారాను, మిగిలిన సగం ఎరువుల దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్నారు. అయినప్పటికీ జిల్లా, తాలూకా, ఫిర్కాకేంద్రాల్లో పక్షం రోజులు గడిచినా రైతులకు యూరియా దొరకడంలేదు. దీంతో దెబ్బతింటున్న తమ పంటలను ఎలా రక్షించుకోవాలో తెలియక రైతులు ఆవేదన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం 8 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు రాగా, మరో రెండు రోజుల్లో 1500 మెట్రిక్ టన్నులు రానున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ విషయమై జిల్లాధికారి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ మేరకు ఓ లేఖద్వార పరిస్థితిని వివరించారు. ఇదిలా ఉండగా కొప్పళకు మాత్రం కేటాయించిన 43వేల మెట్రిక్ టన్నులకన్నా అధికంగా ఇప్పటి వరకు 54 వేల టన్నులు విడుదల చేశారు. అంటే ఆ జిల్లాకు కేటాయించిన దానికంటే 11వేల మెట్రిక్ టన్నులు అదనంగా ఆ జిల్లాకు లభించింది. కేంద్రం, రాష్ట్రంలో వే ర్వేరు పార్టీల ప్రభుత్వాలు ఉండడం వల్లే ఇలా జరుగుతోందని పలువురు విశ్లేషిస్తున్నారు. కొప్పళ జిల్లా ఎంపీ బీజేపీ నాయకుడు కాగా, రాయచూరు ఎంపీ కాంగ్రెస్ అన్న విషయం తెలిసిందే. -
మోడీ పాలన భేష్
కేంద్ర మంత్రి అనంత కుమార్ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ప్రధాని నరేంద్ర మోడీ వంద రోజుల పాలనలో ఎంతో సాధించారని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంత కుమార్ కితాబునిచ్చారు. మంగళవారం స్థానిక బీజేపీ కార్యాలయంలో జరిగిన బెంగళూరు నగర జిల్లా శాఖ కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. యూపీఏ హయాంలో వంట గ్యాస్కు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయని, తమ ప్రభుత్వం వచ్చాక వినియోగదారులకు ఏడాదికి 12 సిలిండర్లు అందేలా చూస్తున్నదని వెల్లడించారు. మన్మోహన్ సింగ్ పదేళ్ల హయాంలో దేశానికి లభించని అంతర్జాతీయ కీర్తి ప్రతిష్టలను కేవలం వంద రోజుల్లోనే మోడీ సాధించగలిగారని ప్రశంసించారు. ఈ నెల 23, 24 తేదీల్లో రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధానికి అపూర్వ స్వాగతం పలకడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 23న సాయంత్రం అయిదు గంటలకు హెచ్ఏఎల్ విమానాశ్రయానికి వస్తున్న మోడీకి ఘన స్వాగతం పలకడంతో పాటు సత్కరించనునున్నట్లు చెప్పారు. కనుక నగరంలోని ప్రతి వార్డూ, నియోజక వర్గం నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని కోరారు. నగరానికి వచ్చిన వెంటనే ప్రధాని తొలుత ఇస్రోను సందర్శిస్తారని, మార్గ మధ్యంలో కూడా ఆయనకు ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. 24న ఉదయం పది గంటలకు తుమకూరులో ఇండియా ఫుడ్ పార్కుకు శంకుస్థాపన చేస్తారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, మాజీ మంత్రులు ఆర్. అశోక్, అరవింద లింబావళి, నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. -
రామగుండం యూరియా ప్లాంటుకు పూర్వవైభవం
న్యూఢిల్లీ: యూరియా ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే చర్యలను కేంద్రం చేపట్టింది. మూతపడిన ప్రభుత్వ రంగ యూరియా కర్మాగారాల పునరుద్ధరణకు పెట్టుబడి ప్రతిపాదనలను ఆమోదించింది. రామగుండం, తాల్చేర్లలో మూతపడిన యూరియా ప్లాంట్లను రూ.10 వేల కోట్ల పెట్టుబడితో పునరుద్ధరించే ప్రతిపాదనలను గత వందరోజుల్లో ఆమోదించామని కేంద్ర ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్ గురువారం మీడియాకు తెలిపారు. సింద్రిలోని మరో మూతపడిన ప్లాంటు పునరుద్ధరణ యత్నాలు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. అస్సాంలోని బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ (బీవీఎఫ్సీఎల్) ప్రాంగణంలో యూరియా - అమోనియా ప్లాంటును కొత్తగా నిర్మించే యత్నాల్లో ఉన్నట్లు వివరించారు. ఇంత భారీ స్థాయిలో ఇన్వెస్ట్మెంట్లు చేయడం గత దశాబ్దంలో ఇదే ప్రథమమని అన్నారు. గత పదేళ్లలో దేశంలో ఒక్క ఎరువుల ప్లాంటును కూడా నిర్మించలేదని చెప్పారు. యువతకు ఉపాధి కల్పించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ కలలను సాకారం చేసేందుకు జగదీశ్పూర్-హల్దియా గ్యాస్ పైప్లైన్ నిర్మాణంపై పెట్రోలియం మంత్రితో ఇప్పటికే రెండుసార్లు చర్చించానని అనంత్కుమార్ వెల్లడించారు. -
ఖరీఫ్ ఎరువుకు గ్యాస్ దెబ్బ
నగరం పేలుడుతో మూతపడ్డ ఓఎన్జీసీ బావులు.. నిలిచిన గ్యాస్ సరఫరా గ్యాస్ సరఫరా లేక ఎరువులు, విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తికి 20 రోజులుగా బ్రేక్ ఒక్క నాగార్జున కర్మాగారంలోనే నిలిచిపోయిన రోజుకు 5,000 టన్నుల ఉత్పత్తి ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా6 రాష్ట్రాలకు ఆగిన యూరియా సరఫరా ఆగస్టు వరకు విదేశీ యూరియా దిగుమతులు రావడం కష్టమే.. దిగుమతి చేసుకున్న ఎరువులతో కేంద్రంపై పెరగనున్న భారం ఈ ఖరీఫ్లో వ్యవసాయానికి యూరియా కటకట తప్పదు: యూరియా సంస్థలు విద్యుత్ ప్లాంట్లకూ గ్యాస్ కొరత దెబ్బ - 750 మెగావాట్ల ఉత్పత్తికి బ్రేక్ కాకినాడ: కృష్ణా - గోదావరి బేసిన్లో ఓఎన్జీసీ గ్యాస్ బావులు మూతపడటంతో.. గ్యాస్ సరఫరా లేక ఎరువుల ఉత్పత్తికి బ్రేక్ పడింది. ఫలితంగా ఖరీఫ్ సీజన్లో వ్యవసాయానికి ఎరువులకు తీవ్ర కొరత ఎదురుకానుంది. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని నగరం గ్రామంలో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్) గ్యాస్ పైపులైన్ పేలుడుతో సహజ వాయువు ఉత్పత్తి చేసే సుమారు 70 ఓఎన్జీసీ బావులు మూతపడి మూడు వారాలైంది. దాంతో సహజ వాయువు సరఫరా నిలిచిపోయి, గ్యాస్పై ఆధారపడ్డ విద్యుత్, ఎరువుల ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది. బావుల పునరుద్ధరణ ఇప్పట్లో సాధ్యం కాదని పైపులైన్ల నాణ్యతపై సర్వే చేస్తున్న ‘ఇంజనీర్స్ ఇండియా’ అభిప్రాయపడుతోంది. గ్యాస్ సరఫరా లేక ఆంధ్రప్రదేశ్ సహా ఆరు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ఫెర్టిలైజర్స్ మూమెంట్స్ ఆర్డర్ ఆధారంగా జరగాల్సిన యూరియా సరఫరా నిలిచిపోయింది. రాష్ట్రంలో యూరియా అవసరాల్లో దాదాపు సగం యూరియా కాకినాడలోని నాగార్జున ఎరువుల కర్మాగారం తీరుస్తుంటుంది. గ్యాస్ సరఫరా లేక యూరియా ఉత్పత్తి నిలిచిపోగా మరోపక్క విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యూరియా కూడా ఆగస్టు నెలాఖరు వరకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఖరీఫ్లో యూరియా కొరత పెనుసమస్య కానుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ‘నాగార్జున’లో నిలిచిన ఉత్పత్తి నాగార్జున కర్మాగారంలో గ్యాస్ సరఫరా జరిగే రోజుల్లో రోజుకు 5,000 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి జరిగేది. కేంద్ర ప్రభుత్వం ఒప్పందంలో భాగంగాఏటా సుమారు20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాల్సి ఉంది. గెయిల్ నుంచి నాగార్జునలోని రెండు ప్లాంట్లకు రోజుకు 3.15 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా కావాలి. వాస్తవంగా గెయిల్ నుంచి సరఫరా అవుతున్నది 2.4 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లే. నగరం పైపు లైన్ పేలుడు తరువాత ఆ సరఫరా కూడా నిలిచిపోయింది. 20 రోజులుగా నాగార్జునలో 14.50 లక్షల నుంచి 20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. ఇక్కడ ఉత్పత్తయ్యే యూరియా ఒడిషా, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు కేంద్రం నిర్ణయించే కోటా ప్రకారం రైల్వే ర్యాక్ల ద్వారా సరఫరా చేస్తుంటారు. సరఫరా నిలిచిపోవడంతో నాగార్జున రోజుకు సుమారు రెండు కోట్ల టర్నోవర్ను కోల్పోయింది. పునర్విభజనకు ముందున్న రాష్ట్రంలో ఖరీఫ్ అవసరాలకు 40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా. దీన్లో సుమారు 14.50 లక్షల మెట్రిక్ టన్నులు నాగార్జున కర్మాగారంలో ఉత్పత్తి అయితే 26 లక్షల టన్నులు ఒమన్, దుబాయ్, కువైట్ తదితర గల్ఫ్ దేశాల నుంచి కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం తదితర ఓడరేవుల ద్వారా దిగుమతి చేసుకోవలసి ఉంది. యూరియా ఉత్పత్తి కంపెనీల ప్రతినిధులు రెండు రోజుల కిందట కేంద్ర పెట్రోలియం మంత్రిని, గెయిల్ చైర్మన్ను కలిసి గ్యాస్ సరఫరాను వెంటనే పునరుద్ధరించకుంటే ఎరువులకు కొరత ఏర్పడి రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. కేంద్రం నిర్ణయించిన ప్రకారం రైతులకు టన్ను యూరియాను రూ. 5,500కు విక్రయిస్తుండగా.. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యూరియా టన్నుకు 350 డాలర్లు (సుమారు రూ. 20 వేలు) అవుతుంది. ఆ మేరకు దిగుమతి చేసుకుంటున్న యూరియా కేంద్ర సర్కారుకు భారమవుతోంది. మూతపడ్డ పవర్ ప్లాంట్లు... గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో విద్యుత్ సంక్షోభం కూడా రాష్ట్రాన్ని పీడిస్తోంది. కాకినాడ తీరంలోని ఉప్పాడ స్పెక్ట్రమ్, ల్యాంకో, విజ్జేశ్వరం, జెన్కో తదితర గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు రోజుకు సుమారు 20 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా నిలిచిపోయి విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. ఓఎన్జీసీ బావులతో పాటు రిలయన్స్, కెయిర్న్ ఎనర్జీ సంస్థల బావుల్లో మరో 10 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. ఈ బావుల నుంచి గెయిల్ విజయవాడ సమీపంలోని ల్యాంకో, విజ్జేశ్వరంలోని ఏపీ జెన్కో, ఉప్పాడ తీరంలోని స్ప్రెక్టమ్ తదితర విద్యుదుత్పత్తి ప్లాంట్లకు రోజూ సుమారు 30 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా చేసేది. ఇప్పుడు గ్యాస్ సరఫరా కాక 750 మెగావాట్ల విద్యుదుత్పత్తి ఆగిపోయింది. 20 రోజులుగా సుమారు 15 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. 100 నుంచి 150 మెగావాట్లు ఉత్పత్తి చేసే విజ్జేశ్వరం, స్పెక్ట్రమ్ ప్లాంట్లు, సుమారు 200 మెగావాట్లు ఉత్పత్తి చేసే వేమగిరి పవర్ ప్రాజెక్టు, 300 మెగావాట్లు ఉత్పత్తిచేసే ల్యాంకో పవర్ప్రాజెక్టు మూతపడ్డాయి. గెయిల్ పైపులైన్లను అధ్యయనం చేస్తున్న ఇంజనీర్స్ ఇండియా నివేదిక వచ్చేసరికి ఎంతలేదన్నా రెండు, మూడు నెలలు పడుతుందని ఓఎన్జీసీ వర్గాలు చెప్తున్నాయి. ఈ పరిస్థితుల్లో యూరియా, విద్యుత్ కొరతలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను చూడాల్సి ఉందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.ఖరీఫ్లో యూరియా కొరత పెనుసమస్య కానుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ‘నాగార్జున’లో నిలిచిన ఉత్పత్తి నాగార్జున కర్మాగారంలో గ్యాస్ సరఫరా జరిగే రోజుల్లో రోజుకు 5,000 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి జరిగేది. కేంద్ర ప్రభుత్వం ఒప్పందంలో భాగంగాఏటా సుమారు20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాల్సి ఉంది. గెయిల్ నుంచి నాగార్జునలోని రెండు ప్లాంట్లకు రోజుకు 3.15 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా కావాలి. వాస్తవంగా గెయిల్ నుంచి సరఫరా అవుతున్నది 2.4 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లే. నగరం పైపు లైన్ పేలుడు తరువాత ఆ సరఫరా కూడా నిలిచిపోయింది. 20 రోజులుగా నాగార్జునలో 14.50 లక్షల నుంచి 20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. ఇక్కడ ఉత్పత్తయ్యే యూరియా ఒడిషా, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు కేంద్రం నిర్ణయించే కోటా ప్రకారం రైల్వే ర్యాక్ల ద్వారా సరఫరా చేస్తుంటారు. సరఫరా నిలిచిపోవడంతో నాగార్జున రోజుకు సుమారు రెండు కోట్ల టర్నోవర్ను కోల్పోయింది. పునర్విభజనకు ముందున్న రాష్ట్రంలో ఖరీఫ్ అవసరాలకు 40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా. దీన్లో సుమారు 14.50 లక్షల మెట్రిక్ టన్నులు నాగార్జున కర్మాగారంలో ఉత్పత్తి అయితే 26 లక్షల టన్నులు ఒమన్, దుబాయ్, కువైట్ తదితర గల్ఫ్ దేశాల నుంచి కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం తదితర ఓడరేవుల ద్వారా దిగుమతి చేసుకోవలసి ఉంది. యూరియా ఉత్పత్తి కంపెనీల ప్రతినిధులు రెండు రోజుల కిందట కేంద్ర పెట్రోలియం మంత్రిని, గెయిల్ చైర్మన్ను కలిసి గ్యాస్ సరఫరాను వెంటనే పునరుద్ధరించకుంటే ఎరువులకు కొరత ఏర్పడి రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. కేంద్రం నిర్ణయించిన ప్రకారం రైతులకు టన్ను యూరియాను రూ. 5,500కు విక్రయిస్తుండగా.. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యూరియా టన్నుకు 350 డాలర్లు (సుమారు రూ. 20 వేలు) అవుతుంది. ఆ మేరకు దిగుమతి చేసుకుంటున్న యూరియా కేంద్ర సర్కారుకు భారమవుతోంది. మూతపడ్డ పవర్ ప్లాంట్లు: గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో విద్యుత్ సంక్షోభం కూడా రాష్ట్రాన్ని పీడిస్తోంది. కాకినాడ తీరంలోని ఉప్పాడ స్పెక్ట్రమ్, ల్యాంకో, విజ్జేశ్వరం, జెన్కో తదితర గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు రోజుకు సుమారు 20 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా నిలిచిపోయి విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. ఓఎన్జీసీ బావులతో పాటు రిలయన్స్, కెయిర్న్ ఎనర్జీ సంస్థల బావుల్లో మరో 10 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. ఈ బావుల నుంచి గెయిల్ విజయవాడ సమీపంలోని ల్యాంకో, విజ్జేశ్వరంలోని ఏపీ జెన్కో, ఉప్పాడ తీరంలోని స్ప్రెక్టమ్ తదితర విద్యుదుత్పత్తి ప్లాంట్లకు రోజూ సుమారు 30 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా చేసేది. ఇప్పుడు గ్యాస్ సరఫరా కాక 750 మెగావాట్ల విద్యుదుత్పత్తి ఆగిపోయింది. 20 రోజులుగా సుమారు 15 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. 100 నుంచి 150 మెగావాట్లు ఉత్పత్తి చేసే విజ్జేశ్వరం, స్పెక్ట్రమ్ ప్లాంట్లు, సుమారు 200 మెగావాట్లు ఉత్పత్తి చేసే వేమగిరి పవర్ ప్రాజెక్టు, 300 మెగావాట్లు ఉత్పత్తిచేసే ల్యాంకో పవర్ప్రాజెక్టు మూతపడ్డాయి. గెయిల్ పైపులైన్లను అధ్యయనం చేస్తున్న ఇంజనీర్స్ ఇండియా నివేదిక వచ్చేసరికి ఎంతలేదన్నా రెండు, మూడు నెలలు పడుతుందని ఓఎన్జీసీ వర్గాలు చెప్తున్నాయి. ఈ పరిస్థితుల్లో యూరియా, విద్యుత్ కొరతలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను చూడాల్సి ఉందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
కౌలు రైతుకు రుణార్హత హుళక్కేనా?
కార్డులున్నా ఫలితం లేదన్నా... ముందుకురాని బ్యాంకర్లు సహకరించని భూయజమానులు రానున్న ప్రభుత్వమైనా కరుణించేనా? ముదినేపల్లి రూరల్, న్యూస్లై న్ : కౌలు రైతుల సంక్షేమమే ధ్యేయమన్న ప్రభుత్వాల ఆర్భాటపు ప్రకటనలు ఆచరణలో అడ్రస్ లేకుండాపోతున్నాయి. వీరికి గుర్తింపు కార్డులతో వ్యవసాయాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా వికసింపజేస్తామన్న గత ప్రభుత్వ హామీలు నీటి మీద రాత లుగానే మిగిలాయి. త్వరలో అధికారం చేపట్టబోతున్న టీడీపీ ప్రభుత్వం కౌలు రైతుల తలరాతను ఏవిధంగా మారుస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. కౌలురైతులకు అటు ప్రభుత్వ పరంగా ఇటు భూయజమానుల పరంగా ఎలాంటి సహకామంద డంలేదు. దీంతో అనేక మంది సాగుకు దూరమవుతున్నారు. ఇలాంటి పరిస్థితిని అధిగమించేందుకు గత ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు, రుణార్హత కార్డులు మంజూరు చేసింది. ఈ కార్డులతో సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, బ్యాంకు రుణాలు పొం దవచ్చని ఆశపెట్టింది. ఆచరణలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. బ్యాంకర్ల విముఖత... ఎలాంటి హామీలేకుండా కౌలు రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు తీవ్ర విముఖత వ్యక్తం చేస్తున్నారు. లాభార్జనే ధ్యేయంగా పనిచేసే బ్యాంకులు హామీ లేకుండా అప్పు లిచ్చి చేతులుకాల్చుకోవు. ఇది తెలిసినప్పటికీ కౌలు రైతులను వంచించేందుకు రుణార్హత కార్డులను గతప్రభుత్వం జారీ చేసింది. ఈ కార్డులతో బ్యాంకులుచుట్టూ కాళ్లరిగేలా తిరిగినా అధికారుల ఈసడింపులే తప్ప వీసమెత్తు ప్రయోజనం కలగలేదు. బీమా ధీమా లేదు... బ్యాంకులు మంజూరుచేసే పంట రుణాలపై రైతుల నుంచి విధిగా బీమా ప్రీమియం వసూలుచేస్తాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతే బీమా కంపెనీ పరిహారం చెల్లిస్తుంది. దీని వల్ల బ్యాంకుల రుణాలు సులభంగా వసూలవుతాయి. కౌలురైతులకు మొక్కుబడిగా రుణాలిచ్చినా వీటికి బీమా ప్రీమియం వసూలు చేయడంలేదు. కౌలు రైతులు సాగు చేసే భూమినే యజమాని బ్యాంకులో తనఖా పెట్టి పంట రుణం పొందుతున్నాడు. ఈ సమయంలో బీమా ప్రీమియం చెల్లిస్తున్నాడు. ఈ కారణం వల్ల ఒకే భూమిపై రెండు సార్లు ప్రీమియం ఎలా వసూలు చేస్తామని బ్యాంకర్లు చెబుతున్నారు. అదే విధంగా వడ్డీ రాయితీలు సైతం కౌలు రైతులకు రావడం లేదు. కార్డులొద్దు బాబోయ్! కౌలు రైతులకు మూడేళ్ల నుంచి రుణార్హత కార్డులు మంజూరు చేస్తున్నారు. ఒకసారి కార్డు పొందిన రైతు రెండో ఏడాది కార్డు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. కార్డుల వల్ల ప్రయాస తప్ప ప్రయోజనం లేదనే అభిప్రాయానికి కౌలు రైతులు వచ్చినందున కార్డులు తీసుకునేందుకు ముందుకు రావడంలేదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. నూతన ప్రభుత్వం రుణార్హత కార్డులను మంజూరు చేసి చేతులు దులిపేసుకుంటుందా? లేక వినూత్న మార్పులేమైనా చేపడుతుందో వేచి చూడాల్సి ఉంది. కౌలు రైతులకు రక్షణ కల్పించాలనే చిత్తశుద్ధి ఉంటే అదను దాటకముందే సరైన చర్యలు తీసుకోవాలని కౌలు రైతులు కోరుతున్నారు. -
ఎరువుల శాఖలో లంచాల బాగోతం!!
యూపీఏ పాలన సమస్తం లంచాల బాగోతమేనన్న విషయం మరోసారి బయటపడింది. నార్వేకు చెందిన యారా ఇంటర్నేషనల్ అనే ఎరువుల తయారీ సంస్థ మన దేశానికి ఎరువులు సరఫరా చేసే కాంట్రాక్టు కోసం ఇక్కడి మంత్రిత్వశాఖ అధికారులకు లంచాలు ఇచ్చింది. ఈ కేసులో ఆ కంపెనీకి చెందిన ముగ్గురు మాజీ సీనియర్ మేనేజిమెంట్ అధికారులను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వశాఖలోని ఆర్థిక సలహాదారు కుటుంబానికి ఈ లంచం చెల్లించినట్లు ఓస్లో నుంచి వచ్చిన కథనాలను బట్టి తెలుస్తోంది. భారతదేశంతో పాటు లిబియా, రష్యాలలోని అధికారులకు కూడా లంచాలు ఇచ్చినందుకు గాను ఈ కంపెనీకి చెందిన అధికారులకు నార్వే ప్రభుత్వం దాదాపు 295 కోట్ల రూపాయల జరిమానా విధించింది. -
వ్యవ‘సాయం’ చేయండి
కలెక్టరేట్, న్యూస్లైన్ : సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులకు భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్రెడ్డి సూచించారు. వ్యవసాయంలో నూతన సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం ప్రగతిభవన్ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. సోయాబీన్ విత్తనాలు, రసాయనిక ఎరువుల సరఫరా గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లనుంచి జిల్లాలో సోయాబీన్ సాగు చేస్తున్నారన్నారు. గతేడాది జిల్లాలో మూడు లక్షల ఎకరాల్లో ఈ పంట పండించారని పేర్కొన్నారు. సుమారు రూ. 20 కోట్ల విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందించామన్నారు. ఇప్పటివరకు మధ్యప్రదేశ్ నుంచి విత్తనాలు దిగుమతి చేసుకునేవారమని, ఈసారి అక్కడ భారీ వర్షాలు కురియడంతో సోయాబీన్ పంటకు భారీ నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. దీంతో వచ్చే ఖరీఫ్లో విత్తనాలకు ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితులున్నాయన్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా సోయాబీన్ విత్తనాలను ఉత్పత్తి చేసి ఖరీఫ్లో కొరత లేకుండా చూడాలని ఏపీ సీడ్ మేనేజింగ్ డెరైక్టర్ సుధాకర్ను కోరారు. విత్తనాలను ఇక్కడే ఉత్పత్తి చేసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వ్యవసాయాధికారులు ప్రాంతాలవారీగా భూములను అధ్యయనం చేసి, ఎక్కడ ఏ పంట వేస్తే లాభదాయకమో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పంటలను నిల్వ చేసుకోవడానికి వీలుగా గిడ్డంగులను నిర్మిస్తున్నామన్నారు. రబీలో ఎరువుల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో పండ్ల తోటల పెంపకానికి అనువైన ప్రాంతాలను గుర్తించాలని కలెక్టర్ ప్రద్యుమ్న వ్యవసాయాధికారులకు సూచించారు. సమావేశంలో ఏపీ సీడ్స్ ఎండీ సుధాకర్, వ్యవసాయ శాస్త్రవేత్త కేశవ్, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు. -
‘యూరియా’ నిబంధనలపై వెనక్కి!
న్యూఢిల్లీ: యూరియా పెట్టుబడి విధానంలోని ‘తిరిగి కొనుగోలు హామీ నిబంధన’ను తొలగిం చేందుకు ఎరువుల మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఇప్పటికే కేంద్రానికి ఒక ప్రతిపాదనను కూడా పంపింది. దీని స్థానంలో కంపెనీలను షార్ట్లిస్ట్ చేసి, బిడ్డింగ్ తరహాలో కొత్త విధానాన్ని అమలుచేయాలని ప్రతిపాదించింది. దేశంలో యూరియా ఉత్పత్తిని పెంచడానికి, కంపెనీలను ప్రోతహించేందుకు వీలుగా 2012 జనవరిలో ఎరువుల మంత్రిత్వ శాఖ కొత్త పెట్టుబడి విధానాన్ని రూపొందించింది. దీన్ని అదే ఏడాది డిసెంబర్లో కేంద్రం ఆమోదించింది. ఈ విధానం ప్రకారం దేశంలో కంపెనీలు ఉత్పత్తి చేసే యూరియాను కేంద్రం తప్పనిసరిగా ఎనిమిదేళ్లపాటు కొనాలి. దీనికి అనుగుణంగా 13 ఎరువుల సంస్థలు ఉత్పత్తిని భారీగా పెంచేం దుకు, కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. ఈ దశలో ఎరువుల మంత్రిత్వ శాఖ ‘తిరిగి కొనుగోలు హామీ నిబంధన’ను తొలగించాలని ప్రతిపాదనలు పం పింది. అలాగే, దరఖాస్తు చేసుకున్న 13 కంపెనీల నుంచి 3 లేదా 4 కంపెనీలను షార్ట్లిస్ట్ చేసి బిడ్డింగ్కు ఆహ్వానించాలని సూచించింది.