german
-
చెన్నమనేని జర్మనీ పౌరుడే
సాక్షి, హైదరాబాద్: వేములవాడ మాజీ ఎమ్మెల్యే చె న్నమనేని రమేశ్ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చిచెప్పింది. భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ 2019లో జారీ చేసిన నోటిఫికేషన్ను సమర్థించింది. తప్పుడు పత్రాలతో గత 15 ఏళ్లుగా న్యాయస్థానాన్ని, అధికారులను తప్పుదోవ పట్టించారని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్మనీ పౌరుడినని తెలిసినా పలు పిటిషన్లు దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృథా చేశారని మండిపడింది.ఇందుకుగాను ఆయనకు హైకోర్టు చరిత్రలోనే తొలి సారిగా ఏకంగా రూ. 30 లక్షల భారీ జరిమానా విధించింది. ఇందులో ఆది శ్రీనివాస్ (ప్రస్తుత వేములవాడ ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో రమేశ్ ప్రత్యర్థి)కు రూ. 25 లక్షలు, హైకోర్టు లీగల్ సర్విసెస్ కమిటీకి రూ. 5 లక్షలు చెల్లించాలని రమేశ్ను ఆదేశించింది. చెల్లింపునకు నెల రోజులు గడువు విధించింది. 2009లో తొలిసారి వేములవాడ నుంచి ఎ మ్మెల్యేగా విజయం సాధించింది మొదలు చెన్నమ నేని భారతీయ పౌరుడా కాదా అనే వివాదం కొన సాగుతోంది.ఆయన రాజకీయ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ దీనిపై తొలి నుంచీ న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జర్మనీ పౌరసత్వం కారణంగా రమేశ్ భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ 2019 నవంబర్లో నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ అదే సంవత్సరం ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై ఐదేళ్లపాటు సాగిన విచారణ అనంతరం న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి అక్టోబర్లో తీర్పు రిజర్వు చేసి సోమవారం తీర్పు వెలువరించారు. ఆయన ఎన్నిక కూడా చెల్లదన్న ఆది శ్రీనివాస్ చెన్నమనేని ఇరుదేశాల పౌరసత్వాన్ని కలిగి ఉన్నారని అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్కుమార్ వాదించారు. ‘రెండుచోట్ల వివిధ కేటగిరీల కింద పౌరసత్వం కలిగి ఉండటాన్ని మన చట్టాలు అనుమతించవు. విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయుడు ఎన్నటికీ ఇక్కడ ఎమ్మెల్యే కాలేరు. తన పౌరసత్వ సమస్య 2009 నుంచి పెండింగ్లో ఉన్నా చెన్నమనేని రమేశ్ రెండు పౌరసత్వాలలో ఒకదాన్ని వదులుకోలేదు’అని వారు గుర్తుచేశారు.చెన్నమనేని రమేశ్ క్లెయిమ్ చేస్తున్న రెండు విభిన్న రకాల పౌరసత్వాలకు సంబంధించిన ఆధారాలు, పత్రాలను న్యాయమూర్తికి సమరి్పంచారు. రమేశ్ పౌరసత్వాన్ని కొనసాగించడం ‘ప్రజాప్రయోజనాలకు అనుకూలం కాదు’అని కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉదహరించారు. మరోవైపు ఆది శ్రీనివాస్ తరఫు న్యాయవాది రవికిరణ్రావు వాదిస్తూ ‘ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డుతో చెన్నమనేని రమేశ్ జర్మనీకి అనేకసార్లు వెళ్లారు. జర్మనీ పౌరసత్వంతోనే ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నిక కూడా చెల్లదు’అని పేర్కొన్నారు. ఆ అధికారం కేంద్రానికి లేదని వాదించిన రమేశ్ మరోవైపు చెన్నమనేని రమేశ్ తరఫున న్యాయవాది రామారావు వాదిస్తూ ‘చెన్నమనేని జర్మనీ పౌరసత్వాన్ని వదులుకున్నారు. జర్మనీ పాస్పోర్టుతో ప్రయాణించినంత మాత్రాన ఆ దేశ పౌరసత్వం ఉన్నట్లు కాదు. దేశ సార్వ¿ౌమత్వానికి విఘాతం కలిగించిన వారి పౌరసత్వాన్ని రద్దు చేసే అధికారం కేంద్రానికి ఉంది. కానీ రమేశ్ అలాంటి చర్యలకు పాల్పడలేదు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకోవాలి. చెన్నమనేని రమేశ్ పౌరసత్వ రద్దు నోటిఫికేషన్ను కొట్టేయాలి’అని కోరారు.అప్పీల్కు వెళ్లడాన్ని పరిశీలిస్తా: చెన్నమనేనిహైకోర్టు తీర్పు తీవ్ర నిరాశపరిచిందని చెన్నమనే ని రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సో మవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రా జకీయ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మిత్రులు, శ్రేయోభిలాషుల సహకారంతో ముందుకు నడిచానని.. నాలుగుసార్లు ఎన్నికల్లో గెలిచానని గుర్తుచేశారు. వరుస ఓటములను జీర్ణించుకోలేక రాజకీయ ప్రత్యర్థులు తన పౌరసత్వంపై కేసులు వేశారని చెన్నమనేని ఆరోపించారు. ఇలాంటి కేసులను గతంలోనే హైకోర్టు, సుప్రీంకోర్టులో విజయవంతంగా ఎదుర్కొన్నానని.. తాజా తీర్పుపై అప్పీల్ చేసే అంశాన్ని పరిశీలిస్తానన్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ వేములవాడ అభివృద్ధికి సహకరిస్తూనే ఉంటానని పేర్కొన్నారు -
నన్ను క్షమించండి ఏంజిలా మెర్కల్ : పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. జర్మనీ మాజీ ఛాన్సలర్ (ప్రధాని) ఏంజిలా మెర్కల్కు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. 17 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘటనను ఆయన తాజాగా గుర్తు చేసుకున్నారు. 17ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే?పుతిన్కు శునకాలంటే మహా ప్రాణం. అందుకే దేశాది నేతలతో జరిగే సమావేశాల్లో సైతం శునకాలు పుతిన్తో దర్శనమిస్తుంటాయి. అయితే, 17ఏళ్ల క్రితం అంటే 2007 సోచి నగరంలో పుతిన్- అప్పటి జర్మనీ ప్రధాని ఏంజిలా మెర్కల్ మధ్య ఓ సమావేశం జరిగింది. అయితే ఆ మీటింగ్కు పుతిన్తో పాటు ఆయన పెంపుడు శునకం లాబ్రడార్ కోని కూడా తీసుకువచ్చారు. సమావేశంలో జరుగుతున్నంత సేపు మెర్కల్తో పాటు పుతిన్ చుట్టూ తచ్చాడుతూ కనిపించింది. దీంతో స్వతహాగా శునకాలంటే భయపడే మెర్కల్ లాబ్రడార్ కోని చూసి ఆందోళనకు గురయ్యారు. నాటి ఘటనపై తాను రాసిన పుస్తకంలో మెర్కల్ ‘ఫ్రీడమ్’ అనే టైటిల్తో ప్రస్తావించారు. అందులో పుతిన్ తనని భయపెట్టాలని తన శునకాన్ని సమావేశానికి తెచ్చారని అర్ధం వచ్చేలా రాశారు. తాజాగా విడుదల మెర్కల్ పుస్కకంలో 2007 నాటి ఘటనపై వ్లాదిమిర్ పుతిన్ బహిరంగంగానే స్పందించారు. మెర్కల్కు మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. -
PM Narendra Modi: పెట్టుబడులకు గమ్యస్థానం భారత్
న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులకు భారత్ ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తమ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావాలని విదేశీ వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు. భారత అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములుగా మారడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘మేక్ ఫర్ ద వరల్డ్’ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని ఆహా్వనించారు. నేడు ప్రపంచ వ్యాపార, వాణిజ్య, తయారీ కేంద్రంగా భారత్ అభివృద్ధి చెందిందని వెల్లడించారు. పెట్టుబడులకు భారత్ కంటే మెరుగైన దేశం మరొకటి లేదని స్పష్టంచేశారు. శుక్రవారం ఢిల్లీలో ‘18వ ఆసియా–పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్–2024’ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సదస్సు జరగడం 12 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. జర్మనీ చాన్స్లర్ ఓలాఫ్ స్కోల్జ్తోపాటు భారత్, జర్మనీ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్లో అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇదే సరైన సమయమని విదేశీ పెట్టుబడిదారులకు ప్రధాని సూచించారు. నైపుణ్యం కలిగిన భారతీయ కారి్మకులపై జర్మనీ ఎంతగానో ఆసక్తి చూపుతోందని, వారికి ప్రతిఏటా ఇచ్చే వీసాల సంఖ్యను 20 వేల నుంచి 90 వేలకు పెంచాలని నిర్ణయించిందని తెలిపారు. దీనివల్ల జర్మనీ ఆర్థిక వ్యవస్థకు లబ్ధి చేకూరుతుందని ఉద్ఘాటించారు. సదస్సులో ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే... ‘ఫోకస్ ఆన్ ఇండియా’ హర్షణీయం ‘‘ప్రజాస్వామ్యం, జనాభా, డిమాండ్, డేటా అనే నాలుగు బలమైన మూలస్తంభాలపై భారత్ నేడు సగర్వంగా నిల్చుంది. రహదారులు, రైల్వేలు, ఎయిర్పోర్టులు, ఓడరేవుల అభివృద్ధికి రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నాం. 2047 నాటికి ఇండియాను పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి రోడ్మ్యాప్ సిద్ధం చేశాం. ఇది చాలా కీలక సమయం. అందుకే ఇండియాతో సంబంధాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా జర్మనీ కేబినెట్ ‘ఫోకస్ ఆన్ ఇండియా’ అనే డాక్యుమెంట్ విడుదల చేసింది. ఇది నిజంగా హర్షణీయం. జర్మనీ సంస్థలకు ఇండియాలో ఎన్నో వ్యాపార అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడిదారులకు, వ్యాపారవేత్తలకు భారత్ కంటే మెరుగైన దేశం ఇంకెక్కడైనా ఉందా? లేదని కచి్చతంగా చెప్పగలను. భారతదేశ ప్రగతికి టాలెంట్, టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేవి నాలుగు అంశాలు. వీటిని ముందుకు నడిపించడానికి మా వద్ద ‘ఆకాంక్షలతో కూడిన భారత్’ అనే ఇంధనం ఉంది. నైపుణ్యాభివృద్ధి, సాంకేతికత ప్రజాస్వామీకరణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. కృత్రిమ మేధ(ఏఐ), సెమీకండక్టర్, గ్రీన్ హైడ్రోజన్, అంతరిక్ష సాంకేతికత అనేవి మాకు చాలా ముఖ్యమైన కార్యక్రమాలు. ఆయా రంగాల్లో పెట్టుబడులకు, ఒప్పందాలకు అద్భుతమైన అవకాశాలున్నాయి. వాటిని విదేశీ వ్యాపారవేత్తలు.. ముఖ్యంగా జర్మనీ వ్యాపారవేత్తలు ఉపయోగించుకోవాలి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. శాంతి స్థాపనకు సహకరిస్తాం ఉక్రెయిన్, పశి్చమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆయా ప్రాంతాల్లో శాంతి స్థాపన కోసం అన్ని రకాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. ఏడో ఇంటర్–గవర్నమెంటల్ కన్సల్టేషన్స్(ఐజీసీ)లో భాగంగా మోదీ శుక్రవారం ఢిల్లీలో జర్మనీ చాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్తో సమావేశమయ్యారు. భారత్–జర్మనీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలతోపాటు అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. ఉక్రెయిన్లో యుద్ధానికి ముగింపు పలికేలా రాజకీయ పరిష్కారం కోసం భారత్ కృషి చేయాలని స్కోల్జ్ కోరారు. మోదీ బదులిస్తూ.. యుద్ధాలతో సమస్యలకు పరిష్కారం లభించదని, చర్చలు, దౌత్యమార్గాల్లో ప్రయతి్నంచాలన్నదే భారత్ విధానమని తేలి్చచెప్పారు. -
భారత్లో సాగు ఆధునీకరణ చర్యలు భేష్
పానిపట్: భారత్లో సాగు రంగాన్ని ఆధునీకరించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జర్మన్ కెమికల్స్ దిగ్గజం బేయర్ దక్షిణాసియా ప్రెసిడెంట్ సైమన్ వీబుష్ ప్రశంసించారు. వెనుకబడిన వ్యవసాయ రంగంతో భారత్ నిర్దేశించుకున్నట్లుగా 2047 నాటికి అగ్రరాజ్యంగా అవతరించడం సాధ్యపడదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేపడుతున్న పలు చర్యలు వ్యవసాయాన్ని ఆధునీకరించడమే లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోందని సైమన్ చెప్పారు. భారత్ వినూత్న ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తూ, రెగ్యులేటరీ ప్రక్రియలను మరింతగా డిజిటలీకరిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యవసాయంలో కూలీల కొరత నెలకొన్న నేపథ్యంలో తాము కలుపు మందులపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. క్రిమిసంహారకాల కన్నా అధికంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వివరించారు. వరి, గోధుమలు, చెరకు వంటి కీలక పంటల కోసం కలుపు మందులను అభివృద్ధి చేస్తున్నామని సైమన్ చెప్పారు. అంతర్జాతీయంగా తాము నిర్వహిస్తున్న ’ఫార్వర్డ్ఫామ్స్’ కార్యక్రమం ద్వారా భారత్లో కూడా వ్యవసాయ ఉత్పాదకతను, ఆగ్రో–కెమికల్స్ను మెరుగుపర్చే కొత్త ఆవిష్కరణలను పరిశీలిస్తున్నామని తెలిపారు. -
అత్యంత వృద్ధ స్లోత్ మృతి
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ స్లాత్ పశ్చిమ జర్మనీలోని క్రెఫెల్డ్ జూపార్కులో కన్నుమూసింది. 54 ఏళ్ల ఈ స్లోత్ను జాన్ అని పిలిచేవారు. అది గత వారం కన్నుమూసినట్లు జూ తెలిపింది. 1969లో పుట్టిన జాన్ తొలుత హాంబర్గ్ జూలో నివసించింది. తర్వాత క్రెఫెల్డ్ జూకు మారి 38 ఏళ్లుగా అక్కడే గడిపింది. మానవ సంరక్షణలో ఉన్న అత్యంత వృద్ధ స్లోత్గా 2021లో గిన్నిస్ రికార్డులకెక్కింది. ఈ మగ స్లోత్కు 22 మంది సంతానం. ఏటా ఏప్రిల్ 30న దాని పుట్టిన రోజు సంబరాలు అట్టహాసంగా జరిగేవి. స్లోత్ల జీవితకాలం 30 నుంచి 40 ఏళ్లు. బద్ధకానికి మారుపేరు! స్లోత్ను అత్యంత బద్ధకస్తురాలైన జీవిగా చెబుతారు. ఇది క్షీరదం. వీటిలో ఆరు రకాలుంటాయి. అన్నీ చెట్ల కొమ్మల మీదే నివసిస్తాయి. మరో చెట్టుపైకి వెళ్లడానికి మాత్రమే కిందకు దిగుతాయి. నేలపై నిమిషానికి కేవలం ఐదడుగుల వేగంతో, చెట్లపైనైతే 15 అడుగుల వేగంతో కదులుతాయి. చూట్టానికి ఎలుగుబంటికి దగ్గరగా, అందంగా ఉంటాయి. ఆకులు, పళ్లు తింటాయి. చెట్ల రసాలు తాగుతాయి. అన్నట్టూ, వీటి జీర్ణ వ్యవస్థ కూడా అత్యంత నెమ్మదిగా పని చేస్తుందట! -
జర్మనీ పర్యాటకుణ్ణి దోచుకున్న పాక్ పోలీసులు
పాకిస్తాన్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అక్కడ సాధారణ పౌరులకు కూడా భద్రత లేదనే మాట వినిపిస్తుంటుంది. ఇక విదేశీ పర్యాటకుల సంగతి చెప్పనవసరం లేదు. పాకిస్తాన్లో జరిగిన ఓ లూటీ సంచలనంగా మారింది.జర్మనీకి చెందిన పర్యాటకుడు బెర్గ్ ఫ్లోరిన్ పాకిస్తాన్ను సందర్శించేందుకు వచ్చాడు. అయితే అతని దగ్గరున్న విలువైన వస్తువులను ఎవరో దోచుకెళ్లడంలో లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసును టేకప్ చేసిన పోలీసులకు ఒక విషయం తెలిసే సరికి వారు తెగ ఆశ్చర్యపోయారు. ఈ కేసులో లాహోర్ పోలీసులు అరెస్టు చేసిన ఏడుగురిలో.. నలుగురు పోలీసులు ఉన్నారని తెలియడంతో వారు కంగుతిన్నారు.వివరాల్లోకి వెళితే జర్మనీకి చెందిన 27 ఏళ్ల బెర్గ్ ఫ్లోరిన్ వారం రోజులుగా లాహోర్ విమానాశ్రయానికి సమీపంలో క్యాంప్ వేసుకుని ఉంటున్నాడు. కొంతమంది దుండగులు ఆయుధాలతో బెదిరించి, ఫ్లోరిన్ దగ్గర నుంచి ఖరీదైన మొబైల్ పోన్తో పాటు కెమెరాను దోచుకెళ్లారు. దీనిపై లాహోర్ పోలీసులకు ఫ్లోరిన్ ఫిర్యాదు చేశాడు. తాను సైకిల్పై పాకిస్తాన్లో పర్యటిస్తున్నట్లు ఫ్లోరిన్ పోలీసులకు తెలిపాడు. ఆగస్టు 3వ తేదీన రాత్రి రోడ్డు పక్కనే టెంట్ వేసుకున్నానని, ఈ సమయంలో కొందరు ఆయుధాలతో తన దగ్గరకు వచ్చి తన విలువైన్ ఫోను, కెమెరాను లాక్కెళ్లి పోయారని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఆ విదేశీ పౌరుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఆ జర్మన్ పౌరుడిని దోచుకున్న నిందితులను అరెస్టు చేసినట్లు లాహోర్ పోలీస్ చీఫ్ బిలాల్ సిద్ధిఖీ కమ్యానా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దోపిడికీ పాల్పడినవారితో జతకట్టిన నలుగురు పోలీసులను కూడా అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. అయితే వారికి మిగిలిన దోపిడీ దొంగలతో సంబంధం ఉందా లేదా అనే విషయమై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
మరణాంతరం భద్రపర్చడానికి ఏకంగా రూ. 1.8 కోట్లు..!
అమరత్వం కోసం పరిశోధకులు పలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవలో ఒక సిలికాన్ వ్యాలీ కంపెనీ సీఈవో 46 ఏళ్ల బ్రయాన్ జాన్సన్ తన జీవ సంబంధ వయసును ఐదేళ్లకు పైగా తగ్గించుకున్నాడు, వృద్ధాప్య లక్షణాలను తిప్పి కొట్టాడు. అందుకోసం నిత్య వైద్యలు పర్యవేక్షణలో ఉంటూ ఎన్నెన్ని ఇంజెక్షన్లు, ఎలాంటి ఫుడ్ తీసుకునేవాడో విన్నాం. ఇప్పుడూ ఏకంగా ఓ జర్మన్ స్టార్ట్ప్ కంపెనీ ఓ అడుగు ముందుకేసి మరణాంతరం బాడీని స్థభింపచేసి ఎక్కువ కాలం బతికేలా చేస్తానంటోంది. చెప్పాలంటే ఎక్కువకాలం జీవించాలనుకుంటున్న వారు తమ కంపెనీని ఆశ్రయించమని చెబుతోంది కూడా. ఇంతకీ అసలు అదెలా సాధ్యమో సవివరంగా చూద్దామా..!జర్మన్ స్టార్టప్ కంపెనీ టుమారో బయో అనే కంపెనీ ఈ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. మరణాన్ని రివర్స్ చేయాలనే లక్ష్యంతో ఈ సరికొత్త ఆలోచనకు తెరతీసింది. మరణాంతరం శరీరం పాడవకుండా సజీవంగా ఉండేలా స్థభింపచేస్తుంది. భవిష్యత్తులో ఏ వ్యాధి కారణంతో చనిపోయారో, దానికి చికిత్స పొంది మరీ ఆ బాడీని పునరుద్ధరించవచ్చిని టుమారో బయో కంపెనీ చెబుతోంది. సదరు కంపెనీ క్రియోప్రెజర్వేషన్ ద్వారా 198 మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద శరీరాన్ని బయోస్టాసిస్లో ఉంచుతుంది. ఈ స్థితిలో జీవప్రక్రియలన్నీ నిరవధికంగా నిలిచిపోయి శరీరం చెక్కు చెదరకుండా ఉంటుంది. భవిష్యత్తులో వినియోగించేలా ఉంటుంది. అంతేగాదు ప్రజలు తాము ఎంతకాలం జీవించాలనుకుంటున్నారో, ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో వివరాలు తెలియజేసి వారి ఆర్థిక వనరుల దృష్ట్యా ఆ ప్యాకేజీని ఎన్నుకోవాలని పేర్కొంది టుమారో బయో కంపెనీ. ఇప్పటికే ఆరుగురు వ్యక్తులు, ఐదు పెంపుడు జంతువులను క్రియోప్రెజర్వేషన్ కింద ఉంచామని కంపెనీ తెలిపింది. అలాగే సర్వీస్ చెల్లించిన సుమారు 650 మంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నట్లు వెల్లడించింది. ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే తమ పని మొదలుపెడతామని చెప్పుకొచ్చింది. అందుకోసం యూరోపియన్ నగరాల్లో ప్రత్యేక అంబులెన్స్ మృతదేహాలను స్విట్జర్లాండ్ తీసుకువెళ్లేలా బెర్లైన్, ఆమ్స్టర్డామ్, జ్యూరిచ్లలో ఉద్యోగులను కూడా నియమించింది. అలాగే ఇక్కడ బాడీని మైనస్ 198 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఉంచేలా ద్రవ నైట్రోజన్తో నింపిన ప్రత్యేక స్టీల్ కంటైనర్లో ఉంచుతారు. కాగా, మరణాంతరం ఇలా భద్రపర్చడానికి సదరు కంపెనీ ఏకంగా రూ. 1.8 కోట్లు వసూలు చేస్తోంది. కేవలం మెదడుని స్థభింపచేయాలనకుంటే దగ్గర దగ్గర రూ. 67.2 లక్షలు డిమాండ్ చేస్తోంది. అయితే కంపెనీ చనిపోయిన వ్యక్తి తిరిగి ఎలా పునరుద్ధరిస్తారు(బతికిస్తారు) అనేది క్లియర్గా వివరించలేదు. క్రయోప్రెజర్వేషన్ అంటే..ఇది జీవ పదార్ధం - కణాలు, కణజాలాలు లేదా అవయవాలని ఎక్కువ కాలం పాటు భద్రపరచడానికి స్తంభింపజేసే ప్రక్రియ. అయినప్పటికీ, క్రియోప్రెజర్వేషన్లో గడ్డకట్టడం భిన్నంగా ఉంటుంది. ఇది శరీరంపై మంచు స్ఫటికాలను నిరోధించడానికి ప్రత్యేక క్రయోప్రొటెక్టెంట్ సొల్యూషన్స్ (లిక్విడ్ నైట్రోజన్) కలిగి ఉంటుంది.(చదవండి: 'రియల్ ఐరన్ మ్యాన్': కృత్రిమ గుండెను పొందిన తొలి వ్యక్తి!) -
పుంగనూరులో పరిశ్రమల కారిడార్ కనుమరుగు?
‘కరువుకు మారుపేరైన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాలను సస్యశ్యామలం చేయాలి. డొక్కలు మాడ్చుకుని ఊరుగాని ఊరు వెళుతున్న నిరుపేదల వలసలను నివారించాలి. స్థానికంగానే ఉపాధి కల్పించి చేయూతనందించాలి..’ అనే సదుద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పుంగనూరు వేదికగా పరిశ్రమల కారిడార్ తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తికి చెందిన ఫెరా ఆలాయ్, గ్రానైట్, ఫీడ్ పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు అందించింది. అలాగే ప్రతిష్టాత్మకమైన జర్మన్ పెప్పర్ ఎలక్ట్రికల్ మోషన్ బస్సులు, ట్రక్కుల పరిశ్రమను నెలకొల్పేందుకు శ్రీకారం చుట్టింది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వ వ్యవహారశైలితో ఆయా కంపెనీల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. టీడీపీ నేతల దమనకాండతో ఆయా పరిశ్రమల స్థాపన సందిగ్ధంలో పడింది. వేలాది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత భవితకు ఆశనిపాతమైంది.పుంగనూరు: స్థానికంగా పదివేల మంది నిరుద్యోగులకు ప్రత్యక్ష ఉపాధి, మరో 20 వేల మందికి పరోక్ష ఉపాధి కల్పించే జర్మన్ పెప్పర్ ఎలక్ట్రికల్ మోషన్ బస్సులు, ట్రక్కుల పరిశ్రమ పుంగనూరు ప్రాంతం నుంచి తరలిపోనుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చిత్తూరు జిల్లా, పడమటి ప్రాంతంలో నిరుద్యోగం, వలసల నివారణకు పుంగనూరు సమీపంలోని ఆరడిగుంటలో రూ.4.640 కోట్లతో 800 ఎకరాలలో బస్సుల పరిశ్రమ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ మేరకు గత ఏడాది అనుమతులు కూడా మంజూరు చేసింది. అప్పటి మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి, కంపెనీ సీఈఓ ఆండ్రియస్ హేగర్తో గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన పనులు ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు భూసేకరణ కూడా పూర్తిచేశారు. ఈ పరిశ్రమ పశ్చిమ ప్రాంతంలో మొట్టమొదట అతి పెద్ద భారీ పరిశ్రమగా నిలవనుందని స్థానికులు కలలుగన్నారు. ఈ ప్రాంత వాసులు తమ బతుకులు మారుతాయని, బిడ్డల భవిష్యత్ బాగుంటుందని సంబరపడ్డారు. అయితే ఈ సంతోషం కొన్నాళ్లు కూడా నిలవలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పరిశ్రమ ఏర్పాటు ఆశలపై నీరుచల్లినట్టయ్యింది. ప్రశాంతతకు మారుపేరైన పుంగనూరులో టీడీపీ శ్రేణులు సృష్టిస్తున్న అలజడులు, అల్లర్లు శాంతి భద్రతల సమస్యకు దారితీస్తున్నాయి. ఇలాంటి అస్తవ్యస్త పరిస్థితుల్లో భారీ పరిశ్రమ నెలకొల్పేందుకు యాజమాన్యం పునరాలోచనలో పడింది.నాటి నుంచి అడ్డంకులేపుంగనూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి కక్షగట్టారు. ఈ విభేదాలతోనే ఇన్నేళ్లుగా వారు అధికారంలో ఉన్నప్పుడు పుంగనూరు అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్నారు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఐదేళ్లుగా పుంగనూరులో ఊహించని అభివృద్ధి జరిగింది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడంతో ఈ ప్రాంతంలో అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిపోయింది.గతంలో ఎప్పుడూ అల్లర్లు లేవునియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2004లో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టారు. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండు సార్లు మంత్రిగా పనిచేశారు. నాటి నుంచి పుంగనూరులో అల్లర్లు జరగలేదు. శాంతి భద్రతలకు విఘాతం కలగలేదు. ఇలాంటి ప్రశాంతత కలిగిన పుంగనూరులో ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేసే ఆగడాలకు జనం బెంబేలెత్తిపోతున్నారు.కంపెనీలు వెనక్కే!పుంగనూరు మండలంలో సుమారు 20 వేల ఎకరాలలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పరిశ్రమల కారిడార్ను ఏర్పాటు చేసింది. ఇక్కడ శ్రీకాళహస్తికి చెందిన ఫెరా ఆలాయ్ పరిశ్రమ పనులు జరుగుతున్నాయి. అలాగే జర్మన్ కంపెనీ పనులు చేపట్టింది. గ్రానైట్ పరిశ్రమ, ఫీడ్ పరిశ్రమతో పాటు మరిన్ని కంపెనీలు ఏర్పాటుకు ముందుకొచ్చాయి. ఒక్కసారిగా అధికార పార్టీ చేష్టలకు పరిశ్రమల యాజమాన్యాలు హడలిపోతున్నాయి. ప్రశాంతత లేని ప్రాంతాలలో పరిశ్రమల ఏర్పాటు కష్టతరమేనని భావించి మరొక ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.ఆగడాలే కారణంకర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు సరిహద్దు ప్రాంతంగా ఉన్న పుంగనూరులో పుష్కలమైన వనరులు లభిస్తాయని జర్మన్ కంపెనీ భావించింది. అందులో భాగంగానే ఇక్కడ బస్సుల కంపెనీని ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ఏర్పాట్లు చేపట్టారు. ఇలాంటి తరుణంలో టీడీపీ అఽధికారం చేపట్టింది. పరిశ్రమ స్థాపనపై నీలినీడలు కమ్ముకున్నాయి. కూటమి ప్రభుత్వం అండతో ఆ పార్టీ శ్రేణులు అల్లర్లు సృష్టిస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నడూ లేనివిధంగా స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి నియోజకవర్గంలో తిరగరాదంటూ కూటమి శ్రేణులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా పుంగనూరు ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. టీడీపీ నేతల ఆగడాలకు ప్రశాంత వాతావరణం దెబ్బతింటోంది. స్థానిక వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు, ఆస్తుల ధ్వంసం లాంటి ఘటనలతో బస్సుల కంపెనీ ఏర్పాటుకు యాజమాన్యం వెనకడుగు వేస్తోంది. -
ప్రపంచం వాడుతున్న జర్మన్ ఆవిష్కరణలు
మార్పు నిత్యం. అదే సత్యం. శాస్త్ర, సాంకేతిక రంగంలో ఇది కొట్టొచ్చినట్టూ కనిపిస్తుంది. జర్మనీలోని రాజకీయ సామాజిక పరిస్థితులు విషయం కాసేపు పక్కనపెడితే.. చరిత్రలో కొత్త ఆవిష్కరణలు చేయడంలో మాత్రం ఆ దేశం చొరవ చూపినట్లు తెలుస్తుంది. మొబైల్లో వాడే సిమ్కార్డు, మోటార్సైకిల్, న్యూస్పేపర్, ఎయిర్బ్యాగ్, టెలిస్కోప్..వంటి దాదాపు ప్రపంచం ఉపయోగించే ప్రధానం ఆవిష్కరణలు జర్మనీ దేశానికి చెందిన పరిశోధకులు కనిపెట్టినవని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అందులో కొన్ని ఆవిష్కరణలు కింది తెలుపబడ్డాయి. కెప్లర్ గ్రహాల చలన నియమాలు ఆధునిక బైనరీ సంఖ్యా వ్యవస్థ ఫారెన్హీట్ స్కేల్ ఇంటర్నల్ కంబర్షన్ ఇంజిన్ కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ +, - గుర్తులు ప్రింటెడ్ సర్య్కూట్ బోర్డ్ అల్జీమర్స్ వ్యాధి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ డీజిల్ లోకోమోటివ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ క్రోమాటోగ్రఫీ ఎనిగ్మా యంత్రం ఎలక్ట్రిక్ ఎలివేటర్ కాంక్రీటు పంపు "√" చిహ్నం ప్రిగ్నెన్సీ టెస్ట్ వాక్యూమ్ పంపు గైరో కంపాస్ స్పీడో మీటర్ స్ట్రాటో ఆవరణం కిండర్ గార్టెన్ గమ్మీ బేర్ బాక్టీరియాలజీ టాకోమీటర్ హిమోగ్లోబిన్ పాస్ఫరస్(భాస్వరం) కణ విభజన మైక్రోఫోన్ వార్తాపత్రిక హాంబర్గర్ ఆటోమొబైల్ మోటార్ సైకిల్ ఓమ్స్ నియమం అతినీలలోహిత కిరణాలు జిర్కోనియం టెలిస్కోప్ ఎగ్ స్లైసర్ వాల్ ప్లగ్ సిమ్ కార్డు నెప్ట్యూన్ యురేనియం ఇయర్ప్లగ్ ఆక్సిజన్ యురేనస్ ఆస్పిరిన్ హెరాయిన్ ఎయిర్ బ్యాగ్ జీన్స్ ఎంపీ3 ప్లేయర్ ఇదీ చదవండి: ‘ఇష్టంలేని పని ఇంకెన్నాళ్లు.. వెంటనే రాజీనామా చేయండి’ -
భారతీయ సంగీతంతో అలరిస్తున్న జర్మన్ సింగర్!
జర్మనీ సింగర్ నోట ముగ్ధమనోహరంగా భారతీయ సంగీతం.అదీకూడా అన్ని భాషల్లో అవోకగా పాడేస్తోందామె. ఆ గాత్రానికి ఎవవ్వరైన మైమరచిపోవాల్సిందే. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీనే ఆమె గాత్రానికి ఫిదా అయ్యారు. మనక్ బాత్లో ఆమె గురించి ప్రస్తావించారు మోదీ. అంతేగాదు మోదీ ఆమెను కలవడమే కాకుండా ఆమె నోట పాటను స్వయంగా విన్నారు. ఇంతకీ ఎవరా జర్మన్ సింగర్? ఏ భాష అయిన అందర్నీ కట్టిపడేసేది సంగీతమే. జర్మన్ సింగర్ కసాండ్ర మే స్పిట్మన్ను ప్రధాని నరేంద్ర మోదీనే స్వయంగా కలిసి ఆమె ప్రతిభను ప్రశంసించారు. భక్తిగీతాలను ఇష్టపడే మోదీ ఎదుటై ప్రసిద్ధ భారతీయ భజన్ గీతమమైన "అచ్చుతం కేశం.. అనే పాట అద్భుతంగా ఆలపించింది. ఇది ఆయన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్ తెగ హల్చల్ చేస్తోంది. మోదీ తన మన్కీ బాత్లో కూడా ఆ జర్మన్ సింగర్ గురించి ప్రస్తావిస్తూ ఇలా అన్నారు. "ఎంత మధురమైన స్వరం. ప్రతి పదంలో ఎంత చక్కగా భావోద్వేగాలను పలికిస్తోంది. దేవుని పట్ల ఆమెకున్న ప్రేమ అందర్నీ అనుభూతి చెందేలా చేస్తుంది. ఆ మధురమైన స్వరం ఒక జర్మన్ది అంటే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆమె పేరు కాసాండ్ర మే స్పిట్మాన్ అంటూ ఆమె గురించి పరిచయం చేశారు. పుట్టుకతో అంధురాలైన అది ఆమె సంగీత ప్రతిభను అడ్డుకోలేదు. ఈ సంగీతంమనందరినీ కలిపే విశ్వభాష. అందమైన రిథమ్లు, బీట్లు ఏ హృదయాన్నేనా గెలుచుకోగలవు. అందుకు ఉదాహరణ అంధురాలైన ఈ కాసాండ్రే అని మన్ కీ బాత్లోఆమె గురించి గొప్పగా మాట్లాడారు మోదీ." ఇక ఈ 22 ఏళ్ల కాసాండ్రాకి భారతదేశాన్ని సందర్శించాలనేది అమె సుదీర్ఘ కల. ఈ నేపథ్యంలోనే భారత్లోని తమిళం, హిందీ, సంస్కృతం అస్సామీ, మలయాళం, బెంగాలీ, వంటి అనేక భాషల్లో పాడగలిగేలా ప్రావీణ్యం సంపాదించిది. అందేగాక తన సోషల్ మీడియా ఖాతాలో తాను పాడిన పాటలను పోస్ట్ చేస్తుండేది. ఓ జర్మన్ ఇలా అలవోకగా భారతీయ భాషల్లో పాటలను పాడేయటం అందర్నీ ఆశ్చర్యపరించింది. ఆ నైపుణ్యమే ఆమెను అందరికీ చేరువయ్యేలా చేసింది. అలాగే ఆమె ఇన్స్ట్రాగ్రామ్ బయోలో "జర్మన్ సింగర్-సాంగ్ రైటర్ ఇన్ లవ్ విత్ ఇండియా" అని అభివర్ణించి ఉంటుంది. దీంతో ఆమెకు 5 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమెలో దాగున్న ఈ టాలెంటే మోదీ నెలవారి రేడియో షో మన కీ బాత్ 105 ఎపిసోడ్లో ప్రస్తావించేందుకు దారితీసింది. Cassandra Mae Spittmann's melodious voice is widely known. At Palladam, I met her and her mother. We had a wonderful discussion about Cassmae's love for Indian culture, music and food. The highlight was her singing Sivamayamaga in Tamil and Achyutam Keshavam! pic.twitter.com/fLVoyMUHiW — Narendra Modi (@narendramodi) February 27, 2024 (చదవండి: అనంత్ అంబానీ బరువుకి కారణం ఇదే! ఆ విషయంలో కాబోయే భార్య..) -
FlixBus: భారత్లోకి జర్మనీ బస్సులు.. ఎక్కడికైనా రూ.99 టికెట్!
జర్మనీ రవాణా సంస్థ ఫ్లిక్స్బస్ (FlixBus)భారత్లోకి అడుగు పెడుతున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద అతిపెద్ద బస్ మార్కెట్ అయిన భారత్లో ప్రయాణికులకు తక్కువ ధరకే మెరుగైన ఇంటర్సిటీ ప్రయాణ అనుభవాన్ని అందించనున్నట్లు వెల్లడించింది. దేశంలో మొదటగా న్యూఢిల్లీ, హిమాచల్, జమ్ము కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, యూపీ అంతటా ఉన్న ప్రధాన నగరాలు, మార్గాలను కలుపుతూ ఫ్లిక్స్బస్ సర్వీసులు నడపనుంది. ఈ బస్సులు ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభం కానున్నాయి. టికెట్ రూ.99 లాంచింగ్ ఆఫర్ కింద ప్రారంభ రూట్లలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రూ. 99 లకే టికెట్లు అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. నార్త్ ఇండియాలోని ఢిల్లీ నుంచి అయోధ్య, చండీఘర్, జైపూర్, మనాలి, హరిద్వార్, రిషికేశ్, అజ్మీర్, కత్రా, డెహ్రాడూన్, గోరఖ్పూర్, వారణాసి, జోధ్పూర్, ధర్మశాల, లక్నో, అమృత్సర్ వంటి అన్ని ప్రముఖ ప్రాంతాలకూ ఈ బస్సులు నడుస్తాయి. ఫ్లిక్స్బస్ సమగ్ర నెట్వర్క్లో 59 స్టాప్లు, మొత్తం 200 కనెక్షన్లు ఉంటాయి. అన్నీ ప్రీమియం బస్సులు జర్మనీకి చెందిన ఫ్లిక్స్బస్ సర్వీస్ ప్రత్యేకంగా BS6 ఇంజిన్లతో కూడిన ప్రీమియం బస్ మోడల్లను నిర్వహిస్తుంది, కఠినమైన ఉద్గార నిబంధనలకు కట్టుబడి పర్యావరణ సుస్థిరతను పెంపొందిస్తుంది. "ఫ్లిక్స్బస్ను ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద బస్ మార్కెట్లలో ఒకటైన భారత్కి విస్తరించడం సంతోషిస్తున్నాం. ఇది మాకు 43వ దేశం. అందరికీ సుస్థిరమైన, సురక్షితమైన, సరసమైన ప్రయాణ ఎంపికలు అందిస్తాం" అని ఫ్లిక్స్బస్ సీఈవో ఆండ్రీ స్క్వామ్లీన్ అన్నారు. -
హమాస్ ఉగ్రవాదుల ఆకృత్యాలు.. మహిళను నగ్నంగా ఊరేగించి..
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్ వీధుల్లో హమాస్ మిలిటెంట్లు ఓ మహిళా మృతదేహాన్ని నగ్నంగా ఊరేగిస్తున్న ఆందోళనకరమైన దృశ్యాలు బయటకొచ్చాయి. అయితే.. ఈ వీడియోలో కనిపిస్తున్నది జర్మనీ పౌరురాలైన తన సోదరి అని ఓ మహిళ ధృవీకరించింది. సోషల్ మీడియాలో కనిపించిన వీడియోల దృశ్యాల ప్రకారం కొంతమంది హమాస్ మిలిటెంట్లు ఓ మహిళా మృతదేహాన్ని నగ్నంగా ఊరేగించారు. ఆ వాహనాన్ని చుట్టుముట్టి కేకలు వేస్తూ రాక్షసానందాన్ని పొందుతున్న దృశ్యాలు బయటకొచ్చాయి. మొదట ఆ మహిళా మృతదేహం ఒక మహిళా ఇజ్రాయెల్ సైనికురాలికి చెందినదని హమాస్ పేర్కొంది. అయితే, వీడియోలో కనిపించిన మహిళ తన సోదరి, జర్మన్ పౌరురాలు అని ట్విట్టర్ వేదికగా ఓ మహిళ నివేదించినట్లు న్యూయార్క్ పోస్టు తెలిపింది. The mother of Shani Louk, the woman whose body was seen on video in the back of a pick-up truck driven by Palestinian terrorists to Gaza, released a statement earlier today. She confirmed she had seen her daughter on the video & asked the public for help with more information pic.twitter.com/LDcPsjGHP8 — Visegrád 24 (@visegrad24) October 8, 2023 ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య తీవ్ర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు శనివారం గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్పైకి వేలాది రాకెట్లు ప్రయోగించారు. ఆ వెంటనే గాజా గుండా భూ, వాయు, సముద్ర మార్గాల్లో పెద్ద సంఖ్యలో చొరబడ్డారు. పండుగ వేళ ఆదమరచిన ఇజ్రాయెలీలపైకి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ కాల్పులకు, విధ్వంసానికి దిగారు. ఇదీ చదవండి: Israel-Palestine War: ఇజ్రాయెల్పై హమాస్ దాడులు -
యూపీఐ పేమెంట్స్పై జర్మన్ మంత్రి ఫిదా..!
బెంగళూరు: భారత్లో యూపీఐ పేమెంట్స్పై జర్మన్ డిజిటల్, ట్రాన్స్పోర్టు మంత్రి విస్సింగ్ ప్రశంసలు కురిపించారు. చిరువ్యాపారులు కూడా యూపీఐ పేమెంట్స్ వాడటంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంతటి సులభతర విధానాన్ని భారతీయులందరూ వాడుతున్నారని పేర్కొంటూ జర్మన్ ఎంబసీ తన ట్వీట్టర్(ఎక్స్ )లో పేర్కొంది. మిస్సింగ్ కూరగాయలు కొని, పేమెంట్స్ చేస్తున్న వీడియోను పంచుకుంది. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారత్ గణవిజయం సాధించిందని మిస్సింగ్ అన్నారు. సెకన్ల కాలంలోనే చెల్లింపులు చేసుకునే విధానంపై ఆయన ఆశ్చర్యపోతున్నట్లు చెప్పారు. సులభతరంగా చెల్లింపులు చేసుకునే యూపీఐ పేమెంట్స్పై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బెంగళూరులో జరుగుతున్న జీ20 డిజిటల్ మినిస్టర్స్ మీటింగ్కు ఆయన హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన యూపీఐ పేమెంట్స్ను ఉపయోగించారు. One of India’s success story is digital infrastructure. UPI enables everybody to make transactions in seconds. Millions of Indians use it. Federal Minister for Digital and Transport @Wissing was able to experience the simplicity of UPI payments first hand and is very fascinated! pic.twitter.com/I57P8snF0C — German Embassy India (@GermanyinIndia) August 20, 2023 జర్మన్ ఎంబసీ పోస్టు చేసిన వీడియోపై నెటిజన్లు భారీ సంఖ్యలో స్పందించారు. యూపీఐ పేమెంట్స్లో భాగం అయినందుకు మిస్సింగ్కు ధన్యవాదాలు తెలిపారు. భారత డిజిటల్ విప్లవంపై స్పందించినందుకు థ్యాంక్స్ చెప్పారు. యూపీఐ ప్రపంచవ్యాప్తంగా మారింది.. ఇందులో జర్మనీ ఎప్పుడు చేరుతుందని ప్రశ్నించారు. యూపీఐ అనేది భారత్లో వేగవంతంగా చెల్లింపులు చేసుకునే డిజిటల్ విధానం. ఇందులో శ్రీలంక, సింగపూర్, ఫ్రాన్స్ భాగం అయ్యాయి. ఇదీ చదవండి: రాహుల్ గాంధీ బైక్ రైడ్.. ధన్యవాదాలు తెలిపిన కేంద్ర మంత్రులు.. -
ఈ క్యారవాన్కు లైసెన్స్ అక్కర్లేదు, నీటిలోనూ సూపర్ స్పీడ్
ఇది రోడ్డు మీద పరుగులు తీసేటప్పుడు వ్యాను. నీటిలో ప్రయాణించేటప్పుడు బోటు. నేల మీదనే కాదు నీటిలోనూ ప్రయాణించగల ఉభయచర వాహనం ఇది. జర్మనీకి చెందిన వాహనాల తయారీ సంస్థ ‘సీల్ వ్యాన్స్’ ఈ విచిత్ర ఉభయచర వాహనాన్ని రూపొందించింది. నేల మీద పరుగులు తీసేటప్పుడు ఇది 50 హార్స్పవర్ హోండా మోటారు సాయంతో పనిచేస్తుంది. నీటిలో ప్రయాణించేటప్పుడు ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్తో పనిచేస్తుంది. ఇది 4.20 మీటర్ల మోడల్లోను, 7.50 మీటర్ల మోడల్లోను దొరుకుతుంది. ‘సీల్వ్యాన్స్’ 4.20 మీటర్ల వాహనంలో ఇద్దరు ప్రయాణించడానికి వీలవుతుంది. ఇక 7.50 మీటర్ల మోడల్లో ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. యూరోప్లో దీనికి లైసెన్స్ అవసరం లేదు, వాహనబీమా తప్పనిసరి కాదు. నీటిలో ఇది గంటకు 13 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. దీని ధర మోడల్ను బట్టి 30,500 డాలర్ల (రూ.25.25 లక్షలు) నుంచి 63,800 డాలర్ల (రూ.49.86 లక్షలు) వరకు ఉంటుంది. -
మహేశ్ బాబుకు ఏమైంది? ఆరోగ్యంపై ఎందుకలా పోస్ట్ చేశారు?
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫిట్నెస్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాలుగు పదుల వయసు దాటినా ఇంకా పాతికేళ్ల కుర్రాడిలా మెస్మరైజ్ చేస్తాడు. హాలీవుడ్ హీరోలా తన చార్మింగ్నెస్తో అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. కఠినమైన డైట్ ఫాలో అయ్యే మహేశ్బాబు ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వెకేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. భార్య, పిల్లలతో వారం రోజులుగా జర్మనీలో గడుపుతున్నారు.అయితే తాజాగా తన ఆరోగ్యానికి సంబంధించిన మహేశ్ షేర్ చేసిన ఓ పోస్ట్ అభిమానులను కలవర పెడుతుంది. డాక్టర్ హ్యారీ కోనిగ్తో దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ..'థ్యాంక్యూ డాక్టర్ హ్యారీ కోనిగ్! ఆరోగ్యం మెరుగైన చేతుల్లో'.. అంటూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. ఇది చూసి మహేశ్కు ఏమైంది?ఆయన అస్వస్థతకు గురైతే డాక్టర్ హ్యారీ నయం చేశారా అంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే ఇందులో కంగారు పడాల్సిన పని లేదని తెలుస్తుంది. గత కొన్నాళ్లుగా నేచురోపతి డాక్టర్ హ్యారీ కోనిగ్ ఆద్వర్యంలో మహేశ్ చికిత్స తీసుకుంటూ ఇలా ఫిట్గా, ఆరోగ్యంగా ఉన్నారట. అందుకే డాక్టర్ సేవలను అభినందిస్తూ మహేశ్ ఈ పోస్ట్ను షేర్ చేసినట్లు సమాచారం. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
Rutvi Chaudhary: స్త్రీల సారథ్యంలో స్త్రీలు నేసే తివాచీలు
ఒక చదరపు అంగుళం తివాచీ అల్లాలంటే 197 దారపు ముడులు వేయాలి. ఓపికతో నిండిన ఈ పనిని స్త్రీలే నేర్చుకున్నారు. ‘జైపూర్ రగ్స్’ ఇవాళ 40 వేల మంది నేత కార్మికులతో రగ్గులు తయారు చేయిస్తుంటే వారిలో 30 వేల మంది స్త్రీలే ఉన్నారు. కోడలుగా ఆ ఇంట అడుగుపెట్టిన రుత్వి చౌదరి ఈ సంస్థను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ‘ఇంట అడుగు పెట్టిన కోడలికి ఇంటి సభ్యుల కన్నా ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఇంటి ఘనతను కోడలు నిలబెట్టగలదా లేదా అందరూ గమనిస్తారు. మా మామగారు ఎన్.కె.చౌదరి మొదలెట్టిన జైపూర్ రగ్స్ సంస్థలో డైరెక్టర్గా అడుగు పెడుతున్నప్పుడు అదేం సామాన్యమైన బాధ్యతని అనిపించలేదు. కాని సాధించగలననే అనుకున్నాను’ అంటుంది రుత్వి చౌదరి. ఆడపడుచులు ఆశ, అర్చనలు అమెరికాలో జైపూర్ రగ్స్ సంస్థను నడుపుతుంటే మన దేశంలో భర్త యోగేష్ చౌదరితో కలిసి సంస్థను ముందుకు తీసుకెళుతోంది రుత్వి చౌదరి. ‘నేను మొదటగా చెప్పాలనుకుంటున్నది ఏమంటే మాది విమెన్ సెంట్రిక్ ఆర్గనైజేషన్. మా సంస్థలో ప్రధాన బాధ్యతలన్నీ స్త్రీలే నిర్వహిస్తారు. మా దగ్గర అల్లే ప్రతి తివాచీ స్త్రీ తన బిడ్డను సింగారించినట్టే ఉంటుంది. చేతి అల్లికతో తయారయ్యే తివాచీలు ఇవి’ అంటుందామె. ► తొమ్మిది మందితో మొదలయ్యి రుత్వి చౌదరి మామగారు ఎన్.కె.చౌదరి 1978లో కేవలం ఇద్దరు నేతగాళ్లతో, రెండు మగ్గాలతో, ఐదు వేల రూపాయల పెట్టుబడితో జైపూర్ రగ్స్ను స్థాపించాడు. చాలా కాలం వరకు ఇది కేవలం విదేశాలకే రగ్గులు పంపేది. 2006లో కొడుకు యోగేష్ చౌదరి పగ్గాలు స్వీకరించాక దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టింది. రుత్వి చౌదరి వచ్చాక సంప్రదాయిక డిజైన్లకు డిజైనర్ల సృజన జత చేయడంతో కొత్త తరాన్ని ఆకట్టుకునేలా ఇవి తయారవుతున్నాయి. ‘ఐదు రాష్ట్రాల్లో 600 గ్రామాల్లో దాదాపు 30 వేల మంది మహిళా నేత కార్మికులు తివాచీలు తయారు చేస్తారు. రాజస్తాన్లాంటి చోట దేశీయ తివాచీ డిజైన్లు అద్భుతంగా ఉంటాయి. కాని చాలామటుకు మూసగా కనిపిస్తాయి. నేను ఈ సాంప్రదాయికతను చెడగొట్టదలుచుకోలేదు. కాని డిజైనర్ల సృజన జత చేయాలనుకున్నాను. హిరేన్ పటేల్, ఆషిష్ షా, శాంతను గార్గ్లాంటి వాళ్ల చేత కొత్త డిజైన్లు, పాట్రన్లు ఈ దేశవాళి డిజైన్లకు జత చేశాను. మా మహిళా నేతగత్తెలు వాటిని వెంటనే అందుకున్నారు. ఈ కాలపు యూత్ను కూడా ఆకర్షించేలా తయారు చేశారు’ అంది రుత్వి. ► స్త్రీలకు దక్కిన మర్యాద ‘తివాచీ ఇంటిని దగ్గరగా కూడేలా చేస్తుందంటారు పర్షియన్లు. ఆ సంగతి ఏమో కాని వేల మంది స్త్రీలను మేము ఒక కుటుంబంగా చేయగలిగాము. రాజస్థాన్లో తివాచీల నేత వల్ల స్త్రీలకు గౌరవం పెరిగింది. అన్నింటి కంటే ముఖ్యం వలసలు ఎంతో తగ్గాయి. భార్య సంపాదిస్తూ ఉండటంతో భర్త కూడా బుద్ధిగా పని చేయడం మొదలెట్టాడు. ఈ అన్ని కారణాల వల్ల మా నేతమ్మలు మా సంస్థను ఎంతో ప్రేమిస్తారు. మేము కూడా వారిని ఎక్కువ విసిగించం. మెటీరియల్ ఇచ్చి సరుకును బదులుగా తీసుకుంటాం. వర్క్ ఫ్రమ్ హోమ్. వారికి వీలున్నప్పుడే పని చేయొచ్చు. అంతర్గతంగా ఏదైనా సమస్య వస్తే చర్చించుకోవడానికి పరిష్కరించుకోవడానికి ‘తనా–బనా’ అనే సొంత యాప్ ఉంది. అందులో సత్వర పరిష్కారాలు చెబుతాం’ అంటుంది రుత్వి. ► జర్మనీలో అవార్డ్ జైపూర్ రగ్స్ సంస్థ తాను ఇచ్చే డిజైన్లనే కాక మహిళలను వారి మనసుకు నచ్చిన డిజైన్లతో వినూత్నమైన తివాచీలను అల్లే వీలు కల్పిస్తుంది. వీటిని ‘మన్చాహా’ తివాచీలు అంటారు. ఇలాంటి తివాచీలకు ఎక్కువ సమయం (కొత్త డిజైన్ ఆలోచించాలి కనుక) పడుతుంది కాబట్టి ఎక్కువ మంది ట్రై చేయరు. కాని ప్రతిభ ఉన్న మహిళలు పాశ్చాత్యులను సైతం అబ్బుర పడేలా డిజైన్లు చేస్తారు. వీటి ధర కూడా ఎక్కువే ఉంటుంది. 2018లో బిమలా దేవి అనే నేతమ్మ అల్లిన తివాచీకి ఫ్రాంక్ఫర్ట్లో ‘జెర్మన్ డిజైన్ అవార్డ్’ దక్కింది. ‘మన వారి ప్రతిభను అలా ప్రపంచ దేశాలకు చాటుతున్నాం. మా మహిళలు తయారు చేస్తున్న తివాచీలు ఇప్పుడు 80 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి’ అని తెలిపింది రుత్వి. ఈ సంస్థలో ఒకసారి కొంతమంది స్త్రీలు 30 అడుగుల పొడవు 40 అడుగుల వెడల్పు తివాచీని అల్లారు. దీని కోసం కోటీ 40 లక్షల దారపు ముడులను వేయాల్సి వచ్చింది. ‘మేము తయారు చేసిన వాటిలో అది అత్యంత ఖరీదైనది. దానిని సౌది రాజుకు అమ్మాం’ అని తెలిపింది రుత్వి. ‘దళారులను తొలగించి వారి కమీషన్ కూడా స్త్రీలకే అప్పజెప్పడం వల్ల వారూ మేమూ సంతృప్తిగా ఉన్నాం’ అని ముగించిందామె. -
జర్మన్ స్టార్టప్లో టీవీఎస్కు 25 శాతం వాటా
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రొడక్టులు, విడిభాగాల జర్మన్ స్టార్టప్ కిల్వాట్ జీఎంబీహెచ్లో వాటాను కొనుగోలు చేసినట్లు దేశీ ఆటో రంగ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ తాజాగా పేర్కొంది. 25 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. కొత్తగా జారీ చేయనున్న 8,500 ఈక్విటీ షేర్ల కొనుగోలు ద్వారా వాటాను పొందనుంది. ఇందుకు షేరుకి 235.29 యూరోల చొప్పున చెల్లించనుంది. ఇందుకు దాదాపు రూ. 18 కోట్లు వెచ్చించనుంది. కంపెనీ ప్రధానంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు అవసరమయ్యే హైటెక్ ప్రొడక్టులు, విడిభాగాల డిజైన్, తయారీ, పంపిణీ చేపడుతోంది. -
నాటు నాటు పాటకి జర్మన్ అంబాసిడర్ స్టెప్పులు..వీడియో వైరల్
నాటు నాటు పాట యావత్ దేశాన్ని ఊర్రూతలు ఊగించడమే గాక ప్రపంచ దేశాల ప్రజల చేత కూడా స్పెప్పులు వేయించింది. ఆ పాటకు వచ్చిన క్రేజ్ మాములుగా లేదు. అందుకు తగ్గట్టుగానే రాజమైళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఈ నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుతో గొప్ప విజయాన్ని దక్కించుకుంది. దీంతో యావత్తు భారతదేశం సంతోషంతో సంబరాలు జరపుకుంది. అంతేగాదు అందులోనూ ఒక తెలుగ సినిమాకు తొలిసారిగా దక్కడం అంబరాన్నంటేలా సంబరాలు జరుపుకుంది భారత్. ఐతే ఇప్పుడూ పాట దేశ రాయబారుల చేత కూడ స్పెప్పులు వేయిచింది. ఈ మేరకు భారత్లోని జర్మన్ రాయబారి డాక్టర్ ఫిలిఫ్ అకెర్మాన్ ఓల్డ్ ఢిల్లీలోని తన బృందంతో కలిసి డాన్య్లు చేసి ఆ విజయాన్ని వారు కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు కూడా.ఆ వీడియోలో జర్మన్ రాయబారి చాందినీ రిక్షాలో దిగుతూ.. ఒక దుకాణదారుని వద్దకు వచ్చాడు. అతను అక్కడ బాగా ఫేమస్ అయిన జిలేబితో పాటు దక్షిణ కొరియ జెండా తోపాటు నాటు నాటు పాట ముద్రించిన లాఠీని అందిస్తాడు. ఆ తర్వాత అకెర్మాన్ తన బృందంతో రహదారిపై నాటు నాటు పాటకు డ్యాన్స్లు చేస్తూ కనిపించారు. ఆ వీడియోలో వారిని ఉత్సాహపరిచేలా చుట్టూ పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా గుమిగూడారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా.. జర్మన్లు డ్యాన్సులు చేయలేరనుకుంటున్నారా? అని అన్నారు.పైగా తాను తన ఇండో బృందంతో ఆస్కార్ అవార్డుని గెలుచుకున్న నాటు నాటు విజయాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఐతే అంత పరెఫెక్ట్గా రాలేదు కానీ ఏదో సరదాగా ఇలా చేశాం అని ట్వీట్ చేశారు. అంతేగాదు ఆయన ట్విట్టర్లో మాకు స్ఫూర్తినిచ్చిన భారత్లోని కొరియన్ ఎబసీకి ధన్యావాదాలు. అలాగే ఆర్ఆర్ఆర్ మూవీ బృందానికి అభినందనలు. ఐతే ఇప్పుడూ నెక్స్ట్ ఎవరూ? అంటూ ఎంబసీ ఛాలెంజ్ విసురుతుంది. అని అన్నారు. కాగా, ఇంతకు మునుపు కొరియా రాయబారి చాంగ్ జే బోక్ తన సిబ్బందితో కలిసి ఈ పాటకు డ్యాన్స్ చేశారు. ఐతే నెటిజన్లు ఈ వీడియను చూసి..వావ్ చాల బాగా చేసింది బృందం అంటూ జర్నన్ రాయబారిని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియోపై భారత్లోని బ్రిటీష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ కూడా స్పందిస్తూ చాలా బాగుందని తెగ మెచ్చుకున్నారు. Germans can't dance? Me & my Indo-German team celebrated #NaatuNaatu’s victory at #Oscar95 in Old Delhi. Ok, far from perfect. But fun! Thanks @rokEmbIndia for inspiring us. Congratulations & welcome back @alwaysRamCharan & @RRRMovie team! #embassychallange is open. Who's next? pic.twitter.com/uthQq9Ez3V — Dr Philipp Ackermann (@AmbAckermann) March 18, 2023 (చదవండి: చైనాతో పరిస్థితి డేంజర్గానే ఉంది! జైశంకర్) -
బాప్రే!.. ఏకంగా 11 వేలకు పైగా హత్యలు చేసిన 97 ఏళ్ల వృద్ధురాలు
ఒకటి రెండు కాదు ఏకంగా వేలమందిని హత్య చేసింది ఒక వృద్ధురాలు. రెండో ప్రప్రంచ యుద్ధం సమయం నాటి కేసులో కోర్టు తాజాగా ఆమెను దోషిగా తేల్చి శిక్ష విధించింది. వివరాల్లోకెళ్తే.. 97 ఏళ్ల వృద్ధురాలు ప్రస్తుత పోలాండ్కి సమీపంలో ఉన్న స్టట్థాప్ నాజీ నిర్బంధ శిబిరంలో కార్యదర్శిగా పనిచేసింది. ఆ సమయంలో ఆమె అక్కడ నిర్బంధంలో ఉన్న యుద్ధ ఖైదీలు సుమారు 10,500 మందికి పైగా హత్యకు గురయ్యారు. ఐతే ఆ హత్యల్లో ఈ వృద్ధురాలు ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా నిందితులకు సహకరించినట్లు జర్మనీలో ఇట్జెహులో జిల్లా కోర్డు మంగళవారం పేర్కోంది. ఆ కేసులో ఆమెకు రెండేళ్ల బహిష్కరణ శిక్ష తోపాటు ఆమె ఈ హత్యలు చేసినప్పుడూ వయసు 18 నుంచి 19 సంవత్సరాల మద్య ఉండటంతో అప్పటి బాల నేరస్తుల చట్టం ప్రకారం విధించే శిక్షలను కూడా విధిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. వాస్తవానికి ఆమెపై దాదాపు 11,412 మంది హత్యలకు సహకరించినట్లు అభియోగాలు ఉన్నాయి. ఐతే 2021 నుంచి కోర్టులో ట్రయల్స్ ప్రారంభం కావడం ఆలస్యమైంది. అదీగాక ఆమె కూడా అనారోగ్యంతో ఉండటంతో కోర్టుకు అందుబాటులో లేకుండా పోయింది. ఆ వృద్ధురాలు 1943 నుంచి 1945 కాలంలో స్టట్థాప్ నాజీ నిర్బంధ శిబిరంలో పనిచేసింది. అక్కడ నిర్బంధంలో ఉన్న దాదాపు 65 వేల మంది ఆకలితో లేదా వ్యాధులతో మరణించారు. మరికొంతమంది స్టట్థాప్లోని గ్యాస్ చాంబర్లో మరణించారు. వారంతా నాజీల నిర్మూలన ప్రచారంలో పాల్గొన్న యుద్ధ ఖైదీలు, వారిలో కొందరూ యూదులు కూడా ఉన్నట్లు సమాచారం. ఐతే ఇది రెండో ప్రపంచ యుద్ధ నేరాలకు సంబంధించిన చివరి కేసు విచారణ అని జర్మనీ స్థానికి మీడియా పేర్కొనడం గమనార్హం. (చదవండి: రష్యా బలగాలకు ఆకస్మిక ఆదేశాలు.. భయాందోళనలో ఉక్రెయిన్) -
వామ్మో! దోమ కుడితే ఇంత అలానా! ఏకంగా 30 సర్జరీలా!
దోమల వల్ల ఏ డెంగ్యూ లేక మలేరియా వంటి వ్యాధులు వస్తాయని తెలుసు. అంతేగానీ ఏకంగా మూడు వారాల పాటు కోమా, 30 సర్జరీలు చేయించుకోవడం గురించి విన్నారా!. లేదు కదా కానీ ఇక్కడోక వ్యక్తి ఒక్క దోమ కాటు వల్ల ఇంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఔనా! ఇది నిజమా? అని సందేహించొద్దు నిజంగానే జరిగింది. దయ చేసి ఈ దోమల పట్ల జాగ్రత్తగా ఉండండని ఆ వ్యక్తి పలువురికి సలహాలు ఇస్తున్నాడు కూడా. వివరాల్లోకెళ్తే....జర్మన్కి చెందిన 27 ఏళ్ల సెబాస్టియన్ రోట్ష్కే 2021లో ఆసియా టైగర్ దోమ అతన్ని కుట్టింది. దీంతో అతనికి కొన్ని రోజులపాటు ఫ్లూ వంటి లక్షణాలతో కూడిన జ్వరం వచ్చింది. ఆ తర్వాత రోట్ష్కే కొద్ది రోజుల్లోనే కోలుకుంటాను అని లైట్ తీసుకున్నాడు. అది కాస్త రోజు రోజుకి విషమించి చనిపోయేంత ప్రాణాంతకంగా మారిపోయింది. ఆ దోమ కాటు కారణంగా బ్లడ్ పాయిజన్గా మారిపోయింది. దీంతో కాలేయం, మూత్రపిండాలు, గుండె, ఊపిరతిత్తులు సరిగా పనిచేయడం మానేశాయి. ఆ తర్వాత అతను సుమారు మూడు, నాలుగు వారాలపాటు పూర్తిగా కోమాలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతను ఏదో కొద్దిపాటి అదృష్టం కొద్ది కోమా నుంచి బయటపడ్డాడు. ఆ తదనంతరం ఆ దోమ కుట్టిన ప్రాంతంలో ఏర్పడిన గడ్డను తొలగించేందుకు ఏకంగా 30 సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. దీంతో రోట్ష్క్ ఏకంగా సగం తోడను పోగొట్టుకోవాల్సి వచ్చింది కూడా. ఈ సర్జరీల కారణంగా తాను కొన్నేళ్ల పాటు మంచానికే అతుక్కుపోవాల్సి వచ్చిందని, దారుణమైన నరకాన్ని అనుభవించానని ఆవేదనగా చెప్పాడు రోట్ష్క్. ఫారెస్ట్ దోమలుగా పిలిచే ఈ ఆసియా టైగర్ దోమలు పగటిపూటే దాడి చేస్తాయని, దయచేసి వాటి పట్ల బహు జాగ్రత్తగా ఉండాలని రోట్ష్క్ అందర్నీ కోరుతున్నాడు. (చదవండి: షాకింగ్ ఘటన: జడ్జి, ఆమె భర్త, పెంపుడు జంతువులతో సహా మృతి) -
విమాన ప్రయాణికులకు అలర్ట్.. వాటిని నిషేదిస్తూ కీలక నిర్ణయం!
విమాన ప్రయాణానికి యాపిల్ ఎయిర్ ట్యాగ్స్ ప్రమాదం అంటూ లుఫ్తాన్సా ఎయిర్లైన్ తెలిపింది. అందుకే తమ సంస్థకు చెందిన విమాన ప్రయాణాల్లో యాపిల్ ఎయిర్ ట్యాగులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. విమాన ప్రయాణంలో తమ వెంట తెచ్చుకున్న లగేజీ సేఫ్గా ఉందా? లేదా? అని చెక్ చేసుకునేందుకు ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు అదే ఎయిర్ ట్యాగ్స్పై జర్మనీ ఎయిర్లైన్ ఆంక్షలు విధించింది. అయితే లుఫ్తాన్సా ఇటీవల ‘ఎయిర్ ట్యాగ్లు ప్రమాదమని.. కాబట్టే యాక్టివేటెడ్ ఎయిర్ట్యాగ్లను ప్రయాణికుల వినియోగంచుకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ట్వీట్ చేసింది. ఐసీఏఓ (ఇంటర్నేషనల్ సివిలియన్ ఏవియేషన్ ఆర్గనైజేషన్) మార్గదర్శకాల కారణంగా లుఫ్తాన్సా ఎయిర్ట్యాగ్ని నిషేధించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. లిథియం అయాన్ బ్యాటరీలు, 15 అంగుళాల యాపిల్ మాక్ ప్రో (సెప్టెంబర్ 2015 ఫిబ్రవరి 2017 మధ్య కొనుగోలు చేసిన)లపై మాత్రమే ఆంక్షలు ఉన్నాయి. యాపిల్ సంస్థ లిథియం- అయాన్ బ్యాటరీలు వినియోగించదు. ఎయిర్ ట్యాగ్స్ కోసం యాపిల్ సంస్థ సీఆర్2032 సెల్స్ను ఉపయోగిస్తుంది. ఒకవేళ ఆ సెల్స్ ప్రమాదకరమని భావిస్తే స్మార్ట్వాచ్లను విమానాల్లో అనుమతించకూడదనే వాదనలు వినిపిస్తున్నాయి. యాపిల్ ఎయిర్ట్యాగ్పై లుఫ్తాన్సా ఎయిర్లైన్ ఎందుకు నిషేధం విధించిందో స్పష్టమైన నిషేధాన్ని కారణాలు వివరించనప్పటికీ, అనేక నివేదికలు మాత్రం ప్రయాణికుల లగేజీని ట్రాక్ చేయకుండా ఉండేందుకు ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటుందని వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. -
Russia-Ukraine war: ఏళ్ల తరబడి ఉక్రెయిన్ యుద్ధం!
కీవ్: ఉక్రెయిన్–రష్యా యుద్ధం ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో ఎవరికీ తెలియదని నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ చెప్పారు. జర్మనీ వార పత్రికకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇరు దేశాల నడుమ యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగే అవకాశం ఉందని, దానికి అందరూ సిద్ధపడాలని చెప్పారు. ప్రపంచదేశాలు ఉక్రెయిన్కు వివిధ రూపాల్లో ఇస్తున్న మద్దతును ఇలాగే కొనసాగించాలని సూచించారు. మద్దతును బలహీనపర్చరాదని అన్నారు. జవాన్లను కలుసుకున్న జెలెన్స్కీ చాలారోజులుగా రాజధాని కీవ్కే పరిమితం అవుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా మైకోలైవ్, ఒడెసాలో జవాన్లను, ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బందిని కలుసుకున్నారు. స్వయంగా మాట్లాడి, వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. తాజా పరిణామాలపై ఆరా తీశారు. విశేషమైన సేవలందిస్తున్న పలువురికి బహుమతులు ప్రదానం చేశారు. వారి సేవలకు గాను కృతజ్ఞతలు తెలిపారు. మైకోలైవ్లో జెలెన్స్కీ పర్యటన ముగిసిన కొద్దిసేపటి తర్వాత రష్యా సేనలు విరుచుకుపడ్డాయి. ప్రావ్డైని, పొసద్–పొక్రోవ్స్క్, బ్లహోదట్నే ఉక్రెయిన్ సైనిక స్థావరాలపై ఫిరంగులతో దాడి చేశాయి. గలిస్టీన్ కమ్యూనిటీలో రష్యా దాడుల్లో ఇద్దరు మరణించారు. జవాన్లలో అడుగంటుతున్న నైతిక స్థైర్యం! ఉక్రెయిన్– రష్యా మధ్య నాలుగు నెలలుగా యుద్ధం కొనసాగుతోంది. ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. నెలల తరబడి తమ కుటుంబాలకు దూరంగా ఉంటున్న సైనికుల్లో నైతిక స్థైర్యం సన్నగిల్లుతోంది. తరచూ సహనం కోల్పోతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరిస్తున్నారు. ఇరు దేశాల సైన్యంలో ఇదే పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని బ్రిటన్ రక్షణ శాఖ వెల్లడించింది. డోన్బాస్లో ఇరు పక్షాల నడుమ భీకర పోరాటం సాగుతోందని, ఆదే సమయంలో జవాన్లు నిరాశలో మునిగిపోతున్నారని పేర్కొంది. -
జర్మనీలో వరంగల్ యువకుడి గల్లంతు.. కేటీఆర్ను సాయం కోరిన కుటుంబం
వరంగల్: ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లిన వరంగల్కి చెందిన యువకుడు అక్కడ గల్లంతయ్యాడు. నగరంలోని కరీమాబాద్కి చెందిన కడారి అఖిల్ (26) జర్మనీలోని హోట్టోవన్ యూనివర్సిటీలో ఉన్నత విద్య చదువుతున్నాడు. మూడేళ్లుగా అక్కడే ఉంటున్న అఖిల్ సోలార్ ఎనర్జీ విభాగంలో ఫైనలియర్లో ఉన్నాడు. కాగా రెండు రోజుల క్రితం స్నేహితులతో కలిసి స్థానికంగా ఉన్న నది వద్దకు వెళ్లాడు. నది ఒడ్డున సెల్పీ దిగే క్రమంలో నీటి ప్రవాహంలో పడి గల్లంతయ్యాడు. ఈ విషయాన్ని స్నేహితులు, అక్కడి ఎంబసీ అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అఖిల్ తండ్రి కడారి పరుశురాములు వరంగల్లో మేస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుమారుడి బంగారు భవిష్యత్తు కోసం అప్పులు చేసి జర్మనీ పంపించాడు. చేతికి అంది వచ్చిన కొడుకు ఇలా నీటిలో గల్లంతవడంతో పరుశురాములు కుటుంబం ఆందోళన చెందుతోంది. మరోవైపు అఖిల్ సోదరి తన సోదరుడి ఆచూకి, వివరాలు తెలిపేందుకు సాయం చేయాలంటూ మంత్రి కేటీఆర్ను ట్విటర్ ద్వారా కోరగా... తన వంతు సాయం చేస్తానంటూ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. Will speak to the authorities in Germany and do our best Rasagnya My team @KTRoffice will keep you informed on any updates that we will get https://t.co/0BZTIh3Roh — KTR (@KTRTRS) May 10, 2022 చదవండి: ప్రాణాలతో గల్ఫ్ కు ఎగుమతి.. శవపేటికల్లో దిగుమతి -
ఉక్రెయిన్ ఆర్మీ ఆసక్తికర ప్రకటన!
ఉక్రెయిన్పై రష్యా దాడులు 30వ రోజు కూడా కొనసాగుతున్నాయి. ఇరవైపుల నుంచి శాంతి చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోగా.. యుద్ధంతో నష్టం ఇరువైపులా భారీగానే నమోదు అవుతోంది. ఈ తరుణంలో ఉక్రెయిన్ ఆర్మీ చేసిన ప్రకటన ఒకటి ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఈ యుద్ధాన్ని రష్యా మే 9వ తేదీన ముగించాలని భావిస్తోందని ఉక్రెయిన్ ఆర్మీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ తేదీనే ఎందుకనే దానికీ ఒక ప్రత్యేకత ఉంది. నాజీ జర్మనీపై తమ విజయానికి గుర్తుగా ఆరోజు రష్యా ‘విక్టరీ డే’ పేరుతో దేశవ్యాప్తంగా సంబురాలు జరుపుతుంటుంది. కాబట్టి, అదే రోజున ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించి.. ప్రకటన చేసుకునే(ఎలాంటిదనేది చెప్పలేదు) అవకాశం ఉందని రష్యా ఆర్మీ అంచనా వేస్తోంది. విక్టరీ డే అనేది 1945లో గ్రేటర్ జర్మన్ రీచ్ లొంగిపోయినందుకు గుర్తుచేసే సెలవుదినం. ఈ మేరకు ఉక్రెయిన్ ఆర్మ్డ్ బలగాల్లోని జనరల్ స్టాఫ్ ఇంటెలిజెన్స్ విభాగపు సమాచారం ప్రకారం ఉక్రెయిన్ ఆర్మీ ఈ ప్రకటన విడుదల చేసినట్లు.. ది కీవ్ ఇండిపెండెట్ మీడియా హౌజ్ ట్వీట్ చేసింది. ⚡️Ukrainian army: Russia wants to end war by May 9. According to intelligence from the General Staff of the Armed Forces of Ukraine, Russian troops are being told that the war must end by May 9 – widely celebrated in Russia as the day of victory over the Nazi Germany. — The Kyiv Independent (@KyivIndependent) March 24, 2022 ఉక్రెయిన్ పౌరుల కిడ్నాప్! ఇదిలా ఉండగా రష్యాపై ఉక్రెయిన్ సంచలన ఆరోపణలకు దిగింది. ఉక్రెయిన్ నుంచి పౌరులను రష్యా బలగాలు బలవంతంగా మాస్కో తరలిస్తున్నాయని, తద్వారా వాళ్లను బంధీలుగా చేసుకుని రాజధాని కీవ్ను ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపిస్తోంది. ఈ మేరు 4 లక్షల మంది ఉక్రెయిన్ పౌరులను (అందులో 84,000 మంది పిల్లలు) కిడ్నాప్ చేసిందని ఉక్రెయిన్ ఆంబుడ్స్మన్ ల్యుద్మైల డెనిసోవా ఆరోపిస్తున్నారు. అయితే రష్యా మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తోంది. -
12 ఏళ్లుగా ఆ జంట ప్రయాణం.. బహుశా ఎవరూ చేసుండకపోవచ్చు!
సాక్షి, చెన్నై: జర్మనీకి చెందిన ఓ జంట 12 సంవత్సరాల క్రితం చేపట్టిన పర్యాటక యాత్ర తాజాగా చెన్నైకు చేరింది. లగ్జరీ వసతులతో కూడిన వాహనం ద్వారా ఈ జంట చెన్నై శివారులోని ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం మహాబలిపురానికి చేరుకుంది. జర్మనీకి చెందిన తోల్సన్(30), మిక్కి(36) తొంభై దేశాల్లో పర్యటించేందుకు నిర్ణయించారు. 12 ఏళ్లుగా ఈ జంట ఇజ్రాయిల్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దుబాయ్ తదితర దేశాల్లో పర్యటించింది. గత వారం ఈ వీరు ఓ నౌక ద్వారా ముంబైకు చేరుకున్నారు. ఈ జంట తమ పర్యటనలో లగ్జరీ సౌకర్యంతో కూడిన వాహనం కూడా తెచ్చుకున్నారు. ఇందులో చిన్న పాటి కిచెన్, బెడ్ రూమ్, స్నానపు గది తదితర వసతుల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ వాహనం ప్రస్తుతం మహాబలిపురం సముద్ర తీర ఆలయానికి కూత వేటు దూరంలో ఉంది. ఈ జంటకు స్థానిక పోలీసులు ప్రత్యేక భద్రత కల్పించారు. అలాగే, అక్కడి గైడ్లు మహాబలిపురం విశిష్టతను వారికి వివరించారు. మరో నాలుగైదు రోజులు చెన్నైలో ఈ జంట పర్యటించనుంది. -
ఈవీ మార్కెట్లోకి మినీ కూపర్ ఎలక్ట్రిక్ కారు.. రేంజ్ కూడా సూపర్..!
Mini Cooper Electric India Launch On 24 February: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎమ్డబ్ల్యు తన మినీ కూపర్ ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకొని వచ్చేందుకు సిద్దం అయ్యింది. గత ఏడాది డిసెంబర్ నెలలో బీఎమ్డబ్ల్యు ఐఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్యువిని లాంఛ్ చేసిన తర్వాత మినీ కూపర్ ఎస్ఈ త్రీ డోర్ ఎలక్ట్రిక్ కారును భారతదేశంలో లాంఛ్ చేయనుంది. ఈ మినీ కూపర్ ఎస్ఈ కారుని 2022 ఫిబ్రవరి 24న భారతదేశంలో విడుదల చేయనున్నారు. దీని కోసం ప్రీ బుకింగ్ కూడా ఓపెన్ చేశారు. మొదటి బ్యాచ్లో 30 యూనిట్ల కార్లు కూడా ఇప్పటికే అమ్ముడుపోయాయి.కొత్త మినీ కూపర్ ఎస్ఈని ప్రపంచవ్యాప్తంగా 2019లో ఆవిష్కరించారు. ఈ ఎలక్ట్రిక్ కారు పెట్రోల్ వెర్షన్ కంటే 145 కిలోల బరువుగా ఉంది. కొత్త మినీ కూపర్ ఎస్ఈ 32.6 కెడబ్ల్యుహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీ చేత పనిచేస్తుంది. ఇది 182 హెచ్పీ పవర్, 270 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ 7.3 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 150 కి.మీ. డబ్ల్యుఎల్ టీపీ ప్రకారం.. కూపర్ ఎస్ఈను ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 270 కిలోమీటర్ల వెళ్లగలదు అని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ కారును 11కెడబ్ల్యు ఛార్జర్ సహాయంతో 2.5 గంటల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేస్తే, అయితే 50కెడబ్ల్యు డీసీ ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో కేవలం 35 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఈ కారు ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడిడిఆర్ఎల్ ఓవల్ హెడ్ ల్యాంప్, షడ్భుజి ఆకారంలో ఉండే గ్రిల్, కాంట్రాస్ట్ కలర్ ఓఆర్ విఎమ్ లతో వస్తుంది. ఈ కారు లోపల 8.8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, ఫుల్ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండనుంది. ఇప్పుడు బుక్ చేసుకున్న కస్టమర్లకు కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా ఆ తర్వాతి నెలల్లో డెలివరీ చేసే అవకాశం ఉంది. మినీ ఇండియా ఈ ఆల్-ఎలక్ట్రిక్ కారును పూర్తిగా విదేశాల్లో తయారు చేసి భారతదేశానికి దిగుమతి చేసుకుని విక్రయిస్తుంది. (చదవండి: నష్టాల్లో రామ్ చరణ్ బిజినెస్, నిలిచిపోయిన సేవలు) -
జర్మనీ పెట్టుబడుల కోసం..ప్రత్యేక క్లస్టర్
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక, వాణిజ్య పెట్టుబడులతో భారత్కు వచ్చేవారికి తెలంగాణ రాష్ట్రం ఆకర్షణీయమైన గమ్యస్థానమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ లో పెట్టుబడులకు అనేక అనుకూలతలు ఉన్నా యని చెప్పారు. జర్మనీ పెట్టుబడిదారుల కోసం ప్రత్యేకంగా అన్ని మౌలిక వసతులతో కూడిన ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. పని ప్రదేశాల్లోనే ఉద్యోగులు, కార్మికులకు నివాస వసతి కల్పించేలా మౌలిక వసతులకు పెద్దపీట వేస్తామని మంత్రి వెల్లడించారు. ఇండో జర్మన్ చాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో సోమవారం సంయుక్తంగా నిర్వహించిన జర్మనీ పెట్టుబడిదారుల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణలో కేవలం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోనే కాకుండా ఇతర రంగాల్లోనూ పెట్టుబడులకు అనేక అవకాశాలున్నాయని కేటీఆర్ తెలిపారు. ఇటీవలి కాలంలో యంత్ర, ఎలక్ట్రానిక్ వాహన తయారీ రంగంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కరోనా పరిస్థితుల్లో తయారీ రంగం చైనా నుంచి తరలేందుకు సన్నాహాలు చేసుకుంటున్న నేపథ్యంలో భారత్ ప్రత్యేకించి తెలంగాణ ఈ తరహా పెట్టుబడులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉందని మంత్రి చెప్పారు. ఈ క్రమంలో జర్మనీ పెట్టుబడిదారులు కూడా తెలంగాణకు తరలివస్తే స్వాగతం పలికేందుకు సిద్ధమన్నారు. ఐపాస్ ద్వారా సులభతర అనుమతులు పారిశ్రామిక అవసరాలకు వీలుగా రాష్ట్రంలో 3.2 లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉందని, టీఎస్ఐఐసీ ద్వారా మౌలిక వసతులు, టీఎస్ఐపాస్ ద్వారా సులభతర అనుమతులు లభించేలా చూస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. జర్మనీ జీడీపీలో 80 శాతానికి పైగా చిన్న, మధ్య తరహా పరిశ్రమల నుంచే సమకూరుతోందని, అదే తరహాలో తెలంగాణలోనూ చిన్న, మధ్య తరహా సంస్థలతో పనిచేసేందుకు జర్మనీ పెట్టుబడిదారులు ముందుకు రావాలని మంత్రి కోరారు. జర్మనీ తరహాలో..డ్యూయల్ డిగ్రీ కోర్సుల యోచన జర్మనీ దేశంలో అమలులో ఉన్న డ్యూయల్ డిగ్రీ తరహా కోర్సులను రాష్ట్రంలోనూ ప్రవేశపెట్టే యోచనలో ఉన్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశంలో భారత్లో జర్మనీ రాయబారి వాల్టర్ జె.లిండ్నర్, చెన్నైలో జర్మనీ కాన్సుల్ జనరల్ కెరిన్ స్టోల్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. రూ.1,500 కోట్ల పెట్టుబడి .. 27 వేల మందికి ఉపాధి జర్మన్ పెట్టుబడిదారుల సదస్సులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆ దేశానికి చెందిన ‘లైట్ ఆటో జీఎంబీహెచ్’తో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. భారత్లో జర్మనీ రాయబారి వాల్టర్ జె.లిండ్నర్, రాష్ట్ర మంత్రి కేటీ రామారావు సమక్షంలో ఈ ఎంవోయూ కుది రింది. ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, లైట్ ఆటో ప్రతినిధులు ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం తెలంగాణలో లైట్ ఆటో జీఎంబీహెచ్ రూ.1,500 కోట్ల పెట్టుబడితో ఆధునిక డిజైనింగ్, తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తుంది. ఎలక్ట్రిక్, ఐసీఈ వాహన రంగంలో కార్లు, వాణిజ్య, ద్విచక్ర వాహనాలకు అవసరమైన మెగ్నీషియం ఉత్పత్తులను తయారు చేస్తుంది. దీని ద్వారా 9 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 18 వేల మందికి పరోక్షంగా.. మొత్తంగా 27 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. -
ఓ అమ్మయి కన్నీటి గాథ.. ఆరు ప్రేతాత్మలు ఆరేళ్లపాటు వేధించి.. అతి క్రూరంగా..!!
The Real Story Behind ‘The Exorcism of Emily Rose’ Is More Terrifying Than the Movie: దేవుడి ప్రస్తావన వచ్చినప్పుడల్లా దెయ్యం ఉనికి గురించీ వింటూనే ఉన్నాం.. నమ్ముతూనే ఉన్నాం. ఆ వినికిడి సారాంశం, నమ్మకపు ప్రభావం..‘దెయ్యాలు క్రూరమైన వి, విచక్షణ లేకుండా ప్రవర్తిస్తుంటాయి.. వాటికి దేవుడంటే భయం’ అని! కానీ దైవశక్తికి సైతం లొంగని ఆరు ప్రేతాత్మలు.. ఆరేళ్ల పాటు ఓ అమ్మాయి శరీరాన్ని ఆవహించి, అనుక్షణం నరకయాతన పెట్టాయి. చివరికి క్రూరంగా చంపేశాయి. 2005లో ప్రపంచాన్ని వణికించిన ‘ది ఎక్సార్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్’ అనే సినిమా కల్పిత కథ కాదు, 1976లో ముగిసిన ఓ అమ్మాయి నిజ జీవిత వ్యథ. జర్మనీ చరిత్రలో సంచలనంగా మిగిలిన ‘అన్నెలీస్ మిషెల్’ కన్నీటి గాథ నేటికీ ఓ మిస్టరీనే. ఉన్నట్టుండి నవ్వడం, క్రూరంగా చూడటం.. ఎంతటి బలవంతుడినైనా ఒంటిచేత్తో నొక్కిపెట్టి కదలకుండా చెయ్యగలగడం, పైకి లేచి చేతులు చాచి.. వికృతంగా ప్రవర్తించడం, తనని తాను బాధించుకోవడం.. కాళ్లతో పాటు చేతులనూ ఉపయోగించి మెట్లు దిగడం.. మనిషి మొత్తం రకరకాల మెలికలు తిరగడం.. ఇదంతా నేటి హారర్ చిత్రాల్లో సాధారణంగా కనిపించే దృశ్యాలు.కానీ దెయ్యం ఆవహిస్తే అలాగే ప్రవర్తిస్తారు అని మొదటిసారిగా ప్రపంచానికి తెలిసింది మాత్రం అన్నెలీస్ని చూసినప్పుడే! అన్నెలీస్.. పశ్చిమ జర్మనీ, బవేరియాలోని లీబ్లిఫింగ్లో 1952, సెప్టెంబర్ 21న పుట్టింది. జోసెఫ్, అన్నా మిషెల్ ఆమె తల్లిదండ్రులు. వాళ్లు రోమన్ కేథలిక్స్. అన్నెకు ముగ్గురు సోదరీమణులు. చిన్ననాటి నుంచి దైవభక్తి కలిగిన ఆమె.. తల్లిదండ్రులతో పాటు వారంలో రెండుసార్లు చర్చికి హాజరయ్యేది. అలాంటి అన్నె.. ఉన్నట్టుండి దేవుడ్ని ద్వేషించడం మొదలుపెట్టింది. ఆమెకు 16 ఏళ్ల వయసులో అకస్మాత్తుగా ఆరోగ్యం దెబ్బతింది. వ్యాధి లక్షణాలను బట్టి మూర్ఛగా, మానసిక రుగ్మతగా గుర్తించిన వైద్యులు.. ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించారు. ‘ఆత్మలు కనిపిస్తున్నాయి’ అంటూ భయపడసాగింది అన్నె. అదంతా వ్యాధి లక్షణాల్లో భాగమే అన్నారు వైద్యులు. దేవుడ్ని ప్రార్థిస్తున్న సమయంలో ఎవరో.. ‘నువ్వు నరకంలో కుళ్లిపోతున్నావు’ అంటున్నారని చెప్పేది ఆ అమ్మాయి. దాన్నీ మానసిక సమస్యగానే పరిగణించారు. కాలక్రమేణా జీసస్ చిత్రాన్ని చూసినా, శిలువను చూసినా వింతవింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. దైవక్షేత్రాల్లోకి వెళ్లాలంటే భయపడేది. బలవంతంగా ప్రార్థన స్థలాలకు తీసుకుని వెళ్తే.. నేల కాలిపోతోంది, కాళ్లు మంటలు పుడుతున్నాయనేది. అన్నె ప్రవర్తన చూసిన ఆమె స్నేహితులకు, కుటుంబసభ్యులకు ‘ఆమెను ఆత్మ ఆవహించిందా?’ అనే అనుమానం బలపడింది. అదే భయంతో అన్నెకు భూతవైద్యం అందించాలని చర్చి ఫాదర్ ఎర్నస్ట్ అల్ట్ను ఆశ్రయించారు. అయితే అప్పటికే భూతవైద్యంపై కఠిన నియమాలు ఉండటంతో వెంటనే అనుమతి లభించలేదు. చివరికి.. అన్నె స్వయంగా అల్ట్కు లేఖ రాసింది. ‘నాకు ఆరోగ్యంగా జీవించాలనుంది. నా గురించి ప్రార్థించండి. జనుల కోసం బాధను అనుభవిస్తాను. కానీ, ఈ నరకం చాలా భయానకంగా ఉంది. తట్టుకోలేకపోతున్నాను’ అంటూ. అది చదివిన ఫాదర్ అల్ట్ మనసు కరిగి, ఆ లేఖను బిషప్ జోసెఫ్ స్తంగల్కు చూపించారు. దాంతో బిషప్.. ప్రీస్ట్ ఆర్నాల్డ్ రెంజ్కు భూత వైద్యం చేసేందుకు అనుమతి ఇచ్చాడు. కానీ ఇదంతా రహస్యంగా జరగాలని ఆదేశించారు. 1975 సెప్టెంబర్ 24 నుంచి అన్నెకు మందులు ఇవ్వడం మానేసి, భూతవైద్యం మొదలుపెట్టారు. మొత్తం వైద్యపద్ధతిని, అన్నె ప్రవర్తనని.. వీడియోల రూపంలో, ఆడియోల రూపంలో రికార్డ్ చేశారు. నేటికీ వాటిని నెట్లో వినొచ్చు, చూడొచ్చు. ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆరు గొంతులు వినిపించేవి. అవి ప్రేతాత్మలవని గుర్తించారు భూతవైద్యులు. వాటి పేర్లు లుసీఫర్, కైన్, జుదాస్ ఇస్క్రీయాట్, బెలీయల్, లెజియాన్, నెరో అని తేల్చారు. కానీ వాటిని అన్నె శరీరంలో నుంచి వెళ్లగొట్టడంలో విఫలమయ్యారు. వారానికి రెండు మూడు రోజులు 4 గంటల చొప్పున.. 67 సార్లు ఆమెకు భూతవైద్యాన్ని అందించారు. అయినా ఫలితం లేదు. ఆ నరకం భరించలేక అన్నె 1976, జులై 1న తన 23వ ఏట చనిపోయింది. అప్పుడే ప్రపంచం అన్నే కథవైపు తిరిగి చూసింది. ఈ మరణానికి బిషప్ ఆదేశాలతో చేసిన భూత వైద్యమే కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు. అందుకు సహకరించిన అన్నె తల్లిదండ్రులనూ అరెస్ట్ చేశారు. అన్నె సుమారు 10 నెలలు ఆహారం తినలేదని, పౌష్టికాహార లోపంతో ఆమె చనిపోయిందని, ఎముకలన్నీ ఛిద్రమై, మాంసం ముద్దలా మారిందని, కేవలం 30 కేజీల బరువు ఉందని పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది. ఆమెను ప్రేతాత్మలు ఆవహించాయని చెప్పేందుకు.. భూతవైద్యులు రికార్డు చేసిన వీడియో, ఆడియో టేపులను కోర్టు ముందు ఉంచడంతో.. అవే వారిని కాపాడాయి. అన్నె తన మూత్రాన్ని తానే తాగేదని, తనని తాను గాయపరచుకొనేదని సాక్షులు తెలిపారు. తల్లిదండ్రులు తెచ్చిన ఆహారాన్ని విసిరికొట్టడం, అన్నే వింతగా ప్రవర్తించడం అన్నింటికీ సాక్ష్యాలు ఉండటంతో కోర్టు నమ్మింది. అందరినీ విడుదల చేసింది. ‘ప్రేతాత్మల కారణంగా చనిపోవడంతో పద్ధతి ప్రకారం అంత్యక్రియలు చెయ్యలేకపోయాం.. మరోసారి ఆ అవకాశం ఇవ్వాలి’ అని కోర్టుని కోరారు అన్నె తల్లిదండ్రులు. కోర్టు అంగీకారంతో.. రెండేళ్ల తర్వాత ఆమె అస్థికలను బయటకు తీసి మరో నాణ్యమైన శవపేటికలో పెట్టి పూడ్చిపెట్టారు. అన్నె అనారోగ్యంతో బాధపడుతుంటే భూతవైద్యం చేసి, తిండిపెట్టకుండా చంపేశారని, తల్లిదండ్రుల ఒత్తిడి, కఠిన నియమాలు, చాదస్తం కారణంగానే అన్నె పిచ్చిదైందనే పలు విమర్శలు వచ్చాయి. సరిగ్గా 37 ఏళ్ల తర్వాత 2013, జూన్ 6న అన్నెలీస్ మిషెల్ నివాసమున్న ఇల్లు అగ్నికి ఆహుతి అయ్యింది. ఎవరూలేని ఇంట్లో మంటలు ఎలా వ్యాపించాయనేది మరో మిస్టరీ. పైగా ఆ మంటల్లో తమకు అన్నెలీస్ ఆత్మ కనిపించిందని స్థానికులు ఫొటోలు, వీడియోలు షేర్ చేయడం సంచలనమైంది. దాంతో ఈ కథ మరోసారి తెర మీద కొచ్చింది. సంఖ్యాశాస్త్రం ప్రకారం.. ఆరవ నెల, ఆరవ తేదీ.. 2013లోని అంకెలు కలిపితే ఆరు, కాబట్టి.. ‘666 అనే నంబర్ దెయ్యాల సంఖ్య’ అంటూ మీడియా కూడా అప్పట్లో ప్రచారం చేసింది. దాంతో అగ్నిప్రమాదానికి కారణం ప్రేతాత్మలేనని కొందరు భయాందోళనలకు గురయ్యారు. మరికొందరు కొట్టిపారేశారు. - సంహిత నిమ్మన చదవండి: Crime Story: తన హత్యకు తానే పథకం వేసుకున్నాడు.. ద్రోహి! -
ఎంతటి దుస్థితి! అఫ్గాన్ మాజీ మంత్రి నేడు డెలివరీ బాయ్గా
అఫ్గానిస్తాన్లో పరిస్థితులు రోజురోజుకు ఆందోళనకరంగా మారాయి. సాధారణ ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఈ భయంతో పక్కదేశాలకు తరలి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సామాన్యులతో పాటు ఆ దేశ రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆ దేశ మాజీ మంత్రి డెలివరీ బాయ్ అవతారమెత్తాడు. మొన్నటి దాక అధికారంలో ఉన్న ఆయన ఇప్పుడు ఇంటింటికి వెళ్లి పిజ్జాలు అందిస్తున్నారు. ఆయనే అఫ్గానిస్తాన్ ఐటీ మాజీ మంత్రి సయ్యద్ అహ్మద్ షా సాదత్. మొన్నటి దాక స్వదేశంలో ఐటీ అభివృద్ధిపై దృష్టి సారించిన సాదత్ ఇప్పుడు విదేశంలో పిజ్జాలు అందించడంపై దృష్టి పెట్టారు. ఈ దుస్థితికి గల కారణాలను ఆయన మీడియాతో పంచుకున్నారు. ‘గతేడాది దేశ అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీతో తనకు విబేధాలు, మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలోనే మంత్రి పదవికి రాజీనామా చేశా. రాజీనామా అనంతరం కొంతకాలం ప్రశాంతంగా జీవనం సాగింది. అనంతరం నా వద్ద ఉన్న డబ్బు ఖర్చయిపోయింది. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో డెలివరీ బాయ్గా చేయాల్సి వచ్చింది’ అని తెలిపారు. సాదత్ ప్రస్తుతం జర్మన్లోని లీప్జిగ్ పట్టణంలో పిజ్జాలు సైకిల్పై డెలివరీ చేస్తున్నారు. ఈ పని చేయడానికి తానేమీ మొహమాట పడడం లేదని పేర్కొన్నారు. సాదత్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అఫ్గానిస్తాన్లో మొబైల్ నెట్వర్కింగ్ అభివృద్ధి చేశారు. మాజీ మంత్రిగా మారిన అనంతరం స్వదేశంలోనే ఉన్నారు. తాలిబన్లు దేశాన్ని ఆక్రమిస్తారని ముందే గ్రహించి తాలిబన్లు ఆక్రమించే వారం రోజుల ముందే జర్మన్కు వచ్చేశారు. ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదురవడంతో కుటుంబ పోషణ కోసం విధిలేక డెలివరీ బాయ్ అవతారం ఎత్తారు. وزير الاتصالات والتكنولوجيا الأفغاني السابق سيد أحمد سادات يلجأ لمهنة توصيل طلبات الطعام على متن دراجة هوائية في مدينة لايبزيغ الألمانية التي وصلها نهاية عام 2020، بعد تخليه عن منصبه pic.twitter.com/zfFERbqCmD — قناة الجزيرة (@AJArabic) August 24, 2021 -
ఈ ఇయర్ ఫోన్స్ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే?
ప్రముఖ జర్మన్-ఆడియో బ్రాండ్ సెన్హెయిసర్ భారతదేశంలో ఇప్పటి వరకు విడుదల చేయని అత్యంత ఖరీదైన ఇయర్ ఫోన్లను లాంచ్ చేసింది. వీటిని ప్రత్యేకంగా ప్రొఫెషనల్ డ్యాన్సర్స్, డిజే ఆపరేటర్స్ కోసం ఐఈ 900 ఇయర్ ఫోన్లను తీసుకొచ్చినట్లు పేర్కొంది. కంపెనీ ఐఈ 900లో సెన్ హీసర్ కొత్త సృజనాత్మక ఎక్స్ 3ఆర్ టెక్నాలజీని ప్రవేశ పెట్టింది. ఈ టెక్నాలజీ వల్ల స్వచ్ఛమైన, సహజ ధ్వనిని ఆస్వాదించవచ్చు. మెరుగైన స్థిరత్వం కొరకు గోల్డ్ ప్లేటెడ్ ఎమ్ ఎమ్ సీఎక్స్ కనెక్టర్లతో సహ ఫీచర్స్ తో ఈ ఇయర్ ఫోన్లు వస్తాయి. సెన్ హీసర్ ఐఈ 900 ఇయర్ ఫోన్ల ధర వచ్చేసి రూ.1,29,900. భారతదేశంలో ఇప్పటి వరకు లాంఛ్ చేసిన అత్యంత ఖరీదైన ఇయర్ ఫోన్లు ఇవే. అయితే, ఈ ఇయర్ ఫోన్లను సెన్ హీసర్ వెబ్ షాప్ లో వీటిని ముందస్తుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. పెద్ద హెడ్ ఫోన్లలో కనిపించే పొందికైన, కళాఖండం లేని "సెన్హీసర్ సౌండ్"ను అందించే ఐఈ 900లో సెన్ హీసర్ తన కొత్త ఎక్స్ 3ఆర్ వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ సిలికాన్ ఇయర్ అడాప్టర్లను, మూడు ఎలాస్టిక్ ఫోమ్ ఇయర్ అడాప్టర్ సెట్లను మూడు విభిన్న సైజుల్లో బండిల్ చేసింది. ఈ ఇయర్ ఫోన్ లు 7 మిమీ ట్రూ రెస్పాన్స్ ట్రాన్స్ డ్యూసర్ ని కలిగి ఉంటాయి. ఇయర్ ఫోన్ లు సింగిల్ డ్రైవర్ సిస్టమ్ తో వస్తాయి. అలాగే ఇందులో అల్యూమినియం చాసిస్ను ఉపయోగించారు. సెన్హెయిసర్ ఇప్పటికే డీజే హెడ్ఫోన్స్, హెచ్డీ 25 మానిటరింగ్ను ఇండియాలో విడుదల చేసింది. -
5,232 మంది హత్యకు సాయం.. రెండేళ్ల శిక్ష
బెర్లిన్: నరకానికి నకళ్ల లాంటి నాజీ క్యాంప్ పేరు చెబితే ఇప్పటికి జర్మన్ ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. యూదుల మీద కోపంతో నియంత అడాల్ఫ్ హిట్లర్ వారిని ఊచకోత కోయడం కోసం ఏర్పాటు చేసిన ఈ క్యాంపుల్లో ఎందరో బలయ్యారు. అయితే నాటి కాలానికి సంబంధించిన నేరాల గురించి నేటికి జర్మనీలో విచారణ జరుగుతుంది. ఈ క్రమంలో చివరి కేసులో జర్మన్ కోర్టు గురువారం తీర్పు వెల్లడించింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ కాన్సంట్రేషన్ క్యాంప్లో సుమారు 5,232 మంది ఖైదీలను, అనేక మంది యూదులను హత్య చేయడానికి సాయం చేసిన 93 ఏళ్ల బ్రూనో డి అనే వ్యక్తిని హాంబర్గ్ కోర్టు దోషిగా తేల్చింది. నాటి నేరాలకు గాను అతడికి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం పోలాండ్లోని గ్డాన్స్క్కు సమీపంలోని స్టుతోఫ్ కాన్సంట్రేషన్ క్యాంప్లో ఎస్ఎస్ బ్రూనో డి గార్డుగా పని చేసేవాడు. ఈ క్రమంలో 1944 ఏప్రిల్ 1945 మధ్య జరిగిన ఈ హత్యలకు బ్రూనో డి సహకరించినట్లు హాంబర్గ్ కోర్టు గురువారం తెలిపింది. ఈ నేరం జరిగినప్పుడు బ్రూనో డి వయసు కేవలం 17, 18 సంవత్సరాలు కావడంతో అతడికి యువత శిక్షా మార్గదర్శకాలకు లోబడి శిక్ష విధించినట్లు కోర్టు తెలిపింది. ఈ క్రమంలో బ్రూనో డి ఆ సమయంలో తాను అక్కడ విధులు నిర్వహిస్తున్నట్లు అంగీకరించాడు. అయితే హత్యలకు సహకరించాల్సి వచ్చిందని.. దానిలో తన తప్పమే లేదని తెలిపాడు. అంతేకాక నాటి నరకంలో ప్రాణాలు కోల్పోయిన వారికి, వారి కుటుంబ సభ్యులకు, మిత్రులకు క్షమాపణ తెలిపాడు. స్టుతోఫ్లో దాదాపు 65 వేల మందిని హత్య చేశారని మ్యూజియం వెబ్సైట్ వెల్లడిస్తుంది. వీరిలో యూదులతో పాటు ఇతరులు కూడా ఉన్నట్లు వెబ్సైట్లో ఉంది. వీరిలో కొందరిని తల వెనక భాగంలో కాల్చి చంపగా.. మరి కొందరి మీద ప్రాణాంతకమైన జైక్లాన్ బీ వాయువు ప్రయోగించి చంపినట్లు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. -
క్లిక్ తెచ్చిన తంటా : 28 టెస్లా కార్లు బుక్
సాక్షి, న్యూఢిల్లీ: టెస్లా కార్లు అంటేనే ఆధునిక టెక్నాలజీకి, విలాసానికి పెట్టింది పేరు. అలాంటిది జర్మనీకి చెందిన ఒక వ్యక్తి ఏకంగా ఒకేసారి 28 టెస్లా కార్లను ఆన్లైన్లో కొనుగోలు చేశాడు. ఆ తరువాత పొరబాటు తెలుసుకుని లబోదిబోమన్నాడు. రెడ్డిట్ సమాచారం ప్రకారం తమ పాత ఫోర్డ్ కుగాను జర్మన్ కు చెందిన వ్యక్తి, అతని తండ్రి ఆటో పైలట్ టెస్లా మోడల్ 3 కారును కొనుగోలు చేయాలని భావించారు. అన్ని వివరాలను నింపి కస్టమర్ చివరికి 'కన్ఫర్మ్' బటన్ను పదేపదే నొక్కేశాడు. దీంతో ప్రతి క్లిక్తో మొత్తం 28 ఆర్డర్లు ఫైనల్ అయిపోయాయి. ఫలితంగా 28 టెస్లా కార్లకు 1.4 మిలియన్ యూరోలు (సుమారు 11.9 కోట్ల రూపాయలు) బిల్లు చూసి కళ్లు తేలేసాడు. అంతేకాదు ప్రతి ఆర్డర్కు కనీసం 100 యూరోల చొప్పున నో రీఫండ్ ఫీజుగా 2,800 యూరోలు కూడా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో బెంబేలెత్తిన సదరు వినియోగదారుడు కంపెనీని ఆశ్రయించాడు. టెస్లా వెబ్సైట్లో సాంకేతిక లోపం కారణంగాఈ పరిణామం చోటు చేసుకుందని రెడ్డిట్ నివేదించింది. చివరికి ఎటువంటి ఛార్జీ లేకుండా మొత్తం ఆర్డర్ను టెస్లా రద్దు చేసింది. మరోసారి కొనుగోలుకు ప్రయత్నించాలని కోరింది. దీంతో జర్మన్ వ్యక్తి ఊపిరి పీల్చుకున్నాడు. -
‘ఆ కోట కింద రూ. 11,617 కోట్ల సంపద’
సాక్షి, న్యూఢిల్లీ : రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా యూరప్ వ్యాప్తంగా నాజీలు దోచుకున్న 28 టన్నుల బంగారం, ఇతర సంపదను 16వ శతాబ్ధానికి చెందిన జర్మన్ కోటలో పాతిపెట్టినట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ నిధి విలువ 1.25 బిలియన్ యుకె పౌండ్ల(రూ.11,617 కోట్లకు పైగా)ని అంచనా వేశారు. నాజీ ఆర్మీ అధికారి ఎస్ఎస్ స్టాండార్టెన్ఫ్యూరర్ ఎగాన్ ఒల్లెన్హౌర్ డైరీలో పేర్కొన్న 11 ప్రదేశాలలో ఆధునిక పోలాండ్లో ఉన్న హోచ్బర్గ్ ప్యాలెస్ ఈ నిక్షేపాలను దాచిన వాటిలో కీలకమని వెల్లడైంది. ఈ డైరీని గత ఏడాదే పరిశోధకులు గుర్తించినట్టు స్పుత్నిక్ న్యూస్ వెల్లడించింది. జర్మన్ నగరం బ్రెలూ నుంచి కొల్లగొట్టిన రూ. 7,000 కోట్లకు పైగా విలువైన రిచెస్బ్యాంక్ గోల్డ్ బార్లు, ఇతర సంపదను ఈ కోట కింద దాచిఉంచవచ్చని ఈ డైరీని స్వాధీనం చేసుకున్న సిలెసియన్ బ్రిడ్జి ఫౌండేషన్ పేర్కొంది. కాగా ఈ డైరీని గత ఏడాది పోలాండ్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు అందచేశామని, ప్రభుత్వం ఇంకా దాన్ని పరిశీలించలేదని ఫౌండేషన్ చీఫ్ రోమన్ ఫర్మనియక్ వెల్లడించారు. నిధుల వ్యవహారాన్ని నిగ్గుతేల్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే క్రమంలో ఈ అంశాలను ఫౌండేషన్ ప్రజల ముందుంచుతోంది. ప్రభుత్వ అనుమతి లేకుండా నిధి కోసం తవ్వకాలు చేపట్టడం, వెలికితీత సాధ్యమయ్యే పనికాదు. ఈ కోట ప్రస్తుత యజమాని నిధుల వెలికితీతకు అనుమతించారని, దోపిడీ దొంగల కన్నుపడకుండా కోట చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి సీసీటీవీ కెమెరాలను అమర్చారని ఫౌండేషన్ వెల్లడించింది. నిధుల్లో బంగారమే కాకుండా మత చిహ్నాలు, పోలండ్, సోవియట్ యూనియన్, ఫ్రాన్స్, బెల్జియం దేశాల నుంచి నాజీలు లూటీ చేసిన విలువైన వస్తువులను దాదాపు 11 ప్రాంతాల్లో దాచినట్టు ఈ డైరీలో వెల్లడైంది. చదవండి : సంక్షోభంలోనూ పెట్టుబడులకు చాన్స్ -
54 రోజులుగా ఎయిర్పోర్ట్లో ఒక్కడే!
న్యూఢిల్లీ: లాక్డౌన్ నేపథ్యంలో జర్మనీకి చెందిన 40 ఏళ్ల వ్యక్తి ఒకరు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. ఎడ్గార్డ్ జీబాట్ అనే జర్మన్ జాతీయుడు 54 రోజులుగా ఒంటరిగా ఇక్కడే ఉండిపోయాడు. మార్చి 18న హనోయి నుంచి ఇస్తాంబుల్కు వెళుతూ అతడు ఇక్కడ చిక్కుబడిపోయాడు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో టర్కీ నుంచి, అక్కడి నుంచి బయలుదేరే అన్ని విమానాలను భారత్ రద్దు చేసింది. నాలుగు రోజుల తర్వాత అన్ని అంతర్జాతీయ విమానాలను నిలిపివేసింది. మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించి కొనసాగిస్తోంది. (కరోనా: ఇటలీలో ఇంత తక్కువ.. ఫస్ట్టైమ్!) ఇతర ప్రయాణికుల మాదిరిగా ఎడ్గార్డ్ జీబాట్ను జర్మనీ రాయబార కార్యాలయానికి అప్పగించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తమ దేశంలో అతడికి నేరచరిత్ర ఉన్నందున అతడిని క్వారంటైన్ను పంపడానికి ఢిల్లీలోని జర్మనీ రాయబార కార్యాలయం నిరాకరించింది. నేర చరిత్ర ఉన్నందున భారత్ కూడా అతడికి వీసా ఇవ్వలేదు. అతడిని స్వదేశానికి పంపే విషయంపై జర్మన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించినా ఇప్పటివరకు స్పందన రాలేదని భారత అధికారులు తెలిపారు. జీబాట్ మార్చిన 18న వియత్నాం నుంచి వీట్జెట్ ఎయిర్ విమానంలో ఢిల్లీ వచ్చాడు. తన గమ్యస్థానానికి వెళ్లే విమానాలన్నీ రద్దు కావడంతో ఇక్కడే ఉండిపోయాడు. అతడితో పాటు ఉన్న ఇద్దరు శ్రీలంక పౌరులు, మాల్దీవులు, పిలిప్పీన్స్కు చెందిన మరో ఇద్దరు పౌరుల గురించి ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు విమానాశ్రయ అధికారులు సమాచారం అందించారు. ఆయా దేశాలు రాయబార కార్యాలయాల ద్వారా వారికి సౌకర్యాలు కల్పించి, వారిని క్వారంటైన్ చేశాయి. (ఫ్రెండ్తో కలిసి పట్టుబడ్డ నటి) జీబాట్ మాత్రం తన లగేజీతో ఎయిర్పోర్ట్లోనే ఉండిపోయాడు. దినపత్రికలు, మేగజీన్స్ చదువుతూ.. కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతూ అతడు కాలక్షేపం చేస్తున్నాడు. తాను కోరుకున్న చోటికి వెళ్లిపోవచ్చని చెప్పినా విమాన సర్వీసులు లేకపోవడంతో అతడు వెళ్లలేకపోతున్నాడని విమానాశ్రయ అధికారులు తెలిపారు. రిలీఫ్ విమానంలో అంకారాకు పంపేందుకు ప్రయత్నించినా టర్కీ అందుకు ఒప్పుకోకపోవడంతో కుదరలేదని వెల్లడించారు. అంతర్జాతీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యే వరకు జీబాట్ నిరీక్షించక తప్పదని స్పష్టం చేశారు. కాగా, జీబాట్తో మాట్లాడేందుకు మీడియా ప్రతినిధులను సెక్యురిటీ సిబ్బంది అనుమతించలేదు. (గుడ్న్యూస్: రేపట్నుంచి రైలు కూత) -
ఇక ఎప్పటికీ ఇంటి నుంచి పనిచేసే హక్కు!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతకమైన కరోనా వైరస్ కారణంగా పలు దేశాల్లోని కంపెనీలు, ముఖ్యంగా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసలుబాటును కల్పించిన విషయం తెల్సిందే. వైరస్ నియంత్రణలో భాగంగా విధించిన లాక్డౌన్ను ఎత్తివేశాక మళ్లీ ఉద్యోగులు తమ ఆఫీసులకు వెళ్లి పని చేయాల్సిందే. అయితే లాక్డౌన్ ఎత్తివేశాక కూడా కోరుకున్న ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే హక్కు కల్పించాలని జర్మనీ నిర్ణయించింది. ఈ మేరకు ఓ బిల్లును రూపొందిస్తున్నామని ఆ దేశ కార్మిక మంత్రి హుబర్టస్ హైల్ మీడియాకు తెలిపారు. (చదవండి : అమెరికా, చైనాల తర్వాతే భారత్..) జర్మనీలో కరోనా కేసులు దాదాపు ఐదు వేలకు చేరుకోవడంతో అన్ని విద్యా సంస్థలను మూసివేశారు. సామాజిక దూరం పాటించాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఐటీ సహా పలు కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసుకునే వెసలుబాటును కల్పించాయి. ప్రస్తుతం జర్మనీలో 25 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తుండగా, 12 శాతం మంది ఆఫీసులకు వెళ్లి పని చేస్తున్నారు. మిగతా వారు ఏమీ లేకుండా సెలవుల్లో గడుపుతున్నారు. వారానికి రెండు, మూడు రోజులు లేదా శాశ్వతంగా ఇంటి నుంచి పనిచేసే వెసలుబాటును ఉద్యోగులందరికి కల్పించే బిల్లును ఈ ఏడాదే పార్లమెంట్కు సమర్పిస్తానని కార్మిక మంత్రి హుబర్టస్ తెలిపారు. దానికి దేశ ఆర్థిక మంత్రి ఓలాఫ్ స్కోల్జా మద్దతు తెలిపారు. అయితే కంపెనీ యజమాని అనుమతించినప్పుడే ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసుకునే హక్కు లభిస్తుందంటూ కార్మిక మంత్రి ఓ మెలిక పెట్టారు. -
ప్రత్యేక విమానంలో జర్మన్ల తరలింపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో చిక్కుకున్న 38 మంది జర్మన్ దేశస్తులను తిరిగి ఆ దేశానికి పంపించేందుకు జర్మనీ కాన్సులేట్ తెలంగాణ ప్రభుత్వం సమన్వయంతో చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీంతో మంగళవారం శంషాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానం ద్వారా వారిని జర్మనీకి తీసుకెళ్లారు. వీరిలో 19 మంది మహిళలు, 17 మంది పురుషులు, మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. జర్మన్లను తరలించేందుకు చెన్నై నుంచి వచ్చిన ఎయిర్ ఇండియాకు చెందిన డ్రీమ్ లైనర్ (బోయింగ్ బీ787–8) విమానం ఏఐ– 3005 ఉదయం 7.32 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. విమానాశ్రయానికి చేరుకున్న జర్మన్లకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. ఆ విమానంలో చెన్నై నుంచి వచ్చిన మరికొందరు జర్మన్లు ఉన్నారు. ఉదయం 9.22 గంటలకు ఈ ప్రత్యేక విమానం హైదరాబాద్ నుంచి ముంబైకు బయల్దేరింది. అక్కడ మరికొంత మంది ప్రయాణికులను తీసుకుని జర్మనీలోని ఫ్రాంక్ఫర్డ్కు వెళ్లనుంది. ఇండిగో మెడికల్ ఎవాక్యుయేషన్ విమానం హైదరాబాద్లో చిక్కుకుపోయిన ఇండిగో విమాన సిబ్బందిని తరలించేందుకు వచ్చిన ప్రత్యేక రెస్క్యూ విమానాన్ని కూడా ఇదే విమానాశ్రయం నుంచి పంపించారు. మార్చి 28 మధ్యాహ్నం ముంబై నుంచి వచ్చిన ఇండిగో మెడికల్ ఎవాక్యుయేషన్ విమానంలో ఎనిమిది మంది ఇండిగో సిబ్బంది ఇక్కడ దిగారు. హైదరాబాద్లో చిక్కుకున్న ఐదుగురు ఇండిగో సిబ్బంది చెన్నైకు బయల్దేరి వెళ్లారు. విమానాశ్రయంలో ఇండిగో సిబ్బందికి స్క్రీనింగ్ నిర్వహించి, వారి సమాచారాన్ని తెలంగాణ ఆరోగ్య శాఖకు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎలాంటి ఆటంకాలూ లేకుండా కొనసాగేందుకు కృషి చేస్తున్నారు. అత్యవసర వస్తువులైన ఔషధాలు, వ్యాక్సిన్లు, మెడికల్ ఎక్విప్ మెంట్, ఫార్మా ముడి పదార్థాలు, రక్షణ పరికరాలు, బ్యాంకు సంబంధిత వస్తువులతో నగరంనుంచి కార్గో సేవలు కొనసాగుతున్నట్లు జీఎమ్మార్ అధికారులు తెలిపారు. -
బోరుబావిలోనే బాలుడు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో బోరు బావిలో పడ్డ మూడేళ్ల బాలుడు సుజిత్ను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 72 గంటలుగా బోరుబావిలోనే ఉన్న బాలుడు.. ప్రస్తుతం 100 అడుగుల లోతులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బోరుబావికి సమాంతరంగా మరో గుంత తవ్వేందుకు ఆదివారం నుంచి ప్రయత్నిస్తుండగా.. తాజాగా ఇందుకోసం జర్మన్ నుంచి తెచ్చిన అత్యాధునిక హెవీ డ్రిల్లింగ్ మెషీన్ను ఉపయోగిస్తున్నట్లు రెవెన్యూ విభాగంకమిషనర్ రాధాకృష్ణన్ తెలిపారు. కెమెరాల ద్వారా పరిశీలించినప్పుడు బాలుడిపై కొంత మట్టి పడినట్లు ఉందని మరో ఉన్నతాధికారి తెలిపారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా మనప్పారై సమీపం నాడుకాట్టుపట్టికి చెందిన ప్రిట్లో ఆరోగ్యరాజ్ (40), కళామేరీ (35) దంపతుల కుమారుడు సుజిత్ శుక్రవారం సాయంత్రం ఆడుకుంటూ చిన్నారి బోరుబావిలో పడిన విషయం తెలిసిందే. ‘సుజిత్ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలుడు క్షేమంగా బయటకు రావాలని ప్రార్థిస్తున్నాను. సహాయక చర్యలపై సీఎంతో మాట్లాడాను’అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. -
ఇండిగో విమానంలో విదేశీయుడి హల్చల్
హైదరాబాద్ : గోవా నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ జర్మనీ దేశస్థుడు హల్చల్ చేశాడు. విమానం బాత్రూమ్లో బట్టలు లేకుండా తిరుగుతున్న ఆ వ్యక్తిని సీఐఎస్ఎఫ్ పోలీసులు గుర్తించారు. దీంతో పైలట్ విమానాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అత్యవసర ల్యాండింగ్ చేశాడు. ఆ వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నాడనే అనుమానంతో.. వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ వ్యక్తి ఉస్మానియా ఆస్పత్రిలో పోలీసుల కళ్లుగప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. -
మన్నించు మిత్రమా
ఒక జర్మన్ యాత్రికుడు చాలా దూరం ప్రయాణించి ఒక ఆధ్యాత్మిక గురువును దర్శించుకునేందుకు వచ్చాడు. ప్రయాణ బడలికలో చికాకుగా ఉన్న అతను విసుగ్గా బూట్లను విప్పి ఒక మూలకు విసిరేసి ఎదురుగా మూసి ఉన్న తలుపును కాలితో బలంగా తన్ని తెరిచి లోపలికి ప్రవేశించి గురువుకు నమస్కరించాడు. గురువు అతనితో ‘‘నీ నమస్కారాలు నాకు అక్కర్లేదు. ముందు వెళ్లి ఆ తలుపునకు, నీ బూట్లకు క్షమాపణ చెప్పిరా’’ అన్నాడు. దానికతను ‘‘తలుపు నకు, బూట్లకు క్షమాపణ చెప్పమంటారేమిటి? వాటికి జీవముందా?’’ అని అడిగాడు. ‘‘తలుపును తన్నినప్పుడు, బూట్లను విసిరేసినప్పుడు వాటికి జీవం లేదు అన్న విషయం నీకు గుర్తుకు రాలేదు. కానీ, నేను వాటికి క్షమాపణ చెప్పమన్నప్పుడు మాత్రం ఆ సంగతి నీకు గుర్తొచ్చిందా? ముందు వెళ్లి వాటికి క్షమాపణ చెప్పిరా. అంతవరకు నేను నీతో మాట్లాడను’’ అన్నాడు. ఒక గొప్ప వ్యక్తిని కలవడానికి ఎంతో దూరం నుంచి వచ్చిన తాను ఇంత చిన్న విషయానికి ఆయనతో మాట్లాడకుండా వెళ్లిపోవడం సమంజసం కాదని గురువు చెప్పినట్లుగా తలుపు దగ్గరకు వెళ్లి నమస్కారం పెట్టి, ‘‘కోపంలో నిన్ను అనవసరంగా తన్ని బాధపెట్టాను. నన్ను మన్నించు’’ అని వేడుకున్నాడు. అలాగే బూట్ల దగ్గరకు వెళ్లి చేతులు జోడించి, ‘‘మిత్రులారా! మిమ్మల్ని ఒక మూలకు విసిరేసి అవమాన పరిచాను. నా తప్పును మన్నించండి’’ అని వేడుకున్నాడు. ఇలా చేసిన వెంటనే అతని మనసులోని అలజడి మాయమై అనిర్వచనీయమైన ప్రశాంతత చోటు చేసుకుంది. క్షమాపణ తంతు ముగించి గురువు వద్దకు వెళ్లి కూర్చున్నాడు. గురువు అతనిని చూసి నవ్వుతూ, ‘‘ఇప్పుడు నాకు బాగుంది. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు అర్థం చేసుకుంటావు. ఇప్పుడు మనం హాయిగా మాట్లాడుకుందాం’’ అన్నాడు. కేవలం మనుషులను మాత్రమే ప్రేమిస్తే సరిపోదు. నిరంతరం ప్రేమలోనే ఉంటూ జీవులను, మనల్ని జీవులుగా ఉంచేవాటినీ ప్రేమించాలి. ప్రేమించగలగాలి. – డి.వి.ఆర్. -
ఆన్ పబ్లిక్ డిమాండ్...
ఎవెలిన్ శర్మ... ఈ జర్మన్ బ్యూటీ గురించి తెలుగు ఆడియన్స్కు అంతగా తెలియదు. కానీ ‘సాహో’ సినిమాలో నటిస్తుండటంతో టాలీవుడ్ ఆడియన్స్కు ఇప్పుడిప్పుడే కాస్త దగ్గరవుతున్నారు. కొందరు నెటిజన్లు ప్రభాస్తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పెట్టమని ఆమెని అడిగారట. ‘‘హాయ్... పబ్లిక్ డిమాండ్. మై హీరో ప్రభాస్తో ఫొటో దిగాను. ఆయన్ని ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేయమని రిక్వెస్ట్ చేశాను. ప్రభాస్ ట్విట్టర్ అకౌంట్ను స్టార్ట్ చేయాలనుకున్నవాళ్లు ఈ పోస్ట్ను రీ ట్వీట్ చేయండి’’ అని సరదాగా అంటూ ప్రభాస్తో దిగిన ఫొటోను షేర్ చేశారు ఎవెలిన్. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శక త్వంలో వంశీ, ప్రమోద్లు నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘సాహో’. ఇందులో శ్రద్ధా కపూర్ కథానాయిక. ఎవెలిన్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ∙ఎవెలిన్ శర్మ, ప్రభాస్ -
నాజీల ‘గాలి’ తీసేశారు..
రెండో ప్రపంచ యుద్ధ కాలం.. అటువైపు.. అరివీర భయంకరమైన నాజీ సైన్యం.. ట్యాంకులు, తుపాకులతో గుంపులు గుంపులుగా.. అచ్చంగా.. బాహుబలి చిత్రంలోని కాలకేయుల్లాగా.. మరి ఇటువైపు.. కేవలం 1,100 మంది కళాకారులు.. వీరి వద్ద తుపాకులు లేవు.. ట్యాంకులు అసలే లేవు.. ఉన్నదల్లా.. సైకిల్ పంపులు.. కలర్ బాక్సులు.. సౌండ్ సిస్టమ్లు.. ఇదేమి చిత్రం.. ఇదేమి యుద్ధం.. ఇంతకీ గెలుపెవరిది? ఘోస్ట్ ఆర్మీ.. రెండో ప్రపంచ యుద్ధంలో వేల మంది అమెరికా, ఇతర మిత్ర దేశాల సైనికుల ప్రాణాలను కాపాడిన సైన్యం.. జర్మనీ సైనికులకు ‘సినిమా’చూపించిన మాయా సైన్యం.. ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేయడం కళాకారులకే సాధ్యం.. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా, మిత్ర దేశాలు దాన్నే తమ ఆయుధంగా మలుచుకున్నాయి. జర్మన్ సైనికులను మభ్యపెట్టడానికి ‘ఘోస్ట్ ఆర్మీ’ని సృష్టించాయి. అధికారికంగా దీన్ని 23వ హెడ్ క్వార్టర్స్ స్పెషల్ ట్రూప్స్గా పిలిచేవారు. ఇందులో పనిచేసేవారి నియామకమంతా రహస్యంగా జరిగింది. న్యూయార్క్, ఫిలడెల్ఫియా ఆర్ట్ స్కూల్స్ నుంచి తమకు కావాల్సిన వారిని ఎంపిక చేసుకున్నారు. వీరిలో మిమిక్రీ ఆర్టిస్ట్స్, చిత్రకారులు, సౌండ్ టెక్నీషియన్లు ఉన్నారు. ఇంతకీ వీరేం చేశారు జస్ట్ మాయ చేశారు.. అసలైన ట్యాంకర్లకు బదులుగా గాలితో నింపిన బెలూన్ టైపు ట్యాంకర్లను తయారుచేశారు. నిజమైన ఆయుధాలుగా భ్రమింపజేసేలా వాటికి రంగులు అద్దారు.. ట్యాంకులు, విమానాలు, శతఘ్నులు ఒకటేమిటి.. ఇలా అన్నీ ‘గాలి’ఆయుధాలను తయారుచేశారు. తమ సౌండ్ బాక్సులతో ఉన్నది వేయి మందైనా.. వేల మంది సైన్యం.. వందల సంఖ్యలో ట్యాంకర్లు వస్తున్న ఎఫెక్ట్ను సృష్టించారు. జర్మన్ సైనికులను లక్ష్యంగా చేసుకుని ఇలా మొత్తం 20 ఆపరేషన్లు చేశారు.. వీళ్ల పని ఒక్కటే.. సైనికుల దుస్తులు వేసుకుని.. అలా పరేడ్ చేసుకుని పోవడమే.. ముందే రికార్డు చేసిన.. ట్యాంకుల సౌండ్లు, వేలాది మంది సైనికుల పరేడ్ ఎఫెక్ట్ వంటి వాటిని భారీ స్పీకర్లతో వినిపించడమే.. అయితే.. ఈ నకిలీ ఆయుధాలు, సౌండ్ ఎఫెక్ట్ల వల్ల.. వందలాది ట్యాంకులతో వేలాది మంది సైనికులు తమ మీదకు దండెత్తి వస్తున్నారంటూ జర్మన్లు హడలిపోయేవారు.. ఉంటున్న స్థావరాలను విడిచి.. పారిపోయేవారు.. అంతేకాదు.. జర్మన్ గూఢచారులకు తెలిసేలా స్థానిక కాఫీ షాపుల్లో కూర్చుని.. వేల సంఖ్యలో అమెరికన్ల సైన్యం దండెత్తి వచ్చేస్తోందంటూ భయపెట్టించేలా మాట్లాడేవారు. ఇలా వీరు తమ గాలి సైన్యంతో వేలాది మంది అమెరికా, మిత్రదేశాల సైనికుల ప్రాణాలను కాపాడారు.. 1945, మార్చి నెల.. ఘోస్ట్ ఆర్మీకి అసలైన పరీక్ష.. రైన్ నదిని దాటి.. జర్మనీలోకి ప్రవేశించాలని అమెరికా, మిత్ర దేశాల సైన్యాలు భావించాయి. జర్మన్ సైన్యాల దృష్టిని మళ్లించడానికి వెంటనే ఘోస్ట్ ఆర్మీని రప్పించాయి. దీంతో వారు ఇక తమ టాలెంట్ చూపించారు. 600 గాలి ట్యాంకులను రంగంలోకి దింపారు. వేల మంది సైనికుల పదఘట్టనల సౌండ్ ఎఫెక్ట్ను వినిపించారు. అంతే.. జర్మన్ సైన్యం దృష్టి.. ఈ రబ్బర్ సైన్యం మీదకు మళ్లింది.. అటు అమెరికా సైన్యాలు అతి తక్కువ ప్రతిఘటనతో విజయవంతంగా రైన్ నదిని దాటేశాయి. ఇక యుద్ధం ముగిసిన తర్వాత ఇందులో పనిచేసిన వారు తమతమ వృత్తుల్లోకి వెళ్లిపోయారు. వీరిలో పలువురు ఆయా రంగాల్లో పేరుప్రఖ్యాతులు కూడా సంపాదించారు. యుద్ధం ముగిసిన చాన్నాళ్ల వరకూ ఈ ఘోస్ట్ ఆర్మీకి సంబంధించిన వివరాలను రహస్యంగా ఉంచారు. ఆ పత్రాలు బయటకి రాలేదు. దాదాపు 40 ఏళ్ల తర్వాత వీరి గురించి ప్రపంచానికి తెలిసింది. నాటి 1100 మంది ఘోస్ట్ ఆర్మీలో ప్రస్తుతం ఓ 50 మంది బతికి ఉన్నారు. 2013లో తీసిన ది ఘోస్ట్ ఆర్మీ డాక్యుమెంటరీలో వీరిని ఇంటర్వ్యూ చేశారు కత్తి కన్నా కలం గొప్పదంటారు.. కానీ వీరంటారు.. కత్తి కన్నా మా ‘కళ’ గొప్పది అని.. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
జర్మనీ అధ్యక్షుడితో మోదీ చర్చలు
న్యూఢిల్లీ: జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్తో భారత ప్రధాని మోదీ విస్తృత చర్చలు జరిపారు. ఐదు రోజుల భారత పర్యటనలో ఉన్న వాల్టర్ను ఢిల్లీలోని సుందర్ నర్సరీలో మోదీ కలిశారు. ‘సుందర్ నర్సరీకి జర్మనీ అధ్యక్షుణ్ని తీసుకెళ్లే గౌరవం నాకు దక్కింది. అనేక అంశాలపై మేం విస్తృత చర్చలు జరిపాం’ అని తర్వాత మోదీ ట్వీట్ చేశారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు ఉన్న మార్గాలపై మోదీ, వాల్టర్లు చర్చించారు. అంతకు ముందు వాల్టర్ ఉప రాష్ట్రపతి వెంకయ్య, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ను కలిశారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లు, సమస్యలపై భారత్, జర్మనీల వైఖరి ఒకేలా ఉందని వెంకయ్య అన్నారు. వెంకయ్యను కలవడానికి ముందు రాష్ట్రపతి భవన్లో వాల్టర్కు ఘన స్వాగతం లభించింది. గురువారం భారత పర్యటనను ప్రారంభించిన వాల్టర్ ఆదివారం చెన్నైలోని మద్రాస్ ఐఐటీలో వాణిజ్య వేత్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సోమవారం మహాబలిపురం ఆలయాన్ని సందర్శిస్తారు. -
జర్మనీ దేశస్థుడిపై నిర్భయ కేసు
హైదరాబాద్: జర్మనీ దేశానికి చెందిన ఓ వ్యక్తి తనను వాట్సాప్లో వేధిస్తున్నాడంటూ నగరానికి చెందిన యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. జూబ్లీహిల్స్లో నివసించే ఓ యువతి(31)కి కొద్ది కాలం క్రితం ఓ ప్రాజెక్టు విషయంలో అదే ప్రాంతంలో ఉన్న బీడీ అగ్రికల్చరల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ న్యూమన్తో పరిచయం ఏర్పడింది. న్యూమన్ తన వాట్సాప్ నంబర్ ద్వారా ఆ యువతికి అసభ్యకర సందేశాలను పంపాడు. దీనిపై ఆమె డిసెంబర్ 19న పోలీసులకు ఫిర్యాదుచేసింది. యువతిని వేధిస్తున్నది జర్మనీకి చెందిన టోర్స్టెన్ రీనర్ న్యూమన్(52)గా పోలీసులు గుర్తించారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 354ఏ, 354డీ కింద క్రిమినల్ కేసులు నమోదుచేశారు. నిందితుడు కూకట్పల్లి సమీపంలోని లోధా టవర్స్లో నివసిస్తున్నట్లు గుర్తించారు. న్యూమన్ రెండ్రోజుల క్రితం కోర్టులో లొంగిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. -
ఇద్దరుమిత్రులు
జర్మనీ ముట్టడిలో ఉన్న ప్యారిస్ నగరం దారుణమైన కరువుకోరల్లో చిక్కుకుంది. ఇళ్ళపైకప్పులో పిచ్చుకలు, బొరియల్లోని ఎలుకలు అంతర్ధానమయ్యాయి. ప్రజలు చేతికేది దొరికితే దాన్ని తింటున్నారు. మాన్సియర్ మోరిసాట్, వృత్తిరీత్యా గడియారాల తయారీదారుడు. ప్రస్తుతమతనికి పనేమీ లేదు.ఒక జనవరి నెల ఉదయసంధ్యారుణ కాంతుల్లో, మోరిసాట్ ప్యాంట్ జేబుల్లో చేతులు దూర్చి, ఖాళీ కడుపుతో ఇరువైపులా చెట్లు బారులుతీరిన దారిలో పెద్దపెద్ద అడుగులేస్తూ నడుస్తున్నాడు. అంతలోఅనుకోకుండా అతనికి మాన్సియర్ సావేజ్ ఎదురుపడ్డాడు.యుద్ధం మొదలవ్వక ముందు–మోరిసాట్ ప్రతి ఆదివారం–చేతిలో వెదురుచువ్వ, వీపున టిన్ బాక్స్ మోసుకొంటూ చేపలు పట్టడానికెళ్ళేవాడు. అతను అర్జెంటూయిల్ కొలంబస్ స్టేషన్లో దిగి, ‘ఇలే మరాంటే’ వరకూ కాలినడకన వెళ్ళేవాడు. అతనికెంతో ఇష్టమైన ఆ ప్రదేశాన్ని చేరీ చేరుకోగానే చేపలుపట్టే పనిలో మునిగిపోయేవాడు. మహదానందంగా ఆ కార్యక్రమాన్ని రాత్రి పొద్దుపోయేదాకా కొనసాగించేవాడు. మాన్సియర్ సావేజ్ లావుగా, బొద్దుగా, పొట్టిగా వుంటాడు. వారిద్దరిమధ్యా మంచి స్నేహానుబంధాలు నెలకొన్నాయి. కొన్నిసార్లు వొట్టి వదరుబోతుల్లా ముచ్చట్లూ, కబుర్లూ చెప్పుకొనేవాళ్ళు. క్రమంగా ఇద్దరిదీ ఒకే మాటగా వారి స్నేహం వృద్ధి చెందింది. ఒకానొక వసంత కాల సమయాన, ‘‘ఈ వాతావరణం చాలా మనోహరంగా వుంది కదూ?’’ మోరిసాట్ అన్నాడు.‘‘ఇంతకు మించిన హాయి ఇంకెక్కడా దొరకదు’’ చెప్పాడు సావేజ్, ఉరకలేస్తున్న పారవశ్యంతో. ఆకులురాలే కాలంలో–మలిసంధ్య పొద్దులో–పడమటిసూర్యుని సింధూరవర్ణం మేఘాలపై పడినప్పుడు, నదీజలము, అరుణత్వం సంతరించుకొంటుంది. ఆ దృశ్యాన్ని పరికించిన ఆ ఇద్దరు మిత్రుల ముఖాలు నూతనకాంతితో మెరిసిపోతాయి. బాటకిరువైపులా బారులుతీరి వున్న చెట్ల ఆకులు, శీతల స్పర్శకు వొంగి వేలాడుతున్నాయి.‘‘ఆహా! ఎంత సుందరమైనదీ దృశ్యం!’’ అని సావేజ్ అన్నప్పుడు, ‘‘బాటకిరువైపులా కొలువుతీరివున్న వృక్షసముచ్ఛయంకన్నా మిన్నగా వుందికదూ?’’ మోరిసాట్ జవాబిచ్చాడు, కళ్ళు పక్కకు తిప్పకుండా. ‘‘మళ్ళీ మనమెప్పుడు కలుసుకుంటామో?’’ అన్నాడు సావేజ్. మాట్లాడుకొంటూ మాట్లాడుకొంటూ, వాళ్ళు ఒక మద్యశాలలోనికి ప్రవేశించారు. ఒక అబ్సెంతియా(ఒక రకమైన మద్యం)సీసా కొని ఇద్దరూ కలిసి తాగి, మరలా వారి నడకను కొనసాగించారు. ఖాళీకడుపుల్లోకి చేరిన మద్యం దాని ప్రభావం చూపిస్తోంది. ఆ రోజు వాళ్ళిద్దరి ముఖాలపైకి చల్లని గాలి సోకుతోంటే చాలా హాయిగావుంది. తాజా గాలి మత్తును వదలగొట్టింది. సావేజ్ హఠాత్తుగా ఆగి, ‘‘మనమక్కడికెళితే?’’ అన్నాడు. ‘‘ఎక్కడికీ?’’‘‘చేపలు పట్టడానికి.’’‘‘ఎక్కడ పట్టాలి?’’‘‘అదే. పాత చోటుకు. ఫ్రెంచి వాళ్ళ సరిహద్దు ప్రాంతానికి. అవి కొలంబస్కు దగ్గర. కల్నల్ డుమౌలిన్ నాకు బాగా తెలుసు. ఔట్పోస్ట్ దాటడానికి మనకు సులువుగా అనుమతి దొరుకుతుంది.’’ ఆ మాటలు విన్న మోరిసాట్ ఆశతో వొణుకుతూనే ‘సరే’నన్నాడు. ఎవరెవరి కర్రా, తాళ్ళు తెచ్చుకోవడానికెళ్ళారు. గంట తరువాత వారు కల్నల్ను అతని విల్లాలో కలిశారు. కల్నల్ నవ్వుతూ వారు కోరిన విధంగా అనుమతి మంజూరుచేశాడు. వారికిచ్చిన రహస్య సంకేతపదాన్ని మననం చేసుకొంటూ నడకసాగించారు. కొంతసేపటికి వారు ఔట్పోస్ట్ దాటిపోయారు. నిర్మానుష్యంగానున్న కొలంబస్ ప్రాంతంగుండా ప్రయాణించి, ద్రాక్ష తోటలకు సరిహదై్దన ‘సీనే’ అనే చోటికి చేరుకొన్నారు. అప్పటికి సమయం పదుకొండు గంటలు.వాళ్ళ కళ్ళముందు కనబడుతున్న అర్జెంటెయిల్ అనే వూరు యుద్ధæభయంతో ఊరు విడిచి జనం పారిపోవడంతో ప్రాణం లేని శవంలా ఉంది. ఎల్తైన ఒర్గెమెంట్, సన్నాయ్స్ పర్వత పాదభాగాన పరచుకొన్న విశాల మైదానాన్ని చిన్నదిగా చేసి చూపుతోంది. కనుచూపుమేర కనిపిస్తున్న ఆ మైదానం ఖాళీగా వుండి, బూడిదరంగుతో, మరుభూమిని తలపిస్తూ ఉంది. ఎదురుగా వున్న కొండలవైపు చూపిస్తూ సావేజ్ ‘‘అదిగో! ఆ కొండమీద కనబడుతున్న వారు కచ్చితముగా ప్రష్యనులే!’’ అంటూ గొణిగాడు. ప్రష్యన్లను ఇదివరకెప్పుడూ వారు చూసుండలేదు. కానీ... వారు గత కొన్ని నెలలపాటు ప్యారిస్ పొరుగున తిష్టవేసి, దోపిడీలు సాగిస్తూ, సామూహిక హత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసి, భయంతో కూడిన ద్వేషభావం వారిద్దరి మనసుల్లో నిండివుంది. ‘‘ఒకవేళ వాళ్ళను మనం కలుసుకొనే పరిస్థితి వస్తే?’’ మోరిసాట్ అన్నాడు. ‘‘మనం కొన్ని చేపలు వాళ్ళకిస్తే సరిపోతుంది.’’ సావేజ్ బదులిచ్చాడు. ‘‘సరే వెళ్దాం పద. అయితే కొంచెం జాగ్రత్తగా వుండటం మంచిది.’’ అంటూ వారు ఒకపక్క ద్రాక్ష తోటల కిందనుండి పాకుతూ, మరోపక్క తమ కళ్ళకూ, చెవులకూ పనిచెబుతూ జాగ్రత్తగా ముందుకు సాగుతున్నారు. వారికి నదీతీరం అల్లంత దూరంలో కనిపించింది. అక్కడకు చేరుకోవాలంటే చిన్న ఖాళీ మైదానాన్ని దాటాలి. వారు వేగంగా పరుగుతీసి, కన్నుమూసి తెరిచేలోగా ఆ బయలుప్రదేశాన్ని దాటేశారు. నదీతీరపు అంచు చేరుకోగానే రెల్లు పొదలమధ్య కొంచెంసేపు దాక్కున్నారు.ఏవైనా అడుగులసవ్వడి వినబడుతుందేమోనని నేలపైన చెవి ఆనించాడు మోరిసాట్. అట్లాంటి శబ్దాలేవీ వినిపించలేదు. తాము తప్ప ఇతరులెవరూ అక్కడ లేనట్టు నిర్ధారణ చేసుకొని, ధైర్యంగా చేపలు పట్టసాగారు. సావేజ్ మొదటి ప్రయత్నంలోనే మంచి గడ్జియన్ చేపను పట్టుకున్నాడు. రెండో సారి మోరిసాట్కు పడింది. ప్రతి నిమిషానికొకసారి అలా రకరకాల చేపలు పడుతునే వున్నాయి. ఆ విధంగా వారిద్దరూ కలసి చాలా చేపలు పట్టారు. వాటినన్నిటినీ చిక్కగా అల్లిన వలలో జారవిడిచారు. చాలా యేళ్ళ తరువాత అలాంటి ఆట ఆడే అదృష్టానికి నోచుకొన్నందుకు వారి మనసులు హర్షాతిరేకంలో ఓలలాడ సాగాయి. సూర్యుడు తన వాడి, వేడి కిరణాలు వారి వీపులమీద కురిపిస్తున్నాడు. ఆ సమయంలో చేపలు పట్టడం తప్ప ఇతర విషయాలను పట్టించుకొనే స్థితిలో లేరు.అంతలో, వున్నట్టుండి ఒక సన్నని ధ్వని వారి చెవులను తాకింది. క్రమంగా పృథ్వీ గర్భంలోంచి వెలువడుతున్నట్టుగా ఉధృతమైంది ఆ ధ్వని. ఏదో బరువు మోస్తూ దడదడమని వస్తున్న బండి చక్రాల శబ్దం వినబడింది. మోరిసాట్ తల వెనక్కి తిప్పి చూశాడు. ఎడమవైపున, నదీతీరానికి దూరంగా కనబడుతున్న మాంట్ వెలారియన్ కొండ శిఖరం వెనుక నుండి తెల్లని పొగ పైకెగబ్రాకుతోంది. మరుక్షణం, భూమి అదిరిపోయేటట్లు, ఒక పెద్దప్రేలుడు సంభవించింది. వెంటనే మరొక ప్రేలుడు.. ఇంకొక్క ప్రేలుడు.. ఇలా వరుస ప్రేలుళ్ళ కారణంగా వెలువడిన పొగ– ప్రశాంతంగా వున్న వినువీధిలోనికి ప్రయాణిస్తూ కారుమబ్బులను సృష్టిస్తోంది. ఎల్తైన కొండ శిఖరం మీదికెగబ్రాకుతోంది. ‘‘వాళ్ళు మళ్ళీ మొదలెట్టారు.’’ సావేజ్ అన్నాడు. దాంతో మోరిసాట్కు కోపమొచ్చింది.‘‘ఎంత మూర్ఖులు వారు! ఒకరినొకరు చంపుకొంటున్నారు’’మాంట్ వెలారియన్ కొండ ఎడతెరిపిలేని ప్రేలుళ్ళతో దద్దరిల్లిపోయింది. ఫిరంగులతో ఇళ్ళు నాశనం చేస్తున్నారు. ఎందరి కలలనో నాశనం చేస్తున్నారు. ఎందరి తీయని ఆశలనో కల్లలు చేస్తున్నారు. ఎందరి సంతోషాలనో చెల్లా చెదరు చేస్తున్నారు. ‘‘ఆ విధంగా వున్నాయి జీవితాలు.’’ సావేజ్ ప్రకటించాడు.‘‘జీవితాలు కాదు. చావులు అను.’’ నవ్వుతూ బదులిచ్చాడు మోరిసాట్. అకస్మాత్తుగా, వారి వెనుకే అడుగుల సవ్వడి కావడంతో ఇద్దరూ వొణికిపోయారు.వెనక్కి తిరిగిచూస్తే.. ఎత్తుగా, గడ్డాలతో, సైనిక దుస్తులు ధరించిన నలుగురు వారి సమీపంలో నిలుచున్నారు. నెత్తిమీద సమతలమైన టోపీలు పెట్టుకొన్నారు. తుపాకీలు గురిపెట్టివున్నారు. దాంతో ఆ ఇద్దరూ తమ చేతుల్లోని కర్ర, తాళ్ళు అప్రయత్నంగా జారవిడిచారు. అవి నదీ ప్రవాహంతో పాటే కొట్టుకుపోయాయి. చూస్తూండగానే, రెండు క్షణాలలో ఆ ఇద్దరూ పడవలోనికి తోయబడ్డారు. ‘ఇలే మరాంటే’కు తీసుకుపోబడ్డారు. ఆ ఇంటి వెనకాల ఎవ్వరూ వుండరేమోననుకొన్నారు. కానీ ఇరవైమంది జర్మన్ సైనికులున్నారు.మోటుగా నిడివైన రోమాలు గల ఒక పెద్ద సైజ్ పర్సనాలిటీ, పంగల కాళ్ళేసుకొని కుర్చీలో కూర్చొని వున్నాడు. పొడవైన పైపును పీల్చుతూ,నోట్లోని పైపు పీలుస్తూ స్వచ్ఛమైన ఫ్రెంచి భాషలో చక్కగా స్పష్టంగా మాట్లాడాడు..‘‘మంచిది. మీ అదృష్టం బాగుంది. చేపలు బాగా పడ్డాయి కదా?’’ అప్పుడొక సైనికుడు చేపలతో నిండి వున్న సంచిని ఆ ఆఫీసరు పాదాలచెంత వుంచాడు. ఆ ఇద్దరిని పట్టుకొని వచ్చేటప్పుడు, అతడు ఆ సంచిని, తేవడం మరచిపోలేదు. చేపలవంక చూస్తూ, ‘‘ఫరవాలేదు. కానీ నేను మీతో వేరే విషయం మాట్లాడాలి. జాగ్రత్తగా వినండి. వెర్రి మొర్రి వేషాలేయొద్దు. మీరు నా దృష్టిలో గూఢచారులు. నన్నూ, నా కదలికలను పరిశీలించడానికి పంపించబడ్డారు. మామూలుగానైతే నేను మిమ్మల్ని పట్టుకొని చంపాలి. చేపలుపడుతున్నట్లు నటిస్తూ మారువేషంలో వుండి మీ పనిని మీరు చేస్తూ, నా చేతిలో పడ్డారు. జరగబోవు పరిణామాల్ని ఎదుర్కోకతప్పదు. యుద్ధమంటే ఇలానే వుంటుంది. మీరు ఔట్పోస్ట్ ద్వారా వచ్చారు. కాబట్టి మీరు వెనక్కెళ్ళేందుకు, మీకివ్వబడిన రహస్య సంకేతపదం నాకు తెలియజేస్తే మిమ్మల్ని వదిలేస్తాను’’ఆ మాటలు విన్న ఆ ఇద్దరు మిత్రుల ముఖాలలో నెత్తురుచుక్క లేదు. ప్రేతకళ వచ్చేసింది. ఇద్దరూ పక్క పక్కనే నిలుచున్నారు. మెల్లగా చేతులు పిసుక్కోవడం ద్వారా కొంచెం భావోద్వేగాలను అణచుకొన్నారు.‘‘మీరు ప్రశాంతంగా మీ మీ ఇళ్ళకెళ్ళొచ్చు. ఈ రహస్యం ఇంతటితో అంతమౌతుంది. మీరు చెప్పకపోతే, కొన్ని క్షణాల్లో చస్తారు. ఆలోచించుకోండి. ఏది కావాలో తేల్చుకోండి.’’వారిద్దరూ నిశ్చలంగా వుండిపోయారు గానీ పెదవి విప్పలేదు. ఆ ప్రష్యను ఏమాత్రం ఉద్రేకపడకుండా శాంతంగానే నదివైపుచేతులు చూపిస్తూ ‘‘ఇక ఐదు నిమిషాలలో మీరు ఆ నది అడుగున సమాధి కాబడతారు.’’ ఆ ఇద్దరి నోటివెంట ఒక్క మాటకూడా బయటికి రాలేదు. ఇక సహనం పోగొట్టుకొన్న ఆ ఆఫీసరు ఏవో ఉత్తర్వులు జారీ చేశాడు. తాను కూర్చున్న కుర్చీకి కొంచెం దూరంగా జరిగాడు. పన్నెండు మంది ముందుకొచ్చి, పొజిషన్ తీసుకొన్నారు.‘‘మీకు ఒకే ఒక నిమిషం టైమిస్తున్నాను. ఒక్క క్షణం కూడా పొడిగించను.’’అప్పుడా ఆఫీసరు ఆ ఇద్దరు ఫ్రెంచి వాళ్ళవద్దకెళ్ళి, మోరిసాట్ భుజమ్మీద చెయ్యివేసి పక్కకు తీసుకెళ్ళాడు. తగ్గుస్వరంతో ‘‘త్వరగా పాస్ వర్డ్ చెప్పు. నీ మిత్రుడేమీ తెలుసుకోలేడు. నిన్ను వదిలేస్తాను. నేనేమీ విననట్టు నటిస్తాను.’’కానీ మోరిసాట్ నోరు విప్పలేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తరువాత సావేజ్ను కూడా తీసుకెళ్ళి అదే ప్రతిపాదన చేశాడు. కాని అతణ్ణుంచీ జవాబులేదు. మరలా వాళ్ళు పక్కపక్కనే నిలుచుండిపోయారు.ఆఫీసరు ఆజ్ఞ ఇచ్చాడు. సైనికులు తుపాకులు పైకెత్తారు.అప్పుడు మోరిసాట్ చూపులు నేలమీద గడ్డిలో పడివున్న చేపల మీదికి మళ్ళాయి. చేపలు గిలగిల కొట్టుకొంటున్నాయి.సూర్యకాంతిలో అవి వెండిలా తళుక్కున మెరిశాయి. మోరిసాట్ హృదయం భారమైంది. ఎంత ప్రయత్నించినా ధారాపాతంగా కారుతున్న కన్నీళ్ళను ఆపుకోలేకపోయాడు.‘‘ఇక సెలవు మాన్సియర్ సావేజ్,’’ తడబడుతూ అన్నాడు.‘‘సెలవు మాన్సియర్ మోరిసాట్, సెలవు‘ బదులిచ్చాడు సావేజ్.ఆపాదమస్తకం వొణుకుతుండగా ఇద్దరూ చేయీ చేయీ కలిపారు. వారి జీవిత అనుభవంతో ప్రోదిచేసుకొన్న సహనం మూలంగా, వారి నరనరాలను నులిమేస్తున్న ప్రాణ భయాన్ని అదుపు చేసుకోగలిగారు. అందుకు వారి మనోశక్తి కూడా తోడ్పడింది. ఆ వెంటనే, ఆఫీసరు ‘ఫైర్’ అంటూ గట్టిగా అరిచాడు. అంతే... పన్నెండు తుపాకులు... ఒకేసారి గర్జించాయి. మాన్సియర్ సావేజ్ వెంటనే ముందుకు పడిపోయాడు. మాన్సియర్ మోరిసాట్, పొడవైనవాడు కాబట్టి కొంచెంగా అటూ ఇటూ వూగుతూ తన మిత్రుని మీద అడ్డంగా పడిపోయాడు. అతని కళ్ళు ఆకాశంకేసి చూస్తున్నాయి. ఆ జర్మను ఇచ్చిన తాజా ఉత్తర్వులననుసరించి, అతని మనుషులు పెద్ద పెద్ద బండరాళ్ళూ, మోకులూ తీసుకొచ్చారు. తాళ్ళతో ఆ ఇద్దరిమిత్రుల కాళ్ళు కట్టేశారు. తాళ్ళ చివర బండరాళ్ళు గట్టిగా బిగించి కట్టి నదివొడ్డుకు మోసుకు పోయారు.ఇద్దరు సైనికుల్లో ఒకరు మోరిసాట్ తల పట్టుకొంటే, ఇంకో సైనికుడు కాళ్ళు పట్టుకొన్నాడు. సావేజ్ను కూడా అదే విధంగానే మరో ఇద్దరు సైనికులు పట్టుకొన్నారు. తరువాత ఆ శవాలను నదిలోకి విసిరేశారు.నదీజలం ఆకాశమంత ఎత్తుకు ఎగిసి పడ్డాయి. కొంచెంసేపటి తరువాత నది నెమ్మదించింది. చిన్న చిన్న అలలు తీరాన్ని తాకి వెళుతున్నాయి. నదినీళ్ళు కొంచెం సేపు ఎర్రని వలయాలుగా అగుపించాయి.ఈ హింసాకాండ జరుగుతున్నంతసేపూ, ప్రశాంతంగా గడిపిన ఆ ఆఫీసరు నవ్వుతూ ‘‘ఇప్పుడు చేపలవంతు’’ అనుకుంటూ, ‘‘విల్ హెల్మ్!’’ అంటూ పిలిచాడు. తెల్లని అప్రాన్ ధరించిన సైనికుడు అతని పిలుపు విని పరుగెత్తుకొంటూ వచ్చాడు. హత్యకు గురైన ఆ ఇద్దరు మిత్రులు పట్టిన చేపలసంచి అతనికిచ్చి..‘‘వెంటనే వీటిని వేయించి తీసుకురా. వీటిని బతికుండగానే వండితే, ఒక అమోఘమైన, రుచికరమైన డిష్ తయారవుతుంది.’’ అని ఆజ్ఞాపించి పైపును తిరిగి అందుకొని పీల్చసాగాడు. ఫ్రెంచి మూలం: గైడీ మపాసా అనువాదం: శొంఠి జయప్రకాష్ -
మేయర్ మెడపై పొడిచేశాడు!
బెర్లిన్: జర్మనీలో ఒక మేయర్పై దాడి జరిగింది. శరణార్థులకు అండగా నిలుస్తున్న ఆయనపై కబాబ్ దుకాణం వద్ద ఓ వ్యక్తి దాడి చేశాడు. సమయానికి కబాబ్ దుకాణం యజమాని సాయంగా రావడంతో ఆయన ప్రాణాలు దక్కాయి. జర్మన్ చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్కు చెందిన క్రిష్టియన్ డెమొక్రటిక్ యూనియన్ నేత, అట్లెనా మేయర్ అండ్రియాస్ హోలెస్టీన్పై సోమవారం సాయంత్రం దాడి జరిగింది. కబాబ్ దుకాణం వద్దకు వచ్చిన అండ్రియాస్ను ఓ వ్యక్తి పలుకరించి.. నువ్వు మేయర్వేనా అని ప్రశ్నించాడు. విదేశీ శరణార్థులకు అండగా ఆయన చేపడుతున్న విధానాలను తప్పుబడుతూ.. పొడవైన కత్తితో మేయర్ మేడపై పొడిచాడు. ఈ దాడి నుంచి కోలుకున్న మేయర్ అండ్రియాస్.. కబాబ్ దుకాణం యజమాని అబ్దుల్లా దిమిర్, అతని కుటుంబసభ్యులు సమయానికి తనకు రక్షణగా రావడం వల్లే తాను బతికి ఉన్నానని, వారే తన ప్రాణాలు కాపాడారని తెలిపారు. -
విసుగెత్తి 100 మంది రోగులను చంపిన నర్సు!
బెర్లిన్: వైద్యం చేయడంలో విసుగెత్తి జర్మనీకి చెందిన ఓ మగ నర్సు ఏకంగా 106 మంది రోగులను పొట్టనబెట్టుకున్నాడు. ప్రాణాంతక మందులను ఇచ్చి వీరిని చంపినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. డెల్మెన్హోస్ట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే నీల్స్ హోగెల్(41) 2015లో ఓ ఇద్దరి రోగులను హత్య చేసి, మరో ఇద్దరిపై హత్యాయత్నం జరిపాడన్న కేసులో అరెస్ట్ అయ్యాడు. అయితే అతను మరిన్ని హత్యలకు పాల్పిడ్డాడని ఆరోపణలు రావడంతో దర్యాప్తు జరిపిన పోలీసులకు విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. మొత్తం 90 మంది రోగులను అతను హతమార్చినట్లు పోలీసులు అదే ఏడాది ఆగష్టులో ప్రకటించారు. దీంతో జర్మనీ కోర్టు హోగెల్కి జీవిత కాల జైలు శిక్ష విధించింది. ఈ కేసు బాధితులు మరింతమంది పోలీసులను ఆశ్రయించడంతో మరోసారి దర్యాప్తు జరిపిన పోలీసులు తాజాగా మరో 16 మందిని కూడా నీల్స్ హోగెల్ చంపినట్లు గురువారం వెల్లడించారు. ఈ హత్యలను 1999-2005లో నీల్స్ పనిచేసిన రెండు ఆసుపత్రిలో జరిపినట్లు తెలిపారు. ఎవరికీ అనుమానం రాకుండా రోగులకు ప్రాణాంతక మందులు ఇంజెక్ట్ చేసి చంపేవాడు. 2005లోనే ఓ రోగికి విషపు ఇంజెక్షన్ ఇవ్వటం గుర్తించిన మరో నర్సు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పుడే నీల్స్ను అరెస్టు చేయగా.. అతనికి కోర్టు ఏడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. ఇవన్నీ వైద్యం చేయడంలో విసుగు చెందే చంపినట్లు నిందితుడు అంగీకరించందని పోలీసులు పేర్కొన్నారు. (నీల్స్ హోగెల్-ఫైల్ ముఖానికి అడ్డుపెట్టుకున్న వ్యక్తి) -
యూపీలో మరో విదేశీ టూరిస్టుపై దాడి
-
దేశ చరిత్రలోనే అతిపెద్ద లైంగిక వేధింపుల కేసు
- జర్మనీలో కలకలం.. 567 మంది బాలురపై కీచకపర్వం బెర్లిన్: ఆస్కార్ ఉత్తమ చిత్రం(2015) ‘స్పాట్లైట్’ గుర్తుందా? బోస్టన్(అమెరికా)లో కొందరు మతగురువులు చర్చిలలో చదివే విద్యార్థులు, పాటలు పాడే బాలలపై లైంగికదాడులకు పాల్పడిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరక్కెక్కిందా సినిమా. సరిగ్గా అలాంటి విషయాలే ఇప్పుడు జర్మనీలో వెలుగుచూశాయి. దీనిని జర్మనీ దేశ చరిత్రలోనే అతిపెద్ద లైంగిక వేధింపుల కేసుగా భావిస్తున్నారు. బెర్లిన్లోని ప్రపంచ ప్రఖ్యాత రెవెన్స్బర్గర్ డోమ్స్పేజెన్ క్యాథలిక్ చర్చి గాయకుల బృందంలోని బాలురపై కొన్నేళ్లుగా జరుగుతున్న దారుణాలు బయటపడటం గమనార్హం. 1945 నుంచి 1990 వరకు ఇక్కడి కోయిర్లోని బాలురు 500మందిపై శారీరక దాడులు, 67 మందిపై లైంగికదాడులు చోటుచేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. పలు ఆరోపణల నేపథ్యంలో చర్చి అధికారులు.. ఉల్రిచ్ వెబర్ అనే లాయర్ను దీనిపై విచారణకు నియమించారు. ఆయన గత ఏడాది మధ్యంతర నివేదిక అందజేశారు. తాజాగా ఆ నివేదికలోని అంశాలు వెలుగులోకి రావడంతో జర్మనీ అంతటా కలకలం రేగింది. దర్యాప్తులో భాగంగా ఆయన బాధితులకు ప్రత్యేకంగా లేఖలు రాసి, వాంగ్మూలం రికార్డు చేశారు. చర్చి గాయకుల బృందం(కోయిర్)లో సభ్యులుగా ఉన్నన్ని రోజులు తాము నరకం చవిచూశామని బాధితులు తెలిపారు. జైలులో మాదిరి చిత్రహింసలు అనుభవించామని వెల్లడించారు. దీనిపై స్పందించిన చర్చి అధికారులకు బాధితులకు పరిహారంగా ఇరవై వేల డాలర్లు చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ దారుణాలపై చర్చి ప్రస్తుత బిషప్ రుడోల్ఫ్ వోడెర్హోల్జెర్ బాధితులకు క్షమాపణలు తెలిపారు. ఈయనకంటే ముందున్న కార్డినల్ గెర్హార్డ్ లుడ్విగ్ ముల్లర్పై పలు ఆరోపణలున్నాయి. ఈ కేసు దర్యాప్తునకు ఆయన ఆటంకం కలిగించటంతోపాటు దీనిపై మీడియా పెద్దదిగా చూపిస్తోందని ఆరోపణలు చేశారు. -
చిన్న ఉద్యోగం ఊడింది... పెద్ద ఉద్యోగం వచ్చింది!
డాగుసరి ఒక దారి మూసుకుపోతే వంద దారులు తెరుచుకునే ఉంటాయనడానికి ఈ డాగిలమే మంచి ఉదాహరణ అదేమిటో చూద్దామా... గ్రెవెల్ అనే పేరుగల ఈ జర్మన్ షెప్పర్డ్ డాగ్ను పోలీసు ఆఫీసర్గా చూడాలని బుజ్జిపప్పీగా ఉన్నప్పటినుంచే దీన్ని పెంచిన వాళ్లు కలలు కన్నారట. వాళ్ల కాళ్లూ వీళ్ల గడ్డాలూ పట్టుకుని లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్లో చిన్న పోస్ట్ ఇప్పించారట. ముద్దొచ్చే ముఖంతో, చిలిపి చేష్టలతో కొత్తాపాతా లేకుండా కలసిపోయి చక్కగా ఆడుకుంటోంది. అయితే, అదే గ్రెవెల్ పాలిట శాపమైంది. అసలు వాచ్ డాగ్ అంటే... కొత్తవాళ్లని చూసి మొరగాలి కదా... ఇదేమో మొరగటం మానేసి తోకూపుకుంటూ ముఖమంతా నాకేస్తూ ఆడుకుంటోందట. చిన్న పిల్ల కదా, పెద్దయ్యాక చూద్దాంలే అని చూసీచూడనట్టు ఊరుకున్నారు పై వాళ్లు. నెలలు గడుస్తున్నకొద్దీ దాని ప్రవర్తన మారకపోగా, మరింత సోషలైజ్ అయిపోతుండడంతో ఇలా లాభం లేదని, దాన్ని కాస్తా ఉద్యోగం నుంచి తప్పించేశారు అధికారులు. అయితే అదే వరంగా మారింది గ్రెవెల్కు. దాని పర్సనాలిటీ చూసి ముచ్చటపడి క్వీన్స్లాండ్ గవర్నర్ పాల్ డీ జెర్సీకి వ్యక్తిగత కాపలాదారు అదేనండీ, అక్కడి భాషలో చెప్పాలంటే వైస్ రీగల్ డాగ్ ఉద్యోగం వరించింది. గవర్నర్ ఆఫీసుకు వచ్చిన వాళ్లని రిసీవ్ చేసుకోవడం, మర్యాదలు చేయడం గ్రెవల్ విధులు. త్వరలోనే గ్రెవెల్ గారు గవర్నర్ అతిథులందరికీ తలలో నాలుకగా మారిపోయింది. అతిథులందరూ గ్రెవెల్ను ప్రత్యేకంగా చూడటం మొదలు పెట్టారు. దాంతో గవర్నర్ వద్ద గ్రెవల్ లెవల్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రత్యేక సమావేశాల్లో, ఆంతరంగిక చర్చల్లో కూడా గ్రెవల్కు స్థానం లభించింది. దానికి కూడా అధికారిక కోట్ తొడిగి మరీ కుర్చీల్లో కూచోబెట్టడం మొదలెట్టారు సిబ్బంది. గవర్నర్ సతీమణి, ఆవిడ స్నేహితులు కూడా దాన్ని ముద్దు చేయడం మొదలెట్టారు. మొత్తం మీద గ్రెవెల్ లెవల్ మరింతగా పెరిగిపోయింది. -
ఏంజెలాతో భేటీలో ట్రంప్ కంపు ప్రవర్తన!
కరచాలనం చేయాల్సిందిగా కోరిన మెర్కెల్ అయినా నిరాకరించిన ట్రంప్.. ఆమె వైపు కన్నెత్తి కూడా చూడని అధ్యక్షుడు న్యూయార్క్: అంతర్జాతీయ నాయకులతో కరచాలనానికి ఎప్పుడూ ముందుండే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. జర్మన్ చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్తో మాత్రం ఒకింత వికృతంగా వ్యవహరించారు. విలేకరుల సమావేశంలో ఆనవాయితీ ప్రకారం ఏంజెలా-ట్రంప్ కరచాలనం చేయాల్సిందిగా విలేకరులు కోరారు. దీంతో ఉత్సాహంతో 'మీరు నాతో కరచాలన చేస్తారా' అని మెర్కెల్ ట్రంప్ను అడిగారు. ట్రంప్ ఆ మాట వినిపించుకోనట్టే వ్యవహరించారు. ఆమె వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ట్రంప్ తీరుతో బిత్తరపోయిన ఆమె ఏం చేయాలో తెలియక ఒకింత తికమకపడ్డారు. ట్రంప్ ఇచ్చిన ఈ షాక్తో ఆమె ఇబ్బందికి లోనైనట్టు ఆమె హవాభావాల్లో స్పష్టంగా కనిపించింది. అమెరికా పర్యటనకు వచ్చిన సందర్భంగా ట్రంప్తో ఏంజెలా భేటీ అయ్యారు. ఓవల్ కార్యాలయంలో వారి భేటీ అనంతరం విలేకరులతో ఫొటో పోజ్ సందర్భంగా ఈ వికృత ఘటన చోటుచేసుకుంది. ట్రంప్ గతంలో అమెరికా పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధాని షింజో అబే, కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడోలతో భేటీ అయిన సందర్భంగా వారితో కరచాలనం చేశారు. అయితే, ప్రవాసులు, శరణార్థుల విషయంలో విభేదాల కారణంగానే ఏంజెలాతో ట్రంప్ అయిష్టంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఆమె గురించి ఒక్క ప్రశంస కూడా చేయకపోగా.. ప్రవాసులు విషయంలో ఆమెకు ట్రంప్ క్లాస్ ఇచ్చినట్టు సమాచారం. -
గగనతలంలో తప్పిన పెను ప్రమాదం
-
ఉగ్రవాద సోదరులు అరెస్టు
బెర్లిన్: ఉగ్రవాదులుగా భావిస్తున్న ఇద్దరు జర్మనీ సంతతికి చెందిన మోరాకో సోదరులను జర్మనీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరికి ఇస్లామిక్ స్టేట్, ‘నుస్రా ఫ్రంట్’ అనే ఉగ్రవాద సంస్థల్లో భాగస్వామ్యం ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో అదుపులోకి తీసుకున్నారు. జర్మనీ పోలీసులు వారిని రచిద్(25), ఖలీద్(24) జర్మన్ సంతతికి చెందిన మోరాకన్లుగా గుర్తించారు. వీరిద్దరూ కూడా 2013లో సిరియాకు వెళ్లి ఉగ్రవాదంలో శిక్షణ తీసుకున్నారని, అనంతరం రచిద్ ‘అల్ నుస్రా’లో చేరాడని అతడిపై ఇప్పటికే కిడ్నాపింగ్, గూఢచర్యం ఆరోపణలు ఉన్నట్లు కోర్టుకు చెప్పారు. ఇస్లామిక్ స్టేట్లో చేరి పలు ఆ సంస్థ చేసిన పలు దాడుల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇక అతడి సోదరుడు ఖలీద్ మాత్రం నేరుగా ఇస్లామిక్ స్టేట్లో చేరి ఉగ్రవాద చర్యలకు పూనుకున్నట్లు స్పష్టం చేశారు. -
అచ్చమైన సోలార్ కారు!
పెట్రోలు కంటే కరెంటు చౌక... సౌరశక్తితో విద్యుదుత్పత్తి చేసుకుంటే మరీ మేలు. ఈ విషయాన్ని జర్మనీ స్టార్టప్ కంపెనీ సోనో మోటార్స్ బాగా అర్థం చేసుకున్నట్లు ఉంది. అందుకే ఈ కంపెనీ సరికొత్త కారునొకదాన్ని డిజైన్ చేసింది. ఫొటోలో కనిపిస్తున్న ఆ కారు మోడల్ను చూస్తేనే విషయం మీకు అర్థమైపోతుంది. అవునండీ... ఇది అచ్చమైన సోలార్ కారు. కారు బాడీపై అన్నివైపులా ఒక పద్ధతి, డిజైన్ ప్రకారం ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ ఎప్పటికప్పుడు విద్యుత్తును ఉత్పత్తి చేసి, దాన్ని బ్యాటరీల్లో నింపుతాయి. ఆరుబయట దీన్ని పార్క్ చేస్తే చాలు. ఈ ప్యానెల్స్ ఒక పూటకు దాదాపు 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. మిగిలిన ఎలక్ట్రిక్ కార్ల మాదిరిగానే దీన్ని చార్జ్ చేసుకోవచ్చు. ఇంకోలా చెప్పాలంటే మీరు రోజుకు 30 కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణించేవారైతే... మీ ఇంధన ఖర్చు జీరో! అంతేకాదు... ఈ కారులో ఏసీ అవసరం లేకుండా గాల్లోని తేమనే నీటిగా మార్చి చల్లటి గాలినిచ్చే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది దుమ్మూధూళి కణాలను కూడా ఫిల్టర్ చేస్తుంది. క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఇప్పటికే దాదాపు రెండు లక్షల డాలర్లు సమకూర్చుకున్న సోనోమోటార్స్ 2018 నాటికల్లా కార్లను మార్కెట్లోకి తెస్తామంటోంది. రెండే మోడళ్లలో లభించే ఈ కార్ల ధరలు... తొమ్మిది నుంచి పన్నెండు లక్షల రూపాయల వరకూ ఉండవచ్చు. -
రోస్బర్గ్ ‘సిక్సర్’...
సీజన్లో ఆరో విజయం తొలిసారి బెల్జియం గ్రాండ్ప్రి టైటిల్ సొంతం టాప్-5లో ఫోర్స్ ఇండియా డ్రైవర్లు స్పా-ఫ్రాంకోర్చాంప్స్ (బెల్జియం): క్వాలిఫయింగ్లో కనబరిచిన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్బర్గ్ ఈ సీజన్లో ఆరో విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన బెల్జియం గ్రాండ్ప్రి ఫార్ములావన్ రేసులో ఈ జర్మన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. 44 ల్యాప్ల ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ఆరంభించిన రోస్బర్గ్ గంటా 44 నిమిషాల 51.058 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. తద్వారా తన కెరీర్లో తొలిసారి బెల్జియం గ్రాండ్ప్రి టైటిల్ను సాధించాడు. 21వ స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్) మూడో స్థానాన్ని పొందగా... రికియార్డో (రెడ్బుల్) రెండో స్థానంలో నిలిచాడు. పదో ల్యాప్లో మాగ్నుసెన్ (రెనౌ) కారు ప్రమాదానికి గురి కావడంతో పది నిమిషాలపాటు రేసును నిలిపివేశారు. భారత్కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టుకు ఈ రేసు కలిసొచ్చింది. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు హుల్కెన్బర్గ్ నాలుగో స్థానంలో, సెర్గియో పెరెజ్ ఐదో స్థానంలో నిలిచి మొత్తం 22 పాయింట్లను సొంతం చేసుకున్నారు. ఈ ఫలితంతో కన్స్ట్రక్టర్స్ చాంపియన్షిప్లో ఫోర్స్ ఇండియా జట్టు 103 పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకింది. సీజన్లోని తదుపరి రేసు ఇటలీ గ్రాండ్ప్రి సెప్టెంబరు 4న జరుగుతుంది. -
రేప్ చేసిన వారి గురించి అబద్ధం చెప్పింది!
మ్యాన్హైమ్: వలస బాధితుల కోసం పోరాటం చేస్తున్న జర్మనీ యువ రాజకీయవేత్త సెలిన్ గోరెన్(25).. గత జనవరిలో వలసదారుల చేతిలోనే అత్యాచారానికి గురైంది. అర్థరాత్రి సమయంలో ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లిన దుండగులు ఆమెపై అత్యాచారం చేశారు. అయితే, ఆ వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లిన సెలిన్.. తనపై అత్యాచారం జరిపిన వారి వివరాలను తప్పుగా వెల్లడించిందట. ఆ సమయంలో పోలీసులతో అత్యాచారానికి పాల్పడిన వ్యక్తుల పోలికలు, భాష తదితర వివరాలను తప్పుగా చెప్పినట్లు ఆమె తాజాగా అంగీకరించింది. అయితే.. అప్పటికే కొలోన్లో నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మహిళలపై జరిగిన సామూహిక అత్యాచారాల నేపథ్యంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న వలసదారులను దృష్టిలో ఉంచుకొనే ఆమె పోలీసులకు అసత్యం చెప్పినట్లు వెల్లడించింది. వాస్తవానికి ఆమెపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులు అరబిక్, పార్సీ భాషను మాట్లాడినట్లు గుర్తించిన సెలిన్.. పోలీసులకు మాత్రం వారు జర్మన్ మాట్లాడినట్లు వెల్లడించింది. జాతివివక్షతతో కూడిన వ్యతిరేకతను దూరం చేయడానికే ఆ సమయంలో అలా అబద్ధం చెప్పినట్లు సెలిన్ వెల్లడించింది. -
రెయిన్బోను చీలుస్తూ విమానం ల్యాండింగ్
డసెల్ డార్ఫ్: జర్మనీలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సాధరణ పరిస్థితులు ఉన్నప్పుడు సురక్షితంగా విమానంలో నుంచి ప్రాణాలతో దిగడమే అద్భుతం అనుకుంటున్న ఈ రోజుల్లో ఏకంగా భీకర గాలుల మధ్య ఓ పైలెట్ విమానాన్ని సురక్షితంగా దించాడు. ఆ గాలి కూడా ఎంత వేగంగా ఉందంటే విమానాన్ని కూడా అమాంతం విసిరేసేంతగా. ఇందులో అసలైన మరో అద్భుతం ఏంటంటే అదే సమయంలో విరిసిన రెయిన్ బో చివరి అంచుమీదుగా చీల్చుకుంటూ పైలెట్ విమానాన్ని దించడం. జర్మనీలోని డసెల్ డార్ఫ్ ఎయిర్ పోర్ట్ లో ఈ సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. అప్పటికే ఆ ప్రాంతంలో తుఫాను వచ్చి వెళ్లిపోయింది. కానీ, బలమైన గాలులు భీకరంగా వీస్తున్నాయి. అదే సమయంలో ప్రయాణీకులతో వచ్చిన జర్మనీ ప్యాసెంజర్ జెట్ విమానం సరిగ్గా రెయిన్ బో చివరి అంచున ఆగింది. అనంతరం దాన్ని చీల్చుకుంటూ రన్ వేపై ముందుకు వెళ్లింది. అత్యంత అరుదుగా కనిపించే ఇలాంటి దృశ్యం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. -
మెరుపుతీగలాంటి బామ్మ
తిక్క లెక్క ఫొటోలో కనిపిస్తున్న జర్మన్ బామ్మగారి పేరు జోహానా కువాస్. వయసు పదహారుకి జస్ట్ డెబ్బయి మాత్రమే ఎక్కువ. అయితేనేం..? జిమ్నాస్టిక్స్లో పదహారేళ్ల పడుచుపిల్లలతో కూడా సై అంటే సై అని పోటీ పడుతుంది ఈమె. సమాంతరంగా నిలిపి ఉంచిన లోహపు చువ్వలను ఆసరా చేసుకుని ఈమె చేసే చిత్రవిచిత్ర విన్యాసాలను చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే! యూట్యూబ్లో ఉంచిన ఈమె వీడియోలను ఇప్పటికే లక్షలాది మంది తిలకించారు. ఆ దెబ్బకు గిన్నెస్బుక్ కూడా ఆమె ప్రతిభాపాటవాలను గుర్తించింది. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జిమ్నాస్ట్గా ఆమె పేరును నమోదు చేసుకుంది. -
'మంటల్లో చస్తావన్నా.. ఆ వీడియోనే చూస్తానన్నాడు'
బెర్లిన్: ఓ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో ఉన్న ఓ వీడియో షాపులో మంటలు షాపంతా వ్యాపించాయి. ఆ పాపులో ఉన్నవారు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. కాగా ఓ క్యాబిన్లో ఉన్న ఓ వ్యక్తి మాత్రం డోర్ లాక్ చేసుకుని పోర్న్ వీడియో చూస్తూ అందులో లీనమైపోయాడు. మంటలు ఆ వ్యక్తి ఉన్న క్యాబిన్కు వ్యాపించాయి. అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసినా.. ఆ గదిలో పొగ కమ్మేసినా అతను దగ్గుతూనే వీడియో చూస్తున్నాడు కానీ బయటకు మాత్రం రాలేదు. మంటలు ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది ప్రమాదంలో చిక్కుకున్న ఆ వ్యక్తిని గుర్తించి బయటకు రావాల్సిందిగా హెచ్చరించారు. అయినా అతను నిరాకరించాడు. ఆ సెక్స్ వీడియో పూర్తిగా చూడనిదే బయటకు రానంటూ లోపలే ఉండిపోయాడు. దీంతో అగ్నిమాపక సిబ్బంది బలవంతంగా అతణ్ని బయటకు తీసుకుని వచ్చారు. ఈ సంఘటన జర్మనీలోని సెయింట్ పౌలీలో జరిగింది. కాగా అతని వివరాలను బయటకు వెల్లడించలేదు. -
ఫుట్బాల్ స్టేడియంలో బాంబు కలకలం
-
ఫుట్బాల్ స్టేడియంలో బాంబు కలకలం
హనోవర్: స్టేడియంలో బాంబు పెట్టారన్న వదంతులతో జర్మనీ, నెదర్లాండ్స్ మధ్య జరగాల్సిన అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్ రద్దయ్యింది. స్టేడియంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తనిఖీల్లో తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం హనోవర్ సిటీలో జర్మనీ, నెదర్లాండ్స్ మధ్య ఫుట్బాల్ మ్యాచ్కు అన్ని ఏర్పాట్లు చేశారు. పారిస్ ఉగ్రవాద దాడులను ఖండిస్తూ స్వేచ్ఛకు ప్రతీకగా ఈ మ్యాచ్ను నిర్వహించాలని తలపెట్టారు. 49 వేల మంది సీటింగ్ సామర్థ్యం ఉన్న ఆతిథ్య స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోయింది, జర్మనీ ఛాన్సలర్ ఏంజిలా మెర్కెల్ కూడా ఈ మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి రావాల్సివుంది. మ్యాచ్ కాసేపట్లో ఆరంభం కావాల్సివుండగా స్టేడియంలో బాంబుదాడి జరగనున్నట్టు కలకలం రేగింది. పోలీసులు వెంటనే రంగంలో దిగి స్టేడియంలోని ప్రేక్షకులను బయటకు తరలించి, స్టేడియంలో క్షుణ్నంగా గాలించారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని, ఎవరినీ అరెస్ట్ చేయలేదని తనిఖీల అనంతరం పోలీసులు ప్రకటించారు. ఫుట్బాల్ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన జర్మనీ ఛాన్సలర్ మెర్కెల్.. మ్యాచ్ రద్దుకావడంతో బెర్లిన్కు వెళ్లిపోయారు. గత శుక్రవారం రాత్రి పారిస్లో జర్మనీ, ఫ్రాన్స్ ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియం బయట ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేసిన సంగతి తెలిసిందే. పారిస్లో పలు ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 129 మంది ప్రాణాలు కోల్పోయారు. -
'ఆ శిశువులను నేనే చంపాను'
బెర్లిన్: దక్షిణ జర్మనీలోని ఓ ఇంట్లో టవల్, పాస్లిక్ బ్యాగుల్లో ఎనిమిది శిశువుల మృతదేహాలు లభ్యమైన ఘటనలో మిస్టరీ విడిపోయింది. ఆ శిశువుల్లో కొందరిని తానే చంపినట్టు కన్నతల్లి అంగీకరించింది. ప్రస్తుతం తమ అదుపులో ఉన్న ఆమెను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మునిచ్, బెర్లిన్కు నడుమ ఉన్న చిన్న పట్టణమైన వాలెన్ఫెల్స్లోని ఓ ఇంట్లో రెండురోజుల కిందట ఎనిమిది శిశువుల మృతదేహాలు టవళ్లు, ప్లాస్టిక్ బ్యాగుల్లో చుట్టిపెట్టి లభ్యమయ్యాయి. కుళ్లిపోయి దుర్వాసన వస్తున్న వాటిని పోస్టుమార్టంకు తరలించి పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ శిశువుల తల్లి అయిన 46 ఏళ్ల ఆండ్రియా జీ అనే మహిళను అరెస్టు చేశారు. కొన్నివారాల కిందట భర్తతో తీవ్రంగా గొడవపడి.. వీడిపోయిన ఆమె ప్రస్తుతం క్రోనాచ్ పట్టణంలో ఓ 55 ఏళ్ల వ్యక్తితో కలిసి నివాసముంటున్నది. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనకు తానే కారణమని, కొందరు శిశువులను తానే చంపానని, మరికొందరు మృతశిశువులు జన్మించారని ఆమె పోలీసులు ముందు వెల్లడించారు. -
బాణసంచా మనదేనట!
పీఛేముడ్ బాణసంచాను చైనావాళ్లు కనిపెట్టారనేది బాగా ప్రచారంలోకి వచ్చిన చరిత్ర. అయితే, చైనావాళ్ల కంటే ముందే భారతీయులే బాణసంచాను కనిపెట్టి ఉంటారని జర్మన్ చరిత్రకారుడు డాక్టర్ గుస్తావ్ ఓపెర్ట్ వాదన. క్రీస్తుశకం 600-900 మధ్యకాలంలో చైనావాళ్లు తొలిసారిగా గన్పౌడర్ను కనిపెట్టినట్లు ఒక అంచనా. నవయవ్వన ఔషధాన్ని తయారు చేసే క్రమంలో చైనా రసవేత్తలు గన్పౌడర్ను తయారుచేశారని చెబుతారు. సాల్ట్పీటర్ (పొటాషియం నైట్రేట్), గంధకం, బొగ్గు కొన్ని నిర్దిష్టమైన పాళ్లలో కలిపి వాళ్లు గన్పౌడర్ను తయారు చేశారు. వేడుకల్లో ఉపయోగించే బాణసంచా మొదలుకొని, యుద్ధాల్లో ఉపయోగించే తుపాకులు, ఫిరంగుల వంటి ఆయుధాలలో దీని వాడుక మొదలైంది. గన్పౌడర్ ఆవిష్కరణ తర్వాత యుద్ధచరిత్రలో పెనుమార్పులే వచ్చాయి. అయితే, క్రీస్తుపూర్వం మూడో శతాబ్దిలోని కౌటిల్యుడి అర్థశాస్త్రంలో గన్పౌడర్కు కీలకమైన సాల్ట్పీటర్ ప్రస్తావన ఉందని, దీనిని చాణక్యుడు ‘అగ్నిచూర్ణం’గా సంబోధించాడని గుస్తావ్ ఓపెర్ట్ శతాబ్దం కిందటే వెల్లడించారు. కేవలం కౌటిల్యుడి అర్థశాస్త్రమే కాదు, వైశంపాయనుడి ‘నీతిప్రకాశిక’లోను, ‘శుక్రనీతి’లోను కూడా దీని ప్రస్తావన ఉండేదని, అప్పట్లో శత్రువులను గందరగోళానికి గురిచేసేందుకు ఎండిన చెట్లబెరడుకు మంటరాజేసి, దట్టంగా పొగవచ్చేలా చేసేందుకు అందులో అగ్నిచూర్ణాన్ని (సాల్ట్పీటర్) వేసేవారని వివరించారు. చైనాలో గన్పౌడర్ ఆవిష్కరణ కంటే ముందే భారతీయులకు దీని ప్రయోజనాలు తెలుసని తన పరిశోధన ద్వారా వెల్లడించారు. -
జర్మనీలో 'కంచె' వేస్తున్నారు
మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ పీరియాడిక్ ఎంటర్టైనర్ 'కంచె'. రెండో ప్రపంచయుద్ధ నేపధ్యంలో భారీగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. హీరో వరుణ్ తేజ్కు మాత్రమే కాదు. దర్శకుడు క్రిష్ కెరీర్లోనూ బిగెస్ట్ హిట్గా నిలిచింది కంచె. ఆకట్టుకునే కథా కథనాలతో పాటు టెక్నికల్గా కూడా అత్యున్నత ప్రమాణాలతో రూపొందిన కంచె సినిమాను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన కంచె సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లను రాబడుతోంది. ఎంతో మంది సినీ విశ్లేషకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాను పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్కు పంపే ఆలోచనలో ఉంది చిత్రయూనిట్. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. కంచె సినిమాను జర్మన్ భాషలోకి అనువదించి అక్కడ కూడా భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. రెండో ప్రపంచయుద్ధ సమయంలో జరిగే ప్రేమకథగా తెరకెక్కిన సినిమా కావటంతో పాశ్యాత్య దేశాల్లో కూడా కంచె సినిమాకు రీచ్ ఉంటుందని భావిస్తున్నారు. టెక్నికల్గా కూడా అంతర్జాతీయ స్ధాయి ప్రమాణాలతో తెరకెక్కటం సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. మరి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న కంచె. జర్మన్ ప్రేక్షకులను ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి. -
ఈ ఏడాదికి జర్మన్ ను కొనసాగించండి: సుప్రీం
న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయాల్లో జర్మన్ భాష కొనసాగింపుపై కేంద్రం పరిశీలన చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. దీనిపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) మూడో భాషగా సంస్కృతాన్ని తప్పనిసరిచేస్తూ మానవ వనరుల శాఖ జారీచేసిన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై విద్యార్థులు తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు విచారణలో భాగంగా మూడో ప్రాధాన్య భాషగా జర్మనీ, గత ప్రభుత్వం చేసుకున్న అవగాహన ఒప్పందం చట్టవిరుద్ధమని అటార్నీ జనరల్ పేర్కొన్నారు. ఇకపై ఆ ఒప్పందాన్ని కొనసాగించలేమని తెలిపారు. అయితే ప్రభుత్వం చేస్తున్న తప్పులకు విద్యార్థులను ఎందుకు బలి చేయాలని న్యాయస్థానం ఈ సందర్భంగా ప్రశ్నించింది. జర్మన్ స్థానంలో సంస్కృతాన్ని ప్రవేశపెట్టడాన్నివచ్చే విద్యా సంవత్సరానికి వాయిదా వేయడంపై వివరణ ఇవ్వాలని సూచించింది. కాగా కేంద్రీయ విద్యాలయాలలో గత కొన్నేళ్లుగా జర్మని భాషను ఒక సబ్జెక్టుగా బోధిస్తున్నారు. అందుకుగాను జర్మనికి చెందిన ఒక సంస్థతో ఆనాటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే జర్మన్ భాషను తొలగించి, సంస్కృతాన్ని పెట్టాలని కేంద్రీయ విద్యాలయాలకు ఆదేశం ఇచ్చింది. విద్యా సంవత్సరం మధ్యలో ప్రభుత్వం ఆదేశాలతో జర్మన్ భాష అభ్యసించే విద్యార్థులకు షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో బాధితు విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. -
కేవీల్లో జర్మన్ స్థానంలో సంస్కృతం
న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయ(కేవీ) పాఠశాలల్లో తృతీయ భాషగా జర్మన్ స్థానంలో ఇకపై సంస్కృతాన్ని బోధించనున్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. జాతీయ అవసరాల దృష్ట్యా కేవీల గవర్నర్ల బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని, అయితే ఇది సంస్కృతాన్ని ప్రోత్సహించేందుకు తీసుకున్నది కాదని, విద్యార్థుల రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు సంబంధించినదని అన్నారు. కేవీల్లో తృతీయ భాషగా జర్మన్ను బోధించడంపై 2011లో కుదిరిన అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై ఇప్పటికే విచారణ ప్రారంభమైందన్నారు. జాతీయ విద్యావిధానంలో ‘త్రి భాషా పద్ధతి’కి వ్యతిరేకంగా ఉన్న ఆ ఒప్పందాన్ని ఎలా కుదుర్చుకున్నారని కేవీ బోర్డు సమావేశంలో ప్రశ్నించామన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆరు నుంచి ఎనిమిది తరగతుల్లో ఉన్న దాదాపు 68 వేల మంది విద్యార్థులపై ప్రభావం చూపనుంది. -
మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి...
సాంకేతికం మీరు కొత్త భాష నేర్చుకోవాలనుకుంటున్నారా? గణితంలో మీ ప్రతిభను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఒక కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. ‘అన్లాక్ యువర్ బ్రెయిన్’ అనే ఈ ఆండ్రాయిడ్ యాప్ రకరకాల భాషలు నేర్పిస్తుంది. చరిత్రను బోధిస్తుంది. దీంతో పాటు రకరకాల పరీక్షలు పెట్టి, మీ గణిత ప్రతిభను మెరుగుపరుస్తుంది. ప్రశ్నకు సరియైన సమాధానం కోసం రెండు నుంచి మూడు సెకండ్ల సమయం ఇస్తుంది. ‘‘ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈ యాప్ ఉపకరిస్తుంది’’ అంటున్నాడు సిమన్. జర్మన్కు చెందిన సిమన్ సెమెండ్ ఈ యాప్ను తయారుచేశాడు. పదసంపద, గణిత ప్రశ్నలతో ప్రస్తుతం ఈ యాప్లో ఉన్నాయి. వీటితో పాటు మరిన్ని కొత్త సబ్జెక్ట్లను రాబోయే రోజుల్లో చేర్చే అవకాశం ఉంది. ఆ యాప్ శక్తిని అంచనా వేయడానికి జర్మనీలోని ‘యూనివర్సిటీ ఆఫ్ పోట్స్డమ్’ కొన్ని పరీక్షలు నిర్వహించింది. ఇందులో 13,285 మంది పాల్గొన్నారు. ఈ యాప్ను ఉపయోగిస్తున్నవారు రెండు వారాల్లో వివిధ సబ్జెక్ట్లలో తమ ప్రతిభను గణనీయంగా మెరుగుపరుచుకున్నట్లు ఈ పరీక్షలో తేలింది. ‘‘ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్నప్పుడు విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. ఎందుకంటే ప్రతి సబెక్ట్కు సంబంధించి గుట్టలు గుట్టలుగా సమాచారం ఉంటుంది. దీంతో ఎక్కడ మొదలుపెట్టాలో వారికి తెలియడం లేదు. కానీ, ఈ ‘అన్లాక్ యువర్ బ్రెయిన్’ యాప్ ఆ అయోమయాన్ని నివారిస్తుంది. సమాచారాన్ని చిన్న చిన్న ముక్కలుగా అందుబాటులో ఉంచి, ఎంచుకున్న సబ్జెక్ట్ మీద అవగాహనకు ఉపకరిస్తుంది’’ అంటున్నాడు సిమన్. మరింకేం... ప్రయత్నించి చూడండి! -
సాకర్ ఫైనల్ సమరం దృశ్యాలు
-
ఆట మీద అధినేత్రి ప్రేమ..!
క్రేజీ ప్రెసిడెంట్ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా గుర్తింపు కలిగిన వ్యక్తి... జర్మన్ చాన్సలర్ ఏంజెలా మోర్కెల్. అత్యంత శక్తియుక్తులతో జర్మనీ వంటి దేశాధినేతగా ఎన్నికై సమర్థంగా ఆ పదవిని నిర్వహిస్తున్న మోర్కెల్కు మరో కోణం ఉంది. అదే ఫుట్బాల్ పిచ్చి. అందుకోసం ఆమె తాను ఉన్న స్థాయిని కూడా కాసేపు పక్కనబెట్టి మరీ ఆటగాళ్లను ఉత్సాహ పరిచింది. అది ఇప్పుడు వార్తలో అంశంగా మారింది. అదేంటో చూద్దాం... ప్రస్తుతం ఫుట్బాల్ ఆటగాళ్ల పండగ జరుగుతోంది. అదే ప్రపంచకప్. బ్రెజిల్లో జరుగుతున్న ఈ ప్రపంచకప్లో హాట్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగింది జర్మన్ జట్టు. తమ జాతీయ టీమ్ ఆడుతున్న తొలి మ్యాచ్కు ప్రత్యేక అతిథిగా హాజరైంది ఏంజెలా. పోర్చుగల్తో తలపడిన ఆ మ్యాచ్లో జర్మన్ జట్టు 4-0తో విజయం సాధించింది. ఇంకేముంది ఏంజెలాకు ఉత్సాహం వచ్చేసింది. మ్యాచ్ జరుగుతున్నంతసేపూ కేరింతలు కొట్టిన ఆమె మ్యాచ్ ముగిశాక టీమ్ డ్రస్సింగ్ రూమ్కు వెళ్లి ఆటగాళ్లను పలకరించింది. అందరికీ అభినందనలు తెలిపి... ఇదే ఆటతీరుతో దూసుకుపొమ్మని ఉద్బోధించింది. ఉన్నట్టుండి ఆమె డ్రస్సింగ్ రూమ్లోకి రావడంతో ఆటగాళ్లే ఆశ్చర్యపోయారు.దేశాధినేత్రి తమతో సరదాగా గడపడం తమకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని వాళ్లు ఎంతో సంతోషంగా చెప్పుకున్నారు.అన్నట్టు...మేడమ్ ఈ విధంగా జర్మన్ ఫుట్బాల్ ఆటగాళ్లతో కలవడం ఇది తొలిసారి కాదట! గతంలో కూడా అనేక సార్లు ఈ విధంగా వాళ్లతో మమేకం అయ్యి ఆటపై, జాతీయ జట్టుపై తనకున్న అభిమానాన్ని చాటుకొందీ జర్మన్ చాన్సలర్. -
ప్రేమ దక్కని తాత్వికుడు
ఇతరత్రా ప్రేమలకిది సందర్భం కాదు. అబ్బాయి తన నుదుటిని అమ్మాయి పాదాలకాన్చి ‘నువ్వు నాక్కావాలి’ అని కన్నీళ్లతో వేడుకునే ప్రేమకు, అమ్మాయి తన శక్తినంతా కూడగట్టుకుని చెయ్యి కందిపోయేలా అబ్బాయి ఆ చెంపా ఈ చెంపా పగలగొడుతూ, ‘‘నువ్వు నా జీవితంలోకి రాకుండా నేన్నొక్కదాన్నీ ఎలా బతికేస్తాననుకున్నావురా బుద్ధిహీనుడా’’ అని రోదిస్తూ మూర్ఛిల్లి పడిపోయే ప్రేమకు ఇది పుట్టినరోజు. అలాగైతే జర్మన్ తాత్వికుడు నీషే ప్రస్తావనకు ఇది సందర్భం కాదేమో. ‘దేవుడు చనిపోయాడు’ అని ప్రకటించినవాడు నీషే! పందొమ్మిదో శతాబ్దపు ఐరోపా ఉలిక్కిపడడానికి ఈ మాట చాలదా! ‘నీషేకు మతి చలించింది’ అన్నారు మతాధికారులు, రాజ్యాధినేతలు. ‘ఏమైనా అనండి, మీ విలువలకు విలువ లేదు, మీ విశ్వాసాలకు విశ్వసనీయత లేదు’ అన్నాడు నీషే. అతడేం చెప్పినా అందులో కవిత్వం ఉండేది. తత్వం ఉండేది. అవి రెండూ ఎవరికీ అర్థమయ్యేవి కావు! ‘‘ఏది నువ్వు కాదో అదే దైవం, అదే ఆదర్శం’’ అనేవాడు నీషే. ‘ఏమిటంటాడూ’ అన్నట్లు చూశారే తప్ప ఎవరూ అతడిని అర్థం చేసుకోలేదు. నిజానికి అతడే అర్థమయ్యే రూపంతో, రంగుతో, రుచితో లేడు. తండ్రికి మతిపోయినట్టే కొడుక్కీ పోయినట్లుంది అన్నారు కొందరు. నీషే తండ్రి మతి స్థిమితం తప్పి ముప్పై ఐదేళ్ల వయసుకే చనిపోయాడు. నీషేకీ అదే గతి పడుతుందనుకున్నారు. పట్టింది కానీ మరీ ముప్పై ఐదేళ్లకు పట్టలేదు. చివరి పదేళ్లూ మానసిక వైద్యుల చుట్టూ తిరిగాక తన 55వ యేట అన్ని విధాలా శల్యమై, శిథిలమై చనిపోయాడు నీషే. నీషే పూర్తి పేరు ఫ్రీడ్రిక్ విల్హెల్మ్ నీషే. ప్రష్యాలో పుట్టాడు. ఫ్రీడ్రిక్ విల్హెల్మ్ అన్నది అప్పటి ప్రష్యా రాజు పేరు. ఆయన పుట్టిన రోజే (అక్టోబర్ 15) నీషే కూడా పుట్టడంతో తండ్రి అతడికి రాజుగారి పేరు జోడించాడు. తర్వాత రాజుగారు మతి చలించి మరణించడం, నీషే తండ్రి, నీషే కూడా మతిస్థిమితం కోల్పోయి చనిపోవడం ఒక చారిత్రక విచిత్రం. పెద్దయ్యాక చూడ్డానికి దున్నపోతు కొమ్ముల్లాంటి బలిష్ఠమైన మీసాలతో కరుకుగా కనిపించేవాడు కానీ... చిన్నప్పుడు నీషే కోమలంగా, కౌమారంలోని బాలికలా ఉండేవాడు. ఆడితే చెల్లితో, లేదంటే బయటి ఆడపిల్లలతో. వాళ్లూ ఖాళీగా లేకపోతే పుస్తకాలు. పోర్టా స్కూల్లో అతడు చదువుకున్నది గ్రీకు, లాటిన్, సైన్స్. బాన్, లీప్జిగ్ యూనివర్శిటీలలో భాషా శాస్త్రం. జీవితంలో పడ్డాక షోపెన్హోవర్ నిరాశావాదం. తర్వాత కొన్నాళ్లు బలవంతంగా సైన్యంలో. అక్కడి నుంచి తప్పించుకుని వచ్చాక బేసిల్ (స్విట్జర్లాండ్) విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా ఉద్యోగం. తర్వాత తన 39 వ ఏట ‘దజ్ స్పేక్ జరతూస్త్ర’ గ్రంథ రచన. దీనర్థం ‘జరతూస్త్ర ఇలా అన్నాడు’ అని. నీషే తను చెప్పదలచుకున్నవన్నీ జరతూస్త్ర చెప్పినట్లుగా చెప్పాడు. జరతూస్త్ర ప్రాచీన పర్షియన్ మత ప్రవక్త. ‘నేను చెబుతాను మీరు వినండి’ అంటే ఎవరూ వినరని అలా ఆ ప్రవక్తను అడ్డం పెట్టుకున్నాడు. ‘సాధనేచ్ఛే చోదకశక్తి’ అన్నది నీషే సిద్ధాంతం. కానీ అతడు మాత్రం తన ప్రేమను సాధించుకోలేకపోయాడు! (చూ: ఆండ్రూ షాఫర్ రాసిన ‘గ్రేట్ ఫిలాసఫర్స్ హూ ఫెయిల్డ్ ఎట్ లవ్’). జీవితమంతా ఒంటరిగానే గడిపాడు నీషే. స్నేహితులు లేరు. బంధువులు లేరు. ఉన్న ఒక్కగానొక్క స్నేహితుడు వాగ్నర్తో గొడవ పెట్టుకుని మాట్లాడ్డం మానేశాడు. వాగ్నర్ అకస్మాత్తుగా ఆస్తికుడిగా మారినందుకు నీషే పడిన గొడవ అది! శారీరకంగా కూడా నీషే బలహీనుడు. ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం. ఒక దశలో అతడు స్త్రీ ప్రేమ కోసం పరితపించాడు. ఒకరి తర్వాత ఒకరుగా నలుగురు అమ్మాయిలను ప్రేమించాడు. తన ప్రేమ విషయం తెలియజేశాడు. ఒక్కరు కూడా అతడి ప్రేమను అంగీకరించలేదు. అందరికన్నా ఎక్కువగా అతడు ప్రేమించినది లూవాన్ సెలోమీ ని. చాలా అందంగా ఉండేది. ఫిన్లాండ్ అమ్మాయి. నీషే రోమ్లో ఉండగా ఆమె పరిచయం అయింది. ‘నిన్ను ప్రేమిస్తున్నా’ అన్నాడు. కానీ ఆమె అతడి రచనలను మాత్రమే ప్రేమించానని చెప్పి, ఒక సాదాసీదా యువకుడిని పెళ్లి చేసుకుని, ఈ తత్వవేత్తను వదిలేసింది. ఆ తర్వాత నీషే ఎవ్వర్నీ ప్రేమించలేదు. పైగా మొత్తం స్త్రీ జాతినే ద్వేషించడం మొదలు పెట్టాడు. స్త్రీలు మనుషులు కాదు.. పిల్లులు, పక్షులు అన్నాడు. వారిని నమ్మకూడదని ప్రబోధించాడు. నీషే భావాలలో కొన్ని నాజీల విశ్వాసాలకు దగ్గరగా ఉండేవి. అందుకేనేమో నీషే మరణించినప్పుడు వీమర్ నగరంలోని ఆయన ఇంటికి వెళ్లి మరీ హిట్లర్ నివాళులు అర్పించాడు. కనీసం ఒక్క అమ్మాయైనా నీషే ప్రేమను అంగీకరించి, బాహువులలోకి తీసుకుని ఉంటే తన స్నేహితుడు వాగ్నర్లా నీషే కూడా నాస్తికత్వం నుంచి ఆస్తికత్వం వైపు మళ్లి ఉండేవాడేమో! -
జర్మన్ పాప్ సింగర్తో... ఆంధ్రా డీజే !
ఎక్స్క్లూజివ్ ‘కాస్మిక్ ఎనర్జీ’ ఆల్బమ్తో పాప్యులరైన జర్మన్ దేశపు పాప్ సింగర్ స్టెల్లాజి...హైదరాబాద్ కుర్రాడు పృథ్వితో జట్టుకట్టింది. వీరిద్దరూ రూపొందించిన సింగిల్ట్రాక్ ఆల్బమ్ బీట్ ద బాక్స్ ఈ నెల 19 న మార్కెట్లోకి వస్తోంది. ఈ నేపథ్యంలో అటు యంగెస్ట్ డీజేగానూ, ఇటు స్టెల్లాతో జోడీ ద్వారానూ టాక్ ఆఫ్ది మ్యూజిక్ ఇండస్ట్రీగా మారిన డీజె పృథ్వితో ‘సాక్షి’ ప్రత్యేకంగా మాట్లాడింది. ఆ విశేషాలు తన మాటల్లోనే... రీమిక్స్ విని విని... నాన్న ఈవెంట్ మేనేజర్గా చేసేవారు. ఆయనకు మ్యూజిక్ అంటే కూడా బాగా ఆసక్తి. ఆ అభిరుచితోనే ‘చిరంజీవి మెగామిక్స్’, ఇళయరాజా పాటలతో‘చలాకీ చిన్నది’ రీమిక్స్ ఆల్బమ్స్ రూపొందించారు. ఆ వర్క్ను దగ్గర నుంచి చూడడం వల్ల నాలో రీమిక్స్ పట్ల ఆసక్తి పెరిగింది. డాడీ చేసే ఈవెంట్లలో పలువురు డీజేల వర్క్ పరిశీలించడం కూడా డీజేయింగ్ై వెపు నన్ను లాగింది. ముందు షాక్ తిన్నా... తర్వాత మెచ్చుకున్నారు డీజే అవుతానంటే నాన్న ముందు షాక్ తిన్నారు. అయితే అప్పటికే నేను ఇంటర్నెట్లో వర్చ్యువల్ డీజే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుని కొన్ని పాటలు మిక్స్ చేశాను. అది 15 రోజుల తర్వాత ఎక్స్పైర్ అయింది. ఈ విషయం చెప్పి నా మిక్సింగ్ చూపించాను. దాంతో కొత్త సాఫ్ట్వేర్ కొనిచ్చారు. ఆ తర్వాత డాడీ ఫ్రెండ్ డీజే అనంత్ నాకు గురువుగా మారారు. గోవాలో తొలి ప్రోగ్రామ్ చేసేటప్పటికి పదేళ్లే కావడంతో యంగెస్ట్ డీజే అని పేరొచ్చింది. ఫ్యాషన్ షోస్కి స్పెషల్... చండీఘడ్ నుంచి కొచ్చిన్ దాకా పలుప్రాంతాల్లో డీజేయింగ్ చేశాను. పబ్స్, క్లబ్స్, ఈవెంట్స్... చేసినా ‘ఫ్యాషనాలజీ’, ఇండియా లైఫ్స్టైల్ -బ్రైడల్ షో, ఫ్యాషన్ ఎట్ ఫౌండేషన్ షో... ఇలా ఎక్కువ ఫ్యాషన్ ఈవెంట్లకి చేయడంతో ఫ్యాషన్ షోస్కి బ్రాండ్ అంబాసిడర్లా మారాను. రెండేళ్ల క్రితం ‘మాస్టర్ బ్లాస్ట్’ ఇంటర్నేషనల్ ఆల్బమ్ రిలీజ్ చేశాను. ‘లాగిన్’ హిందీ మూవీలో మూడు పాటలకు అఫీషియల్ రీమిక్స్ చేశా. నా అభిమాన సంగీత మాంత్రికుడు ఏఆర్ రహ్మాన్వి 37 పాటలు కలిపి ఆరు నిమిషాల రహ్మాన్ మాషప్ చేశాను. అలాగే జర్మన్ సింగర్ స్టెల్లాజి చేసిన కాస్మిక్ ఎనర్జీ ఆల్బమ్ లోని క్యాట్వాక్, వీనస్పవర్ ట్రాక్స్ రీమిక్స్ చేశా. ఇంటర్నెట్లో నా మిక్సింగ్ వర్క్ చూసిన స్టెల్లా ‘ఇద్దరం కలిసి సింగిల్ట్రాక్ చేద్దామా’ అని ఫేస్బుక్లో మెసేజ్ పెట్టింది. అంత పెద్ద సింగర్ ఆఫర్ కావడంతో చాలా హ్యాపీగా ఫీలయ్యాను. వెంటనే ఓకె అన్నా. మేమిద్దరం చేసిన ట్రాక్తో ఆల్బమ్ను ఈ నెలలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం. ఆ పాటలో కొన్ని ర్యాప్ బిట్స్ పాడాను. తొలిసారిగా మనదేశంలో నా వయసు డీజేతో పాప్ సింగర్ చేయడం ఇదే ఫస్ట్. ప్రపంచస్థాయి లక్ష్యం... స్టడీస్ విషయానికొస్తే టెన్త్ పూర్తిచేశా. ప్రైవేట్గా కాలేజీచదువు కొనసాగించాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఇంట్లోనే స్టూడియో సెటప్ కూడా చేసుకున్నా. డీజేయింగ్కు ఇండియాలో మంచిఫ్యూచర్ ఉంది. ఇప్పుడు సినిమా పాటల్ని రీమిక్స్ చేసేందుకు డీజేలనే సంప్రదిస్తున్నారు. నా ఆదాయంలో అత్యధిక భాగం ఛారిటీకి ఖర్చు చేస్తున్నాను. మనీ కాదు మ్యూజిక్లో మంచి పేరు తెచ్చుకోవాలి. ప్రపంచం గుర్తించే డీజే కావాలి. అదే నా ఆశయం. - ఎస్.సత్యబాబు