Goldman Sachs
-
ప్రభుత్వ మూలధన వ్యయాలు తగ్గుతాయ్!
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో మూలధన వృద్ధికి కోత పెట్టే అవకాశం ఉందని విదేశీ బ్రోకరేజ్ గోల్డ్మన్ శాక్స్ అంచనా వేసింది. మార్చితో ముగిసే 2024–25 వార్షిక బడ్జెట్లో మూలధన వృద్ధి రేటు 17 శాతం అయితే, రానున్న 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి రేటు 7 శాతానికి పరిమితం కావచ్చని విశ్లేషించింది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును 4.5 శాతానికి (2024–25లో 4.9 శాతం) కట్టడి చేయడమే లక్ష్యంగా కొత్త బడ్జెట్లో మూలధన వ్యయాలకు కోత పెట్టే వీలుందని పేర్కొంది. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే..ఇదీ చదవండి: ఎలాన్ మస్క్ చేతికి టిక్టాక్..?లోక్సభలో బీజేపీకి మెజారిటీ సీట్లు రాని నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు, సంక్షేమ పథకాలకు బడ్జెట్ నిధులు కేటాయింపు పెరిగే అవకాశం ఉంది. సెప్టెంబరు త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 11 త్రైమాసిక కనిష్ట స్థాయి 5.4 శాతం తగ్గుదలకు ప్రభుత్వ మూలధన వ్యయాల్లో తగ్గుదల ఒక కారణం. ఆర్బీఐ ద్రవ్య పరపతి కఠిన విధానమూ ఇందుకు దారితీసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తవనున్న నేపథ్యంలో వచ్చే బడ్జెట్ దీర్ఘకాలిక ఆర్థిక విధానం గురించి కూడా విస్తృత స్థాయిలో చర్చించే వీలుంది. ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించే తయారీ, సూక్ష్మ, లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఆయా రంగాలకు రుణ లభ్యత, గ్రామీణ గృహ నిర్మాణాలకు ప్రోత్సాహం, ధరల స్థిరత్వానికి ఫుడ్ చైన్ పటిష్టత వంటి అంశాలపై బడ్జెట్ దృష్టి సారించే వీలుంది. -
వొడాఫోన్కు గోల్డ్మన్ శాక్స్ షాక్
న్యూఢిల్లీ: టెలికం రంగ కంపెనీ వొడాఫోన్ ఐడియా మార్కెట్ వాటా రానున్న 3–4 ఏళ్ల కాలంలో తగ్గుతూనే ఉంటుందని బ్రోకరేజీ సంస్థ గోల్డ్మన్ శాక్స్ తాజాగా అభిప్రాయపడింది. వొడాఫోన్ ఐడియా ఇటీవల చేపట్టిన మూలధన సమీకరణ సానుకూల అంశమే అయినప్పటికీ మార్కెట్ వాటా కోల్పోవడాన్ని అరికట్టబోదని గోల్డ్మన్ శాక్స్ పేర్కొంది. రానున్న 3–4 ఏళ్లలో 300 బేసిస్ పాయింట్ల(3 శాతం)మేర మార్కెట్ వాటాకు కోత పడనున్నట్లు అంచనా వేసింది. ఈ సందర్భంగా పెట్టుబడి వ్యయాలు, ఆదాయ మార్కెట్ వాటా మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని ప్రస్తావించింది. వొడాఫోన్ ఐడియాతో పోలిస్తే ప్రత్యర్ధి కంపెనీలు 50 శాతం అధికంగా పెట్టుబడులను వెచి్చస్తున్నట్లు పేర్కొంది. ఇటీవల నిధులను సమీకరించడం ఈ టెలికం కంపెనీకి సానుకూల అంశమేనని, అయితే మార్కెట్ వాటా బలహీనపడటాన్ని నివారించలేదని విదేశీ బ్రోకింగ్ సంస్థ వ్యాఖ్యానించింది. వెరసి సానుకూల ధోరణితో చూస్తే షేరు అంచనా విలువను రూ. 19గా పేర్కొంది. ప్రస్తుత రేటు(గురువారం ముగింపు)తో పోలిస్తే 26 శాతం అధికమైనప్పటికీ బేస్కేసుగా చేసిన మదింపుతో చూస్తే మాత్రం 83 శాతం పతనంకావచ్చని తెలియజేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26) నుంచి వొడాఫోన్కు సర్దుబాటుచేసిన స్థూల ఆదాయ(ఏజీఆర్) స్పెక్ట్రమ్ సంబంధ చెల్లింపులు ప్రారంభంకానున్నట్లు తెలియజేసింది. వీటిలో కొంతమేర బకాయిలను ఈక్విటీగా మార్చుకునేందుకు ప్రభుత్వానికి అవకాశమున్న విషయాన్ని ప్రస్తావించింది. అయితే ఫ్రీక్యా‹Ùఫ్లో స్థితికి చేరేందుకు ఏఆర్పీయూ రూ. 200–270కు జంప్చేయవలసి ఉన్నట్లు అంచనా వేసింది. సమీపకాలంలో ఇది జరిగేందుకు అవకాశాలు తక్కువేనని అభిప్రాయపడింది. టారిఫ్ల పెంపు, పెట్టుబడుల సమీకరణ నేపథ్యంలోనూ 2025 మార్చికల్లా నికర రుణభారం– నిర్వహణ లాభం(ఇబిటా) నిష్పత్తి మెరుగుపడకపోవచ్చని వివరించింది. ఈ నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా షేరు బీఎస్ఈలో 11.5% పతనమై రూ. 13.36 వద్ద ముగిసింది. -
వందలాది ఉద్యోగులను వదిలించుకోనున్న ప్రముఖ బ్యాంక్
ప్రముఖ అంతర్జాతీయ బ్యాంక్ గోల్డ్మన్ సాచ్స్ గ్రూప్ రానున్న వారాల్లో కొన్ని వందల మంది ఉద్యోగులను వదిలించుకోవాలని యోచిస్తోంది.తక్కువ-పనితీరు గల సిబ్బంది వార్షిక తొలగింపులో భాగంగా దీన్ని అమలు చేయబోతోందని ఈ విషయం గురించి తెలిసిన వ్యక్తులను ఉటంకిస్తూ బ్లూమ్బర్గ్ నివేదించింది.తాజా తొలగింపులతో కలుపుకొంటే 2024 ఏడాదిలో మొత్తంగా 3 నుంచి 4 శాతం సిబ్బంది ఉద్యోగాలు కోల్పోతారు. వీటిలో చాలా చాలా వరకు ఏడాది ప్రారంభంలోనే జరినట్లు తెలుస్తోంది. ఖర్చులను తగ్గించుకోవడంతోపాటు కొత్త ప్రతిభను చేర్చుకోవడానికి వీలుగా బ్యాంక్ ఈ చర్యలకు పూనుకుంటోంది. ఉద్యోగుల పనితీరు వార్షిక సమీక్షను కోవిడ్ సమయంలో తాత్కాలికంగా నిలిపేసిన బ్యాంక్ తిరిగి అమలు చేస్తోంది.గోల్డ్మ్యాన్ సాచ్స్ గ్రూప్ ఏడాది మధ్యలో 44,300 మందిని నియమించుకుంది. సిబ్బందికి సంబంధించిన బ్యాంక్ వార్షిక సమీక్ష సాధారణంగా జరిగే ప్రామాణిక ప్రక్రియ అని కంపెనీ ప్రతినిధి తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉండాలని కంపెనీ యోచిస్తోందని వివరించారు. -
అప్పటికల్లా 10 కోట్ల మంది ధనికులు! అంతా లగ్జరీనే..
దేశంలో ధనికుల జనాభా వేగంగా పెరగుతోంది. వచ్చే నాలుగేళ్లలో 10 కోట్లకు చేరుకుంటుందని తాజాగా విడుదలైన ఓ నివేదిక వెల్లడించింది. వినియోగదారుల పోకడలు, సంపద గతిశీలతను పునర్నిర్మించడంలో ఇప్పటికే కీలక పాత్ర పోషించిన వీరు.. రానున్న రోజుల్లో లగ్జరీ వస్తువులు, నివాసాల కొనుగోలు, స్టాక్ మార్కెట్పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతారని ఆ నివేదిక పేర్కొంటోంది. ‘ది రైజ్ ఆఫ్ అఫ్లుయెంట్ ఇండియా’ పేరుతో గోల్డ్మన్ శాక్స్ తాజాగా విడుదల చేసిన నివేదిక భారత్లో ధనికుల జనాభా 2027 నాటికి 10 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం దేశంలో ధనికుల జనాభా 6 కోట్లుగా ఉంది. అంటే నాలుగేళ్లలో 67 శాతం పెరుగుతుందని ఈ నివేదిక పేర్కొంది. ఇలా 10 కోట్లకు పైగా ధనికులు ఉన్న దేశాలు ప్రపంచవ్యాప్తంగా 14 మాత్రమే ఉన్నాయి. ధనికులంటే.. వార్షిక ఆదాయం 10,000 డాలర్లు (ప్రస్తుత మారక విలువ ప్రకారం సుమారు రూ.8.3 లక్షలు) అంతకంటే ఎక్కువ ఉన్నవారిని గోల్డ్మన్ శాక్స్ నివేదిక ధనికులుగా నిర్వచించింది. దేశంలో ప్రస్తుతం పనిచేస్తున్నవారి జనాభాలో 10 వేల డాలర్లు సంపాదిస్తున్నవారు 4 శాతం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. -
యాపిల్ కార్డులు నిలిపివేయనున్న దిగ్గజ సంస్థ.. కారణం ఇదేనా?
గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మన్ సాక్స్తో కలిసి యాపిల్ సంస్థ యాపిల్కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ కార్డ్ని అమెరికన్ ఎక్స్ప్రెస్కు బదిలీ చేయడానికి గోల్డ్మన్ సాక్స్ మంతనాలు జరుపుతుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. దాంతో వారి భాగస్వామ్యాన్ని రద్దు చేసుకోవాలని యాపిల్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా రెండు సంస్థలు ఈ విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. కొన్ని మీడియా కథనాల ప్రకారం వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. యాపిల్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మన్ సాక్స్తో కలిసి వచ్చే 12-15 నెలల్లో యాపిల్ కార్డు నిలిపేయనుంది. 2019లో ప్రారంభించిన క్రెడిట్ కార్డ్ సేవలతోపాటు ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టిన పొదుపు ఖాతాలను యాపిల్ గోల్డ్మన్ సాక్స్తో కలిసి నిర్వహిస్తోంది. అయితే యాపిల్కార్డును అమెరికన్ ఎక్స్ప్రెస్కు బదిలీ చేయాలని గోల్డ్మన్ సాక్స్ భావిస్తున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. దాంతో తమ భాగస్వామ్యాన్ని రద్దు చేయమని కోరుతూ యాపిల్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఆగస్టులో యాపిల్ తన వినియోగదారులకు అధిక ఈల్డ్ ఇచ్చే పొదుపు ఖాతాలు ప్రారంభించింది. అది యాపిల్కార్డుకు అనుసంధానం చేసింది. అందులో దాదాపు రూ. 83 వేల కోట్ల డిపాజిట్లను సేకరించింది. దానికి 4.15 శాతం ఈల్డ్ అందిస్తుంది. గోల్డ్మన్ సాక్స్తో 2029 వరకు ఈ ఒప్పందం ఉంది. కానీ ప్రస్తుతం నెలకొన్ని అనిశ్చిత పరిస్థితుల ద్వారా ఈ డీల్ను రద్దుచేసుకోవాలని యాపిల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సేవింగ్స్ ఫీచర్ను ప్రవేశపెట్టినప్పటి నుంచి 97 శాతం మంది కస్టమర్లు రోజువారీ నగదును వారి ఖాతాల్లో జమ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు యాపిల్ తెలిపింది. ఇదీ చదవండి: రద్దు చేసి 6 నెలలవుతున్నా ఇంకా ప్రజలవద్ద రూ.9,760 కోట్లు! యాపిల్ అమెరికాలో ‘బైనౌ..పే లేటర్’ విధానాన్ని మాస్టర్కార్డ్ ఇన్స్టాల్మెంట్స్ ప్రోగ్రామ్తో కలిసి ప్రారంభించింది. గోల్డ్మన్ సాక్స్ ఆ మాస్టర్కార్డ్ చెల్లింపుల క్రెడెన్షియల్స్ను జారీ చేస్తోంది. -
స్థానిక అభివృద్ధికి గోల్డ్మన్ సాచ్స్ తోడ్పాటు
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ అక్షరాస్యత, మహిళా ఎంట్రప్రెన్యూర్లకు చేయూత, స్థానిక విక్రేతలతో ఒప్పందాలు వంటి వాటి ద్వారా గోల్డ్మన్ సాచ్స్ సంస్థ స్థానిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కె.తారకరామారావు అన్నారు. గోల్డ్మన్ సాచ్స్ వంటి దిగ్గజ సంస్థల కార్యాలయాల ఏర్పాటుతో హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాతీయ సంస్థల ఏర్పాటు, భాగస్వామ్యాలకు అవకాశాలు మరింత మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా పెట్టుబడులు, బ్యాంకింగ్, సెక్యూరిటీలు, పెట్టుబడుల నిర్వహణ రంగాల్లో పేరొందిన గోల్డ్మన్ సాచ్స్ గురువారం ఇక్కడి నాలెడ్జ్ సిటీలో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయం ‘ఓపెల్’ను కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్లో ఉన్న అంతర్జాతీయ కంపెనీలు, స్టార్టప్ల వాతావరణం మరింత బలోపేతం కావడంతోపాటు స్థానిక నైపుణ్యానికి అంతర్జాతీయ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. తమ సంస్థ రెండు దశాబ్దాల అంతర్జాతీయ ప్రస్థానంలో హైదరాబాద్, బెంగుళూరు అంతర్భాగంగా ఉన్నాయని గోల్డ్మన్ సాచ్స్ ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రిచర్డ్ నోడ్ అన్నారు. కార్యక్రమంలో గోల్డ్మన్ సాచ్స్ గ్లోబల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గుంజన్ సమ్తానీ, ఐటీ, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యాలయంలో 2,500 మందికి వసతి ఇంజనీరింగ్, ఫైనాన్స్, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్, కన్జూమర్ బిజినెస్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ తదితర రంగాలకు సంబంధించిన కార్యకలాపాల కోసం గోల్డ్మన్ సాచ్స్ 2021లో హైదరాబాద్లో కార్యాలయాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం 1,500 మంది నిపుణులు ఇక్కడ పనిచేస్తుండగా తాజాగా నాలెడ్జ్ సిటీలోని సలార్పురియా సత్వ నాలెడ్జ్ పార్క్లో 3.51 లక్షల చదరపు అడుగులలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. దీనిలో 2,500 మంది నిపుణులు కూర్చునేందుకు అనువైన ఆధునిక వసతులు ఉన్నాయి. -
హైదరాబాద్లో గోల్డ్మెన్ సాక్స్ విస్తరణ ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: బ్యాంకింగ్, ఫైనాన్స్ సేవలు, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగాల్లో హైదరాబాద్ను అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే ప్రపంచ ఆర్థిక బ్యాంకింగ్ ఫైనాన్స్ సేవల్లో పేరొందిన మాస్ మ్యూచువల్, హెచ్ఎస్బీసీ, స్టేట్ స్ట్రీట్, బెర్కాడియా వెల్స్ఫార్గో, జేపీ మోర్గాన్ వంటి కంపెనీలు హైదరాబాద్లో పెద్దఎత్తున తమ కార్యకలాపాలు విస్తరించాయన్నారు. గోల్డ్మెన్ సాక్స్ విస్తరణ ప్రణాళికలతో బీఎఫ్ఎస్ఐ రంగంలో హైదరాబాద్ స్థానం మరింత బలోపేతం అవుతుందని కేటీఆర్ తెలిపారు. విస్తరణ ప్రణాళికలో భాగంగా 2,500 మంది అత్యంత నైపుణ్యం కలిగిన యువకులకు ఉద్యోగాలు లభిస్తాయంటూ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్తో న్యూయార్క్లోని గోల్డ్మెన్ సాక్స్ కంపెనీ కేంద్ర కార్యాలయంలో సంస్థ చైర్మన్, సీఈఓ డేవిడ్ ఎం.సోలమన్ బృందంతో బుధవారం జరిగిన సమావేశం అనంతరం కంపెనీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న వెయ్యిమంది ఉద్యోగుల సంఖ్యను రెండు రెట్లు పెంచి మరో రెండు వేల మంది నిపుణులకు అదనంగా ఉద్యోగ అవ కాశాలు కల్పిస్తుంది. దీనికోసం సుమారు మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కార్యాలయాన్ని విస్తరిస్తుంది. సంస్థ బ్యాంకింగ్ సేవలు, బిజినెస్ అనలిటిక్స్, ఇంజనీరింగ్ వంటి వివిధ రంగాల్లో గోల్డ్మెన్ సాక్స్ సంస్థ కార్యకలాపాల బలోపేతానికి ఈ నూతన కేంద్రం పనిచేస్తుంది. సంస్థ కార్యకలాపాలకు అనుగుణంగా కావాల్సిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ విభాగాల్లోనూ హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న నూతన కార్యాలయం ప్రధానంగా దృష్టి సారిస్తుందని గోల్డ్మెన్సాక్స్ సంస్థ తెలిపింది. -
గోల్డ్మాన్ సాచెస్లో 125 మంది మేనేజింగ్ డైరెక్టర్ల తొలగింపు?
అంతర్జాతీయ ఆర్ధిక సేవల సంస్థ గోల్డ్మాన్ సాచెస్ కీలక నిర్ణయం తీసుంది. సంస్థలో మరోసారి ఉద్యోగుల తొలగింపుకు శ్రీకారం చుట్టింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మూడు దఫాలుగా లేఆఫ్స్ ఇచ్చిన గోల్డ్మాన్ సాచెస్ తాజాగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) స్థాయి ఉద్యోగాల్లో125 మంది ఎండీలను తొలగించాలని నిర్ణయించినట్లు బ్లూమ్బెర్గ్ నివేదించింది. ఆర్థిక మాంద్యం భయాలతో ప్రాజెక్ట్లలో తిరోగమనం, అమెరికాలో దిగ్గజ బ్యాంకుల్లో నెలకొన్న సంక్షోభంతో గోల్డ్మాన్ సాచెస్ పొదుపు చర్యలు పాటిస్తుంది. తాజాగా, ప్రపంచవ్యాప్తంగా ఎండీ స్థాయి అధికారుల తొలగిస్తున్నట్లు తేలింది. అయితే ఆ తొలగింపులపై గోల్డ్మాన్ సాచెస్ అధికారికంగా స్పందించలేదు. కాగా, 125 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లను తొలగించే అవకాశం ఉండగా.. ఇప్పటికే ఐదు నెలల క్రితం దాదాపు 4,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. -
10 వేల మంది మహిళలకు గోల్డ్మ్యాన్ చేయూత
ముంబై: గోల్డ్మ్యాన్ శాక్స్ భారత్లో 10,000 మంది మహిళలకు వ్యాపారం, మేనేజ్మెంట్ విద్యకు కావాల్సిన నిధుల సహకారం అందించినట్టు ప్రకటించింది. వీరి ద్వారా 12,000 మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభించాయని, గడిచిన 18 నెలల్లో దేశ ఆర్థిక వ్యవస్థకు రూ.2,800 కోట్ల ఆదాయం సమకూరినట్టు తెలిపింది. గోల్డ్మ్యాన్ శాక్స్ 2008లో మొదటిసారి భారత్లో గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని ఆరంభించింది. 18 నెలల క్రితం తిరిగి దీన్ని ప్రారంభించింది. ‘వుమెన్ఇనీషియేటివ్’ కింద 10,000 మంది మహిళలకు వ్యాపారం, యాజమాన్య విద్యకు కావాల్సిన నిధుల సహకారం అందించనున్నట్టు నాడు ప్రకటించింది. గోల్డ్ మ్యాన్ శాక్స్ కార్యక్రమంలో పాల్గొన్న 10వేల మంది మహిళలల్లో 2,400 మందిపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) అధ్యయనం నిర్వహించగా, ఆ వివరాలను గోల్డ్మ్యాన్ శాక్స్ విడుదల చేసింది. గోల్డ్ మ్యాన్ శాక్స్ నిధుల మద్దతు పొందిన 10వేల మంది మహిళలు గత 18 నెలల్లో తమ సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేసుకున్నాయి. అలాగే, ఆదాయాన్ని నాలుగు రెట్లు పెంచుకున్నాయి. తమ ఉత్పాదకతను సగటున ఐదు రెట్లు వృద్ధి చేసుకున్నాయి. వీరిలో అధిక శాతం మహిళా వ్యాపారవేత్తలు నియామకాలు పెంచుకుంటామని, ఆదాయం పెరుగుతుందన్న అభిప్రాయంతో ఉన్నారు. భారత్లో మహిళా వ్యాపారవేత్తల ప్రాతినిధ్యం ఇప్పటికీ చాలా తక్కువగా ఉన్నట్టు గోల్డ్మ్యాన్ శాక్స్ ఇండియా చైర్మన్, సీఈవో సంజయ్ ఛటర్జీ పేర్కొన్నారు. నిధుల సాయం పొందేందుకు కూడా వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని చెబుతూ.. వారి అసలు సామర్థ్యాలు వెలుగులోకి తెచ్చేందుకు ఇంకా ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశంలో కేవలం 20 శాతం వ్యాపారాలే మహిళల నిర్వహణలో ఉన్నాయని, మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో వారి వాటా కేవలం 3 శాతంగానే ఉన్నట్టు చెప్పారు. -
‘నా ఉద్యోగం ఊడింది..జీవితం తలకిందులైంది’
ఆర్ధిక మాంద్యం భయాలు,మార్కెట్లో నెలకొన్న అనిశ్చితులు కారణంగా ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి. తాజాగా ఇన్వెస్ట్మెంట్ బ్యాకింగ్ దిగ్గజం గోల్డ్మన్ సాచ్స్ (జీఎస్) గ్రూప్ దాదాపు 3,200 ఉద్యోగుల్ని ఫైర్ చేసింది. వారిలో ఖరగ్ పూర్లో ఐఐటీ పూర్తి చేసి, బెంగళూరు కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న శుభం సాహు ఒకరు. అయితే తన పుట్టిన రోజు జరుపుకున్న కొన్ని రోజుల తర్వాత ఊహించని విధంగా గోల్డ్మన్ సాచ్స్ పింక్ స్లిప్లు జారీ చేసింది. దీంతో సాహు.. గోల్డ్ మన్ సాచ్స్లో జాబ్ ఎక్స్పీరియన్స్, తొలగింపులపై లింక్డిఇన్లో ఓ పోస్ట్ షేర్ చేశారు. అందులో.. ‘వావ్ ఈ ఏడాది నాకు చాలా ప్రత్యేకంగా ప్రారంభమైంది. సుమారు 6 నెలల క్రితం అనుకుంటా జీఎస్లో సాఫ్ట్వేర్ డెవలపర్గా జాయిన్ అయ్యా. నా బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్న కొన్ని రోజులకే ఫైర్ చేసినట్లు తెలిసింది. ఉద్యోగం చేసింది కొద్ది కాలమే అయినా జీఎస్కు కృతజ్ఞతలు. నేర్చుకోవడానికి, కెరియర్లో ఎదిగేందుకు అనువైన ప్రదేశం’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఉన్న జాబ్ పోయింది కాబట్టి.. కొత్త జాబ్ కోసం ప్రయత్నాలు ప్రారంభించానంటూ లింక్డ్ఇన్ పోస్ట్లో పేర్కొన్నారు. ఇలా సాహూయే కాదు.. గోల్డ్ మెన్ సాచ్స్ విధుల నుంచి తొలగించిన అనేక మంది హెచ్1 బీ వీసా హోల్డర్ ఉద్యోగులు కొత్త జాబ్ కోసం ప్రయత్నిస్తూ సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. మన దేశానికి చెందిన శిల్పి సోనీ టెక్సాస్ ప్రాంతంలో ఉన్న జీఎస్లో సాఫ్ట్వేర్గా ఏడాదిన్నర పాటు పని చేసింది. త్వరగానే జీవితం తలకిందులు అయ్యిందంటూ తన మనసులో మాట బయట పెట్టింది. ‘నా కుటుంబంలో విదేశాలలో మాస్టర్స్ పూర్తి చేసిన మొదటి వ్యక్తిగా నేను గర్వపడుతున్నారు. నేను గ్రామీణ కుటుంబం నుండి వచ్చాను. కాబట్టి సామాజిక, ఆర్థిక పరిమితులను అధిగమించి ఇక్కడకు రావడానికి ఇది ఒక రోలర్ కోస్టర్గా మారింది. నేను ఎక్కడ నుండి జీవితాన్ని ప్రారంభించానో.. అక్కడే ఉద్యోగం పోగొట్టుకోవడం బాధగా ఉంది. కానీ యూఎస్లో నా ప్రయాణం ముగిసిపోలేదు.ఇంకా ఉంది. కాబట్టి ఉద్యోగ వేటను కొనసాగిస్తా’. కొత్త ఉద్యోగ అన్వేషణలో నా పరిమిత సమయాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు లింక్డిఇన్ పోస్ట్లో చెప్పారు. చదవండి👉 ఉద్యోగులకు దిగ్గజ కంపెనీ భారీ షాక్.. ఇక వేలాది మంది ఇంటికే -
ఉద్యోగులకు దిగ్గజ కంపెనీ భారీ షాక్.. ఇక వేలాది మంది ఇంటికే
ఆర్ధిక మాంద్యం భయాల్లో ఇప్పట్లో పోయేలా లేవు. గతేడాది మే నుంచి మొదలైన రెసిషన్ భయాలు సంస్థల్ని ఇంకా పట్టి పీడుస్తూనే ఉన్నాయి. అందుకే నెలలు గడిచే కొద్ది ఖర్చుల్ని తగ్గించుకునేందుకు దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించే విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. తాజాగా న్యూయార్క్కు చెందిన ఇన్వెస్ట్మెంట్ బ్యాకింగ్ దిగ్గజం గోల్డ్మన్ సాచ్స్ గ్రూప్ ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. ఈ వారంలో దాదాపు 3,200 ఉద్యోగుల్ని ఫైర్ చేయనుంది. అస్థిరంగా గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్ల ఫలితంగా కార్పొరేట్ డీల్స్లో భారీ మందగమనం ఏర్పడింది. ఫలితంగా ఖర్చుల్ని తగ్గించుకునేందుకు కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగులకు పింక్ స్లిప్లు జారీ చేయనున్నట్లు బ్లూమ్ బెర్గ్ నివేదిక వెలుగులోకి వచ్చింది. అయితే ఉద్యోగులపై గోల్డ్మన్ సాచ్చ్ యాజమాన్యం స్పందించింది. లేఆఫ్స్ ఉంటాయని ప్రకటిస్తూనే ఎంతమంది అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. కాగా సంస్థలోని కోర్ ట్రేడింగ్, బ్యాంకింగ్ యూనిట్ల నుంచి ఉద్యోగులను తొలగించనున్నట్లు గోల్డ్మన్ సాచ్స్ గ్రూప్ ప్రకటించింది. చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచెత్తనున్న లేఆఫ్స్ సునామీ? -
2022లో 6.9 శాతం.. 2023లో 5.9 శాతం!
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ 2022, 2023లో వరుసగా 6.9 శాతం, 5.9 శాతం వృద్ధిని సాధిస్తుందని వాల్ స్ట్రీట్ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్మన్ శాక్స్ ఒక నివేదికలో అంచనా వేసింది. 2022 భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను రేటింగ్ ఏజెన్సీ ఇటీవలే 7.7 శాతం నుంచి 7 శాతానికి తగ్గించిన నేపథ్యంలో గోల్డ్మన్ శాక్స్ ఈ నివేదికను విడుదల చేసింది. ముఖ్యాంశాలు చూస్తే... ► వరుసగా రెండు సంవత్సరాల భారీ ర్యాలీ కొనసాగే వీలుంది. డిసెంబర్ 2023 నాటికి బెంచ్మార్క్ నిఫ్టీ 20,500 స్థాయికి చేరుకుంటుందని అంచనా. ఇది 12 శాతం ధర రాబడిని సూచిస్తుంది. ► ఇక వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం విషయానికి వస్తే, 2022లో సగటును 6.8 శాతం, 2023లో 6.1 శాతంగా ఉండే వీలుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం లక్ష్యం కన్నా ఇది అప్పటికీ ఎక్కువగానే ఉండడం గమనార్హం. ► వచ్చే డిసెంబర్ పాలసీ సమీక్షలో ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ బ్యాంకులకు సెంట్రల్ బ్యాంక్ ఇచ్చే రుణ రేటు రెపోను 50 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచే వీలుంది. 2023 ఫిబ్రవరిలో మరో 35 బేసిస్ పాయింట్లు పెరిగే వీలుంది. ఈ చర్యలతో రెపో రేటు 6.75 శాతానికి చేరుతుంది. మే తర్వాత సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా రెపో రేటును నాలుగు దఫాలుగా 4 నుంచి 5.9 శాతానికి పెంచింది. తదుపరి ద్వైమాసిక సమావేశం డిసెంబర్ 5 నుంచి 7వ తేదీ మధ్య జరగనుంది. -
ఆ ఉద్యోగుల గుండెల్లో గుబులే: అతిపెద్ద కోతలకు తెర!
న్యూఢిల్లీ:గ్లోబల్ బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్మన్ సాచ్స్ గ్రూప్ భారీ తొలగింపులకు తెరతీసింది. మహమ్మారి ప్రారంభమై నప్పటినుండి పెద్ద సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించనుంది. వాల్ స్ట్రీట్ టైటన్ ఈ నెల (సెప్టెంబరు) నుండి అనేక వందల మందిని తొలగించాలని యోచిస్తోందట. కోవిడ్ తరువాత ఇది భారీ తొలగింపు అని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. గోల్డ్మన్ ఉద్యోగ కోతలకు సిద్ధమవుతున్నట్లు న్యూయార్క్ టైమ్స్ సోమవారం నివేదించింది. అయితే దీనిపై వ్యాఖ్యానించేందుకు గోల్డ్మన్ ప్రతినిధి నిరాకరించారు. మొత్తం సంఖ్య కొన్ని మునుపటి కంటే తక్కువే అయినప్పటికీ, ఈ సెప్టెంబరు నుంచి వందల సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేయనుంది. కోవిడ్ సంక్షోభం తరువాత ఇదే అతిపెద్ద కోత అని అంచనా. ఆదాయాలు భారీగా తగ్గిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బ్లూమ్బెర్గ్ డేటా ప్రకారం, ఈ సంవత్సరం బ్యాంక్ ఆదాయాలు 40శాతానికి మించి పడిపోనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలైలో నియామకాలని తగ్గించడంతోపాటు, ఉద్యోగుల వార్షిక పనితీరు సమీక్షించాలని సంస్థ నిర్ణయించింది. సమీక్ష అనంతరం సాధారణంగా ఫెర్ఫామెన్స్ చెత్తగా ఉన్న సిబ్బందిని తొలగించనుంది. అలాగే అట్రిషన్ కారణంగా కోల్పోయిన సిబ్బందిని భర్తీ చేసే ప్రక్రియను కూడా తగ్గిస్తున్నట్టు సంస్థ సీఎఫ్వో డెనిస్ కోల్మన్ ఒక సందర్బంలో వెల్లడించారు. కంపెనీ రెండో త్రైమాసికం ముగింపు నాటికి సంస్థలో 47వేల ఉద్యోగులుండగా, రెండేళ్ల క్రితం 39,100 ఉద్యోగులు ఉన్నారు. అలాగే గత 12 నెలలుగా ఎస్అండ్పీ 500 ఫైనాన్షియల్స్ ఇండెక్స్ 7.5 శాతం క్షీణతతో పోలిస్తే గోల్డ్మ్యాన్ షేర్లు ఈ ఏడాది 10 శాతానికిపైగా పతనం కాగా గత ఏడాది క్రితం కంటే దాదాపు 15 శాతం క్షీణించాయి. -
Goldman Sachs: 2021–22లో భారత్ జీడీపీ వృద్ధి 9.8%
ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2021–22లో 8.5 శాతంగా నమోదవుతుందని అమెరికన్ బ్రోకరేజ్ దిగ్గజం– గోల్డ్మన్ శాక్స్ తన తాజా నివేదికలో అంచనావేసింది. 2022–23లో వృద్ధి రేటు 9.8 శాతంగా ఉంటుందని పేర్కొంది. మహమ్మారి ప్రతికూల ప్రభావంతో గడచిన ఆర్థిక సంవత్సరం దేశ ఆర్థిక వ్యవస్థ 7.3 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. ఈ లో బేస్ ఎఫెక్ట్తో 2021–22లో మంచి వృద్ది రేటు నమోదవుతుందన్న అంచనాలు ఉన్నాయి. 2021–22లో 9.5 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనా. అయితే 2022–23లో మాత్రం ఈ వృద్ధి రేటు 7.8 శాతం ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో గోల్డ్మన్ శాక్స్ తాజా నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే... ► మహమ్మారి ప్రభావంగ గణనీయంగా తగ్గుముఖం పట్టింది. వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృత ప్రాతిపదికన జరుగుతోంది. ఆయా అంశాలకు తోడు వినియోగం మెరుగుపడుతోంది. ఈ సానుకూల పరిస్థితులు దేశ ఆర్థిక పురోగతికి దోహదపడే అంశాలు. ► ప్రభుత్వ మూలధన వ్యయాలు కూడా భారీగా పెరుగుతాయని విశ్వసిస్తున్నాం. అయితే ప్రైవేటు కార్పొరేట్ క్యాపిటల్ వ్యయాలు (క్యాపెక్స్) రికవరీ, హౌసింగ్ పెట్టుబడుల పునరుద్దరణ మాత్రం బలహీనంగానే ఉంది. ► బేస్ ఇయర్ ఎఫెక్ట్ తగ్గిపోయినప్పటికీ, ఆర్థిక వ్యవస్థలో పలు సానుకూల అంశాల వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరంలో కూడా భారీగా 9.8 శాతం వృద్ధి నమోదవుతుందన్నది అంచనా. ► వృద్ధి పురోగమిస్తుందన్న సంకేతాలతో ఆర్బీఐ తన ద్రవ్య పరపతి విధానాన్ని తిరిగి సాధారణ పరిస్థితికి తీసుకురావడానికి తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 2022లోనే ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం)ను 0.75 శాతం పెంచే అవకాశాలు ఉన్నాయి. ► నాలుగు దశల్లో పాలసీ విధానాన్ని సాధారణ పరిస్థితికి తెచ్చే అవకాశం ఉంది. అదనపు లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)ని వెనక్కు తీసుకుంటామని ఇప్పటికే ఆర్బీఐ పేర్కొనడం ఇందులో మొదటి దశగా భావించవచ్చు. ► వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2021లో సగటున 5.2 శాతం, 2022లో 5.8 శాతంగా ఉండే వీలుంది. బార్క్లేస్ అంచనా 10 శాతం ఇదిలాఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 10 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని బ్రిటిష్ బ్రోకరేజ్ సంస్థ బార్క్లేస్ అంచనావేసింది. అయితే 2022–23లో వృద్ధి 7.8 శాతానికి పరిమితమవుతుందని విశ్లేషించింది. ఆర్బీఐ సరళతర వడ్డీరేట్ల విధానానికి ముగింపు పలకవచ్చని కూడా బార్క్లేస్ అంచనావేసింది. డిసెంబర్లో జరిగే పాలసీ సమీక్షలో రివర్స్ రెపో రేటును పెంచే వీలుందని విశ్లేషించింది. అటు తర్వాత 2022లో రెపో రేటును కూడా పెంచే అవకాశం ఉందని పేర్కొంది. భారతీయ విధాన నిర్ణేతలు గత మూడు సంవత్సరాలుగా వృద్ధికి, ఆర్థిక మూల స్తంభాలకు విఘాతం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారని పేర్కొంది. నిజానికి భారత్ ఆర్థిక వ్యవస్థ మహమ్మారి ప్రారంభానికి ముందే నెమ్మదించడం ప్రారంభించిందని ఈ సందర్భంగా పేర్కొంది. ఇప్పుడు ఆర్థిక స్థిరత్వంపై విధాన నిర్ణేతలు ప్రధానంగా దృష్టి సారిస్తున్నారని వివరించింది. చదవండి: భారత్ జీడీపీ వృద్ధి 8.1 శాతం - ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ -
అమెరికా ‘రు(ర)ణ’ రాజకీయం!
అమెరికా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. దేశం అప్పులు.. వాటి చెల్లింపులను అడ్డుపెట్టుకుని ఆడుతున్న రాజకీయ నాటకం ఇంకొన్ని వారాలపాటు సాగనుంది. ఆర్థిక శాఖ మంత్రి జానెట్ ఎల్లెన్ తాజా ప్రకటనను బట్టి పరిమితిని సకాలంలో పెంచకపోతే డిసెంబరు 15వ తేదీ తరువాత అగ్రరాజ్యం అమెరికా చరిత్రలోనే తొలిసారి రుణ వాయిదాలను చెల్లించలేని పరిస్థితి ఎదుర్కోనుంది. అమెరికాకు అప్పులేంటి? చెల్లించ లేకపోవడం ఏమిటని ఆశ్చర్యపోనవసరం లేదు. ఎంత చెట్టుకు అంత గాలి అంటారు కదా.. అలాగే ఇదీనూ. కాకపోతే ఇక్కడ సమస్య డబ్బుల్లేకపోవడం కాదు. అప్పులపై ఉన్న పరిమితిని పెంచితేగానీ ప్రభుత్వం తన మాట నిలబెట్టుకునే పరిస్థితి లేకపోవడం!! పెంచకపోతే ఏమవుతుంది? రుణ పరిమితిని పెంచకపోతే అమెరికా తొలిసారి తాను చెల్లించాల్సిన రుణ వాయిదాలను చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అక్టోబరులో ఈ మొత్తం దాదాపు 28 లక్షల కోట్ల డాలర్ల వరకూ ఉంది. సకాలంలో రుణ వాయిదా చెల్లించకపోవడం ప్రతి ప్రభుత్వ కార్యక్రమంపై ప్రభావం చూపుతుంది. రాష్ట్రాలకు అందే నిధులు తగ్గుతాయి. గోల్డ్మ్యాన్ శాక్స్ సంస్థ అంచనా ప్రకారం సకాలంలో రుణ పరిమితి పెంచని పక్షంలో అమెరికన్ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందే ఆర్థికసాయంలో నలభైశాతం కోత పడే అవకాశం ఉంది. రక్షణ దళాల సిబ్బందికి పూర్తిస్థాయిలో, సకాలంలో వేతనాలు, ఫింఛన్ల వంటివి చెల్లించలేమని పెంటగాన్ అక్టోబరులోనే ఒక ప్రకటన జారీ చేసింది. వాయిదా చెల్లింపులో విఫలమైతే అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా విశ్వసనీయత దెబ్బతింటుంది. వడ్డీ రేట్లు పెరిగే అవకాశమూ ఉంది. ఇవన్నీ కలగలిస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ నష్టపోతుందన్నమాట. తాత్కాలిక ఉపశమనంగా 480 బిలియన్ డాలర్ల అదనపు రుణం తెచ్చుకోవడానికి అక్టోబరులో సెనేట్ ఒకే చెప్పింది.రుణపరిమితిని పెంచుకోవడానికి, రిపబ్లికన్లను ఒప్పించడానికి బైడెన్ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రతిపక్ష రిపబ్లికన్లు ఏమంటున్నారు? వివాదానికి బాధ్యత డెమొక్రాట్లదేనన్నది రిపబ్లికన్ల వాదన. తమ మద్దతు లేకుండా కొత్త అంశాలపై డబ్బులు ఖర్చు పెట్టేందుకు డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నారని.. దాన్ని అడ్డుకుంటూండటం వల్లనే వారు నిస్పృహకు గురవుతున్నారని ఆరోపిస్తున్నారు. డెమోక్రాట్లు ఇంకోసారి ఏకపక్షంగా పన్నులు విధించడం, ఖర్చు పెట్టడాన్ని తాము అనుమతించేది లేదని మైనార్టీ నేత మిచ్ మెక్కానెల్ స్పష్టం చేశారు. తమ ఆర్థిక విధానాలను అమలు చేసేందుకు డెమొక్రాట్లు బడ్జెట్ సమీక్షను అడ్డుగా పెట్టుకుంటున్నారని, ఇంత చేయగలిగిన వాళ్లు రుణ పరిమితి పెంపుపై కూడా ఏదో ఒక చర్య తీసుకోవాలని అంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ డెమొక్రాట్ల వాదనలేమిటి? రుణ పరిమితి పెంపును రిపబ్లికన్లు అడ్డుకోవడాన్ని అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాలవి ద్వంద్వ ప్రమాణాలని, ప్రమాదకరమైనవని, అమర్యాదకరమైనవి కూడా అని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థతో ఆటలాడుకుంటున్నాయన్నారు. అమెరికన్ సెనేట్లో దాదాపు 50 మంది డెమొక్రాట్లు (100 సభ్యులుండే అమెరికా ఎగువసభ సెనేట్లో 48 మంది డెమొక్రాట్లకు ఇద్దరు స్వంత్రుల మద్దతు ఉంది. మిగతా 50 మంది రిపబ్లికన్ పార్టీ సభ్యులు) ఉండగా... రుణ పరిమితిని పెంచేందుకు కనీసం మరో పది రిపబ్లికన్ ఓట్లూ అవసరమవుతున్నాయి. మొత్తం రుణాల్లో బైడెన్ హయాంలోనివి మూడు శాతం మాత్రమేనని, మిగిలినవన్నీ గత ప్రభుత్వాలవేనని డెమొక్రాట్లు అంటున్నారు. ట్రంప్ హయాంలో తాము మూడుసార్లు రుణ పరిమితి పెంపునకు సహకరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏమిటీ రుణ పరిమితి కథ? అమెరికా ప్రభుత్వం వివిధ రూపాల్లో సేకరించే పన్నుల మొత్తం కంటే ఎక్కువ ఖర్చు పెడుతుంది. ఇందుకోసం అన్ని ప్రభుత్వాల మాదిరిగానే అప్పులు చేస్తుంది. ఈ వ్యవహారమంతా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా నడుస్తుంది. అప్పుల కోసం అగ్రరాజ్యం విడుదల చేసే బాండ్లు ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన పెట్టుబడులుగా భావిస్తారు. 1939లో అమెరికన్ పార్లమెంటు ప్రభుత్వం చేయగలిగే అప్పులపై ఒక పరిమితిని విధిస్తూ చట్టం చేసింది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకూ కనీసం వందసార్లు ఈ పరిమితిని పెంచుకున్నారు. అంటే.. అవసరాన్ని బట్టి మరిన్ని అప్పులు చేసేందుకు ఎప్పటికప్పుడు అవకాశం కల్పించుకున్నారన్నమాట. అయితే ఇలా పరిమితి పెంచుకోవాలన్న ప్రతిసారి కూడా దానిపై కాంగ్రెస్లోని ఇరు పక్షాల మధ్య చర్చోపచర్చలు జరుగుతాయి. చివరకు ఇరుపక్షాలు కొన్ని పట్టువిడుపులతో ఏకాభిప్రాయానికి రావడం పరిమితిని పెంచుకోవడం కద్దు. అయితే ఇటీవలి కాలంలో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంటోంది. 2013లోనూ రుణ పరిమితిని దాటేసే పరిస్థితి ఏర్పడింది. అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యయ ప్రణాళికను రిపబ్లికన్లు పూర్తిగా అడ్డుకున్నారు. అదేమాదిరిగా ఈ సారి కూడా రిపబ్లికన్లు రుణ పరిమితి అంశాన్ని అడ్డుపెట్టుకుని ఒక వివాదాన్ని సృష్టించారు. అయితే... ఇలాంటి విషయాలు చివరి నిమిషం వరకూ సాగడం.. చివరకు రాజీమార్గాలపై తెరవెనుక మంతనాలు, పట్టువిడుపులు, కొన్ని సవరణల తరువాత ఓకే కావడం చరిత్రలో ఇప్పటివరకూ జరిగిన తంతు! -
చైనాను పట్టిపీడిస్తున్న వరుస సంక్షోభాలు...!
Goldman Sachs Cuts China's Growth Forecast: వరుస సంక్షోభాలు చైనాకు కంటికి కునుకులేకుండా చేస్తున్నాయి. చైనాలో ఏదైనా సంక్షోభం తలెత్తితే ప్రపంచదేశాలు కలవరపడుతున్నాయి. వరుస సంక్షోభాలతో చైనా వృద్దిరేటు మందగించేలా ఉన్నట్లు పలు ఫైనాన్షియల్ సంస్థలు గుర్తించాయి. వరుస సంక్షోభాలు..చైనాకు షాకే..! కొద్దిరోజుల క్రితం చైనాకు చెందిన రియల్టీ సంస్థ ఎవర్గ్రాండే దివాలా తీసే పరిస్థితికి చేరుకుంది. ఈ సంక్షోభం సమసిపోకముందే చైనాను మరో సంక్షోభం తలుపుతట్టింది. తీవ్ర విద్యుత్తు కొరత ఇప్పుడు డ్రాగన్ను పట్టిపీడిస్తోంది. కొన్ని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ లైట్లు సైతం వెలగడం లేదు. ఐరోపా సహా ఆసియా దేశాలకు ప్రధాన ఎగుమతిదారుగా ఉన్న చైనాలో ఉత్పత్తి దెబ్బతినే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా పలు దేశాలను ఈ సంక్షోభం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి: వచ్చేశాయి.. ! బడ్జెట్ ఫ్రెండ్లీ రియల్మీ వాషింగ్మెషిన్లు, వాక్యూమ్ క్లీనర్లు..! ధర ఎంతంటే..? షాకిచ్చిన గోల్డ్మన్ సాక్స్..! అమెరికన్ ఇన్వెస్ట్బ్యాంక్, ఫైనాన్సియల్ సర్వీస్ గ్రూప్ గోల్డ్మన్ సాక్స్ చైనాకు షాకిచ్చింది. ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కల్గిన చైనా వృద్ధి అంచనాను గోల్డ్మన్ సాక్ భారీగా తగ్గించింది. ఈ ఏడాదిగాను చైనా 7.8 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తోందని వెల్లడించింది. గ్లోబల్ మార్కెట్లకు, పలు దేశాల ఎకానమీకి చైనీస్ ప్రాపర్టీ భీమోత్ 'లీమన్ సంక్షోభం' గా మారగలదనే భయాల మధ్య చైనా ఇప్పటికే ఎవర్గ్రాండేను కాపాడేందుకు చర్యలను తీసుకుంటుంది. ఈ ఏడాది చైనా ఆర్థిక వ్యవస్థ మూడో త్రైమాసికానికిగాను 4.8 శాతం, నాలుగో త్రైమాసికానికి 3.2 శాతం మేర వృద్ధి రేటును తగ్గించింది. మునపటితో పోలిస్తే వృద్ధి రేటు భారీగా తగ్గనుంది. వృద్దిరేటు తగ్గడం చైనాకు భారీ దెబ్బే అని గోల్డ్మన్ సాక్స్ అభిప్రాయపడింది. చదవండి: భారత్లో ఊపందుకొనున్న స్టార్లింక్ శాటిలైట్ సేవలు -
ఫ్రెషర్స్కు గుడ్న్యూస్, లక్షకు పైగా ఉద్యోగాలకు.. ..
మీరు చదువు కంప్లీట్ చేసుకొని ఉద్యోగ వేటలో ఉన్నారా ! అయితే మీకో గుడ్న్యూస్. పలు దిగ్గజ ఎంఎన్సీ కంపెనీలు ఫ్రెషర్లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఫైనాన్షియల్ దిగ్గజం గోల్డ్మన్ శాక్స్,పీడబ్ల్యూసీ,టాటా కన్సల్టెన్సీ సర్వీస్,బైజూస్,టాటా స్టీల్,ఇన్ఫోసిస్ కంపెనీలు ఆఫ్ క్యాంపస్లో భారీ ఎత్తున ఫ్రెషర్స్ ను రిక్రూట్ చేసుకోనున్నట్లు ఎకనామిక్స్ టైమ్స్ ఓ రిపోర్ట్ ను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం..ఈ ఏడాది సుమారు 30వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన కాగ్నిజెంట్ 2022( వచ్చే ఏడాదికి ) గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకున్న విద్యార్ధులకు 45 వేలు ఉద్యోగాలు ఇవ్వనుంది. ఇన్ఫోసిస్ సైతం గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాదిలో ఇంకా 24,000 మంది ఫ్రెషర్స్ను నియమించనుంది. 2021-22 ఆర్థిక ఆర్ధిక సంవత్సరంలో ఇండియాకు చెందిన టెక్ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్,విప్రోలు సుమారు లక్షా 20 వేల మంది గ్రాడ్యుయేట్లను నియమించనున్నట్లు ఎకనమిక్ టైమ్స్ తన నివేదికలో పేర్కొంది. ఈ సందర్భంగా కాగ్నిజెంట్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శంతను మాట్లాడుతూ.. ఫుల్ స్టాక్ ఇంజనీర్లు, డేటా సైంటిస్ట్,ఏల్/ఎంఎల్ డెవలపర్లు, సైబర్ సెక్యూరిటీ కోసం అధునాతన ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు కలిగిన విద్యార్థులను పెద్ద సంఖ్యలో నియమించుకోవడంపై కంపెనీ దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఫైనాన్షియల్ దిగ్గజం గోల్డ్ మన్ సాక్స్ సైతం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి),నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటి) నుండి ఇంజనీరింగ్ విద్యార్ధుల్ని ఎంపిక చేసుకునేందుకు దేశ వ్యాప్తంగా 'ఇంజనీరింగ్ క్యాంపస్ హైరింగ్ ప్రోగ్రామ్' పేరిట క్యాంపస్ ఇంటర్వ్యూలను ఏర్పాటు చేయనుంది. ఉద్యోగుల నియమాకం కోసం ఇండియాలో మొత్తం 600 ఇంజనీరింగ్ క్యాంపస్లలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు హ్యూమన్ కేపిటల్ మేనేజ్మెంట్ అధికారిణి దీపికా బెనర్జీ చెప్పారు. ఈ నియామకాల్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ ఇంజనీర్ ఉద్యోగుల నియామకాలు ఎక్కువగా ఉన్నాయి.కాగా, స్టార్టప్లు,ఐటీ/ టెక్నాలజీ ఔట్సోర్సింగ్స్ సంస్థలు,స్టార్టప్లు, సాఫ్ట్వేర్ కంపెనీలు, బ్యాంకులు, కన్సల్టెన్సీలలో డిమాండ్ పెరగడంతో తాజాగా గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ విద్యార్ధులను నియమించుకునేందుకు ఆయా సంస్థలు పోటీ పడుతున్నాయి. చదవండి: భారీగా ఉద్యోగాలు, ఈ రేంజ్లో శాలరీలు ఎప్పుడు ఇవ్వలేదేమో! -
ఐపీవోలతో స్టాక్ మార్కెట్ స్పీడు, అత్యంత సంపన్న దేశం దిశగా భారత్
ముంబై: కొద్ది నెలలుగా సందడి చేస్తున్న పబ్లిక్ ఇష్యూల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్ల క్యాపిటలైజేషన్(విలువ) మరింత బలపడనున్నట్లు గోల్డ్మన్ శాక్స్ పేర్కొంది. ప్రైమరీ మార్కెట్లో జోష్ కారణంగా రానున్న మూడేళ్లలో దేశీ మార్కెట్ క్యాప్నకు 400 బిలియన్ డాలర్లు జమకానున్నట్లు తెలియజేసింది. దీంతో 2024కల్లా మార్కెట్ విలువ 5 ట్రిలియన్ డాలర్లను తాకనున్నట్లు అంచనా వేసింది. వెరసి ప్రపంచంలో అత్యధిక మార్కెట్ క్యాపిటటైజేషన్ కలిగిన దేశాలలో 5వ ర్యాంకుకు చేరే వీలున్నట్లు అభిప్రాయపడింది. గత కొద్ది నెలలుగా ప్రైమరీ మార్కెట్లో నెలకొన్న బూమ్ నేపథ్యంలో తాజా అంచనాలను రూపొందించినట్లు యూఎస్ బ్రోకింగ్ దిగ్గజం వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభంనుంచీ చూస్తే పబ్లిక్ మార్కెట్ ద్వారా కంపెనీలు 10 బిలియన్ డాలర్లను సమీకరిస్తున్న పరిస్థితులను ఈ సందర్భంగా ప్రస్తావించింది. గత మూడేళ్లలోనే ఇది అత్యధికంకాగా.. రానున్న 12–24 నెలల్లోనూ ఇది కొనసాగనున్నట్లు అంచనా వేసింది. యూనికార్న్ల దన్ను నవ ఆర్థిక వ్యవస్థ నుంచి పుట్టుకొస్తున్న యూనికార్న్లు, ఐపీవోల ద్వారా లిస్టింగ్కు సిద్ధపడుతున్న కంపెనీలు మార్కెట్ క్యాప్ అంచనాలకు బలాన్నిచ్చినట్లు గోల్డ్మన్ శాక్స్ పేర్కొంది. ఇటీవల బిలియన్ డాలర్ల విలువను అందుకోడం ద్వారా యూనికార్న్ హోదాను పొందుతున్న స్టార్టప్లలో స్పీడ్ నెలకొన్నదని తెలియజేసింది. ఇంటర్నెట్ వృద్ధి, ప్రయివేట్ పెట్టుబడుల లభ్యత, నియంత్రణ సంస్థల తోడ్పాటు వంటి అంశాలు దేశీయంగా స్టార్టప్ వ్యవస్థకు దన్నునిస్తున్నట్లు వివరించింది. ఫలితంగా ఇటీవల 3.5 ట్రిలియన్ డాలర్లను అందుకున్న దేశీ మార్కెట్ క్యాప్ 2024కల్లా 5 ట్రిలియన్ డాలర్లకు చేరగలదని భావిస్తున్నట్లు తెలియజేసింది. గత వారం ఫ్రాన్స్ను అధిగమిస్తూ దేశీ మార్కెట్ విలువ ప్రపంచంలో ఆరో ర్యాంకును అందుకున్న సంగతి తెలిసిందే. డిజిటల్ జోరు ప్రస్తుతం దేశీ ఈక్విటీ ఇండెక్సులలో పాతతరం ఆర్థిక రంగాలకు చెందిన కంపెనీలదే అధిపత్యమని గోల్డ్మన్ శాక్స్ పేర్కొంది. 20 ఏళ్ల సగటు లిస్టింగ్ వయసు కారణంగా పురాతన సూచీలుగా నిలుస్తున్నట్లు వ్యాఖ్యానించింది. అయితే అతిపెద్ద డిజిటల్ ఐపీవోల ద్వారా కొత్త తరానికి చెందిన రంగాలకు ప్రాధాన్యత పెరగనున్నట్లు అంచనా వేసింది. దీంతో నవతరం ఆర్థిక, టెక్ రంగాలకు చెందిన కంపెనీలలో పెట్టుబడులు 5 శాతం నుంచి 12 శాతానికి(50 శాతం ఫ్లోట్) పెరగనున్నట్లు అభిప్రాయపడింది. ఈ బాటలో ఇటీవల స్టాక్ ఎక్సే్ఛంజీలలో జొమాటో లిస్ట్కాగా.. ఫిన్టెక్ దిగ్గజం పేటీఎమ్సహా పలు ఇతర కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి రానున్నట్లు తెలియజేసింది. -
ఎల్ఐసీకి మర్చంట్ బ్యాంకర్లు రెడీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూ ప్రణాళికలు ఊపందుకున్నాయి. ఇష్యూ నిర్వహణకు ప్రభుత్వం తాజాగా 10 మర్చంట్ బ్యాంకర్ సంస్థలను ఎంపిక చేసింది. గోల్డ్మన్ శాక్స్ గ్రూప్, జేపీ మోర్గాన్ చేజ్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కోటక్ మహీంద్రా క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్, సిటీగ్రూప్, నోమురా హోల్డింగ్స్ తదితరాలను షార్ట్లిస్ట్ చేసింది. ఎల్ఐసీ ఐపీవో నిర్వహణకు 16 సంస్థలు ముందుకు వచ్చాయి. ప్రభుత్వ పెట్టుబడులు, ఆస్తుల నిర్వాహక సంస్థ(దీపమ్)కు దరఖాస్తు చేశాయి. చదవండి : Aadhar Link: టెక్నికల్ ఇష్యూస్పై యూఐడీఏఐ క్లారిటీ.. తుది తేదీలు ఇవే! -
సామాన్యుడి నెత్తిన మరో పిడుగు...!
దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు, నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడి నెత్తిమీద మరో పిడుగు పడనుంది. ఈ సారి మొబైల్ రీచార్జ్ టారిఫ్ల రూపంలో రానుంది. పలు టెలికాం కంపెనీలు రీచార్జ్ టారిఫ్ల రేట్లను పెంచనున్నట్లు తెలుస్తోంది. టారిఫ్ల పెంపులతో సామాన్యుడికి మరింత భారం కానుంది. తాజాగా భారతి ఎయిర్టెల్ తన యూజర్ల కోసం బేసిక్ స్మార్ట్ ప్రీ పెయిడ్ ప్లాన్ ధరను రూ. 49 నుంచి ఏకంగా రూ. 79 పెంచేసింది. ఈ బేసిక్ ప్లాన్పై సుమారు 55 మిలియన్ల యూజర్లు ఆధారపడి ఉన్నారు. ఎయిర్టెల్ ఈ ప్లాన్లో భాగంగా అవుట్ గోయింగ్ కాల్స్కు సంబంధించి నాలుగు రెట్లు అధికంగా టాక్టైంను అందించింది. దాంతోపాటుగా డబుల్ మొబైల్ డేటాను చేసింది. తాజాగా ఎయిర్టెల్ బాటలో వోడాఫోన్-ఐడియా కూడా టారిఫ్లను పెంచే దారిలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. వోడాఫోన్-ఐడియా ఇప్పటికే రూ. 49 ప్లాన్ను విరమించుకుంది. ఈ ప్లాన్కు బదులుగా కొత్తగా 28 రోజుల వ్యాలిడిటీతో రూ. 79 ప్లాన్ను తీసుకువచ్చింది. ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా బాటలోనే పలు టెలికాం కంపెనీలు ప్రయాణించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే 6 నెలల్లో రీచార్జ్ టారిఫ్ ప్లాన్ల ధరలను 30 శాతం మేర పెంచాలని టెలికాం కంపెనీలు భావిస్తున్నాయి. టారిఫ్లను పెంచడంతో యూజర్ల నుంచి వచ్చే సగటు తలసరి ఆదాయాన్ని (ఏఆర్పీయూ) పెంచుకోవాలని టెలికాం కంపెనీలు యోచిస్తున్నాయి. గోల్డ్మన్ సాచ్ ప్రకారం.. టెలికం కంపెనీలు 2021 ఆర్థిక సంవత్సరంలో ప్రీ పెయిడ్ కస్టమర్ల నుంచి 50-80 శాతం వరకు రెవెన్యూను జనరేట్ చేసుకున్నాయని పేర్కొంది. టెలికాం కంపెనీల్లో ఫ్రీ క్యాష్ ఫ్లో (ఎఫ్సీఎఫ్) మెరుగుపడాలంటే..కచ్చితంగా ప్రీపెయిడ్ ప్లాన్ల టారిఫ్ల పెంపు అనివార్యమని తెలిపింది. కాగా జియో నుంచి టారిఫ్ల పెంపు తక్కువగా ఉండే అవకాశం ఉందని గోల్డ్మన్ సాచ్ పేర్కొంది. -
హైదరాబాద్లో గోల్డ్మన్ శాక్స్
సాక్షి, హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసుల్లో ఉన్న యూఎస్ దిగ్గజం గోల్డ్మన్ శాక్స్ హైదరాబాద్లో నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఈ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. మాదాపూర్లోని సలార్పురియా సత్వ నాలెజ్డ్ సిటీలో 1,59,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొన్న ఈ కేంద్రం నుంచి ఇంజనీరింగ్, ఫైనాన్స్, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్, కంన్జ్యూమర్ బ్యాంకింగ్ సపోర్ట్ కార్యకలాపాలను నిర్వహిస్తారు. ప్రస్తుతం ఇక్కడ 250 మంది పనిచేస్తున్నారు. డిసెంబరుకల్లా ఈ సంఖ్య 800లకు చేరుతుందని గోల్డ్మన్ శాక్స్ ఇండియా హెడ్ గుంజన్ సంతాని ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. 2023 చివరినాటికి హైదరాబాద్ కేంద్రంలో 2,500 మంది ఉద్యోగులు ఉంటారని వెల్లడించారు. మహమ్మారిలోనూ పెట్టుబడులు.. కార్యాలయం ఏర్పాటు విషయమై తెలంగాణ ప్రభుత్వంతో గతేడాది గోల్డ్మన్ శాక్స్ బృందం చర్చించింది. హైదరాబాద్ కార్యాలయానికి 500 మందిని నియమించుకుంటామని ఆ సందర్భంగా తమకు తెలిపారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ‘2023 నాటికి 2,500 మందిని చేర్చుకోనున్నట్టు ప్రకటించారు. ఇక్కడి మానవ వనరుల సామర్థ్యంపై కంపెనీకి ఉన్న నమ్మకానికి, మెరుగైన మౌలిక వసతులకు ఇది నిదర్శనం. నిర్దేశిత సమయం కంటే ముందుగానే లక్ష్యానికి చేరుకోవడంతోపాటు కంపెనీ తదుపరి విస్తరణ చేపడుతుందన్న విశ్వాసం ఉంది. మహమ్మారిలోనూ పెట్టుబడులను ఆకర్శిస్తున్నాం. మరిన్ని కంపెనీలు రానున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగంలో భాగ్యనగరిలో 1.8 లక్షల మంది పనిచేస్తున్నారు. వీ–హబ్తో కలిసి పనిచేయాల్సిందిగా గోల్డ్మన్ శాక్స్ను కోరుతున్నాను’ అని మంత్రి తెలిపారు. -
ఫ్రెషర్స్కి గోల్డ్మాన్ సాక్స్ గుడ్న్యూస్
హైదరాబాద్: గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ గోల్డ్మాన్ సాక్స్కి సంబంధించి హైదరాబాద్ క్యాంపస్కి ప్రాధాన్యత పెరగనుంది. హైదరాబాద్ క్యాంపస్ ద్వారా మరిన్ని సేవలు అందించేందుకు ఆ సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు రాబోయే రెండేళ్లలో ఇక్కడ కొత్త నియమకాలు చేపడతామని ప్రకటించింది. ఫైనాన్షియల్ సెక్టార్లో గోల్డ్మాన్ సాక్స్ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సంస్థ. 2021 మార్చిన హైదరాబాద్లో కార్యాలయం ప్రారంభించింది. ప్రస్తుతం సంస్థలో కేవలం 250 మంది ఉద్యోగులే పని చేస్తున్నారు. రాబోయే రెండేళ్లలో హైదరాబాద్ కార్యాలయంలో 2,000 మంది ఉద్యోగులను నియమించుకోబోతున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది చివరి నాటికి 700ల మంది ఉద్యోగులను నియమిస్తామని, ఇందులో 70 శాతం కొత్త వారికే అవకాశాలు కల్పించబోతున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. 2023 నాటికి హైదరాబాద్ ఆఫీస్లో 2500ల మంది ఉద్యోగులు పని చేసే విధంగా తమ కార్యకలాపాలు విస్తరిస్తామని గోల్డ్మాన్ సాక్స్ తెలిపింది. రాబోయే రోజుల్లో తాము నిర్వహించే అంతర్జాతీయ స్థాయి కార్యకలాపాలకి హైదరాబరాద్ ఆఫీస్ కీలకంగా మారబోతుందని గోల్డ్మాన్ సాక్స్ చైర్మన్ డేవిడ్ ఎం సాల్మోన్ తెలిపారు. -
హైదరాబాద్ లో గోల్డ్ మెన్ సాస్ గ్లోబల్ సెంటర్ ప్రారంభం
-
GVK Biosciences: రూ. 7,300 కోట్ల డీల్!
ముంబై: కాంట్రాక్ట్ రీసర్చ్, డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అయిన జీవీకే బయోసైన్సెస్లో గోల్డ్మన్ శాక్స్కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ 33 శాతం వాటా చేజిక్కించుకుంటోంది. క్రిస్క్యాపిటల్ తనకున్న 17 శాతం వాటా, ప్రమోటర్లు 16 శాతం వాటాను విక్రయిస్తున్నట్టు సమాచారం. ఈ డీల్ ద్వారా జీవీకే బయోను రూ.7,300 కోట్లుగా విలువ కట్టారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ జెఫరీస్ అడ్వైజర్గా వ్యవహరిస్తోంది. ఇక కొద్ది రోజుల్లో ఈ డీల్ విషయమై అధికారిక ప్రకటన వెలువడనుంది. డీల్ పూర్తి అయితే గోల్డ్మన్ శాక్స్కు భారత ఫార్మా రంగంలో గడిచిన ఆరు నెలల్లో ఇది రెండవ పెట్టుబడి అవుతుంది. గోల్డ్మన్ శాక్స్ 2020 నవంబరులో బయోకాన్కు చెందిన బయోకాన్ బయాలాజిక్స్లో సుమారు రూ.1,100 కోట్లు పెట్టుబడి చేసింది. జీవీకే బయోసైన్సెస్లో జీవీకే కుటుంబానికి, డీఎస్ బ్రార్ కుటుంబానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా చెరి 41 శాతం వాటా ఉంది. ఇదీ జీవీకే బయో నేపథ్యం.. జీవీకే బయోను జీవీకే గ్రూప్, ర్యాన్బాక్సీ ల్యాబొరేటరీస్ మాజీ సీఈవో అయిన డీఎస్ బ్రార్ ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోటర్, చైర్మన్గా 2004లో జీవీకే బయో బోర్డులో బ్రార్ చేరారు. 2001లో ప్రారంభమైన ఈ సంస్థలో 2,500 పైచిలుకు శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. ఔషధ ఆవిష్కరణ, రసాయన, జీవ శాస్త్రం, మాలిక్యూల్ పరిశోధన, అభివృద్ధి, రసాయనాల అభివృద్ధి, ఫార్ములేషన్, ఒప్పంద తయారీ విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. 450కిపైగా క్లయింట్లు ఉన్నారు. 2019–20లో రూ.950 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఎబిటా రూ.275 కోట్లుగా ఉంది. ఔషధ ఆవిష్కరణ, పరిశోధనపైనే సగం ఆదాయం సమకూరుతోంది. మిగిలినది కాంట్రాక్ట్ తయారీ విభాగం నుంచి వస్తోంది. 2014లో యూఎస్కు చెందిన ప్రీ–క్లినికల్ కాంట్రాక్ట్ రీసర్చ్ రంగంలో ఉన్న ఆరాజెన్ బయోసైన్సెస్ను కొనుగోలు చేసింది. చదవండి: Vodafone Idea: ఆ కస్టమర్లకు రూ.49 ప్యాక్ ఉచితం -
భారత్ ఆర్థిక వ్యవస్థ రికవరీ బాగుంది..
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ క్షీణ రేటు అంచనాలను అంతర్జాతీయ బ్రోకరేజ్ దిగ్గజం గోల్డ్మన్ శాక్స్ తగ్గించింది. 2020–21లో భారత్ ఆర్థిక వ్యవస్థ 10.3 శాతం క్షీణతను నమోదుచేసుకుంటుందని తన తాజా నివేదికలో సంస్థ అంచనావేసింది. ఇంతక్రితం ఈ క్షీణ రేటు మైనస్ 14.8 శాతం. కఠిన లాక్డౌన్ సడలింపులతో ఆర్థిక రికవరీ అనుకున్నదానికన్నా బాగుందని అమెరికా కేంద్రం పనిచేస్తున్న ఈ సంస్థ పేర్కొంది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే, పరిస్థితులు మరింత ఆశాజనకంగా మారతాయని అభిప్రాయపడింది. కాగా 2021–22లో భారత్ భారీగా 13 శాతం వృద్ధి సాధిస్తుందని గోల్డ్మన్ శాక్స్ పేర్కొంది. చదవండి: షాపింగ్ బటన్ జోడించిన వాట్సాప్ 2020–21లో అతి తక్కువ బేస్ ఎఫెక్ట్ దీనికి ప్రధాన కారణంగా వివరించింది. అయితే ఆర్థిక వ్యవస్థలో ఇంకా అనిశ్చితి పరిస్థితులు కొనసాగుతున్నాయని గోల్డ్మన్ శాక్స్ నివేదిక పేర్కొంది. కోవిడ్–19 ప్రేరిత అంశాలతో క్షీణతలోకి జారిపోయిన భారత్ ఆర్థిక వ్యవస్థ తిరిగి ఊహించినదానికాన్న వేగంగా రికవరీ అయ్యే అవకాశం ఉందని ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ ఇప్పటికే అంచనావేసింది. ఆర్థిక రంగానికి సంబంధించి పలు ఇండికేటర్లు ఈ విషయాన్ని తెలియజేస్తున్నట్లు పేర్కొంది. భారత్ ఆర్థిక వ్యవస్థ 2020 క్యాలెండర్ ఇయర్లో అనుకున్నదానికన్నా కొంచెం బాగుండే అవకాశం ఉందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ కూడా ఇటీవలే తన నివేదికలో పేర్కొంది. 2020లో క్షీణ రేటు అంచనాలు ఇంతక్రితం మూడీస్ మైనస్ 9.6% అంచనావేయగా, తాజాగా దీనిని మైనస్ 8.9 శాతానికి తగ్గించింది. ఆర్బీఐ రెపో... 0.35 శాతం తగ్గే అవకాశం కాగా 2021 నాటికి వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం మధ్య స్థిరీకరణ పొందే అవకాశం ఉందని గోల్డ్మన్ శాక్స్ అంచనావేయడం గమనార్హం. సరఫరాల సమస్యలు తగ్గడం, తగిన వర్షపాతం, బేస్ ఎఫెక్ట్ తక్కువగా ఉండడం ఇందుకు కారణాలని తెలిపింది. డాలర్ మారకంలో రూపాయి బలపడ్డం ద్రవ్యోల్బణం కట్టడిలో ఉండడానికి ఒక కారణంగా ఉంటుందని పేర్కొంది. ఆయా అంశాల నేపథ్యంలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం)ను ఆర్బీఐ ద్రవ్య పరపతి కమిటీ (ఎంపీసీ) వచ్చే ఏడాది 0.35 శాతం తగ్గించే అవకాశం ఉందని గోల్డ్మన్ శాక్స్ అభిప్రాయపడింది. ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉండాలని కేంద్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి నిర్దేశిస్తోంది. అయితే ఈ స్థాయికి మించి ఈ రేటు నమోదవుతోంది. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటే, సెప్టెంబర్లో ఎనిమిది నెలల గరిష్టం 7.27 శాతానికి పెరిగింది. ఈ ఏడాది మార్చి తరువాత 115 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) రెపోరేటు తగ్గించిన ఆర్బీఐ, రిటల్ ద్రవ్యోల్బణం ఇబ్బందులతో ఆగస్టు, అక్టోబర్ నెలల్లో జరిగిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమావేశాల్లో యథాతథ రేటును కొనసాగించింది. అయితే సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్నా, డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో లక్ష్యాల మేరకు దిగివచ్చే అవకాశాలు ఉన్నాయని ఆర్బీఐ అంచనావేస్తోంది. వ్యవసాయ రంగం పరిస్థితి ఆశాజనకంగా ఉండడం, ముడి చమురు ధరలు ఒక నిర్దిష్ట శ్రేణితో తిరుగుతుండడం, లాక్డౌన్ నిబంధనల సడలింపులతో సరఫరాల వ్యవస్థ మెరుగుపడుతుండడం ఆర్బీఐ అంచనాలకు ప్రధాన కారణాలు. వెరసి డిసెంబర్ త్రైమాసికంలో (క్యూ3) 5.4 శాతానికి, మార్చి త్రైమాసికంలో (క్యూ4) 4.5 శాతానికి ద్రవ్యోల్బణం దిగివస్తుందన్న అంచనాలను వెలువరించింది. క్యూ3లో 3.2–5.9 శాతం శ్రేణి ఉంటే, క్యూ4లో ఈ శ్రేణి 2.4–6.6 శాతం మధ్య ఉంటుందని ఆర్బీఐ తన పాలసీ సమీక్షలో భావించింది. ఈ అంచనాల నేపథ్యంలో వృద్ధికి దోహదపడే సరళతర ద్రవ్య విధానంవైపే ఆర్బీఐ మొగ్గుచూపుతోంది. కాగా, ఆర్థిక వ్యవస్థ రికవరీ, కరోనా వ్యాక్సిన్ వంటి అంశాల ప్రాతిపదికన అవసరమైతే భవిష్యత్తో భారత్ ఈక్విటీలను వోవర్వెయిల్ కేటగిరీలోకి మార్చుతామని గోల్డ్మన్ శాక్స్ తెలిపింది. -
భారీ జరిమానా కట్టేందుకు అంగీకారం
వాషింగ్టన్: ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజం గోల్డ్ మన్ సాక్స్ కు అమెరికా చరిత్రలోనే అత్యధిక జరిమానా విధించిన సంగతి తెలిసిందే. దీనిని చెల్లించేందుకు సిద్ధమని గోల్డ్మన్ సాక్స్ ప్రకటించింది. 1 యండీబీ మలేషియన్ లంచం కుంభకోణం కేసుకు సంబంధించి అమెరికా న్యాయస్థానం ఈ సంస్థకు 2.9 బిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఇప్పటి వరకు ఒక అవినీతి కేసులో అమెరికా న్యాయస్థానం విధించిన అత్యధిక జరిమానా ఇదే. కోర్టు విధించిన ఫైన్ చెల్లించేందుకు గోల్డ్ మన్ సాక్స్ అంగీకరించిందని యూఎస్ అసిస్టెంట్ అటార్నీ జనరల్ బ్రియాన్ సీ రాబిట్ స్వయంగా వెల్లడించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను గోల్డ్మన్ సాక్స్ మోసం చేసిందని, తద్వారా కొన్ని కోట్ల రూపాయల లబ్ధిపొందిందనే ఆరోపణలు నిరూపితమయ్యాయి. ఇందుకోసం 1.6 బిలియన్ డాలర్ల లంచం ఇచ్చిందని సంస్థపై ఆరోపణలు ఉన్నాయి. మలేషియా ప్రభుత్వ సావరిన్ వెల్త్ ఫండ్ 6.5 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించడానికి గోల్డ్ మన్ సాక్స్ సహకరించిందని, 1 ఎండీబీ ఉన్నతాధికారులు ఈ కుంభకోణంలో దాదాపు 4.5 బిలియన్ డాలర్లను కొట్టేశారనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కుంభకోణం మొత్తం 2009 నుంచి 2015 మధ్య జరిగిందని అమెరికా కోర్టు నిర్ధారించింది. ఇన్వెస్ట్ మెంట్ నిధులను కొందరు అవినీతి అధికారులు లూటీ చేశారని విచారణలో తేలింది. ఇందులో గోల్డ్ మన్ సాక్స్ మలేషియా యూనిట్దే ప్రధానపాత్ర. ఈ విషయాలన్నింటిని సంస్థ న్యాయమూర్తి ముందు అంగీకరించింది. తమ వల్ల జరిన నష్టానికి పరిహారం చెల్లించడానికి తాము సిద్ధంగా ఉన్నామని గోల్డ్మన్ సాక్స్ తెలిపింది. అయితే మొత్తం మూడున్నర సంవత్సరాల్లో నియంత్రణా సంస్థలను మాయచేస్తూ, లావాదేవీలు జరిగాయని, అందుకు మొత్తం సంస్థను బాధ్యత చేయడం తగదని కోర్టు ముందు వేడుకుంది. మొత్తానికి అమెరికా చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణం, అతి పెద్ద జరిమానా విధించిన సంస్థ గోల్డ్మన్ సాక్స్ నిలిచింది. చదవండి: అనుమానించి ఉద్యోగం మాన్పించాడు.. చివరకు! -
హైదరాబాద్కు మరో ప్రతిష్టాత్మక సంస్థ
సాక్షి, హైదరాబాద్ : గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మన్ శాక్స్ హైదరాబాద్లో సెంటర్ ఏర్పాటు చేయనుంది. అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం హైదరాబాద్లో చేపట్టే కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఇటీవల సంస్థ ప్రతినిధులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో భరోసా ఇచ్చారు. వాణిజ్య, సాంకేతిక దిగ్గజాలకు హబ్గా మారిన హైదరాబాద్లో అడుగుపెట్టాలని గోల్డ్మన్ శాక్స్ నిర్ణయించడంతో తెలంగాణకు మరో ప్రతిష్టాత్మక సంస్థ రానుంది. భౌగోళికంగా విస్తరించడం, నైపుణ్యాలను అందిపుచ్చుకుంటూ ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య కార్యకలాపాలను సమన్వయం చేసుకునే వ్యూహంలో భాగంగా గోల్డ్మన్ శాక్స్ హైదరాబాద్లో అడుగుపెట్టాలని యోచిస్తోంది. బెంగళూర్ తర్వాత భారత్లో గోల్డ్మన్ శాక్స్కు హైదరాబాద్ రెండవ కార్యాలయం కానుంది. గోల్డ్మన్ శాక్స్ హైదరాబాద్ సెంటర్ వచ్చే ఏడాది ప్రథమార్ధంలో 500 మంది ఉద్యోగులతో కార్యకలాపాలను ప్రారంభించనుంది. కాగా బెంగళూర్ కార్యాలయం భారత్లో తమ మేజర్ లొకేషన్గా కొనసాగుతుందని కంపెనీ స్పష్టం చేసింది. గోల్డమన్ శాక్స్ బెంగళూర్ సెంటర్లో 6000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుల్లో ఒకటైన గోల్డ్మన్ శాక్స్ హైదరాబాద్ రాకను స్వాగతిస్తున్నామని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. భారత్లో తమ రెండో లొకేషన్గా హైదరాబాద్ను ఎంచుకున్నందుకు సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి : రూ.500 కోట్లివ్వండి -
వచ్చే ఏడాదిలోగా 2300డాలర్లకు బంగారం: గోల్డ్మెన్ శాక్స్
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర వచ్చే ఏడాదికల్లా 2300డాలర్లకు చేరుకుంటుందని గోల్డ్మెన్ శాక్స్ సంస్థ అభిప్రాయపడింది. రానున్న రోజుల్లో అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లను మరింత డౌన్గ్రేడ్ చేయవచ్చనే అంచనాలతో పాటు భౌగోళికంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు బంగారం తదుపరి ర్యాలీకి తోడ్పడతాయని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఈ ఏడాదిలో అంతర్జాతీయంగా బంగారం ధర 27శాతం ర్యాలీ చేసిన సంగతి తెలిసిందే. ‘‘ఇటీవల అర్థిక వ్యవస్థ రికవరీకి సమాంతరంగా ద్రవ్యోల్బణ ఆందోళనలు పెరుగుతున్నాయి. డాలర్ నిర్మాణాత్మకంగా బలహీనపడుతోంది. మరోవైపు బంగారం ఈటీఎఫ్లోకి హెడ్జింగ్ ఇన్ఫ్లోలు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో ఫండ్ మేనేజర్లు డాలర్కు హెడ్జ్గా బంగారం వినియోగానికి మొగ్గుచూపవచ్చు’’ అని గోల్డ్మెన్ శాక్స్ తెలిపింది. ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటిని పెంచేందుకు అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లను మరింత డౌన్గ్రేడ్ చేయవచ్చు. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం, కరోనా కేసులు తగ్గుముఖపట్టకపోవడం తదితర కారణాలు బంగారానికి కలిసొచ్చే అంశంగా ఉన్నాయని గోల్డ్మెన్ శాక్స్ అభిప్రాయపడింది. గోల్డ్మెన్ శాక్స్ వెండి ధర అవుట్లుక్ను కూడా పెంచింది. వచ్చే ఏడాదిలోగా ట్రాయ్ ఔన్స్ వెండి ధర 30డాలర్లకు చేరుకుంటుందని తెలిపింది. బంగారం ధర పెరుగుదలతో పాటు సోలార్ ఎనర్జీ పరిశ్రమలో వెండి వినియోగం పెరుగుతుందనే అంచనాలు వెండి ధరను పరుగులు పెట్టిస్తాయని గోల్డ్మెన్ శాక్స్ తెలిపింది. -
యూఎస్ మార్కెట్లకు బ్యాంకింగ్ దన్ను
బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్మన్ శాక్స్ సాధించిన పటిష్ట ఫలితాలకుతోడు.. మోడర్నా ఇంక్ వ్యాక్సిన్ యాంటీబాడీలను అభివృద్ధి చేయడంలో సఫలమవుతున్నట్లు వెలువడిన వార్తలు వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్లకు హుషారునిచ్చాయి. దీంతో బుధవారం డోజోన్స్ 228 పాయింట్లు(0.,9 శాతం) పుంజుకుని 26,870 వద్ద ముగిసింది. ఈ బాటలో ఎస్అండ్పీ 29 పాయింట్లు(0.9 శాతం) బలపడి 3,227 వద్ద నిలవగా.. నాస్డాక్ 62 పాయింట్లు(0.6 శాతం) లాభపడి 10,550 వద్ద స్థిరపడింది.వెరసి మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాలతో నిలిచాయి. అంతకుముందు 750 బిలియన్ యూరోల కోవిడ్ రికవరీ ఫండ్పై ఆశలతో యూరోపియన్ మార్కెట్లలో యూకే, ఫ్రాన్స్, జర్మనీ 2 శాతం స్థాయిలో ఎగశాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్, జపాన్, సింగపూర్, కొరియా, తైవాన్ 1.4-0.5 శాతం మధ్య క్షీణించగా.. థాయ్లాండ్, ఇండొనేసియా 0.3 స్థాయిలో బలపడ్డాయి. బ్యాంకింగ్ జోరు కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలలో రోగనిరోధక శక్తిని పెంచుతున్నట్లు వెల్లడించడంతో మోడర్నా ఇంక్ షేరు తాజాగా 7 శాతం జంప్చేసింది. మంగళవారం సైతం ఈ షేరు 18 శాతం దూసుకెళ్లిన విషయం విదితమే.క్యూ2లో మొత్తం ఆదాయం రెట్టింపునకు పెరగడంతో బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్మన్ శాక్స్ 1.5 శాతం బలపడింది. ఈ ప్రభావంతో నేడు ఫలితాలు ప్రకటించనున్న మోర్గాన్ స్టాన్లీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా 2 శాతం చొప్పున లాభపడ్డాయి. కాగా.. ఇటీవల రికార్డుల బాటలో సాగుతున్న అమెజాన్, మైక్రోసాఫ్ట్, నెట్ఫ్లిక్స్ వెనకడుగు వేయడంతో నాస్డాక్ లాభాలు పరిమితమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. ట్రావెల్ జోరు వ్యాక్సిన్ ఆశలకుతోడు లాక్డవుల ఎత్తివేత నేపథ్యంలో ఈ నెల నుంచి బిజినెస్ యాక్టివిటీ పుంజుకుంటున్నట్లు ఫెడరల్ రిజర్వ్ బీజ్బుక్ సర్వే అభిప్రాయపడటంతో టూరిజం, ట్రావెల్ సంబంధ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. కార్నివాల్ కార్ప్, రాయల్ కరిబియన్ క్రూయిజెస్, మారియట్ ఇంటర్నేషనల్, విన్ రిసార్ట్స్ 7-21 శాతం మధ్య దూసుకెళ్లాయి. -
యూఎస్ మార్కెట్లకు బ్యాంకింగ్ షాక్
స్ట్రెస్ టెస్ట్ నేపథ్యంలో నాలుగో త్రైమాసికం ముగిసేటంతవరకూ అధిక డివిడెండ్లు, షేర్ల బైబ్యాక్లను చేపట్టవద్దంటూ బ్యాంకులకు తాజాగా ఫెడరల్ రిజర్వ్ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర బ్యాంకు ఆదేశాల కారణంగా వారాంతాన బ్యాంకింగ్ కౌంటర్లు డీలా పడ్డాయి. ప్రధానంగా గోల్డ్మన్ శాక్స్ 8.6 శాతం, జేపీ మోర్గాన్ 5.5 శాతం, అమెరికన్ ఎక్స్ప్రెస్ 4.5 శాతం చొప్పున వెనకడుగు వేశాయి. దీనికితోడు తిరిగి కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం అమెరికా స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. ఫ్లోరిడా, కరోలినా, ఆరిజోనా తదితర రాష్ట్రాలలో కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో మరోసారి లాక్డవున్ ఆవశ్యకత ఏర్పడవచ్చన్న ఆందోళనలు ఇన్వెస్టర్లలో తలెత్తాయి. ఫలితంగా అమ్మకాలు ఊపందుకున్నాయి. డోజోన్స్ 730 పాయింట్లు(2.8 శాతం) పడిపోయి 25,016 వద్ద నిలవగా..ఎస్అండ్పీ 75 పాయింట్ల(2.4 శాతం) వెనకడుగుతో 3,009 వద్ద స్థిరపడింది. నాస్డాక్ సైతం 260 పాయింట్లు(2.6 శాతం) పతనమై 9,757 వద్ద ముగిసింది. యూరోపియన్ మార్కెట్లలో జర్మనీ 0.7 శాతం నష్టపోగా.. ఫ్రాన్స్ 0.2 శాతం నీరసించింది, యూకే మాత్రం 0.2 శాతం బలపడింది. ఇక ఆసియాలో జపాన్, కొరియా, సింగపూర్, థాయ్లాండ్, ఇండొనేసియా 1-0.2 శాతం మధ్య పుంజుకోగా..హాంకాంగ్ 1 శాతం క్షీణించింది. చైనా, తైవాన్ మార్కెట్లకు సెలవు. 3.3 శాతం డీలా గత వారం డోజోన్స్ నికరంగా 3.3 శాతం పడిపోగా.. ఎస్అండ్పీ దాదాపు 3 శాతం తిరోగమించింది. నాస్డాక్ సైతం 2 శాతం క్షీణించింది. ఎఫ్ఎంసీజీ దిగ్గజం యూనిలీవర్, టెలికం బ్లూచిప్ వెరిజాన్.. ప్రకటనలను నిలిపివేసేందుకు నిర్ణయించడంతో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ 8.5 శాతం పతనమైంది. హేట్ స్పీచ్ల కట్టడికి చర్యలు తీసుకోకపోవడంపై ఫేస్బుక్ను బాయ్కాట్ చేస్తున్నట్లు ఈ రెండు కంపెనీలూ పేర్కొన్నాయి. ఇతర కౌంటర్లలో ట్విటర్తోపాటు స్పోర్ట్స్వేర్ దిగ్గజం నైక్, కీకార్ప్ కౌంటర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో 9-5.5 శాతం మధ్య ఈ కౌంటర్లు కుప్పకూలాయి. కాగా.. రిటైలింగ్ కంపెనీ గ్యాప్ ఇంక్ 19 శాతం దూసుకెళ్లగా.. ఐటీ దిగ్గజం సిస్కో సిస్టమ్స్ 2.4 శాతం ఎగసింది. నేలచూపుల్లో అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన దేశీ స్టాక్స్ (ఏడీఆర్)లో వారాంతాన అత్యధిక శాతం నష్టాలతో ముగిశాయి. టాటా మోటార్స్(టీటీఎం) 5 శాతం పతనమై 6.6 డాలర్ల వద్ద నిలవగా.. ఐసీఐసీఐ బ్యాంక్(ఐబీఎన్) 3.5 శాతం క్షీణించి 9.05 డాలర్ల వద్ద స్థిరపడింది, వేదాంతా(వీఈడీఎల్) 3.8 శాతం నష్టంతో 5.77 డాలర్లను తాకగా.. డాక్టర్ రెడ్డీస్ 2 శాతం బలహీనపడి 52.19 డాలర్లకు చేరింది. ఇతర కౌంటర్లలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్(హెచ్డీబీ) 1.23 శాతం నీరసించి 45.09 డాలర్ల వద్ద స్థిరపడగా.. ఇన్ఫోసిస్ 2.6 శాతం జంప్చేసి 9.53 డాలర్ల వద్ద ముగిసింది. ఇక విప్రో లిమిటెడ్ 0.3 శాతం బలపడి 3.27 డాలర్ల వద్ద నిలిచింది. -
2000 డాలర్లకు బంగారం: గోల్డ్మెన్ శాక్స్
ప్రపంచ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర ఏడాది లోపు 2000డాలర్లకు అందుకుంటుందని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్మెన్ శాక్స్ అంచనా వేసింది. కరోనా వైరస్ సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితులు, ఆయా దేశాల కరెన్సీల క్షీణతలు బంగారం బలపడేందుకు తోడ్పడతాయని బ్రోకరేజ్ సంస్థ అభిప్రాయపడింది. బంగారం ధర రానున్న 3నెలల్లో 1,800డాలర్లకు, 6నెలలకు 1900డాలర్లకు, ఏడాదిలోగా 2000డాలర్లకు చేరకుంటుందని అని గోల్డ్మెన్ శుక్రవారం విడుదల చేసిన తన నివేదికలో పేర్కోంది డాలర్ క్షీణతతో బంగారానికి డిమాండ్: కోవిడ్-19 సంక్షోభం తర్వాత ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమన భయాలు రానున్ను రోజుల్లో బంగారం ధరను నడిపిస్తాయని బ్రోకరేజ్ విశ్వసిస్తుంది. వర్ధమాన మార్కెట్లో లాక్డౌన్ సడలింపుతో ప్రధాన వినియోగదారుల కొనుగోలు శక్తి పెరుగుతుందని తెలిపింది. ఇదే సమయంలో డాలర్ బలహీనతతో వారు ముందస్తు రక్షణాత్మక చర్యలో భాగంగా బంగారం కొనుగోళ్లకు మొగ్గుచూపేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ద్రవ్యోల్బణం లేకపోతే కరెక్షన్కు అవకాశం: అంతా సవ్యంగా జరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు రివకరీ అయ్యి ద్రవ్యోల్బణం ఏర్పడకపోతే ., బంగారం ధర 2013లో సంభవించిన కరెక్షన్ను తిరిగి చూడవచ్చని బ్రోకరేజ్ సంస్థ హెచ్చరించింది. అలాగే ఫెడ్ రిజర్వ్బ్యాంక్ తన ద్రవ్య విధాన మద్దతును ఉపసంహరించుకుంటుందని ఇన్వెస్టర్లు నమ్మడం ప్రారంభించినప్పుడు కూడా బంగారం ధరలో కరెక్షన్ రావచ్చని గోల్డ్మెన్ సంస్థ తెలిపింది. సెంట్రల్ బ్యాంకుల వడ్డీరేట్ల తగ్గింపు, భారీ ఉద్దీపన చర్యలు బంగారానికి డిమాండ్ను పెంచుతాయి. అలాగే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం, కరెన్సీ క్షీణత పరిస్థితులు నెలకొన్నపుడు ఇన్వెస్టర్లు బంగారాన్ని రక్షణాత్మక సాధనంగా వినియోగిస్తుంటారు. ప్రపంచ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర శుక్రవారం 22డాలర్ల లాభంతో 1,753డాలర్ల వద్ద స్థిరపడింది. ఇక దేశీయ ఎంసీఎక్స్ మార్కెట్లో 10గ్రాముల పసిడి ఫ్యూచర్ల ధర రూ.582 లాభపడి రూ.రూ.47937లు వద్ద ముగసింది. -
గోల్డ్మన్ శాక్స్..బ్యాంక్ షేర్ల రేటింగ్
దేశీ బ్యాంకుల ఆర్జనలు సగటున 40 శాతం వరకూ తగ్గే వీలున్నదంటూ విదేశీ రీసెర్చ్ దిగ్గజం గోల్డ్మన్ శాక్స్ తాజాగా పేర్కొంది. ప్రొవిజన్లు పెరగడం, రుణ చెల్లింపుల వాయిదాలు, నిర్వహణ లాభాలు క్షీణించడం వంటి ప్రతికూలతలు బ్యాంకింగ్ రంగంపై ప్రభావం చూపవచ్చని అంచనా వేసింది. దీనిలో భాగంగా ప్రయివేట్ రంగ దిగ్గజ బ్యాంకుల రేటింగ్స్ను సవరించింది. యాక్సిస్ బ్యాంక్కు గోల్డ్మన్ శాక్స్ గతంలో ఇచ్చిన న్యూట్రల్ రేటింగ్ను తాజాగా విక్రయించవచ్చు(సెల్)కు సవరించింది. టార్గెట్ ధరను రూ. 417 నుంచి రూ. 323కు కోత పెట్టింది. రుణ నాణ్యతకు ఎదురయ్యే సవాళ్లు, నిర్వహణ లాభం నీరసించడం వంటి అంశాలు యాక్సిస్ను దెబ్బతీసే వీలున్నట్లు పేర్కొంది. టార్గెట్ కుదింపు మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ కౌంటర్కు ఇంతక్రితం ఇచ్చిన బయ్ రేటింగ్ను న్యూట్రల్కు గోల్డ్మన్ శాక్స్ సవరించింది. ఫలితంగా ఈ షేరు టార్గెట్ ధరను 16 శాతం కుదించి రూ. 1625కు చేర్చింది. గృహ రుణ బిజినెస్ మందగించడం, బాండ్ మార్కెట్లో క్రెడిట్ స్ప్రెడ్స్ పెరుగుతుండటం వంటి అంశాలు కంపెనీపై ప్రభావం చూపనున్నట్లు అభిప్రాయపడింది. ఇక ఐసీఐసీఐ బ్యాంక్కు బయ్ రేటింగ్ను కొనసాగిస్తున్నప్పటికీ కవరేజీ జాబితా నుంచి తొలగిస్తున్నట్లు తెలియజేసింది. ఎన్బీఎఫ్సీలు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా, బంధన్ బ్యాంకులకు బయ్ రేటింగ్ను కొనసాగిస్తున్నట్లు గోల్డ్మన్ శాక్స్ పేర్కొంది. అయితే ఈ కౌంటర్ల టార్గెట్ ధరలను స్వల్పంగా తగ్గించింది. హెచ్ఢీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత టార్గెట్ రూ. 1142కాగా.. బంధన్ బ్యాంక్కు రూ. 275ను నిర్ణయించింది. ఈ బాటలో ఎన్బీఎఫ్సీ విభాగంలో.. బజాజ్ ఫైనాన్స్, ఆవాస్ ఫైనాన్షియర్స్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, ఎల్అండ్టీ ఫైనాన్స్ కంపెనీలకు ప్రాదాన్యత ఇస్తున్నట్లు తెలియజేసింది. అయితే మరోవైపు ఐడీఎఫ్సీ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్, పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు ‘సెల్’ రేటింగ్ను ప్రకటించింది. ఈ కంపెనీల ఫండమెంటల్స్ బలహీనపడుతున్నట్లు అభిప్రాయపడింది. 25-75 శాతం ప్రయివేట్ బ్యాంక్స్, ఎన్బీఎఫ్సీల లోన్ బుక్స్లో 25-75 శాతం వరకూ రుణ చెల్లింపుల మారటోరియం పరిధిలోనికి వచ్చే వీలున్నట్లు గోల్డ్మన్ శాక్స్ పేర్కొంది. ఇతర దేశాలలో ఇది 10 శాతంవరకూ ఉన్నట్లు తెలియజేసింది. దీంతో ఇది రిటైల్ రుణ నాణ్యతకు సవాళ్లు విసరవచ్చని అభిప్రాయపడింది. ప్రధానంగా రుణ వాయిదాలతో రిటైల్ విభాగం ప్రభావితంకావచ్చని తెలియజేసింది. 420 బిలియన్ డాలర్ల రిటైల్ రుణ విభాగంలో మూడు వంతులకు సమానమైన అంటే 268 బిలియన్ డాలర్ల రుణాలు రెడ్ జోన్లలో ఉన్నట్లు పేర్కొంది. మారటోరియం బుక్స్లో సగటున 20 శాతం స్లిప్పేజెస్ నమోదుకావచ్చని అంచనా వేస్తోంది. గత ఆరేళ్లతో పోలిస్తే ఇది 5 రెట్లు అధికమని తెలియజేసింది. నిర్వహణ లాభాలు 40 శాతం వరకూ తగ్గవచ్చని, ఫీజు ఆదాయం నీరసించవచ్చని భావిస్తోంది. దీంతో మార్జిన్లపై ఒత్తిడి ఏర్పడే వీలున్నట్లు వివరించింది. -
తీవ్ర సంక్షోభంలో ఆర్థిక వ్యవస్థ: గోల్డ్మెన్ సంస్థ
కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమయిన తరుణంలో అంతర్జాతీయ రేటింగ్స్ ఏజెన్సీ గోల్డ్మెన్ శాక్స్ దేశానికి షాకిచ్చే విషయాన్ని వెల్లడించింది. భారత్ అమలు చేస్తున్న లాక్డౌన్ వల్ల దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారి తీవ్ర ఆర్థిక మాంధ్యాన్ని ఎదుర్కొవచ్చని సంస్థ అభిప్రాయపడింది. గతంలో ఎన్నడు జరగని విధంగా ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోనుందని తెలిపింది. గతంలో దేశ వృద్ధి రేటు 20శాతం తగ్గుదల ఉంటుందని భావించిన సంస్థ కరోనా వ్యాప్తి వల్ల 45శాతం తగ్గుదల ఉంటుందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి 20లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిందని పేర్కొంది. గత కొద్ది రోజులుగా వివిద రంగాలను గాడిలో పెట్టే విధంగా నిర్మాణాత్మక సంస్కరణలు చేపడుతున్నట్లు తెలిపింది. దేశంలో అమలు కాబోతున్న ఆర్థిక సంస్కరణలను విశ్లేషిస్తామని గోల్డ్మెన్ సంస్థకు చెందిన పలువురు ఆర్థిక వేత్తలు విశ్లేషించారు. చదవండి: రూ 38 కోట్లు ముంచిన ఉద్యోగిపై వేటు -
గుడ్న్యూస్ : ఆ కంపెనీలో 1460 మందికి ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 ప్రభావంతో అనిశ్చితి వెంటాడుతున్నా విస్తరణ ప్రణాళికలతో ముందుకెళ్లాలని గోల్డ్మన్ శాక్స్ గ్రూప్ నిర్ణయించింది. ఎంపిక చేసిన 1460 మంది భారత గ్రాడ్యుయేట్లను ఈ వేసవిలో విధుల్లోకి తీసుకునేందుకు మొగ్గుచూపింది. 1460 మంది భారత గ్రాడ్యుయేట్లలో సగం మందిని బెంగళూర్లోని బ్యాంక్ టెక్నాలజీ సెంటర్లో పూర్తికాలపు ఉద్యోగాల్లో తీసుకుంటామని, మిగిలిన వారిని ఇంటర్న్షిప్కు అనుమతిస్తామని గోల్డ్మన్ శాక్స్ బ్యాంక్ భారత్ చీఫ్ గుంజన్ సంతానీ తెలిపారు. బెంగళూర్లోని గోల్డ్మన్ టెక్నాలజీ సెంటర్ ప్రపంచంలోనే ఆ సంస్థకు రెండో అతిపెద్ద కేంద్రం కావడం గమనార్హం. కాగా, లాక్డౌన్ ముగిసిన అనంతరం సంస్థ సిబ్బందిలో 40 నుంచి 50 శాతం ఉద్యోగులను విధుల్లోకి అనుమతించాలని సంతానీ యోచిస్తున్నామని చెప్పారు. కరోనా కలకలంతో దేశీయ, విదేశీ కంపెనీలు, టెక్నాలజీ, బ్యాంకింగ్ దిగ్గజాలు ఉద్యోగులకు ఇచ్చిన ఆఫర్లను ఉపసంహరించుకుంటున్న క్రమంలో గోల్డ్మన్ శాక్స్ గ్రూప్ హైరింగ్ ప్రణాళికలతో ముందుకు వెళ్లడం సానుకూల పరిణామంగా భావిస్తున్నారు. చదవండి : లాక్డౌన్ వేళ ఉద్యోగులకు జొమాటో షాక్ -
ఇండస్ఇండ్ బ్యాంకు రూ.30 కోట్ల విరాళం
సాక్షి, ముంబై: అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ గోల్డ్మెన్ శాక్స్ సింగపూర్ అనుబంధ సంస్థ పీటీఈ-ఒడిఐ(ఆఫ్షోర్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్) ప్రయివేటు రంగ దిగ్గజబ్యాంకు ఇండస్ఇండ్ బ్యాంక్లో 0.65 శాతం వాటా కొనుగోలు చేసింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా ఒక్కో షేరు సగటున రూ.430 చొప్పున మొత్తం 4.1 మిలియన్ (41 లక్షల) షేర్లను కొనుగోలు చేసింది. ఈ లావాదేవీ విలువ 176 కోట్ల రూపాయలు. గోల్డ్మెన్ శాక్స్ అనుబంధ సంస్థ వాటా కొనుగోలుతో ఇవాళ ఇండస్ఇండ్ బ్యాంక్ జోరుమీదుంది. గురువారం ప్రారంభలో షేర్ ధర 4శాతానికి పైగా లాభపడింది. గత 3 రోజుల్లో షేర్ 8.47 శాతం పెరగడం విశేషం. ఓపెన్ మార్కెట్లో గోల్డ్మెన్ శాక్స్ అనుబంధ సంస్థ వాటా కొనుగోలుతో ఇవాళ ఇంట్రాడేలో ఇండస్ఇండ్ బ్యాంక్ 4శాతం పైగా లాభపడింది. గత నెల 20న ఆల్టైమ్ కనిష్ట స్థాయి రూ.235.55కుపడిపోయిన ఇండస్ఇండ్ బ్యాంక్ ఆ తర్వాత కోలుకుంది. కనిష్ట స్థాయి వద్ద లభించిన కొనుగోళ్ళ మద్దతుతో ఇండస్ఇండ్ బ్యాంక్ 87శాతం లాభపడింది. కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో అనేక రాష్ట్రాలలో, జాతీయ స్థాయిలో ప్రభుత్వం , దాని ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్నట్లు ఇండస్ఇండ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం రూ .30 కోట్ల విరాళమిస్తున్నట్టు వెల్లడించింది. కరోనా వైరస్ విస్తరణ, తదితర పరిణామాలను, అవసరాలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు చెప్పింది. -
రూ 38 కోట్లు ముంచిన ఉద్యోగిపై వేటు
బెంగళూర్ : ఆన్లైన్ గేమ్లో నష్టాలతో అప్పుల్లో మునగడంతో కంపెనీ నిధుల నుంచి రూ 38 కోట్ల సొమ్మును తన ఖాతాల్లోకి మళ్లించిన గోల్డ్మన్శాక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అశ్వని ఝంఝన్వాలాను తొలగించామని కంపెనీ బుధవారం వెల్లడించింది. అశ్వని ఝంఝన్వాలాను తక్షణమే డిస్మిస్ చేశామని, అతనిపై క్రిమినల్ చర్యలు చేపట్టేందుకు పోలీసు అధికారులకు సహకరిస్తామని గోల్డ్మన్ శాక్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. కంపెనీ ఇండియన్ సబ్సిడరీ ఫిర్యాదుపై అశ్వనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 420 కేసు నమోదు చేశారు. ఛీటింగ్ కేసులో నిందితుడిని స్ధానిక కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించిందని మరథహల్లి సీఐ ఎస్పీ గిరీష్ తెలిపారు. కాగా, తన కింది ఉద్యోగులు గౌరవ్ మిశ్రా, అభిషేక్ యాదవ్, సుజిత్ అప్పయ్యల సహకారంతో అశ్వని కంపెనీ డబ్బును స్వాహా చేశాడు. శిక్షణ పేరుతో వారి ఆఫీస్ సిస్టమ్స్లో అశ్వని లాగిన్ అయ్యేవాడని, వారిని మంచినీళ్లు తీసుకురమ్మని, ఇతర పనులను అప్పగించి నిధుల దోపిడీకి పాల్పడేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇండస్ర్టియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనాకు అక్రమంగా రూ 38 కోట్ల సంస్థ నిధులను బదిలీ చేశాడని ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. చదవండి : అప్పుల్లో మునిగి పనిచేసే సంస్థకు కన్నం -
అప్పుల్లో మునిగి పనిచేసే సంస్ధకు కన్నం..
బెంగళూర్ : ఆన్లైన్ గేమ్లో ఎదురైన నష్టాలను పూడ్చేందుకు తాను పనిచేస్తున్న కంపెనీకి రూ 38 కోట్లు టోకరా వేసిన గోల్డ్మాన్ శాక్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గోల్డ్మాన్ శాక్స్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అశ్వని ఝంఝన్వాలాను కంపెనీని మోసగించిన ఆరోపణలపై అరెస్ట్ చేశామని డిప్యూటీ కమిషనర్ ఎంఎన్ అనుచేత్ వెల్లడించారు. కంపెనీ లీగల్ హెడ్ అభిషేక పర్షీరా ఫిర్యాదుపై అశ్వనితో పాటు ఆయన అనుచరుడిని అరెస్ట్ చేశామని తెలిపారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన కింది ఉద్యోగులు గౌరవ్ మిశ్రా, అభిషేక్ యాదవ్, సుజిత్ అప్పయ్యల సహకారంతో అశ్వని కంపెనీ డబ్బును స్వాహా చేశాడు. శిక్షణ పేరుతో వారి ఆఫీస్ సిస్టమ్స్లో అశ్వని లాగిన్ అయ్యేవాడని, వారిని మంచినీళ్లు తీసుకురమ్మని, ఇతర పనులను అప్పగించి నిధుల దోపిడీకి పాల్పడేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇండస్ర్టియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనాకు అక్రమంగా రూ 38 కోట్ల సంస్థ నిధులను బదిలీ చేశాడని ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. గతంలో అవకతవకలకు పాల్పడి కంపెనీ నుంచి తొలగించబడిన ఉద్యోగి వేదాంత్ కూడా అశ్వనికి నిధుల మళ్లింపులో సహకరించాడని పోలీసులు చెప్పారు. ఈనెల 6న ఇంటర్నల్ ఆడిట్లో ఈ వ్యవహారం వెలుగుచూసింది. అశ్వని ఝంఝన్వాలా ఆన్లైన్ పోకర్ గేమ్లో రూ 49 లక్షలు పోగొట్టుకున్నాడని, రూ 25 లక్షల రుణంతో పాటు పలువురి వద్ద వ్యక్తిగత రుణాలు తీసుకున్నాడని కంపెనీ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. -
బుక్–మైషోలో వాటా కోసం దిగ్గజాల క్యూ
ముంబై: ఆన్లైన్ టికెటింగ్ సంస్థ బుక్–మైషోలో వాటా కొనుగోలు కోసం పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిసింది. బుక్–మైషోలో 10–12 శాతం వాటా కొనుగోలు కోసం ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం జనరల్ అట్లాంటిక్, సింగపూర్ సావరిన్ వెల్త్ఫండ్ టెమసెక్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్మన్ శాక్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. వాటా కొనుగోళ్లకు సంబంధించిన చర్చలన్నీ తుది దశకు చేరాయని, మరికొన్ని వారాల్లో ఖరారవుతాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సంస్థల డీల్స్ ఖరారైతే, బుక్–మైషో విలువ వంద కోట్ల డాలర్లను (రూ.7,000 కోట్లు) దాటుతుందని అంచనా. గత ఏడాది జూలైలో బుక్మైషో సంస్థ టీపీజీ గ్రోత్ నుంచి 10 కోట్ల డాలర్లు సమీకరించింది. అప్పుడు ఈ కంపెనీ విలువను 80 కోట్ల డాలర్లుగా లెక్కగట్టారు. తాజా డీల్స్లో భాగంగా సైఫ్ పార్ట్నర్స్ తన మొత్తం 5.6 శాతం వాటాను విక్రయిస్తుందని, యాక్సెల్ ఇండియా తన వాటాలో కొంత భాగాన్ని అమ్మేస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 2016 వరకూ ఆన్లైన్ టికెటింగ్ సెగ్మెంట్లో బుక్–మైషో సంస్థదే గుత్తాధిపత్యం. ఆ తర్వాత పేటీఎమ్ రంగంలోకి రావడంతో బుక్–మైషో గట్టి పోటీని ఎదుర్కొంటోంది. పేటీఎమ్లో కూడా భారీగా పెట్టుబడులుండటంతో బుక్–మైషో నుంచి వైదొలగాలని సైఫ్ పార్ట్నర్స్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. నెలకు 2 కోట్ల టికెట్లు... 1999లో బిగ్ట్రీ ఎంటర్టైన్మెంట్ పేరుతో బుక్–మైషో తన కార్యకలాపాలు ప్రారంభించింది. ఆరంభంలో థియేటర్లలో సీట్ల మేనేజ్మెంట్ కార్యకలాపాలు చూసిన సంస్థ, ఆ తర్వాత ఆన్లైన్లో టికెట్లను అమ్మడం మొదలెట్టింది. ప్రస్తుతం నెలకు 2 కోట్ల వరకూ టికెట్లను అమ్ముతోంది. సినిమా టికెట్లనే కాకుండా సంగీత కచేరీలు, స్టాండ్–అప్ కామెడీ షోలు, స్పోర్ట్స్ ఈవెంట్లు తదితర కార్యక్రమాల టికెట్లను కూడా బుక్–మైషో విక్రయిస్తోంది. ఈ సంస్థ మొత్తం ఆదాయంలో ఈ సెగ్మెంట్ వాటా దాదాపు మూడోవంతు ఉంటుందని అంచనా. 2016–17 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ ఆదాయం 30 శాతం వృద్ధితో రూ.391 కోట్లకు పెరగ్గా, నికర నష్టాలు 17 శాతం పెరిగి రూ.162 కోట్లకు చేరాయి. -
టెకీలకు తీపికబురు
బెంగళూర్ : ఐటీలో స్లోడౌన్ కనుమరుగవుతుండటంతో మళ్లీ నియామకాలు ఊపందుకున్నాయి. పలు కంపెనీలు సిబ్బంది సంఖ్యను పెంచుకునేందుకు రిక్రూట్మెంట్కు దిగుతుండటంతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. మరోవైపు బహుళజాతి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ గోల్డ్మాన్ శాక్స్ బెంగళూర్ సెంటర్లో ఇంజనీరింగ్ హెడ్కౌంట్ను భారీగా పెంచుకోవాలని కసరత్తు సాగిస్తోంది. భారత్లో 290 మంది ఉద్యోగులతో 2004లో కార్యాలయాలను నెలకొల్పిన గోల్డ్మాన్కు ప్రస్తుతం 5000 మంది ఉద్యోగులు ఉన్నారు. తమ సంస్థ భారత్లో ఏటా 24 శాతం మేర విస్తరిస్తోందని, గత ఐదేళ్లలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ 20 శాతం పెరిగాయని గోల్డ్మాన్ శాక్స్ సర్వీసెస్ ఇండియా హెడ్ గుంజన్ సంతాని చెప్పారు. వ్యాపార వృద్ధికి అనుగుణంగా తాము హైరింగ్ ప్రక్రియను చేపడతామని తెలిపారు. బెంగళూర్ సెంటర్ తమకు కీలకమని, ఇక్కడ కేవలం ఇంజనీరింగ్ కాకుండా ఆటోమేషన్, డిజిటైజేషన్ బిజినెస్ను కూడా అందిస్తున్నామని చెప్పారు. -
ప్రైవేటీకరణే ప్రభుత్వ ప్రధాన అజెండా
ముంబై: ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు అనంతరం ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ప్రైవేటీకరణ, ఎగుమతులకు ప్రోత్సాహం ప్రధాన అజెండాగా ఉంటాయని కన్సల్టెన్సీ సంస్థ గోల్డ్మన్ శాక్స్ ఒక నివేదికలో అభిప్రాయపడింది. వీటితో పాటు భూ, కార్మిక సంస్కరణలపైనా ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉందని తెలియజేసింది. ‘స్థలాల వేలంలో పారదర్శకత పెంచడం... రికార్డుల డిజిటైజేషన్, కార్మిక చట్టాల సంస్కరణలు, వ్యవసాయం.. బ్యాంకింగ్ వంటి రంగాల్లో ప్రైవేటీకరణ మొదలైన సంస్కరణలపై కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం ఉంది‘ అని గోల్డ్మన్ శాక్స్ తన నివేదికలో పేర్కొంది. అలాగే తూర్పు యూరప్, మధ్య ఆసియా దేశాల్లోని కొత్త మార్కెట్లు లక్ష్యంగా ఎగుమతులను ప్రోత్సహించడం, విశ్వసనీయ గ్రేడింగ్.. సర్టిఫికేషన్ వ్యవస్థను రూపొందించడంపైనా కొత్త సర్కార్ కీలక చర్యలు తీసుకోవచ్చని వివరించింది. సంస్కరణలు మరింత వేగం పుంజుకోవడం, లేదా యథాతథ స్థితిలోనే ఉండటం లేదా మళ్లీ పాత రోజులకు మళ్లడమనే మూడు రకాల పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నాయని గోల్డ్మన్ శాక్స్ తెలిపింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వీటి ప్రభావాలను కూడా అంచనా వేసింది. 2020–2025 మధ్యకాలంలో సగటున 7.5 శాతం వాస్తవ జీడీపీ వృద్ధి రేటుపై 2.5 శాతం పాయింట్ల మేర అటూ, ఇటూగా ఈ అంశాలు ప్రభావం చూపవచ్చని పేర్కొంది. సంస్కరణలు వేగవంతం ఒకవేళ చట్టపరమైన సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు తగినంతగా పూర్తి మెజారిటీతో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే సంస్కరణలు వేగవంతం అవుతాయని పేర్కొంది. అయితే, వీటి అమల్లో ప్రభుత్వ సంకల్పం కూడా ముఖ్యమని వివరించింది. ఎగ్జిట్ పోల్స్ ధోరణలకు అనుగుణంగా ఉంటే రాబోయే మూడు నెలల్లో డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ సుమారు 69 స్థాయిలో తిరుగాడవచ్చని గోల్డ్మన్ శాక్స్ తెలిపింది. మధ్యకాలికంగా చూస్తే పన్నెండు నెలల వ్యవధిలో 71 స్థాయిలో ఉండొచ్చని వివరించింది. ఎన్నికల తర్వాత చలామణీలో ఉన్న నగదు పరిమాణం తగ్గి, బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ మెరుగుపడే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. -
క్రెడిట్ కార్డులను తీసుకొస్తున్న టెక్ దిగ్గజం
వాషింగ్టన్ : స్మార్ట్ఫోన్, ల్యాప్టాప్ మార్కెట్లో తనదైన హవా సాగిస్తున్న టెక్ దిగ్గజం ఆపిల్ దృష్టి ఇప్పుడు క్రెడిట్ కార్డు వ్యాపారంపై పడింది. ఈ కంపెనీ ఇప్పుడు ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ‘గోల్డ్ మ్యాన్ శాక్స్’తో కలిసి, క్రెడిట్ కార్డులను ఆఫర్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఆపిల్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టనున్నట్టు అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక వాల్స్ట్రీట్ జర్నల్ రిపోర్టు చేసింది. దీనికోసం ఇటీవలే గోల్డ్ మ్యాన్ శాక్స్ తో భాగస్వామ్యం కూడా కుదుర్చుకుంది. మరింత ఆదాయం పొందే వ్యూహంలో భాగంగా ఆపిల్ క్రెడిట్ కార్డు వ్యాపారంలోకి అడుగుపెడుతున్నట్టు తెలిసింది. ఆపిల్ పే బ్రాండుతో ఈ కార్డులు మార్కెట్లోకి వస్తాయని రిపోర్టులు పేర్కొన్నాయి. ఆపిల్ పే అనేది ఈ టెక్నాలజీ దిగ్గజానికి చెందిన మొబైల్ పేమెంట్, డిజిటల్ వాలెట్ ప్లాట్ఫామ్. తన రెవెన్యూల్లో గాడ్జెట్లనే కాకుండా.. మిగతా వాటిని భాగస్వామ్యం చేయాలని ఆపిల్ భావిస్తోంది. బ్యాంకులు, టెక్ స్టార్టప్ల నుంచి ఇటీవల పేమెంట్స్ స్పేస్లో తీవ్రమైన పోటీ నెలకొంటున్న సంగతి తెలిసిందే. క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టడం ద్వారా ఆపిల్ ఆదాయాలు మరింత పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.భారత మార్కెట్లో ఆదాయాలు పెంచుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నట్టు యాపిల్ సీఈవో టిమ్ కుక్ స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆపిల్, గోల్డ్మ్యాన్ శాక్స్ అధికార ప్రతినిధులు దీనిపై స్పందించడానికి నిరాకరించారు. -
వృద్ధి వేగానికి బ్యాంకింగ్ కష్టాలు అడ్డు!
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ వ్యవస్థలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు భారత్ వృద్ధికి విఘాతం కలిగించనున్నట్లు అంతర్జాతీయ బ్యాంకింగ్ సేవల దిగ్గజం– గోల్డ్మన్ శాక్స్ విశ్లేషిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలనూ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ డౌన్గ్రేడ్ చేసింది. 2019 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాలను 7.6 శాతానికి తగ్గించింది. ఇంతక్రితం ఈ అంచనా 8 శాతం. ప్రభుత్వ రంగంలో రెండవ బ్యాంకింగ్ దిగ్గజం– పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో దాదాపు రూ.13,000 కోట్ల కుంభకోణం గోల్డ్మన్ శాక్స్ తాజా అంచనాలకు నేపథ్యం... రెండేళ్ల కాలానికి రూ.2.11 లక్షల కోట్ల తాజా మూలధనాన్ని బ్యాంకింగ్కు ప్రకటిస్తూ, రుణ వృద్ధికి, ఉద్యోగ కల్పనకు ఈ చర్య దోహదపడుతుందని ప్రకటిస్తున్న కేంద్రానికి గోల్డ్మన్ శాక్స్ తాజా నివేదిక ఆందోళన కలిగించేదే. బ్యాంక్ విడుదల చేసిన అంచనాల్లో ముఖ్యాంశాలను చూస్తే... ♦ ఆర్థిక కుంభకోణాల నేపథ్యంలో...బ్యాంకింగ్ రంగంలో కఠినతరమైన నియంత్రణ విధానాలను అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది. ఇది రుణ వృద్ధికి తద్వారా ఆర్థిక వేగానికి విఘాతం కలిగిస్తుంది. ♦ ఇక బ్యాంకులపై మొండిబకాయిల భారం ఇప్పటికిప్పుడు తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. బ్యాంకు బ్యాలన్స్ షీట్లలో ఉన్న రూ.8.5 లక్షల కోట్ల ఎన్పీఏల తీవ్రత ఇంకా ఎక్కువగానే ఉంది. ♦ మొండిబకాయిలకు ప్రొవిజనింగ్లు పెంచాల్సి రావడం, రుణ వృద్ధిపై పరోక్షంగా తీవ్ర ప్రభావాన్నే చూపుతుంది. ♦ భారత్ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.6 శాతం వృద్ధి సాధించే అవకాశం ఉంది. 2019–20లో 8.3 శాతం వృద్ధి నమోదవుతుందన్న తొలి అంచనాల్లో ఇప్పటికి ఎటువంటి మార్పూ లేదు. -
ప్రభుత్వ బ్యాంకులపై అంచనాల కోత
న్యూఢిల్లీ: గోల్డ్మ్యాన్ శాక్స్ గ్రూపు భారత్కు చెందిన మూడు ప్రభుత్వరంగ బ్యాంకుల ఆదాయ అంచనాలను తగ్గించింది. ఆయా బ్యాంకుల షేర్ల ధరల అంచనాలకూ కోతేసింది. ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ స్కామ్ వెలుగు చూసిన నేపథ్యంలో ఈ మేరకు సవరణలు చేసింది. ఎస్బీఐ ఒక శాతం మేర, బ్యాంకు ఆఫ్ బరోడా 12 శాతం మేర, పంజాబ్ నేషనల్ బ్యాంకు 30 శాతం మేర ఆదాయాన్ని కోల్పోతాయని గోల్డ్మ్యాన్ అంచనాలు వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ భారీ రీక్యాపిటలైజేషన్ సాయంలో మొదటి విడత అందిన నిధులను పరిగణనలోకి తీసుకుని మరీ అంచనాలకు కోతేయడం గమనార్హం. 2019, 2020 సంవత్సరాలకు సంబంధించి కూడా ఈ మేరకు అంచనాలను తగ్గించింది. రిస్క్ భరించాల్సిన సామర్థ్యం, స్కామ్ అనంతరం నియంత్రణలపై మరింత దృష్టి సారించాల్సి రావడం అన్నవి స్వల్ప కాలంలో వృద్ధిని దెబ్బతీయవచ్చని గోల్డ్మ్యాన్ శాక్స్ అనలిస్ట్ తన నివేదికలో పేర్కొన్నారు. ఎస్బీఐ, బీవోబీలకు సంబంధించి ఈక్విటీ విస్తరణ కారణంగా ఈపీఎస్ అంచనాలను తగ్గిస్తున్నట్టు పేర్కొంది. ముఖ్యంగా పీఎన్బీలో స్కామ్ కారణంగా కేటాయింపులు పెరిగి ఈపీఎస్ గణనీయంగా తగ్గుతుందని, వృద్ధి కూడా తక్కువగానే ఉంటుందని పేర్కొంది. పీఎన్బీలో స్కామ్ బయటకు వచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్లో బ్యాంకు షేర్లు భారీగా పడిన సంగతి తెలిసిందే. కుంభకోణంతో పీఎన్బీపై దిద్దుబాటు చర్యలు భారీ కుంభకోణం నేపథ్యంలో ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) విషయంలో రిజర్వ్ బ్యాంక్ సత్వర దిద్దుబాటు చర్యలు (పీసీఏ) అమలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పీఎన్బీలో కొన్నాళ్ల పాటు రుణ వితరణ కార్యకలాపాలు నిల్చిపోవచ్చని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ సంస్థ ఒక నివేదికలో పేర్కొంది. కుంభకోణం నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు అమలు చేసే అవకాశాలను తోసిపుచ్చలేమని వివరించింది. స్కామ్ ఉదంతంతో మూలధన నిష్పత్తిపై సుమారు 230 బేసిస్ పాయింట్ల మేర ప్రతికూల ప్రభావం పడగలదని తెలిపింది. దీంతో తగినంత స్థాయికి మూలధనం పెంచుకునేదాకా పీఎన్బీ రుణ వితరణను నిలిపివేయొచ్చని కోటక్ వివరించింది. ఒకవేళ నిధుల సమీకరణ కోసం కొన్ని అనుబంధ సంస్థలు, జాయింట్ వెంచర్స్లో వాటాలు విక్రయించినా.. కాంట్రాక్టుల నిబంధనల ప్రకారం ఆ నిధులు చేతికొచ్చేందుకు కొంత సమయం పడుతుందని తెలిపింది. బ్యాంకుల ఆదాయం తగ్గుతుంది ఆర్బీఐ కొత్త నిబంధనలపై ఫిచ్ అంచనాలు మొండి బకాయిల వసూళ్లను వేగవంతం చేసే లక్ష్యంతో ఆర్బీఐ తీసుకొచ్చిన నూతన నిబంధనలు స్వల్పకాలంలో బ్యాంకింగ్ రంగ ఆదాయాలను దెబ్బతీయవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అభి ప్రాయపడింది. అయితే, ప్రభుత్వం నుంచి మూలధన సాయం, మొండి బకాయిల సమస్యను పరిష్కరించేందుకు నియంత్రణ పరంగా బలమైన చర్యల వల్ల మధ్యకాలంలో ఈ రంగం పుంజుకుంటుందని తన నివేదికలో అంచనా వేసింది. దేశ బ్యాంకింగ్ రంగంపై ఈ సంస్థ ప్రతికూల ధోరణితో ఉంది. బ్యాంకులు భారీగా రుణం తీసుకున్న వారి ఎగవేతల గురించి ప్రతీ వారం వెల్లడించాల్సి ఉంటుందని, మొండి బాకీల పరిష్కారంలో వేగవంతమైన విధానాన్ని ఇది సూచిస్తోందని పేర్కొంది. -
నోట్ల రద్దుతో మందగమనం
గోల్డ్మన్ శాక్స్.. న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ .. రాబోయే కొంత కాలం మందగించే అవకాశాలు ఉన్నాయని కన్సల్టెన్సీ సంస్థ గోల్డ్మన్ శాక్స్ తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కరెన్సీ సంస్కరణలే ఇందుకుప్రధాన కారణం కాగలవని సంస్థ చీఫ్ ఎకానమిస్ట్ జాన్ హట్జియస్ వివరించారు. ప్రస్తుతానికి ఎకానమీ స్వల్పంగా మందగిస్తోందని, సమీప కాలంలో వృద్ధి మరింత దిగువముఖంగా వెళ్లే రిస్కులున్నాయని భావిస్తున్నట్లుఆయన తెలిపారు. ఇక, 2017లో అమెరికా సారధ్యంలో ప్రపంచ ఎకానమీ వృద్ధి 3.5 శాతం మేర ఉండొచ్చని జాన్ తెలిపారు. ట్రంప్ నేతృత్వంలో అమెరికాలో కొన్ని పన్నులపరమైన సంస్కరణలు, కొంత మేర ఉదారవాదద్రవ్య విధానాలు అమలు, ఇన్ఫ్రాపై వ్యయాలు పెరగడం మొదలైన పరిణామాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. ఇవి ఆర్థిక వృద్ధిపై సానుకూలంగా ప్రభావం చూపగలవని జాన్ పేర్కొన్నారు.మరోవైపు, యూరో దేశాల్లో వృద్ధి దాదాపు అదే స్థాయిలో 1.5 శాతం మేర ఉండొచ్చని అంచనాలు నెలకొన్నట్లు వివరించారు. కనిష్ట స్థాయికి వృద్ధి సూచీలు: నొమురా పెద్ద నోట్ల రద్దుతో గ్రామీణ ప్రాంతాల్లో వినియోగంపై గణనీయంగా ప్రతికూల ప్రభావం పడినట్లు జపాన్కి చెందిన బ్రోకరేజ్ సంస్థ నొమురా పేర్కొంది. దీంతో కీలకమైన వృద్ధి ఆధారిత సూచీలు 1996 తర్వాత కనిష్టస్థాయిలకు పడిపోయాయని వివరించింది. డీమోనిటైజేషన్ కారణంగా సమీప భవిష్యత్లో మందగమనం ఉండొచ్చని ఈ పరిణామం సూచిస్తున్నట్లు పేర్కొంది. నవంబర్లో వచ్చిన డేటాలో మందగమనం పాక్షికంగానేకనిపించిందని, వృద్ధిపై పడిన పూర్తి ప్రభావం డిసెంబర్ డేటా వచ్చిన తర్వాతే తెలుస్తుందని వివరించింది. పెద్ద నోట్ల దెబ్బ ప్రభావం పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ కన్నా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగంపైనేపడిందని నొమురా తెలిపింది. భారత్కి చెందిన కాంపోజిట్ లీడింగ్ ఇండెక్స్ (సీఎల్ఐ) 2017 తొలినాళ్లలో వృద్ధికి సంబంధించి గణనీయంగా క్షీణించిందని పేర్కొంది. 1996లో దీన్ని రూపొందించినప్పట్నుంచి ఇది అత్యంతకనిష్ట స్థాయి అని, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 6%కన్నా తక్కువగానే ఉంటుందన్న అంచనాలకిది అనుగుణంగా ఉందని నొమురా తెలిపింది. ఫిబ్రవరి ఆఖరు నాటికి నగదు కొరత కష్టాలు తీరవచ్చని, 2017 జూన్త్రైమాసికం నుంచి మాత్రమే వృద్ధి రికవరీ మొదలుకాగలదని వివరించింది. -
ట్రంప్ పిక్ చేసిన మరో టాప్ ఎగ్జిక్యూటివ్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికయిన డోనాల్డ్ ట్రంప్ మరో ముఖ్య నియామకాన్ని చేపట్టారు. వైట్ హౌస్ లోని అతి ముఖ్యమైన ఆర్థిక-విధాన బాడీలో గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్మన్ సాచ్స్ కు మరో టాప్ టాప్ ఎగ్జిక్యూటివ్ ని ఎంచుకున్నారు. వైట్ హౌస్ నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ హెడ్ గా అమెరికాలోని ప్రముఖ ఫైనాన్షియల్, బ్యాంకింగ్ సంస్థ గోల్డ్మన్ సాచ్స్ టాప్ ఎగ్జిక్యూటివ్ ని ఎంపిక చేసినట్టు శనివారం మీడియా వెల్లడించింది. గోల్డ్ మన్ అధ్యక్షుడు, గ్యారీ కోన్ (56)ను ఈ పదవికి ఎంపిక చేసుకున్నారు ట్రంప్. దీంతో ఈ సంస్థ నుంచి ట్రంప్ ఎడ్మినిస్ట్రేషన్ లో చేరనున్న మూడవ అధికారి అయ్యారు. గోల్డ్ మన్ సీఓఓ బాధ్యతలు నిర్వహిస్తున్నగ్యారీ కోన్ ను దేశీయ అంతర్జాతీయ ఆర్థిక సమస్యల సమన్వయం చేసే కీలక ఆర్థిక మండలికి డైరెక్టర్ గా నియమించినట్టు జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. సెనేట్ ఆమోదం అవసరం లేని ఈ నియామకానికి కోన్ ఆమోదం లభిస్తే అతను ట్రంప్ పరిపాలనలో చేరిన మూడో బ్యాంకర్ కానున్నారు. ట్రంప్ ట్రెజరీ సెక్రటరీ నామినీ స్టీవెన్ మ్యుచిన్, వైట్ హౌస్ సలహాదారుగా స్టీవ్ బనాన్ కూడా గోల్డ్ మన్ సాచ్స్ లో పనిచేసినవారే. అయితే తన ప్రచారంలో పదే పదే గోల్డ్ మన్ లాంటి ఇతర బ్యాంకులపై విరుచుకుపడిన ట్రంప్ తాజా నియామకాలపై డెమెక్రాట్ అభ్యర్థులు బెర్నీ శాండర్స్ తదితరులు ట్విట్టర్ లో మండిపడ్డారు. ముఖ్యంగా పేదలకు దోచుకుంటోందంటూ గోల్డ్ మన్ సాచ్స్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాగా అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ 1993 లో నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ ని రూపొందించారు. అనంతరం ఇదివ వైట్ హౌస్ లో అతి ముఖ్యమైన ఆర్థిక-విధాన నిర్ణయాల్లో కీలక బాడీగా మారింది. -
ఆర్థిక కార్యకలాపాలకు దెబ్బే..
• స్వల్పకాలంలో వృద్ధి దెబ్బతింటుంది • నోట్ల రద్దుపై గోల్డ్మన్ శాక్స్ వెల్లడి ముంబై: బ్లాక్ మనీని అడ్డుకోవటానికి ఇప్పటిదాకా చలామణిలో ఉన్న రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్రం చేసిన ప్రకటన వల్ల ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతింటాయని ప్రఖ్యాత ఆర్థిక సేవల సంస్థ గోల్డ్మన్ శాక్స్ స్పష్టంచేసింది. ‘‘కేంద్రం చర్యతో బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ పెరుగుతుంది. అది మంచిదే. కానీ రాబోయే రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తారుు. ఆర్థిక వ్యవస్థకిది ప్రతికూలం’’ అని సంస్థ ఒక నివేదికలో స్పష్టంచేసింది. ‘‘ఆర్థిక కోణంలో చూసినపుడు నగదు సరఫరాపై, వినియోగ వ్యయంపై, ద్రవ్య విధానాలపై... ద్రవ్యోల్బణంపై దీని ప్రభావం చాలావరకూ ఉంటుంది’’ అని సంస్థ పేర్కొంది. వ్యక్తులు తమ నగదును బ్యాంకు ఖాతాల్లో వేస్తారు కనక వచ్చే నెలలో ఆర్థిక కలాపాలు మందగిస్తాయని నివేదిక అభిప్రాయపడింది. వ్యక్తుల ఆర్థిక ఆస్తుల్లో దాదాపు 10 శాతం నగదు రూపంలోనే ఉన్నాయని, డిబెంచర్లు- ఈక్విటీల్లో ఉన్నదానికన్నా ఇది అధికమని వెల్లడించింది. ‘‘ఈ సంస్కరణ మధ్య కాలానికి సానకూలమైనదే. ఎందుకంటే దీనివల్ల పారదర్శకత, జవాబుదారీ తనం పెరుగుతారుు. ఎలక్టాన్రిక్, బ్యాంకింగ్ వ్యవస్థద్వారా లావాదేవీలు అధికమవుతారుు. అప్రకటిత ధనాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే పన్ను అధికారులు గమనిస్తూనే ఉంటారు కనక ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది. దీంతో 2016-17లో అంచనావేసిన 3.5 శాతం ద్రవ్యలోటు కన్నా తక్కువగా 2017-18లో లోటు 3 శాతమే ఉండొచ్చు’’ అని అభిప్రాయపడింది. అరుుతే స్వల్ప కాలానికి చూస్తే నగదుపై ఆధారపడిన జ్యుయలరీ, రెస్టారెంట్లు, ఫుడ్-బెవరేజెస్, రవాణా వంటి రంగాలు బాగా దెబ్బతింటాయని... పలు ఇళ్లలో వీటిపై పెడుతున్న ఖర్చు 50 శాతందాకా ఉంది కనక ఈ రంగంపై ఆధారపడిన వారిమీద కూడా ఈ ప్రభావం ఉంటుందని గోల్డ్మన్ శాక్స్ వెల్లడించింది. -
భారత మార్కెట్లు మెరుగ్గా రాణిస్తాయ్
♦ కార్పొరేట్ ఆదాయాల్లో రికవరీ... ♦ గోల్డ్మాన్ శాక్స్ నివేదిక న్యూఢిల్లీ: భారత కార్పొరేట్ సంస్థల ఆదాయాల వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరంలో మెరుగుపడుతుందని, ఇతర దేశాలతో పోచ్చితే రికవరీ వేగంగా ఉటుందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ గోల్డ్మాన్ శాక్స్ ఓ నివేదికలో తెలిపింది. సమీప కాలంలోనే వాస్తవిక అభివృద్ధికి అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేసింది. బీఎస్ఈ 200 కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు ఫ్లాట్గా ఉన్నప్పటికీ దాన్ని వ్యతిరేక అంశంగా పరిగణించలేదని ఈ సంస్థ స్పష్టం చేసింది. సూక్ష్మ ఆర్థిక రంగంలో రికవరీ కొనసాగుతుందని అంచనా వేస్తున్నామని, ఆదాయాల్లో వృద్ధి వేగంగా ఉంటుందని స్పష్టంచేసింది. భారత ఈక్విటీ మార్కెట్లు ఈ ప్రాంతంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే మెరుగ్గా రాణిస్తాయని తన పరిశోధన నివేదికలో గోల్డ్మాన్ శాక్స్ తెలిపింది. అయితే, వ్యవసాయ రంగ ప్రాతినిథ్యం తగినంత లేకపోవడం, ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణాల వ్యయాలు పెరిగిపోవడం సమీప కాలంలో వృద్ధికి సవాళ్లుగా పేర్కొంది. ‘ఐదు వరుస త్రైమాసికాల క్షీణత తర్వాత గత రెండు త్రైమాసికాల్లో ఎంఎస్సీఐ ఇండియా ఇండెక్స్ కంపెనీల లాభాలు 9, 7 శాతం చొప్పున ఉన్నాయి. పూర్తి ఏడాదికి 10 శాతం ఉంటుందన్న అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. దీంతో భారత ఈక్విటీలపై మేము ఇప్పటికీ అధిక వెయిటేజీనే కలిగి ఉన్నాం. వృద్ధి, రికవరీ సరైన మార్గంలోనే ఉన్నాయి. వార్షిక చక్రగతిన 2016-17 సంవత్సరంలో ఎంఎస్సీఐ ఇండియా సూచీలో భాగమైన కంపెనీల ఈపీఎస్ వార్షిక వృద్ధి 12 శాతం వుంటుందని అంచనా వేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఇదే గరిష్టం’ అని నివేదిక పేర్కొంది. -
పసిడి ఇంకా పడకపోవచ్చు..!
♦ గోల్డ్మన్ శాక్స్ అంచనా.. ♦ చైనా తాజా కొనుగోళ్లు జరపవచ్చన్న అభిప్రాయం ♦ అమెరికా సెప్టెంబర్ ‘ఉపాధి’ బలహీనత నేపథ్యం ముంబై/న్యూయార్క్: బంగారం ధర ఇక స్థిరపడవచ్చన్న అంచనాలు వినవస్తున్నాయి. పసిడి ధర వరుసగా ఎనిమిది ట్రేడింగ్ షెషన్ల నుంచీ పడుతూ వస్తోంది. ఈ ఏడాది ధర ఇలా పడటం ఇదే తొలి సారి. న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో పసిడి ధర శుక్రవారంతో ముగిసిన వారం రోజుల్లో ఔన్స్కు (31.1 గ్రాములు) 59 డాలర్లు తగ్గి, 1,259 డాలర్లకు దిగింది. ఇది నాలుగు నెలల కనిష్ట స్థాయి. ప్రస్తుతం 0.25-0.50 శాతం శ్రేణిలో ఉన్న అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెరగవచ్చన్న అంచనాలు దీనికి ప్రధాన కారణం. సెప్టెంబర్ పారిశ్రామిక ఉత్పత్తి బాగుండడంతో డాలర్ బలపడ్డం, ఫెడ్ రేటు పెంపు అంచనాలు పసిడికి మదుపుదారులను దూరం చేశాయి. అంచనాలు ఇలా... అయితే ఇకపై పసిడి ధర మరింత పడకపోవచ్చన్నది గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మన్ శాక్స్ అంచనా. భౌతిక బంగారానికి వచ్చే డిమాండ్ పసిడి మరింత పతనం కాకుండా అడ్డుకుంటుందని గోల్డ్మన్ శాక్స్ అంచనా. ప్రస్తుత పతనం తరువాత చైనా మరో దఫా పసిడి కొనుగోళ్లకు దిగవచ్చన్న అంచనాలున్నట్లు బ్యాంక్ అభిప్రాయపడింది. ఈ ఏడాది చివరకు పసిడి మొత్తంగా 1,280 డాలర్ల వద్ద ఉంటుందని బ్యాంక్ అంచనా వేస్తోంది. ఇక శుక్రవారం వెలువడిన అమెరికా ఉపాధి కల్పనా గణాంకాలు సెప్టెంబర్లో నిరాశాజనకంగా ఉండడం కూడా పసిడి ధర మరింత పడకపోవచ్చనడానికి కారణంగా కనబడుతోంది. ఈ నెలలో 1,56,000 మందికే ఉపాధి కల్పించినట్లు వెల్లడయిం ది. ఇది అంచనాలకన్నా తక్కువ. నిజానికి ఈ సంఖ్య 1,70,000 - 1,76,000 మధ్య ఉంటుందని అంచనావేశారు. వృద్ధి కేవలం 0.1 శాతం నమోదై ఐదు శాతానికి చేరింది. ఇది కూడా ఫెడ్ రేటు కోత మరింత ఆలస్యం జరగవచ్చన్న అంచనాలకు ఊతం ఇస్తోంది. ఇది పసిడి పెరుగుదలకు లాభించే అంశంగా భావిస్తున్నారు. దేశీయంగా ఇలా... అంతర్జాతీయ ధోరణి దేశీయంగా బలంగా కనబడింది. పసిడి ముంబై ప్రధాన స్పాట్ బులియన్ మార్కెట్లో గడచిన వారంలో 99.9 స్వచ్ఛత ధర 10 గ్రాములకు రూ.1,355 తగ్గి రూ.29,995కు చేరింది. 99.5 స్వచ్ఛత సైతం ఇదే స్థాయిలో తగ్గి రూ.29,845కు దిగింది. ఇక వెండి కేజీ ధర ఏకంగా రూ.3,930 పడి రూ.42,385కు చేరింది. ఔన్స్ 31.1గ్రాములు - ప్రస్తుత ధర 1,259 డాలర్లు - డాలర్కు రూపాయి మారకపు విలువ దాదాపు రూ. 68 -
సైబర్సిటీలో గోల్డ్మ్యాన్ సాక్స్ పెట్టుబడులు!
రూ.190 కోట్ల పీఈ ఇన్వెస్ట్మెంట్స్ సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన సైబర్సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రై.లి.లో గోల్డ్మ్యాన్ సాక్స్ పెట్టుబడులు పెట్టింది. ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) రూపంలో రూ.190 కోట్ల నిధులను సమీకరించామని సైబర్సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఎండీ వేణు వినోద్ శుక్రవారమిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. హైటెక్సిటీ ఎంఎంటీఎస్కు చేరువలో 8.5 ఎకరాల్లో మరీనా స్కైస్ పేరిట హైరైజ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ను ప్రారంభించామని చెప్పారు. జీ+31 అంతస్తుల్లో రానున్న ఈ ప్రాజెక్ట్లో మొత్తం 1,250 ఫ్లాట్లొస్తాయని.. ధర చ.అ.కు రూ.4,100గా నిర్ణయించామన్నారు. 40 వేల చ.అ.ల్లో క్లబ్ హౌజ్తో పాటు అన్ని రకాల ఆధునిక సదుపాయాలను కల్పిస్తామని పేర్కొన్నారు. -
‘జియో’ను ఎదుర్కోవడం ఎలా..?
కొత్త వ్యూహాల్లో టెల్కోలు... వినూత్నమైన ప్లాన్ల ప్రకటన ♦ డేటా చార్జీల్లో కోతలు తప్పవు ♦ బండిల్ ఆఫర్ల జోరు పెరుగుతుంది ♦ బ్రోకరేజ్ సంస్థల నివేదికలు న్యూఢిల్లీ: రిలయన్స్ జియో తన ప్రివ్యూ ఆఫర్తో టెలికం రంగంలోని దిగ్గజ కంపెనీలకు చుక్కలు చూపెడుతోంది. వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కాకమునుపే పరిస్థితి ఇలా ఉందంటే.. జనవరిలో పూర్తిస్థాయిలో జియో మార్కెట్లోకి అడుగుపెడితే? దీనికి సమాధానమివ్వడం కొంత కష్టమే. జియో ప్రివ్యూ ఆఫర్ దెబ్బకు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సంస్థలు ఇప్పటికే ఉన్న డేటా ప్యాక్స్కు అదనపు డేటాను అందిస్తున్నాయి. కొత్త యూజర్లను ఆకట్టుకోవడం పక్కన ఉంచితే.. ఉన్నవారిని జారిపోకుండా చూసుకోవడానికి తెగ శ్రమిస్తున్నాయి. దీంతో టెల్కోలు ఇప్పటికే డేటాతోపాటు ఉచిత కాల్స్తో కూడిన వినూత్నమైన ఆఫర్లనూ ప్రకటిస్తున్నాయి. టెల్కోలు.. హ్యాండ్సెట్స్ కంపెనీలతో కలసి ప్రకటించే బండిల్ ఆఫర్ల జోరు పెరుగుతుందని పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు. మెగా సేవర్ ప్యాక్స్ ధర మరింత తగ్గొచ్చు! ప్రస్తుతం ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్ కంపెనీలు వాటి ప్రి-పెయిడ్ ఇంటర్నెట్ ప్యాక్స్పై అధిక డేటాను అందిస్తున్నాయని యూబీఎస్ పేర్కొంది. తమ లెక్కల ప్రకారం సాంప్రదాయ ప్లాన్స్తో పోలిస్తే మెగా సేవర్ ప్యాక్స్ త్వరలో 35-40 శాతం మరింత తక్కువ ధరకే అందుబాటులో రావొచ్చని తెలిపింది. ‘రిలయన్స్ జియో రాకతో 4జీ డేటా వినియోగం బాగా పెరుగుతుంది. దీనికి తక్కువ డేటా చార్జీలతో కూడిన ప్లాన్స్, చౌక ధరల 4జీ హ్యాండ్సెట్స్ వంటి అంశాలు కారణంగా నిలుస్తాయి’ అని వివరించింది. ఉచిత కాలింగ్తో బండిల్ ప్లాన్స్? జియో సేవలు త్వరలో ప్రారంభం కానుండటంతో ఎయిర్టెల్ సహా ఇతర కంపెనీలు డేటా చార్జీలను తగ్గించే అవకాశముందని జేపీ మోర్గాన్ అభిప్రాయపడింది. టెల్కోలు డేటాతోపాటు ఉచిత కాలింగ్ ఫీచర్తో కూడిన బండిల్ ప్లాన్స్ అందించొచ్చని పేర్కొంది. జియోతో పోటీపడటానికి ఇతర కంపెనీలు ఎలాంటి ఆఫర్లను ప్రకటిస్తాయో చూడాల్సి ఉందని వివరించింది. కాగా టెల్కోలు ప్రస్తుతం రూ.9 నుంచి (20 ఎంబీ, 28 రోజుల వ్యాలిడిటీ) డేటా ప్లాన్స్ను అందిస్తున్నాయని క్రెడిట్ సూచీ పేర్కొంది. దీనికి మార్కెట్లోకి కొత్త సంస్థ అడుగుపెట్టడం కారణం కావొచ్చని అభిప్రాయపడింది. ఎయిర్టెల్ వ్యూహాలు మెరుగు రిలయన్స్ జియో సేవల ప్రారంభాన్ని దృష్టిలో ఉంచుకొని ఎయిర్టెల్ వ్యవహరిస్తోన్న విధానాలు మెరుగ్గా వున్నాయని యూబీఎస్ పేర్కొంది. టారిఫ్ ధరలను తగ్గించకుండా అదనపు డేటా అందించడం, రూ.1,498 ముందస్తు చెల్లింపుతో రూ.51లకే 1 జీబీ డేటా వంటి ప్లాన్స్ను ప్రకటించిన విషయం తెలిసిందే. కస్టమర్లను నిలుపుకోవడానికి ఇలాంటి చర్యలు దోహదపడతాయని తెలిపింది. వీటి వ ల్ల డేటా వినియోగం కూడా పెరుగుతుందని పేర్కొంది. జియోని నిలువరిస్తాయా? రిలయన్స్ జియోని ప్రస్తుత దిగ్గజ టెల్కోలు ఎలా ఎదుర్కొంటాయనేది ఆసక్తికరంగా మారిందని గోల్డ్మన్ శాక్స్ పేర్కొంది. జియో ఇప్పటికే రూ.50లకే 1 జీబీ డేటా వంటి పలు వినూత్నమైన ఆఫర్లను ప్రకటించింది. ‘సంస్థ ప్రివ్యూ ఆఫర్ కింద ఉచిత సిమ్తో 4 నెలలు అపరిమిత డేటా, వాయిస్ సేవలను అందిస్తోంది. దీనికి మార్కెట్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. వచ్చే రెండేళ్లలో జియో యూజర్ల సంఖ్య 3.5 కోట్లకు చేరొచ్చు’ అని వివరించింది. దీని దెబ్బకి ఇతర టెల్కోల డేటా వినియోగం వృద్ధి 70% నుంచి 50 శాతానికి తగ్గొచ్చని పేర్కొంది. నాణ్యమైన టెలికం సేవలు కావాలి: సర్వే న్యూఢిల్లీ: రిలయన్స్ జియో దెబ్బకి టెలికం కంపెనీలు టారిఫ్ ధరలపై ప్రధానంగా దృష్టికేంద్రీకరించాయి. అందులో భాగంగానే టారిఫ్ ధరలను తగ్గిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తక్కువ టారిఫ్ ధరలు మంచిదేనని, వీటితోపాటు టెల్కోలు మెరుగైన సేవలను అందిస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ విషయం ‘లోకల్సర్కిల్’ అనే ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యింది. సర్వే ప్రకారం.. టెల్కోల డేటా సర్వీసులు చాలా పేలవంగా ఉన్నాయని 43 శాతం మంది పేర్కొన్నారు. ఇక వాయిస్ సేవలు సంతృప్తికరంగా లేవని 27 శాతం మంది తెలిపారు. కాల్ డ్రాప్స్ విషయానికి వస్తే.. 53 శాతం మంది వారి ఆపరేటర్కు యావరేజ్ రేటింగ్ను ఇచ్చారు. ఇక టెలికం సంబంధిత సమస్యలను చక్కబెట్టడానికి నియంత్రణ సంస్థ ట్రాయ్ తగినంత కృషి చేయలేదని దాదాపు 77 శాతం మంది అభిప్రాయపడ్డారు. డౌన్లోడింగ్ వ్యయం ఎక్కువగా ఉందని 53 శాతం పేర్కొన్నారు. -
పెట్రోల్, డీజిల్ ధరలు షాకివ్వనున్నాయా?
వాహనదారులకు మరోషాక్. ఈ మధ్య కాలంలో గణనీయంగా పెరిగిన ధరలతో ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరల్లో నమోదైన క్షీణతకు ఇక చెల్లుచీటీ ఇచ్చినట్టేనని అంచనాలు చెబుతున్నాయి. డాలర్ తో పోలిస్తే దేశీయ కరెన్సీ విలువ తగ్గడం, పెరిగిన డిమాండ్, ఉత్పత్తి తక్కువ కావడంతో ఇక వీటి ధరలు మోత మోగనున్నాయని సమాచారం. 2014 డిసెంబర్ నెల స్థాయిని తాకాయట. తాజా ఆయిల్ ధరల నివేదిక ప్రకారం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినట్టు తెలుస్తోంది. పెట్రోల్ ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ కు రూ.63.02లుగా ఉంటే, డీజిల్ లీటర్ కు రూ.51.67కు పెరిగిందట. అయితే ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయట. గ్లోబల్ గా క్రూడ్ ఆయిల్ ధరలు స్మార్ట్ ర్యాలీ కొనసాగిస్తుండటంతో పాటు, ఏడు నెలల తర్వాత మొదటిసారి, బ్రెంట్ ఆయిల్ ఫ్యూచర్స్, బ్యారల్ ధర 50 డాలర్లకు పెరిగిందని తాజా నివేదికలు చెబుతున్నాయి. చాలాకాలంగా బేరిష్ మార్కెట్ గా కొనసాగిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఎనర్జీ రంగంలో మంచి అవుట్ లుక్ కనిపిస్తుండటంతో వీటి ధరలు పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఉత్పత్తి పడిపోవడంతో పాటు డిమాండ్ పెరుగుతుండటం క్రూడ్ ఆయిల్ ధరలు ఎక్కువ కావడానికి దోహదం చేస్తున్నాయని ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు గోల్డ్ మ్యాన్ సాచే తెలిపింది. డిమాండ్ వైపు కాకుండా సప్లై వైపే ఎక్కువగా మార్పులు సంభవించడంతో, క్రూడ్ ధరల్లో ప్రభావం కనిపిస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే జనవరిలో బ్యారల్ కు 30 డాలర్లుగా ఉన్న క్రూడ్ ఆయిల్ ధరలు, ప్రస్తుతం రికవరీ అయి 50 డాలర్లగా నమోదయ్యాయి. రూపాయి విలువ పడిపోవడం కూడా దేశీయంగా క్రూడ్ ఆయిల్ ధరలపై ఒత్తిడిని నెలకొలేలా చేస్తుందని కేర్ రేటింగ్స్ తెలిపింది. ప్రస్తుతం రూపాయి 68-69 మధ్య నడుస్తోంది. ఒకవేళ గ్లోబల్ గా క్రూడ్ ధరలు సాధారణంగా ఉన్నా.. ప్రభుత్వం వీటి ధరలను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. 2014 మేలో మోదీ ప్రభుత్వం పాలనలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీలు దాదాపు రెండింతలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ పై వేసే పన్నులతోనే మోదీ ప్రభుత్వం తమ రెవెన్యూలను పెంచుకుందని వాదనలు వినిపిస్తున్నాయి. -
భారీ ఐపీఓ బాటలో వొడాఫోన్!
రూ.13,200-16,500 కోట్ల రేంజ్లో హాంకాంగ్: భారత్లో ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రావడానికి వొడాఫోన్ రంగం సిద్ధం చేస్తోంది. ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా వ్యవహరించడానికి సిటిగ్రూప్, గోల్డ్మన్ శాక్స్, మోర్గాన్ స్టాన్లీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్, యూబీఎస్ గ్రూప్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కోటక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వంటి దిగ్గజ సంస్థలను వొడాఫోన్ గ్రూప్ ఆహ్వానించిందని సమాచారం. ఐపీఓ వ్యవహారాలను చూడడానికి రెండు వారాల్లో ఆరు సంస్థలను ఎంపిక చేయనున్నదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆరు సంస్థలను ఈ ఐపీఓ విలువ 200 కోట్ల డాలర్ల నుంచి 250 కోట్ల డాలర్ల(రూ.13,200 కోట్ల నుంచి రూ.16,500 కోట్లు) రేంజ్లో ఉంటుందని ఆ వర్గాల అంచనా. 2010లో ప్రభుత్వ రంగ కోల్ ఇండియా కంపెనీ ఐపీఓ ద్వారా 350 కోట్ల డాలర్లు సమీకరించింది. దాని తర్వాత ఇదే అతి పెద్ద ఐపీఓ కానున్నది. విశ్లేషకుల అంచనా ప్రకారం వొడాఫోన్ ఇండియా విలువ 2,000 కోట్ల డాలర్లు(రూ.1,32,000 కోట్లు) ఉంటుందని అంచనా. -
జత్రోపా ప్లాంట్ పెట్టుబడులపై సెబీ నిషేధం
ముంబై: జత్రోపా మొక్కల పెంపకం ద్వారా భారీ స్థాయిలో లాభాలు ఆర్జించవచ్చంటూ పెట్టుబడులను సమీకరించే పథకాలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా చెక్ పెట్టింది. మేకలు, ఆవులు, ఈమూ పక్షులు తదితరాల పెంపకం ద్వారా లాభాలు ఆర్జించే పథకాలను ఇప్పటికే నిషేధించిన సంగతి తెలిసిందే. జత్రోపా మొక్కల పెంపకం ద్వారా పెట్టుబడులు ఏడేళ్లలో రెట్టింపునకుపైగా పెరుగుతాయంటూ ఇటీవల కొన్ని సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి నిధులను సమీకరిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చినట్లు సెబీ పేర్కొంది. ఇలాంటి పథకం ద్వారా ఢిల్లీకి చెందిన సన్షైన్ గ్లోబల్ ఆగ్రో లిమిటెడ్(గతంలో సన్షైన్ ఫారెస్ట్రీ ప్రయివేట్) దాదాపు 40,000 మంది ఇన్వెస్టర్ల నుంచి సొమ్ము వసూలు చేసినట్లు తెలిపింది. ఒక్కో జత్రోపా మొక్కపైనా రూ. 1,000 ఇన్వెస్ట్చేస్తే ఏడేళ్ల పెంపకం తరువాత మొక్క ఖరీదు రూ. 3,000కు చేరుతుందంటూ ఆశ చూపినట్లు వివరించింది. 2007 నుంచి వెలుగులోకి ఈజిప్ట్, ఇండియా, మడగాస్కర్ వంటి ఉష్ణ దేశాలలో పెరిగే జత్రోపా మొక్కలు బయోడీజిల్ ఇంధనానికి భవిష్యత్లో భారీగా ఉపయోగపడతాయని గోల్డ్మన్ శాక్స్ 2007లో అంచనా వేసింది. ఈ అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం వేసిన అంచనాతో జత్రోపా మొక్కలపై పెట్టుబడుల పరమైన ఆసక్తి ఏర్పడింది. -
ఖజానా గల గల
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరానికి(2014-15) సవరించిన డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం రూ. 16,027 కోట్లను ప్రభుత్వం అధిగమించింది. ప్రభుత్వ సంస్థల వాటాలతో ఏర్పాటు చేసిన సీపీఎస్ఈ ఈటీఎఫ్ ద్వారా సమీకరించిన రూ. 3,000 కోట్లతో ప్రభుత్వ నిధుల సమీకరణ తాజాగా రూ. 16,119 కోట్లకు చేరింది. దీనికితోడు యాక్సిస్ బ్యాంక్లో వాటా విక్రయం ద్వారా మరో రూ. 5,550 కోట్లను సైతం ప్రభుత్వం శుక్రవారం సమీకరించింది. వెరసి ఆర్థిక మంత్రి చిదంబరం ఇటీవల లోక్సభలో ప్రవేశపెట్టిన 2014 మధ్యంతర బడ్జెట్లో ప్రతిపాదించిన డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని అధిగమించడమేకాకుండా, ద్రవ్యలోటు కట్టడిని సాధించేందుకు వీలు చిక్కింది. మధ్యంతర బడ్జెట్లో చిదంబరం డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని రూ. 40,000 కోట్ల నుంచి రూ. 16,027 కోట్లకు తగ్గించడంతోపాటు, ద్రవ్యలోటును 4.8%(తొలి అంచనా) నుంచి 4.6%కు కట్టడి చేయాలని ప్రతిపాదించిన విషయం విదితమే. స్పందన ఓకే మ్యూచువల్ ఫండ్ మార్గంలో ప్రభుత్వం తలపెట్టిన నిధుల సమీకరణ ప్రయత్నం విజయవంతమయ్యింది. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా పది ప్రభుత్వ దిగ్గజాల వాటాలతో ఏర్పాటు చేసిన ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్(సీపీఎస్ఈ ఈటీఎఫ్) ఆఫర్కు ఇన్వెస్టర్ల నుంచి గరిష్ట స్థాయిలో స్పందన లభించింది. రూ. 3,000 కోట్ల సమీకరణకు ప్రభుత్వం ఈ కొత్త ఫండ్ను ఆఫర్ చేయగా... రూ. 4,000 కోట్ల విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. ఆఫర్ చివరిరోజు(21న) మొత్తం రూ. 1,600 కోట్ల విలువైన బిడ్స్ లభించగా, వీటిలో విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) వాటా రూ. 1,000 కోట్లవరకూ ఉండటం గమనార్హం. ఫలితంగా సీపీఎస్ఈ ఈటీఎఫ్కు దరఖాస్తు చేసిన ప్రతీ రిటైల్ ఇన్వెస్టర్కూ కొంత పరిమాణంలో యూనిట్లు లభించే అవకాశముంది. కాగా, అధికంగా లభించిన రూ. 1,000 కోట్లను ప్రభుత్వం వెనక్కి ఇవ్వనుంది. ఆఫర్లో భాగంగా తొలి రోజు యాంకర్ ఇన్వెస్టర్లయిన ఎస్బీఐ, ఎల్ఐసీ తదితర బీమా కంపెనీలు రూ. 835 కోట్లను ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్కానున్న ఈ ఫండ్ను గోల్డ్మన్ శాక్స్ నిర్వహించనుంది. ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, గెయిల్, కోల్ ఇండియా, ఇండియన్ ఆయిల్, కంటెయినర్ కార్పొరేషన్, ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఇంజనీర్స్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్లో వాటాలతో రూపొందించిన ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్లో భాగంగా ఇన్వెస్టర్లకు రూ. 10 ముఖ విలువగల యూనిట్లను కేటాయిస్తారు. ఆదుకున్న ఎల్ఐసీ ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్లో ప్రభుత్వం 9% వాటాను విక్రయించడం ద్వారా రూ. 5,550 కోట్లను సమీకరించింది. యాక్సిస్లో ఎస్యూయూటీఐ ద్వారా ప్రభుత్వం 20.72% వాటాను కలిగి ఉంది. స్టాక్ ఎక్స్ఛేంజీలలో నమోదైన బల్క్ డీల్ సమాచారం ప్రకారం 4.2 కోట్ల యాక్సిస్ బ్యాంక్ షేర్లను రూ. 1,315.13 సగటు ధరలో ప్రభుత్వం విక్రయించింది. ఇది బీఎస్ఈలో గురువారం యాక్సిస్ ముగింపు ధర రూ. 1,357తో పోలిస్తే 3.1% డిస్కౌంట్. కాగా, ఎల్ఐసీ 85 లక్షల షేర్లను కొనుగోలు చేయడం విశేషం. ఇందుకు రూ. 1,116 కోట్లను వెచ్చించింది. యాక్సిస్ షేర్లను కొన్న ఇతర సంస్థలలో సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ మారిషస్, గోల్డ్మన్ శాక్స్ సింగపూర్ ఉన్నాయి. వాటా విక్రయం కారణంగా యాక్సిస్లో ఎస్యూయూటీఐ వాటా 11.72%కు పరిమితమైంది. షేరు ఊగిసలాట... ప్రభుత్వ వాటా విక్రయం నేపథ్యంలో బీఎస్ఈలో యాక్సిస్ షేరు హెచ్చుతగ్గులకు లోనైంది. ఉదయం సెషన్లో 3%పైగా పతనమై రూ. 1,313ను చేరగా, ఆపై కోలుకుని గరిష్టంగా రూ. 1,411ను సైతం తాకింది. చివరకు 2.7% లాభంతో రూ. 1,393 వద్ద ముగిసింది. -
ప్రభుత్వ ఈటీఎఫ్లో యాంకర్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సంస్థల ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్(సీపీఎస్ఈ ఈటీఎఫ్)లో సంస్థాగత(యాంకర్) ఇన్వెస్టర్లు రూ. 850 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేశారు. ప్రభుత్వ రంగానికి చెందిన పది బ్లూచిప్ కంపెనీల వాటాలతో ఏర్పాటు చేసిన ఈటీఎఫ్ను మంగళవారం ప్రవేశపెట్టగా, తొలి రోజు యాంకర్ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు మాత్రమే అవకాశాన్ని కల్పించారు. ఈటీఎఫ్ ద్వారా మొత్తం రూ. 3,000 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించడంతోపాటు, యాంకర్ ఇన్వెస్టర్లకు రూ. 900 కోట్ల యూనిట్లను రిజర్వ్ చేసింది. కాగా, బుధవారం నుంచీ ఈటీఎఫ్ యూనిట్ల కొనుగోలుకి రిటైలర్లు తదితర ఇన్వెస్టర్లు దరఖాస్తు చేసుకోవచ్చు. యాంకర్ ఇన్వెస్టర్ల విభాగంలో కనీసం రూ. 10 కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సి ఉండగా, ఆరు సంస్థలు బిడ్డింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఆఫర్ ఈ నెల 21న ముగియనుంది. ఓఎన్జీసీ, ఐవోసీ, ఆయిల్ ఇండియా, కోల్ ఇండియా, కంటెయినర్ కార్పొరేషన్, పీఎఫ్సీ, ఆర్ఈసీ తదితర 10 సంస్థల వాటాలతో ఈ ఫండ్ను రూపొందించిన సంగతి తెలిసిందే. అన్ని రకాల ఇన్వెస్టర్లకూ ప్రభుత్వం 5% తొలి(అప్ఫ్రంట్) డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది. దీనిలో భాగంగా అర్హతగల రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రతీ 15 యూనిట్లకు ఒక లాయల్టీ యూనిట్(6.66% డిస్కౌంట్) లభించనుంది. కోల్ ఇండియా డిజిన్వెస్ట్మెంట్? వచ్చే ఆర్థిక సంవత్సరం(2014-15)లో కోల్ ఇండియాలో డిజిన్వెస్ట్మెంట్ను చేపట్టనున్నట్లు ఆర్థిక శాఖ అధికారి ఒకరు చెప్పారు. నిజానికి ఈ ఏడాది మార్చిలోగా కోల్ ఇండియాలో 10% వాటాను విక్రయించాలని ప్రభుత్వం భావించినప్పటికీ, ట్రేడ్ యూనియన్లు వ్యతిరేకించడం వంటి ప్రతికూల పరిస్థితులు ఎదురుకావడంతో ప్రతిపాదనను వాయిదా వేసింది. అంతేకాకుండా 5% వాటాను మాత్రమే డిజిన్వెస్ట్ చేయాలని నిర్ణయించింది. మరోవైపు కంపెనీలో 90% వాటా కలిగిన ప్రభుత్వం డివిడెండ్ రూపంలో రూ. 19,000 కోట్లను అందుకోవడం గమనార్హం. -
కొత్త గరిష్టం నుంచి జారుడు...
కొన్ని బ్లూచిప్ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో మంగళవారం భారత్ స్టాక్ సూచీలు గరిష్టస్థాయి నుంచి కిందకు దిగిపోయాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలతో మంగళవారం ట్రేడింగ్ తొలిదశలో బీఎస్ఈ సెన్సెక్స్ 200 పాయింట్లకుపైగా ర్యాలీ జరిపి 22,041 పాయింట్లకు, నిఫ్టీ 70 పాయింట్ల పెరుగుదలతో 6,575 పాయింట్లకు చేరాయి. ఇవి రెండు కొత్త రికార్డుస్థాయిలు. చివరకు సెన్సెక్స్ 23 పాయింట్ల స్వల్పలాభంతో 21,833 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 6,516 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ కమిటీ రెండురోజుల సమావేశం మంగళవారం ప్రారంభంకానుండటం, క్రిమియా రష్యాలో విలీనమయ్యే ప్రక్రియ ప్రారంభంకావడం వంటి అంశాలతో గరిష్టస్థాయిలో లాభాల స్వీకరణ జరిగిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. పీఎస్యూ బ్యాంకింగ్ షేర్లకు కొనుగోలు మద్దతు లభించింది. ఎస్బీఐ నేతృత్వంలో యూనియన్బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్లు 2-5 శాతం మధ్య ర్యాలీ జరిపాయి. మారుతి సుజుకి 7 శాతంపైగా పెరగ్గా, ఇండెక్స్ హెవీవెయిట్ షేర్లు ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్లు 1.5-2.5 శాతం మధ్య ఎగిశాయి. ఐటీ షేర్లు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రోలు 1-2 శాతం మధ్య క్షీణించాయి. టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, లార్సెన్ అండ్ టూబ్రోలు 1-3 శాతం మధ్య తగ్గాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 1,012 కోట్ల పెట్టుబడులు చేయగా, దేశీయ సంస్థలు రూ. 202 కోట్లు వెనక్కు తీసుకున్నాయి. ఎస్బీఐ కౌంటర్లో షార్ట్ కవరింగ్..... ప్రైవేటు రంగ బ్యాంకింగ్ షేర్లతో పోలిస్తే వెనుకబడివున్న ప్రభుత్వ రంగ ఎస్బీఐ మంగళవారం స్థిరంగా ర్యాలీ జరిపింది. క్యాష్ మార్కెట్లో కొనుగోళ్లతో పాటు ఫ్యూచర్ కాంట్రాక్టులో షార్ట్ కవరింగ్ జరగడంతో ఈ కాంట్రాక్టు నుంచి 1.86 లక్షల షేర్లు కట్ అయ్యాయి. దాంతో మొత్తం ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 70.26 లక్షల షేర్లకు తగ్గింది. రూ. 1,700 స్ట్రయిక్ వద్ద కాల్ కవరింగ్, పుట్ రైటింగ్ ఫలితంగా ఈ కాల్ ఆప్షన్ నుంచి 1.40 లక్షల షేర్లు కట్కాగా, పుట్ ఆప్షన్లో 64 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. ఈ ఆప్షన్లలో వరుసగా 4,80 లక్షలు, 2.08 లక్షల షేర్ల చొప్పున ఓఐ వుంది. రూ. 1,750 స్ట్రయిక్ వద్ద కాల్ రైటింగ్ కారణంగా 3.11 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. ఈ ఆప్షన్లో ఓఐ 7.14 లక్షల షేర్లకు పెరిగింది. సమీప భవిష్యత్తులో ఈ షేరు రూ. 1,700పైన స్థిరపడితే రూ. 1,750 స్థాయిని సమీపించవచ్చని, రూ. 1,700 దిగువన క్రమేపీ బలహీనపడవచ్చని ఈ డేటా సూచిస్తున్నది. -
ఐపీవోకి చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా
హాంకాంగ్: చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ పబ్లిక్ ఇష్యూ చేపట్టే సన్నాహాల్లో ఉంది. ఇందుకు వీలుగా ఆరు మర్చంట్ బ్యాంకర్లతో చర్చలు నిర్వహిస్తోంది. అమెరికా మార్కెట్లలో చేపట్టనున్న ఐపీవో ద్వారా కంపెనీ 15 బిలియన్ డాలర్ల వరకూ సమీకరించగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది జరిగితే 2012లో వచ్చిన ఫేస్బుక్ ఇష్యూ తరువాత అతిపెద్ద ఐపీవోగా నిలిచే అవకాశముంది. ఇష్యూ నిర్వహించేందుకు(అండర్రైటింగ్) సిటీగ్రూప్, డాయిష్ బ్యాంక్, గోల్డ్మన్ శాక్స్, మోర్గాన్ స్టాన్లీ తదితర సంస్థలతో చర్చలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. త్వరలో ప్రారంభంకానున్న ఈ ఇష్యూ ఊహించినదానికంటే అధిక విలువను సాధించే అవకాశమున్నదని, తద్వారా టెక్నాలజీ పరిశ్రమలో రెండో అతిపెద్ద ఇష్యూగా నిలవవచ్చునని పేర్కొన్నాయి. ఈబే, అమెజాన్ కలిపితే... ఈ కామర్స్ దిగ్గజాలు ఈబే, అమెజాన్.కామ్ల సంయుక్త బిజినెస్కంటే అలీబాబా వ్యాపారమే అధికంకావడం విశేషం. సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 20,000 మంది పనిచేస్తున్నారు. చైనా ఈ కామర్స్ మార్కెట్లో 80% వాటా కంపెనీదే. అలీబాబాలో 37% వాటాతో సాఫ్ట్బ్యాంక్, 24% వాటా కలిగిన యాహూ అతిపెద్ద వాటాదారులుగా ఉన్నాయి. అలీబాబా వ్యవస్థాపకులు, కొంతమంది సీనియర్ మేనేజర్లకు కలిపి 13% వరకూ వాటా ఉంది. -
వచ్చే ఏడాది 5.5% వృద్ధి: గోల్డ్మన్ శాక్స్
ముంబై: వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్ 5.5% వృద్ధి సాధిస్తుందని అమెరికా బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్మన్ శాక్స్ అంచనా వేస్తోంది. ఈ అంచనాల్లో ఎలాంటి రాజకీయ పరిస్థితుల ప్రమేయం లేదని గోల్డ్మన్ శాక్స్ ఇండియా ముఖ్య ఆర్థిక వేత్త తుషార్ పొద్దార్ వివరించారు. మూలధన పెట్టుబడులు స్వల్పంగా పెరిగే అవకాశాలుండటం, ఎన్నికల తర్వాత సంభవించే సాధారణ వృద్ధి తదితర అంశాల కారణంగా ఈ వృద్ధి రేటును నిర్ణయించామని పేర్కొన్నారు. బీజేపీకి చెందిన నరేంద్ర మోడి ప్రధానవుతారని అందుకనే భారత స్టాక్ల రేటింగ్ను అప్గ్రేడ్ చేస్తున్నామని ఈ నెల మొదట్లో ఈ కంపెనీ పేర్కొంది. దీంతో వివిధ కేంద్ర మంత్రుల నుంచి విమర్శలు వెల్లువలా వచ్చాయి. రాజకీయాలు చేయకుండా గోల్డ్మన్ శాక్స్ తన పని చూసుకోవాలంటూ పలువురు కేంద్ర మంత్రులు విమర్శలు గుప్పించారు. దీంతో తాజా అంచనాల్లో రాజకీయాలను పరిగణనలోకి తీసుకోలేదని నిపుణులంటున్నారు. ఈ ఏడాదిలో 4.3% వృద్ధి నమోదవుతుందని అభిప్రాయాన్నే పొద్దార్ పునరుద్ఘాటించారు. -
రేటింగ్స్లో రాజకీయాల్లేవు: గోల్డ్మన్ శాక్స్
న్యూఢిల్లీ: భారత ఈక్విటీ మార్కెట్ల రేటింగ్ను అప్గ్రేడ్ చేయడం వెనుక ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ గోల్డ్మన్ శాక్స్ స్పష్టం చేసింది. మార్కెట్ వర్గాల అంచనాల ఆధారంగానే నివేదిక తయారు చేశామని, ఇందులో పార్టీలకు కొమ్ముకాసే పక్షపాత ధోరణేమీ లేదని సంస్థ భారత విభాగం సీఈవో బంటీ బోహ్రా తెలిపారు. ఇన్వెస్టర్ల సెంటిమెంటును పార్టీల రాజకీయాలు ప్రభావితం చేస్తున్నాయని మాత్రమే తాము పేర్కొన్నామన్నారు. ఆసియా పసిఫిక్ పోర్ట్ఫోలియో వ్యూహాలపై తమ నివేదికకు క ట్టుబడి ఉన్నామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే విజయం ఖాయమంటూ గోల్డ్మన్ శాక్స్ ఇటీవల ఇచ్చిన నివేదికపై రాజకీయ దుమారం రేగిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. మోడీ-అవర్ వ్యూ పేరిట నివేదికలో ఈక్విటీ ఇన్వెస్టర్లు బీజేపీని వ్యాపారాలకు అనుకూలమైన పార్టీగాను, మోడీని మార్పునకు ప్రతినిధిగాను భావిస్తున్నారని పేర్కొంటూ.. నిఫ్టీ టార్గెట్ను 6,900 పాయింట్లకు సవరించింది. అయితే, ఈ తరహా నివేదికలు అసంబద్ధం, అభ్యంతరకరమైనవంటూ వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు. -
‘మోడీ ఎఫెక్ట్... 6,900కు నిఫ్టీ’! : గోల్డ్మన్ శాక్స్
ముంబై: భారత్ పట్ల అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు ఆశావహంగా ఉన్నాయి. వచ్చే ఏడాది చివరి నాటికి నిఫ్టీ 6,900 పాయింట్లకు చేరుతుందని గోల్డ్మన్ శాక్స్ అంచనా వేస్తోంది. ప్రస్తుతమున్న స్థాయి నుంచి చూస్తే ఇది 9 శాతం అధికం. అంతేకాకుండా పీఈ నిష్పత్తికి 14.5 రెట్లు ఎక్కువ. ఇంత ఎక్కువ అంచనాలను వెల్లడించిన తొలి బ్రోకరేజ్ సంస్థ ఇదే కావడం విశేషం. మరో వైపు ఈ ఏడాది చివరి నాటికి సెన్సెక్స్ 22,000 పాయింట్లకు చేరుకుంటుందని డాయిష్ బ్యాంక్ అంచనా వేస్తోంది. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ అధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, ఈ రాజకీయ మార్పుకు మెరుగవుతున్న ఆర్థిక పరిస్థితులు కూడా తోడవుతాయని ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీలు దూసుకుపోతాయని గోల్డ్మన్ శాక్స్ పేర్కొంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయని వివరించింది. మూలధన అకౌంట్ ఒత్తిడులు ప్రస్తుతానికైతే తగ్గాయని, అయితే సమస్యలు పూర్తిగా సమసిపోయినట్లు కాదని, వృద్ధి మందగమనంగానే ఉన్నదని వివరించింది. -
మన స్టాక్స్... అండర్వెయిట్
న్యూఢిల్లీ: ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో సాగుతున్నప్పటికీ గోల్డ్మన్ శాక్స్ మాత్రం ఈక్విటీలకు అండర్వెయిట్ రేటింగ్ను ఇచ్చింది. వెరసి రానున్న ఏడాది కాలంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ ప్రధాన సూచీ ‘నిఫ్టీ’ లక్ష్యాన్ని 5,700 పాయింట్లుగా పేర్కొంది. ప్రస్తుతం నిఫ్టీ 5,900 స్థాయిలో కదులుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు స్టాక్ మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 20,000 పాయింట్ల సమీపానికి చేరినప్పటికీ ఇండియా స్థూల ఆర్థిక పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నాయంటూ అంతర్జాతీయ ఫైనాన్షియల్ సర్వీసుల దిగ్గజం గోల్డ్మన్ వ్యాఖ్యానించింది. ఆర్థిక వ్యవస్థ పలు సవాళ్లను ఎదుర్కొంటున్నదని, కఠిన ఆర్థిక విధానాల కారణంగా ఈక్విటీల రేటింగ్ను తగ్గించామని వివరించింది. కాగా, జూలై చివర్లోనూ దేశీయ ఈక్విటీలకు అండర్వెయిట్ రేటింగ్ను ప్రకటించింది. దేశీయ వృద్ధి అవకాశాలు బలహీనంగా ఉన్నాయంటూ గోల్డ్మన్ అప్పట్లో పేర్కొంది. అప్పటినుంచీ పరిస్థితుల్లో పెద్దగా మార్పులేవీ రాలేదంటూ తాజాగా వివరణ ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీల ఆర్జన గతేడాదితో పోలిస్తే 5% పాయింట్లు తక్కువగా 8% వృద్ధికి పరిమితం కావచ్చునని అంచనా వేసింది. ర్యాలీ నిలబడదు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ చర్యల నేపథ్యంలో మార్కెట్లలో ర్యాలీ వచ్చినప్పటికీ మూలాలు పటిష్టంగా లేనందున మళ్లీ బలహీనపడే అవకాశముందని పేర్కొంది. అధిక వడ్డీ రేట్ల నేపథ్యంలో పెట్టుబడులు క్షీణించడం, పెరుగుతున్న ఇంధన ధరలు, ఉద్యోగ అవకాశాలు తగ్గడంతో వినియోగ డిమాండ్ నెమ్మదించడం వంటి సమస్యలు కొనసాగుతాయని భావిస్తున్నట్లు తెలిపింది. సమీప కాలానికి టోకు ధరల ద్రవ్యోల్బణం 7%కు పెరుగుతుందని, దీంతో రిజర్వ్ బ్యాంక్ కఠిన పరపతి విధానాలను కొనసాగిస్తుందని గోల్డ్మన్ శాక్స్ ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా కొద్ది నెలల్లో కీలకమైన కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు, పార్లమెంట్కు సైతం సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో రాజకీయ అనిశ్చితికి తెరలేవనుందని తెలిపింది. ఈ పరిస్థితులు విధాన నిర్ణయాలను ఆటంకపరుస్తాయని వ్యాఖ్యానించింది. -
వృద్ధి 4శాతమే: గోల్డ్మన్ శాక్స్
న్యూఢిల్లీ: భారత్ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2013-14) 4 శాతం వృద్ధి మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్మన్ శాక్స్ తాజాగా అంచనావేసింది. ఈ మేరకు తన క్రితం అంచనాలను 6 శాతం నుంచి కుదించింది. 2014-15లో కూడా వృద్ధి రేటు అంచనాలను 6.8 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గించింది. రూపాయి 72కు... రానున్న ఆరు నెలల్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 72 కనిష్ట స్థాయిలను తాకుతుందని సైతం సంస్థ విశ్లేషించింది. ఈ విలువ 3 నెలలకు 70, ఆరు నెలల్లో 72కు, 12 నెలలకు తిరిగి 70కి చేరుతుందని (60 నిర్ణీత రేటు నుంచి) తన నివేదికలో విశ్లేషించింది. విదేశీ నిధుల క్లిష్టత అమెరికా ఫెడ్ ఆర్థిక సహాయక చర్యలను వెనక్కుతీసుకునే పరిస్థితులు తలెత్తితే భారత్, పలు ఆగ్నేయాసియా దేశాలు క్లిష్టమైన విదేశీ నిధుల పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉందని విశ్లేషించింది. కరెంట్ అకౌంట్, ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం వంటి సమస్యలు ఆయా దేశాల్లో తీవ్రమవుతాయని అంచనావేసింది. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసే చర్యలు వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అభిప్రాయపడింది. అయితే దీర్ఘకాలికంగా చూస్తే, భారత్ వృద్ధి తీరు ఆశాజనకంగానే ఉండే అవకాశం ఉందని పేర్కొంది.