guru
-
సుజాత ఏకపాదులు
ఉద్దాలక మహర్షి కూతురు సుజాత. ఉద్దాలకుడు ఆశ్రమవాసం చేస్తూ, గురుకులం నడిపేవాడు. అతడి వద్ద ఎందరో శిష్యులు వేద శాస్త్రాలను అధ్యయనం చేస్తూ ఉండేవారు. ఉద్దాలకుడి ఆధ్వర్యంలో ఆయన శిష్యులు వేదపఠనం చేస్తున్నప్పుడు సుజాత తరచుగా అక్కడకు వచ్చి కూర్చునేది. వారి వేదపఠనాన్ని శ్రద్ధగా ఆలకిస్తూ ఉండేది. ఒకరోజు సుజాత ఎప్పటిలాగానే పండ్లు, పాలు తీసుకుని తండ్రి వద్దకు వచ్చింది. ఉద్దాలకుడు కూతురిని తల నిమిరి, పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఆమె రాకతో వేదాధ్యయనానికి కొద్ది క్షణాలు అంతరాయం కలిగింది. శిష్యుల చూపులు గురువుగారి వైపు, ఆయన గారాల కూతురి వైపు మళ్లాయి. గురువుగారి వైపు చూసే చూపులు భక్తి గౌరవాలతో నిండి ఉంటే, సుజాత వైపు చూసే చూపులు భయం భయంగా, చూసీ చూడనట్లుగా ఉండే దొంగ చూపుల్లా ఉన్నాయి. అక్కడ ఉన్న శిష్యులందరిలోనూ ఏకపాదుడి చూపుల్లో ప్రత్యేకత ఉంది. గురువుగారి వైపు అతడు చూసే చూపుల్లో భక్తి శ్రద్ధలు, సుజాత వైపు చూసే చూపుల్లో నిర్లిప్తత, నిరాసక్తత కనిపిస్తున్నాయి.శిష్యులు తిరిగి వేదాధ్యయనం ప్రారంభించారు. గురువుగారి నోటి నుంచి వచ్చే ప్రతి శబ్దాన్ని, ప్రతి స్వరాన్ని మననం చేసకుంటూ, ఒక్క పొరపాటైనా లేకుండా చెప్పగలిగేవాడు ఏకపాదుడు ఒక్కడే! గురువు ముఖతః వచ్చిన ప్రతి స్వరమూ అతడికి మరుక్షణమే కంఠస్థమయ్యేది. ఏకపాదుడు ఏకసంథాగ్రాహి.ఉద్దాలకుడు సాధుస్వభావి. శిష్యులకు ఎలాంటి ఆంక్షలు పెట్టేవాడు కాదు. అవసరమైన నియమాలను సూచనప్రాయంగా మాత్రమే చెప్పేవాడు. గురువుగారు చెప్పకపోయినా, ఏకపాదుడు స్వయంగా తనకు తానే కొన్ని నియమాలను విధించుకుని, క్రమశిక్షణతో పాటించేవాడు. గురువుగారి బోధనలను శ్రద్ధగా ఆలకిస్తూ, అధ్యయనం చేసేవాడు. ఏకపాదుడి గుణగణాలు ఉద్దాలకుడిని ఆకట్టుకున్నాయి. పసితనం నుంచే తండ్రి దగ్గర కూర్చుంటూ వేదాధ్యయనం వినడాన్ని అలవాటుగా చేసుకున్న సుజాతకు క్రమంగా ఏకపాదుడిపై ఆసక్తి పెరగసాగింది. అధ్యయనం కొనసాగుతున్నంత సేపు ఆమె ఏకపాదుడినే తదేకంగా చూడసాగేది. అతడి నిత్యకృత్యాలను గమనించడం ఆమె దినచర్యలో భాగంగా మారింది. రోజులు, నెలలు, ఏడాదులు గడిచిపోతున్నాయి. సుజాత యవ్వనంలోకి అడుగుపెట్టింది. ఏకపాదుడు యువకుడవుతున్నాడు. ఏకపాదుడిని చూడటం కోసమే సుజాత త్వరగా తన పనులు ముగించుకుని, అధ్యయనం సాగేటప్పుడు తండ్రి వద్దకు చేరేది. సుజాత రాక ఆలస్యమైతే, ఏకపాదుడి చూపులు ఆమె కోసం వెదుకులాడేవి.అధ్యయన వేళల తర్వాత మిగిలిన శిష్యులతో పాటు ఏకపాదుడు దర్భలు, అరణి, కట్టెపుల్లలు ఏరుకోవడానికి వెళ్లేవాడు. ఏకపాదుడిని సుజాత అనుసరించేది. దర్భలు, పుల్లలు ఏరుకునేటప్పుడు కూడా అతడు వేదపాఠాలను మననం చేసుకుంటూ ఉండేవాడు. తన రాకను అతడు పట్టించుకోకుంటే, సుజాతకు కోపం వచ్చేది. అయితే, అతడి ఏకాగ్రచిత్తానికి లోలోపల మెచ్చుకునేది. ఒకనాడు గురువుగారి వద్ద కూర్చున్న సుజాత వైపు నుంచి ఏకపాదుడు ఎంత ప్రయత్నించినా చూపు మరల్చుకోలేకపోయాడు. అతి ప్రయాసతో చూపులను గురువుగారి మీదకు మరల్చాడు. చిత్తాన్ని అధ్యయనంపై కేంద్రీకరించాడు. ఉద్దాలకుడు అంతా గమనిస్తూనే, ఏకపాదుడి ఏకాగ్రతకు ఎంతో ఆనందించాడు. ఉద్దాలకుడి శిష్యులలో ఏకపాదుడు మిగిలిన శిష్యులందరి కంటే మిన్నగా అధ్యయనం పూర్తి చేశాడు. అతడికి ఇక బ్రహ్మచర్యం కొనసాగించవలసిన అవసరం లేదని ఉద్దాలకుడు నిర్ణయించాడు. ఒకనాడు ఉదయాన్నే ఏకపాదుడిని పిలిచాడు. ‘నాయనా! నీ అధ్యయనం పూర్తయింది. గురుకులం విడిచి స్వతంత్రంగా నువ్వే ఇతరులకు గురుత్వం వహించే స్థాయి పొందావు. నువ్వు కోరుకున్నప్పుడు బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టి, గృహస్థాశ్రమాన్ని స్వీకరించవచ్చు’ అని చెప్పాడు. ఏకపాదుడు వినయంగా గురువుకు పాదాభివందనం చేశాడు. అదే సమయంలో ఉద్దాలకుడు తన మనసులో మాట చెప్పాలనుకున్నాడు. ‘నీకు సమ్మతమయితే, మా సుజాతకు నువ్వే తగిన వరుడివని నా నమ్మకం’ అన్నాడు.గురువుగారి మాటకు ఏకపాదుడు మహదానందం చెందాడు. ఈ సంభాషణను గుమ్మం చాటు నుంచి వింటున్న సుజాత కూడా ఆనందంలో తేలిపోయింది. గురువుగారి మాటకు ఏకపాదుడు వెంటనే బదులివ్వక నేలచూపులు చూడసాగాడు.‘ఏకపాదా! నీ అభిప్రాయం..’ అడిగాడు ఉద్దాలకుడు.‘గురువర్యా! తమరి మాట నాకు శిరోధార్యం’ అంటూ ఏకపాదుడు మరోసారి పాదాభివందనం చేశాడు.ఉద్దాలకుడు సుముహూర్తాన్ని నిర్ణయించి, తన కూతురు సుజాతను ఏకపాదుడికిచ్చి వివాహం జరిపించాడు. -
సాధకులు... గురువులు
గురు అన్న మాటని అతి సామాన్యంగా వాడేస్తూ ఉంటాం. దారిలో కనపడిన ముక్కు మొహం తెలియని మనిషిని పలకరించటానికి, ఎలా సంబోధించాలో తెలియని సందర్భంలోనూ, స్నేహితులు ఒకరినొకరు పలకరించుకోటానికి, చివరికి బస్ కండక్టర్నీ, డ్రైవర్నీ, ఇంకా ఎవరిని పడితే వారిని గురూ అని సంబోధించటం చూస్తాం. కాస్త పెద్దవారైతే గురువుగారూ అంటారు. గురువు అంటే పెద్ద వాడు అన్న అర్థంలో వాడితే సరే! గురు అన్నది అర్థం మాట అటు ఉంచి, పదమే సరి కాదు. గురువు అన్నది సాధు పదం.అసందర్భంగా ఉపయోగించటమే కాదు కొంత మంది ఆ విధంగా పిలిపించుకోవాలి అని చాలా తాపత్రయ పడుతూ ఉంటారు. నిజానికి ఆ విధంగా పిలిపించుకోవటం చాలా పెద్ద బరువు. బాధ్యత అవుతుంది. నాలుగు లలిత గీతాలు నేర్పి, పది పద్యాలో, శ్లోకాలో నేర్పి, రెండు మూడు యోగాసనాలు నేర్పించి, నాలుగు ప్రవచనాలు చెప్పి ‘గురు’ అనే బిరుదాన్ని తమకు తామే తగిలించుకోవటం చూస్తాం. వారి వద్ద నేర్చుకుంటున్న వారు గురువుగారు అనటం సహజం. తప్పనిసరి. అందరూ అట్లాగే అనాలి అనుకోవటం వల్ల సమస్య. అందరూ ఎందుకు అంటారు? అందుకని తామే తమ పేరులో భాగంగా పెట్టుకుంటున్నారు. అయితే ఏమిటిట?గురువు అంటే అజ్ఞాన మనే చీకట్లని తొలగించి, జ్ఞానమనే వెలుగుని ప్రసాదించే వాడు అని కదా అర్థం. గురుత్వాన్ని అంగీకరిస్తే శిష్యుల పూర్తి బాధ్యత నెత్తి కెత్తుకోవలసి ఉంటుంది. వారి తప్పులకి బాధ్యత తనదే అవుతుంది. బోధకుడుగా ఒక విషయంలో బాధ్యత వహించ వచ్చు. కానీ, గురువు అంటే మొత్తం అన్ని విషయాలలోనూ బాధ్యత ఉంటుంది. ఈ బరువు మోస్తూ ఉంటే తన సాధన సంగతి ఏమిటి? తన జీవన విధానం ఆదర్శ్ర΄ాయంగా ఉన్నదా? ఒక్కసారి గురుస్థానం ఆక్రమిస్తే తరచుగా జరిగేది గర్వం పెరగటం. తాను ఒక స్థాయికి రావటం జరిగింది కనుక ఇక పై తెలుసుకోవలసినది, సాధన చేయవలసినది లేదు అనే అభి్ర΄ాయం కలుగుతుంది. దానితో ఎదుగుదల ఆగి΄ోతుంది. గిడసబారి, వామన వృక్షాలు అవుతారు. బోధిసత్వుడు తనను ‘తథాగతుడు’ అనే చెప్పుకున్నాడు కానీ గురువుని అని చెప్పుకోలేదు. శ్రీ రామ చంద్రుడికి అరణ్యవాసంలో మార్గనిర్దేశనం చేసిన ఋషులు కూడా ‘ఇది ఋషులు నడచిన దారి’ అనే చె΄్పారు. మా దారి అని చెప్పలేదు. ఎందుకంటే, వారు అప్పుడు ఉన్న స్థితి కన్నా ఇంకా ఎక్కువ స్థాయికి వెళ్ళటం అనే ఆదర్శం ఉన్న వారు. ఒక్క సారి తనని గురువు అనిప్రకటించుకున్నాక ముందుకి సాగటం ఉండదు. ఈ జన్మకి ఇంతే! సాధకులు అనే స్థితి లేక ΄ోతే, సాధన ఎక్కడ? సిద్ధి ఎక్కడ? అటువంటి వారిని ఎంతో మందిని చూస్తూనే ఉంటాం. ఏదో చిన్న సిద్ధి రాగానే దానిని ప్రకటించుకుంటూ ఆగి ΄ోతారు. పతనం కూడా అవుతారు. మరొక గొప్ప బాధకరమైన ఉదాహరణ. చిన్నపిల్లలలో ప్రతిభ ఉండచ్చు. దాన్ని ్ర΄ోత్సహించాలి కూడా. కానీ, వాళ్ళకి బిరుదాలు మొదలైనవి ఇచ్చిన తరువాత మరొక్క అడుగు ముందుకి వేయక ΄ోవటం అనుభవమేగా! ఒక రంగంలో అత్యున్నత స్థానాన్ని ΄÷ందిన వారు ఎవరు కూడా తాము గురువులము అని చెప్పుకోవటం చూడం. ఇంకా సాధన చేస్తున్నాము, జ్ఞానం అనంతం మాకు ఈ మాత్రం అందినందుకు ధన్యులం అంటారు. పైగా ప్రతిరోజు మరింతగా సాధన చేస్తూ ఉంటారు. సంగీత విద్వాంసులయినా, వేద పండితులైనా, క్రికెట్ ఆటగాళ్లయినా అభ్యాసం ఆపరు. తాను చెప్పినది విని తనని నలుగురు అనుసరిస్తున్నారు అంటే ఎంత జాగ్రత్తగా మసలుకోవాలి? – డా. ఎన్. అనంత లక్ష్మి -
ఆయనే రుషి..అక్షర కార్మికుడు..మార్గదర్శి..!
ఆదియుగం నుంచి ఆధునికయుగం వరకు ఆయనే రుషి.. శిష్యుల భవిష్యత్కు నిచ్చెన వేసే అక్షర కార్మికుడు.. సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు.. ఆయనెవరో కాదు మనందరికీ విద్యా బుద్ధులు నేర్పే గురువు. అందుకే తల్లిదండ్రుల తర్వాత ఆచార్య దేవో భవ అంటూ గురువుకి స్థానం ఇచ్చాం. గురువు బ్రహ్మ.. గురువు విష్ణువు.. గురువు శివుడు అంటూ కీరిస్తాం.. దేశాన్ని ఏలే రాజైనా సరే ఒక గురువుకి శిష్యుడే.. ప్రపంచాన్ని శాసించే పరమాత్ముడైనా ఒక గురువుకి శిష్యుడిగా మారి విద్యను అభ్యసించాల్సిందే.. గురుభక్తి ఉన్న శిష్యుడు ఉన్నత స్థితికి చేరుకుంటాడు. గురువు ఆశీస్సులతో మనం ఏదైనా సాధించగలం. ఈ రోజు (సెప్టెంబర్ 5న) డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా మనందరికీ స్ఫూర్తినిచ్చే ఉత్తమ గురు-శిష్య జంటల గురించి తెలుసుకుందాం.మహాభారత కాలం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడిని సిసలైన గురుశిష్య సంబంధానికి ప్రతీకలుగా కొలుస్తున్నాం. సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానమని జాతిపిత మహాత్మా గాంధీ కీర్తించారు. ‘మీరు నా కృష్ణుడు, నేను అర్జునుడిని’ అన్నారు గాంధీజీ. ‘మీరు నా ఉపాధ్యాయుడు’ అని కీర్తించారు పండిట్ నెహ్రూ. బహుశా ఈ వ్యాఖ్యల నేపథ్యం నుంచే ఆయన పుట్టిన రోజును టీచర్స్ డేగా నిర్వహించాలనే ఆలోచన పుట్టిందేమో..!గురువులకే గురువు..యుగపురుషుల గురించి ఉపన్యాసం ఇవ్వండని పిలిస్తే.. యుగపురుషుడే వచ్చి ఉపన్యసించారు అని కొనియాడారు హోవెల్. నాలో మామూలు మనిషిని దర్శించిన మహర్షి అని కీర్తించారు సోవియట్ అధినేత స్టాలిన్. అలాంటి గీతాచార్యుడు, ప్రబోధకుడు, యుగపురుషుడు, జ్ఞాన మహర్షి.. మన సర్వేపల్లి రాధాకృష్ణన్. గురువులకే గురువు ఆయన. అందుకే ఆయన పుట్టిన రోజు ‘ఉపాధ్యాయ దినోత్సవం’ అయ్యింది.తరతరాలుగా, యుగయుగాలుగా సనాతన భారతీయ విచారధారలోని పరమార్థ విషయాల్ని ప్రపంచానికి సూటిగా, సులభంగా, స్పష్టంగా తెలియజెప్పిన ధీమంతుడు, ధీశాలి సర్వేపల్లి. హృదయాన్ని, మేధను సమపాళ్లలో పండించిన ప్రజ్ఞాశాలి ఆయన. తత్వశాస్త్రానికి సాహిత్య మాధుర్యం చేకూర్చిన మహా రచయిత రాధాకృష్ణన్. ఆధునిక సమాజానికి ఎలాంటి గురువు అవసరమో, గురువు ఎలా ఉండాలో ఆయన స్వీయచరిత్రలో స్పష్టంగా వివరించారు. బోధ గురువులు, బాధ గురువుల లక్షణాలను ప్రస్తావించారు.గురువు గొప్పదనం..మహాభారతం అరణ్య పర్వంలోని యక్షప్రశ్నల ఇతివృత్తంలోని అంశం.. యక్షుడు ‘మనిషి మనీషి ఎలా అవుతాడు?’ అని ధర్మరాజును ప్రశ్నిస్తాడు. అప్పుడు ధర్మరాజు ‘అధ్యయనం వల్ల, గురువు ద్వారా’ అని బదులిస్తాడు. గురువుకు ఉన్న శక్తి అంతటి గొప్పది. అధర్వణ వేద సంప్రదాయం ప్రకారం చదువు ప్రారంభించే ముందు శిష్యుడు మొదటగా ఇష్టదేవతా ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత ‘స్వస్తినో బృహస్పతిర్దదాతు’ అని గురువును స్మరిస్తాడు.చాణక్యుడు చేతిలో రూపుదిద్దుకున్న శిల్పం చంద్రగుప్తమౌర్యుడు. సమర్థ రామదాసు తయారుచేసిన వీరఖడ్గం శివాజీ. రామకృష్ణ పరమహంస అందించిన ఆధ్యాత్మిక శిఖరం వివేకానందుడు. భారతీయ గురుశిష్య శక్తికి వీళ్లు ఉదాహరణలు మాత్రమే. ఆదిదేవుడితో మొదలైన గురుపరంపర వేదవ్యాసుడితో సుసంపన్నమైంది. భారతీయ సంస్కృతిలో నేటికీ అది కొనసాగుతూనే ఉంది.మన సనాతన ధర్మాన్ని సంరక్షిస్తున్న ఆ గురుదేవులందర్నీ స్మరించుకుంటూ.. ఈ ఉత్తమ గురు-శిష్య ద్వయం నుంచి నేటి తరం అపారమైన జీవిత పాఠాన్ని నేర్చుకుని స్ఫూర్తి పొందొచ్చు.(చదవండి: గురువును మించిన శిష్యులు: ఈ సెలబ్రిటీల గురించి తెలుసా?) -
భక్త విజయం: రుద్రాక్షధారణ ఫలితం
చంద్రసేనుడు కశ్మీర రాజు. అతడి కొడుకు సుధర్ముడు. చంద్రసేనుడి మంత్రి గుణనిధి. రాజు కొడుకు సుధర్ముడికి మంత్రి కొడుకు తారకుడికి బాల్యం నుంచి స్నేహం ఏర్పడింది. వారి స్నేహం దినదిన ప్రవర్ధమానం కాసాగింది. రాజు కొడుకు, మంత్రి కొడుకు ఇద్దరూ ఐశ్వర్యంలో పుట్టిపెరిగిన వారే! ఇద్దరూ అందగాళ్లే! అయినా వారికి రత్నాభరణాలను ధరించడం మీద ఏమాత్రం మోజు ఉండేది కాదు. వారిద్దరూ శివపూజా తత్పరులు. శరీరంపై భస్మత్రిపుండ్రాలు, రుద్రాక్షలు ధరించేవారు. ఎందరు ఎన్ని విధాలుగా నచ్చచెప్పినా, వారు రత్నాభరణాలను ధరించేవారు కాదు. ఆ బాలురిద్దరి ప్రవృత్తి మిగిలిన బాలురి కంటే కొంత విచిత్రంగా ఉండేది. ఒకనాడు పరాశర మహర్షి చంద్రసేనుడి వద్దకు వచ్చాడు. చంద్రసేనుడు ఎదురేగి పరాశరునికి స్వాగతం పలికి, అతిథి సత్కారాలు చేశాడు. ఆయనకు ఈ విచిత్ర బాలురిద్దరినీ పరిచయం చేశాడు. ‘స్వామీ! ఇతడు నా కుమారుడు సుధర్ముడు. అతడి పక్కనున్నవాడు నా మంత్రి కుమారుడు తారకుడు. వీరిద్దరి ప్రవర్తన కొంత వింతగా ఉంటోంది. మిగిలిన బాలల మాదిరిగా అలంకరణలపై ఆసక్తి చూపరు. శరీరంపై నిత్యం భస్మత్రిపుండ్రాలు ధరించి, రుద్రాక్షమాలలు వేసుకుని తిరుగుతుంటారు. మేమంతా ఎంతగా నచ్చచెప్పినా రాజోచితమైన రత్నాభరణాలను ధరించడం లేదు. వీరికి బాల్యంలోనే ఇంతటి వైరాగ్య ప్రవృత్తి ఎందుకు కలిగిందో మాకెవరికీ అర్థం కావడంలేదు. మీరే వీరి సంగతి చెప్పాలి’ అన్నాడు చంద్రసేనుడు. పరాశరుడు దివ్యదృష్టితో ఆ బాలురిద్దరి వృత్తాంతాన్నీ గ్రహించాడు. ‘రాజా! దిగులు చెందకు. వీరి ప్రస్తుత ప్రవృత్తికి కారణం వీరి పూర్వజన్మలోనే ఉంది’ అంటూ ఆ బాలురి పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పసాగాడు. ‘పూర్వం నందిగ్రామంలో మహానంద అనే గణిక ఉండేది. ఆమె మహా ఐశ్వర్యవంతురాలు. ఆమె సౌధంలో రత్నరాశులు విరివిగా ఉండేవి. పాడిపంటలతో ఆమె సమృద్ధిగా తులతూగేది. సర్వాలంకారభూషితగా ఉండేది. కులవృత్తిరీత్యా ఆమె స్వేచ్ఛాసంచారిణిగా ఉండేది. అయినా, ఆమె శివదీక్షా తత్పరురాలు. తన ఇంట నిత్యం శివపూజ చేసేది. శివాలయాలకు విరివిగా దానాలు చేసేది. శివభక్తులైన బ్రాహ్మణులను ఆదరించి, వారు కోరిన దానాలు ఇచ్చేది. వినోదం కోసం ఆమె ఒక కోతిని, ఒక కోడిని పెంచుకునేది. వాటికి భస్మత్రిపుండ్రాలతోను, రుద్రాక్షలతోను అలంకరించేది. వాటిని నాట్యమండపానికి తీసుకొచ్చి, వాటితో ఆటలాడించేది. రుద్రాక్షలు ధరించిన కోతి బాలకునిలా ఆ గణిక ముందు నృత్యం చేసేది. కోతి నృత్యాన్ని చూసి కోడి కూడా నాట్యమాడేది. వాటి ప్రదర్శన చూపరులకు ఆనందం కలిగించేది. ఇలా చాలాకాలం గడిచింది. ఒకనాడు శివదీక్షాపరుడైన ఒక వర్తకశ్రేష్ఠుడు ఆ గణిక ఇంటికి వచ్చాడు. భస్మత్రిపుండ్రాలు, రుద్రాక్షమాలలు, రత్నకంకణ కేయూరాది ఆభరణాలను ధరించి, చూడటానికి అపర కుబేరుడిలా ఉన్నాడు. మహానంద ఆ వర్తకశ్రేష్ఠుడిని సాదరంగా ఆహ్వానించి, పూజించింది. అతడికి సపర్యలు చేసింది. అతడితో కబుర్లాడుతూ, ‘మహాత్మా! మీరు ధరించిన రత్నకంకణం స్త్రీలు ధరిస్తే శోభిస్తుంది. మీ కంకణం ధరించాలని నాకు మక్కువగా ఉంది’ అని అంది. ‘అంత కోరికగా ఉంటే నా కంకణాన్ని నీకిస్తాను. మరి దీనికి మూల్యంగా ఏమిస్తావు?’ అన్నాడు ఆ వర్తకుడు. ‘అయ్యా! నేను గణికను. మీ కంకణాన్ని నాకు అనుగ్రహిస్తే, అందుకు బదులుగా మూడు రోజులు మీకు భార్యగా నడుచుకోగలను’ అని బదులిచ్చింది. అందుకు సంతోషంగా సమ్మతించిన వర్తకశ్రేష్ఠుడు ఆమెకు తన కరకంకణాన్ని ఇచ్చాడు. దానితోపాటు రత్నఖచితమైన శివలింగాన్ని కూడా ఇచ్చాడు. ‘ఈ శివలింగం నాకు ప్రాణప్రదమైనది. దీనిని జాగ్రత్తగా భద్రపరచు. దీనికి భంగం కలిగితే, నాకు ప్రాణభంగమే’ అని చెప్పాడు. మహానంద ఆ వర్తకశ్రేష్ఠుడు ఇచ్చిన కంకణాన్ని అలంకరించుకుని, అతడిచ్చిన శివలింగాన్ని తన పూజామందిరంలో భద్రపరచింది. నాటి రాత్రి ఆ వర్తకుడితో గడిపి నిద్రించింది. అర్ధరాత్రి వేళ అకస్మాత్తుగా ఆ గణిక ఇంట్లో మంటలు చెలరేగాయి. మంటల వేడికి మేలుకున్న గణిక ఇంట్లో కట్టేసి ఉన్న కోతికి, కోడికి కట్లు విప్పి వాటిని బయటకు విడిచిపెట్టింది. ఇంటిని మంటలు కమ్మేస్తుండటంతో ఆమె, ఆమె వెనుకనే వర్తకుడు బయటకు వచ్చేశారు. వాళ్లు చూస్తుండగానే ఇల్లు భస్మీపటలమైంది. పూజామందిరంలో భద్రపరచిన శివలింగం కూడా అగ్నికి ఆహుతైపోయింది. ప్రాణప్రదమైన శివలింగం దగ్ధమవడంతో ఆ వర్తకుడు ప్రాణత్యాగం చేశాడు. అతడికి ఇచ్చిన మాట ప్రకారం అతడితో మూడురోజులు గడపాల్సి ఉండగా, అతడు ఒక రోజు గడిచేసరికే ప్రాణత్యాగం చేయడంతో ఆ గణిక చాలా దుఃఖించింది. ఆమె కూడా అతడితో పాటే ప్రాణత్యాగం చేసింది. ఆమె విడిచిపెట్టిన కోతి, కోడి కొన్నాళ్లకు కాలధర్మం చెందాయి. గణిక వద్ద పెరిగినప్పుడు భస్మత్రిపుండ్రాలు, రుద్రాక్షలు ధరించిన కోతి, కోడి ఇప్పుడు నీకు, నీ మంత్రికి కొడుకులుగా పుట్టారు. పూర్వజన్మ స్నేహమే వారి మధ్య నేటికీ కొనసాగుతోంది. ధార్మికులైన వీరిద్దరూ మీ తర్వాత జనరంజకంగా ప్రజలను పరిపాలించి, చివరకు శివసాయుజ్యాన్ని చేరుకుంటారు’ అని చెప్పాడు పరాశరుడు. –సాంఖ్యాయన ఇవి చదవండి: పాతాళవనం కాదు! అదొక 'నేలమాళిగలో ఉద్యానవనం..! -
గురు వాక్యస్య... !!!
వాగ్గేయకారులలో గమనించవలసిన ఒక గొప్ప లక్షణం– వారిలోని గురుభక్తిని. అది లేకుండా సనాతన ధర్మంలో ఏ వ్యక్తీ పరిఢవిల్లలేదు. పుస్తకజ్ఞానం ఎంత ఉన్నా గురుముఖతః నేర్చుకున్నదేదో అది మాత్రమే అభ్యున్నతికి కారణమవుతుంది. ‘శ్రద్థ’ అని మనకు ఒక మాట ఉంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం– అంటారు గీతాచార్యులు. ఆ శ్రద్ధ ఎవరికి ఉన్నదో వారికి మాత్రమే జ్ఞానం కలుగుతుంది–అని. శ్రద్ధ అన్న మాటకు శంకరభగవత్పాదులు వ్యాఖ్యానం చేస్తూ.. ‘‘శాస్త్రస్య గురువాక్యస్య సత్య బుద్ధ్యవధారణమ్’ సాశ్రద్ధా కథితా సద్భిర్యాయా వస్తూపలభ్యతే’’.. అంటారు. శాస్త్రం చెప్పిన విషయం తిరుగులేని సత్యం... అన్న నమ్మకం ఉండాలి. కలడుకలండనెడువాడు కలడోలేడో...’ అన్న అనుమానం దగ్గరే ఉండిపోకుండా ‘భగవంతుడు ఉన్నాడు. శాస్త్రం చెప్పిన విషయం పరమ సత్యం..అని నమ్మాలి. ఆ పైన గురువాక్యస్య.. అంటే గురువుగారి నోటివెంట ఏది వచ్చిందో అది సత్యం. గురువుగారి నోటి వెంట వచ్చినది సత్యమయ్యేట్లు చూడవలసిన కర్తవ్యం భగవంతుడు తీసుకుంటాడు. అందుకే యోగివాక్కు అంటారు. యోగి వాక్కు అంటే – గురువుగారు సత్యం చెప్పారు.. అని కాదు .. గురువుగారు చెప్పినది సత్యం... అని అన్వయం చేసుకోవాలి. అంటే అంత తిరుగులేని విశ్వాసం ఉండాలి. అందుకే గురు విషయంలో స్థాన శుశ్రూష అంటారు. మనం ఉంటున్న ఇంటిని, మనం కొలిచే దేవుడు ఉండే దేవాలయాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అలా గురువుగారుండే ప్రదేశాన్ని కూడా శిష్యులు శుభ్రం చేస్తూ గురువుగారికి సౌకర్యంగా ఉండేటట్లు చూస్తుంటారు. ఈ కంటితో చూడలేని పరబ్రహ్మం సశరీరంతో... అంటే మనలాగా కాళ్ళూచేతులతో, ఇతరత్రా మనలాగే నడిచివెడితే అదే గురువు. ‘గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మైశ్రీగురువేనమః’–అని. గురువే బ్రహ్మ. గురువు మనలోని జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు. అందుకని సృష్టికర్త. గురుర్విష్ణుః..అంటే శ్రీమహావిష్ణువు స్థితికారుడై ఏ విధంగా ఈ సృష్టినంతటినీ నిలబెడుతున్నాడో అలా జ్ఞానాన్ని, భక్తిని పతనం కాకుండా గురువు కాపాడుతుంటాడు. అందుకని విష్ణువు. గురుర్దేవో మహేశ్వరః.. మహేశ్వరుడు ఎలా లయకారుడో అట్లా అజ్ఞానాన్ని గురువు లయం చేసి జ్ఞానాన్ని ఇచ్చి నిలబెడుతుంటాడు. అందుకే గురువు పరబ్రహ్మము. అటువంటి గురువుకు... తస్మైశ్రీగురవేనమః. ... నమస్కరించుచున్నాను. ఈ లోకంలో గురువుగారికి ప్రత్యుపకారం చేయడం కానీ, గురువుగారిని సత్కరించడం కానీ, గురువుగారికి మనం పదేపదే కృతజ్ఞతలు చెప్పడం కానీ సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి గురువు విషయంలో కృతజ్ఞత గా చెయ్యగలిగినది ఒక్కటే– రెండు చేతులు కలిపి జోడించి శిరస్సు తాటించి నమస్కరించడం మాత్రమే. అది గురువుపట్ల చెదరిపోని నమ్మకంతో చేయాలి.. అది వాగ్గేయకారులందరూ చేశారు. కాబట్టే మహాత్ములయ్యారు. -
ర్యాలీస్లో రేఖా ఝున్ఝున్వాలా వాటాల విక్రయం
ముంబై: దివంగత ఇన్వెస్ట్మెంట్ గురు రాకేష్ ఝున్ఝున్వాలా సతీమణి రేఖా ఝున్ఝున్వాలా తాజాగా ర్యాలీస్ ఇండియాలో మరో 6.2586 శాతం వాటాలను విక్రయించారు. దీంతో ఇకపై తన దగ్గర 2.278 వాటాలు (సుమారు 44.30 లక్షల షేర్లు) ఉన్నట్లవుతుందని ఆమె స్టాక్ ఎక్సేచంజీలకు తెలియజేశారు. 2013 మార్చి 11 నాటికి తమ వద్ద 2.03 కోట్ల షేర్లు (10.4581 శాతం వాటాలు) ఉన్నట్లు.. అప్పటి నుంచి ఈ ఏడాది జూలై 17 మధ్య తాము 37 లక్షల షేర్లు (1.9446 శాతం) విక్రయించామని పేర్కొన్నారు. జూలై 18 – జూలై 20 మధ్యలో మరో 1.21 కోట్ల షేర్లను (6.2586 శాతం) విక్రయించినట్లు వివరించారు. శుక్రవారం ర్యాలీస్ ఇండియా షేర్లు 1.31 శాతం క్షీణించి సుమారు రూ. 218 వద్ద క్లోజయ్యాయి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4,237 కోట్ల ప్రకారం రేఖ వద్ద ప్రస్తుతమున్న వాటాల విలువ సుమారు రూ. 96 కోట్లుగా ఉంటుంది. -
హీరోయిన్ల ఫోటోలు అసహ్యంగా ఎడిట్ చేసి మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు : నటి
గురు సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన బ్యూటీ రితిక సింగ్. తొలి సినిమాతోనే ఆకట్టుకున్న ఆమె ఆ తర్వాత నీవెవరో, శివలింగ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా రితిక సింగ్ మెయిన్ లీడ్లో ఇన్కార్ అనే తమిళ సినిమాలో నటించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా పాన్ ఇండియా స్థాయిలో మార్చి 3నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రితిక సింగ్ మాట్లాడుతూ హీరోయిన్లపై వచ్చే మీమ్స్, ట్రోల్స్పై ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్ల ఫోటోలు అసహ్యంగా ఎడిట్ చేసి డబుల్ మీనింగ్ డైలాగ్స్తో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. నేను కూడా ఇలాంటివి ఫేస్ చేశాను. ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధేస్తుంది. మీకే కాదు నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది. నా ఫోటోలు అలా చూసి నా పేరెంట్స్ ఏమనుకుంటారు? వాళ్ల గుండె బద్దలవుతుంది అలాంటివి చూసినప్పుడు. అందుకే ఇలాంటి చెత్త మీమ్స్, ట్రోల్స్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించడం అంటూ రితిక భావోద్వేగానికి లోనైంది. -
ప్రవచన కర్త చాగంటి కోటేశ్వర్ రావుకు గురజాడ పురస్కారం
-
మహాస్వామి వారి మౌన బోధనం
జగద్గురు ఆదిశంకరులు కూడా మౌనంగానే శిష్యులకు బోధించేవారట. వారి చిన్ముద్రలోనే శిష్యులకు సమస్తసమూ బోధపడేవిట. సత్వం, రజస్సు, తమస్సు అనే మూడు గుణాల కారణంగా ఏర్పేడేదే సంసారం. వీటికి దూరంగా ఉండటమే చిన్ముద్ర సందేశం. ఈ సందేశాన్ని ఉత్తమ విద్యార్థులైన రుషులు అర్థం చేసుకున్నారట. అందుకే వారందరూ మూకుమ్మడిగా ఆయననే తమ ఉత్తమోత్తమ గురువుగా, ఉత్తరోత్తరా కూడా ఆయనే తమ గురువుగా ఉండాలని కోరుకున్నారు. అదేవిధంగా కంచి పరమాచార్యను కూడా వారి భక్తులు, శిష్యులు ఇప్పటికీ తమ గురుపరంపరలో ఆద్యునిగా ఆరాధిస్తున్నారు. సేవిస్తున్నారు. సాంత్వన పొందుతున్నారు. ప్రాచీన ఆలయాల ప్రాకారాలపై చెక్కి ఉన్న దక్షిణామూర్తి రూపాన్ని చూస్తే దక్షిణామూర్తి ఒక యువకుడు. చెట్టు మూలంలో కూర్చుని ఉంటాడు. శిష్యులందరూ వృద్ధులు. ఆయనేమో మౌనంగా చిన్ముద్రలో ఉంటాడు. ఆ మౌన వ్యాఖ్యతోనే శిష్యుల సందేహాలు పటాపంచలౌతాయట. చెట్టు ఒక ప్రసిద్ధమైన సంకేతం. ఎడతెరిపి లేని జనన మరణాలతో కూడిన సంసారమనే వక్షం. సంసారానికి మూలమైన పరమాత్మ అనేది శుద్ధ చైతన్యమని మన సిద్ధాంతం. ఈ చైతన్యంలో ప్రకటమయ్యే సృజనాత్మక శక్తినే ప్రకృతి లేదా మాయ అన్నారు. చైతన్యమే జగత్తుగా కనిపిస్తుందని అర్థం. ఈ చెట్టు మూలంలో ఉన్న దక్షిణామూర్తి ఎల్లప్పుడూ మౌనంగా చిన్ముద్రలో కూర్చుని ఉంటాడు. ఆ మౌనముద్రలోనే అంత పెద్ద శిష్యుల సందేహాలన్నీ పటాపంచలు కావడానికి ప్రత్యక్ష ఉదాహరణమే శ్రీశ్రీశ్రీ కంచిçకామకోటి పీఠాధిపతి జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి. ఆయన సాక్షాత్తూ దక్షిణామూర్తి స్వరూపులు. స్వామివారి సన్నిధికి వచ్చి ఆయనను దర్శించుకుని, తమకున్న కొండంత కష్టాల గురించి ఆయనతో మొరపెట్టుకుని ఆయన అనుగ్రహంతో వాటిని తొలగించుకుని తిరిగి సాధారణ జీవితాన్ని గడిపిన వారు కోకొల్లలు. స్వామివారు కాష్ఠమౌనంలో ఉన్నప్పుడు కూడా ఆయనకు తమ సమస్యలను నివేదించుకునేవారు. ఆయన మౌనంగానే ఉండి తమకు అంతా తెలుసునన్నట్లు వారివంక చిరునవ్వుతో చూసేవారు. సాక్షాత్తూ దైవస్వరూపులైన స్వామి వారి కరుణాపూరిత దృక్కులు చాలదా వారి దుఃఖాలను బాపటానికి! మానవ సంబంధాలలో అత్యుత్తమ మైనది గురుశిష్య బాంధవ్యం. అర్థరహిత, స్వార్థరహితమైన బాంధవ్యం. ఆ గురుశిష్య సంబంధానికి అర్థబలంతో అంగబలంతో పనిలేదు. అహంకారంతో పనిలేదు. స్వార్ధరహితం. ఇలా రహిత పద్ధతిగా ఏర్పడేది ఒక్క గురుశిష్య బాంధవ్యం మాత్రమే. దానిలో ఏమీ మిగలదు. ఎందుకంటే అశరీర పద్ధతే లక్ష్యం కాబట్టి. సశరీర ధర్మాలుగానీ, సశరీర బాంధవ్యాలు గానీ లేకుండా చేసే పద్ధతిగా నిన్ను పరిణమింపచేయడమే దాని ఉద్దేశ్యం. వింతైన విషయం ఏమిటంటే ఈ అన్యోన్య దర్శనం ఉన్నప్పుడే ఈ మౌన వ్యాఖ్య సాధ్యమౌతుంది. పరబ్రహ్మ తత్త్వాన్ని తెలియచెప్పాలంటే ఒకే ఒక మార్గముంది. ప్రకటించటం అంటే తెలియచెప్పటం. పరబ్రహ్మ తత్త్వాన్ని తెలియచెప్పాలంటే ఒకే ఒక పద్ధతుంది. మౌనవ్యాఖ్య. దానిని గురించి శాస్త్రాలలో, ఉపనిషత్తులలో ధర్మ పద్ధతిగా, జ్ఞాన పద్ధతిగా, యోగ పద్ధతిగా ఎలా చెప్పబడింది అనే సాంప్రదాయ రీతులలో దానిని గురించి విశేషంగా మాట్లాడటాన్ని వ్యాఖ్య అన్నారు. గురు హృదయంలో బోధించాలనే సంకల్పం కలగగానే, వ్యక్తీకరించక ముందే శిష్యుడికి అర్థమైపోవాలి.. దక్షిణామూర్తిని గమనిస్తే ‘వటమూల నివాసిని’ వటవృక్షమంటే మర్రిచెట్టు. వటవృక్షం దక్షిణామూర్తి సమానం. అశ్వత్థ వృక్షమంటే రావిచెట్టు. అశ్వత్థ వృక్షం విష్ణు సమానం. పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలుసుకోవడానికి ఈ వటవృక్షాన్ని అధ్యయనం చేయాలి, ఆశ్రయించాలి. ‘‘వటవిటపి సమీపే భూమి భాగే విషణ్ణం! సకల ముని జనానాం జ్ఞాన దాతార మారాత్!!’’ ఇటువంటి జ్ఞానానికి అధికారి ఎలా ఉండాలట? జ్ఞానదాత అంటే సద్గురువే. అటువంటి సద్గురువు, నడిచేదైవంగా పేరు పొందిన కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామికి జేజేలు. ఆయన సన్నిధిని ప్రత్యక్షంగా అనుభవించిన వారికే కాదు, పరోక్షంగా ఆయన బోధల వల్ల ప్రేరణ పొందిన వారికి కూడా ఆయన జీవన్ముక్త స్థితి, భక్తవత్సలత గురించీ బాగా తెలుసు. ఎంతటి క్లిష్టపరిస్థితులనైనా, తమ అనుగ్రహంతో, ఆశీర్వాదపూర్వకంగా మార్చిన కర్మయోగి, జ్ఞానయోగి. గీతాబోధకు ప్రత్యక్ష నిదర్శనం. నడిచేదైవానికి సహస్రకోటి ప్రణామాలు. సూక్తి సుధ ► మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులని భావిస్తే.. బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తిమంతులే అవుతారు. ► ఈ ప్రపంచంలో కష్టమయిన పని అంటూ ఏది లేదు.మనకి అదంటే ఇష్టం లేకపోవటం వలన అది ’కష్టం’ గా మారుతుందంతే. ► దూరంగా ఉన్నంత మాత్రాన బంధాలు తెగిపోవు. దగ్గరగా ఉంటే బంధాలు పెరిగిపోవు. ఎదుటివారి మనసులో మనం ఉన్నపుడు దూరం, దగ్గర అనేవి సమస్యలు కానేకావు. ► మంచో చెడో ఒకడుగు ముందుకెయ్యడానికి ప్రయత్నించు. గెలుపైతే ముందుకెళ్ళు. ఓటమైతే ఆలోచన మార్పు చేయి. ► ఎవరైనా తమతో స్నేహం చేసేవారికి వారివద్దనున్న గుణాన్నే పంచగలరు. మంచివాడు మంచిని, చెడ్డవారు చెడును, కోపిష్టి కోపాన్ని, అజ్ఞానుడు అజ్ఞానాన్ని, తెలివి వంతుడు తన తెలివిని పంచగలడు. ఇందులో నీకు ఎలాంటి స్నేహం కావాలో ఎంచుకోవడం నీ బాధ్యత. నీ స్నేహాన్నిబట్టే సమాజం నిన్ను అంచనా వేస్తుంది. – ఎన్. రమేశన్, ఐ.ఎ.ఎస్. -
వాంగ.. వాంగ...
నాయకుడు.. ప్రతినాయకుడు.. సహాయ నటుడు.. ఏ పాత్రని అయినా అవలీలగా చేయగల నటుడు మోహన్బాబు. అందుకే చెన్నై ఇప్పుడు ఆయన్ను ‘వాంగ.. వాంగ..’ అంటోంది. అంటే.. రండి.. రండి. అని అర్థం. అసలు చెన్నై ఆయన్ను ఇప్పుడు రమ్మనడమేంటి? ఎప్పుడో 40 ఏళ్ల క్రితం ఆయన తమిళ సినిమాల్లో నటించారు. వాటిలో 1980లో చేసిన ‘గురు’ అనే సినిమా ఒకటి. ఇప్పుడు కూడా మోహన్బాబు కోసం కబురు పంపింది నేటి ‘గురు’ (2017) డైరెక్టర్ సుధా కొంగర. వెంకటేశ్ హీరోగా ‘గురు’ చిత్రాన్ని తెరకెక్కించిన సుధ తెలుగమ్మాయి. ఈ చిత్రం తర్వాత సూర్య హీరోగా ఓ చిత్రం చేయడానికి సుధ సన్నాహాలు చేస్తున్నారు. కథ రాసుకునేటప్పుడు సినిమాకి అతికీలకమైన ఓ పాత్రను మోహన్బాబు చేస్తే బాగుంటుందని ఆమె అనుకున్నారట. కథ విన్న సూర్య కూడా మోహన్బాబు అయితే న్యాయం జరుగుతుందని భావించారట. ఇటీవల మోహన్బాబుకు సుధ కథ చెప్పడం, ఆయన గ్రీన్సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. ఇప్పటివరకూ కనిపించన విలక్షణ పాత్రలో ఆయన కనిపించనున్నారని సమాచారం. -
సైన్యంలో చేరతా అమర జవాన్ భార్య
కుమారుడు దేశసేవలో ఉన్నాడని గర్వించే తల్లిదండ్రులు, భర్త రాక కోసం మధురానుభూతులతో నిరీక్షించే సతీమణి గుండెల్లో ఇప్పుడు అంతులేని విషాదం తాండవిస్తోంది. కొద్దిరోజుల కిందటివరకు తమ మధ్యనే ఉన్న ఆత్మీయుడు మంచుకొండల నడుమ నుంచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం ఆ కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నాలుగురోజుల నుంచి అన్నపానీయాలు లేక విలపిస్తూ మంచం పట్టారు. మండ్య: ‘నా భర్త స్వప్నాన్ని ఉగ్రవాదులు ధ్వంసం చేశారు. ఆయన కలను నెరవేర్చడానికి నేను సైన్యంలో చేరడానికి సిద్ధం. దేశ సేవ చేస్తా’ అని అమరవీరుడు గురు సతీమణి కళావతి ప్రకటించారు. పుల్వామా ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన సీఆర్పీఎఫ్ జవాను గురు (33) స్మృతులను తలుచుకొని తల్లిదండ్రులు, భార్య ఇప్పటికీ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సెలవుల్లో ఇంటికి వచ్చిన సమయంలో గురు తమతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుని పదేపదే ఆవేదన చెందుతున్నారు. 14వ తేదీన మరణవార్త తెలిసిననాటి నుంచి తిండీ నిద్రకు దూరమై గురును స్మరిస్తున్నారు. పాకిస్థాన్ను నాశనం చేయాలి: తండ్రి హన్నయ్య గురు తండ్రి హన్నయ్య మాట్లాడుతూ.. గురు తన కుమారుడని చెప్పుకోవడానికి తమకు ఎంతో గర్వంగా ఉందన్నారు. గురుతో పాటు ఎంతోమంది భారత సైనికులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు, ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ను సర్వనాశనం చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మనవడిని కూడా భారతసైన్యంలో చేర్పిస్తానని తెలిపారు. గురు భార్య కళావతి మాట్లాడుతూ.. తన భర్త మరో పదేళ్లపాటు సైన్యంలో సేవలు అందించాలని కలలు కనేవారన్నారు. అయితే ఉగ్రవాదులు ఆ కలను సర్వనాశనం చేశారని విలపించారు. భర్త కలను తాను నెరవేర్చుతానని, సైన్యంలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె ఆవేశంగా చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స నాలుగు రోజులుగా దుఃఖిస్తూ అస్వస్థతకు గురైన ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురును కోల్పోవడంతో గుడిగెరె గ్రామంలో కూడా మౌనవాతావరణం నెలకొంది. గురుతో గడిపిన క్షణాలు తలుచుకొని గ్రామస్థులు, స్నేహితులు కన్నీటి పర్యతంమయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురు కుటుంబ సభ్యులను ఆదివారం సీఆర్పీఎఫ్ కమాండెంట్ ప్రదీప్ పరామర్శించి భారత సైన్యం అందించిన వీరమరణ పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం గురు అంత్యక్రియలు నిర్వహించిన ప్రాంతాన్ని సందర్శించారు. పలువురు గురు తండ్రిని కలిసి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గురు కుటుంబానికి ఆర్థిక సహాయం పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన గురు కుటుంబ సభ్యులను ఆదివారం ప్రముఖులతో పాటు ప్రజలు సాంవత్వన తెలిపి ఆర్థిక సహాయం అందించారు.గురు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి డీసీ తమ్మణ్ణ కోడలు కవిత సంతోష్ రూ.25 వేల నగదు అందజేశారు. శ్రద్ధాంజలి, పరామర్శలు సరిపోవని, దొంగదెబ్బతో సైనికులను హత్య చేసిన ఉగ్రవాదులను అంతమొందించనపుడే సైనికుల ఆత్మకు శాంతి చేకూరుతుందని ఆమె అన్నారు. బెల్బాటం కన్నడ చిత్రం హీరో హీరోయిన్లు రిషభ్ శెట్టి, హరిప్రియ, డైరెక్టర్ సంతోష్కుమార్లు గురు కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.75వేల ఆర్థిక సహాయం అందించారు. ఆత్మాహుతికి సిద్ధం ఆత్మాహుతి దాడి చేసి భారత సైనికులను హత్య చేసిన ఉగ్రవాదులు,పాకిస్థాన్ సైనికులపై ప్రతీకారం తీర్చుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని అందుకు అదే తరహాలో ఆత్మాహుతి దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ చేతన్ అనే యువకుడు సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసిన వీడియో వైరల్గా మారింది. సైనికులపై జరిగిన దాడిని జీర్ణించుకోలేకపోతున్నానని శత్రువలపై ప్రతీకారం తీర్చుకోవడానికి మనసు పరితపిస్తోందని వీడియోలో పేర్కొన్నాడు. -
రచ్చకెక్కిన గురు ఫ్యామిలీ
సాక్షి, చెన్నై: వన్నియర్ సంఘం నేత, మాజీ ఎమ్మెల్యే దివంగత కాడు వెట్టి గురు కుటుంబం రచ్చకెక్కింది. ఆయన కుమార్తె విరుదాంబిగై ప్రేమ వివాహం చేసుకోవడం, ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. తన కుటుంబం నుంచి ప్రాణహాని ఉందంటూ ఆమె కుంభకోణం పోలీసుల్ని ఆశ్రయించారు. వివాదాస్పద నేతగా కాడు వెట్టి గురు అందరికీ సుపరిచితుడే. రాందాసు నేతృత్వంలోని పీఎంకేకు కుడి భుజంగా వన్నియర్ సంఘాలు ఉన్నాయంటే, అందులో గురు పాత్ర కీలకం. వ్యక్తిగత పలుకుబడి కల్గిన నాయకుడిగా, వన్నియర్ సంఘాల్ని ఒకే వేదిక పైకి తీసుకొచ్చి నడిపించారు. అలాగే, కాడువెట్టి గురు చుట్టూ కేసులు మరీ ఎక్కువే. అరియలూరు జిల్లా ఆండి మడం నుంచి ఓ సారి, జయం కొండం నుంచి మరోసారి అసెంబ్లీకి సైతం ఎన్నికైన ఆయన వివాదాస్పద వ్యాఖ్యలతో పలుమార్లు జైలుకు వెళ్లొచ్చారు. బలం కల్గిన నాయకుడిగా ముద్ర పడ్డ గురు అనారోగ్యం మేలో మరణించారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని, ఇక ఆయన కుటుంబానికి అన్ని తానై ఉంటానని పీఎంకే నేత రాందాసు ప్రకటించారు. గురు తన పెద్దకుమారుడు అని, ఆయన పిల్లలు తన మనవడు, మనవరాలు అని ప్రకటించారు. అయితే, ప్రస్తుతం ఆ కుటుంబంలో ఆస్తి వివాదం చాప కింద నీరులా సాగుతూ వచ్చి, ప్రస్తుతం విశ్వరూపం దాల్చడమే కాదు, రచ్చకెక్కింది. కుమార్తె వివాహం: కొద్ది రోజులుగా చాప కింద నీరులా సాగుతూ వచ్చిన కుటుంబ సమరం తాజాగా రచ్చకెక్కింది. కొద్ది రోజుల క్రితం తనయుడు ధన అరసన్ కనిపించడం లేదని గురు సతీమణి లత గగ్గోలు పెట్టారు. అదే సమయంలో తన తల్లి కనిపించడం లేదని ధన అరసన్ వీడియో వైరల్గా మారింది. ఈ పరిస్థితుల్లో బుధవారం గురు కుమార్తె విరుదాంబిగై వివాహంతో కుటుంబం ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. గురు మూడో సోదరి, తన చిన్న అత్తయ్య చంద్రలేఖ కుమారుడు మనోజ్ను ఆమె తంజావూరులోని స్వామిమలైలో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం వీడియో వైరల్గా సామాజిక మాధ్యమాల్లో మారాయి. అలాగే, తమకు భద్రత కల్పించాలంటూ విరుదాంబిగై వేడుకోవడం గమనార్హం. అదే సమయంలో ఈ వివాహానికి గురు భార్య లత మినహా బంధువులు, విరుదాంబిగై సోదరుడు ధన అరసన్ సైతం పాల్గొన్నట్టుగా మరో వీడియో తెర మీదకు రావడంతో కుటుంబ వ్యవహరాలు రచ్చకెక్కినట్టు అయింది. దీంతో తనకు, తన భర్తకు రక్షణకల్పించాలని విరుదాంబిగై కుంబకోణం పోలీసుల్ని ఆశ్రయించడం గమనార్హం. కాగా, గురు కుటుంబంలో వివాదాలు తారా స్థాయికి చేరి ఉన్న ఈ నేపథ్యంలో పీఎంకే నేత రాందాసు చూసి చూడనట్టుగా వ్యవహరించడంపై విమర్శలు బయలుదేరాయి. -
తాప్సీ లీడ్రోల్లో ‘గేమ్ ఓవర్’
టాలీవుడ్, బాలీవుడ్లలో సత్తా చాటిన తాప్సి ప్రధాన పాత్రలో వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమా గేమ్ ఓవర్. గతంలో లవ్ ఫెయిల్యూర్, గురు సినిమాలను తెరకెక్కించిన ఈ సంస్థ ఇప్పుడు తెలుగు తమిళ భాషల్లో మరో చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘నయనతార’ ప్రధాన పాత్రలో తమిళ నాట ఘనవిజయం సాధించిన ‘మయూరి’ వంటి చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు అశ్విన్ శరవణన్.. గేమ్ ఓవర్ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా ఈ రోజు(గురువారం) చెన్నై ప్రారంభమయింది. ఓ సరికొత్త కధ, కథనాలతో తెలుగు,తమిళ భాషలలో ఏక కాలంలో ఈ రోజు నుంచి ఏక ధాటిగా ఆంద్ర,తెలంగాణ,తమిళనాడు రాష్ట్రాలలోని పలు ప్రదేశాలలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనుంది అని నిర్మాత ఎస్.శశికాంత్ తెలిపారు. -
లేడీ డైరెక్టర్ సినిమాకి యస్
హీరో సూర్య టాప్ గేర్లో దూసుకెళ్తున్నారు. వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరీర్ను మస్త్ ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సెల్వ రాఘవన్, కేవీ ఆనంద్ దర్శకత్వంలో హీరోగా సినిమాలు చేస్తోన్న సూర్య తర్వాతి చిత్రం ‘ఇరుది సుట్రు’ ఫేమ్ సుధా కొంగర డైరెక్షన్లో రూపొందనుందని కోలీవుడ్ సమాచారం. తొలిసారి ఓ లేడీ డైరెక్టర్తో సూర్య చేయనున్న చిత్రం ఇది. ‘ఇరుది సుట్రు’ తెలుగు రీమేక్ ‘గురు’ చిత్రం కూడా సుధా కొంగర దర్శకత్వంలోనే తెరకెక్కిన సంగతి తెలిసిందే. ‘మెర్సెల్, వేలైక్కారన్, సర్కార్’ చిత్రాలకు పాటలు రాసిన వివేక్ ఈ సినిమాకు కూడా లిరిక్స్ రాయనున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందించనున్నారు. ‘‘సూర్య సార్తో తొలిసారి వర్క్ చేయడం ఆనందంగా ఉంది. జీవీ ప్రకాశ్ మంచి ట్యూన్స్ ఇచ్చారు. సుధా మేడమ్కి థ్యాంక్స్’’ అన్నారు వివేక్. -
తోట పనీ ధ్యానమే
ఆ జెన్ గురువు ఓ పర్వతం పాదాలకింద ఓ పర్ణశాల ఏర్పాటు చేసుకున్నాడు. అందులోనే ఏళ్ళ తరబడి నివసిస్తున్నాడు. ఆ ఆశ్రమంలో ఓ అందమైన పూలతోట కూడా ఉంది. ఆ తోటలో బోలెడన్ని పూలమొక్కలు. వాటి బాగోగులు పరిశీలించే పనులన్నీ శిష్యులకు అప్పగించారు సాధువు. వాళ్ళూ గురువుగారి మాట మీరకుండా పూదోటను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. నిత్యమూ బోలెడు పువ్వులు వికసిస్తూ చూపరులను ఆకర్షించడమే ఆ పూలమొక్కల పని. సాధువుకు ఆ పూలవనం అంటే ఎంతో ఇష్టం. వాటిని శిష్యులు ప్రాణప్రదంగా చూసుకోవడం గురువుకెంతో నచ్చింది. అందుకే ఆయన ప్రతిరోజూ ఆ తోటలో కొన్ని గంటలు గడుపుతారు. అంతేకాదు, ఆయన కూడా కొన్ని మొక్కలకు నీరు పోస్తారు. పువ్వులతోనూ, మొగ్గలతోనూ, పచ్చని ఆకులతోనూ కబుర్లు చెబుతూనే, రాలిన ఆకులను సేకరించి తోటనంతా శుభ్రం చేస్తుంటారు. గురువు తీరుని చూసి ఆశ్చర్యంతో ఒకరడిగారు... ‘‘అయ్యా, ఈ తోటలో చెత్తాచెదారం మీరు బాగు చేయాలా... మీరు ఏం చెప్తే అది చెయ్యడానికి శిష్యులు ఉన్నారు... ఒకవేళ శిష్యులు బద్దకించినా డబ్బులు వెదజల్లితే తోట పనులు చెయ్యడానికి మనుషులు ముందుకొస్తారు కదా’’ అని. సాధువు నవ్వి ‘‘ఎవరో ఎందుకూ... నేను ఈ తోట పని చేస్తే తప్పేంటీ...’’ అని ప్రశ్నించారు. ‘‘తప్పు లేదండి. కానీ మీరు మహాత్ములు. ఎన్నో ప్రసంగాలు చేసే గొప్ప ఆలోచనాపరులు. మీ అపూర్వమైన కాలాన్ని మీరు మరివేటికైనా ఉపయోగించుకోవచ్చు కదా’’ అని ఆయన మనసులోని మాట చెప్పాడు. సాధువు ‘‘మిత్రమా, నేను ఒట్టి తోట పనే చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. కానీ నిజానికి నేను ఇక్కడ ధ్యానం చేస్తున్నాను... ప్రతి రోజూ నేను ఈ సమయం కోసమే నిరీక్షిస్తుంటాను. తోటలోకెళ్ళి ఎప్పుడు శుభ్రం చేస్తానా అని. ఇక్కడే ఇతర ఆలోచనలేవీ మనసులోకి రానివ్వక మొక్కలతోనూ పువ్వులతోనూ నా సమయాన్ని గడుపుతాను. మొక్కలకు నీరు పోస్తూ, వికసించిన పువ్వులతో మాట్లాడుతూ పరవశించి నన్ను నేను మరచిపోతుంటాను. అలాంటి అమృతఘడియలు మరెక్కడా అంత అమోఘంగా అద్భుతంగా దొరకవు. కనుక నాకీ తోట పనీ ఓ ధ్యానమే‘‘ అని చెప్పారు. – యామిజాల జగదీశ్ -
మరణించిన భోజన పాత్ర
శిష్యుడు ఆశ్రమాన్ని శుభ్రం చేస్తున్నాడు. చూడకుండా చేయి తగలడంతో ఒక పింగాణీ పాత్ర కిందపడి, భళ్లున బద్దలైంది. గురువుగారికి కోపమెక్కువ. పైగా ఆయనకు అది ఇష్టమైన పాత్ర. అందులోనే భోంచేయడం ఆయన అలవాటు. శిష్యుడికి భయమేసింది. ఒళ్లంతా చమట పట్టింది. గురువు తనను ఏం చేయనున్నాడో! చకచకా ఆ పెంకులన్నీ ఏరి ఒకచోట జాగ్రత్తగా పెట్టాడు. గురువుకు ఏమని సమాధానం చెప్పాలా అని ఆలోచించసాగాడు. కాసేపట్లో గురువు వస్తున్నట్టుగా పాదాల అలికిడి వినబడింది. శిష్యుడు ఎదురెళ్లి, వినయంగా చేతులు కట్టుకుని, ‘గురువర్యా, పొద్దున్నే నాకో సందేహం వచ్చింది. అడగమంటారా?’ అన్నాడు. శిష్యుడి వాలకం కొత్తగా అనిపించినప్పటికీ, అడగమన్నట్టుగా తలూపాడు గురువు. ‘అసలు మనుషులకు మరణం ఉండాల్సిందేనా?’ ప్రశ్నించాడు శిష్యుడు. ‘అది ప్రకృతి సహజం. ప్రతిదీ ఏదో రోజు నశించి తీరవలసిందే’ చెప్పాడు గురువు. వెంటనే అందుకున్నాడు శిష్యుడు: ‘అయితే, ఇవ్వాళ మీ భోజన పాత్ర మరణించింది’. వివేకవంతుడు కావడంతో గురువుకు తక్షణం జరిగినదేమిటో అర్థమైంది. శిష్యుడి ప్రశ్నకు ఉన్న మూలం గుర్తించాడు. దానికి కారణమైన తన కోపగుణం కూడా మనసులో మెదిలింది. శిష్యుడిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ‘ఇవ్వాళ నా కోపం కూడా మరణించింది’ అన్నాడు. -
ఎటువైపైనా ఒక వైపే
ఒక యువకుడు గుర్రం మీద బయల్దేరాడు. అతడు కొత్తగా బౌద్ధధర్మాన్ని స్వీకరించాడు. గుర్రం మీద ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ ఒక చోటికి చేరుకున్నాడు. అక్కడ ఒక చిన్న యేరు అడ్డం వచ్చింది. అది ఉధృతంగా పారుతోంది. గుర్రంతో సహా దిగలేనంత లోతుగా ఉందని వెంటనే అంచనాకు రాగలిగాడు. కానీ ఎలా దాటడం? అవతలి వైపునకు ఎలా చేరడం? ఎంత ఆలోచించినా ఉపాయం తోచలేదు. గుర్రం దిగి చాలాసేపు అలాగే నిరీక్షించాడు. గుర్రం పచ్చిక మేస్తూవుంది. సాయంత్రం కావస్తోంది. యువకుడి సహనం నశిస్తూవుంది. అప్పుడు యేరుకు అటువైపు ఒక గురువు నడుస్తూ కనిపించాడు. యువకుడు ఉత్సాహంగా లేచి, గొంతెత్తి కేకేశాడు. ‘గురువర్యా, నేను అవతలి వైపు ఎలా రావాలి?’ గురువు ఏమాత్రం తడుముకోకుండా అంతే బిగ్గరగా సమాధానమిచ్చాడు. ‘నాయనా, నువ్వున్నది కూడా అవతలి వైపే’. ఇది హాస్యం కాదు. ఒక అవరోధం రాగానే ప్రయత్నాన్ని విరమించుకొమ్మని చెప్పడం కాదు. అసలు ఏ వైపైనా ఎందుకు దాటాలి? ఏ ప్రపంచం ఇవ్వగలిగే అనుభవం ఆ ప్రపంచానికే ఉండగా మరెక్కడికో చేరాలన్న ఉబలాటం దేనికి? గురువు చెప్పింది అర్థమైన యువకుడు సానుకూలంగా గురువుకు నమస్కరించి, తిరుగు ప్రయాణం కోసం మళ్లీ తన అశ్వం వైపు బయల్దేరాడు. ‘గురువర్యా, నేను అవతలి వైపు ఎలా రావాలి?’గురువు ఏమాత్రం తడుముకోకుండా అంతే బిగ్గరగా సమాధానమిచ్చాడు. ‘నాయనా, నువ్వున్నది కూడా అవతలి వైపే’. -
భూమ్మీదే స్వర్గనరకాలు
ఒక సైనికుడికి స్వర్గనరకాలు అంటే ఏమిటో తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలిగింది. చాలామందిని అడిగాడు. దానికి వారు ఇచ్చిన సమాధానాలు అతడికి తృప్తి కలిగించలేదు. చివరగా సుదూర నగరంలోని ఒక గురువును ఆశ్రయించాడు. గురువుకు వినయంగా నమస్కరించి– ‘గురువర్యా! ఈ స్వర్గనరకాలు అంటారే, అవేమిటి?’ అని వినయంగా ప్రశ్నించాడు. ‘నీ ముఖానికి నీక్కూడా స్వర్గనరకాలు అంటే ఏమిటో తెలుసుకోవాలని ఉందా?’ కఠినంగా ప్రశ్నించాడు గురువు. సైనికుడు ఆ ప్రశ్నను ఊహించలేదు. అతడి ముఖంలో రంగులు మారినై. కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే తన ఒరలోని కత్తిని బయటికి తీశాడు. ‘అదిగో, నరక ద్వారం ఇప్పుడే తెరుచుకుంది,’ అన్నాడు గురువు. సైనికుడు మౌనం వహించాడు. ‘అయితే ఆ కత్తితో నా తలను ఖండిద్దామనే అనుకుంటున్నావా? నా మెడను నరికేంత పదును దానికి ఉందా?’ అన్నాడు ఆత్మవిశ్వాసంగా గురువు. గురువు మాటల్లోని ఆంతర్యం గ్రహించిన సైనికుడు సిగ్గుపడి కత్తిని తీసి మళ్లీ ఒరలో పెట్టుకున్నాడు. ‘ఇప్పుడు చూడు, స్వర్గ ద్వారం నిన్ను ఆహ్వానిస్తోంది’ అన్నాడు చిర్నవ్వుతో గురువు. సైనికుడి ప్రయాణం సఫలమైంది. తను ఇన్నాళ్లుగా వెతుకుతున్న ప్రశ్నకు సరైన జవాబు దొరికింది.,కోపమే నరకం. శాంతియే స్వర్గం. ‘అదిగో, నరక ద్వారం ఇప్పుడే తెరుచుకుంది,’ అన్నాడు గురువు. సైనికుడు మౌనం వహించాడు. -
శిష్యుడు గురువ్రతుడు
గురువుగారూ! అని ఎవరినైనా పిలిస్తే వారు మనకు గురువులయిపోరు. నీ ఉద్ధరణ కోసం పాటుపడుతున్న వారిలో నీకు ఎవరిమీద గురి పెరిగిందో వారు నీకు గురువులు. గురిలేనప్పుడు వారు గురువులు కాలేరు, కారు కూడా. ఒక్కొక్కసారి గురువు ప్రమేయం లేకుండా కొందరు గురువుకి శిష్యులయిపోతుంటారు. పూనిక అంత గొప్పది. గురుశిష్యుల సంబంధం శిష్యుడి వైపునుంచి ప్రవహిస్తుంది. కబీర్దాసుగారి విషయంలో అలా జరిగింది. గురుశిష్య సంబంధం చాలా చమత్కారంగా ఉంటుంది. శిష్యుడి ఆర్తిచేత గురువవుతాడు తప్ప గురువుకి తెలియదు వాడు నా శిష్యుడని. ఆర్తితో శిష్యుడైపోతాడు. అంతేవాసిత్వాన్ని పొందేస్తాడు, ఉద్ధరణ పొందేస్తాడు. అంతే. మరి కొన్ని సందర్భాల్లో గురువు శిష్యుణ్ణి ఎంతగానో అనుగ్రహిస్తుంటాడు. అంతేవాసి అంటే శిష్యుడు. గురువు మనసులో చోటు సంపాదించి కొడుకయిపోతాడు. కొంతకాలానికి కొడుకుకంటే శిష్యుడే ఎక్కువ గుర్తుకొస్తుంటాడు. అలా శుశ్రూషచేత గురువు గారి హృదయంలో చేరిపోతాడు. గురువుకూడా ప్రేమతో స్వీకరిస్తాడు. గురువు ఆజ్ఞ స్వీకరించి ఈశ్వరపథంలో నడవడానికి అనుష్ఠానం చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అటువంటి శిష్యుణ్ణి చూసి ’ఏమి దీక్షరా, ఎంత అనుష్ఠానం చేస్తున్నాడ్రా, ఎంత ధార్మిక జీవనం చేస్తున్నాడ్రా’ అని గురువు మురిసిపోతుంటాడు. గురుశిష్య సంబంధాల్లో అనేక విధాలుంటాయి. పతివ్రత అనేమాట మీరు వినే ఉంటారు కదా ! అటువంటిదే గురువ్రత అనే మాట ఒకటుంది.అత్యంత ప్రీతిపాత్రమైన శిష్యుణ్ణి పిలిచేటప్పుడు మాత్రమే గురువు ఈ మాట వాడతాడు. పతివ్రత అంటే ఆమె ఆలోచనలన్నీ ఆమె భర్త గౌరవాన్ని పెంచడం పైనే కేంద్రీకృతమై ఉంటాయి. అలా గురువ్రతుడైన శిష్యుడు గురువుగారి గౌరవాన్ని పెంచుతూ ఆయనకు వశవర్తయి ఉంటాడు. అందుకే ’ఇదినాది’అనే భావన ఉండదు. ‘ఇదంతా నీది. నీ ఉచ్చిష్టాన్ని నేను ప్రసాదంగా అనుభవిస్తున్నాను’ అనే భావనతో ఉంటాడు. గురువు సమర్థ రామదాసు కనబడితే భిక్షాపాత్రలో శివాజీ మహరాజ్ ఒక కాగితం ఉంచాడు. అది విప్పి చూస్తే రాజ్యమంతా ధారపోసినట్లుంది. ‘‘నాకెందుకురా సన్యాసిని. నా ప్రసాదంగా నువ్వే ఏలుకో. ఇదిగో కాషాయ పతాకం. అన్ని చోట్ల పెట్టు.’’ అన్నాడు. అలాగే విద్యారణ్యులవారు రాజ్యస్థాపన చేసారు. తర్వాత దాన్ని హరిహర బుక్కరాయల వారికి ఇచ్చేసారు. ఇప్పటికీ శృంగేరీ గురువులకు ‘కర్ణాటక సింహాసన ప్రతిష్ఠాపనాచార్య’ అన్నది వారి బిరుదావవళిలో వినిపిస్తుంటుంది. గురువోచ్చిష్టం. గురువు తాను ఏం అనుభవిస్తున్నాడో ఎంత ఐశ్వర్యం ఉందో అది గురువోచ్చిష్టంగా శిష్యుడు అనుభవిస్తాడు. శిష్యుడు బయట ఎంత గొప్పవాడయినా గురువ్రతుడిగా గురువుకి లొంగి ఉంటాడు. ‘ఆజ్ఞాపాలన హనుమ’ లాగా గురువుగారు చెప్పే దానిని శాసనంగా స్వీకరిస్తాడు. ఆయన శాసకుడు. గురుశిష్య సంబంధంలోని ఒక సత్యాన్ని రూఢం చేసుకున్నవాడిని ‘గురువ్రత’ అంటారు. ఏమిటా సత్యం? ‘గురువు శాసకుడు తప్ప అభ్యర్థించువాడు కాడు’ అని. లోకంలో ఎవరు ఇచ్చినా అది సలహా కావచ్చు. కానీ గురువు ఇచ్చేది ఆజ్ఞ. ‘నేను కింకరుణ్ణి. ఆయన చెప్పింది చేసేయడమే నా పని’ అనేది శిష్యుడి భావనగా ఉంటుంది. ‘నాకు, నా భార్యకు అత్యంత ప్రియమైన పని ఒకటి ఉంది. మంచిపనే. ఎందుకో ఒకరోజు గురువుగారు – ’ అది నువ్వు జీవితంలో చేయడానికి వీల్లేదు’ అన్నారు. ఎందుకని అని–మేం అడగలేదు. ఆనాటినుంచి నేను కానీ, నా భార్యకానీ దాని జోలికెళ్ళలేదు. దాన్ని సలహాగా కాదు, శాసనంగా స్వీకరించాం. ప్రపంచంలో ఎవరయినా ఇంకొకరికి లొంగితేనే వృద్ధిలోకి వస్తారు. -
గురువుగారిల్లు గుడితో సమానం
బ్రహ్మగా, విష్ణువుగా, మహేశ్వరుడిగా గురువు తపించేది శిష్యుడికోసమే. అంతగా పరితపించే గురువు శిష్యుడినుండి ఏం కోరతాడు? ఏమీ ఉండదు. అంటే తను అడగ దలుచుకున్నది బలవంతంగా అణచుకోవడం కాదు. కోరుకోవడానికి ఆయనకు మరే కోరిక ఉండదు కనుక. ’నాకిది కావాల్రా’ అని అడగడు. కారణం –ఆయన కోరుకుంటే ఇచ్చేవాడు వేరొకడున్నాడు(పరమేశ్వరుడు). ఆయన్ని అడుగుతాడు తప్ప శిష్యుడి ముందు చేయిచాపడు. అయనకా అవసరం లేదు కూడా. ఆయన పరిపూర్ణుడు. ఎప్పుడూ తృప్తితో ఉంటాడు. మరి అటువంటి గురువు పట్ల శిష్యుడి కర్తవ్యం? గురువుగారు శరీరంలో ఉండేటట్లు చూసుకోవడమే. శరీరం అనిత్యమని గురువుకు తెలుసు. అది పడిపోతుంది. కించిత్ బెంగపెట్టుకోడు. ‘నేను ఆత్మ, శాశ్వతం. ఎక్కడికీ వెళ్ళను’ అన్న అవగాహనతో పరమ సంతోషంతో ఉంటాడు. ఈ శరీరంతో అనుభవించడానికి ఆయనకు భోగాపేక్ష ఉండదు. ఒకవేళ కష్టం వస్తే... గతజన్మల తాలూకు కర్మఫలం పోతున్నదని అనుభవిస్తాడు. కానీ గురువుగారి శరీరం లేకపోతే నష్టం కలిగేది శిష్యులకు. ఊపిరి త్వరగా తీసి త్వరగా విడిచిపెడుతుంటే ఆయువు క్షీణిస్తుంటుంది. బోధనలు నిర్విరామంగా చేస్తూంటాడు గురువు. ఆయన ఆయువు త్వరగా క్షీణిస్తుంది. ఇలా శిష్యులకోసం తన ఆయువును తాను తగ్గించుకుంటున్న గురువుకు శిష్యుడు చెయ్యడానికేమీ ఉండదు. మరి ఏం చేయాలి ? కేవలం శుశ్రూష మాత్రమే చేయగలడు. ఆయన శరీరం సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండడం కోసమని తాపత్రయపడి చేసే సేవే శుశ్రూష. ఇది స్థాన శుశ్రూష అని, దేహ శుశ్రూష అని రెండు రకాలు. స్థాన శుశ్రూష అంటే – గురువుగారి ఇల్లు సాక్షాత్ పరమేశ్వరుడు కొలువైన దేవాలయంతో సమానం. అందుకే గురువుగారి ఇంటిపక్కనుంచి వెళ్ళేటప్పుడు అది గుడి అన్న భావనతో ప్రదక్షిణంగా వెడతారు చాలామంది. విరాటపర్వంలో ఉత్తరకుమారుడితో అర్జునుడు– ‘‘రథం నడపడంలో నీకంత ప్రవేశం లేదు. ఆయన మా గురువు ద్రోణాచార్యులవారు. వారు నాకు పరమ పూజ్యులు. నీవు రథం నడిపేటప్పుడు పొరబాటున కూడా నా రథాన్ని మా గురువుగారి రథం ముందు పెట్టవద్దు. మా గురువుగారి రథం నా ఎడమవైపున కూడా ఉండడానికి వీల్లేదు. వారి రథం నా కుడి చేతివైపునే ఉండాలి. కారణం– నేను మా గురువుగారి మీద బాణం వెయ్యను. గురువుగారే ఒకవేళ ముందు వేస్తే...నేను క్షత్రియుడిని కాబట్టి దానికి బదులుగా బాణం వేస్తాను తప్ప నా అంతట నేను వేయను. యుద్ధరంగంలోకి వెళ్ళేటప్పుడు కూడా వారి రథాలకు ప్రదక్షిణచేసి లోపలకు నడుపు’’ అన్నాడు. దీన్ని స్థాన శుశ్రూష అంటారు. దానివల్ల గురువులకు ఒరిగేదేమీ ఉండదు. శిష్యుడి స్థాయి పెరుగుతుంది. అంతే. గురువుగారు ఉన్న ఇంటిని శుభ్రం చేయడం, గురువుగారి అవసరాలు గుర్తెరిగి సమకూర్చడంవంటివి చేస్తారు. దేహ శుశ్రూష–దేహము అంటే దహ్యమానమయిపోతుంది. ఆయన శరీరం బడలిపోతుంది. నీరసపడిపోతుంది. వయసు పెద్దదవుతుంది. శరీరంలో బలమూ తగ్గిపోతుంది. కానీ ఆయనకు శిష్యుడిపట్ల ప్రేమ ఎక్కువవుతుంటుంది. ఆ గురువు ఉండాలి ఆ శరీరంలో. అందుని గురువుగారు పడుకుంటే ఆయన కాళ్ళు ఒత్తుతారు. మంచినీళ్ళు తెచ్చిస్తుంటారు. గురువుగారు నదీస్నానం చేస్తుంటే ప్రవాహదిశలో దిగువకు శిష్యుడు స్నానం చేస్తాడు. గురువుగారిని తాకి వస్తున్న నీరు గంగకన్నా గొప్పది. -
గురువు సదాశివుడు
గురువు బ్రహ్మ అనీ, గురువు విష్ణువు అనీ తెలుసుకున్నాం. గురువు మహేశ్వరుడెలా అయ్యాడో చూద్దాం. మహేశ్వరుడేం చేస్తాడు? ఆయన లయకారకుడు. అంటే చంపేస్తాడని కాదు. స్వల్పకాలిక లయం, ఆత్యంతిక ప్రళయం, మహా ప్రళయం అని మూడు చేస్తాడు. అవికూడా పరమదయతో చేస్తాడు. అంతేకానీ ఆయనది క్రౌర్య స్వభావం కాదు. అందుకే ఆయనకు ’సదాశివ’అని వేదం బిరుదిచ్చింది. ఆయన ఎప్పుడూ ఎవ్వరిజోలికి వెళ్ళి బాధపెట్టే స్వభావమున్న వాడు కాదు. కోపం నటిస్తాడు, అదీ మనకోసమే, మన ఉద్ధరణకోసమే తప్ప నాన్నగారు వేలు చూపిస్తూ ’చితక్కొట్టేస్తా’ అంటే అది మనలను బాగుచేయడానికే కదా! అలా అన్నప్పుడు తండ్రి మనసులో ఎంత ప్రేమ ఉంటే అంత కోపం వ్యక్తమయిందో శివుడి కోపంలో కూడా అంతే ప్రేమ ఉంటుంది. అందుకని సదాశివ. గురువు సదాశివ. ఎందువల్ల? శివుడు లయకారకుడు. కొన్నిటిని నొక్కేస్తాడు. గురువు చేసే పని–శిష్యుడు ఎక్కడ పొరపాటు చేస్తున్నాడో పట్టుకుంటాడు. సాధనలో అనేక వైక్లబ్యాలుంటాయి. ‘నేను మంచి మార్గంలో వెడుతున్నా’ అనుకుంటూ శిష్యుడు దారితప్పి ధర్మానుష్ఠానంలో వైక్లబ్యాన్ని పొందుతాడు. వెళ్ళరాని మార్గంలో వెళ్ళిపోతుంటాడు. ధర్మం అత్యంత ప్రధానం. పరమ సున్నితమైన విషయమది. అంత సున్నితమైన ధర్మాన్ని ఆచరింపచేయడంలో గురువు దిద్దుతుంటాడు శిష్యుణ్ణి.గురువుగారితో బాగా అంటకాగి తిరగడం అలవాటయింది. గురుబోధలు వింటూ తన సంసారాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. గురువుగారికి అనుమానమొచ్చింది. పిలిచి – ’ఏమిరా, నేను గృహస్థాశ్రమంలో లేనా! నా భార్యాబిడ్డల్ని చూడ్డం లేదా ! ధర్మం ధర్మమే. గృహస్థుగా ఉండగా నీ మొదటి కర్తవ్యం వారి బాగోగులను చూడడం.’’ అని హెచ్చరించి దిద్దుతాడు. ’కర్తవ్యం’ అని ఒక మాట ఉంది. గురువు గొప్పదనమంతా కర్తవ్యనిష్ఠలో ఉంది. గురువు ఒకసారి చెప్తాడు.. వినలేదు, రెండుసార్లు, మూడుసార్లు చెప్తాడు.. వినలేదు. తను బతికున్నంత వరకు చెపుతుంటాడు తప్ప ‘నీ ఖర్మ’ అనడు. అది కర్తవ్యం. అంటే చేయవలసిన పని తాను చేయడం. ఫలితం–ఈశ్వరానుగ్రహం. కొడుకును కన్న తరువాత వాడికి విద్యాబుద్ధులు నేర్పించడం, వాడికి సరైన ఆదర్శంగా నిలబడడం, వాడు మంచి మార్గంలో ప్రయాణించేటట్టుగా తాను జీవించడం గృహస్థు ధర్మం. కొడుకు అలాగే ఉంటే సంతోషం. అలా ఉండకపోతే? బెంగపెట్టేసుకుని గృహస్థు అనుష్ఠానం మానేయకూడదు. తన అనుష్ఠానం తాను చేసి వెళ్ళిపోవాలి. అది కర్తవ్యం. ఈశ్వరునిపట్ల నమ్మకం వేరు, ఆశ్రమధర్మం వేరు. ఆశ్రమధర్మాన్ని ఆశ్రమ ధర్మంగానే పట్టుకోవాలి, నీవు పండేవరకు. నీ కర్తవ్యం పూర్తయ్యేవరకు నీవలాగే పట్టుకోవాలి. శిష్యుని పొరబాట్లను గురువు దిద్దుతాడు. ఉత్థానపతనాలలో జారిపోకుండా శిష్యుణ్ణి కాపాడుకుంటాడు. గురువు ఒక్కొక్కసారి తీవ్రస్వరంతో మాట్లాడతాడు. కోపాన్ని ఆయుధంగా తీసుకుని చక్కబెడతాడు. ఒక్కొక్కసారి ప్రశాంతవదనంతో మాట్లాడతాడు. ఏది ఎలా మాట్లాడినా లక్ష్యం ఒక్కటే. శిష్యుణ్ణి కాపాడుకోవాలి. ధర్మంనుంచి జారిపోకుండా చూసుకోవాలి. అలా చూసుకునే ప్రక్రియలో గురువు మహేశ్వర స్వరూపంతో నిలబడతాడు. అలా గురువు బ్రహ్మగా, విష్ణువుగా, మహేశ్వరుడిగా తన కర్తవ్యాన్ని పాలిస్తాడు. వెరసి గురువు పరబ్రహ్మ. -
విషాదాన్ని అలా పోగొట్టుకున్నాడు
రాయబారాలన్నీ విఫలమై, తీరా యుద్ధం ప్రారంభమయ్యే తరుణంలో అర్జునుణ్ని విషాదం చుట్టుముట్టింది: ‘నా శరీరంలోని ఇంద్రియాల్లాంటి ఈ నా చుట్టాల్నీ, సొంతవాళ్లనీ చంపి ఏం బావుకోవాలి?’ అనే జాలి పుట్టుకొచ్చింది. శ్రీకృష్ణుణ్ని ‘నాకిప్పుడేమీ పాలుపోవడం లేదు. నాకు గురువువై మార్గాన్ని చూపించు’ అని వేడుకొన్నాడు. శ్రీకృష్ణుడప్పుడు కర్తవ్యాన్ని బోధించాడు: ‘ఇక్కడ ఈ లోకంలో లోపలా బయటా అన్నీ సంఘర్షణలే. వాటి నుంచి ఎవడూ పారిపోలేడు. ఈ కర్మలనన్నిటినీ నిమిత్త మాత్రంగా చెయ్యాలి తప్ప, వాటి ఫలితాల ఆస్తి మీద మనకెవ్వరికీ హక్కు లేదు. పరమేశ్వరుణ్నే శరణు కోరుకొని, ఫలితాలన్నీ అతనివేనన్న వివేకంతో, అతని చేతిలో ఒక సాధనంగా మాత్రమే పనిచెయ్యాలి. ఇక్కడ ఎవ్వరూ ఎవ్వర్నీ చంపడం లేదు, చావడం లేదు కూడాను. మార్పులకు గురి అయ్యే శరీరాలు మార్పుల్ని పొందితే మనం ఏడవవలసిన పనిలేదు. అంతటా వ్యాపించి ఉన్న మనలో ఎవరికీ చావులేదు. భగవంతుణ్నే గుండెలో పెట్టుకొని తొణుకూ బెణుకూ లేకుండా ఈ జగన్నాటకాన్ని వినోదంగా చూస్తూ ఉండాలి. అతనూ నేనూ ఒకటేనన్న భావాన్ని రూఢి చేసుకొని, జీవితంలో సంఘర్షణలన్నీ నవ్వుతూనే ఎదుర్కోవాలి. అప్పుడే నీ మోహం పోతుంది’. ఈ ఉద్బోధను విని, విషాదాన్ని పోగొట్టుకుని గురువు చెప్పినట్టుగానే చేస్తూ అర్జునుడు యుద్ధంలో విజృంభించాడు. మొత్తంమీద భారతమంతటా అర్జునుడి సాధకరూపం ఉట్టిపడుతూ వచ్చింది. -
గూగుల్ కన్నా గురువే మిన్న
సాక్షి, భువనేశ్వర్ : సామాజంలో పరివర్తన తీసుకురావండలో గురువుది అద్వితీయమై పాత్రని భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ విషయంలో గూగుల్ లేదా మరో సెర్చ్ ఇంజిన్ ఎన్నటికీ గురువుకు పోటీకాలేవని ఆయన స్పష్టం చేశారు. తల్లి, మాతృభూమి, మాతృభాష, గురువు అనే ఈ నలుగురు వ్యక్తి జీవిత రేఖను నిర్ణయిస్తారని ఆయన అన్నారు. భువనేశ్వర్లోని కేఐఐటీ యూనివర్సిటీ 13వ స్నాతకోత్సం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆధునిక కాలంలో గూగుల్ ముఖ్యమైనదే.. కానీ గురువును కాదనేంత స్థాయిలో మాత్రం కాదని వెంకయ్యనాయుడు విద్యార్థులకు చెప్పారు. ఇంగ్లీష్, హిందీ, ఫ్రెంచ్, జర్మనీ వంటి భాషలు నేర్చుకోవడంలో తప్పులేదు.. కానీ మాతృభాషను కాపాడుకోవాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఆవేదన, ప్రేమ, బాధ వంటి భావాలను మాతృభాషలో స్పష్టం చేసినట్లుగా ఇతర భాషల్లో వ్యక్తం చేయలేమని ఆయన అన్నారు. -
మంచి శిష్యుడికోసం ఆరాటం!
మర్త్యలోకంలో (మానవలోకంలో) ఉన్నాడంటే పాపపుణ్యాల ఫలితాలు సుఖదుఃఖాలుగా అనుభవించడానికి వచ్చాడని గుర్తు. ఇక్కడకు వచ్చినవాడెవడూ పూర్తి సుఖాన్నీ పొందడు, పూర్తి దుఃఖాన్నీ పొందడు. నూరేళ్లు కష్టాలు పడ్డా, చివరకు మంచి మాట వింటాడు ఏదో ఒకటి. కానీ జీవితమంతా సుఖాలుండవు, అలాగే దుఃఖాలు కూడా ఉండవు. ఏవయినా కొన్నాళ్లే. మారిమారి అనుభవిస్తుంటాడు. ఇవి అనుభవంలోకి వచ్చినప్పుడు తాత్కాలికమైన ఉపశమనాలకోసం చూస్తే ఉద్ధరణ ఉండదు. అలా లేకుండా పోవాలంటే వైరాగ్యంతో భగవంతుడిని ఆశ్రయించాలి. ఆ అనుగ్రహం గురువు కారణంగానే వస్తుంది. గురువు రక్షణ బాధ్యత స్వీకరిస్తాడు. అందుకే శంకర భగవత్పాదులంటారు ‘సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్త్వం, నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః’. గురువు సత్ స్వరూపుడు. రామకృష ్ణపరమహంస అంటారు. ఏనుగుకు ఒక లక్షణం ఉంటుంది. అదలా వెళ్ళిపోతూ తన తొండాన్ని చాపి కనబడ్డ ప్రతి వస్తువునూ పీకుతుంది. అది జాజి తీగ కానివ్వండి, పనసచెట్టు కానివ్వండి. దానికనవసరం. అది లాగేస్తుంది. అదే ఏనుగు పక్కన మావటి వెడుతున్నాడనుకోండి. అది తొండం ఎత్తినప్పుడల్లా తన చేతిలో ఉన్న అంకుశం ప్రయోగిస్తాడు. అంతే. ఎంత బక్కపలచటివాడైనా మావటి మాటకు అంతటి బలమైన ఏనుగు లొంగిపోతుంది. దేన్నీ పాడుచేయదు. గురువుగారితో మమేకం చెందిన శిష్యుడు నిరంతరం గురువుని స్మరిస్తుంటాడు. నేనీ తప్పు చేస్తే, గురువుగారి దగ్గరకు వెళ్ళి ఏముఖం పెట్టుకుని నిలబడను? గురువు గారికి తెలియదులే అనుకుంటారా! మరి గురువు ఇంకెందుకు పరబ్రహ్మం అయినట్లు! ఒకవేళ గురువుగారికి నిజంగానే తెలియదనుకుందాం. నువ్వు తప్పుచేసి గురువుగారి దగ్గరకు వెళ్ళి తప్పుచేయని వాడిలా నిలబడతావా! అది గురుద్రోహం కాదా! కట్టి కుడుపదా! ‘నేనీ తప్పుచేయను. గురువుగారి ముందు నిలబడి నమస్కరించగల యోగ్యత నాకు చాలు’ అనుకున్నప్పుడు.. గురువు రక్షణ బాధ్యత స్వీకరించినట్లే. ఆ గురువు వలన ఉత్తర జన్మలన్నీ కూడా నిలబడ్డాయి. మంచి జన్మలలోకి వెళ్ళిపోతాడు. ఇంకా మంచి జన్మలలోకి వెళ్ళి శాస్త్రం మీద అధికారం ఉన్న తండ్రి కడుపునపుట్టి ఆయన అనుష్ఠానాన్ని చూసి ఆయన దగ్గర ఉపదేశం పొంది చాలా తొందరగా వైరాగ్యాన్ని పొంది బహుకొద్ది జన్మలలో ఈశ్వరుడి లోకి చేరిపోతాడు. అందుచేత గురువు రక్షకుడు. అంతేకాదు, మనం పొందిన జ్ఞానాన్ని నిలబెట్టేవాడు గురువే. గురువంటే డిగ్రీ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా ఓసారి చెప్పేసి వదిలిపెట్టేవాడు కాడు. గురువుతోడి అనుబంధం తెగిపోయేది కాదు. అలాగే శిష్యుడు లేని గురువు కూడా శోభిల్లడు. శిష్యుడికోసం పాకులాడతాడు గురువు. ‘అవంతీ హోమం’ అని వేదంలో ఒక ప్రస్తావన ఉంది. ఇది యోగ్యులైన శిష్యుల కోసం చేస్తారు. యోగ్యులైన శిష్యులు తన దగ్గరకు వచ్చి పాఠం నేర్చుకోవాలని గురువు ఈ హోమం చేస్తాడు. ఇది స్వార్థం కాదు, త్యాగం. కారణం తన విద్య తనతో పోకూడదు. సరస్వతి అంటే ప్రవాహం. గంగానది కళ్ళకు కనబడుతుంది, యమున కనబడుతుంది, అంతర్వాహిని అయిన సరస్వతి కనబడదు. అది అంతర్లీనంగా ప్రవహిస్తుంది. గురువు విద్య ఆ గురువుతో ఆగిపోకూడదు. ఆ గురువు హృదయాన్ని, ఉపదేశాన్ని అందిపుచ్చుకుని గురువుగారిలా తయారు కాగలిగిన శిష్యుడు దొరకాలి. దానివల్ల ఎప్పటికీ బోధ చేసే వాళ్ళుంటారు. అప్పుడే ఈ లోకానికి క్షేమం. -
ఆయనకు గుడి లేదు, పూజా లేదు!
గురుర్బ్రహ్మ్ర... అంటాం. గురువు బ్రహ్మ ఎలా అయ్యాడు? బ్రహ్మగారికి పూజలు లేవు కదా. అలా లేకపోవడానికి కారణాలు అనేకం ఉండవచ్చు. వాటిలో ఒకటి– బ్రహ్మగారు కొత్తగా అనుగ్రహించడానికి ఏమీ లేదు కనుక. అంటే... మనం చేసిన కర్మఫలితానికి ఈ శరీరాన్ని ఇచ్చేసాడు. మళ్ళీ ఇవ్వాలంటే ఈ శరీరం పడిపోవాలి. ఈ శరీరంతో ఉండగా ఇక బ్రహ్మగారు కొత్తగా అనుగ్రహించడానికి ఏముంది.. అందుకని ఆయనకు గుడిలేదు, పూజలేదు. స్థితికారుడైన విష్ణువు, జ్ఞానదాత అయిన మహేశ్వరుడు మాత్రం అనుగ్రహిస్తారు. బ్రహ్మ సృష్టి చేస్తాడు. సృష్టికంతటికీ పెద్దవాడు. అందువల్ల ఆయనను గౌరవించాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం చేసిన కర్మలను బట్టి శరీరాన్ని ఇస్తుంటాడు. మనుష్యుడు పొందిన ఈ శరీరాన్ని బట్టి కర్మాధికారం ఉంటుంది. ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి. ’జంతూనాం నరజన్మ దుర్లభం’అంటారు శంకరభగవత్పాదులు. అంటే అందరూ పశువులే. పశువుకానివాడు ఉండడు. పశువు అంటే పాశం చేత కట్టబడినది. జన్మ అది ఒక రాట(పశువులను కట్టే గుంజ). కర్మపాశాలు పలుపుతాళ్ళు. అవి మెడకు తగిలి ఉండడంవల్ల ఆ కర్మ ఫలితాలను అనుభవించడానికి మనుష్యుడు ఒక శరీరంలోకి వస్తాడు. ఆ కర్మపాశాలను తెగకోయకలిగినవాడు–పశుపతి. ’ఈశ్వరా! నేను పశువుని. మీరు పశుపతి. నన్ను ఉద్ధరించడానికి మనిద్దరి మధ్య ఈ సంబంధం చాలదా’ అన్నారు శంకరులు. కాబట్టి బ్రహ్మగారిచ్చిన ఈ శరీరం ఒక అద్భుతం. దేవతలు, మనుష్యులు, రాక్షసులు, మిగిలిన తిర్యక్కులు (భూమికి వెన్నుపాము అడ్డంగా కలిగిన ప్రాణులు).. అలా అన్నిటిలోకి మనుష్యుల శరీరమే గొప్పది. మనుష్యుడు ఎక్కడుంటాడు... మర్త్యలోకంలో ఉంటాడు. మర్త్యలోకమంటే.. మృత్యువుచేత గ్రసింపబడేది. అంటే ఈ లోకంలోకి ఏ ప్రాణివచ్చినా అది వెళ్లిపోతుంది ఒకనాడు.‘జాతస్యహి ధృవో మృత్యుః ధృవం జన్మ మృతస్యచ’’. వచ్చిన ప్రతి శరీరం వెళ్ళిపోవలసిందే. అయినా మనుష్య శరీరం చాలా గొప్పది. కారణం ? దేవతలు మనకన్నా గొప్పవాళ్ళంటారేమో! కానీ వారి శరీరాలకు కర్మాధికారం లేదు. యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి వాళ్లకా అధికారం లేదు. వాళ్ళ పుణ్యం క్షీణించిపోయే వరకు దేవలోకాల్లోఉండి తరువాత మర్త్య లోకంలో పడిపోయి మళ్ళీ సున్నతో మొదలు పెడతారు. కానీ మనుష్యుడు అలా కాదు. ఇక్కడుండి పుణ్యం చేసుకుని దేవలోకానికి వెళ్ళగలడు. లేదా చిత్తశుద్ధి కలిగి, దాని వలన జ్ఞానం కలిగి, మోక్షం కావాలని కోరుకుని తద్వారా ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందగలడు. మనుష్యశరీరంతో వచ్చినా, దానివిలువ తెలియనప్పుడు పాపకర్మలే చేసి కేవలం తాను బతికితే చాలని, ఇతరులగురించి ఆలోచించకుండా, శాస్త్రాధ్యయనం చేయకుండా, గురువుగారి పాదాలు పట్టుకోకుండా స్వార్థంతో బతికి చివరకు మళ్ళీ కొన్ని కోట్లజన్మల వెనక్కి తిర్యక్కుగా వెళ్ళిపోగలడు. మోక్షం పొందాలన్నా, దేవతా పదవులలోకి వెళ్ళాలన్నా, పాతాళంలోకి వెళ్ళాలన్నా, తిర్యక్కుగా వెళ్ళిపోవాలన్నా... మనుష్య శరీరానికే. అంటే పైకెక్కాలన్నా, కిందకుపోవాలన్నా ఇక్కడికి రాకుండా ఉండాలన్నా అటువంటి కర్మచేయగల అధికారం ఉన్న ఏకైక ప్రాణి సృష్టిలో మనుష్యుడు ఒక్కడే. ఈ శరీరాన్ని బ్రహ్మగారిచ్చారు. ఇస్తే... ఏమిటి దానివల్ల ఉపయోగం? సనాతనధర్మంలో ఆశ్రమ వ్యవస్థ వచ్చింది ఎందుకు... మెలమెల్లగా వ్యామోహాన్ని తీసేసి భగవంతునివైపు నడిపించడానికి. అందుకే ఎప్పుడు ఆశ్రమం మారినా, ఆ మార్పుచేత కట్టు మీద కట్టు వేసినా, ఆ కట్టువేయవలసినవాడు ఎవడు... అంటే... గురువొక్కడే. గురువుకు తప్ప ఆ కట్టువేసే అధికారం మరెవ్వరికీ లేదు. -
గురుపాద స్మరణే... సాధనకు మార్గం
‘‘నాకు ఉపనయనం చేసేటప్పుడు మా తండ్రిగారు గాయత్రీ మహామంత్రాన్ని ఉపదేశం చేశారు. తదనంతరం వేరొక గురువు మరొక మంత్రాన్ని ఉపదేశించారు. నేను ధ్యానం చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు నా మనోనేత్రంతో ఏ దేవతా స్వరూపాన్ని చూస్తున్నానో నాకు ఆమె కనబడడం లేదు. ఆమెకు బదులుగా గురువుగారిచ్చిన వేరొకమంత్రం తాలూకు దేవతా రూపం కనబడుతున్నది. పోనీ ఆ మంత్రం చేద్దామనుకుంటే, తండ్రిగారిచ్చిన గాయత్రీ స్వరూపం కనబడుతోంది. ఒక్కొక్కసారి ఈ రెండూ కూడా కనబడకుండా ఇష్టదేవతా స్వరూపం కనబడుతున్నది. మరి ఆ ధ్యానశ్లోకం చెప్పి ఆ దేవతా స్వరూపాన్ని మనోనేత్రంతో చూడకుండా వేరొక దేవతా స్వరూపం లోపల దర్శనమవుతుంటే–అటువంటి రూపాన్ని ధ్యానం చేస్తూ జపం చేయవచ్చా ?’’ – మహాపురుషులు శృంగేరీ పీఠానికి ఆధిపత్యం వహించిన శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి వారిని ఓ జిజ్ఞాసువు అడిగిన ప్రశ్న ఇది. ఉపదేశం పొందిన ఒక్కొక్క మంత్రానికి ఒక ధ్యానశ్లోకం ఉంటుంది. అంతటా నిండిన పరబ్రహ్మాన్ని సాకారరూపంగా ఇలా ఉంటుంది... ఆ రూపం అని చెప్పి ఊహచేస్తాం. తర్వాత మనసు దానితో తాదాత్మ్యత చెందడం మొదలుపెడుతుంది. ఉప్పుతో చేయబడిన ఒక బొమ్మ సముద్రంలో పడినప్పుడు లోతుకు వెళ్ళేకొద్దీ సాగరజలాల్లో అది కరిగిపోయినట్లు– ఏ వస్తువుపట్ల ధ్యానం మొదలుపెట్టాడో ఆ వస్తువులోనే సాధకుడు ఐక్యమయిపోతాడు. ఇప్పుడు ధ్యానం, ధ్యానవస్తువు, ధ్యేయం... మూడు ఒకటయిపోయి ఒక వస్తువుగా నిలబడిపోతుంది. అప్పుడు లోపలినుంచి ఆనందం అంకురించి రోమాంచితమవుతుంది. అలా జపం చేసేటప్పుడు శరీరానికి కదలిక లేకుండా ప్రాణాయామంతో ఊపిరిని బాగా క్రమబద్ధీకరిస్తే మనసు కదలదు. కదలని మనస్సును నిలబెట్టి ధ్యానవస్తువుని చూస్తూ క్రమంగా దేన్ని ధ్యానిస్తున్నాడో దానిలోకి లయమయ్యే ప్రయత్నం చేస్తాడు సాధకుడు. జిజ్ఞాసువు సందేహాన్ని విన్న స్వామివారు –‘‘నీకు నీ గురువుగారి పాదాలు గుర్తున్నాయా?’’ అని అడిగారు. ‘మా గురువుగారి పాదాలు నాకు ఎప్పుడూ జ్ఞాపకమే. అవి ఎప్పుడూ నా స్మరణలోనే ఉంటాయి’ అని ఆయన సమాధానం చెప్పారు. ‘‘గాయత్రి మహామంత్రం చేసినా, గురువుగారిచ్చిన వేరొక మంత్రం చేసినా ధ్యానశ్లోకం చదివి వదిలిపెట్టేయ్. ఆయాదేవతల రూపాన్ని ధ్యానం చేసే ప్రయత్నం చేయకు. నీకు పరమ ప్రీతికరం కనుక, నీకు వెంటనే జ్ఞాపకంలోకి వస్తాయి కాబట్టి నీ గురువుగారి పాదాలు ధ్యానం చెయ్. ఆ దేవతయినా, ఈ దేవతయినా గురువులోనే ఉంటారు. గురువు పరబ్రహ్మ స్వరూపం. అటువంటి పరబ్రహ్మ స్వరూపమైన గురుపాదాలను స్మరించి చేసే జపం సిద్ధిస్తుంది. నీ సాధన ఫలిస్తుంది’’ అని మహాస్వామివారు వివరించారు. కాబట్టి గురువుగారి పాదాలను ధ్యానం చేయడం అంటే.. పరబ్రహ్మను ధ్యానం చేయడమే. అందుకే ఇప్పటికీ మనం ‘‘గురుర్బహ్మ్ర, గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర:’’ అంటాం. -
శిష్యవాత్సల్యం
బిడ్డలు మంచివారయినా, చెడ్డవారయినా ఆస్తిని మాత్రం తల్లిదండ్రులు వారికే ఇస్తారు. కానీ గురువొక్కడే తన శిష్యులకు ఇస్తాడు. గురువుగారి శరీరం పడిపోయిన తరువాత ఆయన ఆస్తి – అంటే రామాయణం, భారతం, భాగవతం, భక్తి, జ్ఞానం, వైరాగ్యం, ప్రబోధం, అనుష్ఠానం, ధర్మం... ఇవన్నీ నమ్ముకున్న శిష్యుడికి వెళ్ళిపోతాయి. యోగ్యుడు కాకపోతే కొడుక్కు కూడా వెళ్ళవు. తనని అంటిపెట్టుకుని తిరిగాడు కాబట్టి అంతటి గొప్పవిద్యను గురువు శిష్యుడికి ఇవ్వగలడు. శిష్యుడికి వశవర్తియై పరమేశ్వరుడి అనుగ్రహం కూడా శిష్యుడికి ఇప్పించగలడు. వైష్ణవ సంప్రదాయంలో ’యథోక్తకారీ’ అని ఒక అద్భుత విశేషం ఉంది. కాంచీపురంలోని ఒక దేవాలయంలో విష్ణుపెరుమాళ్ శేషశయనం మీద ఉంటాడు. ఈ సంప్రదాయానికి చెందిన ఆళ్వారుల్లో ఒకరయిన భక్తిసారులు విష్ణుమూర్తిని సేవిస్తూ ఉండేవారు. బ్రహ్మచారిగా ఉన్న అలాంటి భక్తిసారులను ఒక దంపతుల జంట సేవిస్తూ ఉండేది. ఆయనకు తెచ్చిన ఆవుపాలు ఆయన తాగగా మిగిలినవి ప్రసాదంగా సేవిస్తూ ఉండేవారు. వారికి కణికణ్ణన్ అని ఒక కుమారుడు పుట్టాడు. అదే దేవాలయంలో వృద్ధురాలయిన ఒక గూనిస్త్రీ రోజంతా తుడిచి కడిగి వెళ్ళిపోతూ ఉండేది. అది చూసిన కణికణ్ణన్ ఆమెకు గూని లేకపోతే మరింత ఎక్కువ సేవచేసేది కదా అనుకుని గురువుగారివంక చూసాడు. ఆయన అనుగ్రహం పొందిన శిష్యుడు వెళ్ళి ఆమె గూనిని ముట్టుకోగానే ఆమె వైకల్యం పోయి నవయవ్వనంతో చక్కటి సౌందర్యవతిగా మారిపోయింది. వృద్ధుడయిన ఆ దేశపు రాజుకు ఈ విషయం తెలిసి కణికణ్ణన్ను పిలిపించి తన వృద్ధాప్యాన్ని కూడా తొలగించమన్నాడు. గూనిస్త్రీలో వచ్చిన మార్పు తన గొప్పదనం వల్ల కాదనీ, కేవలం తన గురువుగారి అనుగ్రహం వల్లమాత్రమే సాధ్యమైందని ఎంత చెప్పినా వినకుండా రాజు కణికణ్ణన్కు దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. కణికణ్ణన్ నేరుగా గురువుగారి దగ్గరకు వచ్చి జరిగింది చెప్పి దేశం విడిచి వెళ్ళిపోతున్నానన్నాడు. వెంటనే భక్తిసారులు లేచి శేషశయనం మీద ఉన్న స్వామివారిని ఉద్దేశించి ‘‘కణికణ్ణన్వెళ్ళి పోతున్నాడు’’ అన్నాడు. అంతే చెప్పాడు. స్వామివారు దిగ్గున లేచి ‘కణికణ్ణన్ ఎక్కడికెడితే మనమూ అక్కడికే వెడదాం పద’ అంటూ ముందుకు నడిచాడు. కణికణ్ణన్ముందు, ఆయన వెనుక భక్తిసారులు, వారి వెనుక స్వామి వెళ్ళిపోతూ మార్గమధ్యంలో ఆ రాత్రికి పాలార్నది ఒడ్డున బస చేశారు. విష్ణువు వక్షస్థలంలో కొలువై ఉండే లక్ష్మి కూడా కాంచీపురాన్ని వదిలిపెట్టడంతో ’నగరేషు కాంచి’గా పేరొందిన ఆ నగరం వెలవెలాపోయి ప్రజలు గగ్గోలు పెట్టడంతో విషయం తెలుసుకున్న రాజు పరుగున వెళ్ళి క్షమించమంటూ స్వామివారి పాదాలమీద పడ్డాడు.’నా భక్తుడు రమ్మంటే ఆయన వెంట వచ్చేసాను’ అంటూ స్వామి భక్తిసారులను చూపాడు. భక్తిసారుల దగ్గరకు వెళ్ళి ప్రాధేయపడ్డాడు రాజు. కణికణ్ణన్ వెళ్ళిపోతుంటే ఆయన్ని అనుసరించానంతే అన్నాడు భక్తిసారులు. రాజువెళ్ళి ఆయనను అర్థించగా కరుణించిన కణికణ్ణన్’తప్పు ఒప్పుకున్నావుగా చాలు, పద’ అని కంచివైపు తిరుగుముఖం పట్టాడు. భక్తిసారులు చూసి ’కణికణ్ణన్ వెళ్ళిపోతున్నాడు’ అని చెప్పడంతో స్వామివారు అలాగే అంటూ బయల్దేరారు. ముందు కణికణ్ణన్, వెనుక భక్తిసారులు, వారి వెనుక స్వామివారు తిరిగి కంచి దేవాలయానికి చేరుకున్నారు. ‘యథా ఉక్తకారీ’ అంటే ఎలా గురువుగారు చెప్పారో అలా చేసిన పరమాత్ముడు’ అని–అదే ఇప్పుడు కంచిలో ఉన్న యథోక్తకారి దేవాలయం. గురువుకు ఉండే శిష్య వాత్సల్యం పరమేశ్వరుడిని కూడా శాసిస్తుందని చెప్పడానికి ఈ దేవాలయం ఒక నిదర్శనంగా కనబడుతుంది. -
తెలియదని తెలుసుకోవడమే జ్ఞానం
అధ్యాపకుడు అంటే ఏది చదవాలో అది చదివిస్తాడు. గురువుచేసే మొదటి పని వినయాన్ని నేర్పడం. అసలు విద్య అన్న మాటకు ఒక అర్థం–విత్ అంటే తెలుసుకొనుట. రెండవ అర్థం–నాకేమీ తెలియదని తెలుసుకోవడం. కానీ ఎవరైనా, ఎవరినైనా నీకేమీ తెలియదంటే ఒప్పుకోరు. అది మానవ నైజం. కంచికామకోటి పీఠాధిపతి శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని శిష్యులొకసారి ‘మిమ్మల్ని జగద్గురువని సంబోధించాలని ఉంది... అలా పిలవొచ్చా– అని అడిగారు. దానికాయన ‘‘జగద్గురువంటే ఒక సమాసం ప్రకారం ‘జగత్తునంతా గురువుగా కలిగినవాడు’ అనే అర్థంలో నేను ఎప్పుడూ జగద్గురువునే. ఎందుకంటే ఇంతమందిని చూసి నేను ప్రతిరోజూ నేర్చుకుంటున్నాను కనుక’ అన్నారు. అదీ ఆయన వినయం. శిష్యుడు అంటే శిక్షింపబడేవాడు. వినయం ఉండి ఇంద్రియాలు శిక్షింపబడిన వాడు శిష్యుడు. గురువుగారి పేరు వినబడినా, ఆయన కనబడినా ఇంద్రియాలు అదుపులోకి రావాలి. చూడకూడనిది కన్ను చూడదు, స్మరించకూడనివి మనసు స్మరించదు, వినకూడనివి చెవులు వినవు. అలా ఇంద్రియాలను శిక్షించుకుని, నిగ్రహించుకుని, శమదమాదులు నేర్చుకుని గురువు ముందు కూర్చున్నవాడు శిష్యుడు. అందుకే శంకరాచార్యులవారు షట్పదీ స్తోత్రం చేసూ ్త‘నా అవినయాన్ని తీసేసి వినయాన్ని కటాక్షించు’ అన్నారు. మొదట వినయం నేర్పినవాడు గురువు, ఆయన అధ్యాపకుడు. చదువు నేర్పుతాడు. ఉపాధ్యాయుడు అని మరో పేరు. అనేకమైన క్రియాకలాపాలవల్ల గురువు ఇన్ని పేర్లతో పిలవబడతాడు. లౌకికంగా అర్థం చెప్పాలంటే – కొంత ద్రవ్యాన్ని జీతంగా తీసుకుని పాఠం చెప్పేవాడు ఉపాధ్యాయుడు అని. మరొక అర్థంలో – ఎవరు వేదం నేర్పుతారో ఆయన ఉపాధ్యాయుడు. -
సుధీర్కు జోడిగా బాక్సింగ్ బ్యూటీ
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన రితికా సింగ్, తొలి సినిమా సాలా ఖద్దూస్ తోనే ఆకట్టుకున్నారు. తరువాత అదే సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన గురుతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. గ్లామర్ రోల్స్ లోనూ నటిస్తున్నారు. గురు తరువాత ఎక్కువగా తమిళ చిత్రాలు మాత్రమే చేస్తు వచ్చిన రితికా డబ్బింగ్ సినిమాగా తెలుగు లో రిలీజ్ అయిన శివలింగాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. త్వరలో ఈ బాక్సింగ్ బ్యూటీ మరో తెలుగు సినిమాలో నటించనుందట. యంగ్ హీరో సుధీర్ బాబు లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న సినిమాకు రితికా ఓకె చెప్పిందన్న టాక్ వినిపిస్తోంది. కొత్త దర్శకుడు రాజశేఖర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. -
మహాజ్ఞానిని కూడా అనుసరించరాదు
శాస్త్ర సారాన్ని ఒక్క వాక్యంలో ఆవిష్కరిస్తాడు గురువు. కాబట్టి ఆచార్యః. ఆచరించి చూపువాడు. ఆచరణలేని విద్య ఎవరికి పనికొస్తుంది? ఆయన ఫలానా పనిచేయడు, కానీ చేయాల్సిందిగా అందరికీ చెబుతుంటాడు. ఆయనే చెయ్యనప్పుడు ఇంకెవరు చేస్తారు. మరొకాయన పరమనిష్ఠాపరుడు. ప్రాణం పోయినా అది చేయకుండా ఉండడు. ఆ మంచిపని ఒక్కటి చాలు పదిమందికి మార్గదర్శకత్వం వహించడానికి. ఇక్కడ ఒక చిన్న మర్మం ఉంది. జాగ్రత్తగా గమనించాలి. ఆచరణ చేసే గురువుంటాడు, చెయ్యని గురువుకూడా ఉంటాడు. ఇద్దరూ గురువులే. ఒక గురువుకు ఆచరణ ఉండదు. ఆచరణ లేదు కాబట్టి గురువుకాడని అనలేం. ‘నేను ఆత్మ’ అని 24 గంటలు ఆత్మగానే నిలబడిపోయే స్థాయికి వెళ్ళిన వాళ్ళుంటారు. భగవాన్ రమణులలాంటివారు. ఆయనకు ఒంటిమీద బట్టకూడా అక్కర్లేదు. ‘అయ్యా, మీకయితే సర్వం బ్రహ్మం. కానీ మాకు మాత్రం తేడాలున్నాయి. ఓ గోచీ అయినా పెట్టుకోండి’ అని శిష్యులంటే పెట్టుకున్నారాయన. ఆయనకు – శరీరంవేరు, ‘నేను’ వేరు. ఇది తెలుసుకున్న ఆయన మహాజ్ఞాని. ఆయన ఫలానా పనులేవీ చేయడు కదండీ, నేను కూడా మానేస్తానంటే కుదరదు. ఎప్పుడూ జీవితంలో ఇద్దరిని అనుకరించరాదు. మహాజ్ఞానిని, అజ్ఞానిని. ఇది బాగా గుర్తుంచుకోండి. మహాజ్ఞానిని అనుకరించకూడదు. రామకృష్ణ పరమహంసకు కంఠంలో రాచపుండు పుట్టింది. అన్నం మింగలేకపోతున్నారు. ఒకసారి వివేకానందుడు ఆయనతో ‘మీతో కాళికాదేవి మాట్లాడుతుంది కదా, ‘‘అమ్మా ! అన్నం తినలేకపోతున్నా’’ అని చెప్పుకో కూడదా? తినే అవకాశం కల్పిస్తుంది కదా !’ అని సూచించాడు. ‘సరే, అయితే అడుగుతా నుండు. అని లోపలికి వెళ్ళివచ్చారు. ‘‘ఏమంది అమ్మ?’’ అని అడిగారు వివేకానందుడు. ‘ఇన్ని కంఠాలతో తింటున్నది నీవు కాదా!’ అన్నదని చెప్పారు. అంతటా ఉన్నది ఒక్క ఆత్మ. అలా మనం ఉండగలమా? ఆయనలా నీవు ఉండగలిగితే నీవు కూడా ఆయనను అనుకరించవచ్చు. గోచీపెట్టుకోంగానే రమణ మహర్షికాలేం కదా ! మహాజ్ఞాని ఆత్మగా నిలబడిపోయి ఉంటాడు. రమణులకు సర్కోమా వ్యాధి వచ్చింది. శస్త్రచికిత్స చేసారు. ఆ పుండు కోసి కట్టుకట్టినప్పుడు వేడి తగలకూడదట. వేడి తగిలితే శరీరం బద్దలై రక్తం చుక్కలు చుక్కలుగా కింద పడిపోతుందట. అది తెలియక ఆయన అనుచరగణం అది చలికాలం కావడంతో మంచం కింద హీటరు పెట్టారు. శరీరమంతా బద్దలైపోయి ఆయన నెత్తురు చుక్కలుగా కారి తట్టు కట్టింది. డాక్టర్లు వచ్చి ‘ఎవరు పెట్టారు హీటరిక్కడ’ అని అడిగితే ‘చలిగా ఉందని పెట్టామండీ, ఇంత అనర్థం అవుతుందని తెలియదే’ అన్నారు ‘ఇంత నెత్తురు కారిపోతుంటే మమ్మల్ని పిలవొచ్చుగా లేదా మీరే దాన్ని తీసేయచ్చుగా అన్నారు డాక్టర్లు. రమణులన్నారు తాపీగా..’’దీనికి (శరీరానికి) బాగుంటుందని వారు (హీటర్) పెట్టారు, బాగుండదని మీరంటున్నారు. ఇది బాగాలేదని అదేమో బద్దలయిపోయింది. ఈ మూడూ చూస్తున్నా.’’ అన్నారు..! అందుకే మహాజ్ఞానిని అనుకరించరాదు. ఇక అజ్ఞాని–వాడికేం తెలియదు. ఏదయినా పద్ధతి చెబితే చెయ్యనంటాడు. ఆయన చెయ్యడం లేదు కాబట్టి నేను కూడా చెయ్యను అనకూడదు. అలా అజ్ఞానిని అనుకరించరాదు. మరెవరిని అనుకరించాలి? శాస్త్రమెరిగి పాటించే వారిని అనుసరించాలి. అలా శాస్త్రం తెలుసుకుని పాటించేవాడు ఆచార్యుడు. ఆయనను అనుసరించాలి. ఎప్పటివరకు? నీవు పండేవరకు. -
లెజెండరీ డైరెక్టర్తో వెంకీ నెక్ట్స్..!
గురు సినిమాతో ఆకట్టుకున్న విక్టరీ వెంకటేష్ ఇంత వరకు తన నెక్ట్స్ సినిమాను ఎనౌన్స్ చేయలేదు. గురు సినిమా సెట్స్ మీద ఉండగానే.. వెంకీ నెక్ట్స్ సినిమా క్రిష్తో ఉంటుందన్న ప్రచారం జరిగింది. వీరయ్య టైటిల్తో పీరియాడిక్ డ్రామగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారన్న టాక్ బలంగా వినిపించింది. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అదే సమయంలో యంగ్ డైరెక్టర్ కిశోర్ తిరుమలతో ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమా చేసేందుకు ప్లాన్ చేశాడు వెంకీ. కానీ సినిమా కూడా స్టార్ కాలేదు. తాజాగా వెంకీ నెక్ట్స్ ప్రాజెక్ట్పై మరో ఆసక్తికరమైన వార్త హల్చల్ చేస్తోంది. సౌత్ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్, వెంకటేష్ కోసం కథ రెడీ చేశాడట. ఇటీవల ఒప్పం సినిమాతో సంచలనం సృష్టించిన ప్రియదర్శన్, వెంకీ కోసం స్పెషల్ స్టోరిని రెడీ చేశాడట. రెండు దశాబ్దాల క్రితం నాగార్జునతో నిర్ణయం, బాలకృష్ణతో గాంఢీవం సినిమాలను తెరెక్కించిన ప్రియదర్శన్ తరువాత ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. ఇన్నేళ్ల తరువాత వెంకటేష్తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే కాంబినేషన్పై ఇంతవరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో వెంకటేష్
గురు సినిమాతో డీసెంట్ హిట్ కొట్టిన సీనియర్ హీరో వెంకటేష్ ప్రస్తుతం ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. గురు తరువాత వేరే ఏ ప్రాజెక్ట్ కు ఓకె చెప్పని వెంకీ కొంత గ్యాప్ తీసుకోవాలని భావిస్తున్నాడు. గురు ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న వెంకటేష్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై స్పందించాడు. ప్రస్తుతానికి ఎలాంటి కమిట్ మెంట్స్ లేకపోయినా ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్లో నటించే ఉద్దేశం ఉన్నట్టుగా తెలిపాడు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తనకు మంచి మిత్రుడన్న వెంకీ, వీలైతే తనతో ఓ బాలీవుడ్ మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తానని తెలిపాడు. ప్రస్తుతానికి ఈ కాంబినేషన్ కోసం ఎలాంటి వర్క్ జరగకపోయినా. అవకాశం ఉంటే మాత్రం సల్మాన్ తో నటించేందుకు తాను సిద్ధమని తెలిపాడు వెంకీ. వెంకీ లీడ్ రోల్ లో సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన గురు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. -
బాబాయ్ సినిమా సీక్వల్లో అబ్బాయ్..!
సీనియర్ స్టార్ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా గురు. సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమాకు సీక్వల్ను తెరకెక్కించే ప్లాన్లో ఉంది దర్శకురాలు సుధ కొంగర. ఇప్పటికే సీక్వల్కు సంబంధించి ఓ స్టోరి లైన్ కూడా రెడీ చేసుకుందట. ప్రస్తుతం పూర్తి స్క్రీప్ట్ రెడీ చేసే పనిలో ఉంది. అయితే తొలి భాగాన్ని వెంకటేష్ హీరోగా తెరకెక్కించిన దర్శకురాలు, సీక్వల్లో హీరోను మార్చాలని నిర్ణయించింది. గురు సినిమా సీక్వల్కు యంగ్ హీరో రానాను లీడ్ రోల్కు తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే లైన్ విన్న రానా ఫుల్ స్క్రీప్ట్ రెడీ చేయమన్నాడు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నేనే రాజు నేనే మంత్రి సినిమా షూటింగ్లో పాల్గొంటున్న రానా, బాహుబలి పార్ట్ 2 రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత సుధ దర్శకత్వంలో సినిమా ఉండే ఛాన్స్ ఉంది. అయితే తొలి భాగంలో వెంకీ చేసిన పాత్రకు రానా పాత్రను ఎలా కనెక్ట్ చేస్తారో చూడాలి. బాబాయ్ ఆకట్టుకున్న కోచ్ పాత్రకు అబ్బాయి రానా ఎంత వరకు న్యాయం చేస్తాడో అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
డైరెక్టర్స్ హీరో
పదిమందిలో మంచి పేరు తెచ్చుకోవడానికి నైజం ఏదైనా నిజం బయట పడకుండా పబ్లిక్ లైఫ్లో యాక్ట్ చేసేస్తుంటారు. వెంకటేశ్ అలా కాదు. సత్యాన్ని అన్వేషించాలనుకుంటాడు. అందుకే... సత్యానికి దగ్గరగా ఉండాలనుకుంటాడు. అందుకే ఆయన డైరెక్టర్స్ హీరో అయ్యాడు. పాత్రల్లో ఎలాగూ మంచి నటన ఉంటుంది. జీవితంలో మంచి పాత్ర చాలు. నటన అక్కర్లేదు. వెంకీ పాలసీ, ఫిలాసఫీ కూడా ఇదే. ⇒ వెంకీగారు... మెయి న్స్ట్రీమ్ హీరోల్లో ఇద్దరు లేడీ డైరెక్టర్స్తో సినిమాలు చేసింది మీరే. ఫీమేల్ డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేయాలనా? వెంకీ: (నవ్వుతూ) నేను మంచి సినిమాలను ప్రోత్సహిస్తాను. క్రమశిక్షణ, అంకితభావానికి ప్రాధాన్యం ఇస్తాను. అది ఎవరిలో ఉన్నా ఎంకరేజ్ చేస్తా. సుధలో నేను ఆ లక్షణాలు చూశా. 24 గంటలూ ఆమె సినిమా గురించే ఆలోచిస్తుంది. ప్లస్ తను తీసుకొచ్చిన కథ బాగుంది. ⇒ ఫీమేల్ డైరెక్టర్, స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్... సుధ హ్యాండిల్ చేయగలుగుతుందా? అని చిన్న సందేహం కూడా కలగలేదా? వెంకీ: ఇప్పుడు మీరు అడుగుతుంటే ఆలోచిస్తున్నాను. యాక్చువల్గా సుధ వచ్చినప్పుడు నాకేమీ అనిపించలేదు. ఫీమేల్ డైరెక్టర్ అని ఆలోచించలేదు. స్టోరీ నచ్చింది. ముందు సినిమాల్లో చేసినట్టు కాకుండా కొత్తగా, నేను టోటల్ డిఫరెంట్గా కనిపించాలని, నటించాలని అను కుంది సుధ. ఆ విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పింది. ⇒ ‘అమ్మాయిలు అవకాశాలు రాలేదు... అంటుంటారు. వస్తే ఉపయోగించుకోరు’ అని ‘గురు’ సినిమాలో ఓ డైలాగ్ చెప్పారు. ఇన్ జనరల్ విమెన్ గురించి చెప్పండి? వెంకీ: సహజంగా మహిళలు మగవాళ్ల కన్నా స్ట్రాంగ్. అందులో సందేహం లేదు. 20– 30 ఏళ్లుగా మహిళలు సమాజంలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. వాళ్లకు ఓ ఛాన్స్ ఇచ్చి చూడండి... అద్భుతాలు సృష్టిస్తారు. సమాజం మహిళల పాత్రను గుర్తించి అంగీకరించాలి. నేనెప్పుడూ మహిళలను ఎంకరేజ్ చేస్తాను. వాళ్లు ఏం చేసినా బాగా చేస్తారు. లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నారనే ఛాయిస్ వాళ్లకే ఇవ్వాలి. ⇒ మరి... ఈ సినిమాలో రితికా సింగ్ను కాలితో తన్నే సీన్ చేయడానికి ఇబ్బంది పడలేదా? వెంకీ: ఆ సీన్ కుదరదంటే కుదరదని సుధతో అన్నాను. కానీ, చేయకపోతే సీన్ పేలవంగా ఉంటుందని చెప్పింది. (మధ్యలో సుధ కల్పించుకుంటూ)... మామూలుగా వెంకీ ఏ సీన్ అయినా సింగిల్ టేక్లో చేసేస్తారు. కానీ, ఈ సీన్కి టేక్స్ మీద టేక్స్ తీసుకున్నారు. రితిక ఏమో ‘కమాన్ హిట్ మి’ అన్నప్పటికీ వెంకీ చేయడానికి ఇష్టపడలేదు. చివరికి ఎలాగో ఒప్పించాం. ఇష్టం లేకుండా చేసిన సీన్ కాబట్టి, ఎక్కువ టేక్స్ తీసుకున్నారు. ⇒ ‘గురు’ పాత్రకు వెంకీయే కరెక్ట్ అని ఎలా ఊహించారు? సుధ: నిజం చెప్పాలంటే... నేను గుడ్ యాక్టర్స్తోనే పని చేయడానికి ఇష్టపడతాను. అలాంటివాళ్లు పక్కన ఉంటే నాకు ఎనర్జీ వస్తుంది. బ్యాడ్ యాక్టర్స్ను భరించలేను. వెంకీ జీనియస్ యాక్టర్. ‘క్షణ క్షణం’లో వెంకీ యాక్టింగ్ ఇష్టం. ఆయనకు ఓ క్యారెక్టర్ ఇస్తే అందులోంచి అటూ ఇటూ వెళ్లరు. ఆ పాత్రకు ఏం చేయాలో అదే చేస్తారు. ఆయన సినిమాలు చూసి, నేను తెలుసుకున్న విషయం అది. అందుకే ‘గురు’గా ఆయనే కరెక్ట్ అనుకున్నా. ఒకవేళ వెంకీ చేయకపోతే ‘గురు’ వచ్చేది కాదు. ⇒ తమిళంలో ఈ సినిమాని మాధవన్తో తీశారు. తెలుగులో వెంకీ పెద్ద స్టార్ కాబట్టి, మీకేమైనా భయం అనిపించిందా? సుధ: మొదట ఆయన ఈ సినిమా చేయడానికి అంగీకరిస్తే... సగం యుద్ధం గెలిచినట్టే అనుకున్నా. కథకు తగ్గట్టు ఎలా నటించాలో తర్వాత ఎలానూ చెబుతారు. అఫ్కోర్స్... భయం ఉంటుంది. కొత్త వ్యక్తిని ఎవర్ని కలిసినా నాలో భయం ఉంటుంది. అయితే సినిమా బాగా రావాలనే స్వార్థమే... ఆ భయాన్ని తీసి పక్కన పడేసింది. (వెంకటేశ్ మధ్యలో కల్పించుకుంటూ) మొదట్లో కొన్ని నా దగ్గర చెప్పలేదు. వారం తర్వాత ఓ రోజు ‘మీరు ఫుల్ స్క్రిప్ట్ చదవాలి. అది కూడా షూటింగ్కి ముందే మొత్తం చదవాలి. పక్కన ఆర్టిస్టులుంటారు. వాళ్లతో కలసి రిహార్సల్స్ చేయాలి’ అంది. సరే చూద్దామన్నా. చాలాసార్లు రిహార్సల్స్ చేయాలని అడిగింది. నేనెప్పుడూ అలా చేయలేదు. దాంతో ఇబ్బందిగా ఉంటుందేమో అనిపించింది. ఇంపార్టెంట్ సీన్స్ ఇంటికి తీసుకువెళ్లి ప్రిపేర్ కావడం కామనే. కానీ, నా లైఫ్లో ఫుల్ స్క్రిప్ట్ ఎప్పుడూ చదవలేదు. అసలు నాకు తెలుగు రాదు. ఫుల్ స్క్రిప్ట్ చదవడం, రిహార్సల్స్.. ఇదంతా ఎప్పటికి పూర్తవుతుందని సుధని అడిగితే... ‘ఏం ఫర్వాలేదు’ అంది. ఇంటికి వెళ్లి బాగా ఆలోచించాను. ఎక్కడో కొడుతుందేమో, డేంజర్ అవుతుందేమో అనుకున్నా. కానీ, ఒక్కసారి స్క్రిప్ట్ చదవి, షూటింగ్ మొదలు పెట్టాక ఎంతో ఎనర్జీ వచ్చింది. ఏదో ఐఏయస్, ఐపీయస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినట్లు అనిపించింది. ⇒ భల్లాలదేవ (వెంకీ అన్న సురేశ్బాబు కొడుకు)తో మీ రిలేషన్ గురించి? వెంకీ: తను నా కొడుకులాంటివాడే. ‘సాలా ఖడూస్’ గురించి చెప్పి, ‘ఈ సినిమా చూడు’ అన్నాడు. అంతకుముందే సుధ నాకు ఈ సినిమా గురించి చెప్పింది. ‘నేను కూడా ఇదే చేయాలనుకుంటున్నార్రా’ అన్నాను. అన్నయ్య, నేను బాగా డిస్కస్ చేసుకుంటాం. రానా కూడా తన సినిమాల గురించి చెబుతుంటాడు. సుధ: 2010లో ఇదే రూమ్లో రానాకి ‘గురు’ కథ చెప్పాను. రానా యంగ్ కాబట్టి, కొంచెం లవ్, రొమాన్స్ యాడ్ చేశాను. స్క్రిప్ట్ నచ్చినప్పటికీ అప్పట్లో రానాకి ఈ సినిమా చేయడం కుదరలేదు. తర్వాత రెండేళ్లకు వెంకీకి ఈ కథ చెప్పా. నా ఫ్రెండ్ ఒకరు రమణ మహర్షి డైరీ ప్రతి ఏడాదీ ఇస్తుంటారు. ప్రతి రోజూ ఆ డైరీలో రాసుకుంటాను. వెంకీ దగ్గర కథ చెప్పడానికి వెళ్లినప్పుడు ఆ డైరీ తీసుకెళ్లాను. రమణ మహర్షి డైరీ ఏంటి? అని అడిగారాయన. ఏదో శక్తి నడిపించినట్లుగానే ముందు రానా దగ్గరకు వచ్చిన కథ... ఆ తర్వాత మూడేళ్లకు వెంకీకి కుదరడం భలే గమ్మత్తుగా అనిపించింది. సుధ: సాధారణంగా వెంకీ ఉదయం తొమ్మిది పదింటికి షూటింగ్ చేయడానికి ఇష్టపడతారు. మేము 7 గంటలకే రమ్మన్నాం. ఆయన 6.45కే వచ్చి... ‘‘నేను ఎలా చేస్తే బాగుంటుంది? నువ్వేం అనుకుంటున్నావ్?’ అనడిగేవారు. యాక్టర్ అలా రెస్పాండ్ కాకపోతే డైరెక్టర్ ఏమీ చేయలేరు. ⇒ హిందీ హీరోల్లా తెలుగు హీరోలు ప్రయోగాలు చేయరంటారు. ‘దంగల్’కి ఆమిర్ఖాన్ పొట్ట పెంచినట్లుగా ఏదైనా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే మీరూ చేస్తారా? వెంకీ: అలాంటి కథ వస్తే తప్పకుండా చేస్తాను. రైటర్స్, డైరెక్టర్స్ రావాలి. ఒకప్పుడు నేను చేసిన సినిమాలు తీసుకోండి. ‘చంటి’ ఒప్పుకున్నప్పుడు, ‘నువ్వేమో మ్యాన్లీగా ఉంటావ్. అమాయకుడి పాత్ర వర్కవుట్ కాదని చాలామంది అనుకుంటున్నార్రా. జాగ్రత్త’ అన్నారు నాన్నగారు. ఇండస్ట్రీలో చాలామంది వద్దన్నారు. నాకు సబ్జెక్ట్ నచ్చింది. అప్పట్లో అదో ప్రయోగం. అలాగే, ‘శ్రీను’ సినిమా కూడా. నాకు సబ్జెక్ట్ ముఖ్యం. డిఫరెంట్గా యాక్ట్ చేసే స్కోప్ ఉందనిపిస్తే కచ్చితంగా ఒప్పుకుంటా. ‘గురు’ విషయానికొస్తే... అందరూ ప్రశంసిస్తున్నారు. చిరంజీవిగారైతే ‘హ్యాట్సాఫ్ టు యు. ఆ లుక్, నాన్నలాంటి వయసు అనే డైలాగ్ ఒప్పుకోవడం... మామూలు విషయం కాదు. చాలా రిస్క్. నువ్వు ఎప్పుడూ రిస్క్ తీసుకుంటావ్’ అన్నారు. మెగాస్టార్కి నా ఛాయిస్ నచ్చింది. హీరోగా నేను తీసుకున్న రిస్క్ని ఆయన చాలా అభినందించారు. సుధ: యాక్చువల్లీ చిరంజీవిగారి వైఫ్ (సురేఖ) ఈ సినిమా చూడ్డానికి పెద్ద ఆసక్తి చూపలేదు. ‘బాక్సింగ్ మూవీ కదా, ఏముంటుందిలే’ అనుకున్నారట. సినిమా చూశాక... ‘ఇది బాక్సింగ్ మూవీ కాదు.. మంచి ఎమోషన్’ అంటూ ఏడ్చారు. ఆమెకు అంత బాగా నచ్చింది. ⇒ వెంకీగారూ! ఆ మధ్య దాదాపు ఒకే రకం సినిమాలు చేశారు. అప్పుడు బోర్ అనిపించలేదా? వెంకీ: నాకైతే ‘ఇక చాలు.. రిటైర్ అయిపోతే బెస్ట్’ అనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. చేసే నాకూ, చూసే ప్రేక్షకులకూ విసుగు అనిపించే సినిమాలు చేయడం ఎందుకు? కొన్ని సినిమాలు ఆడినా, కిక్ అనిపించలేదు. నన్ను నేను డిఫరెంట్గా చూసుకోవాలని ఉంది. కొత్తగా ఏదైనా చేయాలి. అలా కుదరనప్పుడు ‘ఇక చాలు’ అనుకుంటుంటాను. అలా అనుకున్న ప్రతిసారీ మంచి ఛాన్స్ వస్తుంటుంది. ఆ సినిమా భలే కిక్ ఇస్తుంది. ఆ ఉత్సాహంతో మళ్లీ చేస్తుంటా. ⇒ 30 ఏళ్లుగా సినిమాలు చేస్తూ, రిటైర్ అవ్వడం అంత ఈజీయా? వెంకీ: మంచి సినిమాలు రానప్పుడు ఏం చేస్తాం? లైఫ్ ఎలా వెళితే అలా తీసుకోవాలి. పెద్దగా ఆలోచించకూడదు. ⇒ అంటే.. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను ఇష్టపడడంలేదా? వెంకీ: కమర్షియల్ అంటే ఏంటి? ఇప్పుడు ‘గురు’ కమర్షియల్ సినిమానే. క్లాస్, మాస్, కమర్షియల్ అనేది ఎప్పుడో పోయింది. కథలో ఉన్న ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అయితే అది కమర్షియల్ సినిమానే. ⇒ ఓకే... మీ రియల్ లైఫ్ గురువుల గురించి తెలుసుకోవాలని ఉంది! వెంకీ: మైసూరులో ఒక గురువుగారు ఉండేవారు. ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లారు. హిమాలయాలవీ తిరిగాను కదా. రామకృష్ణ పరమ హంస, వివేకానంద, పరమహంస యోగానంద... వీళ్ల టీచింగ్స్ చదివి, చాలా ఇన్స్పైర్ అయ్యాను. రమణ మహర్షి టీచింగ్స్ చదవడం మొదలుపెట్టాక, అవి నాకు పర్ఫెక్ట్ అనిపించాయి. మహమ్మద్ ప్రవక్త, రూమీ, జీసెస్ల టీచింగ్స్లా ఆయనవి కూడా ఉంటాయి. దేహానికి మించినది ఏదో ఉందని తెలుసుకున్నాను. భూమి మీద పుట్టాం కాబట్టి, ఈ ఫిజికల్ డ్రామా చేయాల్సిందే. కర్మానుసారం అన్నీ జరుగుతుంటాయి. శ్రీరాముడు–శ్రీకృష్ణుడు రాజ్యాలు ఏలారు. సేమ్ టైమ్ సత్యం తెలుసుకున్నారు. మనిషి ఈ రెండూ చేయాలి. ఇప్పుడు వాళ్ల దారిలో వెళుతూ నేను చేస్తున్నది అదే. శరీరీం–ఆత్మ... ఈ రెండింటి బాధ్యతలనూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాలి. ⇒ మీ గురువు సుధగారు? సుధ: సాయిబాబా. ప్రతి రోజూ ఆయన పుస్తకంలో ఒక పేజీ చదువుతాను. డిస్ట్రబ్డ్గా ఉన్నప్పుడు పుస్తకం తెరిస్తే, సమాధానం దొరుకుతుంది. నా విషయంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఏదో పవర్ ఉందని నమ్ముతాను. ⇒ క్రికెట్ బాగా ఆడతారు కదా! ఈ మధ్య ఎప్పుడు ఆడారు? వెంకీ: ఈ మధ్య ఎక్కువగా చూడటమే. ఆడటంలేదు. స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ తగ్గడానికి చాలా టైమ్ పడుతోంది. దానివల్ల షూటింగ్కి ఇబ్బందవుతుందేమో అని పెద్దగా ఆడటంలేదు. ఈ 5న జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకొన్ని రోజులు నేను ఈ మ్యాచ్లు చూస్తూ, బిజీగా ఉంటా. ఆ తర్వాతే సినిమాలు. ⇒ సినిమాల్లో సెంచురీ కొట్టేస్తారా? వెంకీ: అది నా చేతుల్లో లేదు. చేసే పని సిన్సియర్గా చేయాలి. ఇప్పుడు ‘గురు’ చేశాను కాబట్టి, నాకోసం కొత్త స్క్రిప్ట్స్ రెడీ చేస్తారని నమ్ముతున్నాను. ⇒ శారీరకంగా, మానసికంగా బలహీనమైనప్పుడు..? వెంకీ: ‘వేకప్ స్టేట్’, ‘స్లీపింగ్ స్టేట్’ అని రెండు ఉంటాయి. మెలకువ దశలో ఉన్నప్పుడు జరిగినవన్నీ నిద్ర స్థితిలో మరచిపోతాం. ఉదాహరణకు, కోట్లకు కోట్లు అప్పు ఉందనుకోండి. నిద్రపోయేటప్పుడు అది గుర్తుకు రాదు కదా. అలాగే పిల్లలకు ఆరోగ్యం బాగాలేనప్పుడు, మెలకువగా ఉన్నంత వరకూ ఆందోళనపడతాం. నిద్రపోయాక మరచిపోతాం. వేకప్ స్టేట్లో జరగాల్సిన డ్రామా జరుగుతూ ఉంటుంది. దాన్నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కాకపోతే ‘వేకప్ స్టేట్’, ‘స్లీపింగ్ స్టేట్’ గురించి అర్థం చేసుకున్నవాళ్లు వీటికి తక్కువ రియాక్ట్ అవుతారు. మనిషిగా పుట్టాం కాబట్టి, సమస్యలు తప్పవు. పుట్టేటప్పుడు మన బ్యాగేజ్లో ఏం రాసి ఉందో అవన్నీ అనుభవించాల్సిందే. మనం బలంగా ఉండాలంటే తప్పించలేని వాటి గురించి ఎక్కువగా ఆందోళన పడటం అనసవరం. ⇒ అన్నీ ఉన్న మీలాంటివాళ్లు ఎన్నైనా చెబుతారు.. వెంకీ: (నవ్వుతూ).. ఏదైనా రోగం వస్తే అన్నీ ఉన్నోళ్లు డబ్బూ పేరూ... ఏమీ వద్దు. ఆ రోగం పోతే చాలనుకుంటారు కదా. అసలు మనం రేపు చచ్చిపోతాం అనుకుంటే, ప్రపంచం గురించి తక్కువ ఆలోచిస్తాం. రేపు మనం చచ్చిపోతాం అనుకుని బతికితే ఇవాళ వర్రీ అవ్వం. ఎందుకంటే రేపు అనేది ఉండదు. ఇదిగో నేనిప్పుడు మీతో మాట్లాడుతున్నాను. బిస్కెట్స్ తిన్నాను, మంచినీళ్లు తాగాను, టీ తాగాను. ఈ క్షణం వరకూ అంతా బాగానే ఉంది కదా. రేపటి గురించి ఎందుకు అనుకుంటే,æలైఫ్ లీడ్ చేయడం ఈజీ. ⇒ మీకు ఎక్కువ హిట్లు ఉన్నాయి. అయినప్పటికీ అభిమానులు పెద్దగా హడావిడి చేసినట్లు కనిపించరెందుకు? వెంకీ: ఫ్యాన్స్ వాళ్ల కుటుంబాలతో గడపాలని కోరుకుంటాను. అది రైటో రాంగో తెలియదు కానీ, నేను బాగా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్లు చాలా హంగామా చేయాలనుకున్నారు. నేను ఒప్పుకునేవాణ్ణి కాదు. ‘మీ ఫ్యామిలీస్ చూసుకోండి’ అనేవాణ్ణి. ఫ్యాన్స్ నిరుత్సాహపడేవాళ్లు. ఎలాంటి హడావిడీ చేసేవాళ్లు కాదు. అది అలా కంటిన్యూ అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే... నేను రికార్డ్స్ గురించి అంత పర్టిక్యులర్గా ఎప్పుడూ ఆలోచించను. ⇒ మీ ఫ్యాన్స్లో ఎక్కువమంది ఆడవాళ్లు ఉన్నారు కదా! వెంకీ: అది కరెక్టే. ఫస్ట్ డే వాళ్లు సినిమా చూడ్డానికి రారు. అందరూ ఇంట్లో ఉంటారు. ప్లస్ హంగామా, హడావిడి చేయరు (నవ్వుతూ). ఒక యాక్టర్ తను చేసే సినిమాల పట్ల తను హ్యాపీగా ఉండాలి. సుధ: మొన్న పబ్లిక్ థియేటర్కి వెళితే, ఒక ప్రెగ్నెంట్ లేడీ సినిమా చూడ్డానికి వచ్చింది. కొడుకు పుడితే ‘జూనియర్ వెంకటేశ్’ అని పేరు పెట్టుకుంటా అంది. ఇంకా చాలామంది లేడీస్ సినిమా చూడ్డానికి వచ్చారు. వాళ్లు మాట్లాడుతుంటే, వెంకీకి ఎంత మంచి ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అర్థమైంది. ⇒ నెక్ట్స్ మీ ప్రాజెక్ట్స్ గురించి? వెంకీ: ఇప్పుడు నేను హాలిడే మూడ్లో ఉన్నాను. సురేశ్ ఏవేవో స్రిప్ట్స్ వింటున్నాడు. నేను కొన్నాళ్లు రిలాక్స్ అయ్యాక వాటి మీద దృష్టి పెడతా. సుధ: ఇంకా ఏమీ అనుకోలేదు. అవకాశాలైతే ఉన్నాయి. – డి.జి. భవాని -
స్టార్ కోచ్
-
'గురు' మూవీ రివ్యూ
టైటిల్ : గురు జానర్ : ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తారాగణం : వెంకటేష్, రితికా సింగ్, నాజర్, జకీర్ హుస్సేన్ సంగీతం : సంతోష్ నారాయణ దర్శకత్వం : సుధ కొంగర నిర్మాత : వై నాట్ స్టూడియోస్ తమిళ, హిందీ భాషల్లో ఘన విజయం సాధించిన ఇరుద్ది సుత్రు, సాలాఖద్దూస్ సినిమాలకు రీమేక్గా తెలుగులో తెరకెక్కిన సినిమా గురు. ఒరిజినల్ వర్షన్ను తెరకెక్కించిన సుధ కొంగర దర్శకత్వంలోనే తెలుగులో వెంకటేష్ హీరోగా తెరకెక్కించారు. తమిళ, హిందీ భాషల్లో నటించిన చాలా మంది నటులు తెలుగులోనూ అదే పాత్రల్లో కనిపించారు. చాలా రోజుల తరువాత వెంకటేష్ చేసిన ఈ సీరియస్ రోల్ అభిమానులను ఎంత వరకు ఆకట్టుకుంది..? కథ : ఆదిత్య రావు ( వెంకటేష్) దేశం కోసం మెడల్ సాధించాలన్న కసి ఉన్న బాక్సర్. 1996లో వరల్డ్ చాంపియన్ షిప్లో పాల్గొనేందుకు రెడీ అవుతున్న ఆది, సెలక్షన్ కమిటీ రాజకీయాల మూలంగా ఆ అవకాశం కోల్పోతాడు. చీఫ్ సెలెక్టర్ దేవ్ ఖత్రీ (జకీర్ హుస్సేన్) కావాలనే ఆదిని గేమ్కు దూరం చేస్తాడు. దీంతో చాలా కాలం పాటు బాక్సింగ్ రింగ్కు దూరంగా ఉండిపోయిన ఆదిని కొంత కాలం తరువాత ఉమెన్స్ బాక్సింగ్ కోచ్గా నియమిస్తారు. అయితే అక్కడ కూడా స్టూడెంట్స్తో కఠినంగా వ్యవహరిస్తున్నాడన్న సాకుతో ఢిల్లీ నుంచి వైజాగ్కు ట్రాన్స్ఫర్ చేస్తారు. వైజాగ్ చేరుకున్న ఆది, మార్కెట్లో కూరగాయలు అమ్మే రామేశ్వరి అలియాస్ రాముడు (రితికా సింగ్) గొడవ పడటం చూసి ఆమెను బాక్సర్గా తయారు చేయాలనుకుంటాడు. ఆమె అక్క లక్స్ అలియాస్ లక్ష్మీ (ముంతాజ్ సర్కార్) అప్పటికే స్పోర్ట్స్ కోటాలో పోలీస్ ఉద్యోగం సాధించాలన్న ఆశతో బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటోంది. ఈ ఇద్దరినీ తనతో పాటు తీసుకెళ్లిన ఆది, రాముడిపై స్పెషల్ ఇంట్రస్ట్ చూపించటం లక్స్కి నచ్చదు. ఎలాగైన రాముడ్ని తిప్పి పంపేయాలన్న ఆలోచనతో కీలక మ్యాచ్కు ముందు రాముడి చేతికి దెబ్బ తగిలేలా చేస్తుంది. రాముడు కావాలనే ఇలా చేసిందన్న కోపంతో ఆది ఆమెను పంపేస్తాడు. తిరిగి ఇంటికి వచ్చిన రాముడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది. బాక్సింగ్ ట్రైనింగ్ ఎలా కొనసాగించింది. ఆది అనుకున్నట్టుగా రాముడు ఉమెన్స్ వరల్డ్ చాంపియన్ షిప్ సాధించిందా..? లేదా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : ఎక్కువగా ఫ్యామిలీ డ్రామాలు మాత్రమే చేసే విక్టరీ వెంకటేష్, తొలిసారిగా ఓ కొత్త మేకవర్, కొత్త బాడీలాంగ్వేజ్తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఇప్పటికే ఎన్నో అవార్డులు సాధించిన వెంకీ, బాక్సింగ్ కోచ్గా మరోసారి అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్తో అలరించాడు. సినిమా అంతా సీరియస్ లుక్లో కనిపిస్తూనే అద్భుతమైన ఎమోషన్స్ను పండించాడు. ఒరిజినల్ వర్షన్లో తనదైన నటనతో విశ్లేషకుల ప్రశంసలు అందుకున్న రితికా సింగ్ తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకునే నటన కనబరిచింది. బాధ్యత లేని అల్లరి అమ్మాయిగా, మెడల్ సాధించడానికి ఎంత కష్టాన్నైనా బరించే సీన్సియర్ ప్లేయర్గా మంచి వేరియేషన్స్ చూపించింది. విలన్ పాత్రలో జకీర్ హుస్సెన్ ఆకట్టుకోగా, నాజర్ కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. రఘుబాబు, అనితాచౌదరి, ముంతాజ్ సర్కార్లు తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : సౌత్ ఇండస్ట్రీలో స్పోర్ట్స్ డ్రామాల వచ్చిన దాఖలాలు చాలా తక్కువ. గతంలో ఒకటి రెండు సినిమాలు వచ్చిన ఓ స్టార్ హీరో ఈ తరహా సినిమా చేయటం మాత్రం ఇదే తొలిసారి. ఇలాంటి ఓ సీరియస్ స్పోర్ట్స్ సినిమాకు వెంకటేష్ లాంటి ఫ్యామిలీ హీరోను ఎంచుకున్న దర్శకురాలు సుధ కొంగర మంచి విజయం సాధించింది. వెంకీ పర్ఫామెన్స్తో పాటు ఎక్కడా అనుకున్న లైన్ నుంచి డీవియేట్ కాకుండా ఒకే ఎమోషన్ను క్యారీ చేస్తూ కథ నడిపించారు. సంతోష్ నారాయణ అందించిన నేపథ్యం సంగీతంతో పాటు బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ సినిమా స్థాయిని పెంచాయి. హర్షవర్థన్ అందించిన మాటలు, కె ఎ శక్తివేల్ సినిమాటోగ్రఫి, సతీస్ సూర్య ఎడిటింగ్, వై నాట్ స్టూడియోస్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : వెంకటేష్, రితికా సింగ్ నటన సంగీతం క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ : సెకండ హాఫ్ లో కొన్ని సీన్స్ గురు.. ఆలోచింప చేసే ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
బారిస్టర్ పార్వతీశం పాత్రలో సీనియర్ హీరో..!
తెలుగు కథలు చదివిన వారందరికీ బారిస్టర్ పార్వతీశం సుపరిచితుడే. 1924లో మొక్కపాటి నరసింహ శాస్త్రీ రాసిన ఈ కథను తరువాత పాఠ్యాంశంగానూ చేర్చారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ కథను సినిమాగా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. అంతేకాదు ఈ సినిమాలో పార్వతీశం పాత్రకు ఓ సీనియర్ హీరోతో చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పలు కామెడీ చిత్రాలతో అలరించిన విక్టరీ వెంకటేష్ హీరోగా బారిస్టర్ పార్వతీశం కథను సినిమాగా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వెంకీ హీరోగా తెరకెక్కిన గురు ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
పవన్ హిట్ కొట్టినా.. భయం లేదా..!
సాధారణంగా స్టార్ హీరోల సినిమా రిలీజ్ అవుతుందంటే కనీసం రెండు వారాల పాటు, కాస్త హైప్ ఉన్న సినిమాలను రిలీజ్ చేయడానికి సాహసించరు. అదే, ఆ సినిమాకు హిట్ టాక్ వస్తే మూడు వారాల పాటు మరో సినిమాకు ఛాన్స్ ఉండదు. కానీ కాటమరాయుడు విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన కాటమరాయుడు పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్నాడు. అయినా సరే వచ్చే వారం మూడు, నాలుగు సినిమాలు రిలీజ్కు ప్లాన్ చేసుకుంటున్నాయి. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన గురు సినిమాను ముందుగా ఏప్రిల్ 7న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే కాటమరాయుడు రిలీజ్ తరువాత సినిమాను ప్రీపోన్ చేస్తూ మార్చి 31నే రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. పూరి దర్శకత్వంలో ఇషాన్ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన రోగ్ సినిమాను కూడా అదే రోజు రిలీజ్ చేస్తున్నారు. నయనతార లీడ్ రోల్లో నటించిన డోరతో పాటు చిన్న సినిమాలు కారులో షికారుకెల్తే, ఎంతవరకు ఈ ప్రేమ కూడా 31నే రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నాయి.పవన్ సినిమా కాటమరాయుడు మంచి టాక్తో దూసుకుపోతున్నా వారం గ్యాప్లో ఇన్ని సినిమాలు రిలీజ్ రెడీ అవ్వటం ఇండస్ట్రీ వర్గాలకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. -
వారం ముందే వస్తోన్న గురు
సీనియర్ విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గురు. తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిన సాలా ఖద్దూస్కు రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమాలో ఒరిజినల్ వర్షన్లో నటించిన రితికా సింగ్ కీలక పాత్రలో నటించింది. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, చాలా కాలం క్రితమే పూర్తయినా.. రిలీజ్ను మాత్రం వాయిదా వేశారు. ముందుగా జనవరి 26నే సినిమా రిలీజ్ చేయాలని భావించినా.. తరువాత ఏప్రిల్ 7న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను అనుకున్న సమయం కన్నా వారం ముందుగా అంటే మార్చి 31న రిలీజ్ చేయాలని నిర్ణయించారట. ఏప్రిల్ 7న మణిరత్నం, కార్తీల చెలియా రిలీజ్ అవుతుండటంతో అనవసరమైన పోటీ ఎందుకున్న ఆలోచనతో సినిమాను ముందుగానే రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం గురు రిలీజ్ ప్రీ పోన్ అయిన విషయాన్ని యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించలేదు. అయితే అభిమానులు మాత్రం ప్రీ పోన్ చేయటమే బెటర్ అని భావిస్తున్నారు. -
‘గురు’తో నేను కొత్త నటుణ్ణి
‘‘30 ఏళ్లుగా నటిస్తున్నా, ఎన్నో చిత్రాలు చేశా. అవార్డులు అందుకున్నా. అయితే, ఎప్పుడూ పూర్తి కథను చదవలేదు. కానీ, ‘గురు’ కథను పూర్తిగా చదవమని సుధ చెప్పారు. సరేనని చదవడం మొదలుపెడితే... నాలో ఏదో తెలియని శక్తి వచ్చింది. ఈ సినిమాతో నేను ఓ కొత్త నటుణ్ణి అనిపించింది’’ అని వెంకటేశ్ అన్నారు. వెంకటేశ్ హీరోగా సుధ కొంకర దర్శకత్వంలో ఎస్. శశికాంత్ నిర్మించిన సినిమా ‘గురు’. రితికా సింగ్, ముంతాజ్, నాజర్ ముఖ్యతారలు. సోమవారం ట్రైలర్ విడుదల చేశారు. వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘ఈ కథ విన్నప్పుడు డెంగీ జ్వరం రావడంతో చేయలేకపోయా. తమిళం, హిందీ భాషల్లో సినిమా తీసిన తర్వాత నాకు కుదిరింది. గత చిత్రాలకంటే ఇందులో బాగా లీనమై నటించా. నా డైలాగ్ డెలీవరీ, బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉంటాయి. ఈ సినిమాలో మాత్రమే నేను గురు. షూటింగ్లో మాత్రం నా గురు సుధానే. తనకి నేను స్టూడెంట్ అయిపోయా. ఈ సినిమాలో ఓ ట్యూన్ వినగానే చాలా ఎగ్జయిట్గా అనిపించి పాట పాడా. సంతోశ్ మంచి పాటలిచ్చారు’’ అన్నారు. సుధ కొంగర మాట్లాడుతూ– ‘‘గురు’ కథ అనుకున్నప్పుడు ఫస్ట్ మణిరత్నంగారిని సంప్రదించా. నాలుగైదేళ్లు బాక్సింగ్పై పరిశోధన చేసి, 250 మంది బాక్సర్లను కలిసి కథ రెడీ చేశా. వెంకీగారిని కలిసి బాక్సింగ్ నేపథ్యం అనగానే చాలా ఎక్జైట్ అయ్యారు. ఆయన కమిట్మెంట్, సిన్సియారిటీ నాకు నచ్చింది. ఆయన టైమ్ అంటే టైమే. ఆయనతో పనిచేయడం చాలా ఎగ్జయిటింగ్ ఉంది. బాక్సర్ రితిక 2010 నుంచి నాతో ట్రావెల్ అవుతోంది. ముంతాజ్ కూడా బాక్సర్.. ఇద్దరూ సిస్టర్స్గా యాక్ట్ చేశారు. నిర్మాత శశికాంత్ చాలా ఫ్రీడమ్ ఇవ్వడంతో క్వాలిటీ సినిమా వచ్చింది’’ అన్నారు. ‘‘వెంకీ సార్ని చూస్తే నా రియల్ గురు గుర్తుకొచ్చారు. ఈ చిత్రం చూశాక చాలా మంది స్ఫూర్తి పొందుతారు’’ అన్నారు రితికా సింగ్. శశికాంత్, ముంతాజ్, సంగీత దర్శకుడు సంతోశ్ నారాయణన్, పాటల రచయిత భాస్కర భట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రాడ్యూసర్ రామ్ తదితరులు పాల్గొన్నారు. -
మణిరత్నంకి పోటీ వస్తున్న సీనియర్ హీరో
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గురు. తమిళ హిందీ భాషల్లో సక్సెస్ సాధించిన సాలా ఖద్దూస్కు రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమా చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. చిత్రయూనిట్, సమ్మర్లో రిలీజ్ చేస్తామని ప్రకటించినా.. డేట్ మాత్రం ప్రకటించలేదు. తాజాగా గురు మూవీ రిలీజ్ డేట్పై చిత్రయూనిట్ ఓ నిర్ణయానికి వచ్చారట. ఇప్పటికే ఆలస్యం కావటంతో ఏప్రిల్ 7న ఎట్టి పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అయితే అదే రోజు గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చెలియా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో కార్తీ హీరోగా నటిస్తుండటంతో తెలుగు నాట భారీ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. దీంతో వెంకటేష్.. గురు, కార్తీ.. చెలియాల మధ్య గట్టి పోటి నెలకొంది. మరి వెంకీ ఇంత పోటిలో బరిలో దిగుతాడా లేక మరో డేట్ కోసం ఎదురుచూస్తాడా..? తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
ప్రేక్షకులు క్షమించేస్తారని నమ్మా!
వెంకటేశ్ కూడా ఆ క్లబ్లో చేరిపోయారు. ఏ క్లబ్ అనుకుంటున్నారా? అదేనండి ‘సింగింగ్ క్లబ్’. ఇప్పుడు స్టార్లు అప్పుడప్పుడు సింగుతున్న విషయం తెలిసిందే. ‘గురు’ సినిమా కోసం వెంకీ కూడా సింగర్ అవతారం ఎత్తేశారు. తన 30 ఏళ్ళ సినీ జీవితంలో ఇప్పటివరకు వెంకీ ఒక్క పాట కూడా పాడలేదు. రిలీజ్కు రెడీ అవుతున్న ‘గురు’ చిత్రం కోసం కాస్త గొంతు సవరించుకుని ‘జింగిడి.. జింగిడి...’ అంటూ ఓ సాంగ్ పాడేశారు. ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘‘ముఫ్పై ఏళ్ళుగా యాక్ట్ చేస్తున్నాను. సడన్గా సింగింగ్ ఎందుకూ అనుకున్నాను. అయినా పాడటానికి ఓకే చెప్పిన తర్వాత ఇంటికి వెళ్లి ఆలోచించాను. పదాలు కాస్త అటూ ఇటూ అయినా ప్రేక్షకులు క్షమిస్తారన్న నమ్మకంతో పాడేశాను. లక్కీగా సాంగ్ బాగా వచ్చింది. సాంగ్ షూట్ను ఎంజాయ్ చేశాను’’ అని వెంకీ అన్నారు. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ‘గురు’ చిత్రం హిందీ ‘సాలా కడూస్’కి తమిళ రీమేక్ అయిన ‘ఇరుదు సుట్రు’కి తెలుగు రీమేక్. -
జీవితమంటే సినిమా కాదురయ్యా : వెంకటేశ్
-
జీవితమంటే సినిమా కాదురయ్యా : వెంకటేశ్
తన ముప్పై ఏళ్ల సినీ ప్రస్థానంలో తొలిసారి హీరో వెంకటేశ్ గురు చిత్రంలో సింగర్ అవతారం ఎత్తాడు. చిత్రంలో మద్యం సేవించిన తర్వాత హీరో ఈ పాట పాడుతాడు. సంతోష్ నారాయణన్ అందించిన బాణీలకు తగ్గట్టుగా వెంకీ ఈ పాటను అద్భుతంగా పాడారు. వెంకటేశ్ తన ఫేస్ బుక్ పేజీలో ఈ పాటను పోస్ట్ చేసిన కొద్ది సేపటికే లైకులు షేర్లతో అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నటనతోనే కాకుండా గాయకుడిగా కూడా వెంకీ అదరగొట్టారు అంటూ అభిమానులు తెగ సంబరపడుతున్నారు. బాధలు మరిచిపోవడానికి పీతల్లా తాగుతున్నారు కానీ, హార్ట్, లివర్ దొబ్బుతుందని, ఆరోగ్యం షెడ్డుకెళుతుందని జిందగీ బర్బాస్ అవుతుందని తెలుసుకోరే...జీవితమంటే సినిమా కాదురయ్యా ప్రతీదీ సెన్సార్ బోర్డు చూసుకోవడానికి.. దూమపానం, మద్యపానం మహచెడ్డదిరా అబ్బాయ్ అని ఎంత చెప్పినా వినరే..మీలాంటి వాళ్లకోసమే యముడి పక్కసీటు రెడీగా ఉంది.. బయలుదేరండి బయలు దేరండి...అంటూ ఓ సందేశం ఇస్తూ వాయిస్ ఓవర్ పూర్తవ్వగానే పాట మొదలౌతుంది. క్వాటరు బాటిలు జానెడున్న మ్యాటరు బోలెడున్నది.. అంటూ హీరో మందు తాగిన తర్వాత వచ్చే సాంగ్ కావడంతో అదే తరహాలో జింగిడి జింగిడి... అంటూ మ్యూజిక్కు తగ్గట్టుగా పాడి వెంకి మ్యాజిక్ చేశాడు. ‘గురు’ షూటింగ్ను వెంకటేశ్ ఎప్పుడో పూర్తి చేశారు. కానీ, విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తుందని చెబుతున్నారు. మధ్య మధ్యలో ఒక్కో సాంగ్ను విడుదల చేస్తున్నారు. సినిమా విడుదల ఎందుకింత ఆలస్యమవుతోందనేది ప్రేక్షకులకు అంతుచిక్కని ఓ పజిల్లా తయారయింది. ఫిల్మ్నగర్లో మాత్రం ‘రెజ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఆమిర్ఖాన్ ‘దంగల్’ సూపర్ హిట్టయింది. వెంకీ ‘గురు’ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. అయితే... రెండూ స్పోర్ట్స్ మూవీస్ కాబట్టి ప్రేక్షకులు రెండిటి మధ్య ఎక్కడ పోలికలు వెతుకుతారోననే ఆలోచనతో ఈ చిత్రం విడుదల ఆలస్యం చేస్తున్నారు’ అనే గాసిప్ వినిపిస్తోంది. ‘గురు’ యూనిట్ ఈ గాసిప్ను ఖండించింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉందంటున్నారు. డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ థియేటర్ల నుంచి ప్రేక్షకులు చూసే థియేటర్లకు రావడానికి ఎంతో టైమ్ పట్టదని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాకు సుధ కొంగర దర్శకత్వం వహిస్తుండగా నిర్మాతగా ఎస్. శశికాంత్ వ్యవహరిస్తున్నారు. -
క్రిష్, వెంకీల సినిమా లేనట్టేనా..?
గౌతమిపుత్ర శాతకర్ణితో అందరి దృష్టిని ఆకర్షించిన క్రిష్, తన తదుపరి చిత్రాన్ని కూడా సీనియర్ హీరోతోనే చేసేందుకు ప్లాన్ చేశాడు. గురు సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న వెంకటేష్ హీరోగా ఓ సక్సెస్ ఫుల్ నవల ఆధారంగా సినిమాను రూపొందించేందుకు ప్లాన్ చేశాడు. డాక్టర్ కేశవ రెడ్డి రాసిన 'అతడు అడవిని జయించాడు' నవల ఆధారంగా 'వీరయ్య' పేరుతో సినిమాను తెరకెక్కించాలని భావించాడు. ఈ సినిమా వెంకటేష్ 75వ సినిమా కూడా కావటంతో మరో ట్యాండ్ మార్క్ సినిమా చేసిన క్రెడిట్ తన ఖాతాలో పడుతుందని ఈ ప్రాజెక్ట్ అంగీకరించాడు. అయితే ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఈ సినిమా ఆగిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. సరైన కారణాలు వెల్లడించకపోయినా.. 'అతడు అడవిని జయించాడు' నవల విషయంలో కాపీ రైట్స్ ఇష్యూ కారణంగా ఈ ప్రాజెక్ట్ను పక్కన పెట్టేశారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ను పక్కన పెట్టేసిన క్రిష్, మరో స్టార్ హీరోతో చర్చలు జరుపుతున్నాడట. అదే సమయంలో 'అతడు అడవిని జయించాడు' నవల కాపీరైట్స్ ఇష్యూను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాడు. త్వరలోనే క్రిష్ చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
జాతీయ గీతం పాడతారా?
ఎటువంటి ఇమేజ్ చట్రంలోనూ చిక్కుకోని స్టార్ హీరోల్లో వెంకటేశ్ ఒకరు. పాత్రకు తగ్గట్టు పాదరసంలా మారుతుంటారు. ఇప్పుడీ పాదరసంను పవర్ఫుల్గా చూపించే ఆలోచనలో దర్శకుడు పూరి జగన్నాథ్ ఉన్నారట. మహేశ్బాబు హీరోగా ‘జనగణమణ’ అనే దేశభక్తి చిత్రం తీయనున్నట్లు గతంలో పూరి ప్రకటించారు. కానీ, మహేశ్ ఏ మాటా చెప్పకపోవడంతో ఆ కథను పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఆ దేశభక్తి కథకు కొత్త హంగులు అద్ది వెంకీతో సినిమా తీయనున్నారని ఫిల్మ్నగర్ టాక్. పూరి సినిమాల్లో హీరోయిజం ఏ స్థాయిలో పరుగులు పెడుతుందో.. పైపైకి వెళ్తుందో తెలిసిందే. ఈ ‘జనగణమణ’లోనూ వెంకీ క్యారెక్టర్, లుక్ అంతే స్థాయిలో పవర్ఫుల్గా ఉంటాయట. ప్రస్తుతం వెంకటేశ్ హీరోగా నటించిన ‘గురు’ను మార్చి 31న విడుదల చేయాలనుకుంటున్నారట. ‘గురు’ తర్వాత కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్లూ... మీకు జోహార్లు’ చేయాలనుకున్నారు వెంకీ. దాంతో పాటు క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారనీ వార్తలొచ్చాయి. మరి, ఆ రెండు చిత్రాల్లో ఏది ముందు పట్టాలు ఎక్కుతుంది? ఆ రెండూ కాకుండా పూరి ‘జనగణమణ’ సెట్స్కి వెళుతుందా? వేచి చూడాల్సిందే. -
ఈ కోచ్ చాలా స్టైల్ గురూ
స్కూల్కి హాలీడేస్... చిన్నారులకు జాలీడేస్.... సమ్మర్ వస్తే పిల్లలకు మాంచి పండగ వచ్చినట్టే. స్కూల్లో గురువులు చెప్పే పాఠాలకు ఫుల్స్టాప్ పెట్టి కాస్త రిలాక్స్ అయ్యే ఆ టైమ్లో మరో గురువు వాళ్ల దగ్గరకి వస్తున్నాడు. ఆయనే ‘విక్టరీ’ వెంకటేశ్. స్కూల్లో గురువులు క్లాస్ రూముల్లో పాఠాలు చెబితే... వెంకీ ప్లే– గ్రౌండ్లో క్లాస్ తీసుకుంటారు. సమ్మర్ స్పెషల్ క్లాస్తో ఈ గురువు రెడీ అవుతున్నారు. సుధా కొంగర దర్శకత్వంలో వెంకటేశ్ బాక్సింగ్ కోచ్గా నటించిన సినిమా ‘గురు’. ఎస్. శశికాంత్ నిర్మించిన ఈ చిత్రాన్ని వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ నెల 17న ‘ఏయ్ సక్కనోడ..’ పాట లిరికల్ వీడియో విడుదల చేయనున్నారు. నిర్మాత మాట్లాడుతూ – ‘‘ఇప్పటివరకూ కనిపించని సరికొత్త లుక్లో వెంకటేశ్ సై్టలిష్గా కనిపి స్తారు. ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాను దర్శకురాలు మలచిన విధానం అద్భుతం. మార్చిలో పాటల్ని రిలీజ్ చేస్తాం’’ అన్నారు. రితికా సింగ్, ముంతాజ్ సర్కార్ ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రానికి మాటలు: హర్షవర్థన్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, శ్రీమణి, ఫైట్స్: ‘స్టన్నర్’ శామ్, ‘రియల్’ సతీశ్, కళ: జాకీ, కూర్పు: సతీశ్ సూర్య, కెమేరా: కేఏ శక్తివేల్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: చక్రవర్తి రామచంద్ర, సంగీతం: సంతోశ్ నారాయణన్. -
అశోక్ లేలాండ్ నుంచి రెండు కొత్త ట్రక్కులు
గురు, పార్టనర్ వాహనాలు విడుదల హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలాండ్ మరో రెండు ట్రక్కులను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇంటర్మీడియల్ కమర్షియల్ వెహికిల్ (ఐసీవీ) విభాగంలో ‘గురు’, లైట్ కమర్షియల్ వెహికిల్ (ఎల్సీవీ) విభాగంలో పార్టనర్ వాహనాలను మంగళవారమిక్కడ విడుదల చేశారు. వేరియంట్లను బట్టి గురు వాహనం ధర రూ.14.35 లక్షల నుంచి రూ.16.72 లక్షలు, పార్టనర్ ధర రూ.10.29 లక్షల నుంచి రూ.10.59 లక్షల మధ్య ఉంది. ఈ సందర్భంగా మంగళవారమిక్కడ విలేకరులతో సంస్థ ట్రక్స్ విభాగం గ్లోబల్ ప్రెసిడెంట్ అనూజ్ కథూరియా మాట్లాడుతూ... ఈ రెండు వాహనాలు కూడా భారత్ స్టేజ్ (బీఎస్)–4 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందినవేనని, అయితే బీఎస్–3 వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. గత నెలలో ఈ రెండు వాహనాలను మార్కెట్లోకి తీసుకొచ్చామని.. ఇప్పటికే వంద బుకింగ్స్ కూడా అయ్యాయని చెప్పారాయన. వచ్చే వారంలో సెంట్రల్, పశ్చిమ జోన్లో విడుదల చేయనున్నట్లు అనూజ్ తెలియజేశారు. అన్ని రకాలూ కలిసిన వాణిజ్య వాహనాల మార్కెట్లో అశోక్ లేలాండ్ 30 శాతం వాటా కలిగి ఉందని.. ఆంధ్రప్రదేశ్, తెలం గాణ రాష్ట్రాల్లో తమ వాటా 46.8 శాతం వరకూ ఉందని ఆయన చెప్పారు. ఐసీవీ వాహనాలు ఏటా 50 వేలు విక్రయమవుతుండగా ఇందులో అశోక్ లేలాండ్ వాటా 20 శాతం వరకూ ఉందని చెప్పారాయన. దీంతో ప్రస్తుతం సంస్థ పోర్ట్ఫోలియోలో 2 టన్నుల నుంచి 49 టన్నుల వరకూ అన్ని రకాల వాణిజ్య వాహనాలూ ఉన్నట్లయిందని వివరించారు. -
స్టార్ హీరో సినిమా మూడు నెలలు వాయిదా
సౌత్ ఇండస్ట్రీలో సినిమాల వాయిదాల పర్వం ఇంకా కొనసాగుతోంది. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాకపోవటంతో పాటు ఇతర సినిమా రిలీజ్ డేట్లు, రాజకీయ పరిస్థితులు కూడా సినిమాల విడుదల తేదీల మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఇటీవల పెద్ద నోట్ల రద్దు కారణంగా చాలా సినిమాలు వాయిదా పడగా.. ఆ తరువాత కూడా వివిధ కారణాల వల్ల సూర్య సింగం 3 పలు మార్లు వాయిదా పడింది. టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన గురు విషయంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. తమిళ సినిమా ఇరుది సుట్రుకు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్తో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ముందుగా ఈ సినిమాను జనవరి 26న రిలీజ్ చేయాలని భావించినా.. ఇప్పుడు ఏకంగా మూడు నెలలు ఆలస్యంగా ఏప్రిల్ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. జనవరి బరి నుంచి వాయిదా వేసిన తరువాత వరుసగా యంగ్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతుండటంతో గురును సమ్మర్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. తమిళ వర్షన్ డైరెక్టర్ చేసిన సుధా కొంగర తెలుగు సినిమాను కూడా డైరెక్ట్ చేస్తుండగా.. వెంకటేష్ సొంత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. -
అశోక్ లేలాండ్.. 2 వాణిజ్య వాహనాలు
చెన్నై: హిందుజా గ్రూప్కు చెందిన ‘అశోక్ లేలాండ్’ కంపెనీ తన మధ్యస్థ, తేలికపాటి వాణిజ్య వాహన విభాగపు పోర్ట్ఫోలియోను మరింత విస్తరించింది. కంపెనీ తాజాగా మధ్యస్థ వాణిజ్య వాహనం ‘గురు’ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అలాగే తేలికపాటి వాణిజ్య వాహనం ‘పార్ట్నర్’లో కొత్త వెర్షన్ను మార్కెట్లో ఆవిష్కరించింది. గురు వాహనం ధర రూ.14.35 లక్షలు–రూ.16.72 లక్షల శ్రేణిలో, పార్ట్నర్ వాహనం ధర రూ.10.29 లక్షలు–రూ.10.59 లక్షల శ్రేణిలో ఉందని కంపెనీ పేర్కొంది. అన్ని ధరలు ఎక్స్షోరూమ్ చెన్నైవి. తాజా కొత్త ఆవిష్కరణలతో మార్కెట్లో తమ స్థానం మరింత పదిలమౌతుందని, అంతర్జాతీయంగా టాప్–10 ట్రక్ తయారీ కంపెనీల్లో స్థానం పొందడమే లక్ష్యమని అశోక్ లేలాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ కె.దాసరి తెలిపారు. ‘గురు’.. 12 టన్నులు, 13 టన్నుల కేటగిరీలో పలు రకాల బాడీ ఆప్షన్లలో బీఎస్–3, బీఎస్–4 వేరియంట్లలో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. -
గురు టీజర్ వచ్చేసింది..!
-
ఒకేసారి బాబాయ్, అబ్బాయ్
యంగ్ హీరో రానా హీరోగా తెరకెక్కుతున్న బహుభాషా చిత్రం ఘాజీ. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్కు రెడీ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఘాజీ ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్కు మంచి స్పందన రాగా.. తాజాగా చిత్రయూనిట్ టీజర్ను రిలీజ్ చేసింది. సినిమా నేపథ్యంతో పాటు సముద్ర గర్భంలో నావీ టీం చేసే అద్భుత విన్యాసాలను ట్రైలర్లో చూపించారు. తెలుగుతో పాటు ఘాజీ హిందీ, తమిళ టీజర్లను కూడా ఒకేసారి రిలీజ్ చేశారు. ఘాజీ టీజర్ తో పాటు సీనియర్ స్టార్ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న గురు టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. గతంలో వెంకీ లుక్ ను మాత్రమే రివీల్ చేసిన యూనిట్, కొత్త టీజర్ లో వెంకీ క్యారెక్టరైజేషన్ ను చూపించారు. రఫ్ లుక్ లో బాక్సింగ్ కోచ్ గా కనిపిస్తున్న వెంకీ అబ్బాయి రానాకి పోటీ ఇచ్చేలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గురు రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న రిలీజ్ అవుతోంది. -
వెంకీతో పూరి?
విక్టరీ వెంకటేశ్ హీరోగా పూరి జగన్నాథ్ ఓ చిత్రం తెరకెక్కించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్నగర్ వర్గాలు. హిందీ ‘సాలా ఖడూస్’కు రీమేక్గా సుధ కొంగర దర్శకత్వంలో వెంకీ నటించిన తాజా చిత్రం ‘గురు’ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకొంటోంది. జనవరి 26న ఈ సినిమా విడుదల కానున్నట్లు సమాచారం. ‘గురు’ తర్వాత వెంకీ ‘నేను – శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్ళూ.. మీకు జోహార్లు’ చిత్రం చేయనున్నారనే టాక్ వినిపించింది. తాజాగా వెంకటేశ్తో పూరి జగన్నాథ్ ఓ చిత్రం తెరకెక్కించనున్నారనే వార్త ప్రచారంలోకొచ్చింది. కల్యాణ్రామ్తో తీసిన ‘ఇజం’ విడుదలై రెండు నెలలు దాటినా తర్వాతి చిత్రం ఏమిటనే విషయంపై పూరి ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు. మరి.. వెంకీతో సినిమా చేయనున్నారనే వార్త గురించి త్వరలో క్లారిటీ వస్తుందా? -
వెంకటేష్ కొత్త సినిమా ఆగిపోయిందా..?
సీనియర్ హీరో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం గురు. తమిళ, హిందీ భాషల్లో మంచి టాక్ సొంతం చేసుకున్న సాలాఖద్దూస్ సినిమాకు రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమాపై టాలీవుడ్ కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. గురు సినిమా రిలీజ్ కాక ముందే తన తరువాత సినమాను కూడా పట్టాలెక్కించేశాడు వెంకీ. నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం ఆగిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ ప్రకటించకపోయినా.. పెద్ద నోట్ల రద్దు కారణంగా సినిమా షూటింగ్ను ఆపేశారన్న ప్రచారం జరుగుతోంది. తిరిగి షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందన్న విషయంలో కూడా ఎలాంటి క్లారిటీ లేదు. -
సింగర్ గురూ!
వెంకటేశ్ కూడా సింగింగ్ క్లబ్లో చేరిపోయారు గురూ! ఈ మధ్య స్టార్ హీరోలు తమంతట తాముగానో, లేక సంగీతదర్శకుడు, దర్శకుడు కోరిన మీదటో పాటలు పాడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ‘గురు’ సినిమా కోసం వెంకీ కూడా పాడారు. చిత్ర దర్శకురాలు సుధ కొంగర, సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ కోరిన మీదట ఆయన ఉత్సాహంగా పాడేశారు. ఈ సినిమాలో వెంకీ లుక్ అభిమానులకు ఓ ఐ–ఫీస్ట్ అయితే, ఆయన పాడటం ఇయర్–ఫీస్ట్. మొత్తానికి ఈ సినిమా మంచి ఫీస్ట్ అవుతుందని చిత్రబృందం అంటోంది. హిందీ చిత్రం ‘సాలా ఖదూస్’కి రీమేక్గా ఈ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. జనవరిలో సినిమా విడుదల కానుంది. -
ఫ్యాన్స్కు వెంకీ బర్త్డే గిఫ్ట్
బాబు బంగారం సినిమాతో డీసెంట్ హిట్ కొట్టిన విక్టరీ వెంకటేష్, ప్రస్తుతం సాలాఖద్దూస్ రీమేక్గా తెరకెక్కుతున్న గురు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను జనవరి 26న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్లో.. వెంకీ డిఫరెంట్ మేకోవర్తో పాటు కండలు తిరిగిన బాడీతో కనిపిస్తున్నాడు. ఈ రోజు( మంగళవారం) వెంకీ పుట్టిన రోజు సందర్భంగా అభిమానుల కోసం ఓ ఫస్ట్ లుక్ టీజర్ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సినిమా థీంను, కాన్సెప్ట్ను ఏమాత్రం రివీల్ చేయకుండా కేవలం అభిమానుల కోసమే అన్నట్టుగా టీజర్ను రూపొందించారు. చిన్న మ్యూజిక్ బిట్కు వెంకీ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ అభిమానులను అలరిస్తున్నాయి. త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్తో పాటు ఆడియో రిలీజ్ డేట్లను ప్రకటించనున్నారు. -
అలా మజిల్స్ పెంచా!
సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్న ‘గురు’ స్టిల్స్లో వెంకటేశ్ కొత్తగా కనిపించారు. సాల్ట్ అండ్ పెప్పర్ సై్టల్ మాత్రమేనా... ఐదు పదుల వయసులోనూ కండలు పెంచి అభిమానులను ఫుల్ ఖుషీ చేశారు. నేడు వెంకటేశ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మీ మజిల్స్ సీక్రెట్ ఏంటో చెప్పమని ‘సాక్షి’ అడగ్గా... వెంకటేశ్ మాట్లాడుతూ – ‘‘ఈ మేకోవర్ నాకు బాగా నచ్చింది. ‘గురు’లో నాది బాక్సింగ్ కోచ్ పాత్ర. మజిల్స్తో బాడీ మరింత ఫిట్గా కనిపిస్తే బాగుంటుందనుకున్నా. ఫిట్నెస్ ట్రైనర్ కునాల్ గిర్ దగ్గర కొన్ని నెలల పాటు ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నా. హై ప్రొటీన్, లో కార్బోస్ ఉన్న ఫుడ్ తీసుకున్నా. కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తినేవాణ్ణి’’ అన్నారు. ఈ ఏడాది ‘బాబు బంగారం’గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన... మేనల్లుడు నాగచైతన్య ‘ప్రేమమ్’లో అతిథిగా కనిపించారు. త్వరలో కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్లూ... మీకు జోహార్లు’ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. మొత్తం మీద ఈ ఏడాది చాలా సంతోషంగా గడిచిందన్నారు. అన్నట్టు... పుట్టినరోజు సందర్భంగా బయటికొచ్చిన కొత్త స్టిల్స్లో వెంకీ హ్యాండ్సమ్గా ఉన్నారు కదూ. ‘ఆడాళ్లూ... మీకు జోహార్లు’లో లుక్లోనే కనిపిస్తారట! ఆ సంగతలా ఉంచితే.. పుట్టినరోజు వేడుక జరుపుకోవడం తనకు అలవాటు లేదన్న వెంకీ.. చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించిన వర్దా తుఫాను బాధితులకు సానుభూతి వ్యక్తం చేశారు. -
మరో సీనియర్ హీరోతో క్రిష్
గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె లాంటి సినిమాలతో విభిన్న దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ క్రిష్. ఇప్పటికే వరకు ఎక్కువగా యువ కథానాయకులతోనే సినిమాలు తెరకెక్కించిన ఈ క్రియేటివ్ డైరెక్టర్ ప్రస్తుతం సీనియర్ స్టార్ బాలకృష్ణ హీరోగా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత మరో సీనియర్ హీరోతో కలిసి పనిచేసేందుకు రెడీ అవుతున్నాడు క్రిష్. ప్రస్తుతం గురు సినిమాతో పాటు, నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆడాళ్లు మీకు జోహార్లు సినిమాలు చేస్తున్న విక్టరీ వెంకటేష్, క్రిష్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు అంగకీరించాడు. గతంలో రానా, క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కిన కృష్ణం వందే జగద్గురుం సినిమాలో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చిన వెంకటేష్, త్వరలో క్రిష్ దర్శకత్వంలో సినిమాకు ఓకె చెప్పాడు. ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా పూర్తయిన తరువాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించనున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ గా తెరకెక్కనుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న వెంకటేష్ గురు రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న రిలీజ్ అవుతోంది. -
బీచ్ రోడ్డులో...
శుక్రవారం ఉదయం విశాఖ భీమిలి బీచ్ రోడ్డులో ట్రాఫిక్ నార్మల్గానే ఉంది. కానీ, కాసేపటికి రాయల్ ఎన్ఫీల్డ్పై వెంకటేశ్ రావడంతో ఆ ఏరియా అంతా కోలాహలంగా మారింది. ట్రాఫిక్ జామ్ కావడంతో బౌన్సర్లు వెంకీకి రక్షణగా రంగంలోకి దిగారు. అసలు వివరాల్లోకి వెళితే.. వెంకటేశ్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో ఎస్.శశికాంత్ నిర్మిస్తున్న సినిమా ‘గురు’. మాధవన్ హీరోగా సుధా కొంగర తీసిన తమిళ సినిమా ‘ఇరుది సుట్రు’కి తెలుగు రీమేక్ ఇది. విశాఖలో భీమిలి బీచ్ రోడ్డులో వెంకటేశ్ జాగింగ్ చేస్తున్న దృశ్యాలతో పాటు బైక్పై వెళ్తున్న సీన్స్, బోయవీధిలో కిక్ బాక్సింగ్ చేస్తున్న సన్నివేశాలను చిత్రీకరించారు. హీరోయిన్ రితికా సింగ్, సీనియర్ నటుడు నాజర్ తదితరులు చిత్రీకరణలో పాల్గొన్నారు. తరువాతి షెడ్యూల్ చెన్నైలో మొదలుకానుంది. -
రేసు నుంచి తప్పుకున్న వెంకీ..?
ఈ సంక్రాంతికి నలుగురు సీనియర్ హీరోలు ఒకేసారి బరిలో దిగుతారని భావించినా.. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించటం లేదు. చాలా కాలం తరువాత నలుగురు అగ్ర కథానాయకులు ప్రస్టీజియస్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అంతేకాదు ఈ నలుగురు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారన్న వార్తలతో అభిమానులు కూడా తెగ సంబర పడిపోయారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించటం లేదు. ఓంనమో వేంకటేశాయ పేరుతో భక్తి రస చిత్రంలో నటిస్తున్న నాగార్జున ముందుగా రేసు నుంచి తప్పుకున్నాడు. భారీ గ్రాఫిక్స్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ కావద్దన్న ఉద్దేశంతో వాయిదా వేసుకున్నాడు. తాజాగా మరో హీరో వెంకటేష్ కూడా డేట్ మార్చుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. రీమేక్గా తెరకెక్కుతున్న గురు సినిమాలో నటిస్తున్న వెంకీ ముందుగా పండుగ రోజు థియేటర్లలోకి రావాలని ప్లాన్ చేసుకున్నాడు. అయితే తాజాగా వెంకీ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. వెంకీ బాక్సింగ్ ట్రైనర్గా నటిస్తున్న గురు సినిమాను రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట. దీంతో సంక్రాంతి బరిలో చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150తో పాటు బాలకృష్ణ వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణిలు మాత్రమే పోటి పడనున్నాయి. -
సెట్స్లో సందడి గురూ!
‘‘వెంకటేశ్గారితో కలసి నటిస్తుండడం చాలా ఆనందంగా ఉంది. ఆయన నిజంగా ‘విక్టరీ’నే. ‘గురు’ షూటింగ్లో వెంకీతో ఓ సెల్ఫీ’’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు ముంతాజ్ సోర్కర్. ఎవరీ ముంతాజ్ అనుకుంటున్నారా? ఇక్కడ వెంకటేశ్ పక్కన ఆరెంజ్ కలర్ జెర్సీలో కళ్లజోడు పెట్టుకుని సెల్ఫీ తీసుకున్న అమ్మాయే. సుధా కొంగర దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటిస్తున్న ‘గురు’లో హీరోయిన్ రితికా సింగ్కి సిస్టర్గా నటిస్తున్నారు. మాధవన్ హీరోగా సుధా కొంగర తీసిన ‘సాలా ఖడూస్’కి తెలుగు రీమేక్ ఈ ‘గురు’ అనే సంగతి తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్లో కూడా ముంతాజ్ హీరోయిన్ సిస్టర్గా నటించారు. ప్రస్తుతం విశాఖలో ‘గురు’ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రం లొకేషన్కి వచ్చిన అభిమానులతో వెంకీ ఫొటోలు దిగారు. వైనాట్ స్టూడియోస్ పతాకంపై ఎస్.శశికాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్లో పూర్తవుతుంది. -
వెంకీ కూడా సంక్రాంతికే వస్తున్నాడు
యంగ్ హీరోల జోరు పెరగటంతో కాస్త స్లో అయిన సీనియర్ హీరోలు సంక్రాంతినే టార్గెట్ చేస్తున్నారు. గత ఏడాది సంక్రాంతి బరిలో బాలకృష్ణ, నాగార్జున లాంటి స్టార్ హీరోలు పోటి పడగా ఈ ఏడాది సంక్రాంతి పోటి మరింత రసవత్తరంగా మారనుంది. ఇప్పటికే పోటిలో ఇద్దరు స్టార్ హీరోలు కాలు దువ్వుతుండగా తాజాగా మరో సీనియర్ హీరో కూడా పోటిలోకి ఎంటర్ అయ్యాడు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150తో పాటు బాలకృష్ణ వందో చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి కూడా సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. నాగార్జున లీడ్ రోల్లో తెరకెక్కుతున్న ఓం నమోవేంకటేశాయ కూడా అదే సమయంలో రిలీజ్ అవుతుందన్న టాక్ వినిపిస్తున్నా అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. ఇంతటి భారీ పోటి మధ్య మరో స్టార్ హీరో కూడా బరిలో దిగేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల బాబు బంగారం సినిమాతో ఆకట్టుకున్న విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం సాలాఖద్దూస్కు రీమేక్గా తెరకెక్కుతున్న గురు సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను కూడా సంక్రాంతి బరిలోనే రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవల కాలం ఎన్నడూ లేని విధంగా ఒకేసారి ముగ్గురు సీనియర్ స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతుండటంతో ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులు కూడా ఈ పోటిని ఆసక్తిగా గమనిస్తున్నారు. -
గురు లుక్ అదిరింది
బాబు బంగారం సినిమాతో ఆకట్టుకున్న సీనియర్ హీరో వెంకటేష్ తన నెక్ట్స్ సినిమాను మొదలెట్టేస్తున్నాడు. తమిళ హిందీ భాషల్లో ఘనవిజయం సాధించిన సాలా ఖద్దూస్ సినిమాను తెలుగు రీమేక్ చేస్తున్నాడు. ఒరిజినల్ వర్షన్ కు దర్శకత్వం వహించిన సుధ కొంగర దర్శకత్వంలోనే తెలుగు సినిమా కూడా రూపొందనుంది. గతంలో సినిమా కోసం తన ఫిజిక్ విషయంలో భారీ మార్పుల చేయని వెంకీ ఈ సినిమా కోసం కాస్త వేరియేషన్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాలో బాక్సింగ్ కోచ్ గా నటిస్తుండటంతో అందుకు తగ్గట్టుగా కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్నాడు వెంకీ. ఈ నెల 19నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెలుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రానా రిలీజ్ చేశాడు. గురు పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో రితికా సింగ్ కీలక పాత్రలో నటిస్తోంది. -
అబ్బాయి చేతుల మీదుగా బాబాయ్ ఫస్ట్ లుక్
బాబు బంగారం సినిమాతో ఆకట్టుకున్న సీనియర్ హీరో వెంకటేష్, తన నెక్ట్స్ ప్రాజెక్ట్ను మొదలు పెట్టనున్నాడు. అయితే కాస్త భిన్నంగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవ్వటానికి ముందే ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు చిత్రయూనిట్. హిందీ, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించిన సాలా ఖద్దూస్ సినిమాను తెలుగులో గురు పేరుతో రీమేక్ చేస్తున్నాడు వెంకీ. ఒరిజినల్ వర్షన్కు దర్శకత్వం వహించిన సుధా కొంగర ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించనున్నారు. ఒరిజినల్ వర్షన్లో బాక్సింగ్ స్టూడెంట్గా నటించిన రితికా సింగ్, ఈ సినిమాతో తెలుగులోనూ ఎంట్రీ ఇవ్వనుంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను ఈ రోజు( శనివారం) సాయంత్రం 5 గంటలకు యంగ్ హీరో రానా తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేయనున్నాడు. -
ముహూర్తం కుదిరింది గురూ!
వెంకటేశ్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో పీవీపీ సంస్థ ఓ చిత్రం నిర్మించనున్న విషయం తెలిసిందే. హిందీలో సుధ కొంగర దర్శకత్వంలోనే ఘనవిజయం సాధించిన ‘సాలా ఖద్దూస్’కి రీమేక్ ఇది. తమిళంలో ‘ఇరుది సుట్రు’ పేరుతో సూపర్ హిట్ అయిన ఈ కథ ఇప్పుడు తెలుగు తెరపైకి కొత్త హంగులతో వస్తోంది. చిత్ర షూటింగ్ ఈ నెల 19న ప్రారంభం కానుంది. ఇందులో వెంకీ బాక్సింగ్ కోచ్గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి ‘గురు’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. హిందీలో హీరోయిన్గా నటించిన రితికా సింగ్నే ఇప్పుడీ తెలుగు ‘గురు’లోనూ ఎంపిక చేశారు. విశాఖపట్నం, చెన్నై, ఊటీలలో షూటింగ్ చేసి, క్రిస్మస్కి విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ స్వరకర్త. -
ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు
భక్తులతో కి టకిటలాడిన సాయిబాబా మందిరాలు కోదాడఅర్బన్: పట్టణంలోని పలు ఆలయాల్లో గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆజాద్నగర్లోని సాయిబాబా మందిరంతో పాటు కాశీనాధం కల్యాణ మండపం, దుర్గాపురంలోని సాయిబాబా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలలో కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ వంటిపులి అనితతో పాటు పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం ఆయా ఆలయాల్లో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదే విధంగా పట్టణంలోని శ్రీస్కూల్లో గురువుల విశిష్టతను విద్యార్థులకు తెలియజేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సాయిబాబా, ఆదిశంకరాచార్యులు, రామకృష్ణ పరమహంసల చిత్రపటాలకు పుష్ఫాభిషేకం నిర్వహించి వారి విశిష్టతను విద్యార్ధులకు తెలియజేశారు. పట్టణంలోని రిషి డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు ఈ సందర్భంగా తమ నాట్యగురువు నాగేశ్వరరావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా ఆలయాల కమిటీల సభ్యులు, కౌన్సిలర్లు, నాయకులు, శ్రీపాఠశాల ప్రధానోపాధ్యాయులు శేఖర్, జ్యోతి, ఎఓ శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణకు రాజు అయినా...
హైదరాబాద్ : తెలంగాణకు రాజు అయినా ....గురువు ముందు మాత్రం ఆయన ఇప్పటికీ విద్యార్థే. తనకు విద్య నేర్పిన ఉపాధ్యాయుడిని ఆయన మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవటమే కాకుండా, ఆయనను తగిన రీతిలో సత్కరించారు. అంతేకాకుండా గురువుకు చేతులు జోడించి వినయంగా నమస్కరించారు. ఇంతకీ ఆయన ఎవరు అనుకుంటున్నారా?... ఆయనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. తనకు చిన్నప్పుడు తెలుగు పాఠాలు నేర్పిన మృత్యుంజయ శర్మను కేసీఆర్ గురువారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన తన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. మృత్యుంజయ శర్మ మెదక్ జిల్లా దుబ్బాక మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేశారు. కాగా అమ్మ జన్మ ఇస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడని . గురువు మంచి వ్యక్తి అయితే రాయి కూడా పాఠం నేర్చుకుంటుందని కేసీఆర్ ...ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తన గురువు మృత్యుంజయ శర్మ ఫీజు లేకుండా పాఠాలు చెప్పారని..తాను ఇలా మాట్లాడుతున్నానంటే గురుదేవులు పెట్టిన అక్షర భిక్షేనని ఆయన గుర్తు చేసుకున్న విషయం తెలిసిందే. -
కామన్వెల్త్ వీరులు బిజీ బిజీ