Gwalior
-
Madhya Pradesh: ఆస్పత్రిలో పేలిన ఏసీ.. వ్యాపించిన మంటలు
గ్వాలియర్: మధ్యప్రదేశ్లోని గ్వాలియర్(Gwalior)లో ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి ఒక ఆస్పత్రిలో ఉన్నట్టుండి ఒక ఏసీ పేలిపోయింది. ఈ ఘటనలో ఆస్పత్రి అంతటా మంటలు వ్యాపించడంతో కలకలం చెలరేగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోనికి తెచ్చింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.గ్వాలియర్ మున్సిపల్ కార్యాలయ అధికారి అతిబల్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ ఆస్పత్రి లేబర్ రూమ్(Labor room)లో మంటలు అంటుకున్నాయని తనకు సమాచారం రాగానే, తాను ఈ విషయాన్ని ఫోనులో అగ్నిమాపకశాఖకు తెలియజేశానన్నారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారన్నారు. ఆస్పత్రిలోని ఏసీ పేలిపోయి, మంటలు అంటుకోగానే అప్రమత్తమైన సిబ్బంది అక్కడి రోగులను బయటకు తరలించారన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదని తెలిపారు. గ్వాలియర్ సబ్ డివిజినల్ మేజిస్టేట్ వినోద్ సింగ్ మాట్లాడుతూ ఎయిర్ కండిషన్డ్ గైనకాలజీ యూనిట్లో మంటలు చెలరేగాయని, ఆ సమయంలో అక్కడ దాదాపు 22 మంది ఉన్నారన్నారు. వైద్య సిబ్బంది అక్కడి నుంచి వారిని ఖాళీ చేయించారన్నారు. ఇది కూడా చదవండి: 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ హతం? -
ఇంటి బయట పోలీసులు ఇంట్లో మర్డర్
గ్వాలియర్(ఎంపీ): గొడవలు వద్దు, కూర్చుని మాట్లాడుకోండని సర్దిచెప్పేందుకు వచ్చిన పోలీసులు ఇంటిబయట ఉండగానే కూతురిని కన్న తండ్రి చంపేసిన ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. అమ్మాయి బంధువు సైతం కాల్పులు జరిపినట్లు ఆరోపణలున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్వాలియర్లోని గోలా కా మందిర్ ప్రాంతంలో 45 ఏళ్ల మహేశ్ సింగ్ గుర్జార్కు 20 ఏళ్ల కూతురు ఉంది. జనవరి 18వ తేదీన ఆమె పెళ్లి జరగాల్సి ఉంది. అయితే తనకిప్పుడు ఈ పెళ్లి ఇష్టంలేదని కుమార్తె చెప్పడంతో మహేశ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఎలాగైనా పెళ్లి జరగాల్సిందేనని మహేశ్ మేనల్లుడు రాహుల్ సైతం పట్టుబట్టి ఆమెను ఒప్పించే ప్రయత్నంచేశాడు. ముగ్గురి మధ్య వాగ్వాదం విషయం తెల్సి స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వాళ్లు హుటాహుటిన పెళ్లింటికి వచ్చేశారు. పెళ్లి ఏర్పాట్లతో ఇళ్లంతా ముస్తాబు చేసిఉండటంతో లోపలికి వెళ్లకుండా మగ, ఆడ కానిస్టేబుల్స్ ఇంటి బయటే వేచి చూస్తున్నారు. ఎంతచెప్పినా పెళ్లికి ఒప్పుకోకపోవడంతో మహేశ్, రాహుల్ ఒక నాటు తుపాకీ, పిస్టల్తో అమ్మాయిని కాల్చి చంపారు. నాలుగు బుల్లెట్లను కాల్చారు. బుల్లెట్ల మోతతో హుతాశులైన స్థానికులు, పోలీసులు ఇంట్లోకి పరుగులుతీశారు. అప్పటికే రాహుల్ అక్కడి నుంచి తప్పించుకోగా తండ్రి అక్కడే ఉన్నాడు. రక్తమోడుతున్న అమ్మాయిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. పారిపోయిన బంధువు రాహుల్ను పోలీసులు బుధవారం అరెస్ట్చేశారు. -
క్లాస్మేట్పై జూనియర్ డాక్టర్ అత్యాచారం
గ్వాలియర్: ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణలోని ఉపయోగంలో లేని హాస్టల్లో ఓ జూనియర్ డాక్టర్(25) తోటి వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ నగరంలోని గజరాజా మెడికల్ కాలేజీలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు, బాధితురాలు వేర్వేరు హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు. ఆదివారం నిందితుడు కాలేజీ ఆవరణలోనే ఉన్న ఉపయోగంలో లేని బాయ్స్ హాస్టల్లోకి రావాలని బాధితురాల్ని కోరాడు. అంగీకరించి అక్కడికి వెళ్లిన ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై బాధితురాలు కాంపు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిందితుడిని సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు నగర ఎస్పీ అశోక్ జడొన్ చెప్పారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. -
కొత్త స్టేడియంలో....14 ఏళ్ల తర్వాత...
2010లో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ (200 నాటౌట్)తో చరిత్ర సృష్టించింది గ్వాలియర్లోనే. అయితే ఆ మ్యాచ్ జరిగిన రూప్ సింగ్ స్టేడియంలో అదే ఆఖరి మ్యాచ్. గ్వాలియర్ మున్సిపల్ శాఖకు చెందిన రూప్ సింగ్ స్టేడియంలో ఆ మ్యాచ్ తర్వాత మరో అంతర్జాతీయ మ్యాచ్ జరగలేదు. ఇక్కడ మొత్తం 12 వన్డేలు జరిగాయి. దీని తర్వాత మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తమ సొంత స్టేడియం నిర్మాణం వైపు మొగ్గింది. నగర శివార్లలో 30 ఎకరాల విస్తీర్ణంలో కొత్తగా స్టేడియాన్ని నిర్మించింది. అత్యాధునిక సౌకర్యాలతో దాదాపు 30 వేల సామర్థ్యం గల ‘శ్రీమంత్ మాధవ్రావ్ సింధియా క్రికెట్ స్టేడియం’ను ఇటీవలే ప్రారంభించారు. నేటి మ్యాచ్ ఇదే మైదానంలో జరగనుంది. 14 ఏళ్ల తర్వాత గ్వాలియర్ అంతర్జాతీయ పోరుకు వేదిక కానుంది. స్టేడియంను ప్రారంభించిన తర్వాత ఇక్కడ ఒక్క దేశవాళీ మ్యాచ్ కూడా నిర్వహించలేదు. మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్ పోటీలు మాత్రం జరిగాయి. కొత్త స్టేడియంలో పిచ్ బ్యాటింగ్కే అనుకూలించే అవకాశం ఉంది. మ్యాచ్ రోజున వర్ష సూచన లేదు. -
భారత్-బంగ్లా తొలి టీ20.. స్టేడియం వద్ద మూడంచెల భద్రత
బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. ఇప్పుడు టీ20 సిరీస్ కన్నేసింది. ఆక్టోబర్ 6న గ్వాలియర్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే గ్వాలియర్కు చేరుకున్న ఇరు జట్లు తమ ప్రాక్టీస్ను మొదలు పెట్టాయి.అయితే మొదటి టీ20కు ఇవ్వనున్న గ్వాలియర్ ఇప్పుడు హై సెక్యూరిటీ జోన్గా మారింది. న్యూ మాధవరావు సింధియా క్రికెట్ స్టేడియం వద్ద పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇరు జట్ల ఆటగాళ్లు బస చేసే హోటల్ వద్ద కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.కాగా మ్యాచ్ జరిగే అక్టోబర్ 6న హిందూ మహాసభ బంద్కు పిలుపునివ్వడంతో పోలీసులు ముందుస్తు జాగ్రత్తగా భద్రతను కట్టుదిట్టం చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ మహాసభ ఆదివారం నల్లజెండాలతో ర్యాలీని నిర్వహించాలని ప్లాన్ చేసింది. దీంతో ఎటువంటి అవాంఛీనయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రతమత్తమయ్యారు.తుది జట్లు అంచనాభారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్బంగ్లాదేశ్: లిట్టన్ దాస్, తాంజిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హొస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్ -
Independence Day 2024: 16 రాష్ట్రాలకు గ్వాలియర్ త్రివర్ణ పతాకాలు
కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపధ్యంలో మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. రాబోయే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గ్వాలియర్లో తయారైన త్రివర్ణ పతాకాలను 16 రాష్ట్రాల్లో ఎగురవేయనున్నారు. ఇప్పటి వరకు ఇక్కడి నుంచి 14 రాష్ట్రాలకు అందించేందుకు త్రివర్ణ పతాకాలను తయారు చేసేవారు. ఇప్పుడు కేరళ, కర్నాటక రాష్ట్రాలకు అందించేందుకు కూడా ఇక్కడే జాతీయ జెండాలను తయారుస్తున్నారు. గ్వాలియర్ నుంచి వివిధ రాష్ట్రాలకు ఎనిమిది వేల త్రివర్ణ పతాకాలను పంపించారు.తాజాగా మరో రెండు వేల త్రివర్ణ పతాకాలకు ఆర్డర్లు అందాయి. ఈ సందర్భంగా కేంద్ర భారత ఖాదీ యూనియన్ కార్యదర్శి రమాకాంత్ శర్మ మాట్లాడుతూ ప్రతి ఇంటికీ త్రివర్ణ పతాకం అనే ప్రభుత్వ నినాదం చురుగ్గా సాగుతున్నదన్నారు. గ్వాలియర్కు చెందిన 196 మందితో కూడిన బృందం త్రివర్ణ పతాకాలను రూపొందిస్తోంది. -
కుటుంబాన్ని మింగేసిన అగ్ని కీలలు
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మూడంతస్తుల భవనంలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో తండ్రి, ఇద్దరు కూతుళ్లు సజీవ దహనమయ్యారు. మంటలు భారీగా చెలరేగడంతో 13 అగ్నిమాపక శకటాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలకు అదుపులోనికి తీసుకువచ్చాయి. ఈ ఘటన గ్వాలియర్లోని బహోదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కైలాష్నగర్లో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలోని మూడంతస్తుల భవనంలో విజయ్ అలియాస్ బంటీ అగర్వాల్ తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వారు దీనిని గమనించి, పోలీసులకు సమాచారం అందించారు.అయితే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేటప్పటికే విజయ్, అతని కూతుళ్లు అన్షిక అలియాస్ మినీ (15), యాషిక అలియాస్ జీసస్ (14) సజీవదహనమయ్యారు. మంటలు చెలరేగిన భవనంలో కింది అంతస్తులో ఒక ప్రవేశ ద్వారం మాత్రమే ఉంది. దీంతో వారు ఇంటిలో నుంచి బయటకు రాలేకపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక దళం మంటలను అదుపుచేసింది. ఈ భవనపు కింది భాగంలో డ్రై ఫ్రూట్స్ దుకాణం, రెండవ అంతస్తులో ఒక గొడౌన్ ఉంది. -
రూ.46 కోట్లు కట్టు! పీజీ విద్యార్థికి ఐటీ నోటీసు
గ్వాలియర్: మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ప్రమోద్ దండోతియా(25) అనే పీజీ విద్యార్థి ఏకంగా రూ.46 కోట్ల ఆదాయ పన్ను నోటీసు అందుకున్నాడు! దాంతో షాకై పోలీసులను ఆశ్రయించాడు. తన పాన్ కార్డు వివరాల ద్వారా ఎవరో ఢిల్లీ, ఫుణేల్లో తన పేరిట ఓ కంపెనీని సృష్టించి ఈ లావాదేవీలు జరిపినట్లు ఐటీ, జీఎస్టీ అధికారుల ద్వారా తెలిసిందని బాధితుడు చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని వారతనికి సూచించారు. ఐటీ నోటీసులు, ఇతర ఆధారాలతో ఫిర్యాదు చేయాలని ప్రమోద్కు చెప్పినట్టు ఏఎస్పీ షియాజ్ తెలిపారు. దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. -
150 ఏళ్ల నాటి నిధి, వాటాలకోసం జగడం..చివరికి..?
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలోని ఒక గ్రామంలో ఇల్లు నిర్మిస్తున్న కూలీలకు ఊహించని పరిణామం ఎదురైంది. 150 ఏళ్ల నాటి బ్రిటిష్ కాలం నాటి నిధి వారి కంటపడింది ఇంటి నిర్మాణం కోసం (మంగళవారం మార్చి 5న) గుంతలు తవ్వుతున్న కూలీలకు బ్రిటీష్ కాలం నాటి వెండి నాణేలు లభ్యమైనాయి. దీంతో ఈ వార్త ఆ నోటా ఈ నోటా ఊరంతా పాకి వివాదానికి దారి తీసింది. సంజయ్ పాల్ అనే వ్యక్తి ఇల్లు కట్టుకోవడానికి కూలీలను పెట్టుకున్నాడు. ఈ క్రమంగా అక్కడ తవ్వుతుండగా ఇద్దరు కార్మికుల వెండి నాణేలు లభించాయి. ఈ సంగతి సంజయ్ పాల్ పొరుగువారికి తెలియడంతో వివాదం రేగింది.త మకూ వాటా కావాలని పట్టుబట్టడంతో వాగ్వాదానికి దారి తీసింది. దీంతో సంజయ్ కుమారుడు హరీష్ జంగంజ్ పోలీసులను ఆశ్రయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వాటా అడిగిన ఇంటి పొరుగువారితో పాటు ఇద్దరు కార్మికులను అరెస్టు చేస్తామని చెప్పారు. కొన్ని వెండి నాణేలను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. ఈవిషయానికి సంబంధించి పురావస్తు శాఖ నుంచి వివరాలను సేకరించి తగిన చర్యలు చేపడతామని పోలీసు అధికారులు ప్రకటించారు. కాగా ఇంటి పునాదిని తొలగిస్తుండగా నిధి కనిపించిందని, కూలీలకు 40-50 నాణేలు లభించాయని తమకు సమాచారం అందిందనీ, తాము అక్కడికే చేరుకునే సరికి అక్కడ ఎవరూ లేరని, వాటిని కార్మికులో తీసుకుని ఉంటారని హరీష్ తెలిపాడు. -
‘సూరీడు కనిపించి ఏడురోజులైంది’
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్వాసులను గత వారం రోజులుగా ఎముకలు కొరికే చలి గజగజ వణికిస్తోంది. ఈ ప్రాంతంలో ‘సూరీడు కనిపించి ఏడురోజులైంది’ అని స్థానికులు చెబుతున్నారు. పొద్దస్తమానం ఉండే చలి కారణంగా జనజీవనం స్తంభించింది. చలి నుంచి రక్షించుకునేందుకు స్థానికులు రగ్గుల కింద తలదాచుకుంటున్నారు. ఈ పరిస్థితులను గమనించిన జిల్లా యంత్రాంగం గ్వాలియర్లో జనవరి 6న అన్ని ప్రీ-ప్రైమరీ పాఠశాలలకు సెలవు ప్రకటించింది. చలి తీవ్రత కారణంగా ప్రీ ప్రైమరీ నుంచి ఐదో తరగతి వరకు నడుస్తున్న అన్ని పాఠశాలలకు జనవరి 6వ తేదీ శనివారం సెలవు ప్రకటించినట్లు గ్వాలియర్ కలెక్టర్ అక్షయ్ కుమార్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆరు నుంచి 12వ తరగతి వరకు అన్ని క్లాసులను మునుపటిలానే నిర్వహిస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్వాలియర్లో గత వారం రోజులుగా చలి తీవ్రత అధికంగా ఉంది. జనవరి 2 నుండి రాత్రి ఉష్ణోగ్రతలు 9 నుండి 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. వాతావరణశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గ్వాలియర్ ప్రజలు సూర్యుడిని చూసేందుకు మరో రెండు మూడు రోజులు వేచి చూడాల్సివుంటుంది. ప్రస్తుతం జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉండనుంది. ఒకటి రెండు రోజుల్లో చినుకులు కూడా పడే అవకాశాలు కూడా ఉన్నాయి. గ్వాలియర్-చంబల్లో దట్టమైన పొగమంచు ఏర్పడుతోంది. -
గుడ్బై 2023: సుఖోయ్-30.. మిరాజ్-2000 ఢీకొన్న వేళ..
కొద్దిరోజుల్లో 2023వ సంవత్సరం ముగియబోతోంది. ఆశలు రేకెత్తిస్తూ.. 2024 మన ముందుకు వస్తోంది. కొత్త సంవత్సరం ప్రజలకు కొత్త ఆనందాన్ని అందించబోతోంది. అయితే 2023 దేశ ప్రజలకు కొన్ని మంచి, కొన్ని చెడు జ్ఞాపకాలను అందించింది. 2023 జనవరి 28న గగనతలంలో ఊహకందని ఘటన చోటుచేసుకుంది. మన దేశానికి చెందిన రెండు శక్తివంతమైన యుద్ధ విమానాలు సుఖోయ్-30, మిరాజ్-2000 ఒకదానికొకటి ఢీకొని ధ్వంసమయ్యాయి. ఈ రెండు యుద్ధ విమానాలు గ్వాలియర్లోని మహారాజ్పురా ఎయిర్బేస్ నుండి సాధారణ శిక్షణ కోసం బయలుదేరాయి. ఈ ప్రమాద ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచింది. మధ్యప్రదేశ్లోని మోరెనాలోని పహర్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మన్పూర్ మహాదేవ్ అడవిలో మిరాజ్ యుద్ధ విమానం కూలిపోయింది. సుఖోయ్కు చెందిన రెక్కలు మోరెనాలోని పహర్ఘర్ ప్రాంతంలో పడిపోయాయి. మిగిలిన విమానం రాజస్థాన్లోని భరత్పూర్లోని ఉచైన్ పోలీస్ స్టేషన్లోని నాగ్లా బిజా గ్రామ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో మిరాజ్ పైలట్ వింగ్ కమాండర్ హనుమంతరావు సారథి మృతి చెందగా, సుఖోయ్ పైలట్లిద్దరూ గాయపడ్డారు. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మిరాజ్-2000 చాలా కాలంగా భారత వైమానిక దళంలో భాగంగా ఉంది. ఫిబ్రవరి 2019లో జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు భారత వైమానిక దళానికి చెందిన 12 మిరాజ్-2000 యుద్ధ విమానాలను వినియోగించారు. భారత వైమానిక దళం తెలిపిన వివరాల ప్రకారం ఈ విమానాలు.. విమాన శిక్షణ మిషన్లో ఉండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక పైలట్ మృతి చెందగా, ఇద్దరు పెలట్లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే దిశగా విచారణ కొనసాగుతోంది. ఇది కూడా చదవండి: దేశమంతటా క్రిస్మస్ వెలుగులు.. చర్చిలు శోభాయమానం! -
Madhya Pradesh Elections: సింధియాకు అగ్నిపరీక్ష
అసెంబ్లీ ఎన్నికలు ఇంకా వారం కూడా లేని వేళ మధ్యప్రదేశ్లో కీలకమైన గ్వాలియర్–చంబల్ ప్రాంతం అధికార బీజేపీకి తలనొప్పిగా మారుతోంది. పార్టీలోని పాత నేతలకు, మూడేళ్ల కింద కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన జ్యోతిరాదిత్య సింధియా అనుయాయులకు అస్సలు సరిపడకపోవడం, ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తుండటం అధిష్టానానికి మింగుడు పడటం లేదు. ఈ ప్రాంతంలో 34 కీలక అసెంబ్లీ స్థానాలున్నాయి. రాష్ట్రంలో అధికారం చేపట్టాలంటే ఇక్కడ మంచి ఫలితాలు సాధించడం కాంగ్రెస్, బీజేపీ రెండింటికీ చాలా కీలకం. అలాంటి ప్రాంతంలో పాత, కొత్త నేతలు సయోధ్యకు ససేమిరా అంటుండటం పార్టీ నాయకత్వంతో పాటు సింధియాకు కూడా ఇబ్బందికరంగానే మారింది. పైగా శివరాజ్సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై జనంలో నెలకొన్న వ్యతిరేకత కూడా దీనికి తోడయ్యేలా కని్పస్తుండటం మరింత గుబులు రేపుతోంది. ఈసారి గ్వాలియర్ ప్రాంతంలో బీజేపీ సాధించబోయే సీట్ల సంఖ్యపై పారీ్టలో సింధియా భవితవ్యం కూడా చాలావరకు ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఓటర్ల తీర్పు ఎలా ఉండనుందన్నది ఆసక్తికరంగా మారింది... అది గ్వాలియర్లోని హజీరా ప్రాంతం. సిట్టింగ్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఇంధన మంత్రి ప్రద్యుమ్నసింగ్ తోమర్ ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి ఓటెయ్యాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాత్రం కాంగ్రెస్కు ఓటెయ్యాల్సిందిగా కోరారాయన! ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచిన అనంతరం యువ నేత జ్యోతిరాదిత్య సింధియా నాయకత్వంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న 16 మంది ఎమ్మెల్యేల్లో తోమర్ ఒకరు. ఆయన రాకతో కినుక వహించిన స్థానిక బీజేపీ నేతలు ఇప్పుడాయనకు సహాయ నిరాకరణ చేస్తున్నారు. దాంతో ఒకరకంగా ఆయనది ఒంటరి పోరుగానే మారింది. ఆయనకు మాత్రమే కాదు, బీజేపీ టికెటిచ్చిన సింధియా వర్గానికి చెందిన మరో 17 మంది నాయకులకూ దాదాపుగా ఇదే పరిస్థితి ఎదురవుతోంది! అంతేగాక ఓటర్లు కూడా వారిపట్ల నిరాసక్తతే చూపుతున్నారు. ‘‘వారికే పరస్పరం కుదరడం లేదు. అలాంటి వాళ్లకు మా మంచీ చెడూ గురించి ఆలోచించేంత సమయం ఎక్కడుంటుంది?’’ అని ప్రశ్నిస్తున్నారు! బీజేపీ వర్సెస్ సింధియా వర్గం 2020 మార్చిలో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి సింధియా బీజేపీలో చేరారు. దాంతో కమల్నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలి శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. వారంతా రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలొచ్చాయి. గ్వాలియర్–చంబల్ ప్రాంతంలో ఇలా రాజీనామా చేసిన 16 మందిలో 9 మంది తిరిగి నెగ్గారు. దాంతో అక్కడ బీజేపీ బలం 16కు పెరిగింది. ఈసారి ఆ స్థానాలన్నింటినీ నిలుపుకోవడంతో పాటు మరిన్ని చోట్ల నెగ్గాల్సిన కఠిన పరీక్ష సింధియా ముందుంది. కానీ పరిస్థితులు ఆయనకు అంత సానుకూలంగా కనిచడం లేదు. ఆ ప్రాంత ప్రజల్లో మెజారిటీ సింధియా నిర్ణయాన్ని తప్పుబడుతుండటం విశేషం. ఆయనసలు కాంగ్రెస్ను వీడాల్సిందే కాదన్నది వారి నిశి్చతాభిప్రాయం. దీనికి తోడు సింధియా వర్గానికి చెందిన 18 మందికి బీజేపీ నాయకత్వం టికెట్లివ్వడం కూడా పార్టీలో విభేదాలకు కారణమైంది. పలువురు ఆశావహులు పార్టీలు మారి బరిలో దిగి సవాలు విసురుతున్నారు. మోరెనా అసెంబ్లీ స్థానంలో సింధియా వర్గం ఎమ్మెల్యే రఘురాయ్ కన్సానాకు టికెటివ్వడాన్ని వ్యతిరేకిస్తూ రాకేశ్ రుస్తుం సింగ్ బీజేపీని వీడారు. బీఎస్పీ టికెట్పై బరిలో దిగి సవాలు విసురుతున్నారు. బీజేపీ ఓటు బ్యాంకును ఆయన గణనీయంగా చీల్చడం ఖాయమంటున్నారు. పలు ఇతర అసెంబ్లీ స్థానాల్లోనూ ఇదే పరిస్థితి! దీన్ని గమనించే బీజేపీ ట్రబుల్ షూటర్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అక్టోబర్ 30 నుంచి వారంలోపే ఏకంగా రెండుసార్లు గ్వాలియర్–చంబల్ ప్రాంతంలో పర్యటించారు. అసంతృప్త పార్టీ నేతలతో వరుస సమావేశాలు జరిపి బుజ్జగించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.‘‘అసలు బీజేపీ నేతల్లోనే చాలామంది సింధియాను వ్యతిరేకిస్తున్నారు. ఇది ఈసారి ఆ పారీ్టకి బాగా చేటు చేసేలా కనిపిస్తోంది’’ అని రాజకీయ, మీడియా విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి గ్వాలియర్ రాజ వంశీకునిగా సింధియాపై ఈ ప్రాంతవాసులకు చెప్పలేనంత అభిమానముంది. కానీ ఆయన పార్టీ మారిన తీరు వారికి పెద్దగా నచ్చలేదు. వ్యతిరేక పవనాలు...! అంతేగాక మధ్యలో ఓ ఏడాదిన్నర మినహా రాష్ట్రంలో 18 ఏళ్లుగా బీజేపీ పాలనే సాగుతుండటంతో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న ప్రభుత్వ వ్యతిరేకత కూడా సింధియాకు ప్రతికూలంగా మారుతోంది. ‘‘నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మాకొచ్చే రోజువారీ కూలీ ఏ మూలకూ చాలడం లేదు. పోయినసారి బీజేపీకి ఓటేశాం. ఈసారి మాత్రం కాంగ్రెస్కే వేసి చూద్దామనుకుంటున్నాం’’ అన్న మాలతీ కిరార్, ఆమె సోదరుడు యోగేంద్ర మాటలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఇంజనీరింగ్ పూర్తి చేసినా తనకిప్పటికీ ఉద్యగం దొరకలేదని భగవాన్ దాస్ అనే యువకుడు వాపోయాడు. ‘‘మూడేళ్లుగా ప్రభుత్వోద్యోగాల భర్తీయే లేదు. బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి?’’ అన్న ఆయన ప్రశ్న యువతలో కూడా కమలం పార్టీకి సానుకూలంగా లేదనేందుకు రుజువేనంటున్నారు. -
భద్రాద్రి మాడ వీధుల్లో గ్వాలియర్ పందిరి
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి నలువైపులా మాడ వీధుల్లో గ్వాలియర్ పందిరి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారవుతున్నాయి. ఇటీవల జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ చైర్మన్ జీబీఎస్ రాజు దంపతులు స్వామివారి దర్శనానికి భద్రాచలం రాగా, భక్తుల సౌకర్యార్థం మాడవీధుల్లో శాశ్వత ప్రాతిపదికన గ్వాలియర్ షీట్లతో పందిరి నిర్మాణానికి సహకరించాలని ఆలయ ఈవో రమాదేవి కోరారు. దీంతో ప్రతిపా దనలు రూపొందించేందుకు జీఎంఆర్ సంస్థ ఇంజనీరింగ్ అధికారులను శనివారం భద్రాచ లం పంపించగా.. ఆలయ ఈఈ రవీందర్, ఏఈవోలతో కలిసి ప్రతిపాదనలు సిద్ధం చేశా రు. నాలుగు వైపులా 80 వేల చదరపు అడు గుల పందిరి నిర్మాణానికి రూ.8 కోట్లు ఖర్చవు తుందని అంచనా వేశారు. కాగా దక్షిణ భాగం నుంచి తూర్పు మెట్లు, వైకుంఠ ద్వారం వరకు తొలి విడతగా పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
మధ్యప్రదేశ్లో మరో వికృత చేష్ట.. వీడియో వైరల్
గ్వాలియర్: మధ్యప్రదేశ్లో మరో వికృత చేష్ట వెలుగుచూసింది. సిద్ధి జిల్లాలో ఓ వ్యక్తిపై మరో వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటనను మరవకమునుపే ఈ ఘటన బయటకు వచ్చింది. కదులుతున్న వాహనంలో ఒక వ్యక్తితో ఇద్దరు వ్యక్తులు బలవంతంగా అరికాళ్లు నాకించారు. వ్యక్తిగత వైరం నేపథ్యంలో జరిగిన తాజా ఘటనపై పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో శుక్రవారం నుంచి సోషల్ మీడియాలో వైరలవుతోంది. కదులుతున్న వాహనంలో గోలూ గుర్జర్ అనే వ్యక్తి మరో వ్యక్తిని పదేపదే కొట్టడం, దూషిస్తూ అతడితో బలవంతంగా అరికాళ్లు నాకించడం ఉన్నాయి. అతడు చెప్పినట్లుగానే గోలూ గుర్జర్ను బాధితుడు పొగిడాడు. మరో వీడియో క్లిప్లో గోలూ గుర్జర్ చెప్పుతో బాధితుడి మొహంపై కొడుతున్నట్లుగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి బాధితుడి కుటుంబం ఫిర్యాదు మేరకు గోలూ గుర్జర్, సుదీప్ గుర్జర్ అనే వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు, బాధితుడు దబ్రా పట్టణానికి చెందిన వారేనని పోలీసులు తెలిపారు. బాధితుడు మొహ్సిన్ ఖాన్ మే 21వ తేదీన గోలూ గుర్జర్ను కొట్టాడని గ్వాలియర్ పోలీసుఅధికారి రాజేశ్ చందేల్ చెప్పారు. దాడిపై గోలూ డబ్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడన్నారు. కక్ష గట్టిన గోలూ గుర్జర్ తన వారితో కలిసి జూన్ 30న ఖాన్ను నిర్బంధించి, దాడికి దిగినట్లు చెప్పారు. -
గగన పోరాటంలో వరుణ్ తేజ్
దేశంలో జరిగిన వైమానిక దాడుల్లో మన సైనికులు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? ఎంతటి వీరోచితంగా పోరాడతారో వరుణ్ తేజ్ చూపించనున్నారు. దేశంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా భారతీయ వైమానిక దళ పైలెట్గా వరుణ్ తేజ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్గా నటిస్తున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సందీప్ ముద్దా నిర్మిస్తున్నారు. ‘‘ఇప్పటివరకు చూడని భీకర వైమానిక దాడుల్లో మన వీరుల పోరాటాన్ని ఈ చిత్రంలో చూపించనున్నాం. తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం గ్వాలియర్లో షూటింగ్ చేశాం. అక్కడి షెడ్యూల్ పూర్తయింది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
చీరకట్టులో ఫుట్బాల్ ఇరగదీసిన మహిళలు.. వీడియో వైరల్..
భోపాల్: మహిళలు చీరకట్టులో ఫుట్బాల్ ఆడిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ గ్వాలియర్లో 'గోల్ ఇన్ శారీ' పేరుతో ఈ ఫుట్బాల్ మ్యాచ్లు నిర్వహించారు. 20-72 ఏళ్ల మధ్య వయసున్న 8 మహిళా జట్లు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నాయి. మహిళలు సంప్రదాయ చీరకట్టులోనే తమ నైపుణ్యాలను ప్రదర్శించి అబ్బురపరిచారు. గ్వాలియర్ మున్సిపల్ కార్పొరేషన్, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సీనియర్ మెంబర్ అసోసియేషన్ ఈ కార్యక్రమానికి స్పాన్సర్లుగా వ్యవహరించారు. చైత్ర నవ్రాత్ర ఉత్సవాన్ని పురస్కరించుకుని ఈపోటీలు నిర్వహించారు. ఇంత మంది మహిళలు చీరలు ధరించి ఫుట్బాల్ ఆడటం దేశంలో బహుశా ఇది తొలిసారి అని నెటిజన్లు అంటున్నారు. చీరకట్టులోనూ ఫుట్బాల్ ఆడి సత్తాచాటారని కొనియాడారు. म्हारी महिलायें क्या #मेसी से कम हैं.. ग्वालियर में महिलाओं ने साड़ी वेशभूषा में फुटबॉल खेली। pic.twitter.com/Hi6PmTJp2i — Brajesh Rajput (@brajeshabpnews) March 27, 2023 ఈ వీడియోను చూసిన వారు బెండ్ ఇట్ లైక్ బెక్హాం మూవీలో ఓ యువతి క్యారెక్టర్ గుర్తుకువస్తుందని కామెంట్లు చేస్తున్నారు. ఆ సినిమాలో కూడా యువతికి ఫుట్బాల్ ఆడాలని కలలు కంటుంది, కానీ సంప్రదాయ కుంటుంబానికి చెందిన పెద్దలు అందుకు ఒప్పుకోరు. కానీ సంప్రదాయ పద్ధ తులను పాటిస్తూనే యువతి తన కలను నెరవేర్చుకునే విధానం ఇన్స్పైరింగ్గా ఉంటుంది. చదవండి: వామ్మో.. ప్రపంచంలోనే అతిపెద్ద పాము.. చూస్తే గుండె గుభేల్..! -
చీరకట్టులో.. చెంగు చెంగున గోల్స్
-
పేరుకే పెద్ద ఆస్పత్రి..కనీసం స్ట్రెచర్ లేక వృద్ధుడి పాట్లు: వీడియో వైరల్
కొన్ని ప్రభుత్వాస్పత్రులు పేరుకే పెద్ద ఆస్పత్రులు గానీ అందులో సౌకర్యాలు మాత్రం నిల్. దీంతో చికిత్స కోసం వచ్చే రోగులు పడే ఇబ్బందులు అంత ఇంత కాదు. చిన చితక పనులు చేసుకునే పేదలకు ఆ ఆస్పత్రులే గతి. దీంతో అక్కడ ప్రభుత్వోద్యోగులు వీళ్లపట్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారు. అచ్చం అలాంటి పరిస్థితి ఓ ప్రభుత్వాస్పత్రిలో వృద్ధుడు ఎదుర్కొన్నాడు. కనీసం రోగిని తీసుకువెళ్లేందకు స్ట్రెచర్లు లేక అతని తీసుకువెళ్తున్న విధానం చూస్తే ఆ ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం రాక మానదు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..మధ్యప్రదేశ్లోని గాల్వియర్లో సుమారు వెయ్యి పడకల ప్రభుత్వాస్పత్రికి ఓ వృద్ధుడు వచ్చాడు. అతని కాలు విరిగిపోవడంతో చికిత్స కోసం తన కోడలితో కలిసి ఆస్పత్రికి వచ్చాడు. ఐతే అక్కడ ఆర్థోపెడిక్ విభాగంలోని శ్రీకిషన్ ఓజా(65)ను ట్రామా విభాగానికి తరలించాలని సూచించారు. ఐతే అతన్ని తీసుకువెళ్లేందు కోసం స్ట్రెచర్ కోసం వెళ్లింది కానీ వాటికి చక్రాలు లేవు. దీంతో తన మామను ఒక తెల్లటి క్లాత్లో కూర్చొబెట్టి లాక్కుని వెళ్లింది. అక్కడ నుంచి ఆటో తీసుకుని ట్రామాకేర్ ఆస్పత్రికి తీసుకువెళ్లింది. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఐతే అక్కడ రోగులు స్ట్రెచర్లు ఉన్నాయే కానీ పనిచేయనవని చెబతున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. Video: No Hospital Stretcher, Elderly Man With Broken Leg Dragged On Cloth In Gwalior Hospital https://t.co/2NAOIfdZ6W pic.twitter.com/F0uWTMiPk3 — NDTV (@ndtv) March 25, 2023 (చదవండి: మీ ఛాతీపై బీజేపీ బ్యాడ్జి పెట్టుకోండి అంటూ విలేకరిపై రాహుల్ ఫైర్) -
మహాత్మాగాంధీ డిగ్రీ కూడా చేయలేదు! గవర్నర్ షాకింగ్ వ్యాఖ్యలు
భారత జాతీయ కాంగ్రెస్ మాజీ నాయకుడు మహాత్మాగాందీ ఎలాంటి డిగ్రీలు చేయలేదని జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సిన్హా గాల్వియర్లోని ఐటీఎం యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ..డిగ్రీ పోందడం విద్య కాదని చెబుతూ ఈ విధంగా వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీకి న్యాయశాస్త్రంలో డిగ్రీ లేదని, ఆయన ఏ ఒక్క యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేయలేదని చెప్పారు. గాంధీజీ చదువుకోలేదని ఎవరూ అనరు. అలా చెప్పరు కూడా. కానీ ఆయన కేవలం హైస్పూల్ డిప్లొమాలో మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఆయనకు ఎటువంటి డిగ్రీ లేదు. అయితే చాలామంది ఆయన న్యాయశాస్త్రంలో డిగ్రీ చేశాడనుకుంటారు కానీ ఆయన లా చేసేందుకు అర్హత సాధించాడే తప్ప డిగ్రీ లేదు. కానీ ఆయన ఎంత చదువుకున్నాడంటే దేశానికి జాతిపిత అయ్యేంతగా జ్ఞానాన్ని సముపార్జించాడు. డిగ్రీలు చేశామనే దర్పంలో మునిగిపోకండి. డిగ్రీ పొందడం చదువు కాదు. అలాగే మార్క్ట్వైన్ అనే కలం గురించి వినే ఉంటారు. ఆ కలంతో పుస్తకాలు రచించిన శామ్యూల్ లాంఘోర్న్ క్లెమెన్స్కు కూడా పెద్దగా చదుదుకోలేదు. కానీ అతను 12 ఏళ్ల వయసులోనే పాఠశాలను విడిచిపెట్టి పబ్లిక్ లైబ్రరీలలో చదువుకున్నాడన్నారు. కేవలం డిగ్రీలు చేస్తే అది విద్య కాదని తన ఎదుగదలకు, దేశ భవితవ్యానికి ఉపయోగపడేదే నిజమైన విద్య అని చ్పెపారు. అందుకు సబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. Modi’s representative in Kashmir says Mahatma Gandhi had no academic degree. These guys to justify Modi’s fake degrees can even insult Mahatma. Gandhi had a law degree from University College London. pic.twitter.com/kbkmATCBOP — Ashok Swain (@ashoswai) March 24, 2023 (చదవండి: ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ రోడ్డెక్కిన విపక్షాలు..ఢిల్లీలో ఉద్రిక్తత) -
ఏవండీ.. ఆవిడొచ్చింది! అంటే చెల్లుతుందా?
సినిమా వేరు.. నిజ జీవితం వేరు. సినిమాల్లో మాదిరి చేద్దామనుకుంటే చట్టాలు తొక్కిపడేస్తాయి. కాదని ముందుకు వెళ్తే.. కఠిన చర్యలకు, శిక్షలకు దారి తీస్తాయి. అలా చట్టాన్ని పట్టించుకోకుండా ముందుకు అడుగేసిన ఇద్దరు భార్యల ముద్దుల మొగుడి వాస్తవ గాథే ఇది. ఈవీవీ డైరెక్షన్లో వచ్చిన ఏవండి.. ఆవిడవచ్చింది చిత్రం గుర్తుందా? అందులో ఇద్దరు పెళ్లాల ముద్దుల భర్తగా సోగ్గాడు శోభన్బాబు, భార్యలుగా వాణిశ్రీ, శారదలు ప్రేక్షకులను అలరించారు. వారంలో చెరో మూడు రోజులు భార్యల దగ్గర.. మరో రోజు ప్రశాంతంగా తల్లిదండ్రుల దగ్గర గడిపే వెసులుబాటు ఉంటుంది ఆ సినిమాలో హీరోకి. కానీ, రియల్ లైఫ్లో అలా చేస్తామంటే కుదురుతుందా? అలాంటి పరస్పర ఒప్పందాలు చట్టప్రకారం చెల్లుతాయా? గురుగ్రామ్కు చెందిన ఓ ఇంజినీర్.. 2018లో గ్వాలియర్కు చెందిన ఓ మహిళను పెళ్లాడాడు. రెండేళ్లు కాపురం చేశారు వాళ్లు. అయితే.. కరోనా టైంలో(2020లో) వైరస్ భయానికి ఆమెను పుట్టింటికి పంపాడు. అయితే వైరస్ ఉధృతి తగ్గాక మళ్లీ ఈమెను తీసుకెళ్లేందుకు పోనేపోలేదు ఆ వ్యక్తి. రెండేళ్లపాటు రకరకాల సాకులు చెబుతున్న భర్త తీరుపై ఆమెకు అనుమానం కలిగింది. ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉన్నపళంగా ఒక్కతే గురుగ్రామ్కు వెళ్లింది. అలా వెళ్లిన ఆమెకు పెద్ద షాకే తగిలింది. కరోనా టైంలోనే ఆఫీస్లో ఓ కొలీగ్ అమ్మాయిని ప్రేమించి-పెళ్లి చేసుకోవడమే కాదు.. ఏకంగా ఆ టైంలో ఆమె ద్వారా ఓ బిడ్డను కూడా కనేశాడు ఆ ప్రబుద్దుడు. దీంతో ఆమె ఆఫీస్ వద్దే నిరసనకు దిగింది. ఆపై తనకు న్యాయం కావాలంటూ గ్వాలియర్లోని ఫ్యామిలీ కోర్టుకు ఆశ్రయించింది. దీంతో సమన్లు జారీ చేసిన ఫ్యామిలీ కోర్టు.. అతనికి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు యత్నించింది. అయినా కూడా రెండో భార్యను విడిచిపెట్టేందుకు అతను ససేమీరా అన్నాడు. దీంతో.. ఈసారి ఆ ఇద్దరు భార్యలను కూర్చోపెట్టి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ, వాళ్లు కూడా పరిస్థితిని అర్థం చేసుకోలేదు. చివరికి.. ఆ ముగ్గురు ఓ అండర్స్టాండింగ్కు వచ్చారు. వారంలో మూడు రోజులు ఒకరి దగ్గర, మూడు రోజులు మరొకరి దగ్గర గడపడం.. మిగిలిన ఆదివారం ఒక్కరోజును ఆ భర్త ఛాయిస్కు వదిలేశారు. ఇక ఒప్పందంలో భాగంగా.. ఇద్దరికీ ఉండేందుకు చెరో ఫ్లాట్ను ఇవ్వడంతో పాటు జీతం చెరిసమానంగా పంచాలని నిర్ణయించుకున్నాడు. అయితే.. ఈ ఒప్పందం చట్టప్రకారం చెల్లుబాటు కాదంటున్నారు వాళ్లకు కౌన్సెలింగ్ నిర్వహించిన న్యాయవాది హరీష్ దివాన్. ఇది పరస్పర అంగీకారంతో ముగ్గురు చేసుకున్న ఒప్పందం. ఇందులో కోర్టు పాత్రగానీ, కౌన్సిలర్ ప్రమేయంగానీ ఏమీ లేదు. ఈ ముగ్గురు హిందువులు. హిందూ చట్టాల ప్రకారం.. ఇలాంటి ఒప్పందం చెల్లదు. చట్టం ప్రకారం.. ఒక హిందువు ఒక భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాతే మరోకావిడను వివాహం చేసుకుంటేనే చెల్లుతుంది. కానీ, వీళ్లు తమ మానానా తాము ఒప్పందం చేసుకున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాళ్ల మీద చర్యలు ఉండొచ్చు అని చెప్పారు. -
అచ్చం అరవింద్ కేజ్రీవాల్లా..కానీ, చాట్ అమ్ముతూ..
మనుషులను పోలిన వాళ్లు ఏడుగురు ఉంటారని ఆర్యోక్తి. అది ఎంత వరకు నిజమో తెలియదు కానీ. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తిని చూస్తే మాత్రం ఆశ్చర్యపోక మానరు. అచ్చం ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ని పోలిన మరో వ్యక్తి చాట్ అమ్ముతూ కనిపించాడు. మద్యప్రదేశ్లోని గాల్వియర్లో కేజ్రీవాల్లా క్యాప్ ధరించి, ఆయన మాదిరి వేషధారణలో ఉన్నాడు. చూస్తే అరవింద్ కేజ్రీవాలే అని అనుకుంటారు. అంతలా ఉంది అతని వేషధారణ. అతను ఒక బిజీ రోడ్డుపై చాట్బండితో కనిపించాడు. తన మెనుని అక్కడే ఉన్న చెట్టుకి వేలాడదీశాడు. పైగా అతని వద్ద సమోసా, చాట్, గులాబ్ జామ్ వంటి అన్ని రకాల స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి. పైగా వాటి ధర కేవలం రూ. 10 నుంచి మొదలై రూ. 30 వరకు మాత్రమే ఉంది. తాను నాణ్యతను నమ్ముతానని, తన దగ్గర మంచి నాణ్యతతో లభించే ఆహార పదార్థాలే ఉంటాయని, ఇలాంటివి మరెక్కడ ఉండవని చెబుతున్నాడు. ఈ మేరకు విశాల్ శర్మ అనే ఫుడ్ బ్లాగర్ గాల్వియర్లో చాట్ అమ్ముతున్న కేజ్రీవాల్ అనే క్యాప్షన్ జోడించి మరీ వీడియోని ఇన్స్టాగ్రాంలో పోస్ చేశాడు. అంతేగాదు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఢిల్లీలో అన్ని ఉచితంగా ఇస్తే, ఈయన నాణ్యతను నమ్మతారు కాబోలు అని వీడియోలో చమత్కరించాడు. దీంతో నెటిజన్లు బహుశా అతని వ్యాపారానికి ప్రభుత్వ లైసెన్సు లభించొచ్చు అని ఒకరూ, చాలా తక్కువ ధరలో మంచి స్నాక్స్ అందిస్తున్నాడు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by vishal sharma (@foodyvishal) (చదవండి: వీడియో: బెంజ్ కారులో వచ్చి డబ్బులు నేలకేసి కొట్టాడు.. ఆమె ఏం చేసిందో చూడండి) -
సుఖోయ్, మిరాజ్ ఢీ.. పైలట్ మృతి
న్యూఢిల్లీ/భరత్పూర్/మొరెనా: భారత వైమానిక దళం(ఐఏఎఫ్)నకు చెందిన సుఖోయ్ 30ఎంకేఐ, మిరాజ్–2000 యుద్ధ విమానాలు ఢీకొన్న అరుదైన ఘటనలో ఒక పైలెట్ మృతి చెందారు. మరో ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్కు సమీపంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఐఏఎఫ్ బేస్గా ఉన్న గ్వాలియర్ విమానాశ్రయం నుంచి ఈ రెండు విమానాలు రోజువారీ సాధారణ శిక్షణలో భాగంగా బయలుదేరాయి. మొరెనా జిల్లా పహర్గఢ్ సమీపంలోని బహిరంగ ప్రదేశంలో అవి ప్రమాదవశాత్తు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఘటనలో సింగిల్ సీటర్ మిరాజ్–2000 పైలెట్ వింగ్ కమాండర్ హనుమంతరావు సారథి చనిపోగా ట్విన్ సీటర్ సుఖోయ్ ఫ్లయిట్లోని ఇద్దరు పైలెట్లు ఎజెక్ట్ అయి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మృతి చెందిన వింగ్ కమాండర్ శరీర భాగాలు పహార్గఢ్ ప్రాంతంలో లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. విమాన శకలాలు కొన్ని పొరుగునే ఉన్న రాజస్తాన్లోని భరత్పూర్ జిల్లాలోనూ పడిపోయాయి. దీనిపై ఐఏఎఫ్ దర్యాప్తునకు ఆదేశించింది. ఘటనకు సంబంధించిన వివరాలను ఐఏఎఫ్ చీఫ్ వీఆర్ చౌధరి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు వివరించారు. ఫ్లయిట్ డేటా రికార్డుల విశ్లేషణ అనంతరమే ఘటనకు దారి తీసిన కారణాలు తెలుస్తాయన్నారు. ఐఏఎఫ్ చరిత్రలో మిరాజ్, సుఖోయ్ ఢీకొనడం ఇదే తొలిసారి. దేశంలో గత 70 ఏళ్లలో ఇలాంటి 64 ప్రమాదాల్లో 39 మంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారని వైమానిక నిపుణుడు అంచిత్ గుప్తా తెలిపారు. -
దారుణం.. ప్రియుడితో కలిసి కన్నతల్లిని కడతేర్చిన కూతురు..
భోపాల్: యువకుని ప్రేమ మాయలో పడి కన్నతల్లినే కడతేర్చింది ఓ యువతి. ప్రియుడితో కలిసి ఆమెను దారుణంగా హత్య చేసింది. కత్తిపోట్లతో విరుచుకుపడి క్రూరంగా చంపేసింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ గ్వాలియర్లో ఆదివారం జరిగింది. నిందితురాలు మైనర్(17). ఆమె బాయ్ఫ్రెండ్ వయసు 25 ఏళ్లు. ఇద్దరినీ పోలీసులు సోమవారం అరేస్టు చేశారు. అయితే నిందితులిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అమ్మాయి తల్లి వీరిద్దరి రిలేషన్ను తీవ్రంగా వ్యతిరేకించింది. అతన్ని కలవొద్దని చెప్పింది. కానీ రెండు నెలల క్రితం ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది అమ్మాయి. ఆమె మైనర్ అయినందున తల్లిదండ్రులు కేసు పెట్టారు. దీంతో పోలీసులు ప్రియుడ్ని అరెస్టు చేశారు. అనంతరం అతడు బెయిల్పై విడుదలై మళ్లీ అమ్మాయిని తరచూ కలుస్తున్నాడు. దీంతో తల్లి హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే తన ప్రేమకు తల్లే అడ్డుపడుతోందని భావించిన అమ్మాయి ఆమెపై కక్ష పెంచుకుంది. పథకం పన్ని ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది. చివరకు కటకటాల పాలైంది. చదవండి: 'సమాజం ఎటుపోతుందో అర్థంకావట్లేదు.. ఆ కిరాతకులను ఉరి తీయాలి' -
చదివింది ఎనిమిదో తరగతి..డజను మంది మహిళలకు టోకరా
న్యూఢిల్లీ: ఎనిమిదో తరగతి చదివిన వ్యక్తి ఏకంగా డజను మంది మహిళలను మోసం చేసి లక్షల్లో డబ్బు కాజేశాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...వికాస్ గౌతమ్ అనే మధ్యప్రదేశ్లోని గాల్వియర్ నివాసి వికాస్ యాదవ్ అనే పేరుతో నకిలీ ఐపీఎస్ ఆఫీసర్గా ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్ ట్విట్టర్లలో ఐడీ క్రియేట్ చేశాడు. ఆఖరికి ప్రోఫైల్ పోటో కూడా ఒక గవర్నమెంట్ కారు పక్కన నిలబడి తీసుకున్న ఫోటోను పెట్టడంతో పలువురు సులభంగా అతని చేతిలో మోసపోయారు. ఈ మేరకు ఢిల్లీలోని సంజయ్ గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఒక మహిళ వైద్యురాలు ఆన్లైన్లో అతడితో ఒక రోజు చాటింగ్ చేసింది. ఆ తర్వాత అతడిపై నమ్మకం ఏర్పడటంతో తన వివరాలన్ని చెప్పింది. దీన్నే అవకాశంగా ఉపయోగించుకుని ఏకంగా రూ. 25 వేలు బ్యాంకు నుంచి డ్రా చేశాడు. దీన్ని గమనించిన సదరు మహిళా డాక్టర్ ఆ వ్యక్తిని ఫ్రాడ్గా భావించి పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకుంది. ఐతే ఆ వ్యక్తి తాను ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పడంతో రాజకీయనాయకుల అండదండ ఉండి ఉంటుందని భావించి తొలుత వెనక్కు తగ్గింది. ఎట్టకేలకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వికాస్ గౌతమ్ అరెస్టు అయ్యాడు. ఆ తర్వాత అతను విచారణలో డజను మంది మహిళల నుంచి లక్షల్లో డబ్బు కాజేసినట్టు తేలింది. అతను ఎనిమిదో తరగతి మాత్రమే చదివాడని, ఆ తర్వాత అతను ఇండస్ట్రీయల్ కోర్సు కూడా పూర్తి చేసినట్లు పోలీసులుల తెలిపారు. నిందితుడు వికాస్ ఢిల్లీలోని ముఖర్జీ నగర్లోని ఓ రెస్టారెంట్లో కూడా పనిచేసేవాడని తెలిపారు. అది సివిల్ కోచింగ్ సెంటర్లకు పేరుగాంచిన ప్రాంతం అని, అక్కడ కోచింగ్ తీసుకునే విద్యార్థులను చూసి ఈ నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ అవతారం ఎత్తాడని చెప్పారు. పోలీసులు వికాస్ నేర చరిత్రను తిరగదోడారు. అతడు గతంలో ఉత్తప్రదేశ్, గాల్వియర్లలో పలు ఆరోపణలపై జైలుకు కూడా వెళ్లినట్లు తెలిపారు. (చదవండి: ప్రపంచంతో కనెక్ట్ అవ్వాలంటే..హిందీతోనే వర్క్ ఔట్ అవ్వదు! రాహుల్ కీలక వ్యాఖ్యలు) -
షాకింగ్.. నాలుగు కాళ్లతో జన్మించిన శిశువు.. ఫొటో వైరల్..
భోపాల్: మధ్యప్రదేశ్ గ్వాలియర్లో ఆర్తి కుశ్వాహా అనే మహిళకు జన్మించిన ఆడ శిశువుకు నాలుగు కాళ్లున్నాయి. చిన్నారి 2.3 కేజీల బరువు ఉంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. కమ్లా రాజా ఆస్పత్రిలో ఆర్తి కుశ్వాహ బుధవారం ప్రసవించింది. అయితే పుట్టిన బిడ్డకు నాలుగు కాళ్లు ఉండటం చూసి వైద్యులు షాక్ అయ్యారు. విషయం తెలియగానే జయారోగ్య హాస్పిటల్ గ్రూప్ సూపరింటెండెంట్ డా.ఆర్కే ధాకడ్.. వైద్య బృందంతో వెళ్లి చిన్నారిని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. పుట్టుకతోనే శిశువుకు నాలుగు కాళ్లు ఉన్నాయి. ఆమెకు శారీరక వైకల్యం ఉంది. కొన్ని పిండాలు అదనంగా ఏర్పడుతాయి. దీనిని వైద్య శాస్త్ర భాషలో చెప్పాలంటే ఇస్కియోపాగస్ అంటారు. పిండం రెండు భాగాలుగా విభజించబడినప్పుడు శరీరం రెండు చోట్ల అభివృద్ధి చెందుతుంది. ఈ ఆడ శిశువు నడుము కింది భాగం రెండు అదనపు కాళ్లతో అభివృద్ధి చెందింది. కానీ ఆ కాళ్లు క్రియారహితంగా ఉన్నాయి. అని డా. ధాకడ్ వివరించారు. శిశువుకు ఇంకా వేరే శరీర భాగాల్లో వైకల్యం ఉందా? అని పరిశీలించిన అనంతరం ఆమె ఆరోగ్యంగా ఉంటే ఇన్యాక్టివ్గా ఉన్న రెండు కాళ్లను శస్త్ర చికిత్స చేసి తొలగిస్తామని ధాకడ్ చెప్పారు.అప్పుడు చిన్నారి సాధారణ జీవితాన్ని గడపవచ్చని పేర్కొన్నారు. చదవండి: లైంగిక వేధింపులు.. హెడ్ మాస్టర్ను కర్రలతో చితకబాదిన అమ్మాయిలు -
Viral Video: గుండెపోటు వచ్చిన వ్యక్తి ప్రాణాలు కాపాడిన మహిళా పోలీస్
భోపాల్: రోడ్డుపై గుండెపోటు వచ్చిన వ్యక్తికి సరైన సమయంలో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడింది మహిళా ఎస్ఐ. మధ్యప్రదేశ్ గ్వాలియర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. మహిళా పోలీస్ సమయస్ఫూర్తిని నెటిజన్లు కొనియాడుతున్నారు. మహిళా ఎస్ఐ పేరు సోనం పరషార్. రొటీన్ చెకింగ్లో భాగంగా రోడ్డుపై విధులు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఓ వ్యక్తి సడెన్గా గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే అతని వద్దకు వెళ్లిన సోనం.. అంబులెన్స్కు ఫోన్ చేసింది. అయితే అతడు తీవ్రంగా ఇబ్బందిపడటం చూసి సీపీఆర్ చేసింది. ఈలోగా అంబులెన్స్ వచ్చింది. హుటాహుటిన అతడ్ని అపోలో ఆస్పత్రికి తరలించారు. ग्वालियर: "राहगीर को आया हार्ट अटैक, लेडी पुलिस ने CPR दे बचाई जान।" लोग ट्रैफिक सूबेदार सोनम पराशर की कर रहे जमकर तारीफ।#gwalior #CPR #heartattack pic.twitter.com/qhrrSF2mwh — The Hint News (@TheHintNews) December 13, 2022 అయితే సదరు వ్యక్తికి సరైన సమయంలో సీపీఆర్ చేసి ఉండకపోతే ప్రాణాలు కాపాడటం చాలా కష్టం అయ్యేదని వైద్యులు తెలిపారు. అతని పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. చదవండి: శ్రద్ధ వాకర్ తరహా ఘటన..తండ్రిని చంపి 32 ముక్కలు చేసిన కుమారుడు -
స్నేహం ముసుగులో మైనర్పై అత్యాచారం, లైవ్ స్ట్రీమింగ్
గ్వాలియర్: మధ్యప్రదేశ్లో అమానుషం దారుణం చోటుచేసుకుంది. గ్వాలియర్ నగరంలో స్నేహం ముసుగులో ఇద్దరు యువకులు ఓ పదహారేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. అంతేగాక లైంగిక దాడికి సంబంధించిన దృశ్యాలను తమ మిత్రునికి లైవ్లో స్ట్రీమ్ చేసి రాక్షస ఆనందం పొందారు. ఏడాదిగా బాలికపై అత్యాచారానికి ఒడిగడుతున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించడంతో బాలిక భయపడిపోయింది. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితమే బాధితురాలికి మరో వ్యక్తితో నిశ్చితార్థమైంది. దీనిని అదునుగా భావించిన నిందితులు అత్యాచార వీడియోను సదరు వ్యక్తికి పంపించారు. దీంతో పెళ్లి రద్దు అయ్యింది. బాలిక తల్లిదండ్రులు తన కూతురికి జరిగిన అన్యాయంపై ఝాన్సీ రోడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా మొదటగా 2021 జూన్ 2న ఓ హోటల్కు తీసుకెళ్లి తనపై అఘాయిత్యం చేశారని బాలిక ఫిర్యాదులో పేర్కొంది. లైంగికదాడి సందర్భంగా తీసుకున్న ఫొటోలు, వీడియోలను తర్వాత వాళ్లు సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారని తెలిపింది. అంతేగాక ఈ విషయం బయటకు చెబితే తన తండ్రిని, సోదరుడిని చంపేస్తామని బెదిరించినట్లు తెలిపింది. శుక్రవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. చదవండి: ప్రియురాలికి వేరొకరితో నిశ్చితార్థం.. మాట్లాడాలని పిలిచి మూడు రోజులు.. -
భార్య దారుణంగా మోసం చేసిందన్న భర్త.. ఇదొక విచిత్రమైన కేసు!
పెళ్లయిన కొత్తలోనే భర్తకు భార్య, భార్యకు భర్త షాకిచ్చిన ఉదంతాలు, మోసపోయిన కథనాల గురించి వినే ఉంటారు. అయితే ఇక్కడో భర్త.. భార్య మీద అనూహ్యమైన ఆరోపణలకు దిగాడు. తన భార్య అసలు ఆడదే కాదని.. తనను మోసం చేసి అంటగట్టారంటూ వైద్య నివేదికలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తన భార్యకు పురుషాంగం ఉందని.. తనను మోసం చేసి పెళ్లి చేశారంటూ ఓ వ్యక్తి ఏకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని బెంచ్ తొలుత ఈ పిటిషన్ స్వీకరించేందుకు తొలుత నిరాకరించింది. అయితే వైద్య పరీక్షల రిపోర్టులన్నీ పరిశీలించాక.. శుక్రవారం సదరు యువతితో పాటు ఆమె తల్లిదండ్రులకు నోటీసులు పంపింది. నాలుగు వారాల్లోగా నోటీసులపై స్పందించాలని ఆదేశించింది. తొలి రాత్రే షాక్.. మధ్యప్రదేశ్ గ్వాలియర్కు చెందిన వ్యక్తికి 2016లో వివాహం జరిగింది. ఆ తర్వాత చాలాకాలం పాటు ఆ అమ్మాయి కార్యానికి సహకరించలేదు. పీరియడ్స్, ఆరోగ్యం బాగోలేదంటూ వాయిదా వేస్తూ పోయారు అమ్మాయి తరపు ఇంటివాళ్లు. చాలా కాలం ఓపిక పట్టిన ఆ యువకుడు.. చివరకు తన తల్లిదండ్రులను రంగంలోకి దించి.. ఓ ముహూర్తం ఖరారు చేసుకున్నాడు. చివరకు ఆ రాత్రి.. భార్యకు పురుషాంగం ఉందంటూ రచ్చ చేశాడు. తాను మోసపోయానని, అమ్మాయిని కాకుండా అబ్బాయిని తనకు కట్టబెట్టారని ఆ రాత్రే పెద్దలను పిలిచి పంచాయితీ పెట్టాడు. జెనెటిక్ లోపం.. Imperforate Hymen ఇంపర్ఫోరేట్ హైమన్.. ఇదొక జెనెటిక్ లోపం. పుట్టుకతో అండాశయాలతో స్త్రీగానే ఉన్నా.. బాహ్యంగా మాత్రం పురుషాంగం చిన్నసైజు పరిమాణంలో ఉంటుందని డాక్టర్లు తెలిపారు.ఆ అమ్మాయికి అదే సమస్య ఉంది. ఇది సర్జరీతో సరి చేయొచ్చు. కానీ, పిల్లలు పుట్టే అవకాశాలు చాలా చాలా తక్కువ!. ఆ యువతిని పరిశీలించిన వైద్యులు ఈ విషయమే ఆమె భర్తకు చెప్పారు. పుట్టుకతో వచ్చిన అడ్రినల్ హైపర్ప్లాసియా అనే జన్యుపరమైన రుగ్మతగా వెల్లడించారు. ఈ విషయం తెలిశాక.. ఆ యువతిని ఆ వ్యక్తి పుట్టింటికి పంపించేశాడు. సర్జరీ చేయించి.. తిరిగి ఆమె భర్త ఇంట్లో దిగబెట్టి వెళ్లాడు ఆమె తండ్రి. అయితే మోసం చేసి వివాహం చేయడం, పిల్లలు పుట్టే అవకాశాలు లేకపోవడంతో విడాకులకు పట్టుబట్టాడు ఆ యువకుడు. దీంతో బెదిరింపులకు దిగింది ఆ యువతి కుటుంబం. ఈ క్రమంలోనే.. సదరు వ్యక్తి స్థానిక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాడు. విచారణ కొనసాగుతున్న సమయంలో ట్రయల్ కోర్టు సదరు యువతికి నోటీసు జారీ చేసింది. అయితే మధ్యప్రదేశ్ హైకోర్టు మాత్రం.. ఆ వ్యక్తి ఆరోపణలకు తగిన ఆధారల్లేవంటూ కేసును కొట్టేసింది. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించిన యువకుడు.. న్యాయం కోరుతున్నాడు. ఈ నేపథ్యంలో.. భర్త ఆరోపణలపై స్పందించాలంటూ ఆ యువతికి.. సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
‘ఐటెం సాంగ్’ ఆరోపణలు.. మహిళా జడ్జికి భారీ ఊరట
హైకోర్టు న్యాయమూర్తి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఐటెం సాంగ్కు చిందులేయాని బలవంతం చేశారని ఆరోపించిన దిగువ స్థాయి కోర్టు న్యాయమూర్తికి ఊరట లభించింది. మధ్యప్రదేశ్లో జరిగిన ఈ ఘటన ‘న్యాయవ్యవస్థలో ఐటెం సాంగ్ మరక’గా దేశవ్యాప్తంగా ప్రచారం అయ్యింది. అయితే ఈ ఉదంతంలో 2014లో రాజీనామా చేసిన ఆమెను.. తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఈరోజు మధ్యప్రదేశ్ హైకోర్టుకు తెలిపింది. 2014లో సదరు మహిళా న్యాయమూర్తి బలవంతంగా రాజీనామా చేయవలసి వచ్చిందని, ఆ కారణంతో ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని గురువారం ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. రాజీనామాను స్వచ్చంద విరమణ కింద పరిగణించకూడదంటూ కోర్టు మధ్యప్రదేశ్ హైకోర్టుకు సూచించింది. అంతేకాదు మధ్యప్రదేశ్ హైకోర్టు ఆమోదించిన ఆమె రాజీనామాను కొట్టేస్తున్నట్లు జస్టిస్ గవాయ్ తెలిపారు. ఏం జరిగిందంటే.. జూలై 2014లో, అదనపు జిల్లా న్యాయమూర్తి అయిన ఆమె.. హైకోర్టు జడ్జి నుంచి తనకు జరిగిన వేధింపుల ఎదురవుతున్నాయని ఆరోపణలకు దిగింది. ఈ వేధింపులపై రాష్ట్రపతి, సుప్రీం ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయశాఖ మంత్రికి లేఖలు రాసింది. ఆ తర్వాత ఆమె గ్వాలియర్లోని అదనపు జిల్లా న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసేసింది. ఓ ఐటెం సాంగ్లో తనను డ్యాన్స్ చేయాలని హైకోర్టు జడ్జి తనను కోరినట్లు లేఖలో ఆరోపించిందామె. అంతేకాదు సుదూర ప్రదేశానికి తనను బదిలీ చేయడాన్ని న్యాయమూర్తి ప్రభావితం చేశారని ఆమె ఆరోపించింది. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. దీంతో సదరు జడ్జికి సుప్రీం నోటీసులు కూడా జారీ అయ్యాయి. అంతేకాదు లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ కోసం రాజ్యసభ తరపున ఒక ప్యానెల్ నియమించారు. ఈ ప్యానెల్ గత ఏడాది డిసెంబర్లో నివేదిక ఇస్తూ.. సదరు హైకోర్టు న్యాయమూర్తికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఫిర్యాది మహిళను వేధించడానికి న్యాయమూర్తి తన పదవిని దుర్వినియోగం చేశారనే అభియోగంలో ఎటువంటి ఆధారం లేదని ప్యానెల్ తెలిపింది. ఈ పరిణామాల తర్వాత.. ఆరోపణలు చేసిన మహిళ.. తనను తిరిగి విధుల్లోకి చేర్చుకోవడాన్ని పరిశీలించాలని ఆమె న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయితే హైకోర్టులో ఆమెకు చుక్క ఎదురు కాగా.. ఇప్పుడు సుప్రీం కోర్టులో భారీ ఊరట దక్కింది. -
విపత్కర సమయంలో సేవలందించిన పైలెట్కి దిమ్మతిరిగే షాక్ !
మాములుగా ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడూ పొరపాటున మన ముందున్న వాహనాన్ని ఢీ కొట్టిన అంత పెద్దమొత్తంలో జరిమాన పడదు. కానీ విమానం ల్యాండింగ్ చేసే సమయంలో దేన్నైనా ఢీ కొడితే కళ్లు తిరిగేలా ఎక్కువ మొత్తంలో జరిమాన విధిస్తారు. అచ్చం అలాంటి సంఘటన గాల్వియర్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే... మధ్యప్రదేశ్లోని గాల్వియర్ విమానాశ్రయంలో పైలెట్లు కరోనా మహమ్మారీ సమయంలో అపారమైన సేవలందించి కోవిడ్ యోధులుగా పేరుతెచుకున్నారు. అలాంటి యోధులలో ఒకడైన పైలెట్ మజిద్ అక్తర్ తన కో పైలెట్ మే 6, 2021న బీచ్ క్రాఫ్ట్ కింగ్ ఎయిర్ B 250 GT అనే విమానం గాల్వియర్ రన్వే పై క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. అంతేకాదు కరోనా బాధితులకు సంబంధించిన 71 రెమ్డిసివిర్ బాక్స్లను అహ్మదాబాద్ నుండి గ్వాలియర్కు తీసుకువెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ ప్రమాదంలో పైలట్ మాజిద్ అక్తర్, కో-పైలట్ శివ్ జైస్వాల్, నాయబ్ తహసీల్దార్ దిలీప్ ద్వివేది సహా ముగ్గురు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కానీ విమానయాన సంస్థ మాత్రం విమానానికి నష్టం కలిగించినందుకు గానూ ఫైలెట్ మజిద్ అక్తర్కి దాదాపు రూ.85 కోట్ల బిల్లుని కట్టాల్సిందిగా తెలిపింది. అంతేకాదు ఈ విమానాలు దెబ్బతినడం వల్ల ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి విమానాలను కొనుగోలు చేయాల్సి వస్తుందంటూ ..సుమారు 60 కోట్లు ఖరీదు చేసే ఆ విమానానికి అదనంగా రూ 25 కోట్లు జోడించింది. దీంతో మజిద్ విమానానికి ఇన్సూరెన్స్ చేయకుండా ఎలా ఆపరేట్ చేయడానికి అనుమతించారని ప్రశ్నించాడు. అంతేకాదు ప్రమాదం ఎలా జరిగిందో కూడా తనకు తెలియదన్నాడు. అయినా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ) కూడా తనకు ల్యాడింగ్ అయ్యేటప్పుడూ ఎటువంటి సూచనలు తెలియజేయాలేదని ఆరోపించాడు. ఈ మేరకు భారతదేశ పౌర విమానయాన నియంత్రణ సంస్థ అక్తర్ ఫ్లయింగ్ లైసెన్స్ను ఒక ఏడాదిపాటు నిషేధించింది. అంతేకాదు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. అయితే ఇన్సూరెన్స్ ప్రోటోకాల్ని అనుసరించకుండా విమానాన్ని ఎలా అనుమతించారనే దానిపై ప్రభుత్వం మౌనం వహించడం గమనార్హం. ఈ క్రమంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణ పూర్తైయ్యేవరకు అతని నేరస్తుడిగా పరిగణించకూడదని పేర్కొంది. (చదవండి: మా ఎంపిక సరైనదే అంటూ చైనా కొత్త పల్లవి) -
వృద్ధురాలి కాళ్లుపట్టుకుని మంత్రి క్షమాపణ! ఏం జరిగిందంటే..
కూరగాయలు అమ్ముకొని జీవించే బామ్మకు ఓ మంత్రి క్షమాపణలు చేప్పారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు విషయం ఏమిటంటే.. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ నగరంలో రోడ్డుపై రద్దీ పెరుగుతున్న కారణంగా స్థానికంగా ఉండే ఓ కూరగాయల మార్కెట్ను అధికారులు మరోచోటుకి తరలించబోయారు. ప్రస్తుత మార్కెట్ను పరిశీలించడానకి అక్కడికి రాష్ట్ర ఇంధన వనరులశాఖ మంత్రి ప్రద్యుమ్న సింగ్ వచ్చారు. మంత్రిని చూసిన బాబినా బాయ్ అనే కూరగాయలు అమ్ముకునే వృద్ధురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు ఉపాధి కలిగించే మార్కెట్ను మరో చోటుకు తరలించడంపై ఆమె కన్నీరు పెట్టుకుంది. అయితే ఆమెను శాంతింపజేయడానకి మంత్రి.. రోడ్డు, మార్కెట్ పరిస్థితిని వివరించాడు. అంతటితో ఆగకుండా కూరగాయలు అమ్ముకునే వారికి కలిగిస్తున్న అసౌకర్యానికిగాను ఆమె కాళ్లు పట్టుకొని క్షమించమని అడిగారు. మార్కెట్ తరలింపు వల్ల ఇబ్బంది పెడుతున్నామని.. ఆమె చేతులు పట్టుకొని చెంపలపై కొట్టించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వృద్ధురాలికి మంత్రి క్షమాపణ చేప్పి.. తన గొప్ప మనసు చాటుకున్నారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. -
మిమ్మల్ని ఉరితీస్తా,ఉద్యోగులకు కలెక్టర్ వార్నింగ్
ఓ జిల్లా కలెక్టర్ తన నోటికి పనిచెప్పారు. వ్యాక్సినేషన్ డ్రైవ్లో ఉద్యోగులు అలసత్వం ప్రదర్శిస్తే ఉరితీస్తామని బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు. భారత్లో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ సమాచారం ప్రకారం.. బుధవారం సాయంత్రం నాటికి దేశంలో మొత్తం 68 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అన్నీ రాష్ట్రాల ప్రభుత్వాలు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేస్తున్నాయి. During a meeting on #CovidVaccine when Gwalior collector Kaushlendra Vikram Singh came to know that the COVID-19 vaccination target was not achieved. He said "There shouldn't be a delay of even a single day. If it happens, 'phasi pe tang dunga'@ndtv@ndtvindia pic.twitter.com/n9fOXovRa8 — Anurag Dwary (@Anurag_Dwary) December 15, 2021 తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించింది. ఈ డ్రైవ్లో ఉద్యోగులు అనుకున్నంత స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో విఫలమయ్యారు. ఈ సందర్భంగా గ్వాలియర్ జిల్లా కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ భితర్వార్ రెవెన్యూ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కౌశలేంద్ర ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ ఒక్కరోజు కూడా ఆలస్యం కాకూడదు. అలా చేస్తే మిమ్మల్ని ఉరితీస్తా. వ్యాక్సిన్ వేయించుకునేలా ప్రజలతో మాట్లాడండి. వ్యవసాయ క్షేత్రాల్లో తిరగండి. బ్రతిమలాడండి. వ్యాక్సినేషన్ మాత్రం పూర్తిగా జరిగేలా చూడండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యల వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. వైరలతున్న వీడియోలపై కలెక్టర్ కౌశలేంద్ర స్పందించారు. ఉద్యోగుల గురించి తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, వ్యాక్సినేషన్ టార్గెట్ కంప్లీట్ చేయకపోవే సస్పెండ్ చేస్తానని మాత్రమే తాను హెచ్చరించినట్లు వెల్లడించారు. -
చాట్ అమ్ముతూ కేజ్రీవాల్ !.. తీరా చూస్తే అసలు కథ వేరే..
ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఉంటారని అంటుంటారు. ఈ విషయంలో సాధారణ ప్రజలకు డూపుల కన్నా సెలబ్రిటీల డూపుల ఫోటోలు మాత్రం సోషల్మీడియాలో ఓ రేంజ్లో హల్చల్ చేస్తుంటాయి. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్లా ఉన్న వ్యక్తి ఫోటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్గా మారింది. ప్రస్తుతం ఆ వ్యక్తి ఎక్కడున్నాడంటే....! వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ గ్వాలియర్లోని ఫూల్ బాగ్ ఏరియాలో మోతీ మహల్ ముందు గుప్తా చాట్ పేరుతో ఓ వ్యక్తి స్టాల్ను నిర్వహిస్తున్నాడు.ప్రస్తుతం అతను సెలబ్రిటీలా మారిపోయాడు. ఎందుకుంటే అతను అచ్చం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను పోలి ఉన్నాడు కాబట్టి. తన స్టాల్లో.. రుచికరమైన చాట్తో పాటు స్వీట్లకు అది ఫేమస్. ఇటీవల ఫుడ్ బ్లాగర్ నడుపుతున్న ఓ వ్యక్తి ఈ గుప్తా చాట్ నిర్వాహకుడిని వద్దకు వస్తాడు. చాట్ నిర్వాహకుడు సీఎం కేజ్రీవాల్లా ఉండటంతో చూసి అతను ఆశ్చర్యపోతాడు.(చదవండి: Viral Video: బాబోయ్ ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. తల్లి మెడకు సైకిల్ లాక్ వేసి..) ఇంకేముంది షాక్ నుంచి తేరుకుని అతన్ని సంప్రదించి తను చేసే వంటని వీడియోగా చిత్రీకరించి యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. సెలబ్రిటీ అందులోనా దేశరాజధానికి సీఎంను పోలి ఉండడంతో అది వైరల్గా మారి నెట్టింట దూసుకుపోతుంది. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు సడెన్గా చూసి కేజ్రీవాల్ చాట్ అమ్మడమేంటని అనుకున్నా..తీరా చూస్తే తెలిసింది అతను డూప్లికేట్ కేజ్రీవాల్ అంటూ కామెంట్స్ చేశాడు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ఈ డూప్లికేట్ కేజ్రీవాల్ను ఒక్కసారైనా కలవాలి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. చదవండి: Funny Video: ఏయ్ నిన్నే.. పిలుస్తుంటే పట్టించుకోవా.. పంతం నెగ్గించుకున్న పిల్ల ఏనుగు -
విషాదం: స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లలో అపశ్రుతి
భోపాల్ (మధ్యప్రదేశ్): దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర సంబరాలు రేపు అంబరాన్నంటనున్నాయి. రేపటి ఉత్సవాల కోసం శనివారం ఏర్పాట్లు శరవవేగంగా సాగుతున్నాయి. ఈ పనుల్లో అపశ్రుతి దొర్లి ముగ్గురు మున్సిపల్ సిబ్బంది మృతి చెందిన సంఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఆ రాష్ట్రంలో విషాదం అలుముకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గ్వాలియర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చారిత్రక నేపథ్యం ఉన్న మహారాజా బడా తపాలా కార్యాలయం (పోస్టాఫీస్) భవనంపై జెండా ఏర్పాటు చేస్తున్నారు. హైడ్రాలిక్ ఫైర్ బ్రిగేడ్ ట్రాలీతో భవనంపైకి ఎక్కిన సిబ్బంది జెండా ఏర్పాటు చేస్తుండగా ఒక్కసారిగా క్రేన్ విరిగిపడింది. దీంతో ట్రాలీ అదుపు తప్పి ఆ నలుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన స్థలంలోనే ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయాలతో ఆస్పత్రిలో చేరారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మిగతా ఇద్దరిదీ నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. జాతీయ పండుగ ఏర్పాట్లలో విషాదం అలుముకోవడంపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి తులసీరామ్ సిలావత్ ప్రకటించారు. ఈ ప్రమాదంపై విచారణ చేపట్టాలని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కమల్నాథ్ డిమాండ్ చేశారు. -
ప్రిన్సిపల్ అయితే నాకేంది? బడిలో అనుకోని అతిథి పెత్తనం
భోపాల్: మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ కొంత శాంతించడంతో పలు రాష్ట్రాల్లో కొన్ని జాగ్రత్తలు, ఆంక్షల నడుమ విద్యాలయాలు తెరుచుకుంటున్నాయి. కొన్ని నెలల తర్వాత తెరుచుకోవడంతో పాఠశాలలు అధ్వానంగా మారాయి. కొన్నిచోట్ల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. వాటిని పాఠశాల సిబ్బందితో కలిసి విద్యార్థులు కూడా శుభ్రం చేశారు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్లోనూ విద్యాలయాలు తెరుచుకున్నాయి. అయితే ఓ పాఠశాలలో తలుపులు తెరవగానే ప్రిన్సిపల్ భయపడ్డాడు. తన కుర్చీలో అనుకోని అతిథి ప్రత్యక్షమవడంతో ఖంగు తిన్నాడు. మధ్యప్రదేశ్లో 11, 12వ తరగతులు కూడా సోమవారం (జూలై 26వ తేదీ) నుంచి ప్రారంభమయ్యాయి. గ్వాలియర్ జిల్లాలోని డబ్రాలో పాఠశాల తెరవగానే కోతులు ప్రత్యక్షమయ్యాయి. తరగతి గదుల్లో అవి విద్యార్థుల్లాగా కూర్చున్నాయి. నానా హంగామా చేశాయి. ఇక ప్రిన్సిపల్ తన గది తెరవగా అక్కడ కూడా వానరాలు బీభత్సం సృష్టించాయి. ప్రిన్సిపల్ కుర్చీలో కూర్చుని ప్రిన్సిపల్నే భయపెట్టాయి. విద్యార్థులు కూడా భయపడడంతో ప్రిన్సిపల్ ఏం చేయాలో పాలుపోలేదు. ఇంతలో కొందరు ఉపాధ్యాయులు, విద్యార్థులు ధైర్యం చేసి వాటిని అక్కడి నుంచి వెళ్లగొట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్గా మారాయి. -
పెళ్లయి 3 నెలలు: యాసిడ్ తాగించిన భర్త.. సీఎంకు ఫిర్యాదు
గ్వాలియర్ (మధ్యప్రదేశ్): పెళ్లయి మూడు నెలలు కూడా కాలేదు అదనపు కట్నం వేధింపులు తీవ్రమయ్యాయి. భర్తతో పాటు వదిన కూడా హింసించడం మొదలుపెట్టింది. వారి ఆగడాలు శ్రుతిమించి ఆ నవ వధువుపై క్రూరంగా ప్రవర్తించారు. వారిద్దరూ కలిసి ఆ అబల నోటిలో యాసిడ్ పోశారు. అనంతరం అగ్గి పెట్టారు. దీంతో ఆమె తట్టుకోలేకపోయింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరింది. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో కొన ఊపిరి మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆమె జీర్ణాశయం మొత్తం దెబ్బతింది. ఈ ఘటన విషయం తెలుసుకున్న మహిళా కమిషన్ ఏకంగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్కు ఢిల్లీ మహిళా కమిషన్ ఫిర్యాదు చేయడంతో బహిర్గతమైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్వాలియర్లోని డబ్రా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో యువతికి (25) ఈ సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన వివాహమైంది. పెళ్లయిన కొన్ని రోజులకే అత్తింటి వారు వేధింపులు మొదలుపెట్టారు. అదనంగా కట్నం తీసుకురావాలని ఆమెపై నిత్యం వేధిస్తున్నారు. భర్త శారీరకంగా తీవ్రంగా హింసించేవాడు. అతడికి తోడుగా అతడి సోదరి కూడా చేరి ఆమెకు నరకం చూపించారు. జూన్ 3వ తేదీన వారి ఆగడాలు శ్రుతిమించాయి. ఆ యువతిని తీవ్రంగా కొట్టి భర్త, వదిన కలిసి యాసిడ్ తాగించారు. అంతటితో ఊరుకోకుండా అగ్గి పెట్టారు. వాటి దెబ్బకు ఆమె తాళలేక అరుపులు, కేకలు వేసి నరకం అనుభవించింది. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా ప్రాథమిక చికిత్స అనంతరం ఢిల్లీలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో నరకయాతన అనుభవిస్తూ జీవిస్తోంది. యాసిడ్ ప్రభావంతో జీర్ణాశయం పూర్తిగా దెబ్బతింది. కడుపు ముందరి భాగం పూర్తిగా కాలిపోయింది. దీంతో వైద్యులు అతికష్టంగా ఆమెకు తినిపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్, సభ్యురాలు ప్రమీలా గుప్తా బాధితురాలిని పరామర్శించారు. జరిగిన విషయం తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ దారుణంపై మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ సహించలేకపోయారు. వెంటనే ఆమె వివరాలు, ఫొటోలను తీసుకుని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ఫిర్యాదు చేశారు. ఘటన వివరాలు తెలుపుతూ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ నమోదై నెల దాటినా ఇంకా నిందితులను అరెస్ట్ చేయలేదని గుర్తుచేశారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాధితురాలి దీనస్థితిని ముఖ్యమంత్రికి లేఖలో వివరించారు. दिल्ली महिला आयोग की अध्यक्षा @SwatiJaiHind और मेंबर @promilagupta24 ने दिल्ली के एलएनजेपी अस्पताल पहुंचकर ग्वालियर की एसिड अटैक सर्वाइवर से मुलाकात की। https://t.co/bv7yg8xopK pic.twitter.com/vGmLWGcV39 — Delhi Commission for Women - DCW (@DCWDelhi) July 20, 2021 -
ఫ్యామిలీ గ్రూప్లో నగ్న చిత్రాలు.. కాపురంలో చిచ్చు
ఫోన్ పోతే లైట్ తీసుకునేవాళ్లకు ఒక అలర్ట్ లాంటిది ఈ ఘటన. ఫోన్ చోరీకి గురైందని పట్టించుకోకుండా ఉండిపోయింది ఆమె. అయితే నెలరోజుల తర్వాత ఆమె వాట్సాప్ నుంచే ఫ్యామిలీ గ్రూప్లో ఆమెవేనంటూ నగ్న ఫొటోలు, అశ్లీల వీడియోలు షేర్ చేశాడు ఆ దొంగ. అంతేకాదు పని చేసే చోట ఆమె ఎఫైర్లు పెట్టుకుందంటూ ఆమె భర్తకే కాల్ చేసి చెప్పాడు. కాపురంలో చిచ్చు పెట్టిన ఫోన్ చోరీ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. భోపాల్: గ్వాలియర్కు చెందిన మహిళ(28) స్థానికంగా ఆస్పత్రిలో నర్స్గా పనిచేస్తోంది. నెల క్రితం ఫోన్ పోగా.. ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆపై కొత్త ఫోన్ కొనుక్కుని వాడుకుంటోంది. పది రోజుల కిందట కుటుంబ సభ్యులకు, ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో ఆమె నగ్న చిత్రాలు, అశ్లీల దృశ్యాలు షేర్ అయ్యాయి. అవి చూసి ఆమె కంగుతింది. తన ప్రమేయం లేకుండా తన వాట్సాప్ నుంచే అవి పోస్ట్కావడంతో భయపడింది. ఈలోపు ఆమె భర్తకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ప్రతీకాత్మక చిత్రం ఖంగుతిన్న భర్త ఆమె పనిచేస్తున్న ఆస్పత్రిలో మేల్ స్టాఫ్తో శారీరక సంబంధం పెట్టుకుందని, అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తన దగ్గర ఉన్నాయని ఆ ఆగంతకుడు ఆమె భర్తకి ఫోన్లో చెప్పాడు. అంతటితో ఆగకుండా కొన్ని పంపాడు కూడా. దీంతో ఆమె భర్త షాక్ తిన్నాడు. నిలదీయడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ మొత్తం వ్యవహారంతో పరువు పొగొట్టుకున్న ఆ యువతి.. మహరాజ్పుర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రతీకాత్మక చిత్రం అవి మార్ఫింగ్వి! కాగా, తనవని ప్రచారం జరుగుతన్న ఫొటోలు, వీడియోలు ఎవరో మార్ఫ్ చేసినవని ఆమె వాపోయింది. ఈ మేరకు మీడియా ముందుకు వచ్చిన ఆమె.. వాటిని షేర్ చేయొద్దని ప్రజలకు రిక్వెస్ట్ చేసింది. ఈ విషయంలో భర్త కుటుంబంతో రాజీ చర్చలు జరుపుతున్నామని ఆమె బంధువు ఒకరు తెలిపారు. కాగా, వేధింపులు, బ్లాక్మెయిలింగ్ నేరాల కింద కేసు నమోదు చేసుకున్న మహరాజ్పుర పోలీసులు.. సైబర్ క్రైమ్ వింగ్సాయంతో కేసును చేధించి నిందితుడిని పట్టుకునే పనిలో పడ్డారు. -
గ్వాలియర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
భోపాల్: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో సుమారు 10 మంది మృతి చెందారు. గ్వాలియర్ పూరాణి చవానీ ప్రాంతంలో ఈ ప్రమాదంలో చోటు చేసుకుంది. వివరాలు.. మంగళవారం తెల్లవారుజామున కూలీలతో వెళ్తున్న ఆటో, బస్సును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు 10 మంది మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద ధాటికి ఆటో నుజ్జు నుజ్జు అయ్యి ఐరన్ ముద్దలా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలకు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిటీ ఎస్పీ మాట్లాడుతూ.. ‘‘ఆటో రిక్షా ఓవర్లోడ్తో వెళ్తోంది. ఆటోలో సుమారు 13 మంది మహిళలే ఉన్నారు. వీరంతా ఓ ఫంక్షన్లో వంట చేయడానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో మొరేనా నుంచి స్పీడ్గా వస్తోన్న బస్ ఆటోని ఢీకొట్టింది. దాంతో ప్రమాదం చోటు చేసుకుంది’’ అని తెలిపారు. చదవండి: తలపై నుంచి దూసుకెళ్లిన బస్సు చక్రం -
మధ్య ప్రదేశ్ గ్వాలియర్ లో ఘోర రోడ్డు ప్రమాదం
-
షాకింగ్: జ్యోతిరాదిత్య సింధియా ప్యాలెస్లో చోరీ
భోపాల్: బీజేపీ ఎంపీ, గ్వాలియర్ రాచ వంశానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియాకు చెందిన ప్యాలెస్లో దొంగలు చోరీకి యత్నించినట్లు తెలిసింది. వివరాలు.. సింధియాకు చెందిన మధ్యప్రదేశ్ జై విలాస్ ప్యాలెస్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. స్థానిక పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘సోమవారం లేదా మంగళవారం అర్ధరాత్రి సమయంలో దొంగలు వెంటిలేటర్ బద్దలు కొట్టి జై విలాస్ ప్యాలెస్లోని రాణి మహల్లోకి ప్రవేశించేందుకు యత్నించినట్లు గుర్తించాం’’ అన్నారు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందం ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలు సేకరించే పనిలో ఉన్నారు. స్నిఫర్ డాగ్స్ కూడా రంగంలోకి దిగాయి. ఎంతమంది ఈ దొంగతనానికి ప్రయత్నించారు.. ఏమేం చోరీ చేశారు అనే దాని గురించి పోలీసులు ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. గ్వాలియార్ సిటీ ఎస్పీ రత్నేష్ తోమర్ మాట్లాడుతూ.. ‘‘దొంగలు ప్యాలెస్లోని రాణి మహల్లోని ఓ గది వెంటిలేటర్ని బద్దలు కొట్టి లోనికి ప్రవేశించారు. ప్యాలెస్లో గతంలో బ్యాంక్ విధుల కోసం వినియోగించిన గదిలోని వస్తువులను ధ్వంసం చేశారు’’ అని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇక్కడ పని చేస్తున్న సిబ్బందిని విచారిస్తున్నట్లు తెలిపారు. స్నిఫర్ డాగ్తో ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు జై విలాస్ ప్యాలెస్ని 19వ శతాబ్దంలో జయరావ్ సింధియా నిర్మించారు. 1874 ప్రాంతంలో ఆయన గ్వాలియర్ మహారాజుగా ఉన్నపుడు ఈ ప్యాలెస్ను నిర్మించారు. ప్రస్తుతం ఇది జ్యోతిరాదిత్య సింధియాకు సొంతం అయ్యింది. చదవండి: ‘నా చుట్టూ గద్దలు తిరుగుతున్నాయి’ రూ.90 లక్షల ప్లాట్ కొని.. సొరంగం తవ్వి! -
సింథసైజర్ వాయిస్తుండగా బ్రెయిన్ సర్జరీ
భోపాల్: ఇంజక్షన్ పేరు చెబితే చాలు చిన్నారులతో సహా పెద్దలు కూడా కొందరు భయపడతారు. అలాంటిది సర్జరీ అంటే.. ఇక ఎంత భయం, ఆందోళన ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ధైర్యవంతుల్లో కూడా చిన్నపాటి ఆందోళన సహజం. కానీ ఓ తొమ్మిదేళ్ల చిన్నారి మాత్రం బ్రెయిన్ సర్జరీ జరుగుతుండగా.. ఏ మాత్రం భయపడలేదు సరి కదా.. ఏకంగా సింథసైజర్(ఎలక్ట్రానిక్ సంగీత పరికరం) వాయిస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వివరాలు.. గ్వాలియార్కు చెందిన సౌమ్య అనే తొమ్మిదేళ్ల చిన్నారికి తలలో కణితి ఏర్పడింది. తల్లిదంద్రులు చిన్నారిని గ్వాలియర్ బీఐఎంఆర్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించారు. అయితే సాధారణంగా ఆపరేషన్కు ముందు మత్తు మందు ఇస్తారు. కానీ సౌమ్య విషయంలో ఇలా మత్తు మందు ఇచ్చి సర్జరీ చేయడం ప్రమాదం అని.. దాని వల్ల మెదడులోని ఇతర నరాలు దెబ్బతింటాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల, ఆమె శస్త్రచికిత్సను 'అవేక్ క్రానియోటమీ'(రోగి మెలకువగా ఉండగానే సర్జరీ చేయడం) పద్ధతిలో చేయాలని వైద్యులు నిర్ణయించారు. (చదవండి: బిగ్బాస్ షో చూపిస్తూ బ్రెయిన్ ఆపరేషన్) ఈ క్రమంలో చిన్నారి దృష్టి మరల్చడం కోసం వైద్యులు వినూత్న ఆలోచన చేశారు. సౌమ్యకు సర్జరీ చేస్తుండగా సింథసైజర్ ఇవ్వాలని... పాప దానితో ఆడుకుంటూ.. శస్త్ర చికిత్స విషయం మర్చిపోతుందని భావించారు. ఇక సర్జరీ చేసే భాగం వరకు మాత్రమే మత్తు మందు ఇచ్చారు. అనంతరం వైద్యులు దాదాపు రెండు గంటల పాటు శ్రమించి సౌమ్య తలలోని కణితిని విజయవంతంగా తొలగించారు. ఆ తర్వాత సౌమ్యను ఆబ్జర్వేషన్లో ఉంచారు. ప్రస్తుతం చిన్నారి పూర్తి ఆరోగ్యవంతంగా ఉందని వెల్లడించారు వైద్యులు. -
తను అలా పిలవగానే షాకయ్యాం: డీఎస్పీలు
భోపాల్: ‘‘తనను మాట్లాడించేందుకు మేం ఎంతగానో ప్రయత్నించాం. కానీ తను నిశ్శబ్దంగా ఉండిపోయాడు. దాంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాం. కాస్త దూరం వెళ్లగానే ఆ వ్యక్తి మమ్మల్ని ఇంటి పేర్లతో పిలవగానే షాకయ్యాం’’ అంటూ మధ్యప్రదేశ్కు చెందిన క్రైంబ్రాంచ్ డీఎస్పీ విజయ్ సింగ్ భదోరియా తమకు ఎదురైన వింత అనుభవం గురించి చెప్పుకొచ్చారు. తమ స్నేహితుడిని ప్రస్తుతం ఓ ఆశ్రమానికి తరలించామని, త్వరలోనే తను కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు. అసలేం జరిగిందంటే.. విజయ్ సింగ్ భదోరియా, ఆయన సహచర డీఎస్పీ రత్నేష్ సింగ్ తోమర్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాల కౌంటింగ్ నేపథ్యంలో నవంబరు 11న గ్వాలియర్లో విధులు ముగించుకుని ఇంటికి పయనమయ్యారు. ఈ క్రమంలో రోడ్డుపై అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్న యాచకుడిని చూసి చలించిపోయారు. చెత్తకుప్ప వద్ద తచ్చాడుతున్న అతడికి భోజనం పెట్టించారు. చలికి వణుకుతున్న యాచకుడికి భదోరియా తన వద్ద ఉన్న జాకెట్ ఇవ్వగా, తోమర్ తన బూట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అతడి వివరాల గురించి ఆరా తీశారు. అయితే తొలుత వారితో మాట్లాడేందుకు నిరాకరించిన ఆ బిచ్చగాడు, వారు వెనుదిరగగానే ఇంటి పేర్లు పెట్టి పిలవడంతో ఆశ్చర్యంలో మునిగిపోయారు. మా గురించి నీకెలా తెలుసంటూ ప్రశ్నల వర్షం కురిపించగా... అతడి ప్లాష్బ్యాక్ గురించి తెలుసుకుని అవాక్కయ్యారు. గతంలో తమతో పాటు పోలీసు శిక్షణలో పాల్గొన్న స్నేహితుడే ఈ బిచ్చగాడు అని తెలుసుకుని ఉద్వేగానికి లోనయ్యారు. ఎస్సైగా పనిచేసిన మనీష్ మిశ్రాకు పట్టిన దుస్థితి తెలిసి భావోద్వేగంతో అతడిని అక్కున చేర్చుకున్నారు.(చదవండి: భావోద్వేగ దృశ్యం: కన్నీళ్లు ఆగడం లేదు) ఈ విషయం గురించి డీఎస్పీ భదోరియా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మనీష్.. అందగాడు మాత్రమే కాదు. మా బ్యాచ్లోని 250 మందిలో గల టాప్ 10 షార్్ప షూటర్లలో అతనొకడు. మంచి అథ్లెట్ కూడా. వివిధ జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లలో ఇంచార్జిగా పనిచేసిన అనుభవం తనకు ఉంది. తనకు 2005లో దాటియాలో పోస్టింగ్ వచ్చింది. అదే తన గురించి మాకు తెలిసిన చివరి సమాచారం. ఇదిగో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ తనను చూశాం. మనీష్ తండ్రి కూడా పోలీసుగా పనిచేశారు’’అని జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. మనీష్కు పెళ్లైందని, బహుశా ఆయన మానసిక పరిస్థితి దృష్ట్యా భార్య విడాకులు ఇచ్చి ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. మనీష్ పెద్దన్నయ్య కూడా గుణ జిల్లాలో పోలీసు అధికారిగా పనిచేస్తున్నారని, ఆయన ద్వారా తమ స్నేహితుడి గురించిన పూర్తి సమాచారం తెలుసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయనను షెల్టర్ హోంకు తరలించి, సైకియాట్రిస్టులతో కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నామని, మనీష్ త్వరలోనే మామూలు మనిషి అవ్వాలని ఆకాంక్షించారు.(చదవండి: అక్కడ హాయిగా పానీపూరీ లాగించేయవచ్చు!) ఇక మరో డీఎస్పీ తోమర్, మనీష్ గురించి చెబుతూ.. మానసిక పరిస్థితి సరిగా లేనందు వల్ల విధులు సరిగా నిర్వర్తించలేకపోవడంతో ఉద్యోగం నుంచి అతడిని తొలగించినట్లు తెలిసిందన్నారు. ఆ తర్వాత మనీష్ను అతడి కుటుంబ సభ్యులు తమ స్వస్థలానికి తీసుకువెళ్లి చికిత్స చేయించినా ఫలితం లేకుండా పోయిందని, తరచుగా ఇంటి నుంచి పారిపోయేవాడని, అలా ఓ రోజు మొత్తానికే కనిపించకుండా పోయాడని వాళ్లు చెప్పినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మనీష్ను స్వర్గ్ సదన్ అనే ఆశ్రమంలో చేర్పించామని, ఆయన పరిస్థితి మెరుగయ్యేంత వరకు తామే బాధ్యత వహిస్తామని పెద్ద మనసు చాటుకున్నారు. ప్రస్తుతం ఈ కథనానికి సంబంధించిన విశేషాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
భార్య కోసం.. బైక్పై 1000 కిమీ
రాంచీ: భార్య తనకంటే విద్యాధికురాలు అయితే చాలా మంది మగవారికి నచ్చదు. ఇక పెళ్లాయ్యాక ఆడవారికి చదువుకునే వెసులుబాటు కల్పించే భర్తలు చాలా అరుదుగా ఉంటారు. ఈ నేపథ్యంలో పదో తరగతితోనే చదువు ఆపేసి.. వంట మనిషిగా పని చేస్తోన్న ఓ వ్యక్తి.. టీచర్ కావాలన్న తన భార్య కలను నెరవేర్చడం కోసం సుమారు 1000 కిలోమీటర్లు బైక్ మీద ప్రయాణం చేసిన అరుదైన ఘటన ప్రస్తుతం తెగ వైరలవుతోంది. వివారాలు.. జార్ఖండ్ గొడ్డా ప్రాంతానికి చెందిన ధనంజయ్ కుమార్ పదవ తరగతి పాస్ అవుట్. తర్వాత వంట మనిషిగా పని చేస్తున్నాడు. ధనంజయ్ భార్య సోని హెంబ్రామ్కు టీచర్ కావాలని ఆశ. ఇందుకు గాను మధ్యప్రదేశ్ బోర్డు అందించే ప్రాథమిక విద్య డిప్లోమా కోర్సులో చేరింది. ప్రస్తుతం సెకండియర్ చదువుతోంది. పరీక్షలు జరగుతున్నాయి. ఎగ్జామ్ సెంటర్ మధ్యప్రదేశ్లోని గ్వాలియర్. గొడ్డా నుంచి పరీక్ష కేంద్రానికి మధ్య దూరం 1100 కిలోమీటర్లు. గూగుల్ మ్యాప్, కొన్ని షార్ట్కట్ మార్గాల వల్ల దూరం 1000 కిలోమీటర్లకు తగ్గింది. (చదవండి: క్లాస్ టీచర్) దాంతో పరీక్ష కేంద్రానికి చేరుకోవడం కోసం మూడు రోజుల పాటు బైక్ మీద 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశారు ఈ దంపతులు. ఈ సందర్భంగా ధనంజయ్ మాట్లాడుతూ.. ‘నా భార్య 2019లో మధ్యప్రదేశ్లో టీచర్ కోర్సులో చేరింది. జార్ఖండ్లో ఫీజు చాలా ఎక్కువగా ఉండటంతో ఇలా చేసింది. దాంతో తనకు గ్వాలియర్లో ఎగ్జామ్ సెంటర్ పడింది. అక్కడికి చేరుకోవడానికి ప్రస్తుతం రైళ్లు అందుబాటులో లేవు. సోని టీచర్ ఒకరు విద్యార్థులను గొడ్డా నుంచి గ్వాలియర్ తీసుకెళ్లడానికి కారు మాట్లాడారు. కానీ 30 వేల రూపాయలు చెల్లించాలని చెప్పారు. గత నాలుగు నెలలుగా నాకు ఉద్యోగం లేదు. దాంతో బైక్ మీద వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ప్రస్తుతం నా భార్య ఆరోనెల గర్భవతి. ఆగస్టు 27 రాత్రి మా ప్రయాణం ప్రారంభమయ్యింది. బిహార్, లక్నోలోని ముజఫర్పూర్ మీదుగా ప్రయాణించి ఆగస్టు 30 సాయంత్రం గ్వాలియర్ చేరుకున్నాం. బంధువుల దగ్గర నుంచి 10 వేలు బదులు తీసుకుని పరీక్షకు వెళ్లడానికి బయలుదేరాం’ అని తెలిపాడు ధనంజయ్. (చదవండి: పంతులమ్మ ఆదాయం : అధికారులకు షాక్) గ్వాలియర్లోని డీడీ నగర్ ప్రాంతంలో ఉండటానికి వారు 1,500 రూపాయలతో గది అద్దెకు తీసుకున్నారు. ధనంజయ్ మాట్లాడుతూ.. ‘మేము ఇప్పటికే 7,000 రూపాయలు ఖర్చు చేసాము. ఇప్పుడు 3 వేల రూపాయలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆరు నెలల గర్భవతి అయిన నా భార్య అనారోగ్యంతో బాధపడుతున్నంది. ఇప్పుడు, నేను తిరిగి వెళ్ళడానికి అవసరమయిన డబ్బు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాను’ అని తెలిపాడు. -
రామాలయం పునాది, కరోనా అంతానికి నాంది
గ్వాలియర్: అందరినీ గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ అంతం త్వరలోనే ప్రారంభం కానుందట. అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణానికి పునాది వేసిన క్షణం నుంచి ఆ మహమ్మారి వినాశనం ఆరంభం అవుతుందంటున్నారు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్, బీజేపీ నేత రామేశ్వర్ శర్మ. బుధవారం గ్వాలియర్లో ఆయన మాట్లాడుతూ.. "ఆనాడు మానజాతి సంక్షేమం కోసమే రాక్షసులను చంపేందుకు శ్రీరాముడు పునర్జన్మ ఎత్తాడు. చదవండి: భూమి పూజకు 40 కిలోల వెండి ఇటుక నేడు రామాలయ నిర్మాణం ప్రారంభమైన వెంటనే కరోనా నాశనం కూడా ఆరంభమవుతుంది. ప్రస్తుతం ప్రపంచమే కరోనాతో కలవరపడుతోంది. కానీ భారత్లో మేము కేవలం సామాజిక దూరం పాటించడమే కాదు, మా ఆరాధ్య దైవాలను స్మరించుకుంటూ ఉంటాము" అని చెప్పుకొచ్చారు. కాగా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఆగస్టు 5న భూమిపూజ జరగనున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. భౌతిక దూరం పాటిస్తూ సుమారు 200 మంది ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. (మోదీ చేతుల మీదుగా రామ మందిర నిర్మాణం) -
కొడుక్కి బుద్ధి చెప్పిన మాజీ మంత్రి
గ్వాలియర్: పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన తన కుమారుడికి మాజీ మంత్రి ఒకరు తగిన గుణపాఠం చెప్పారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. లాక్డౌన్ నేపథ్యంలో గురువారం బైక్పై రోడ్డుపైకి వచ్చిన యువకుడిని పోలీసులు ఆపారు. ముఖానికి మాస్క్ లేకుండా ఎందుకు వచ్చాయని ప్రశ్నించగా సదరు యువకుడు పోలీసులపై జులుం ప్రదర్శించారు. ‘మా నాన్న ఎవరో తెలుసా’ అంటూ పోలీసులను బెదిరించడమే కాకుండా దురుసుగా ప్రవర్తించాడు. (తండ్రి ప్రేమ.. స్క్రాప్ నుంచి బైక్ తయారీ) ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా అనుచరుడైన మాజీ మంత్రి ప్రద్యుమన్ సింగ్ తోమర్ స్పందించారు. ఎందుకంటే పోలీసులతో అనుచితంగా ప్రవర్తించింది ఆయన కుమారుడే. తన కొడుకు రిపుదమాన్ చేసిన పనికి తోమర్ విచారం వ్యక్తం చేయడమే కాకుండా అదే రోజు సాయంత్రం అతడిని ఘటనా స్థలానికి తీసుకెళ్లి పోలీసులకు క్షమాపణ చెప్పించి, జరిమానా చెల్లించారు. అక్కడితో ఆగకుండా తర్వాతి రోజు కొడుక్కి గుణపాఠం చెప్పారు. మున్సిపల్ కార్మికులతో కలిసి శుక్రవారం చెత్త ఎత్తించారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించినందుకు శిక్షగా పారిశుద్ధ్య పని చేయించారు. కొడుకు చేసిన తప్పును సరిదిద్ది హుందాగా ప్రవర్తించిన ప్రద్యుమన్ సింగ్ తోమర్ను అందరూ అభినందిస్తున్నారు. (స్పెషల్ ట్రైన్ ఎక్కాలంటే.. ఇవి పాటించాలి) -
‘నాన్న నిర్ణయం పట్ల ఎంతో గర్వంగా ఉంది’
భోపాల్: తండ్రి నిర్ణయం తనకు గర్వకారణమని జ్యోతిరాదిత్య సింధియా కుమారుడు మహానార్యమన్ సింధియా అన్నాడు. తమ కుటుంబం ఎప్పుడూ అధికారం కోసం అర్రులు చాచలేదని.. ప్రజాసేవచేయడమే తమకు ముఖ్యమని పేర్కొన్నాడు. గ్వాలియర్ రాజ కుటుంబానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం కాంగ్రెస్ను వీడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన మహానార్యమన్... ‘‘నాన్న ఈ స్టాండ్ తీసుకోవడం ఎంతో గర్వంగా ఉంది. ఇందుకు ఎంతో ధైర్యం కావాలి. మా కుటుంబానికి అధికార దాహం లేదని చరిత్రే చెబుతోంది. భారత్, మధ్యప్రదేశ్లో ప్రభావవంతమైన మార్పు తీసుకువస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం’’ అని ట్వీట్ చేశాడు.(బీజేపీలో సింధియాలు.. సింధియాలో బీజేపీ ) కాగా మహానార్యమన్ కూడా తండ్రి బాటలోనే ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. డెహ్రాడూన్లో హై స్కూల్ విద్యనభ్యసించిన మహానార్యమన్.. అమెరికాలో ఎంబీఏ చేశాడు. పార్టీ ప్రచార కార్యక్రమాలకు తండ్రి జ్యోతిరాదిత్యతో కలిసి హాజరైన మహానార్యమన్ ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. ఇక సమకాలీన రాజకీయ అంశాలపై సోషల్ మీడియాలో స్పందించే మహానార్యమన్.. గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అనేక ట్వీట్లు చేశాడు. ప్రస్తుతం తన తండ్రి అదే పార్టీలో చేరుతుండటం పట్ల హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. కాగా 1994లో మరాఠా గైక్వాడ్ రాజవంశానికి చెందిన ప్రియదర్శినీ రాజేను వివాహమాడిన జ్యోతిరాదిత్యాకు కుమారుడు మహానార్యమన్, కుమార్తె అనన్య సింధియా ఉన్న విషయం తెలిసిందే.(కాంగ్రెస్కు సింధియా గుడ్బై.. ఏం జరుగనుంది?) I am proud of my father for taking a stand for himself. It takes courage to to resign from a legacy. History can speak for itself when I say my family has never been power hungry. As promised we will make an impactful change in India and Madhya Pradesh wherever our future lies. — M. Scindia (@AScindia) March 10, 2020 ఇక మంగళవారం తొలుత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన జ్యోతిరాదిత్య.. అనంతరం ఆయనతో కలిసి ప్రధాని మోదీ నివాసానికి చేరుకున్నారు. చర్చల అనంతరం కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ పంపారు. 18 ఏళ్లుగా కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నానని.. ఇక ముందుకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని సింధియా లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితిల్లో ఇంకా పార్టీలో కొనసాగితే దేశ, రాష్ట్ర ప్రజలకు సేవ చేయలేనని అనిపిస్తోంది కాబట్టి.. కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం మెరుగని భావిస్తున్నానని తెలిపారు. (ఆపరేషన్ కమల్.. కాంగ్రెస్కు రంగుపడింది) అదే విధంగా ఇన్నాళ్లూ దేశానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు సోనియాకు ఆయన కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నుంచి సింధియా బహిష్కరణను సోనియా ఆమోదించినట్లు ఏఐసీసీ తెలిపింది. ఇక సుదీర్ఘ కాలంగా పార్టీకి సేవలు అందిస్తున్న సింధియా రాజీనామా చేయడం... ఆయన వెంట ఉన్న 22 మంది ఎమ్మెల్యేలు సైతం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు స్పీకర్కు లేఖలు పంపడంతో సీఎం కమల్నాథ్ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ క్షణమైనా కుప్పకూలే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. (సింధియా టైమ్స్) -
ఆ నగరాలు సురక్షితం కాదు
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లోని భోపాల్, గ్వాలియర్, రాజస్తాన్లోని జోధ్పూర్ నగరాలు తమకు సురక్షితం కాదని మహిళలు అభిప్రాయపడుతున్నారని తాజా అధ్యయనంలో తేలింది. ఈ ప్రాంతాల్లో జనావాసం తక్కువగా ఉండటం, ఇతర ప్రాంతాలకు ఇవి సుదూరంగా ఉండటం వంటి కారణాల వల్ల తమకు రక్షణ కరువైనట్లు మహిళలు భావిస్తున్నారు. సామాజిక సంస్థలు సేఫ్టీపిన్, కొరియా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, ఆసియా ఫౌండేషన్లు ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి. దీనికి గానూ భోపాల్ (77), గ్వాలియర్ (75), జోధ్పూర్ (67) నగరాల నుంచి 219 సర్వేల ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించాయి. ఈ మూడు ప్రాంతాల్లో నివసించే విద్యార్థుల్లో 57.1 శాతం, అవివాహిత యువతుల్లో 50.1 శాతం మంది లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఈ ప్రదేశాలు నిర్జనంగా ఉండటం వల్ల తమకు రక్షణ కరువైందని 89 శాతం మంది మహిళలు అభిప్రాయపడ్డారు. తమకు రక్షణ కరువైందని భావించడానికి మహిళలు పలు కారణాలను వెల్లడించారు. డ్రగ్స్, మద్యం అందుబాటులో ఉండటం (86 శాతం), ప్రజా రవాణా అందుబాటులో లేకపోవడం (63 శాతం), సరైన భద్రత లేకపోవడం (68 శాతం) వంటివి కారణాలుగా పేర్కొన్నారు. బస్సులు, ఆటోల్లో ప్రయాణించే సమయంలో కూడా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు 50 శాతం మంది తెలిపారు. మార్కెట్లు వంటి చోట్ల వేధింపులకు గురవుతున్నామని 39 శాతం మంది వెల్లడించారు. రోడ్డు పక్కన వెళ్తుండగా (26 శాతం మంది), ట్రాన్స్పోర్ట్ కోసం వేచిచూసే సమయంలో (16 శాతం) సైతం లైంగిక వేధింపులకు గురవుతున్నామని చెప్పారు. -
లాటరీ వివాదం; చెప్పులతో మహిళ దాడి!
సాక్షి, మధ్యప్రదేశ్ : గ్వాలియర్లోని ప్రభుత్వ అధికారి, స్థానిక నాయకుడిపై ఓ మహిళ చెప్పులతో దాడికి దిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీంతో ఆ మహిళపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. లీలా జాతవ్(35) మహిళకు ప్రభుత్వ లాటరీ ద్వారా ఇల్లు లభించింది. అయితే తనకు కేటాయించిన ఇంటిపై ఆసంతృప్తితో ప్రతిపక్ష నాయకుడైన కృష్ణారావు దీక్షిత్, అక్కడి రాజీవ్ గాంధీ హౌసింగ్ స్కీమ్ నోడల్ అధికారి అయిన పవన్ సింఘాల్పై మహిళ గురువారం దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటికీ తనను ఇంకా అరెస్టు చేయలేదన్నారు. కాగా ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం అక్కడి ప్రభుత్వం రాజీవ్ గాంధీ హౌజింగ్ స్కీం ద్వారా 832 ఇళ్లను నిర్మించింది. వాటిని లాటరీ డ్రా పధ్దతి ద్వారా అర్హులైన వారికి ఇంటిని కేటాయించే ఉద్దేశంతో గురువారం లాటరీ డ్రా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సదరు మహిళ.. ఇదంతా మోసం అని, ఈ లాటరీ పద్దతిలో కుట్ర దాగుందని.. తమకు ఇష్టమైన వాళ్లకే మంచి ఇల్లు కేటాయిస్తున్నారు అంటూ గట్టిగా అరుస్తూ... పవన్ సింఘాల్పై చెప్పులతో దాడి చేసింది. ఈ క్రమంలో తనని ఆపడానికి యత్నించిన కృష్ణారావుపై కూడా ఆమె దాడికి దిగింది. ఈ విషయం గురించి కృష్ణారావు మాట్లాడుతూ.. తను కోరుకున్న ఫ్లాటు లాటరీలో రాలేదన్న కోపంతోనే ఆమె ఇలా చేసిందని పేర్కొన్నాడు. కాగా వార్షిక ఆదాయం రూ. 3 లక్షల కంటే తక్కువ ఉన్న కుటుంబాలకు రాజీవ్ గాంధీ హౌజింగ్ పథకం కింద ఒక్కొక్కొ ప్లాట్ను రూ. 3.5 లక్షల లాటరి పద్దతిలో కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
కోళ్లపై కన్నేసి.. విషంతో కాటేసి..
భోపాల్ : తాను పెంచుకుంటున్న కోళ్లలో ఒక కోడిని ఇచ్చేందుకు మహిళ నిరాకరించడంతో ఇద్దరు వ్యక్తులు ఆమెకు చెందిన కోళ్లను విషమిచ్చి చంపిన ఘటన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో వెలుగుచూసింది. ఝాన్సీరోడ్ పోలీస్ స్టేషన్లో మహిళ గుడ్డిభాయ్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం...వైష్ణో ధామ్ ఆలయ సమీపంలో నివసించే గుడ్డి భాయ్ వ్యవసాయ పనులకు వెళుతూ మరికొంత ఆదాయం కోసం నాలుగు కోళ్లను కొనుగోలు చేసి కోడిగుడ్లను విక్రయిస్తూ జీవిస్తోంది. ఈమె పొరుగున ఉండే సురేందర్, సమర్లు ఆమె పనులకు వెళ్లిన సమయంలో మహిళ ఇంటికి వెళ్లి తమకు ఓ కోడిని ఇవ్వాలని కోరగా ఆమె కుమార్తె నిరాకరించడంతో నాలుగు కోళ్లకు విషం ఎక్కించారు. పని నుంచి ఇంటికి వచ్చిన మహిళకు కుమార్తె నిందితుల నిర్వాకం వివరించడంతో చనిపోయిన కోళ్లను తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
మహిళ అని కూడా చూడకుండ లాఠీతో బాదిన పోలీసు
-
వైరల్ వీడియో.. ఖాకీల కాఠిన్యం
ముంబై : పోలీసుల కాఠిన్యానికి అద్దం పట్టే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో మహిళతో పాటు ఓ రెండేళ్ల చిన్నారి కూడా ఉంది. తనను కొట్టవద్దంటూ ఆ మహిళ ఎంత ప్రాధేయపడిన ఆ ఖాకీ మనసు కరగలేదు. మధ్యప్రదేశ్ గ్వాలియార్కు చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ వీడియోలో ముగ్గురు మహిళలు.. చిన్న పిల్లల్ని పట్టుకుని పోలీస్ స్టేషన్లో కూర్చుని ఉన్నారు. ఇంతలో ఓ అధికారి వారి దగ్గరకు వచ్చాడు. వారిని ప్రశ్నించే ఉద్దేశంతో.. అందరిని పైకి లేవమని చెప్పాడు. అతన్ని చూడగానే ఆ మహిళలంతా పక్కకు జరగడానికి ప్రయత్నిస్తూ.. ఏడుస్తూ తమను వదిలిపెట్టమని ఆ అధికారిని వేడుకుంటున్నారు. ఇంతలో ఆ అధికారి ఓ మహిళ దగ్గరకు వెళ్లి లాఠీతో పదే పదే కొట్టాడమే కాక జుట్టుపట్టుకుని లాగాడు. ఆ మహిళ తనను విడిచిపెట్టమని ఎంత వేడుకున్నా సదరు అధికారి కరుణించలేదు. ఈ సంఘటన చోటు చేసుకున్నప్పుడు స్టేషన్లో మరో ముగ్గురు అధికారులు కూడా ఉన్నారు. వారిలో ఒకతను సదరు మహిళ దగ్గరకు వచ్చి ఆమెను తిట్టడం ప్రారంభించాడు. ప్రస్తుతం సోషల్మీడియాలో తెగ వైరలవుతోన్న ఈ వీడియో గురించి గ్వాలియర్ పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నించగా.. ఈ వీడియో ఇప్పటది కాదని రెండేళ్ల క్రితందని తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలయిన తర్వాతే దీని గురించి వారికి తెలిసిందని వెల్లడించారు. వీడియోలో ఉన్న అధికారి ప్రస్తుతం ఎన్నికల విధుల్లో ఉన్నాడన్నారు. ఎలక్షన్స్ అయ్యాక ఈ విషయం గురించి దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. ఆరోదశ ఎన్నికల్లో భాగంగా గ్వాలియార్లో ఈ నెల 12న ఎన్నికలు జరగనున్నాయి. -
గ్వాలియర్ ‘మహారాజు’ ఎవరో!
సాక్షి, న్యూఢిల్లీ : ‘2014లోలాగా ఇప్పుడు నరేంద్ర మోదీ హవా లేదు. ఆయన నాడిచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చ లేదు. రైతుల్ని అయితే పూర్తిగా విస్మరించారు. మోదీ అయినా, రాహుల్ అయినా మాకు ఒరిగేది ఏమీ ఉండదు. ప్రస్తుతం మాకు అభ్యర్థే ముఖ్యం. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గ్వాలియర్ మేయర్ వివేక్ షెజావాల్కర్ ఏ నాడు మా వూరును సందర్శించలేదు. అదే కాంగ్రెస్ అభ్యర్థి అదే అశోక్ సింగ్ మా ఊరుకు 15 సార్లు వచ్చారు. వచ్చినప్పుడల్లా రైతుల యోగ క్షేమాలు అడుగుతారు. ఆయన పట్ల మాకు సానుభూతి కూడా ఉంది. 2007లో జరిగిన ఉప ఎన్నికల్లో, ఆ తర్వాత 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన యశోధర రాజె సింధియా చేతుల్లో అశోక్ సింగ్ ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో మోదీ హవా కారణంగా బీజేపీ అభ్యర్థి నరేంద్ర సింగ్ తోమర్ చేతుల్లో ఆయన ఓడిపోయారు. ఇప్పుడు ఓడిపోవడానికి రాజూ లేడు. మోదీ ప్రభావమూ లేదు. ఆయన్నే గెలుస్తారు. ఆయనకే ఓటు వేస్తాం’ అని గ్వాలియర్లోని సముదాన్ గ్రామంలో నీడపట్టున ముచ్చటిస్తున్న రైతులను మీడియా కదిలించగా వారీ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేశామని, ఈసారి కూడా ఆ పార్టీకే ఓటు వేస్తామని కొందరు రైతులు చెప్పారు. గ్వాలియర్ లోక్సభ నియోజకవర్గంలోని పరదిలో ఏడు అసెంబ్లీ సెంగ్మెంట్లు ఉండగా, వాటిలో ఆరింట కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 231 సీట్లు ఉండగా, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 114 సీట్లను గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో బీజేపీకి 109 సీట్లు వచ్చాయి. అప్పటి ఎగ్జిట్ పోల్లో ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేశామని చెప్పిన రైతుల్లో ఎక్కువ మంది లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తామని చెప్పారు. ఇప్పుడు వారి వైఖరి మారినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో రైతుల రుణాల మాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయడం కొంత మార్పునకు కారణం. కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తే రాష్ట్రానికి నిధుల కొరత ఉండదని ఒకరిద్దరు రైతులు అభిప్రాయపడ్డారు. గ్వాలియర్ నియోజకవర్గంలో ఎక్కువ మంది రైతులతోపాటు దళితుల సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. వారిలో కూడా ఎక్కువ మంది కాంగ్రెస్ వైపే మొగ్గుచూపుతున్నారు. మే 12వ తేదీన ఇక్కడ పోలింగ్ జరుగుతుంది. -
రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ముప్పు
గ్వాలియర్ : మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ రైల్వేస్టేషన్లో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. క్యాంటిన్లో మంటలు చెలరేగడంతో రైల్వే స్టేషన్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. క్యాంటిన్లో పని చేసేవారు, ప్రయాణికులు మంటలను గుర్తించి అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చాయి. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. -
తరగతి గదిలో దస్తూరి తిలకం
గ్వాలియర్లో వాజ్పేయి చదువుకున్న పాఠశాల ఆయన జ్ఞాపకాల్లో తడిసిముద్దవుతోంది. ఆయన చేతిరాతతో ఉన్న రిజిస్టర్ తమకు పెన్నిధి అంటూ గర్వంగా చెప్పుకుంటోంది. కృష్ణాదేవి, కృష్ణ బిహారి వాజ్పేయి దంపతులకు 1924 సంవత్సరం క్రిస్మస్ పర్వదినం రోజు జన్మించిన అటల్ బిహారి వాజ్పేయి గోరఖి పాఠశాలలో ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నారు. ఆ సమయంలో ఆ పాఠశాలకు వాజ్పేయి తండ్రే ప్రిన్సిపాల్గా ఉండేవారు. వాజ్పేయి స్కూలు రిజిస్టర్లో తన స్వదస్తూరితో పేరును రాసుకున్నారు. ప్రస్తుతం ఆ పాఠశాల శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ, వాజ్పేయి చేతిరాత ఉన్న రిజిస్టర్ మాత్రం పదిలంగా ఉంది. ‘ఈ రిజిస్టర్ మాకో నిధిలాంటిది. నెంబర్ 101 దగ్గర ఉన్న పేరు వాజ్పేయిదే. 1935లో ఆరో తరగతిలో చేరడానికి వచ్చినప్పుడు వాజపేయి స్వయంగా తన పేరుని రాసుకున్నారు. ఇప్పుడే ఇది ఒక చారిత్రక పత్రంగా మారింది‘ అని స్కూలు ప్రిన్సిపాల్ కె.ఎస్.రాథోడ్ ఉద్వేగంగా చెప్పారు. అంతేకాదు ఆ పాఠశాలను కూడా స్థానికులు అటల్ జీ అంటూ ప్రేమగా పిలుస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆ పాఠశాల అలాగే గుర్తింపు ఉంది. స్కూల్ రోజుల్లో వాజ్పేయి కబడ్డీ, హాకీ ఆటలు ఆడేవారు. అందరు విద్యార్థుల మాదిరిగానే సైకిల్ వేసుకొని పట్టణం అంతా చక్కెర్లు కొట్టేవారు. చిన్నప్పట్నుంచి అటల్జీకి స్వీట్లు అంటే ప్రాణం. గ్వాలియర్ ఎప్పుడు వచ్చినా తనకిష్టమైన మిఠాయి దుకాణానికి వెళ్లి లడ్డూలు, గులాబ్జాములు లాగించేవారు. తాను పుట్టిన గడ్డ, చిన్నతనంలో గడిపిన పరిసరాలు, చదువుకున్న స్కూలు, నోరూరించే మిఠాయిలుండే దుకాణాలు ఇవంటే వాజపేయికి ఎంతో మమకారం. ఆ అనుబంధంతోనే 1984 లోక్సభ ఎన్నికల్లో గ్వాలియర్ నుంచి పోటీ చేశారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి మాధవ్ రావు సింధియా చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. సొంత గడ్డ తనని ఓడించడాన్ని తట్టుకోలేకపోయారు. అందుకే మరోసారి గ్వాలియర్ నుంచి పోటీ చేయడానికి ఆయన సాహసించలేదు. కానీ తరచూ గ్వాలియర్ వెళ్లి వస్తూ ఉండేవారు. 2006లో చివరిసారిగా వాజపేయి గ్వాలియర్కు వెళ్లారు. అనారోగ్యం కబళించడంతో ఆయన ఆ తర్వాత వెళ్లలేకపోయారు. ఎన్నికల్లో ఓడిపోయినా, చివరి రోజుల్లో వెళ్లలేకపోయినా గ్వాలియర్తో అటల్జీకున్న అనుబంధం మరువలేనిది. ఉత్తమ గేయ రచయిత వాజ్పేయి వాజ్పేయి కవిత్వం కొత్త చిగుళ్లు తొడుక్కున్న ఆమనిలా ఆహ్లాదాన్ని పంచుతుంది. సహజంగానే సున్నిత మనస్కుడు, ప్రేమమూర్తి , భావకుడు అయిన వాజ్పేయి కలం నుంచి మరువలేని, మరపురాని అద్భుతమైన కవితలెన్నో జాలువారాయి. అలాంటి కవిత్వానికి ఒక సినిమా అవార్డు వస్తుందని ఎవరైనా ఊహించగలరా ? అసలు వాజపేయి కూడా అనుకోలేదు తన కవిత్వానికి ఒక అవార్డు వస్తుందని.. స్క్రీన్ అవార్డుల కమిటీ మాత్రం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ వాజపేయిని ఉత్తమ గేయ రచయితగా ఎంపిక చేశారు. వాజ్పేయి కవితల్లో ఆణిముత్యాల్లాంటివి కొన్నింటిని ఏరి గజల్మాస్ట్రో జగిత్ సింగ్ ఆలపించారు. అవన్నీ నవి దిశ పేరుతో 1999లో ఆల్బమ్గా వచ్చాయి. ఈ ఆల్బమ్కు 2000 సంవత్సరంలో నాన్ ఫిల్మ్ కేటగిరీలో ఉత్తమ గేయ రచయితగా వాజపేయి అవార్డు దక్కించుకున్నారు. అయితే అప్పుడు వాజ్పేయి ప్ర«ధానమంత్రిగా ఊపిరి సలపని పనుల్లో ఉండడంతో అవార్డు ప్రదానోత్సవానికి హాజరు కాలేకపోయారు. ఆ తర్వాత ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లి అవార్డుని అందజేశారు. -
రాజమాత కారు కాదని.. సైకిల్పైనే?
గ్వాలియర్ : అప్పటికే వాజ్పేయి ప్రముఖ రాజకీయ నాయకుడు. ఎన్నోఏళ్లుగా ఎంపీగా కొనసాగుతున్నారు. అయినా సరే ఎంతో సాదాసీదాగా ఉండడమే ఆయనకు ఇష్టం. తాను పుట్టి పెరిగిన గ్వాలియర్లో సైకిల్పై తిరుగుతూ చిన్ననాటి స్నేహితుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తడం అంటే వాజ్పేయికి ఎంతో సరదా. ఈ విషయాల్ని వాజ్పేయి మేనకోడలు క్రాంతి మిశ్రా పంచుకున్నారు. ‘గతంలో అటల్జీ గ్వాలియర్ వచ్చినప్పుడు నా కుమారుడి సైకిల్ తీసుకుని చిన్ననాటి స్నేహితుడు దీపక్తో పాటు ఇతర స్నేహితుల ఇళ్లకు వెళ్లేవారు’ అని మిశ్రా పాత జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్నారు. ఒకసారి ఈ విషయం తెలిసి అప్పటి బీజేపీ నాయకురాలు, రాజమాత విజయ రాజే సింధియా.. గ్వాలియర్కు వచ్చినప్పుడు తనకు చెపితే ప్రత్యేకంగా కారును ఏర్పాటు చేస్తానని చెప్పినా నిరాడంబరంగా ఉండేందుకు వాజ్పేయి ఇష్టపడేవారు. -
మంటల్లో చిక్కుకున్న ఏపీ ఎక్స్ప్రెస్
-
ఏపీ ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం
సాక్షి, గ్వాలియర్ : ఢిల్లీ నుంచి విశాఖపట్నం వస్తున్న ఏపీ ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రెండు ఏసీ బోగీలు (బీ6, బీ7) పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో రెండు బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సోమవారం ఉదయం 11.55 గంటల సమయంలో గ్వాలియర్ సమీపంలోని బిర్లానగర్ రైల్వేస్టేషన్ వద్ద బోగీల్లో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన ప్రయాణికులు చైన్ లాగి రైలును నిలిపివేశారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. కాగా ఈ ప్రమాదం నుంచి 36 మంది ట్రైనీ ఐఏఎస్ అధికారులు సురక్షితంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. ప్రయాణికులు సామాగ్రి మాత్రం మంటల్లో కాలిపోయింది. హైటెన్షన్ విద్యుత్ తీగలు పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా, లోకో పైలట్ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పిందని, ఫైరింజన్లతో మంటలను ఆర్పివేసినట్లు రైల్వే పీఆర్వో మనోజ్ కుమార్ తెలిపారు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. మంటలు అంటుకున్న రెండు బోగీల్లో వైజాగ్కు చెందిన 65 మంది ప్రయాణికులు ఉన్నారు. మరోవైపు ఈ ప్రమాదం జరగడంతో ఆ మార్గంలో నడిచే రైల్వే రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే అధికారుల తీరుపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైల్వే శాఖ విడుదల చేసిన అత్యవసర ఫోన్ నంబర్లు: 1322, 1800111189 విశాఖలో హెల్ప్లైన్ నంబర్లు: 08912883003, 08912883004, 08912746330, 08912746344 గ్వాలియర్లో హెల్ప్లైన్ నంబర్లు: 0751-2432799, 0751-2432849 ఝాన్సీలో హెల్ప్లైన్ నంబర్లు: 0510- 2440787, 0510- 2440790 -
యువకుల బుల్లెట్లకు దళితులు బలి
సాక్షి, న్యూడిల్లీ : రాకేశ్ జాటవ్కు 40 ఏళ్లు. రోజు కూలి చేసుకుని బతికే సంసారి. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ సిటీ, భీమ్నగర్ దళిత వాడలో నివసిస్తున్నాడు. ప్రతిరోజు లాగే సోమవారం నాడు కూడా ఉదయం ఎనిమిది గంటలకు రెడీ అయ్యాడు. కూతురు టిఫిన్ బాక్సులో చపాతీలు కట్టివ్వగా తీసుకొని సమీపంలోని కూలీ అడ్డాకు బయల్దేరి వెళ్లారు. మధ్యాహ్నానికి పక్కింటాయన పరుగెత్తుకుంటూ వచ్చి ‘మీ నాన్నకు బుల్లెట్ తగిలింది. కింద పడిపోయాడు’ అంటూ 18 ఏళ్ల కూతురు కాజల్కు చెప్పారు. కూతురు పరుగెత్తుకుంటూ కుమ్హార్ పురలోని కూలీల అడ్డకు వెళ్లింది. దూరం నుంచే ఓ పోలీసు ఆమెను అడ్డుకున్నారు. రక్తం మడుగులో నుంచి అప్పుడే రాజీవ్ జాటవ్ శరీరాన్ని లేపి అంబులెన్స్లోకి ఎక్కిస్తున్నారు. ‘అప్పటికి నాన్న ఊపిరి కొట్టుకుంటుందో లేదో, నాకు తెలియదు. ఛాతిలో నుంచి బుల్లెట్ దూసుకపోయిందంటూ అక్కడి వారు చెప్పుకుంటుంటే విన్నాను. ఆ తర్వాత నేను ఆస్పత్రికి వెళ్లేలోగా నాన్న చనిపోయాడు’ అని కాజల్ మీడియాకు వివరించింది. భారత్ బంద్ సందర్భంగా గ్వాలియర్ సిటీలో దళితులు, అగ్రవర్ణాల మధ్య జరిగిన ఘర్షణల్లో మరణించిన ముగ్గురు దళితుల్లో రాకేశ్ జాటవ్ ఒకరు. మిగతా ఇద్దరు దళితులు కూడా బుల్లెట్ గాయాలకే మరణించారు. వారిలో 22 ఏళ్ల దీపక్ ఒకరు. అతను గ్వాలియర్ నగరంలోని గొల్లకొత్తార్ ప్రాంతానికి చెందిన వాడు. మరొకరు 26 ఏళ్ల విమల్ ప్రకాష్. గ్వాలియర్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెవారియా ఫూల్ గ్రామస్థుడు. ఈ ముగ్గురులో ఎవరికి కూడా బంద్తోగానీ, ఘర్షణతోగానీ సంబంధం లేదని తేలింది. రాకేశ్ జాటవ్ రోడ్డు మీద వెళుతుండగా ఛాతిలోకి బుల్లెట్ దిగింది. జీవితంలో ఎస్సై కావాలనుకుంటున్న విమల్ 40 కిలోమీటర్ల దూరంలోని దాబ్రాలో కోచింగ్ తరగతులకు హాజరై ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో బుల్లెట్ తగిలి అక్కడికక్కడే మరణించాడు. ఇక ఆటోనడిపే దీపక్ రోడ్డు పక్కన ఆటో ఆపుకొని నిలబడి ఏదో గొడవ జరుగుతోందని అనుకుంటున్నంతలోనే మెడలో నుంచి బుల్లెట్ దూసుకుపోయి అక్కడికక్కడే చనిపోయారు. అన్న చనిపోతున్న దృశ్యాన్ని పక్కనే ఉన్న 20 ఏళ్ల తమ్ముడు సచిన్ చూశాడు. పోలీసులు వచ్చే వరకే అన్న చనిపోయాడని తెలిపాడు. తాము ఘర్షణలను ఆపేందుకు లాఠీలతో బెదిరించామేగానీ, ఒక్క బుల్లెట్ను కూడా పేల్చలేదని పోలీసులు స్పష్టం చేశారు. రాళ్లు విసురుతున్న దళితులపైకి అగ్రవర్ణాలకు చెందిన గుర్తుతెలియని యువకులు తుపాకులతో కాల్పులు జరపడంతో వారు మరణించినట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. తాము ముందుగా ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడలేదని, ఎస్సీ, ఎస్టీల చట్టాన్ని నీరు కార్చవద్దని నినాదాలు చేస్తూ ప్రదర్శనగా వెళుతుంటే అగ్రవర్ణాలకు చెందిన యువకులు తుపాకులతో బెదిరించారని, వారిని ఎదుర్కోవడం కోసం తాము రాళ్లు రువ్వాల్సి వచ్చిందని దళితులు చెబుతున్నారు. దళితులే తమ ఇళ్లపైకి దాడులకు దిగారని అగ్రవర్ణాల వారు ఆరోపిస్తున్నారు. అల్లర్లకు కారణం ఎవరైనా గుర్తుతెలియని యువకులు దళితులపైకి తుపాకులతో కాల్పులు జరుపుతున్న దశ్యాలు సీసీటీవీ కెమెరాలకు చిక్కాయి. వాటి ఆధారంగా పోలీసులు పలువురిని అరెస్ట్చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అరెస్టైన వారిలో ఇరువర్గాల వారున్నారని పోలీసులు చెప్పారు. సోమవారం నాటి బంద్ సందర్భంగా జరిగిన హింసాకాండలో ఎనిమిది మంది మరణించిన విషయం తెల్సిందే. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ముగ్గురు మరణించగా, భింద్ జిల్లలో ఇద్దరు, రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో ఇద్దరు, యూపీలో ఒకరు మరణించారు. -
నాథూరాం గాడ్సేకు గుడి కట్టేశారు!
భోపాల్: హిందూత్వ సంస్థ అయిన అఖిల భారతీయ హిందూ మహాసభ.. మహాత్మాగాంధీ హంతకుడైన నాథూరాం గాడ్సేకు ఘన నివాళులర్పించింది. గాడ్సే వర్థంతి సందర్భంగా గురువారం గ్వాలియర్లో ప్రతేక కార్యక్రమాన్ని నిర్వహించిన మహాసభ.. గాడ్సే అర్ధవిగ్రహాన్ని ప్రతిష్ఠాపన చేసి.. శ్రద్ధాంజలి ఘటించింది. అంతేకాకుండా గాడ్సేకు గుడి కూడా కట్టినట్టు వెల్లడించింది. గ్వాలియర్లో నాథూరాం గాడ్సేకు గుడి కట్టేందుకు హిందూ మహాసభ ప్రయత్నించగా.. ఇందుకు జిల్లా అధికార యంత్రాంగం అనమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 32 అంగుళాల పొడవున్న గాడ్సే విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసిన హిందూ మహాసభ.. ఆయనకు గుడి కట్టాలన్న తమ అభ్యర్థనను జిల్లా యంత్రాంగం నిరాకరించిందని, అయినప్పటికీ తమ సొంత స్థలంలో గాడ్సే విగ్రహం ఏర్పాటుచేసి.. గుడి కట్టామని తెలిపింది. మహాసభకు చెందిన సొంత స్థలంలో గుడి కట్టినందున దీనిపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదని మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు జైవీర్ భరద్వాజ్ తెలిపారు. -
ఐసీయూలో ఇద్దరి భార్యల ఫైట్
-
వారెవ్వా పోలీస్.. సాక్షాత్తు పోలీసు స్టేషన్ లోపలే!
-
వారెవ్వా పోలీస్.. సాక్షాత్తు పోలీసు స్టేషన్ లోపలే!
పోలీసు వృత్తి అంటేనే ఎంతో క్రమశిక్షణతో కూడుకున్నది. సమాజం గాడితప్పకుండా రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. కానీ పోలీసులే గాడితప్పారు. హోలీ ఆడుతూ మందుకొట్టారు. అది కూడా సాక్షాత్తూ పోలీసు స్టేషన్ లోపలే. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఈ ఘటన జరిగింది. హోలీ పండుగ సందర్భంగా మంగళవారం పోలీసు స్టేషన్లోపలే పోలీసులు రంగులు చల్లుకున్నారు. అంతటితో ఆగకుండా బీర్లు తాగారు. పోలీసు దుస్తుల్లోనే మందుకొట్టారు. ఇది కెమెరాకు చిక్కింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది -
‘ఆ వీడియోలతో వస్తే రూ.పది వేలు ఇస్తాం’
గ్వాలియర్: అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వివాహ కార్యక్రమాలు ఇతర ఉత్సవాల్లో సెలబ్రిటీలు తుపాకులు పేల్చడం పరిపాటి అవుతోంది. ఆ తుపాకులు కావాలని పేలుస్తున్నవి కాదని, అనుకోకుండా జరుగుతున్న సంఘటనలని చెబుతూ వారు తప్పించుకుంటున్నారు. ఇలాంటివి గ్వాలియర్ ప్రాంతంలో ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో అక్కడి జిల్లా యంత్రాంగం ఒక వినూత్న ఆలోచన చేసింది. పెళ్లి తదితర వేడుకల్లో ఎవరైతే తుపాకీ పేలుస్తారో ఆ చర్యలను వీడియో రికార్డింగ్ చేసి ఆధారాలుగా సమర్పించే వ్యక్తులకు రూ.10 వేలను రివార్డుగా ఇస్తామని ప్రకటించింది. గ్వాలియర్ ప్రాంతంలో విందు, వినోదాలే కాకుండా తమకు సంతోషం కలిగించే ఏ సందర్భాల్లోనైనా మరోమారు ఆలోచించకుండా గాల్లోకి తుపాకులు పెట్టి కాలుస్తుంటారు. దీని వల్ల చాలా సార్లు ప్రాణనష్టం కూడా చోటు చేసుకుంది. ఇలాంటి చర్యలు చట్ట ప్రకారం తప్పు. అయినా, అలాంటి వారిని నిలువరించేందుకు ఆధారాలు సరిగా లభ్యం కావు. దీంతో ఆ చర్యలను అడ్డుకునేందుకు తాజాగా పదివేల రివార్డును ప్రకటించింది. -
చెప్పుతో భర్త తాటతీసింది!
-
చెప్పుతో భర్త తాటతీసింది!
గ్వాలియర్: భర్త ఎలాంటి తప్పు చేసినా భరిస్తారో లేదో కానీ, ఇతర మహిళతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తే మాత్రం అపరకాళికలా మారిపోతారు. సరిగ్గా ఇలాంటి సంఘటన ఇటీవల మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో చోటుచేసుకుంది. ఇతర మహిళతో సంబధం పెట్టుకుంటావా అంటూ చేత చెప్పుతో రోడ్లపై భర్తను పరుగులు పెట్టించింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. గ్వాలియర్ కు చెందిన పుష్ప, మనీశ్ అగర్వాల్ ప్రేమించుకున్నారు. పోలీసులు, కోర్టును ఆశ్రయించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లు అన్యోన్యంగా ఈ జంట కలిసి ఉన్నారు. కొన్ని నెలలుగా మనీశ్ వ్యవహారం పుష్ప ఆశించినట్లుగా ఉండటం లేదు. అసలు ఏమైందో తెలియదు కానీ, ఇంటికి రావడం తగ్గించాడు. రెండు నెలలుగా మనీశ్ వ్యవహారాన్ని గమనించిన భార్యకు అనుమానమోచ్చింది. భర్త మనీశ్ కు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని తెలుసుకుంది. తన బంధువుల సాయంతో మనీశ్ ను పట్టుకుని, ఈ విషయంపై కడిగి పారేసింది. వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. చిన్నపిల్లల్లా వ్యవహరించవద్దని ఇంటికి వెళ్లి హాయిగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇదే అవకాశమని భావించిన మనీశ్, పుష్ప నుంచి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాడు. మరోసారి రోడ్లపై భార్యాభర్తలు గొడవపడ్డారు. భర్తపై పుష్ప విరుచుకుపడి చెప్పుతో దాడికి ప్రయత్నించింది. మనీశ్ రోడ్లపై పరుగు అందుకోగానే చెప్పు చేతపట్టిన పుష్ప కూడా భర్తను తరుముతూ హల్ చల్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్ గా మారింది. -
ఖాకీ కాఠిన్యం..
గ్వాలియర్ః రైల్వే స్టేషన్ లో పిక్ పాకెటింగ్ కు పాల్పడ్డాడన్న అనుమానంతో ఓ బాలుడిపై రైల్వే కానిస్టేబుల్ ప్రతాపం చూపించాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ లో జరిగిన ఘటన అందర్నీ విస్మయ పరచింది. ఎప్పుడూ జనంతో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లో బాలుడి మెడకు టవల్ ను కట్టి, దారుణంగా కొడుతూ ఈడ్చుకెళ్ళడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఆగస్టు 27న ప్లాట్ ఫాం నెంబర్ 1 లో జరిగిన ఘటనపై రికార్డయిన వీడియో వైరల్ గా మారింది. గ్వాలియర్ రైల్వే స్టేషన్ లో బాలుడ్ని తీవ్రంగా హించించిన ప్రభుత్వ రైల్వే పోలీస్ (జీఆర్పీ) ను వీడియో ఆధారంగా హెడ్ కానిస్టేబుల్ హరి నారాయణ్ సింగ్ (50) గా గుర్తించారు. అయితే బాలుడ్ని విచక్షణా రహితంగా కొడుతూ, ప్లాట్ ఫాం పై ఈడ్చుకెళ్ళిన కానిస్టేబుల్.. అతడ్ని పోలీస్ స్టేషన్ కు అప్పగించకపోవడంపైనా పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అయితే ఓ ప్రయాణీకుడు తన జేబు కొట్టేశారని ఇచ్చిన కంప్లైంట్ తో... బాలుడ్ని చిల్లర దొంగగా అనుమానించిన జీఆర్పీ సింగ్.. అతడ్ని పట్టుకొని కొట్టడంతోపాటు ఈడ్చుకుంటూ వెళ్ళడంతో సదరు బాలుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వీడియోను వీక్షించిన రైల్వే పోలీసు అన్నతాధికారులు హెడ్ కానిస్టేబుల్ సింగ్ ను సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. -
గ్వాలియర్లో ఉద్రిక్తత
♦ మొహరం ర్యాలీ రూటు మార్చారని ఆందోళన.. కర్ఫ్యూ విధింపు ♦ జార్ఖండ్లో రాళ్లు రువ్వుకున్న ఇరు వర్గాలు, ఒకరి మృతి ♦ బిహార్, యూపీల్లో స్వల్ప ఘర్షణలు న్యూఢిల్లీ: మొహరం సందర్భంగా చేపట్టిన ర్యాలీలు రెండు, మూడు చోట్ల ఉద్రికత్తకు దారితీయటంతో.. పలువురికి గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో మొహరం ర్యాలీ సందర్భంగా తలెత్తిన ఘర్షణలతో కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. శుక్రవారం రాత్రి ఓ రూట్లో ర్యాలీకి అనుమతిచ్చిన పోలీసులు.. ఉదయం రూటు మార్చటంతో కొందరు యువకులు ఆందోళన చేపట్టారు. కొన్ని చోట్ల రాళ్లు రువ్వటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో కర్ఫ్యూ విధించాల్సి వచ్చిందని.. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని.. పోలీసులు తెలిపారు. జార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లాలో మొహర్రం ర్యాలీ సందర్భంగా రెండు వర్గాల మధ్య గొడవ హింసాత్మకంగా మారటంతో ఒకరు మృతిచెందగా.. 9మందికి గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి 70 రౌండ్ల కాల్పులు జరపాల్సి వచ్చింది. బిహార్లోని మధుబని ప్రాంతంలో.. తాజియా ర్యాలీ సందర్భంగా రెండు వర్గాలు రాళ్లు రువ్వుకోవటంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని రెండు ప్రాంతాల్లో చిన్న చిన్న ఘటనలు మినహా మొహరం ప్రశాంతంగానే జరిగింది. కోల్కతాలో పెద్ద సంఖ్యలో షియాలు మొహరం ర్యాలీల్లో పాల్గొన్నారు. పరిస్థితిని ఊహించిన పోలీసులు శనివారం.. దుర్గాదేవి విగ్రహాల నిమజ్జనాన్ని ఆదివారానికి వాయిదా వేశారు. ఇవి మినహా దేశ వ్యాప్తంగా మొహర్రం ప్రశాంతంగా జరిగింది. -
మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జికి సుప్రీం నోటీసు
న్యూఢిల్లీ: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. మహిళా జడ్జి చేసిన ఆరోపణలపై మధ్యప్రదేశ్ ఏర్పాటు చేసిన కమిటీ వ్యవహారాలపై అత్యున్నత ధర్మాసనం స్టే విధించింది. మధ్యప్రదేశ్లోని హైకోర్టు గ్వాలియర్ బెంచ్ జడ్జి తనను లైంగికంగా వేధించారని గ్వాలియర్లో అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా పనిచేసిన ఓ మహిళ ఇటీవల సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. ఆ జడ్జి తనను ఓ ఐటెం సాంగ్కు డాన్సు చేయమన్నారని ఆమె ఆరోపించారు. ఆ న్యాయమూర్తి తనను ఒంటరిగా తన బంగ్లాకు రమ్మన్నారని ఆమె తెలిపారు. -
దుశ్శాసన పర్వం!
ఈ జనారణ్యంలో ఆడపిల్లలను వేధించుకుతినే తోడేళ్లు ఫలానాచోటే కాచుక్కూర్చుంటాయనడానికి లేదు. అవి ఎక్కడైనా తారసపడొచ్చు. ఇల్లా, వీధి చివరి మూల మలుపా, నడిరోడ్డా, బస్సా, రైలా, స్కూలా, ఆఫీసా అన్న విచక్షణేమీ లేదు. ఈ జాబితాకు న్యాయదేవత కొలువుదీరిన పవిత్ర స్థలం కూడా మినహాయింపుకాదని తాజా ఉదంతం వెల్లడిస్తున్నది. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి ఒకరు తనను ఎన్నోసార్లు లైంగికంగా వేధించాడని, కించపరిచేలా మాట్లాడాడని, ఈ విషయంలో తన మొర ఆలకించేవారెవరూ లేరని నిర్ధారించుకున్నాక ఉద్యోగానికి రాజీనామా చేశానని గ్వాలియర్ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం. లోధాకు లేఖ రాశారు. ఈ లేఖ అందాక దిద్దుబాటు చర్యలు మొదలయ్యాయి. మహిళా న్యాయమూర్తి ఆరోపణల్లో నిజమున్నదని తేలితే తగిన చర్య తీసుకుంటామని జస్టిస్ లోధా చెప్పారు. న్యాయ పీఠంపై ఆరోపణలు రావడం ఇది మొదటిసారేమీ కాదు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఏకే గంగూలీ, జస్టిస్ స్వతంత్ర కుమార్లు తమతో అసభ్యంగా ప్రవర్తించారని ఇద్దరు యువతులు ఆమధ్య ఆరోపించారు. వాటితో పోలిస్తే ఇప్పడు వెల్లడైన ఉదంతం చాలా అసాధారణమైనది. ఆ రెండు సందర్భాల్లోనూ యువతులు కొత్తగా న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించినవారు. తమకు ఎదురైన అనుభవాలను ఎవరితో చెప్పుకోవాలో తెలియనివారు. చెబితే ఏమవుతుందో, ఎటు దారితీస్తుందోనని అయోమయంలో ఉన్నవారు. అందువల్లే ఫిర్యాదుచేయడానికి వారు జంకారు. చాలా సమయం తీసుకున్నాకే ధైర్యం కూడగట్టుకోగలిగారు. ఇక్కడ బాధితురాలు స్వయానా న్యాయమూర్తి. పదిహేనే ళ్లపాటు న్యాయవాద వృత్తిలో పనిచేసి జిల్లా స్థాయి అదనపు న్యాయమూర్తిగా పనిచేస్తున్నవారు. పైగా లైంగిక వేధింపుల కేసుల్ని పరిశీలించే జిల్లా స్థాయి విశాక కమిటీ చైర్పర్సన్. ఆ స్థాయిలో ఉన్నవారికే లైంగిక వేధింపులు తప్పలేదంటే పరిస్థితి ఎంతవరకూ వచ్చిందో అర్ధంచేసుకోవచ్చు. తమకు ఎక్కడా న్యాయం జరగలేదని భావించినప్పుడు బాధితులు చిట్టచివరిగా తలుపుతట్టేది న్యాయవ్యవస్థనే. అక్కడికెళ్తే తమకు తప్పక న్యాయం లభిస్తుందని ఈ దేశ ప్రజల్లో అత్యధికులు నమ్ముతారు. అలాంటి నమ్మకాన్ని వమ్ము చేయగలిగిన ప్రబుద్ధులు కూడా ఇందులో చేరారని తాజా ఉదంతం రుజువు చేస్తున్నది. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధమని హైకోర్టు న్యాయమూర్తి చెబుతున్నారు. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు కూడా సిద్ధమేనం టున్నారు. మహిళా న్యాయమూర్తిపట్ల ఆయన వ్యవహరించిన తీరుపై సాక్ష్యాధారాలుండకపోవచ్చు. ఒక శుభకార్యంలో కలిసినప్పుడు ‘నీ పనితీరు చాలా బాగుంది. అంతకన్నా నీ అందం మరింత బాగుం దంటూ ఆయన చేసిన దుర్వ్యాఖ్యకు ప్రత్యక్ష సాక్షులుండకపోవచ్చు. ‘ఐటెం సాంగ్’కు నృత్యం చేయమని ఒక న్యాయమూర్తి భార్యతో ఫోన్ చేయించిన ఉదంతానికీ ఆధారాలు దొరక్కపోవచ్చు. ‘ఒంటరిగా ఓసారి నా బంగ్లాకు రా’ అని అడిగినప్పుడు చుట్టూ ఎవరూ ఉండకపోవచ్చు. ‘నీ కెరీర్ను సర్వనాశనం చేస్తాన’ని హెచ్చరించి నప్పుడు కూడా ఎవరూ వినకపోయి ఉండొచ్చు. విన్నా ధైర్యంగా చెప్పడానికి ముందుకు రాకపోవచ్చు. కానీ, ఈ ఏడాది జనవరిలో రూపొందిన వార్షిక రహస్య నివేదిక ఆ మహిళా న్యాయమూర్తి పనితీరు ఎన్నదగినదని పేర్కొన్నది. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆమెపై వేధింపుల పరంపర ఎందుకు ప్రారంభమైంది? ఏవో కారణాలు చూపి ఆమెను గ్వాలియర్ నుంచి మారుమూల ప్రాంతానికి ఎందుకు బదిలీచేయాల్సి వచ్చింది? దీనివల్ల తన పిల్లల చదువు దెబ్బతింటుందని, ఎనిమిది నెలల వ్యవధినిస్తే అక్కడకు వెళ్లేందుకు తాను సిద్ధమని చెప్పినా ఎందుకు వినిపించుకోలేదు? తన విషయంలో సదరు న్యాయమూర్తి అనవసర శ్రద్ధ కనబర్చడం మొదలుపెట్టాక కోర్టుకు అరగంట ముందుగా రావడం, గంట అదనంగా పనిచేయడం కొనసాగించానని, అయినా వేధింపులు తప్పలేదని ఆమె ఆరోపిస్తున్నారు. న్యాయమూర్తి స్థానంలో ఉన్నవారే...సమాజంలో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న అసహాయ మహిళలకు ఆసరాగా ఉండాల్సినవారే అభద్రతా భావంతో, ఆత్మన్యూనతా భావంతో పనిచేసే పరిస్థితులుండటం విస్మయం కలిగిస్తుంది. చదువూ, సంస్కారమూ కొరవడినవారు మాత్రమే అవివేకంగా ప్రవర్తిస్తారని అందరూ అనుకుంటారు. కానీ ఉన్నత చదువులు చదివినవారూ, బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నవారూ ఇంత అధమాధమంగా వ్యవహరిస్తారని వర్తమాన పరిణామాలను గమనిస్తే అర్ధమవుతుంది. స్త్రీ-పురుష సమానత్వం విషయంలో మన దేశం ఎన్నో వర్ధమాన దేశాలతో పోల్చినా చాలా వెనకబడి ఉన్నదని ఆమధ్య ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి నివేదిక తెలిపింది. ఆడపిల్ల పుట్టింది మొదలుకొని పెరిగి పెద్దయ్యేవరకూ ఎన్నో రూపాల్లో వివక్షకు గురవుతున్నది. ఈ పరిస్థితిని మార్చడానికి న్యాయవ్యవస్థ కూడా తన వంతు కృషి చేస్తున్నది. ఈ ప్రయత్నాలకు సమాంతరంగా మహిళలను కించపరిచేలా, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా, వారిలోని ప్రతిభాపాటవాలు సమాధయ్యేలా వ్యవహరిస్తున్న దుశ్శాసనులు పెరిగిపోతున్నారు. అలాంటివారు న్యాయవ్యవస్థలో సైతం చొరబడ్డారని ఇటీవలి ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుత ఉదంతంలో మహిళా న్యాయమూర్తికి న్యాయం లభించేలా కృషిచేయడంతోపాటు ఇలాంటి ఫిర్యాదులను పరిశీలించేందుకు శాశ్వత ప్రాతిపదికన ఒక కమిటీని ఏర్పాటుచేసే అంశాన్ని సుప్రీంకోర్టు పరిశీలించాలి. అంతకన్నా ముందు ఆమె గౌరవప్రదంగా తన ఉద్యోగం చేసుకునేందుకు తోడ్పడాలి. -
హైకోర్టు జడ్జి డ్యాన్స్ చేయమన్నారు: మహిళా జడ్జి
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లోని హైకోర్టు గ్వాలియర్ బెంచ్ జడ్జి వ్యవహారంపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)దాఖలైంది. మహిళా జడ్జిని హైకోర్టు జడ్జి లైంగికంగా వేధించారని ఆ పిల్లో ఆరోపించారు. హైకోర్టు జడ్జిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, విచారణ చేపట్టాలని పిటిషనర్ తన పిల్లో కోరారు. గ్వాలియర్లో అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్న ఓ మహిళ తనను హైకోర్టులోని ఓ జడ్జి లైంగికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ జడ్జి తనను ఓ ఐటెం సాంగ్కు డాన్సు చేయమన్నారని కూడా ఆమె ఆరోపించారు. ఆ న్యాయమూర్తి తనను ఒంటరిగా తన బంగ్లాకు రమ్మన్నారని ఆమె తెలిపారు. ఈ విషయాలు చెప్పేందుకు ప్రయత్నించగా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తనకు అనుమతి ఇవ్వలేదని ఆమె తెలిపారు. దాంతో ఇక తాను ఏమీ చేయలేని పరిస్థితిలో, తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోడానికి జ్యుడీషియల్ సర్వీసుకు రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ మేరకు ఆమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ ఎం లోధా, న్యాయమూర్తులు జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ అనిల్ రమేష్ దవే, జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో పాటు మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. ఇదిలాఉండగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్జి తాను ఎటువంటి విచారణకైనా సిద్ధమేనని మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. మహిళా న్యాయమూర్తి ఆరోణలను ఆయన ఖండించారు. -
పడవ మునక, 6గురు మృతి, 18 మంది గల్లంతు
మధ్యప్రదేశ్ లో ఒక పడవ నీట మునిగిపోవడంతో ఆరుగురు పనివాళ్లు జలసమాధి అయిపోయారు. ఈ సంఘటన సోమవారం తెల్లవారు జామున జరిగింది. మధ్యప్రదేశ్ లోని దతియా, గ్వాలియర్ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న సింధునదిలో నీటి వేగానికి పడవ కొట్టుకుపోయింది. ఆ తరువాత అదుపు తప్పి మునిగిపోయింది. ఆ సమయంలో పడవలో దాదాపు 25 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో చాలా మంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ప్రయాణిస్తున్న వారంతా గల్లంతయ్యారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పడవ చాలా పాతది కావడం, అందులో ఎక్కాల్సిన వారికన్నా చాలా ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఎక్కడంతో ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు చెబుతున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. -
కూలిన ఐఏఎఫ్ కొత్త విమానం
ఐదుగురు సిబ్బంది మృత్యువాత కొండను ఢీకొట్టడంతో ప్రమాదం! న్యూఢిల్లీ/జైపూర్: భారత వైమానిక దళానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల కొనుగోలు చేసిన అమెరికా తయూరీ రవాణా విమానం ఒకటి శుక్రవారం గ్వాలియర్ సమీపంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో అందులో ఉన్న మొత్తం ఐదుగురు సిబ్బంది మరణించారు. జైపూర్లోని రక్షణ శాఖ వర్గాల కథనం ప్రకారం.. సి-130 జే అనే ఈ అత్యాధునిక రవాణా విమానం ఉదయం 10 గంటల సమయంలో రోజువారీ కసరత్తులో భాగంగా ఆగ్రా వైమానిక స్థావరం నుంచి బయలుదేరింది. అరుుతే 11 గంటల సమయంలో గ్వాలియర్ వైమానిక స్థావరానికి పశ్చిమంగా 70 మైళ్ల దూరంలో.. గోటాఘాట్ ప్రాంతం వద్ద చంబల్ నది ఒడ్డున ఈ విమానం కుప్పకూలిందని రక్షణ శాఖ తెలిపింది. ఇద్దరు వింగ్ కమాండర్లు పి.జోషి, ఆర్.నాయర్, ఇద్దరు స్క్వాడ్రన్ లీడర్లు కె.మిశ్రా, ఎ.యూదవ్ (నేవిగేటర్), వారంట్ ఆఫీసర్ కె.పి.సింగ్ ఈ ప్రమాదంలో మరణించినట్లు పేర్కొంది. ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించినట్లు వైమానిక దళ ప్రతినిధి ఒకరు న్యూఢిల్లీలో చెప్పారు. చిన్న కొండను ఢీకొట్టిన విమానం కుప్పకూలి మంటల్లో చిక్కుకున్నట్టుగా సమీప గ్రామస్తుల కథనాన్ని బట్టి తెలుస్తోందని కరౌలి జిల్లా కలెక్టర్ చెప్పారు. సుమారు రూ.6వేల కోట్ల వ్యయంతో అమెరికా నుంచి కొనుగోలు చేసిన ఆరు సి-130 జే సూపర్ హెర్క్యులస్ విమానాలను రక్షణ శాఖ ఇటీవలే ఐఏఎఫ్లో ప్రవేశపెట్టింది. ఈ విమానం 20 టన్నుల వరకు బరువును రవాణా చేయగలదు. అతి త క్కువ ఎత్తులో ఎగరడం వంటి వ్యూహాత్మక కసరత్తు కోసం ఈ తరహా విమానాలు రెండు టేకాఫ్ తీసుకోగా ఇందులో ఒకటి ప్రమాదానికి గురైందని అధికారులు చెప్పారు. గ్రౌండ్ కంట్రోల్తో సంబంధాలు కోల్పోయేముందు అత్యవసర పరిస్థితికి సంబంధించిన ఎలాంటి సమాచారం విమానం నుంచి అందలేదన్నారు. -
పులి బోనులో క్యాబరే డాన్స్
పులి నోట్లో తల దూర్చడమంటే మాటలా? మధ్యప్రదేశ్ లో ఒక ఇంజనీరింగ్ కుర్రాడు దాదాపు ఇలాంటి పనేచేశాడు. మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ జూకి వెళ్లి పులుల బోనులోకి దూకేశాడు. అంతేకాదు పులుల క్లబ్బులో క్యాబరే డాన్సర్ గా మారి నడుం ఊపి, కాలు కదిపి 'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే' పాడేశాడు. ఆ కుర్రాడి పేరు యశోనందన్ కౌశిక్. వయసు 23 ఏళ్లు. ఇండోర్ లో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ చదువుకుంటున్నాడు. సోమవారం జూకి వెళ్లి, ఇరవై అడుగుల ఎత్తైన బోను ఎగబాకి ఎక్కి, లోపలికి దూకేశాడు. లోపల డాన్సులు చేశాక, పులులు నీరుతాగేందుకు ఏర్పాటు చేసిన చిన్న నీటి గుంటలో ముఖం,కాళ్లు, చేతులు కడుక్కున్నాడు. ఈ తతంగమంతా దాదాపు అరగంట పాటు సాగింది. పులులకు ఈ డ్యాన్సు బాగా నచ్చిందేమో... తాపీగా కూర్చుని చూస్తూ ఊరుకున్నాయే తప్ప ఏమీ చేయలేదు. అంతలో ఈ వింత చూసిన మిగతా పర్యాటకులంతా పరుగుపరుగున వెళ్లి జూ అధికారులకు చెప్పారు. వారు వచ్చి ఈ కుర్రాడిని బయటకు లాక్కొచ్చారు. 'మా అబ్బాయి గత నాలుగు రోజులుగా నిద్రపోలేదు. దానివల్లే ఇలా చేశాడేమో' అన్నారట కౌశిక్ తల్లిదండ్రులు. గతేడాది అక్టోబర్ లో ఇలాగే ఒకాయన భువనేశ్వర్ లోని నందన్ కానన్ జూలోని సింహాల బోనులోకి ప్రవేశించి, మాంసం ముద్దై బయటకు వచ్చాడు. 2007 లో గువహటి జూ లో ఒకాయన బోనులో చేతులు దూర్చి మరీ తన సెల్ ఫోన్ లో పులుల ఫోటో తీయబోయాడు. ఆ ఫోనూ, ఆయన చెయ్యి బోనులోనే ఉండిపోయాయి. అవును మరి... పులిని చూడాలనుకుంటే చూడొచ్చు. కాస్త దగ్గరికి వెళ్లి ఫోటో దిగాలనుకుంటే దిగొచ్చు. ఫరవాలేదులే అని మరీ జూలు పట్టుకుంటే .... వేటాడేస్తది. అన్ని పులులూ గ్వాలియర్ జూలో లాంటి పులుల్లా ఉండవు మరి !! -
రాణి పునరాగమనం
పోయినచోటే వెతుక్కొమ్మన్నారు. వసుంధర రాజె సింధియా కూడా సరిగ్గా అదే చేశారు. బీజేపీలో అంతర్గత కుమ్ములాటల కారణంగా ఐదేళ్ల క్రితం తన చేజారిన అధికారాన్ని, అదే పార్టీని ఏకతాటిపై నడిపించడం ద్వారా ఇప్పుడు హస్తగతం చేసుకున్నారు. గ్వాలియర్ను పాలించిన సింధియా రాజవంశానికి చెందిన 60 ఏళ్ల రాజెది ఆకర్షణీయమైన వ్యక్తిత్వం. సంప్రదాయ రాజస్థానీ గిరిజన వేషధారణతో గ్రామీణ మహిళలతో కలగలిసిపోయి వారి సమస్యలను ఓపిగ్గా ఆలకించినా, రాహుల్దేవ్ వంటి మోడల్స్తో కలిసి రాంప్ వాక్ చేసినా ఆమెకే చెల్లింది. బీజేపీ వ్యవస్థాపక సభ్యురాలు విజయరాజె సింధియా కూతురు, దివంగత కాంగ్రెస్ నేత మాధవరావ్ సింధియా సోదరి అయిన రాజె ముంబై యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్లో డిగ్రీ చేశారు. రాజస్థాన్కు చెందిన జాట్ కులస్తుడిని పెళ్లాడారు. కులమతాలకు అతీతంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికీ ఆమోదనీయురాలైన నేతగా ఎదిగారు. మూడుసార్లు అసెంబ్లీకి, ఐదుసార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. 2003లో రాజస్థాన్కు తొలి మహిళా ముఖ్యమంత్రి అయ్యారు. భైరాన్సింగ్ షెకావత్ వంటి దిగ్గజాలకే ఎన్నడూ సాధ్యపడని రీతిలో బీజేపీకి ఏకంగా 120 సీట్లు సాధించిపెట్టారు. రాజస్థాన్లో బీజేపీకి మెజారిటీ దక్కడం అదే తొలిసారి. పాలనపై ఆమెకున్న పట్టు తిరుగులేనిదని చెబుతారు. అయితే ఏకపక్ష పోకడలు, ఎవరికీ అందుబాటులో ఉండని నైజంతో 2008లో రాష్ట్రంలో బీజేపీని ఆమే చేజేతులా ఓడించారని విమర్శకులు అంటుంటారు. ఆమె ఒంటెత్తు పోకడలను గుజ్జర్లు, మీనాల వంటి ప్రాబల్య వర్గాల వారు జీర్ణించుకోలేకపోయారని కూడా చెబుతారు. తన తల్లికి పూర్తి భిన్నంగా ఆరెస్సెస్ను, అనుబంధ సంస్థలను దూరంగా ఉంచుతారని రాజెకు పేరుంది. 2009 లోక్సభ ఎన్నికల్లో రాజస్థాన్లో 25 స్థానాలకు గాను బీజేపీ కేవలం 4 మాత్రమే గెలవడంతో రాజె ప్రతిష్ట బాగా మసకబారింది. పార్టీ సూచన మేరకు విపక్ష నేత పదవికి కూడా ఆమె రాజీనామా చేశారు. కానీ రాజె నెమ్మదిగా బలం కూడదీసుకున్నారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆరెస్సెస్ తెరపైకి తెచ్చిన గులాబ్చంద్ కటారియాను పక్కన పెట్టేలా పార్టీ పెద్దలను ఒప్పించగలిగారు. నరేంద్ర మోడీతో రాష్ట్రవ్యాప్తంగా విసృ్తతంగా ప్రచారం చేయించడం కూడా రాజెకు బాగా కలిసొచ్చిందన్నది పరిశీలకుల అభిప్రాయం.