Hockey India
-
నేటి నుంచి జాతీయ మహిళల హాకీ టోర్నీ
పంచ్కులా: సీనియర్ మహిళల జాతీయ హాకీ చాంపియన్షిప్ను కొత్త ఫార్మాట్లో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి ఈ నెల 12 వరకు హరియాణాలోని పంచ్కులాలో ఈ మెగా టోర్నీ జరుగనుంది. మొత్తం 28 జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ సీజన్లో ఈ 28 జట్లు ఎ, బి, సి గ్రూపుల్లో తలపడతాయి. ఈ తాజా ప్రదర్శనే ప్రామాణీకంగా తదుపరి సీజన్ గ్రూపుల్లో జట్లు మారతాయి. అంటే రంజీ క్రికెట్ తరహాలో రాష్ట్ర హాకీ జట్లు మూడు గ్రూపులుగా విభజించి నిర్వహిస్తారు. తద్వారా ఉత్తమ, మధ్యమ, అధమ స్థాయి జట్ల మధ్య పోటీలు జరుగుతాయి. సిలో చిన్న జట్లు మెరుగైన ప్రదర్శన కనబరిస్తే మధ్యమ స్థాయి ‘బి’కి... తర్వాత ఉత్తమ స్థాయి ‘ఎ’కి ఆయా జట్లకు ప్రమోషన్ లభిస్తుంది. తద్వారా బలమైన జట్టుతో బలహీనమైన జట్టు పోటీపడదు. సమఉజ్జీల మధ్యే సమరం జరగడం వల్ల పోటీ వాతావరణం క్రమంగా పెరిగి ఆయా జట్లు పురోగతి సాధిస్తాయని ‘హాకీ ఇండియా’ భావిస్తోంది. ఈసారి తెలుగు రాష్ట్రాల జట్లకు ‘ఎ’ డివిజన్లో పోటీపడే అవకాశం లభించలేదు. తెలంగాణ ‘బి’ డివిజన్లోని పూల్ ‘ఎ’లో ఉన్న ఉత్తరప్రదేశ్, అస్సాం, రాజస్తాన్, బిహార్లతో తలపడుతుంది. ‘సి’ డివిజన్లోని పూల్ ‘బి’లో ఉన్న ఆంధ్రప్రదేశ్... పుదుచ్చేరి, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్లతో పోటీ పడుతుంది. ‘ఎ’ డివిజన్లో... పూల్ ‘ఎ’: హరియాణా, ఒడిశా, కర్ణాటక; పూల్ ‘బి’: మహారాష్ట్ర, మణిపూర్, పంజాబ్; పూల్ ‘సి’: జార్ఖండ్, మిజోరం, తమిళనాడు; పూల్ ‘డి’: మధ్యప్రదేశ్, బెంగాల్, ఉత్తరప్రదేశ్. ‘బి’ డివిజన్లో... పూల్ ‘ఎ’: తెలంగాణ, ఉత్తరప్రదేశ్, అస్సాం, రాజస్తాన్, బిహార్; పూల్ ‘బి’: ఢిల్లీ, ఛత్తీస్గఢ్, చండీగఢ్, హిమాచల్ప్రదేశ్. ‘సి’ డివిజన్లో... పూల్ ‘ఎ’: కేరళ, దాద్రా నాగర్ హవేలి, డామన్ అండ్ డియూ, గుజరాత్; పూల్ ‘బి’: ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్. -
Rani Rampal: మకుటం లేని మహారాణి
భారత పురుషుల హాకీ జట్టుకు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. దిగ్గజాలూ ఉన్నారు. కానీ మహిళల హాకీకి ఆదరణే అంతంత మాత్రం! ఇలాంటి ఆటలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన రాణి రాంపాల్... తన ఆటతీరుతో నిజంగా ‘రాణి’గా ఎదిగింది. బాల్యంలో పేదరికం వెంటాడినా... పెద్దయ్యాక ఆటలో గోల్స్ వేటలో పడింది. మేటి ఫార్వర్డ్ ప్లేయర్గా, తదనంతరం కెప్టెన్ గా జట్టును నడిపించింది. టోక్యో ఒలింపిక్స్లో ఆమె సారథ్యంలోని భారత మహిళల జట్టు త్రుటిలో కాంస్యం కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచింది. న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ జట్టు మాజీ కెప్టెన్ రాణి రాంపాల్ తన 16 ఏళ్ల కెరీర్కు వీడ్కోలు పలుకుతున్నట్లు గురువారం ఆమె ప్రకటించింది. మహిళల జట్టులో అరుదైన మేటి క్రీడాకారిణిల్లో ఆమె ఒకరు. ‘పారిస్’ కంటే ముందు జరిగిన టోక్యో విశ్వక్రీడల్లో భారత మహిళల జట్టుకు పతకం రేసులో నిలిచే సత్తా ఉందని తన సారథ్యంతో చాటి చెప్పిన స్టార్ ఫార్వర్డ్ రాణి. దురదృష్టవశాత్తూ కాంస్య పతక పోరులో రాణి బృందం ఓడి చివరకు నాలుగో స్థానంలో నిలిచింది. భారత మహిళల హాకీ చరిత్రలో ఒలింపిక్స్ పతకం లేకపోవచ్చేమో గానీ... నాలుగో స్థానంతో దేశంలో మహిళల హాకీ భవిష్యత్తుకు బంగారు బాట వేసింది. ఇదీ నేపథ్యం... హరియాణాలోని మారుమూల పల్లెకు చెందిన నిరుపేద కుటుంబ నేపథ్యం రాణి రాంపాల్ది. తండ్రి రాంపాల్ రోజూ బండిలాగితే వచ్చే అరకొర డబ్బులతో వీరి కుటుంబం పూట గడిచేది. అలాంటి చిన్నారి ఓ హాకీ స్టిక్ చూడగలదేమో కానీ కొనుక్కోలేదు. బాల్యంలో సరైన తిండిలేక పోషకాహార లోపంతో కనబడే రాణిని చూసిన జిల్లాస్థాయి కోచ్ ఆమెకు కోచింగ్ నిరాకరించాడు. కానీ ఆ బాలిక మాత్రం మక్కువ పెంచుకున్న హాకీ ఆటపై మనసు లగ్నం చేసింది. విరిగిపోతే పడేసిన ఓ హాకీ స్టిక్తో అదేపనిగా ప్రాక్టీస్ చేసింది. అలా మెల్లిగా స్థానిక జట్టులోకి వచ్చి... ఎన్నో ఒడిదొడుకులు, పేదరికపు కష్టాలు, ఆటుపోట్లకు ఎదురీది ఎట్టకేలకు 14 ఏళ్ల వయసులో భారత జట్టులోకి ఎంపికై అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. ఆ తర్వాత ఏళ్లు గడుస్తున్న కొద్దీ పేరుకు తగ్గట్టే భారత మహిళల హాకీ జట్టుకు ‘రాణి’ అయ్యింది. ఫీల్డ్లో చక్కని సమయస్ఫూర్తి, పాస్లలో చురుకుదనం, ప్రత్యర్థి గోల్పోస్ట్ వద్ద కొరకరాని ఫార్వర్డ్గా ఎదిగింది. తదనంతరం జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టాక భారత్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆసియా క్రీడలు, ప్రపంచకప్, ఒలింపిక్స్లో మహిళల జట్టుకు అద్భుతం చేసే సత్తా ఉందని కెప్టెన్ గా నిరూపించింది. తాజాగా 29 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ ప్రకటించింది. కెరీర్లో ఘనతలు స్టార్ ఫార్వర్డ్ రాణి సారథ్యంలోనే టోక్యో ఒలింపిక్స్లో భారత్కు నాలుగో స్థానం లభించింది. 2018 మహిళల ప్రపంచకప్ హాకీ (లండన్)లో క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించింది. అదే ఏడాది ఆసియా క్రీడల్లో రాణి జట్టు రజత పతకం గెలిచింది. చిరు ప్రాయంలో అంతర్జాతీయ కెరీర్ను ఆరంభించిన ఆమె 254 అంతర్జాతీయ మ్యాచ్లాడి 205 గోల్స్ చేసింది. 2020లో ఆమె ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డును ప్రదానం చేసింది. అదే ఏడాది నాలుగో పౌర పురస్కారమైన ‘పద్మశ్రీ’ కూడా ఆమె కీర్తి కిరీటంలో చేరింది. ఆమె 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో సాధించిన మైలురాళ్లకు ఘనమైన గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించుకున్న హాకీ ఇండియా ఆమె జెర్సీ నంబర్ 28కి రిటైర్మెంట్ ఇచ్చింది. గురువారం న్యూఢిల్లీలో భారత్, జర్మనీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం రాణిని కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవియా సన్మానించి రూ. 10 లక్షలు నగదు పురస్కారం అందజేశారు. నాకే ఆశ్చర్యమనిపిస్తోంది నా క్రీడా ప్రయాణం చూసుకుంటే నాకే ఆశ్చర్యమేస్తుంది. ఇన్నేళ్లు భారత్కు ఆడతానని ఏనాడు అనుకోలేదు. బీదరికంలో కష్టాలు చూసిన ఆ కళ్లతోనే ఆటపై దృష్టి పెట్టాను. అనుకున్నది సాధించాను. సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ ఏనాడూ నిరాశ చెందలేదు. భారత్కు ఆడటంపట్ల ఎంతో గర్విస్తున్నాను. నిజం చెప్పాలంటే నేను 254 మ్యాచ్ల్లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాననని గానీ, 200 పైచిలుకు గోల్స్ సాధిస్తానని గానీ ఎప్పుడు అనుకోలేదు. బాల్యంలో నాన్న ఆ తర్వాత కుటుంబం, నా కోచ్ బల్దేవ్ సింగ్ నా లైఫ్ను తీర్చిదిద్దారు. బల్దేవ్లాంటి కోచ్, టీచర్ దొరకడమే నా అదృష్టం. ఆటలో నైపుణ్యం నేర్పిన అతను జీవితానికి సరిపడా పాఠాలూ చెప్పారు. రిటైర్మెంట్ నిర్ణయం కఠినమైనా తప్పదు. దీనికిదే సరైన సమయమని భావిస్తున్నా. భారత సబ్ జూనియర్ జట్టుకు ఇటీవల కోచ్గా నన్ను నియమించారు. త్వరలో జరిగే హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో హరియాణా–పంజాబ్కు చెందిన సూర్మా హాకీ మహిళల జట్టుకు కోచ్, మెంటార్గా సరికొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నాను. ఒలింపిక్స్లో మా జట్టు పోడియంలో నిలువలేదు... కానీ భవిష్యత్తులో తప్పకుండా పతకాలు సాధిస్తుంది. –రాణి రాంపాల్ -
PR Sreejesh: జెర్సీ నంబర్ 16కు వీడ్కోలు
న్యూఢిల్లీ: భారత దిగ్గజ గోల్కీపర్ శ్రీజేశ్ ఇకపై హాకీ మైదానంలో కనిపించడు. అలాగే అతని జెర్సీ నంబర్ 16 కూడా కనిపించదు. గోల్పోస్ట్ ముందు ప్రత్యర్థులకు అడ్డుగోడలా నిలబడి భారత జట్టుకు విశేష సేవలందించిన శ్రీజేశ్ ఘనకీర్తికి గుర్తుగా ఆ జెర్సీకి అతనితోపాటే రిటైర్మెంట్ ఇవ్వాలని హాకీ ఇండియా (హెచ్ఐ) నిర్ణయించింది. బుధవారం ఒలింపిక్స్ కాంస్య పతక విజేత జట్టు సభ్యులను ఘనంగా సన్మానించారు. శ్రీజేశ్కు రూ. 25 లక్షల నగదు పురస్కారం చెక్ రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా హెచ్ఐ అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్ టిరీ్క, భోళానాథ్ సింగ్లు మాట్లాడుతూ శ్రీజేశ్ను ఆకాశానికెత్తారు. ఆధునిక భారత హాకీకి అతనొక దేవుడని కితాబిచ్చారు. భారత సీనియర్ పురుషుల జట్టులో 16వ నంబర్ జెర్సీని ఎవరికీ కేటాయించబోమని భోళానాథ్ చెప్పారు. ‘శ్రీజేశ్ త్వరలోనే జూనియర్ భారత జట్టు కోచ్గా వెళతారు. ఘనమైన కెరీర్కు అతను వీడ్కోలు పలికితే ... హాకీ ఇండియా అతని ఘనకీర్తికి గుర్తుగా జెర్సీ నంబర్ 16కు రిటైర్మెంట్ ఇచ్చింది. అయితే ఇది సీనియర్ స్థాయికే పరిమితం. జూనియర్ జట్టులో 16వ జెర్సీ యథాతథంగా కొనసాగుతుంది’ అని ఆయన వివరించారు. -
రిటైర్మెంట్ ప్రకటించిన భారత హాకీ లెజెండ్..
భారత హాకీ లెజెండ్ పీఆర్ శ్రీజేష్ తన 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్కు విడ్కోలు పలికేందుకు సిద్దమయ్యాడు. ప్యారిస్ ఒలింపిక్స్-2024 తర్వాత శ్రీజేష్ అంతర్జాతీయ హాకీకి రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. ఈ విషయాన్ని అతడు సోమవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఎక్స్(ట్విటర్)లో భావోద్వేగ నోట్ షేర్ చేశాడు. "ప్యారిస్లో జరిగే ఒలింపిక్స్ అనంతరం నా కెరీర్కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాడు. భారత జెర్సీని ధరించడం ఇదే చివరి సారి. ఈ సారి ఒలింపిక్స్ కోసం ఎంతో ఆతృగా ఎదురుచూస్తున్నాను. నా ఈ 18 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఇన్నాళ్లు నాకు మద్దతుగా నిలిచిన హాకీ ఇండియా, నా కుటుంబం, సహచరులు, కోచ్లు, అభిమానులందరికి ధన్యవాదాలు. వారి ప్రేమాభిమానాలకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనని. నాపై ఇప్పటికి నమ్మకం ఉంచినందుకు హాకీ ఇండియాకు స్పెషల్ థాంక్స్ చెప్పాలనకుంటున్నాను.నా సహచరలు సైతం కఠినమైన సమయాల్లో నా పక్కనే ఉన్నారు. ఎన్నో టోర్నీల్లో మేమందరం కలిసి విజయం సాధించాము. ఇప్పుడు మరోసారి ప్యారిస్లోనూ మన జెండా ఎగరవేద్దాం" అని ఎక్స్లో శ్రీజేష్ పేర్కొన్నాడు. 2006లో సౌత్ ఆసియన్ గేమ్స్తో అరంగేట్రం చేసిన శ్రీజేష్.. ఎన్నో ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. కెప్టెన్గా, గోల్కీపర్గా భారత్కు చిరస్మరణీయ విజయాలను అందించాడు. రియో ఒలింపిక్స్లో భారత జట్టుకు శ్రీజేష్ సారథ్యం వహించాడు. 2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన భారత హారీ జట్టులో శ్రీజేష్ సభ్యునిగా ఉన్నాడు. ఇది శ్రేజేష్కు నాలుగో ఒలింపిక్స్ కావడం గమనార్హం. అతడి కెరీర్లో రెండు ఆసియా గేమ్స్ బంగారు పతకాలు, రెండు ఆసియా కప్ టైటిల్స్, నాలుగు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ కూడా ఉన్నాయి. 2021లో శ్రేజేష్ 2021లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్నాడు. Once a Champion, Always a Champion 💪🏻#WinItForSreejesh https://t.co/LdR0SP3NMW— Hockey India (@TheHockeyIndia) July 22, 2024 -
పక్షవాతాన్ని జయించి.. ప్యారిస్ ఒలింపిక్స్లో!
సంకల్ప బలం గట్టిగా ఉంటే.. ఎలాంటి అడ్డంకులు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ సుఖ్జీత్ సింగ్. పక్షవాతం బారినా పడినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి.. తన కలను నిజం చేసుకున్నాడు.హాకీ ఆటగాడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుని విశ్వ క్రీడల్లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. పంజాబ్లోని జలంధర్లో 1996లో జన్మించాడు సుఖ్జీత్ సింగ్. అతడి తండ్రి అజిత్ సింగ్ పంజాబ్ పోలీస్ విభాగంలో పనిచేసేవాడు.తండ్రిని చూసిపోలీస్ టీమ్ తరఫున హాకీ ఆడే తండ్రిని చూసి చిన్ననాటి నుంచే గమనించిన సుఖ్జీత్.. ఆటపై మక్కువ పెంచుకున్నాడు. ఆరో ఏటనే హాకీ స్టిక్ చేతబట్టి ఓనమాలు నేర్చాడు.నాటి నుంచి తండ్రి ప్రోత్సాహంతో భారత జట్టులో చోటే లక్ష్యంగా శ్రమించాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ లక్ష్యానికి చేరువగా వచ్చాడు. కానీ.. తానొకటి తలిస్తే దైవమొకటి తలిచినట్లు పక్షవాతం రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. తాత్కాలిక పక్షవాతంఆరేళ్ల క్రితం వెన్నునొప్పి బారిన పడిన సుఖ్జీత్.. కుడికాలు తాత్కాలిక పక్షవాతానికి గురైంది. దీంతో అతడి కలలు కల్లగానే మిగిలిపోతాయేమోనని కుటుంబం భయపడింది. అయితే, తండ్రి ప్రోత్సాహం, తన సంకల్ప బలం వల్ల సుఖ్జీత్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు.భారత జట్టు తరఫున అరంగేట్రం చేసి తానేంటో నిరూపించుకున్నాడు. తద్వారా ప్యారిస్ ఒలింపిక్స్-2024 జట్టులో స్థానం సంపాదించాడు ఈ ఫార్వర్డ్ ప్లేయర్. ఈ నేపథ్యంలో తన ప్రయాణం గురించి మాట్లాడుతూ..ఐదు నెలలు మంచానికే పరిమితం‘‘ఒలింపిక్స్ ఆడటం నా కల. నా కుటుంబం కూడా ఇదే కోరుకుంది. నాకు దక్కిన గొప్ప గౌరవం ఇది. కఠినంగా శ్రమిస్తే కచ్చితంగా ఫలితం వస్తుందని నేను నమ్ముతాను.ఇప్పుడు అది మరోసారి నిరూపితమైంది. జట్టు ప్రయోజనాలే ప్రధానంగా ఆడుతాను. నాపై నమ్మకం ఉంచిన కోచ్లు, సహచర ఆటగాళ్లు తలెత్తుకునేలా చేస్తాను.ఇక హాకీ ఆడలేమోనని భయపడ్డాఅయితే, ఈ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాను. ముఖ్యంగా పాక్షిక పక్షవాతం కారణంగా ఐదు నెలలు మంచానికే పరిమితం కావాల్సిన దుస్థితి వచ్చింది.నా జీవితంలో అత్యంత కఠినమైన దశ అదే. శారీరకంగా.. మానసికంగా చాలా చాలా అలసిపోయాను. నడవలేకపోయాను. కనీసం నా పనులు కూడా నేను చేసుకోలేకపోయాను.ఇక హాకీ ఆడలేమోనని భయపడ్డాను. అయితే, మా నాన్న నన్ను తేలికగా తలవంచనీయలేదు. నొప్పిని భరించేలా తన మాటలతో ఉపశమనం కలిగించారు. నాలో స్ఫూర్తిని రగిల్చారు.ఆయన వల్లే నేను కోలుకోగలిగాను. ప్రస్తుతం నా దృష్టి మొత్తం ప్యారిస్ ఒలింపిక్స్పైనే ఉంది. నా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాను’’ అని సుఖ్జీత్ సింగ్ ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశాడు.పసిడి గెలిచిన జట్లలో సభ్యుడుకాగా రెండేళ్ల క్రితం సుఖ్జీత్ భారత జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. FIH Pro League 2021-2022 సీజన్లో స్పెయిన్తో మ్యాచ్ సందర్భంగా ఎంట్రీ ఇచ్చిన అతడు ఇప్పటి వరకు 70 మ్యాచ్లు ఆడి.. 20 గోల్స్ స్కోరు చేశాడు.భువనేశ్వర్లో జరిగిన హాకీ వరల్డ్కప్లో ఆరు మ్యాచ్లు ఆడిన సుఖ్జీత్.. మూడు గోల్స్ కొట్టాడు. ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో పసిడి పతకం గెలిచిన భారత జట్టులో అతడు సభ్యుడు.గతేడాది ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన జట్టులోనూ సుఖ్జీత్ ఉన్నాడు. మైదానంలో పాదరసంలా కదులుతూ డిఫెన్స్ స్ప్లిట్టింగ్ పాస్లు మూవ్ చేసే సుఖ్జీత్కు, టీమిండియాకు ఆల్ ది బెస్ట్!.. ప్యారిస్ ఒలింపిక్స్లో భాగంగా భారత్ తొలుత న్యూజిలాండ్ను ఢీకొట్టనుంది. పూల్-బిలోని ఇరు జట్ల మధ్య జూలై 27న ఈ మ్యాచ్ జరుగనుంది.చదవండి: ఏడేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వనున్న మాక్సీ!.. కారణం అదే! -
Hockey India: హాకీ ఇండియా సీఈఓ ఎలీనా రాజీనామా
న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్ఐ)లో మరో కుదుపు!... 13 ఏళ్లుగా హాకీ ఇండియాకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా వ్యవహరిస్తున్న ఎలీనా నార్మన్ రాజీనామా చేసింది. ఇటీవలే మహిళల జట్టు చీఫ్ కోచ్ యానిక్ షాప్మన్ కూడా రాజీనామా చేసింది.‘భారత హాకీలోని రెండు గ్రూపుల మధ్య విబేధాలతో గురుతర బాధ్యతలు నిర్వర్తించడం చాలా కష్టం. మూడు నెలలుగా జీతం నిలిపి వేశారు. సంప్రదింపులు, సముదాయింపుతో గతవారం పూర్తిగా జీతం చెల్లించారు’ అని 49 ఏళ్ల ఎలీనా వివరించారు.2011లో సీఈఓగా నియమితులైన ఎలీనా హయాంలోనే భారత్లో రెండు పురుషుల ప్రపంచకప్లు (2018, 2023), రెండు జూనియర్ పురుషుల ప్రపంచకప్లు (2016, 2021) విజయవంతంగా నిర్వహించారు. చదవండి: క్రికెట్పై రాజకీయాలు చేయడం దురదృష్టకరం: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ -
రగులుతున్న 'పనౌటీ' వివాదం! తెరపైకి నాడు ఇందీరా గాంధీ..
రెండు రోజుల్లో రాజస్తాన్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు పోటాపోటీగా ఎన్నికల ప్రచార ర్యాలీలతో హోరెత్తించారు. ఎవరికి వారు మాటల తుటాలతో ఓటర్లను ఆకర్షించేలా ప్రచారం చేశారు. ఐతే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఓ ప్రచార ర్యాలీ మోదీని విమర్శిస్తూ చేసిన పనౌటీ వ్యాఖ్య ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తిపై అలాంటి వ్యాఖ్యలా అని బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. ఈ వ్యాఖ్యల విషయమై రాహుల్పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఏకంగా ఎలక్షన్ సంఘాన్ని కోరింది. అంతటితో ఆగకుండా 1982లో జరిగిన ఆసియా క్రీడల హాకీ ఫైనల్ మ్యాచ్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్పై విమర్శలు ఎక్కిపెట్టింది బీజేపి. ఆ టైంలో ఇందిరాగాంధీ నేరుగా హాకీ మ్యాచ్ని వీక్షించేందుకు స్టేడియంకు వచ్చారని, ఐతే భారత హాకీ జట్టు మ్యాచ్లో వెనుకబడి ఉండటంతో ఆమె మధ్యలో వెళ్లిపోయారంటూ నాటి సంఘటనను గుర్తు చేసింది బీజేపి. అలా మధ్యలో వెళ్లిపోయి ఇందిరా గాంధీ భారత జట్టుని అవమానించారు అని విమర్శించారు. ఇలాంటి ప్రవర్తన నిజంగా క్రీడాకారుల మనోస్థైర్యాన్ని దెబ్బతియడంతో సమానం అంటూ కాంగ్రెస్ని దుమ్మెత్తిపోసింది. కానీ ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ క్రికెట్ ప్రపంచ వరల్డ్ కప్లో అలా చేయలేదని చివరి వరకు ఉండి, భారత జట్టుని కలిసి ప్రశంసించి, స్టైర్యాన్ని నింపితే ఇలానా వ్యాఖ్యానించేదని చీవాట్లు పెట్టింది. రాహుల్ లాంటి అపరిపక్వత వ్యక్తి కూడా ప్రధాని మోదీని విమర్శించడం సిగ్గు చేటు అంటూ మండిపడింది. ఇదిలా ఉండగా అస్సాం ముఖ్యమంత్రి బీజేపీ నేత హిమంత్ శర్మ టీమ్ ఇండియా ప్రపంచ కప్పు ఫైనల్లో ఓడిపోవడానికి భిన్నమైన వివరణ ఇస్తూ విమర్శలు చేశారు. ఇందిరా గాంధీ జయంతి రోజునే ఫైనల్ మ్యాచ్ జరగడంతోనే టీమ్ ఇండియా ఓడిపోయిందన్నారు. అందువల్ల దయచేసి గాంధీ కుటుంబ సభ్యల పుట్టిన రోజున టీం ఇండియా ఎట్టిపరిస్థితుల్లోనూ మ్యాచ్లు ఆడకూదనే విషయం అవగతమైందంటూ వ్యగ్యంగా మాట్లాడారు. ఏదీఏమైన రాహుల్ గాంధీ పనౌటీ వ్యాఖ్యలపై బీజేపీ చాలా గుర్రుగా ఉంది, ఏకంగా రాజస్తాన్ ఎనికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది. కాగా, ఈ రోజు సాయంత్రంతో ఇరు పార్టీల ప్రచార ర్యాలీకి తెరపడనుంది. ఈ నెల 25న రాజస్తాన్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగునుంది. (చదవండి: ఆ రెండు భారతదేశానికి రాహు-కేతువులు! అమిత్ షా ఫైర్) -
భారత్ నుంచి ఒక్కరే... ఒలింపిక్స్లో రఘు ప్రసాద్! ప్రతిష్టాత్మక ఈవెంట్లో నీరజ్..
Paris Olympics 2024: వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో హాకీ ఈవెంట్లో విధులు నిర్వహించే అంపైర్ల వివరాలను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రకటించింది. పురుషుల, మహిళల మ్యాచ్లకు కలిపి మొత్తం 28 మంది అంపైర్లును ఎంపిక చేశారు. భారత్ నుంచి రఘు ప్రసాద్ ఒక్కడే అంపైరింగ్ బాధ్యతలు నిర్వహించేందుకు ఎంపికయ్యాడు. 2003 నుంచి అంపైర్గా వ్యవహరిస్తున్న రఘు 186 అంతర్జాతీయ మ్యాచ్ల్లో అంపైర్గా పని చేశాడు. 2012 లండన్, 2021 టోక్యో ఒలింపిక్స్లోనూ రఘు ప్రసాద్ అంపైరింగ్ బాధ్యతలు నిర్వహించాడు. నీరజ్ చోప్రా ఒక్కడే ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ మీట్ ఫైనల్స్లో భారత్ నుంచి జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మాత్రమే పోటీపడుతున్నాడు. అవినాశ్ సాబ్లే (3000 మీటర్ల స్టీపుల్ఛేజ్), మురళీ శ్రీశంకర్ (లాంగ్జంప్) కూడా అర్హత సాధించినా ఆసియా క్రీడల నేపథ్యంలో ఈ ఇద్దరు దూరంగా ఉన్నారు. ఈనెల 16, 17వ తేదీల్లో అమెరికాలోని యుజీన్లో ఈ ఫైనల్స్ జరుగుతాయి. గత ఏడాది జ్యూరిక్లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్స్లో నీరజ్ జావెలిన్ త్రో ఈవెంట్ స్వర్ణ పతకం సాధించాడు. -
మన హాకీ... మళ్లీ మొదటికి!
కొన్నేళ్ల క్రితం వరకు భారత హాకీ జట్టుకు కొత్త విదేశీ కోచ్ రావడం... కొన్నాళ్లు ఆ పదవిలో కొనసాగడం... అభిప్రాయభేదాలు రావడం... ఆ తర్వాత పదవికి రాజీనామా చేసి వెళ్లిపోవడం తరచూ జరిగేది. కానీ నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియాకు చెందిన గ్రాహమ్ రీడ్ మాత్రం సుదీర్ఘంగానే ఈ పదవిలో కొనసాగారు. ఆయన ఆధ్వర్యంలో భారత్ చెప్పుకోదగ్గ విజయాలే అందుకుంది. కానీ తాజాగా స్వదేశంలో జరిగిన ప్రపంచకప్లో భారత జట్టు వైఫల్యం నేపథ్యంలో ఆయన చీఫ్ కోచ్ పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా హాకీ ఇండియా (హెచ్ఐ) కొత్త కోచ్ను వెదికే పనిలో పడింది. ఈ ఏడాది ఆసియా క్రీడలు... వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్ ఉండటంతో హాకీ ఇండియా మళ్లీ విదేశీ కోచ్ వైపు మొగ్గు చూపుతుందా లేక స్వదేశీ కోచ్కు ప్రాధాన్యత ఇస్తుందా వేచి చూడాలి. న్యూఢిల్లీ: నాలుగేళ్లుగా నిలకడగా కొనసాగుతున్న భారత పురుషుల హాకీ జట్టు శిక్షణ బృందంలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. స్వదేశంలో అట్టహాసంగా జరిగిన ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత హాకీ జట్టు కనీసం క్వార్టర్ ఫైనల్ చేరకపోవడం... చివరకు తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకోవడంతో హాకీ ఇండియా (హెచ్ఐ) దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాదే పారిస్ ఒలింపిక్స్ ఉండటం... ఈ సంవత్సరం ఆసియా క్రీడల టోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకు నేరుగా పారిస్ ఒలింపిక్ బెర్త్ దక్కనున్న నేపథ్యంలో హెచ్ఐ ప్రస్తుతం ఉన్న శిక్షణ బృందాన్ని మార్చాలని నిశ్చయించింది.v హెచ్ఐ భవిష్యత్ ప్రణాళికల్లో తన పేరు ఉండే అవకాశం లేదని గ్రహించిన ప్రస్తుత చీఫ్ కోచ్ గ్రాహమ్ రీడ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతోపాటు ఎనలిటికల్ కోచ్ గ్రెగ్ క్లార్క్, సైంటిఫిక్ అడ్వైజర్ మిచెల్ డేవిడ్ పెంబర్టన్ కూడా తమ రాజీనామా లేఖలను హెచ్ఐ అధ్యక్షుడు దిలీప్ టిర్కీకి సమర్పించారు. ఆస్ట్రేలియాకు చెందిన 58 ఏళ్ల రీడ్ 2019 ఏప్రిల్లో భారత జట్టుకు హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టారు. ఒప్పందం ప్రకారం ఆయన 2024 జూలై–ఆగస్టులో జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడల వరకు పదవిలో ఉండాలి. అయితే స్వదేశంలో జరిగిన ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు కనీసం క్వార్టర్ ఫైనల్ కూడా చేరకపోవడం... స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వకపోవడం... పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలచడంలో వైఫల్యం...ఆటగాళ్ల మధ్య సమన్వయలేమి... వెరసి రీడ్ రాజీనామాకు దారి తీశాయి. భారత్ 1975 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన తర్వాత మరోసారి ఈ మెగా ఈవెంట్లో సెమీఫైనల్ దశకు చేరుకోలేకపోయింది. ఒలింపిక్ పతకం వచ్చినా... రీడ్ నాలుగేళ్ల శిక్షణ కాలంలో భారత హాకీ జట్టు చెప్పుకోదగ్గ విజయాలు సాధించింది. భారత జట్టు 41 ఏళ్ల ఒలింపిక్ పతక నిరీక్షణకు తెరదించడంలో రీడ్ సఫలమయ్యారు. ఆయన శిక్షణలోనే భారత్ 2021 టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించింది. 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో రజతం గెలిచింది. 2021–2022 ప్రొ లీగ్ సీజన్లో మూడో స్థానం సంపాదించింది. 2019లో చీఫ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన ఏడాదే భువనేశ్వర్లో జరిగిన ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత్ గెలిచి టోక్యో ఒలింపిక్స్కు అర్హత పొందింది. ‘చీఫ్ కోచ్ పదవి నుంచి తప్పుకొని ఆ బాధ్యతలు వేరేవారికి అప్పగించే సమయం వచ్చింది. భారత జట్టుతో, హాకీ ఇండియాతో కలిసి పనిచేసినందుకు గర్వంగా ఉంది. ఈ నాలుగేళ్ల కాలంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. భవిష్యత్లో భారత జట్టుకు మంచి విజయాలు లభించాలని కోరుకుంటున్నాను’ అని రీడ్ వ్యాఖ్యానించారు. రీడ్, గ్రెగ్ క్లార్క్, మిచెల్ డేవిడ్ రాజీనామాలను ఆమోదించినట్లు హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు దిలీప్ టిర్కీ తెలిపారు. గతంలోనూ... భారత హాకీ జట్టుకు తొలి విదేశీ కోచ్గా వ్యవహరించిన ఘనత జర్మనీకి చెందిన గెరార్డ్ రాచ్కు దక్కుతుంది. ఆయన 2004 జూలైలో టీమిండియాకు తొలి విదేశీ కోచ్ అయ్యారు. 2007 ఫిబ్రవరిలో ఆయన రాజీనామా చేసి వెళ్లిపోయారు. 2009 మేలో స్పెయిన్కు చెందిన జోస్ బ్రాసా కోచ్గా వచ్చి 2010 నవంబర్ వరకు ఆ పదవిలో కొనసాగారు. 2011 జూన్లో ఆస్ట్రేలియాకు చెందిన మైకేల్ నాబ్స్ ఐదేళ్ల కాలానికి భారత జట్టుకు కోచ్గా వచ్చారు. కానీ ఆయన రెండేళ్లు మాత్రమే ఆ పదవిలో కొనసాగి 2013 జూన్లో వెళ్లిపోయారు. అనంతరం ఆస్ట్రేలియాకే చెందిన టెర్రీ వాల్‡్ష 2013 అక్టోబర్ నుంచి 2014 అక్టోబర్ వరకు... నెదర్లాండ్స్కు చెందిన పాల్ వాన్ యాస్ 2015 జనవరి నుంచి జూన్ వరకు... నెదర్లాండ్స్కు చెందిన రోలంట్ ఆల్ట్మన్స్ 2015 జూన్ నుంచి 2017 సెప్టెంబర్ వరకు... నెదర్లాండ్స్కే చెందిన జోయెర్డ్ మరీన్ 2017 సెప్టెంబర్ నుంచి 2018 మే వరకు భారత జట్టుకు కోచ్లుగా వ్యవహరించారు. -
హాకీ ఇండియా అధ్యక్షుడిగా దిలీప్ టిర్కీ..
హాకీ ఇండియా కొత్త అధ్యక్షుడిగా భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ దిలీప్ టిర్కీ ఎన్నికయ్యారు. ఈ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేసిన రాకేష్ కాత్యాల్, బోలా నాథ్ తప్పుకోవడంతో ఏకగ్రీవంగా టిర్కీ గెలుపొందాడు. కాగా హాకీ ఇండియా అధ్యక్ష పదవికి ఎన్నికలు అక్టోబర్ 1వ తేదీన జరగాల్సి ఉంది. కానీ ఎంపిక ఏకగ్రీవం కావడంతో వారం రోజుల ముందే నిర్వహకులు ప్రకటించారు. అయితే జాతీయ క్రీడా నియమావళిని హాకీ ఇండియా ఉల్లంఘించిందే అని చెప్పుకోవాలి. నేషనల్ స్పోర్ట్స్ కోడ్ ప్రకారం.. ఎన్నికల తేదికు ముందు విజేతను ప్రకటించకూడదు. కాగా హాకీ ఇండియా కొత్త అధ్యక్షుడిగా తనను ఎన్నుకున్నందుకు నిర్వాహకుల కమిటీ సభ్యలకు టిర్కీ ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా 44 ఏళ్ల టిర్కీ 1998 ఆసియా గేమ్స్లో స్వర్ణం గెలిచిన భారత జట్టులో సభ్యుడు. అదే విధంగా హాకీ ఇండియా జనరల్ సెక్రటరీగా భోలా నాథ్ సింగ్, కోశాధికారిగా శేఖర్ జె. మనోహరన్ ఎంపికయ్యారు. చదవండి: Duleep Trophy 2022 Final: డబుల్ సెంచరీతో చెలరేగిన యశస్వి జైశ్వాల్.. -
Men Hockey World Cup 2023: హాకీ ప్రపంచకప్ డ్రా విడుదల
భువనేశ్వర్: వచ్చే ఏడాది భారత్లో నిర్వహించే పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్కు సంబంధించిన డ్రా గురువారం విడుదల చేశారు. భువనేశ్వర్, రూర్కెలా వేదికల్లో వచ్చే జనవరి 13 నుంచి 28వరకు ఈ మెగా ఈవెంట్ జరుగనుంది. ప్రపంచ ఐదో ర్యాంకర్, ఆతిథ్య భారత్ ‘పూల్–డి’లో ఇంగ్లండ్, స్పెయిన్, వేల్స్లతో తలపడనుంది. ఈ పూల్లో మెరుగైన ర్యాంకింగ్ జట్టు భారతే! ఇంగ్లండ్ (6), స్పెయిన్ (8), వేల్స్ (16)లు ఆతిథ్య జట్టుకు దిగువనే ఉన్నాయి. ‘పూల్–ఎ’లో ప్రపంచ నంబర్వన్ ఆస్ట్రేలియా, 2016 ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనా, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. ప్రపంచ చాంపియన్ బెల్జియం ‘పూల్–బి’లో ఉంది. ఈ పూల్లో జర్మనీ, కొరియా, జపాన్ మిగతా జట్లు. ‘పూల్–సి’లో గత రన్నరప్ నెదర్లాండ్స్, న్యూజిలాండ్, మలేసియా, చిలీ ఉన్నాయి. -
Varinder Singh: భారత హాకీ దిగ్గజం కన్నుమూత
ఒలంపిక్ పతక విజేత, వరల్డ్కప్ సాధించిన భారత హాకీ జట్టు సభ్యుడైన వారీందర్ సింగ్(75) కన్నుమూశారు. స్వస్థలం జలంధర్లో మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. వారీందర్ సింగ్ మరణం పట్ల హాకీ ఇండియా సంతాపం వ్యక్తం చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించింది. ఈ సందర్భంగా వారీందర్ సింగ్ లేని లోటు పూడ్చలేనిదంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. పాకిస్తాన్పై విజయంలో భాగస్వామిగా.. 1947లో పంజాబ్లోని జలంధర్లో జన్మించిన వారీందర్ సింగ్ హాకీపై మక్కువ పెంచుకున్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ భారత హాకీ జట్టులో చోటు సంపాదించారు. హాకీ వరల్డ్కప్-1975 టోర్నీలో పాకిస్తాన్ను 2-1 తేడాతో ఓడించి స్వర్ణ పతకం గెలిచిన భారత జట్టులో ఆయన సభ్యుడు. అదే విధంగా... 1972 నాటి మ్యూనిచ్ ఒలంపిక్స్లో కాంస్య పతకం గెలిచిన భారత జట్టులో ఆయన భాగస్వామిగా ఉన్నారు. అంతేగాక 1973లో ప్రపంచకప్లో రజతం గెలిచిన జట్టులో సభ్యుడు. ఇక 1974, 1978 ఏసియన్ గేమ్స్లో రజతం గెలిచిన భారత జట్టుకు ఆయన ప్రాతినిథ్యం వహించారు. కాగా హాకీ ఆటగాడిగా క్రీడా రంగానికి చేసిన సేవకు గానూ 2007లో ప్రతిష్టాత్మక ధ్యాన్చంద్ జీవన సాఫల్య పురస్కారాన్ని వారీందర్ సింగ్ అందుకున్నారు. చదవండి: India T20 Captain: అలా అయితే రోహిత్ స్థానంలో ఇకపై అతడే టీ20 కెప్టెన్! In light of the tragic passing of the great Hockey player Shri Varinder Singh, we pray to the Almighty to grant the departed person's soul eternal rest and to provide the family members the fortitude to endure this irreparable loss. 🙏🏻 pic.twitter.com/s7Jb5xH0e3 — Hockey India (@TheHockeyIndia) June 28, 2022 -
బత్రాపై సీబీఐ దర్యాప్తు.. కారణమేంటి?
న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్ఐ)లో నరీందర్ బత్రా నిధుల దుర్వినియోగానికి సంబంధించి కేంద్రీయ దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రాథమిక విచారణ చేపట్టింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ), అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) అధ్యక్షుడైన నరీందర్ బత్రా.. హెచ్ఐకి చెందిన రూ. 35 లక్షలను వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐకి హెచ్ఐ ఫిర్యాదు చేయడంతో ప్రాథమిక విచారణ నిమిత్తం కేసు రిజిస్టర్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల నరీందర్ బత్రాకు హాకీ ఇండియాకు మధ్య విబేధాలు పొడసూపాయి. భారత పురుషుల హాకీ జట్టు ప్రదర్శనపై పదేపదే బత్రా విమర్శించడం, ప్రశ్నించడం మింగుడుపడని హెచ్ఐ తమ నిధులు, విధుల్లో జోక్యం చేసుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది. 1975 ప్రపంచకప్ హాకీ విజేత జట్టు సభ్యుడైన అస్లామ్ షేర్ఖాన్... బత్రా మితిమీరిన జోక్యంపై ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. చదవండి: IPL 2022: కమిన్స్ కమాల్.. ముంబై ఢమాల్.. తిలక్ కొట్టిన సిక్సర్ మాత్రం హైలైట్! -
Anurag Thakur: ‘కామన్వెల్త్’పై హెచ్ఐ ఎలా నిర్ణయిస్తుంది?
Anurag Thakur Comments On Hockey India Decison: వచ్చే ఏడాది జరిగే కామన్వెల్త్ గేమ్స్ నుంచి భారత హాకీ జట్లు తప్పుకుంటున్నట్లు హాకీ ఇండియా (హెచ్ఐ) తీసుకున్న ఏకపక్ష నిర్ణయం చెల్లదని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. జాతీయ క్రీడా సమాఖ్యలు ఇలాంటి కీలక అంశాలపై ప్రభుత్వాన్ని లేదంటే సంబంధిత శాఖను సంప్రదించాలన్నారు. నిర్ణయాధికారాన్ని ప్రభుత్వానికే వదిలేయాలని... జట్లు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాయని, క్రీడా సమాఖ్యలకు కాదని ఠాకూర్ అన్నారు. చదవండి: CSK Vs DC: చెన్నై అడుగు టైటిల్ వైపు -
కామన్వెల్త్ క్రీడల బరి నుంచి తప్పుకున్న భారత జట్లు
న్యూఢిల్లీ: బర్మింగ్హామ్ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న కామన్వెల్త్ క్రీడల బరి నుంచి భారత పురుషుల, మహిళల హాకీ జట్లు తప్పుకున్నాయి. ఈ మేరకు హాకీ ఇండియా అధ్యక్షుడు జ్ఞానంద్రో నింగోంబం మంగళవారం ప్రకటన విడుదల చేశారు. కామన్వెల్త్ గేమ్స్ బరి నుంచి తప్పుకున్న భారత జట్లు.. ఆసియా క్రీడలపై దృష్టిసారించనున్నాయని నింగోంబం తెలిపారు. ఆసియా క్రీడల్లో చక్కని ప్రదర్శన కనబరిస్తే 2024 పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ఖరారు కానుందని, అందుకే కామన్వెల్త్ క్రీడల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కాగా, 2022 జులైలో కామన్వెల్త్ క్రీడలు, ఆగస్టులో ఆసియా క్రీడలు జరగనున్న సంగతి తెలిసిందే. చదవండి: ప్రాంక్ చేసి భార్యను బెదరగొట్టిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. -
గంటల వ్యవధిలో ఇద్దరు ఆటగాళ్ల రిటైర్మెంట్ ప్రకటన
Olympic Bronze Medalist Rupinder Singh, Birendra Lakra Retired: టోక్యో ఒలింపిక్స్ పురుషుల హాకీలో భారత్ కాంస్య పతకం సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఇద్దరు స్టార్ క్రీడాకారులు గంటల వ్యవధిలో రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించారు. తొలుత డ్రాగ్ ఫ్లికర్గా పేరుగాంచిన రూపిందర్ పాల్ సింగ్ అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించగా.. గంటల వ్యవధిలో మరో స్టార్ ఆటగాడు, డిఫెండర్ బీరేంద్ర లక్రా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. రూపిందర్ గురువారం ట్విటర్ వేదికగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించగా.. బీరేంద్ర లక్రా వీడ్కోలు పలుకుతున్న విషయాన్ని ఇన్స్టా వేదికగా వెల్లడించింది. యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించేందుకే రిటైర్ అవుతున్నట్లు ఈ ఇద్దరూ ప్రకటించారు. భారత హాకీకి చేసిన సేవలకు గాను హాకీ ఇండియా వీరిద్దరిని అభినందించింది. ఇదిలా ఉంటే, దేశంలో అత్యుత్తమ డ్రాగ్ ఫ్లికర్గా గుర్తింపు పొందిన 30 ఏళ్ల రూపీందర్ పాల్.. భారత్ తరఫున 223 మ్యాచ్ల్లో 119 గోల్స్ సాధించాడు. టోక్యో ఒలింపిక్స్లో జర్మనీతో జరిగిన కాంస్య పతక పోరులో అతను నాలుగు కీలక గోల్స్ సాధించి జట్టు పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక, 31ఏళ్ల బీరేంద్ర లక్రా విషయానికొస్తే.. టోక్యో ఒలింపిక్స్లో భారత హాకీ జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరించిన అతను.. 201 మ్యాచ్ల్లో 10 గోల్స్ సాధించాడు. 2014లో జరిగిన ఏషియన్ గేమ్స్లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టులో లక్రా కీలక సభ్యుడు. చదవండి: ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ బౌలర్ సరికొత్త రికార్డు.. -
రాజీవ్ ఖేల్రత్న: హాకీ గోల్కీపర్ శ్రీజేష్ పేరు నామినేట్
న్యూఢిల్లీ: రాజీవ్ ఖేల్రత్న అవార్డ్కు హాకీ గోల్కీపర్ శ్రీజేష్ పేరును నామినేట్ చేస్తున్నట్లు హాకీ ఇండియా శనివారం ప్రకటించింది. అదే విధంగా.. హాకీ మహిళా జట్టుకు ప్రాతినిథ్యం వహించిన క్రీడాకారిణి దీపిక పేరును కూడా ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ చేసింది. ధ్యాన్చంద్ లైఫ్టైం అవార్డుకు డాక్టర్ ఆర్పీ సింగ్, సంగాయి ఇబెంహాల్ పేర్లను ప్రతిపాదించింది. ద్రోణాచార్య పురస్కారానికి బీజే కరియప్ప, సీఆర్ కుమార్ పేర్లను నామినేట్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక అర్జున పురస్కారానికి హర్మన్ప్రీత్ సింగ్, వందనా కటారియాతో పాటు నవజోత్ కౌర్ పేర్లను ప్రతిపాదించింది. చదవండి: 2 డజన్లకు పైగా పతకాలు.. రోడ్డు పక్కన చిప్స్ అమ్ముతూ -
హాకీ ఇండియా అధ్యక్షుడిగా జ్ఞానేంద్రో
న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్చ్ఐ) కొత్త అధ్యక్షుడిగా మణిపూర్కు చెందిన జ్ఞానేంద్రో నింగోంబం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన వీడియో సమావేశంలో ఆయనను ఎన్నుకుంటూ హెచ్ఐ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఈశాన్య రాష్ట్రాల నుంచి హెచ్ఐ అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి వ్యక్తిగా నింగోంబం నిలిచారు. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు ఉండనున్నారు. ఆయన 2009–14 మధ్య మణిపూర్ హాకీ సీఈవోగా పనిచేయడం విశేషం. 2018లో అధ్యక్ష పదవిని చేపట్టిన మొహమ్మద్ ముస్తాక్ అహ్మద్ ఎన్నిక చెల్లదంటూ గతంలో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. జాతీయ క్రీడా నియమావళి ప్రకారం ఏ వ్యక్తి కూడా వరుసగా మూడు పర్యాయాలు ఆఫీస్ బేరర్గా ఉండరాదు. ముస్తాక్ అహ్మద్ 2010–14 మధ్య హెచ్ఐ కోశాధికారిగా, 2014–18 మధ్య సెక్రటరీ జనరల్గా పనిచేశారు. 2018లో జాతీయ క్రీడా నియమావళి నిబంధనలను ఉల్లంఘిస్తూ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దాంతో ఆగ్రహించిన క్రీడా మంత్రిత్వ శాఖ... అహ్మద్ను వెంటనే పదవి నుంచి దిగిపోవాలని, మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో అహ్మద్ను సీనియర్ ఉపాధ్యక్ష పదవికి ఎన్నుకోవడం విశేషం. -
భారత హాకీలో కరోనా కలకలం
న్యూఢిల్లీ: భారత హాకీలో కరోనా కలకలం రేపుతోంది. జాతీయ స్థాయి ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతూ ఉండటం ఇండియన్ హాకీలో ఆందోళన రేకెత్తిస్తోంది. తాజాగా ఆరో పాజిటివ్ నమోదు కావడంతో మరోసారి అలజడి రేగింది. హాకీ ఆటగాడు మన్దీప్ సింగ్కు తాజాగా కరోనా బారిన పడ్డాడు. తాజాగా జరిపిన కోవిడ్-19 టెస్టుల్లో మన్దీప్కు కరోనా సోకినట్లు నిర్దారణ అయ్యింది. తద్వారా భారత హాకీలో ఆరో పాజిటివ్ నమోదైంది. ఈ విషయాన్ని సాయ్ ఓ ప్రకటనలో తెలిపింది.ఆగస్టు 20వ తేదీ నుంచి నేషనల్ క్యాంప్ ఆరంభించడానికి సన్నాహకాలు ప్రారంభించిన తరుణంలో వరుసగా క్రీడాకారులు కరోనా బారిన పడటం గుబులు పుట్టిస్తోంది. (నర్సింగ్ వస్తున్నాడు...) దాంతో జాతీయ క్యాంపును వాయిదా వేసే పరిస్థితిపై భారత హాకీ సమాఖ్య చర్చలు జరుపుతోంది. గతవారం భారత హాకీ కెప్టెన్ మన్ప్రీత్ సింగ్తో పాటు మరో నలుగురు కోవిడ్ బారిన పడ్డారు. సుదీర్ఘ విరామం తర్వాత సాయ్ సెంటర్కు వెళ్లిన క్రమంలో వీరికి కరోనా సోకింది. సాయ్ సెంటర్కు 20 మంది ఆటగాళ్లు హాజరు కాగా అందులో ఆరుగురికి కరోనా సోకడంతో కలవరం మొదలైంది. కరోనా సోకిన హాకీ ఆటగాళ్లలో మన్దీప్, మన్ప్రీత్ సింగ్లతో పాటు సురేంద్ర కుమార్, జస్కరన్ సింగ్, వరుణ్ కుమార్, కృష్ణ బహుదుర్ పాఠక్లు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం తేలికపాటి లక్షణాలతో చికిత్స తీసుకుంటున్నట్లు సాయ్ వెల్లడించింది. -
హాకీ ఇండియా అధ్యక్షుడు ముస్తాక్ అహ్మద్ రాజీనామా
న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు మొహమ్మద్ ముస్తాక్ అహ్మద్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారమే అహ్మద్ తన రాజీనామా పత్రాన్ని హెచ్ఐకి అందజేయగా... శుక్రవారం సమావేశమైన హెచ్ఐ ఎగ్జిక్యూటివ్ బోర్డు దాన్ని ఆమోదించింది. అతని స్థానంలో హాకీ ఇండియా సీనియర్ ఉపాధ్యక్షుడు జ్ఞానేంద్రో నిగోంబమ్ (మణిపూర్)ను నియమించినట్లు బోర్డు ప్రకటించింది. అయితే జాతీయ క్రీడా నిబంధనలకు వ్యతిరేకంగా 2018లో అహ్మద్ ఎన్నిక జరిగిందని పేర్కొన్న భారత క్రీడా మంత్రిత్వ శాఖ అతన్ని అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని గతంలోనే పేర్కొంది. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి వరుసగా రెండు పర్యాయాలు మాత్రమే ఆఫీస్ బేరర్గా వ్యవహరించేందుకు అవకాశముంది. ముస్తాక్ అహ్మద్ 2010–2014 వరకు హాకీ ఇండియా కోశాధికారిగా, 2014–2018 వరకు కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం 2018–2022 కాలానికిగానూ అధ్యక్షునిగా నియమితులయ్యారు. ప్రస్తుతం వ్యక్తిగత కారణాలను చెబుతున్నప్పటికీ క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం. -
ఎట్టకేలకు హాకీ క్రీడాకారులు ఇంటికి
న్యూఢిల్లీ: మూడు నెలలుగా ఇంటి మొహమే చూడని భారత మహిళల, పురుషుల హాకీ జట్లకు ఎట్టకేలకు ఊరట లభించింది. హాకీ ఇండియా (హెచ్ఐ) ఇరు జట్ల క్రీడాకారులకు నెల రోజుల పాటు ‘హోమ్ సిక్’ సెలవులు మంజూరు చేసింది. దీంతో శుక్రవారం వారంతా స్వస్థలాలకు పయనమయ్యారు. భారత పురుషుల, మహిళల హాకీ జట్లు టోక్యో ఒలింపిక్స్కు అర్హత సంపాదించాయి. దీంతో వీరికి బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసింది. అయితే కరోనా మహమ్మారి వల్ల మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ మొదలైంది. వైరస్ ఉధృతి కొనసాగడంతో టోక్యో ఈవెంట్ కూడా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. అయినప్పటికీ లాక్డౌన్ వల్ల ఆటగాళ్లంతా బెంగళూరులోనే చిక్కుకుపోయారు. గతనెల చివరి వారం నుంచి సడలింపులు ఇవ్వడంతో ఇక ఇంటికి వెళ్లే వెసులుబాటు దక్కింది. దీంతో హెచ్ఐ ఇరు జట్ల చీఫ్ కోచ్లను సంప్రదించి నెలపాటు శిక్షణకు విరామం ఇస్తేనే మళ్లీ నూతనోత్సాహంతో బరిలోకి దిగుతారని భావించి సెలవులు మంజూరు చేసింది. -
‘పద్మశ్రీ’కి విజయన్ పేరు సిఫారసు
న్యూఢిల్లీ: అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఫుట్బాల్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ఐఎమ్ విజయన్ను ‘పద్మశ్రీ’ పురస్కారానికి సిఫారసు చేసింది. కేరళకు చెందిన మాజీ స్ట్రయికర్ 90వ దశకంలో భారత్ తరఫున విశేషంగా రాణించాడు. 79 అంతర్జాతీయ మ్యాచ్లాడిన విజయన్ 40 గోల్స్ చేశాడు. 1993, 1997, 1999లలో ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచాడు. 2000 నుంచి 2003 వరకు జట్టు సారథిగా వ్యవహరించాడు. 2003లో ఆయనకు అర్జున అవార్డు లభించింది. అత్యున్నత నాలుగో పురస్కారమైన ‘పద్మశ్రీ’కి విజయన్ పేరును పరిశీలించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ప్రతిపాదించామని ఏఐఎఫ్ఎఫ్ కార్యదర్శి కుశాల్ దాస్ తెలిపారు. పౌర పురస్కారానికి తనను సిఫార్సు చేయడం పట్ల విజయన్ సంతోషం వ్యక్తం చేశాడు. మరో వైపు భారత పురుషుల హాకీ జట్టు మాజీ సహాయ కోచ్ రమేశ్ పరమేశ్వరన్ ద్రోణాచార్య అవార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది హాకీ ఇండియా (హెచ్ఐ) కరియప్ప, రమేశ్ పఠానియాలను ఆ అవార్డు కోసం నామినేట్ చేయగా... పరమేశ్వరన్ సొంతంగా హాకీ కర్ణాటక అండతో దరఖాస్తు చేసుకున్నారు. -
13న హాకీ ఇండియా ప్రత్యేక సమావేశం
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడటంతో హాకీ జట్ల సన్నాహకాలపై చర్చించేందుకు హాకీ ఇండియా (హెచ్ఐ) ఈ నెల 13న వీడియో సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా, హెచ్ఐ అధికారులు పాల్గొంటారు. ఇందులో భారత పురుషుల, మహిళల జట్లకు ఏర్పాటు చేసే శిబిరాలు, సన్నాహాకాలపై ప్రధానంగా చర్చించే అవకాశముంది. దీంతో పాటు దేశవాళీ హాకీ లీగ్లపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనుంది. -
అదనంగా మరో రూ. 75 లక్షలు... కేంద్రానికి హాకీ ఇండియా విరాళం
హాకీ ఇండియా (హెచ్ఐ) మరోసారి తన పెద్ద మనసు చాటుకుంది. కరోనా కట్టడి కోసం ఇప్పటికే కేంద్రానికి రూ. 25 లక్షల విరాళం ప్రకటించిన హెచ్ఐ శనివారం అదనంగా మరో రూ. 75 లక్షలు పీఎం–కేర్స్ సహాయనిధికి ప్రకటించింది. దీంతో హెచ్ఐ మొత్తం కోటి రూపాయల విరాళమిచ్చినట్లయింది. ప్రస్తుత పరిస్థితులరీత్యా ప్రభుత్వానికి మరింత అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు హెచ్ఐ తెలిపింది. ‘దేశంలో సంక్షోభం ముదురుతోన్న ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ చేదోడుగా నిలవాలి. కరోనాను అరికట్టేందుకు కేంద్రం నిర్విరామంగా కృషి చేస్తోంది. ఇన్నాళ్లుగా దేశ ప్రజల నుంచి హాకీ అమితమైన ప్రేమ, ఆదరణను పొందింది. ఇది దేశానికి తిరిగి ఇవ్వాల్సిన సమయం’ అని హాకీ ఇండియా అధ్యక్షుడు ముస్తాక్ అహ్మద్ పేర్కొన్నారు. -
హాకీ ఇండియా, ఏఐఎఫ్ఎఫ్ విరాళం రూ. 25 లక్షలు
న్యూఢిల్లీ: కరోనాపై పోరు కోసం చేతులు కలిపే వారి జాబితా తాజాగా హాకీ ఇండియా (హెచ్ఐ), అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) చేరాయి. పీఎం కేర్స్ సహాయ నిధి కోసం హెచ్ఐ, ఏఐఎఫ్ఎఫ్ చెరో రూ. 25 లక్షలు బుధవారం విరాళంగా ప్రకటించాయి. గంగూలీ ఉదారత కరోనా కారణంగా ఆహారం లేక ఇబ్బంది పడే వారిని ఆదుకునేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ముందుకొచ్చాడు. అతను బుధవారం రామకృష్ణ మిషన్ హెడ్కార్టర్స్ అయిన బేలూరు మఠానికి 2,000 కేజీల బియ్యాన్ని అందజేశాడు. ‘25 ఏళ్ల తర్వాత బేలూరు మఠాన్ని సందర్శించాను. అన్నార్థుల కోసం 2,000 కేజీల బియ్యాన్ని అప్పగించాను’ అని దాదా ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. -
ఎఫ్ఐహెచ్ ఫైనల్స్కు రజని
న్యూఢిల్లీ: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ఆధ్వర్యంలో జరగనున్న మహిళల సిరీస్ ఫైనల్స్ టోర్నీకి ఆంధ్రప్రదేశ్ అమ్మా యి, గోల్కీపర్ ఎతిమరపు రజని ఎంపికైంది. రాణి రాంపాల్ నేతృత్వంలోని భారత జట్టును హాకీ ఇండియా (హెచ్ఐ) బుధవారం ప్రకటించింది. జపాన్లోని హిరోషిమాలో వచ్చే నెల 15 నుంచి జరుగుతుంది. -
సర్దార్ ఇక హాకీ సెలక్టర్...
న్యూఢిల్లీ: ఇటీవలే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సర్దార్సింగ్ ఇక సెలక్టర్ పాత్ర పోషించనున్నాడు. 13 మంది సభ్యుల భారత హాకీ సెలక్షన్ కమిటీలో సర్దార్కు చోటు దక్కింది. ఈ విషయాన్ని సర్దార్ సింగ్ ధ్రువీకరించాడు. ‘భారత హాకీకి ఆటగాడిగానే కాకుండా ఏ రకంగా సేవచేసేందుకైనా నేను సిద్ధం. అందుకే సెలక్టర్ పాత్రను పోషించేందుకు కూడా సిద్ధమయ్యాను. సెలక్టర్గా విధులు నిర్వర్తించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. రెండు దశాబ్దాలుగా ఆటగాడిగా హాకీ పరిస్థితుల్ని దగ్గరుండి చూశా. జట్టుకు ఏది ముఖ్యమో అర్థం చేసుకున్నా. అనుభవజ్ఞులు, యువతతో కూడిన సమతూకమైన జట్టుకే నేను మద్దతిస్తా’ అని సర్దార్ సింగ్ పేర్కొన్నాడు. సర్దార్తో పాటు హర్బీందర్ సింగ్, సయ్యద్ అలీ, సుబ్బయ్య, ఆర్పీ సింగ్, రజనీశ్ మిశ్రా, జోయ్దీప్ కౌర్, సురేందర్కౌర్, అసుంత లాక్రా, హై పర్ఫామెన్స్ డైరైక్టర్ డేవిడ్ జాన్, భారత సీనియర్ పురుషుల, మహిళల జట్ల కోచ్లు ఇతర సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీకి 1975 హాకీ ప్రపంచ కప్ విజేత జట్టులో సభ్యుడైన బీపీ గోవింద సారథిగా వ్యవహరిస్తున్నాడు. -
హాకీ ఇండియా అధ్యక్షుడిగా ముస్తాక్ అహ్మద్
న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడిగా మహ్మద్ ముస్తాక్ అహ్మద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో ఆయన ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సోమవారం జరిగిన హెచ్ఐ ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మణిపూర్కు చెందిన జ్ఞానేంద్రొ నింగోమ్బం, జమ్మూకశ్మీర్కు చెందిన ఆసిమా అలీ, భోలనాథ్ సింగ్ (జార్ఖండ్) ఉపాధ్యక్షులుగా, రాజీందర్ సింగ్ (జమ్మూ కశ్మీర్) కార్యదర్శిగా ఎన్నికవగా, కోశాధికారిగా తపన్ కుమార్ దాస్ (అస్సాం) కొనసాగనున్నారు. మహిళల హాకీ మాజీ కెప్టెన్ అసుంత లక్రా, ఫిరోజ్ అన్సారి (చత్తీస్గఢ్)లు సంయుక్త కార్యదర్శులయ్యారు. -
జాతీయ శిబిరంలో రజని, సౌందర్య
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక మహిళల ప్రపంచ కప్నకు ముందు హాకీ ఇండియా (హెచ్ఐ) ప్రత్యేక జాతీయ శిబిరాన్ని నిర్వహించనుంది. ఈ నెల 28 నుంచి జూన్ 9 వరకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఆధ్వర్యంలో బెంగళూరులో నిర్వహించే ఈ శిబిరం కోసం హాకీ ఇండియా 48 మంది సీనియర్ క్రీడాకారిణుల పేర్లను శనివారం ఎంపిక చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు చెందిన గోల్కీపర్ ఎతిమరపు రజని, తెలంగాణ ఫార్వర్డ్ ప్లేయర్ యెండల సౌందర్య కూడా ఉన్నారు. ఇటీవల ముగిసిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్తో సరిపెట్టుకున్న భారత మహిళల హాకీ జట్టు తిరిగి సోమవారం నుంచి శిబిరంలో పాల్గొననుంది. చీఫ్ కోచ్ జోయర్డ్ మరీనే నేతృత్వంలో ఈ శిబిరాన్ని నిర్వహించనున్నారు. ‘ఫిట్నెస్ ప్రమాణాలు పెంచుకునేందుకు ఈ క్యాంప్ను వినియోగించుకుంటాం. దీంతో పాటు మానసికంగా ఇంకా ధృడంగా మారేందుకు కృషిచేస్తాం’ అని కోచ్ తెలిపారు. -
మన్ప్రీత్కు అర్జున, చెత్రికి ధ్యాన్చంద్...
న్యూఢిల్లీ: భారత హాకీ కెప్టెన్, మన్ప్రీత్ సింగ్ పేరును ‘అర్జున’ అవార్డుకు పరిశీలించాలని హాకీ ఇండియా (హెచ్ఐ) భారత ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇతనితో పాటు మరో ఇద్దరిని కూడా నామినేట్ చేసింది. మిడ్ఫీల్డర్ ధరమ్వీర్ సింగ్, మహిళల జట్టు గోల్ కీపర్ సవితను హెచ్ఐ సిఫార్సు చేసింది. దశాబ్దానికి పైగా మహిళల హాకీ జట్టుకు సేవలందించిన మాజీ ప్లేయర్ సంగాయి ఇబెంహల్ చాను, పురుషుల మాజీ కెప్టెన్ భరత్ చెత్రిలను ‘ధ్యాన్చంద్ జీవిత సాఫల్య’ పురస్కారానికి... కోచ్ బి.ఎస్.చౌహాన్ను ‘ద్రోణాచార్య’ అవార్డుకు ప్రతిపాదించామని హెచ్ఐ కార్యదర్శి ముస్తాక్ అహ్మద్ తెలిపారు. -
హకీ కోచ్ కావలెను
హెచ్ఐ వెబ్సైట్లో దరఖాస్తుల ఆహ్వానం న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్ఐ) భారత పురుషుల సీనియర్ జట్టుకు చీఫ్ కోచ్ను నియమించే పనిలో పడింది. అర్హులైనవారు ఈ–మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని హెచ్ఐ వెబ్సైట్లో ప్రకటన ఇచ్చింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లాగే ఈసారి కొత్తగా వెబ్సైట్ ద్వారా హెచ్ఐ దరఖాస్తుల్ని ఆహ్వానించడం విశేషం. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) లెవెల్–3 అర్హతలున్న కోచ్లు, అంతర్జాతీయ స్థాయిలో విజయవంతమైన కోచ్లు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని అందులో పేర్కొంది. ఎంపికైన చీఫ్ కోచ్ టోక్యో ఒలింపిక్స్ (2020) వరకు పని చేయాల్సివుంటుంది. ముందుగా ఆరునెలల ప్రొబెషన్ పీరియడ్లో సంతృప్తికర ఫలితాలు సాధిస్తే ఈ మూడేళ్ల పాటు కొనసాగిస్తారు. ప్రకటనలో కోచ్కు ఉండాల్సిన అర్హతలతో పాటు లక్ష్యాలను పొందుపరిచారు. ‘ముందుగా వచ్చే ఏడాది ఒలింపిక్స్ క్వాలిఫికేషన్లో జట్టును విజయవంతంగా నడిపించాలి. ప్రపంచ స్థాయి ఈవెంట్లకు జట్టును సన్నద్ధం చేయాలి. ఒలింపిక్స్కు మేటి జట్టును తయారు చేయాలి. అలాగే జూనియర్ జట్టు పురోగతిపై కూడా సమీక్షించాలి’ అని ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల కోచ్లు ఈ నెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. జట్టు ప్రదర్శన నిరాశాజనకంగా ఉండటంతో హాలెండ్కు చెందిన ఓల్ట్మన్స్ను ఇటీవలే కోచ్ పదవినుంచి హాకీ ఇండియా తప్పించింది. -
కోచ్ ఓల్ట్మన్స్కు ఉద్వాసన
హాకీ ఇండియా అనూహ్య నిర్ణయం న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు కోచ్ రోలంట్ ఓల్ట్మన్స్ను హాకీ ఇండియా (హెచ్ఐ) ఉన్నపళంగా తప్పించింది. హై పెర్ఫార్మెన్స్, డెవలప్మెంట్ కమిటీ సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం కోచ్ను తప్పిస్తున్నట్లు హెచ్ఐ వెల్లడించింది. హాకీ జట్టు ఇంటా బయటా ఆశించిన ఫలితాలు సాధించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుత హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ డేవిడ్ జాన్కు తాత్కాలిక కోచ్ బాధ్యతలు అప్పగించింది. పూర్తిస్థాయి కోచ్ నియామకం జరిగే వరకు ఆయన సీనియర్ జట్టు కోచ్గా పనిచేస్తారని హెచ్ఐ తెలిపింది. హాలెండ్కు చెందిన ఓల్ట్మన్స్ తొలుత 2013లో హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్గా చేరారు. అనంతరం 2015 జూలైలో కోచ్గా నియమితులయ్యారు. ఆయన మార్గదర్శనంలోనే చాంపియన్స్ ట్రోఫీలో భారత్ రజతం సాధించింది. జూనియర్ జట్టు ప్రపంచకప్లో విజేతగా నిలిచింది. అయితే అజ్లాన్ షా, హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ ఈవెంట్లలో భారత్ తమ కన్నా తక్కువ ర్యాంకు ఉన్న మలేసియా, కెనడా జట్ల చేతిలో ఓడటం హెచ్ఐ ఉన్నతాధికారులను అసంతృప్తి పరిచింది. -
హాకీ కెప్టెన్గా మన్ప్రీత్
ప్రపంచ లీగ్ సెమీఫైనల్కు భారత జట్టు హైదరాబాద్: జూన్లో జరిగే మూడు దేశాల హాకీ టోర్నీ, ప్రపంచ హాకీ లీగ్ సెమీఫైనల్ టోర్నీలో పాల్గొనే భారత హాకీ జట్టుకు మన్ప్రీత్ సింగ్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. జర్మనీ, లండన్లో జరిగే ఈ టోర్నీల్లో పాల్గొనే 18 మందితో కూడిన భారత జట్టును గురువారం ప్రకటించారు. ‘అజ్లాన్షా కప్ టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో గాయపడిన కెప్టెన్, గోల్కీపర్ శ్రీజేశ్ మోకాలి గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. అతడి స్థానంలో జట్టును మన్ప్రీత్ నడిపిస్తాడు’ అని హాకీ ఇండియా తెలిపింది. వరల్డ్ లీగ్ను కనీసం రెండో స్థానంతో ముగించాలని కోరుకుంటున్నట్టు జట్టు కోచ్ ఓల్ట్స్మన్ అన్నారు. జట్టు వివరాలు: ఆకాశ్ చిక్తే, వికాస్ దహియా(గోల్కీపర్లు), పర్దీప్ మోర్, కొథాజీత్ సింగ్, సురేందర్కుమార్, రూపిందర్పాల్ సింగ్, హర్మన్ప్రీత్ సింగ్, చింగ్లన్సన సింగ్, ఎస్కేఉతప్ప, సత్బీర్సింగ్, సర్దార్సింగ్, మన్ప్రీత్ సింగ్, హీర్జీత్ సింగ్, రమణ్దీప్ సింగ్, ఎస్వీ సునీల్, తల్విందర్ సింగ్, మన్దీప్ సింగ్, ఆకాశ్దీప్ సింగ్. -
పాక్ ఆడుతోందా... అయితే మేము ఆడం!
జొహర్ కప్ హాకీ టోర్నీకి భారత్ దూరం న్యూఢిల్లీ: మలేసియాలో జరిగే సుల్తాన్ ఆఫ్ జొహర్ కప్ హాకీ టోర్నమెంట్ నుంచి భారత్ వరుసగా రెండో ఏడాది తప్పుకుంది. అండర్–21 స్థాయిలో జరిగే ఈ టోర్నమెంట్లో పాకిస్తాన్ జట్టు ఆడుతుండటమే అందుకు కారణం. 2014లో చాంపియన్స్ ట్రోఫీ సెమీస్లో భారత్ను ఓడించిన తర్వాత పాక్ ఆటగాళ్లు భారత ప్రేక్షకుల వైపు అసభ్యకర సైగలు చేశారు. ఈ ఘటనను తీవ్రంగా భావించిన హాకీ ఇండియా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అయితే పాకిస్తాన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అప్పటి నుంచి పాక్ బరిలో నిలిచే టోర్నీలో ఆడరాదని నిర్ణయం తీసుకుంది. ‘సుల్తాన్ జొహర్ కప్ ఆహ్వానిత టోర్నీ మాత్రమే. అందులో పాల్గొనడం తప్పనిసరి కూడా కాదు. కాబట్టి మా గత నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం’ అని హాకీ ఇండియా ప్రతినిధి ఆర్పీ సింగ్ స్పష్టం చేశారు. -
హాకీ వరల్డ్ కప్ భారత్ కైవసం
-
జూనియర్ ప్రపంచకప్ హాకీ విజేత భారత్
-
జూనియర్ ప్రపంచకప్ హాకీ విజేత భారత్
లక్నో: జూనియర్ ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో భారత ఆటగాళ్లు మరోసారి చరిత్ర సృష్టించారు. 15 ఏళ్ల క్రితం చివరిసారి జూనియర్ వరల్డ్ కప్ హాకీ టైటిల్ను సాధించిన భారత్.. నేటితో ఆ కరువును తీర్చుకుంది. ఇక్కడి మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ప్రత్యర్థి బెల్జియంపై 2-1 గోల్స్ తేడాతో భారత్ విజయం సాధించింది. తమపై పెట్టుకున్న నమ్మకాన్ని హర్జిత్ సింగ్ అండ్ గ్యాంగ్ నిలబెట్టుకుంది. ఈ టోర్నీలో ఇరు జట్లు ఓటమి అనేది లేకుండా ఫైనల్ పోరుకు అర్హత సాధించినా.. చివరి మెట్టుపై బెల్జియంను భారత్ బోల్తా కొట్టించింది. ఆది నుంచి భారత కుర్రాళ్లదే హవా! ఆట మొదలైన 8వ నిమిషంలో గుర్జంత్ సింగ్ బెల్జియం గోల్ కీపర్ ను బోల్తా కొట్టిస్తూ భారత్ కు 1-0 ఆధిక్యం అందించాడు. ఆ మరుసటి నిమిషంలో నీలకంఠశర్మ గోల్ పోస్ట్ కు బంతిని కొట్టగా తృటిలో గోల్ చేజారింది. 22వ నిమిషంలో సిమ్రన్ జీత్ సింగ్, నీలకంఠ సమిష్టిగా గోల్ చేసి ఆధిక్యాన్ని రెట్టింపు చేశారు. ఆటముగిసే సరికి బెల్జియం కేవలం ఒక్క గోల్ చేయడంతో 2-1తో భారత్ రెండో పర్యాయం జూనియర్ హాకీ ప్రపంచ కప్ ను ముద్దాడింది. తద్వారా జర్మనీ తర్వాత రెండుసార్లు ఈ ప్రపంచ కప్ నెగ్గిన జట్టుగా భారత్ ఘనత వహించింది. -
హెచ్ఐ అధ్యక్షురాలిగా కోషి
న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్ఐ) నూతన అధ్యక్షురాలిగా మరియమ్మ కోషి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత అధ్యక్షుడు నరీందర్ బాత్రా అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడిగా ఎంపికవడంతో... ఆయ న స్థానంలో కోషిని అధ్యక్షురాలిగా ఎంచుకున్నారు. అలాగే హాకీ ఇండియా లీగ్ చైర్మన్ బాధ్యతలను హెచ్ఐ సెక్రటరీ ముస్తాక్ అహ్మద్కు అప్పగించారు. -
శ్రీజేష్కు భారత హాకీ పగ్గాలు
మహిళల జట్టుకు సుశీలా చాను నాయకత్వం న్యూఢిల్లీ: ఒలింపిక్స్లో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్లను హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా ప్రకటించారు. సర్దార్ సింగ్ను కెప్టెన్సీ నుంచి తప్పించి సీనియర్ గోల్ కీపర్ శ్రీజేష్కు నాయకత్వం అప్పగించారు. అయితే తుది జట్టులో మాత్రం తను చోటు దక్కించుకున్నాడు. ఇటీవలి చాంపియన్స్ ట్రోఫీలో శ్రీజేష్ నేతృత్వంలోనే భారత్ రజతం సాధించింది. సునీల్ వైస్కెప్టెన్గా ఉంటాడు. ‘కెప్టెన్సీ ఒత్తిడి లేకపోవడంతో సర్దార్ ఒలింపిక్స్లో విశేషంగా రాణిస్తాడని నమ్ముతున్నాను. కెప్టెన్సీ నుంచి తప్పుకునే నిర్ణయం సర్దారే తీసుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీ తరహా ఆటతీరునే ఒలింపిక్స్లోనూ ప్రదర్శిస్తాం’ అని కోచ్ ఓల్ట్మన్స్ తెలిపారు. అలాగే జట్ల ప్రకటనతో పాటు ఆటగాళ్ల వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ హాకీ బృందానికి దేశం తరఫున, ప్రధాని మోదీ తరఫున శుభాకాంక్షలు అందిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో క్రీడా మంత్రి విజయ్ గోయల్, అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడు లియాండ్రో నెగెరే, బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, సాయ్ డీజీ ఇంజేటి శ్రీనివాస్, ఐఓఏ ప్రధాన కార్యదర్శి, రాజీవ్ మెహతా, మాజీ హాకీ ఒలింపియన్స్ పాల్గొన్నారు. రీతూ రాణిపై వేటు: మరోవైపు మహిళల జట్టుకు చాలాకాలంగా కెప్టెన్గా కొనసాగుతున్న రీతూ రాణిపై ఊహించినట్టుగానే వేటు పడింది. సుశీలా చాను తన స్థానంలో సారథిగా వ్యవహరించనుంది. క్రమశిక్షణాచర్యల కింద రీతూపై హాకీ ఇండియా చర్యలు తీసుకుంది. 1980 మాస్కో గేమ్స్లో చివరిసారిగా మహిళల జట్టు ఒలింపిక్స్లో పాల్గొంది. పురుషుల జట్టు: శ్రీజేష్ (కెప్టెన్), హర్మన్ప్రీత్, రూపిందర్పాల్, కొతజిత్ సింగ్, సురేందర్, మన్ప్రీత్, సర్దార్ సింగ్, వీఆర్ రఘునాథ్, ఎస్కే ఉతప్ప, డానిష్ ముజ్తబా, దేవిందర్ వాల్మీకి, ఎస్వీ సునీల్, ఆకాశ్దీప్, చింగ్లెన్సన, రమణ్దీప్, తిమ్మయ్య. మహిళల జట్టు: సుశీలా చాను (కెప్టెన్), నవ్జ్యోత్ కౌర్, దీప్ గ్రేస్ ఎక్కా, మోనిక, నిక్కీ ప్రధాన్, అనురాధ దేవి, సవిత, పూనమ్ రాణి, వందన, దీపికా, నమిత, రేణుకా యాదవ్, సునీత లక్రా, రాణి రాంపాల్, ప్రీతి దూబే, లిలిమ మింజ్. -
మాజీ ఆటగాడికి అండగా హాకీ ఇండియా
న్యూఢిల్లీ: కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న భారత మాజీ హాకీ ఆటగాడు మొహ్మద్ షాహిద్కు అండగా ఉండేందుకు హాకీ ఇండియా(ఎచ్ఐ) ముందుకొచ్చింది. ఒకవేళ అతనికి కాలేయ మార్పిడి అవసరమైతే వైద్యానికి అయ్యే ఖర్చులను పూర్తిగా భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తాజాగా వెల్లడించింది. గత నెలలో షాహిద్ కు కామెర్లు సోకడంతో చికిత్స తీసుకున్నారు. అయితే ఆయన కోలుకున్న తరువాత ఉదర సంబంధిత సమస్యలు తలెత్తడంతో స్థానికి ఆస్పత్రిలో చేరారు. అయితే అక్కడ షాహిద్ పరిస్థితి విషమంగా మారడంతో అతన్ని వారణాసి నుంచి ఢిల్లీలోని మెడంటా ఆస్పత్రికి తరలించారు. దానిలో భాగంగానే గత మూడు రోజుల నుంచి ఆయన్ను అబ్జర్వేషన్లో ఉంచారు. అయితే ఆ ఆటగాడికి పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు హాకీ ఇండియా తెలిపింది. అతని వైద్యానికి అయ్యే ఖర్చులను పూర్తిగా భరిస్తామని హెచ్ఐ అధ్యక్షుడు నరీందర్ బత్ర స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే షాహిద్ కుటుంబంతో నిత్యం టచ్ లో అతని ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అతనికి కాలేయ మార్పిడి అవసరమైన పక్షంలో ఆ ఖర్చులను కూడా భరిస్తామని నరీందర్ బత్ర తెలిపారు.1980లో మాస్కోలో జరిగిన ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన హాకీ జట్టులో షాహిద్ సభ్యుడు .1981లో షాహిద్ను కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది. కాగా, ఆ తరువాత 1982లో ఆసియా గేమ్స్లో రజతం, 1986లో కాంస్యం సాధించిన భారత హాకీ జట్టులో షాహిద్ ఆటగాడిగా ఉండటం విశేషం. -
‘అర్జున’కు రీతూ రాణి, రఘునాథ్ పేర్లు ప్రతిపాదన
న్యూఢిల్లీ: భారత మహిళల జట్టు కెప్టెన్ రీతూ రాణి... భారత పురుషుల జట్టు కీలక ఆటగాళ్లు రఘునాథ్, ధరమ్వీర్ సింగ్ పేర్లను అర్జున అవార్డు కోసం ప్రతిపాదన చేశామని హాకీ ఇండియా (హెచ్ఐ) తెలిపింది. మరోవైపు 1980 మాస్కో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత జట్టు సభ్యుడు సిల్వానస్ డుంగ్ డుంగ్ పేరును ధ్యాన్చంద్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ పురస్కారానికి... వెటరన్ కోచ్ సీఆర్ కుమార్ పేరును ద్రోణాచార్య అవార్డు కోసం సిఫారసు చేశారు. హరియాణాకు చెందిన 25 ఏళ్ల రీతూ రాణి భారత్ తరఫున 223 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించింది. కర్ణాటక ప్లేయర్ రఘునాథ్ 203 మ్యాచ్లు ఆడి 127 గోల్స్ చేయగా... పంజాబ్కు చెందిన ధరమ్వీర్ 126 మ్యాచ్ల్లో పాల్గొని 31 గోల్స్ సాధించాడు. -
ఉత్తమ ఆటగాడిగా శ్రీజేష్
బెంగళూరు: ఈ ఏడాది ‘అత్యుత్తమ హాకీ ఆటగాడు’ అవార్డును భారత గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ గెలుచుకున్నాడు. మహిళల విభాగంలో దీపికాకు ఈ పురస్కారం లభించింది. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో హాకీ ఇండియా (హెచ్ఐ) వార్షిక అవార్డులను ప్రదానం చేసింది. ఈ ఇద్దరికి చెరో రూ. 25 లక్షల నగదుతో పాటు ట్రోఫీలను బహూకరించారు. దివంగత కెప్టెన్ శంకర్ లక్ష్మణ్కు... ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్చంద్ జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. ఈ అవార్డు కింద రూ. 30 లక్షల నగదుతో పాటు ట్రోఫీని అందజేశారు. భారత్ తరఫున 100 మ్యాచ్లు ఆడినందుకు ధర్మవీర్ సింగ్, కొతాజిత్ సింగ్, బీరేంద్ర లక్రా, సుశీలా చానులకు తలా రూ. 50 వేల నగదు పురస్కారం, ట్రోఫీని ఇచ్చారు. 200 మ్యాచ్లు ఆడిన వీఆర్ రఘునాథ్, గుర్బాజ్ సింగ్లకు చెరో లక్ష చొప్పున ఇచ్చారు. 36 ఏళ్ల తర్వాత రియో ఒలింపిక్స్కు అర్హత సాధించిన మహిళల జట్టును ఈ సందర్భంగా సత్కరించారు. -
సర్దార్కే సారథ్యం
అజ్లాన్ షా హాకీ టోర్నీకి భారత జట్టు న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్కు ముందు కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడకుండా ఉండేందుకు హాకీ ఇండియా (హెచ్ఐ) వారికి దశలవారీగా విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది. ఫలితంగా ఏప్రిల్ 6 నుంచి 16 వరకు మలేసియాలో జరిగే సుల్తాన్ అజ్లాన్ షా కప్లో పాల్గొనే భారత జట్టులో ఏకంగా ఏడుగురు సీనియర్ ఆటగాళ్లను ఎంపిక చేయలేదు. సర్దార్ సింగ్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. అజ్లాన్ షా కప్లో భారత్తోపాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, జపాన్, కెనడా, మలేసియా జట్లు బరిలో ఉన్నాయి. -
హాకీ ఇండియాకు ఊరట
న్యూఢిల్లీ : హాకీ ఇండియా (హెచ్ఐ)కు క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సీఏఎస్) నుంచి ఊరట లభించింది. దేశంలో హాకీ వ్యవస్థ తమ చేతుల్లో ఉండాలని గతంలో భారత హాకీ సమాఖ్య (ఐహెచ్ఎఫ్) వేసిన కేసును సీఏఎస్ తోసిపుచ్చింది. దీంతో హెచ్ఐకి న్యాయపరమైన చిక్కులు తొలగినట్టయ్యింది. 2008లో భారత ఒలింపిక్ సంఘం, అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ఐహెచ్ఎఫ్ గుర్తింపును రద్దు చేసింది. దీంతో గత నవంబర్లో ఐహెచ్ఎఫ్ ఈ అప్పీల్ చేసుకుని భారత్ నుంచి తమకు గుర్తింపునివ్వాలని కోరింది. అయితే ఐహెచ్ఎఫ్కు సంబంధించిన అన్ని అప్పీళ్లను సీఏఎస్ డిస్మిస్ చేసింది. -
ఒలింపిక్స్ వరకు ఓల్ట్మన్స్
♦ చీఫ్ కోచ్గా నియామకం ♦ హాకీ ఇండియా ప్రకటన న్యూఢిల్లీ : మరోసారి విదేశీ కోచ్వైపే మొగ్గుచూపిన హాకీ ఇండియా భారత పురుషుల జట్టుకు రోలంట్ ఓల్ట్మన్స్ను చీఫ్ కోచ్గా నియమించింది. నెదర్లాండ్స్కు చెందిన 61 ఏళ్ల ఓల్ట్మన్స్ గత మూడేళ్లుగా భారత జట్టుతో కలిసి పని చేస్తున్నారు. ఆయన హై పెర్ఫార్మెన్స్ డెరైక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ‘వచ్చే ఏడాది ఆగస్టులో బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగే ఒలింపిక్స్ క్రీడల వరకు ఓల్ట్మన్స్ కోచ్గా ఉంటారు. ఈ మేరకు ఆయన తన అంగీకారాన్ని కూడా తెలిపారు. ఒలింపిక్స్ తర్వాత కూడా ఆయనే కోచ్గా ఉండాలని మేము కోరుకుంటున్నాం’ అని హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా తెలిపారు. భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) డెరైక్టర్ జనరల్ ఇంజేటి శ్రీనివాస్తో శనివారం సమావేశం అయ్యాక బాత్రా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఓల్ట్మన్స్ నియామకంతో గత ఐదు నెలలుగా చీఫ్ కోచ్గా ఉన్న పాల్ వాన్ యాస్ను ఆ పదవి నుంచి అధికారికంగా తొలగించినట్లయింది. ‘పాల్ వాన్ యాస్పై వేటు అంశం ముగిసిన అధ్యాయం. కోచ్లు వస్తుంటారు, పోతుంటారు. ముఖ్యమైన విషయమేమిటంటే భారత హాకీ ముందుకు వెళ్లాలి. ఓల్ట్మన్స్కు ఏమేమీ కావాలో ఆయనను అడిగి సమకూర్చుతాం’ అని నరీందర్ బాత్రా తెలిపారు. 2013లో నాటి చీఫ్ కోచ్ మైకేల్ నాబ్స్ (ఆస్ట్రేలియా)పై వేటు పడిన తర్వాత రోలంట్ ఓల్ట్మన్స్ ఆసియా కప్, చాంపియన్స్ ట్రోఫీలలో భారత జట్టుకు తాత్కాలిక కోచ్గా వ్యవహరించారు. -
భారత హాకీ జట్టు కోచ్గా ఓల్ట్మన్స్
న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు చీఫ్ కోచ్గా రోలెంట్ ఓల్ట్మన్స్ను నియమించారు. ప్రస్తుతం జట్టు డైరెక్టర్గా ఉన్న ఓల్ట్మన్స్కు కోచ్ బాధ్యతలు అప్పగించినట్టు హాకీ ఇండియా ప్రకటించింది. భారత హాకీ కోచ్ పాల్ వాన్ను హాకీ ఇండియా తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో అతని స్థానంలో నియామకం చేపట్టారు. హాకీ ఇండియా అధ్యక్షుడు బాత్రా కేంద్ర క్రీడా ప్రాధికార సంస్థ డైరెక్టర్ జనరల్ శ్రీనివాసన్తో సమావేశమయ్యారు. అనంతరం కొత్త కోచ్ను నియమిస్తున్నట్టు చెప్పారు. -
పిలిస్తే... మళ్లీ వస్తాను
నా విధుల్లో జోక్యం చేసుకోవద్దు: హాకీ కోచ్ పాల్ వాన్ యాస్ న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్ఐ) అధికారులు మళ్లీ చీఫ్ కోచ్ పదవి చేపట్టాలని ఆహ్వానిస్తే... భారత్కు తిరిగి వస్తానని పాల్ వాన్ యాస్ తెలిపారు. తాను చీఫ్ కోచ్ పదవి నుంచి వైదొలగలేదని, తనపై హాకీ ఇండియా అధికారులే వేటు వేసి తప్పించారని ఆయన పునరుద్ఘాటించారు. ‘ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేను. ఏం జరుగుతుందో చూద్దాం. నన్ను ఆహ్వానిస్తారని అనుకోను. గతవారమే నాపై వేటు వేశారు. అయితే అధికారిక సమాచారం కోసం వేచి చూస్తున్నాను. ఏదీ జరిగినా నాకు సమ్మతమే. నా పదవి నుంచి దిగిపోయానని నేనెప్పుడూ చెప్పలేదు. నన్ను తప్పిస్తే నేనేం చేయాలి’ అని ప్రస్తుతం తన స్వస్థలం నెదర్లాండ్స్లోని రోటర్డామ్లో ఉన్న పాల్ వాన్ యాస్ వివరించారు. ‘చీఫ్ కోచ్ పదవిని స్వీకరించాలని మళ్లీ కోరితే తప్పకుండా వస్తాను. అయితే దీనికి ముందు చాలా విషయాలపై చర్చ జరగాలి. నేను ముక్కుసూటి మనిషిని. నా కార్యకలాపాల్లో ఎవరూ జోక్యం చేసుకోకూడదు. నేను మంచి కోచ్ కాదు అని హెచ్ఐ అధ్యక్షుడు నరీందర్ బాత్రా వ్యాఖ్యానించారని తెలిసింది. తెలియని విషయాలపై బాత్రా అంచనాకు రాకూడదు. హాకీపై ఆయనకు అవగాహన లేదని ఇలాంటి వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి’ అని పాల్ తెలిపారు. ‘రియో ఒలింపిక్స్లో టీమిండియా నుంచి అద్భుతం చేసి చూపించాలనే తాపత్రయంతో చీఫ్ కోచ్ పదవిని స్వీకరించాను. భారత ఆటగాళ్లతో పనిచేసిన కాలం అద్భుతంగా సాగింది. భారత ఆటగాళ్లందరిలో సహజసిద్ధ నైపుణ్యం ఉంది. తనపై వేటు వేసిన విషయానికి సంబంధించిన పత్రాలను భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) అధికారులకు మెయిల్ చేశాను. వారి ధ్రువీకరణ కోసం వేచి చూస్తున్నాను’ అని పాల్ వాన్ యాస్ వివరించారు. -
భూకంప బాధితులకు హాకీ ఇండియా సహాయం
న్యూఢిల్లీ: నేపాల్లో ఇటీవల సంభవించిన భూకంపంలో బాధితులను ఆదుకునేందుకు హాకీ ఇండియా (హెచ్ఐ) ముందుకు వచ్చింది. రూ.10 లక్షల విరాళాన్ని ప్రధాని జాతీయ రిలీఫ్ ఫండ్కు అందించింది. ‘మన పొరుగు దేశానికి ఇప్పుడు పూర్తి స్థాయిలో సహాయం అందాల్సి ఉంది. ఈ జాతీయ విపత్తు నుంచి వారు బయటపడేందుకు మేం శాయశక్తులా సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. చిన్న మొత్తమైనా వారు తమ జీవితాలను తిరిగి ప్రారంభించేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం’ అని హెచ్ఐ అధ్యక్షుడు నరీందర్ బాత్రా తెలిపారు. నేపాల్కు ఆర్థిక సహాయం ప్రకటించిన క్రీడా సంఘాల్లో హెచ్ఐ మొదటిది కావడం విశేషం. -
ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ శుభారంభం
భువనేశ్వర్: హాకీ చాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. గ్రూప్ ఏ లో భాగంగా శనివారం ఇక్కడ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ అద్వితీయమైన విజయాన్ని సాధించింది. విశ్వవిజేత ఆస్ట్రేలియాను బోల్తా కొట్టించిన ఇంగ్లండ్ 3-1 తేడాతో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉండగా గ్రూప్ బిలో ఉన్న హాకీ ఇండియా ఆదివారం నాటి మ్యాచ్ లో అర్జెంటీనాతో తలపడనుంది. -
రావడానికి నేను సిద్ధం: వాల్ష్
మీ సేవలు అవసరం లేదు: హెచ్ఐ న్యూఢిల్లీ: ఓవైపు భారత హాకీ జట్టు చీఫ్ కోచ్ పదవిని మళ్లీ చేపట్టేందుకు టెర్రీ వాల్ష్ ఆసక్తి చూపిస్తుంటే... మరోవైపు అతని సేవలు తమకు అవసరం లేదని హాకీ ఇండియా (హెచ్ఐ) ప్రకటించింది. కొన్ని సమస్యలకు హెచ్ఐ ఆచరణీయ పరిష్కారాలు చూపితే చర్చలకు వస్తానని వాల్ష్ సోమవారం కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్కు లేఖ రాశారు. అయితే ఈ లేఖపై సాయ్, మంత్రిత్వ శాఖలో చర్చలు జరుగుతుంటే... ఆస్ట్రేలియన్ సేవలు అవసరం లేదంటూ హెచ్ఐ మంగళవారం స్పష్టం చేసింది. సాయ్ ఆమోదంతో కొత్త కోచ్ను తీసుకొస్తామని హెచ్ఐ అధ్యక్షుడు నరీందర్ బాత్రా వెల్లడించారు. ఈ మేరకు సాయ్ డెరైక్టర్ జనరల్ జిజీ థామ్సన్కు లేఖ రాశారు. వాల్ష్ ఓ గొప్ప వ్యక్తిగా తనను తాను చిత్రీకరించుకుంటున్నాడని బాత్రా విమర్శించారు. ‘ఆటగాళ్లు, చాంపియన్స్ ట్రోఫీ ని దృష్టిలో పెట్టుకుని నవంబర్ 19 నుంచి ఓ నెల పూర్తి జీతం చెల్లిస్తామని నా సమక్షంలో హైపెర్ఫార్మెన్స్ డెరైక్టర్ ఆల్టమస్ ప్రతిపాదించారు. అలాగే నాలుగు నెలల విశ్రాంతి కాలానికీ జీతం చెల్లిస్తామని సాయ్ ఆమోదం తెలిపింది. అయినప్పటికీ వాల్ష్ ఉండకుండా వెళ్లిపోయారు. ఇప్పుడేమో జట్టుపై, అధికారులపై ప్రేమ కురిపిస్తున్నారు. మీడియా ముందు హెచ్ఐని విలన్గా చూపెడుతున్నారు’ అని బాత్రా వివరించారు. మరోవైపు యూఎస్ హాకీలో చేసిన ఆర్థిక అవకతవకలను వాల్ష్ పరిష్కరించుకోవాలని సూచించారు. 2012లోనే ఈ సమస్యను పరిష్కరించుకున్నానని కోచ్ చెప్పడం అబద్ధమని బాత్రా ధ్వజమెత్తారు. -
టెర్రీ వాల్ష్ సేవలు ఇక చాలు: హెచ్ ఐ
న్యూఢిల్లీ: టెర్రీ వాల్ష్ సేవలు ఇక అవసరం లేదని హాకీ ఇండియా(హెచ్ ఐ) స్పష్టం చేసింది. వాల్ష్ మనసు మార్చుకుని భారత హాకీ జట్టుకు మళ్లీ కోచ్ పనిచేసేందుకు సిద్ధపడినా తాము అంగీకరించబోమని హెచ్ఐ అధ్యక్షుడు నరీందర్ బాత్రా తెలిపారు. ఈ మేరకు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) డైరెక్టర్ జనరల్ జిజి థామ్సన్ కు ఆయన లేఖ రాశారు. టెర్రీ వాల్ష్ సేవలు అవసరం లేదని, సాయ్ అనుమతితో కొత్త కోచ్ ను నియమించుకుంటామని బాత్రా పేర్కొన్నారు. హాకీ ఇండియా ఒప్పుకుంటే భారత హాకీ జట్టు కోచ్గా మరో సారి టెర్రీ వాల్ష్ను నియమించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సాయ్ ప్రకటించిన నేపథ్యంలో బాత్రా ఈ లేఖ రాశారు. -
వాల్ష్ వైదొలిగితే హాకీ ఇండియాకు కష్టాలు తప్పవు!
న్యూఢిల్లీ:హాకీ ఇండియా చీఫ్ కోచ్ గా ఉన్న టెర్రీ వాల్ష్ బాధ్యతల నుంచి తప్పుకుంటే జట్టు కష్టాలను ఎదుర్కొవాల్సి వస్తుందని హాకీ ఇండియా పాలనా అధికారి రోలెంట్ ఆల్ట్మన్ అభిప్రాయపడ్డాడు. తన డిమాండ్లను నెరవేర్చకపోతే తాను వైదొలుగుతానని వాల్ష్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆల్ట్మన్ పై విధంగా స్పందించారు. 2016 రియోలో జరిగే ఒలింపిక్స్ కు వాల్స్ కోచ్ గా ఉంటే హాకీ ఇండియాకు మేలు జరుగుతుందన్నాడు. ఒకవేళ వాల్ష్ వెళ్లిపోతే మాత్రమ కష్టాలు తప్పవని స్పష్టం చేశాడు. ఈ మధ్య దక్షిణకొరియాలోని ఇంచియాన్ లో జరిగిన ఆసియా గేమ్స్ లో భారత జట్టు స్వర్ణం సాధించి 16 ఏళ్ల చరిత్రను తిరరాసిన సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే తాను ఏమిటో వాల్ష్ నిరూపించుకున్నాడని, తదుపరి ఒలింపిక్స్ కు అతను చీఫ్ కోచ్ గా లేకపోతే ఎఫెక్ట్ తప్పదని హెచ్చరించాడు. తన డిమాండ్లను నెరవేర్చకపోతే కోచ్ పదవిలో కొనసాగే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన వాల్ష్ భవితవ్యంపై ఈనెల 17న నిర్ణయం తీసుకోనున్నారు. -
హాకీ ఆటగాళ్లకు వార్షిక అవార్డులు
న్యూఢిల్లీ: ప్రతిభ చూపిన హాకీ ఆటగాళ్లకు వార్షిక అవార్డులు ఇవ్వాలని భారత హాకీ సమాఖ్య నిర్ణయించింది. పురుషులు, మహిళా విభాగాల్లో అవార్డులు ఇవ్వాలని, ప్రైజ్ మనీ కింద రూ. 25 లక్షల చొప్పున అందజేయాలని నిర్ణయించినట్టు హాకీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి మహ్మద్ ముస్తాక్ అహ్మద్ తెలిపారు. ప్రస్తుత జట్టులోని సభ్యులతో పాటు రాబోయే టీమ్ లోని ఆటగాళ్లను ప్రతిభాపాటవాలను గుర్తించి అవార్డులకు ఎంపిక చేస్తామని చెప్పారు. ఈ అవార్డుల ద్వారా ఆటగాళ్లకు మేలు జరగడమే కాకుండా ఆట కూడా మంచి జరుగుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. భారత హాకీ సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ నరీందర్ సింగ్ బాత్రా కుమారుడు ధ్రువ్ పేరు మీద వ్యక్తిగతంగా అవార్డులు ఇవ్వనున్నారు. -
ఇండియన్ హాకీ కోచ్ టెర్రీ వాల్ష్ రాజీనామా
న్యూఢిల్లీ: హాకీ ఇండియా కోచ్ టెర్రీ వాల్ష్ తన పదవికి రాజీనామా చేశారు. పారితోషికం విషయంలో హాకీ ఇండియాతో చోటు చేసుకున్న విభేదాలతో వాల్ష్ రాజీనామాకు సిద్ధమైయ్యాడు. ఆస్ట్రేలియాకు చెందిన టెర్రీ వాల్ష్ గత సంవత్సరం అక్టోబర్ నెలలోనే భారత హాకీ జట్టు కోచ్ గా నియమితులైయ్యారు. నాలుగు ప్రపంచకప్లు, మూడు ఒలింపిక్స్లు ఆడిన అనుభవం ఉన్న వాల్ష్ ను హాకీ కోచ్ గా ప్రవేశపెట్టిన అనంతరం భారత్ హాకీ మెరుగైన ఫలితాలను సాధించింది. తాజాగా దక్షిణకొరియాలోని ఇంచియాన్ లో జరిగిన ఆసియా గేమ్స్ లో భారత పురుషుల జట్టు స్వర్ణాన్ని కైవసం చేసుకోవడంలో కూడా వాల్ష్ పాత్ర కొనియాడకుండా ఉండలేం. అంతకుముందు కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ స్వర్ణాన్ని చేజిక్కించుకుంది. ప్రస్తుతం హాకీ ఇండియాతో పేమెంట్ల వ్యవహారంలో చోటు చేసుకున్న విభేదాలే అతని రాజీనామాకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.1990లో కోచింగ్ కెరీర్ మొదలుపెట్టిన ఆయన మలేసియా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్ల ప్రధాన కోచ్గా పనిచేశారు.త్వరలో రియో ఒలింపిక్స్ లో కూడా హాకీ ఇండియా ఆశించిన ఫలితాలు సాధిస్తుందని భావిస్తున్న తరుణంలో వాల్ష్ రాజీనామా బాట పట్టారు. -
హాకీ ఇండియా అధ్యక్షుడిగా నరీందర్ బాత్రా
న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్ఐ) నూతన అధ్యక్షుడిగా నరీందర్ బాత్రా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. నాలుగేళ్ల పదవీకాలానికి సోమవారం హెచ్ఐ ఆఫీస్ బేరర్లను ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా ముష్తాక్ అహ్మద్ వ్యవహరించనున్నారు. ఇప్పటిదాకా అధ్యక్షురాలిగా కొనసాగిన మరియమ్మ కోషీ సీనియర్ ఉపాధ్యక్షురాలుగా ఉంటారు. రిటర్నింగ్ అధికారి జస్టిస్ అరుణా సురేశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికలకు భారత ఒలింపిక్ సంఘం తరఫున పరిశీలకులుగా కుల్దీప్ వాట్స్ హాజరయ్యారు. తనపై నమ్మకముంచిన సభ్యులకు బాత్రా కృతజ్ఞతలు తెలిపారు. -
ఒక్క రాష్ట్రం నుంచే అన్ని పేర్లు సిఫార్సు చేస్తారా?
న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ సారథ్యంలోని అర్జున్ అవార్డులకు నియమించబడ్డ కమిటీ చేసిన సిఫార్సులపై వివాదం చెలరేగుతోంది. అత్యున్నత క్రీడాకారులను మాత్రమే ఖేల్ రత్న ఎంపిక చేయాలని కపిల్ కమిటీ సిఫార్సుచేసినా.. ఒక్క రాష్ట్రం నుంచి ఐదుగురు క్రీడాకారులను అర్జున అవార్డుకు సిఫార్సు చేయడం కాస్తా విమర్శలకు తావిస్తోంది. 15 మందిని అర్జున అవార్డులకు సిఫార్సు చేస్తే.. అందులో అధికశాతం మందిని ఒక్క కేరళ రాష్ట్రం నుంచే ఎంపిక చేశారని హాకీ సెక్రటరీ జనరల్ నరీందర్ బత్రా ప్రశ్నించారు. ఆ ఎంపిక ఎలా జరిగిందో చెప్పాలని కపిల్ కమిటీని నిలదీశారు. తాము హాకీ నుంచి పంపిన ఏడుగురు ఆటగాళ్ల పేర్లలో ఏ ఒక్కరిని అర్జునకు సిఫార్సు చేయలేదని మండిపడ్డారు. ప్రస్తుతం కపిల్ కమిటీలో ఉన్న మాజీ హాకీ ఆటగాడు అనుపమ్ గులాటీ కూడా ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం శోచనీయమని బత్రా తెలిపారు. అయితే గత నాలుగేళ్ల నుంచి హాకీలో సరైన విజయాలు లేకపోవడంతో ఆటగాళ్ల పేర్లను కమిటీ ముందు పెట్టలేదని గులాటీ చెప్పడం సరైన విధానం కాదన్నారు. హాకీకి సంబంధించి ఆటగాళ్లను ఎంపిక చేసి వారికి తగిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని బత్రా అభిప్రాయపడ్డారు. గతంలో గంట కంటే ఎక్కువ సేపు కమిటీ సమావేశం అయిన దాఖలు లేకపోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. ఈసారి ఐదు గంటలకు పైగా జరిగిన సమావేశంలో తీవ్ర తర్జన భర్జనల అనంతరం అర్జున అవార్డులకు క్రీడాకారులను సిఫారుసు చేసింది. అయితే రాజీవ్ ఖేల్ రత్నకు మాత్రం తాజా కమిటీలో ఎవరి పేరును సిఫారుసు చేయకపోవడం గమనార్హం. ఈ అవార్డును అత్యున్నత క్రీడాకారులకే ఇవ్వాలని కపిల్ నేతృత్వంలోని కమిటీ సూచించినట్లు సమాచారం. -
1975 ప్రపంచకప్ హీరోలకు సన్మానం
భారత్కు హాకీ ప్రపంచకప్ అందించిన ఆటగాళ్లను హాకీ ఇండియా ఎట్టకేలకు సన్మానించింది. ఇప్పటిదాకా భారత్ ఒకే ఒక్కసారి 1975లో ప్రపంచకప్ గెలిచింది. అయితే మనదేశానికి ఈ ఘనతను అందించిన ఆటగాళ్లను ఇన్నాళ్లూ మరచిపోయారు. ఇన్నాళ్లకు జట్టులోని 16 మంది ఆటగాళ్లను సన్మానించడమే కాకుండా వారికి రూ. 1.75 లక్షల నగదు బహుమతిని హాకీ ఇండియా అందజేసింది. దేశ రాజధానిలో జరిగిన ఈ కార్యక్రమంలో భారత ప్రస్తుత ఆటగాళ్లు, హాకీ ఇండియా అధికారులు పాల్గొన్నారు. ప్రపంచకప్ విజేతలతో పాటు ప్రస్తుత భారత జట్టు సభ్యులు కలిసి గ్రూప్ ఫోటో దిగారు. -
హాకీ బాధ్యత ఇక హెచ్ఐదే
జాతీయ క్రీడ హాకీని నడిపించే పూర్తి బాధ్యతను ప్రభుత్వం హాకీ ఇండియా (హెచ్ఐ)కే కట్టబెట్టింది. ఈ మేరకు హెచ్ఐకి జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్) హోదాను కల్పిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. భారత హాకీపై పెత్తనం కోసం అంతర్గత కలహాలు చోటుచేసుకోవడం, ప్రభుత్వ నిబంధనల్ని పాటించని కారణంగా 2012లో హెచ్ఐ గుర్తింపును క్రీడా మంత్రిత్వశాఖ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీర్ఘకాలంగా కొనసాగుతున్న సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఇటీవల చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ స్థాయిలో భారత హాకీ ప్రతిష్టకు, ఆటగాళ్ల ప్రయోజనాలకు భంగం వాటిల్లరాదని భావిస్తూ దేశంలో పురుషుల, మహిళల హాకీ బాధ్యతను హెచ్ఐకే అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు హాకీ ఇండియాకు పూర్తి గుర్తింపు కల్పిస్తున్నట్లు పేర్కొంటూ హెచ్ఐ సెక్రటరీ జనరల్ నరీందర్ బాత్రాకు ప్రభుత్వ కార్యదర్శి ఏకే పాత్రో లేఖ రాశారు. భారత క్రీడా నియమావళికి అనుగుణంగా నడచుకోవాల్సిందిగా హెచ్ఐకి సూచించారు. -
రాజకీయాలతో హాకీ అధోగతి: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: జాతీయ క్రీడ హాకీకి పట్టిన అధోగతిపై సుప్రీంకోర్టు మండిపడింది. గతంలో ఘనంగా వెలిగిన ఈ క్రీడ... రాజకీయాలతో నానాటికీ తీసికట్టుగా తయారైందని ఆందోళన వ్యక్తం చేసింది. సమాఖ్య పాలకుల వల్లే ఆట భ్రష్టు పట్టిందని ఘాటుగా వ్యాఖ్యానించింది. క్రీడా సమాఖ్యలు, సంఘాలకు నేతృత్వం వహించాల్సింది క్రీడాకారులే తప్ప వ్యాపారవేత్తలు కాదని స్పష్టం చేసింది. అధికారిక గుర్తింపు కోసం భారత హాకీ సమాఖ్య (ఐహెచ్ఎఫ్), హాకీ ఇండియా (హెచ్ఐ)ల మధ్య వైరం నడుస్తుండటంతో కేసు విచారణ సందర్భంగా జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ టీఎస్ ఠాకూర్లతో కూడిన ద్విసభ్య బెంచ్ గురువారం ఈ వ్యాఖ్యలు చేసింది. రెండేళ్ల క్రితం ఇరు సంఘాలు పరస్పరం ఈ పిటిషన్ను దాఖలు చేశాయి. ఒలింపిక్స్లో హాకీకి 8 స్వర్ణాలు గెలిచిన ఘనచరిత్ర ఉంది. అలాంటి జట్టు లండన్ ఒలింపిక్స్ (2012)లో అట్టడుగు 12వ స్థానంలో నిలిచింది. ప్రపంచకప్ హాకీ (2010)లో ఎని మిదో స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలతో సమాఖ్య వర్గాలను తలంటింది. చెత్త రాజకీయాలు, అధిపత్య ధోరణి వల్ల అంతిమంగా ఆటే బలిపశువవుతోందని, ఆటగాళ్లు నష్టపోతున్నారని పేర్కొంది. వ్యాపారవేత్తలు, క్రీడేతర వ్యక్తులు అధ్యక్షులు అవడం వల్ల వాళ్లు దీన్నో ప్రైవేటు వ్యవహారంగా చూసుకుంటున్నారు తప్ప క్రీడలపై చిత్తశుద్దితో కాదని కోర్టు వ్యాఖ్యానించింది. -
ఆసియా చాంపియన్స్ట్రోఫీకి హాకీ జట్టు ఎంపిక
న్యూఢిల్లీ: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో పాల్గొనే భారత పురుషుల జట్టును హాకీ ఇండియా (హెచ్ఐ) సోమవారం ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ సర్ధారా సింగ్కు విశ్రాంతినిచ్చిన హెచ్ఐ సెలక్టర్లు జట్టు పగ్గాలు మన్ప్రీత్ సింగ్కు అప్పగించారు. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ జపాన్లోని కకమిగహరలో వచ్చే నెల 2 నుంచి 10 వరకు జరగనుంది. సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్లో మన్ప్రీత్ జూనియర్ జట్టును విజయపథాన నడిపించాడు. దీంతో అతని సారథ్యంలోని 18 మంది సభ్యుల సీనియర్ జట్టును ఎంపిక చేశారు. ఈ ఈవెంట్ తొలి మ్యాచ్లో నవంబర్ 2న భారత్... చైనాతో తలపడుతుంది. అనంతరం 3న జపాన్, 5న ఒమన్, 7న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో పోటీపడుతుంది. -
భారత హాకీ జట్టులో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అమ్మాయి యెండల సౌందర్య భారత మహిళల హాకీ జట్టుకు ఎంపికైంది. జపాన్లో జరిగే ఆసియా చాంపియన్స్ ట్రోఫీకి 18 మంది సభ్యుల భారత జట్టును శుక్రవారం ప్రకటించారు. ఈ టోర్నీ కకమిగహరలో వచ్చే నెల 2 నుంచి 9 వరకు జరుగుతుంది. ఇందులో భారత్తో పాటు చైనా, జపాన్, మలేసియాలు తలపడుతున్నాయి. మిడ్ఫీల్డర్ రీతూ రాణి జట్టుకు సారథ్యం వహించనుంది. గత నెల మలేసియాలో జరిగిన ఆసియా కప్లో భారత్ రజత పతకం గెలిచింది. జట్టు: రీతూ రాణి (కెప్టెన్), యెండల సౌందర్య, నమిత, చంచన్ దేవి, వందన, రాణి, పూనమ్ రాణి, రితుష్య ఆర్య, దీప్గ్రేస్ ఏక్కా, దీపిక, కిరణ్దీప్ కౌర్, సునీత లక్రా, సుశీల చాను, మోనిక, మంజీత్ కౌర్, అమన్దీప్, సానరిక్ చాను, సందీప్ కౌర్, లిలీ మింజ్, లిలీ చాను, అనురాధా దేవి, అనూప బార్లా.