Hydrogen
-
గ్రీన్ హైడ్రోజన్.. గేమ్ చేంజర్!
హైడ్రోజన్ కార్లు.. బస్సులు.. రైళ్లు.. నౌకలు.. పరిశ్రమలు... ఇలా ప్రపంచమంతా ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ నామ జపం చేస్తోంది! పునరుత్పాదక ఇంధన రంగంలో గేమ్ చేంజర్గా అభివరి్ణస్తున్న గ్రీన్ హైడ్రోజన్ కోసం భారత్ కూడా వేట మొదలుపెట్టింది. దేశీ కార్పొరేట్ దిగ్గజాలైన రిలయన్స్, అదానీ గ్రూపులతో పాటు అవాడా, హైజెన్కో గ్రీన్ ఎనర్జీస్, థెర్మాక్స్ వంటి సంస్థలు ఈ రంగంలో ఇప్పటికే భారీ ప్రణాళికలతో చకచకా ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా ఈ నయా ఇంధనాన్ని వినియోగదారులకు చౌకగా అందించేందుకు ఉత్పాదక వ్యయాన్ని రెండింతలకు పైగా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రస్తుతం దేశంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదక వ్యయం ఒక్కో కేజీకి 4–5 డాలర్లు (దాదాపు రూ.340–430)గా ఉంటోంది. అదే గ్రే హైడ్రోజన్ ఉత్పత్తి ఖర్చు 1–2 డాలర్లు (రూ.85–170) మాత్రమే. గ్రే హైడ్రోజన్ ఉత్పత్తి కాలుష్యకరమైనది కావడంతో ప్రపంచవ్యాప్తంగా దీనిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో కంపెనీలు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదక వ్యయాన్ని గణనీయంగా తగ్గించడంపై దృష్టిపెట్టాయి. సరికొత్త టెక్నాలజీలతో పాటు వినూత్న ఉత్పత్తులు, ఇతరత్రా మార్గాలను ఎంచుకుంటున్నాయి. 2030 నాటికి భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్దేశించుకున్న 50 లక్షల వార్షిక టన్నుల ఉత్పత్తి లక్ష్యం సాకారం కావాలంటే, ఉత్పాదక వ్యయాన్ని తగ్గించడం చాలా కీలకమని నిపుణులు పేర్కొంటున్నారు. టెక్నాలజీ దన్ను... గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదనలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో పాటు అధునాతన ఎనలిటిక్స్ను అవాడా గ్రూప్ ఉపయోగిస్తోంది. ‘అత్యాధునిక ఎలక్ట్రోలైజర్ టెక్నాలజీ వల్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం మెరుగుపడి, హైడ్రోజన్ ఉత్పత్తికి తక్కువ విద్యుత్ అవసరమవుతుంది. దీంతో వ్యయం భారీగా దిగొస్తోంది’ అని కంపెనీ చైర్మన్ వినీత్ మిట్టల్ పేర్కొన్నారు. హైజెన్కో సంస్థ అయితే, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), ఏఐతో పాటు మెషీన్ లెరి్నంగ్ను ఉపయోగించి గ్రీన్ హైడ్రోజన్, అమోనియా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకుంటోంది. కంపెనీ ఒడిశాలోని గోపాల్పూర్లో 1.1 మిలియన్ టన్నుల సామర్థ్యంతో గ్రీన్ అమోనియా ప్రాజెక్టును నెలకొల్పే ప్రణాళికల్లో ఉంది. వెల్స్పన్ న్యూ ఎనర్జీ కూడా గ్రీన్ హైడ్రోజన్ను చౌకగా అందించేందుకు సౌర, పవన విద్యుత్తో పాటు బ్యాటరీల్లో స్టోర్ చేసిన విద్యుత్ను కూడా ఉపయోగిస్తోంది. అంతేకాకుండా పెద్దయెత్తున జల విద్యుత్ను కూడా వినియోగించే సన్నాహాల్లో ఉన్నట్లు కంపెనీ సీఈఓ కపిల్ మహేశ్వరి పేర్కొన్నారు. ఇక గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అవసరమైన మాడ్యూల్స్ తయారీ, విక్రయం, సరీ్వస్ కోసం థర్మాక్స్ బ్రిటన్కు చెందిన సెరెస్తో ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా దాని ఆక్సైడ్ ఎల్రక్టాలిసిస్ టెక్నాలజీని ఉపయోగించుకోనుంది. తక్కువ ఉష్ణోగ్రతతో కూడిన ఎలక్ట్రాలిసిస్ సాంకేతికతతో పోలిస్తే ఇది 25% మెరుగైనదని సంస్థ సీఈఓ ఆశిష్ భండారీ వెల్లడించారు.అంబానీ, అదానీ గిగా ఫ్యాక్టరీలుదేశంలో గ్రీన్ హైడ్రోజన్ సమగ్ర వ్యవస్థ (ఎకో సిస్టమ్) నెలకొల్పేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) 10 బిలియన్ డాలర్లను వెచి్చంచనుంది. 2030 నాటికి కేజీ గ్రీన్ హైడ్రోజన్ను ఒక డాలరుకే ఉత్పత్తి చేయాలనేది కంపెనీ లక్ష్యం. 2026 కల్లా తొలి ఎలక్ట్రోలైజర్ గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ తాజా ఏజీఎంలో ప్రకటించారు కూడా. ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచి, కొత్త తరం ఎలక్ట్రోలైజర్ల కోసం పెట్టుబడి వ్యయాలను తగ్గించుకోవడానికి అధునాతన ఎల్రక్టాలిసిస్ ఆధారిత టెక్నాలజీలను కూడా కంపెనీ అభివృద్ధి చేస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో దిగ్గజ సంస్థల్లో ఒకటిగా అదానీ న్యూ ఇండస్ట్రీస్ను తీర్చిదిద్దే సన్నాహాల్లో అదానీ గ్రూప్ నిమగ్నమైంది. 2030 నాటికి 10 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి తోడ్పడేలా సమగ్ర ఎకో సిస్టమ్ను అభివృద్ధి చేస్తోంది. తదుపరి పదేళ్లలో ఈ సామర్థ్యాన్ని 30 లక్షల టన్నులకు పెంచాలనేది అదానీ లక్ష్యం. ఈ వ్యవస్థలో గ్రీన్ అమోనియా, గ్రీన్ మిథనాల్, పర్యావరణానుకూల విమాన ఇంధనం వంటి పలు ఉత్పత్తులు ఉంటాయి. గ్రీన్ హైడ్రోజన్: ప్రకృతిలో అపారంగా దొరికే నీటిని పునరుత్పాదక ఇంధనాలైన సౌర, పవన, జల విద్యుత్ను ఉపయోగించి హైడ్రోజన్, ఆక్సిజన్గా విడగొడతారు. ఎలక్ట్రోలైజర్లో జరిపే ఈ ప్రక్రియను ఎల్రక్టాలిసిస్గా పేర్కొంటారు. ఉత్పత్తిలోనూ, వినియోగంలోనూ 100 శాతం పర్యావరణానుకూలమైనది కావడంతో దీనికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. దీన్ని నిల్వ చేయడం చాలా సులభం. అంతేకాకుండా, వాహనాల నుండి పరిశ్రమల వరకు అనేక అవసరాల కోసం వాడుకోవచ్చు. గ్రే హైడ్రోజన్: హైడ్రోజన్ ఉత్పత్తిలో ఇది అత్యంత సాధారణ ప్రక్రియ. స్టీమ్ మీథేన్ రిఫారి్మంగ్ (ఎస్ఎంఆర్) అనే ప్రక్రియలో సహజవాయువును ఉపయోగిస్తారు. తయారీలో గణనీయంగా కార్బన ఉద్గారాలను విడుదల చేయడం వల్ల దీనిపై వ్యతిరేకత నెలకొంది. వినియోగంలో మాత్రం 100% పర్యావరణ హితమైనదే. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
కూతపెట్టనున్న..హైడ్రోజన్ రైలు
సాక్షి, హైదరాబాద్: అధునాతన సౌకర్యాలతో సరికొత్త రైళ్లను అందుబాటులోకి తెస్తున్న భారత రైల్వే.. త్వరలోనే హైడ్రోజన్తో నడిచే రైళ్లను పట్టాలెక్కించబోతోంది. వచ్చే నెలలోనే తొలి రైలును ప్రయోగాత్మకంగా నడిపించనుంది.జర్మనీ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో.. మన రైల్వే సొంతంగానే ఈ రైళ్లను తయారు చేస్తోంది. ఇప్పటికే అధిక వ్యయం, కాలుష్య కారకమైన డీజిల్ రైళ్లను తొలగించి ఎలక్ట్రిక్ రైళ్ల సంఖ్యను పెంచుతుండగా.. ఇకపై ఏ మాత్రం కాలుష్యం ఉండని హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై పరుగెత్తనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ అంశంలో జర్మనీ ముందుంది. ఆ దేశం గణనీయ సంఖ్యలో హైడ్రోజన్ రైళ్లను నడుపుతోంది. దానితోపాటు చైనా, రష్యా సహా ఐదు దేశాలు హైడ్రోజన్ రైళ్లు నడుపుతున్నాయి. వాటి సరసన ప్రపంచంలో ఐదో దేశంగా భారత్ రికార్డు సృష్టించనుంది.‘హైడ్రోజన్’ రైలు ప్రాజెక్టు విశేషాలివీ..» నీటి నుంచి హైడ్రోజన్ను ఉత్పత్తి చేస్తారు. ఆ హైడ్రోజన్ను, ఆక్సిజన్తో కలిపినప్పుడు రసాయన చర్య జరిగి వెలువడే శక్తి ద్వారా రైలును నడిపిస్తారు. ఇందుకోసం రైలు ఇంజన్లలో హైడ్రోజన్, ఆక్సిజన్ ట్యాంకులను ఏర్పాటు చేస్తారు. » ఒకసారి ఇంధనాన్ని నింపితే వెయ్యి కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని అంచనా. » హైడ్రోజన్ ఇంజన్లు డీజిల్ ఇంజన్ల కంటే 65 శాతం తక్కువ శబ్ధాన్ని ఉత్పత్తి చేస్తాయి. ప్రస్తుత పరిజ్ఞానం మేరకు గరిష్టంగా 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని.. 54.6 సెకన్లలోనే వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. » ఒక కిలో హైడ్రోజన్ ఇంధనం 4.5 లీటర్ల డీజిల్తో సమానంగా శక్తిని అందిస్తుంది. ఓ అంచనా మేరకు ఒక్కో హైడ్రోజన్ రైలు ద్వారా ఏడాదికి రూ.16 లక్షల డీజిల్ ఆదా అవుతుంది. » ఒక డీజిల్ ఇంజన్ ద్వారా ఏడాదిలో 4,000 టన్నుల కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుంది. హైడ్రోజన్ ఇంజన్తో ఆ కాలుష్యానికి అడ్డుకట్ట పడుతుంది. హైడ్రోజన్ ఇంజన్లో ఇంధనాన్ని మండించిన తర్వాత వ్యర్థాలుగా నీరు, నీటి ఆవిరి వెలువడతాయి. » రైల్వే తొలుత 35 హైడ్రోజన్ రైళ్లను రూపొందించాలని భావించినప్పటికీ తాజాగా ఆ సంఖ్యను 50కి పెంచింది. » ప్రస్తుత పరిజ్ఞానం ప్రకారం ఒక్కో రైలు తయారీకి రూ.80 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేస్తోంది. వీటి తయారీకి రూ.2,800 కోట్లను కేటాయించారు. » రైల్వే రోజుకు 3 వేల కిలోల హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యంతో ఒక ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. తర్వాత హిల్ స్టేషన్లలో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మొదట హిల్ స్టేషన్లలో.. హరియాణాలోని జింద్–సోనిపట్ మధ్య 90 కిలోమీటర్ల మార్గంలో తొలి హైడ్రోజన్ రైలును పరీక్షించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెలాఖరులో ఈ ప్రయోగాత్మక పరిశీలన మొదలుకానుంది. పర్యావరణానికి ఏమాత్రం హాని చేయని ఈ హైడ్రోజన్ రైళ్లను తొలుత ప్రకృతి అందాలతో అలరారే హిల్ స్టేషన్లలోని రూట్లలో నడపాలని రైల్వే శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, నీలగిరి మౌంటెయిన్ రైల్వేలను ఎంపిక చేసింది. మరిన్ని హిల్ స్టేషన్లలో ప్రస్తుతం డీజిల్ ఇంజన్లతో నడుపుతున్న రైళ్లను తొలగించి హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టనుంది. తర్వాత దశలవారీగా సాధారణ రూట్లలోనూ నడపనుంది. భవిష్యత్ ఇంధనం హైడ్రోజనే... బొగ్గు, చమురు నిల్వలు తరిగిపోతుండటం, అవి కాలుష్య కారకం కావడంతో... ప్రత్యామ్నాయ ఇంధనాలపై ప్రపంచ దేశాలు దృష్టిపెట్టాయి. ఈ క్రమంలో ఎలాంటి కాలుష్యం వెలువడని, తరిగిపోని హైడ్రోజన్ను భవిష్యత్తు ఇంధనంగా భావిస్తున్నాయి. వాటితో వాహనాలను నడిపే సాంకేతికతలను కొన్ని దేశాలు అభివృద్ధి చేశాయి. ఈ క్రమంలోనే మన రైల్వే కూడా వేగంగా ప్రయోగాలు పూర్తి చేసి హైడ్రోజన్ రైళ్లను పట్టాలెక్కించే దిశగా ముందుకు వెళుతోంది. రెండేళ్ల క్రితమే ఈ ప్రాజెక్టును చేపట్టగా.. డిసెంబర్ చివరిలో ప్రయోగాత్మక పరిశీలన మొదలవుతోంది. -
ప్రపంచాన్ని నడిపించే సరికొత్త ఇంధనం
ఈవీలు కలకాలం నిలుస్తాయా? వీటికంటే మెరుగైన, పర్యావరణ హితమైన వాహనాలు వస్తాయా? చాలామందిని వేధించే ప్రశ్నలివి. ఆ ఇంధనం పెట్రోలు, డీజిళ్ల మాదిరి కాలుష్యాన్ని మిగల్చదు. ఈవీ బ్యాటరీల్లో మాదిరిగా లిథియం వంటి ఖరీదైన, అరుదైన ఖనిజాలు అస్సలు వాడదు. ఏమిటా అద్భుత ఇంధనం? అదే హైడ్రోజన్!మీకు తెలుసా? పెట్రోలు, డీజిల్ ఇంజిన్ల ద్వారా సుమారు 80 శాతం శక్తి వృథా అవుతోందని? లీటర్ పెట్రోలు లేదా డీజిల్ పోసి కారు నడిపితే 20–25 శాతం వరకు మాత్రమే ప్రయాణానికి ఉపయోగపడుతుంది. మిగి లిన 75–80 శాతం ఇంజన్లో ఆహుతి కాని ఇంధనం, వేడి పొగ రూపంలో పొగగొట్టం నుంచి బయటకు వెళ్లిపోతుంది.ఇంజిన్లో ఇంధనం మండటం వల్ల పుట్టే వేడి, దానిని చల్లార్చే కూలింగ్ వ్యవస్థ రూపంలో వృ«థా అవుతూంటుంది! విద్యుత్తు బ్యాటరీలు కాలుష్య కారక పొగలు కక్కవు కానీ... వీటి బ్యాటరీల తయారీకి మూడంటే మూడు దేశాల్లో ఉన్న లిథియంపై ఆధారపడాలి. పైగా ఇదే లిథియం మన స్మార్ట్ ఫోన్లతోపాటు ఈ కాలపు ఎలక్ట్రానిక్స్ అన్నింటి బ్యాటరీలకూ కావాలి. విద్యుత్తుతో నడిచే వాహనాలు పర్యావరణానికి మేలు చేసేవే అయినప్పటికీ ఛార్జ్ చేసుకునేందుకు ఎక్కువ సమయం పడుతూండటం, పూర్తిస్థాయిలో రీఛార్జింగ్ నెట్ వర్క్ లేకపోవడం వంటివి వీటి విస్తృత వినియోగానికి అడ్డుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పెట్రోలు, డీజిల్, విద్యుత్తుల కంటే మెరుగైన, చౌకైన, సమర్థమైన ఇంధనం కోసం దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. హైడ్రో జన్ లభ్యత భూమండలం మీద అనంతం. ఒక లీటర్ (మంచి) నీటి నుంచి ఎలక్ట్రోసిస్ చర్య ద్వారా 1.2 లీటర్ల హైడ్రోజన్ను వేరు చేయవచ్చు. గాలి నుంచి కూడా తీసు కోవచ్చు.ప్రపంచంలోనే మొట్టమొదటి హైబ్రిడ్ కారు(పెట్రోలు + విద్యుత్తు) ‘ప్రియస్’ను తయారు చేసిన రికార్డు టయోటాదే. అలాగే అందరికంటే ముందు హైడ్రోజన్ ఫ్యుయెల్ సెల్ (అక్కడికక్కడ హైడ్రోజన్ను ఉత్పత్తి చేసే బ్యాటరీ లాంటిది) వాహనం ‘మిరాయి’ కూడా టయోటా సృష్టే. ఈ నేపథ్యంలోనే తాము విద్యుత్తు వాహనాల కంటే హైడ్రోజన్ వాహనాలకే ప్రాధాన్యమిస్తామని టయోటా ఛైర్మన్ అకిడో టయోడా ఇటీవల చేసిన ప్రకటన అందరి దృష్టినీ హైడ్రోజన్ పైకి మళ్లించింది. విద్యుత్తు వాహనాల వల్ల ఉపాధి కోల్పో తారని ఆందోళన చెందుతున్న కోట్లాదిమంది టెక్నీషిషన్లకు హైడ్రోజన్ ఇంధనం ఆ దుఃస్థితి రానివ్వదు.హైడ్రోజన్ ఫ్యుయల్ సెల్స్ టెక్నాలజీతో ఎన్నో లాభాలున్నాయి. పెట్రోలు, డీజిళ్ల మాదిరిగా హైడ్రోజన్ను నిమిషాల వ్యవధిలో నింపుకోవచ్చు. చల్లటి వాతావరణ మైనా, విపరీతమైన వేడి ఉన్నా వాహనం నడపడంలో ఎలాంటి సమస్యలూ ఉండవు. భారీ బ్యాటరీల అవసరం ఉండదు. బ్యాటరీ వాహనాల కంటే చాలా ఎక్కువ మైలేజీ వస్తుంది. ఫలితంగా భారీ ట్రక్కుల్లాంటివి దూర ప్రాంతా లకు నిరాటంకంగా ప్రయాణించవచ్చు. సౌర, పవన వంటి పునరుత్పత్తి ఇంధనాల సాయంతో హైడ్రోజన్ను ఉత్పత్తి చేస్తే పర్యావరణ కాలుష్యమూ గణనీయంగా తగ్గుతుంది. పెరిగిపోతున్న భూతాపాన్ని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశా లన్నీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించేందుకు హైడ్రోజన్ పని కొస్తుంది. హైడ్రోజన్ ఇంధనంతో ఇప్పటికే జర్మనీ, ఆస్ట్రియా, నెదర్లాండ్స్, ఇటలీ, యూకే, కెనడా, జపాన్, దక్షిణ కొరియా చైనా దేశాలు రైళ్లను నడుపుతున్నాయి. కొన్ని దేశాలు ప్రోటో టైపులను రూపొందించి త్వరలో పట్టాలెక్కేంచేందుకు సిద్ధమవుతున్నాయి. రైళ్లకు హైడ్రోజన్ ఇంధనం వాడటం వల్ల ఎలక్ట్రిక్ లైన్లు ఏర్పాటు, నిర్వహణ వ్యయాలు తగ్గుతాయి.ఈ టెక్నాలజీని ఇప్పటికే నాసా అంతరిక్ష ప్రయో గాల్లోనూ విజయవంతంగా పరీక్షించారు. అంటే రోడ్లు, నీటిపై తిరిగే వాహనాలకు మాత్రమే కాకుండా... అంతరిక్ష ప్రయోగాల్లోనూ దీన్ని వాడే అవకాశాలు ఉన్నాయన్న మాట. భవిష్యత్తులో విమానాలు హైడ్రోజన్ ఇంధనంపైనే నడుస్తాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న నేపథ్యంలో హైడ్రోజన్ సరుకు రవాణాకు, బ్యాటరీలు వ్యక్తిగత రవాణాకు పరిమిత మవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే... ప్రస్తుతా నికి హైడ్రోజన్ వాహనం ఉత్పత్తి ఖర్చు కొంచెం ఎక్కువే. కానీ... సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పుల కారణంగా 2030 నాటికి ఈ ఖర్చు సగమవుతుందనీ, ఆ వెంటనే విస్తృత వినియోగమూ పెరుగుతుందనీ హైడ్రోజన్ కౌన్సిల్ అంచనా వేస్తోంది. హైడ్రోజన్ బాటన ప్రపంచం గత ఏడాది ప్రపంచ హైడ్రోజన్ ఫ్యుయల్ సెల్ అమ్మకాలు 30 శాతం వరకూ పెరిగాయి. ఈ రంగం విలువ 2022 నాటికే రూ. 1.08 లక్షల కోట్లకు చేరుకోగా 2030 నాటికి రూ. 3.32 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. అలాగే కొరియా, జపాన్లతో పాటు యూరోపియన్ యూని యన్ కూడా హైడ్రోజన్ వాహనాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. పెట్రోలు బంకుల మాదిరిగానే హైడ్రో జన్ బంకుల్లాంటివి వందల సంఖ్యలో ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశాయి. కొరియాలో 2040 నాటికి 1,200 బంకుల ఏర్పాటుకు ప్రయత్నిస్తూండగా జపాన్ 2030 నాటికే ఎనిమిది లక్షల వాహనాలు, 900 రీఫ్యుయలింగ్ స్టేషన్ల కోసం ఏర్పాట్లు చేస్తోంది. యూరోపియన్ యూని యన్ 2050 నాటికల్లా ఐదు లక్షల హైడ్రోజన్ ట్రక్కులు ఉత్పత్తి చేసే దిశగా అడుగులేస్తోంది. ఆ యా దేశాల ప్రభు త్వాలే కాకుండా... ప్రైవేట్ రంగం కూడా చురుకుగా హైడ్రోజన్ మార్కెట్లోకి ప్రవేశిస్తూండటం గమనార్హం. టయో టాతో పాటు హ్యుండయ్, హోండా, బీఎండబ్ల్యూ, మెర్సి డిస్, ఫోర్డ్ వంటి దిగ్గజ వాహన కంపెనీలు కూడా హైడ్రోజన్ టెక్నాలజీలో పరిశోధనలకు పెద్దపీట వేస్తున్న కారణంగా ఇంకొన్నేళ్లలోనే ఈ ఇంధనం ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తుందని అంచనా. బి.టి. గోవిందరెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
గ్రీన్ హైడ్రోజన్.. కొత్త విజన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్, అనుబంధ ఉత్పత్తుల (డెరివెటివ్స్) పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భారీ రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రకటించబోతోంది. ఈ మేరకు త్వరలో తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ–2024ను రూపొందించింది. స్వచ్ఛమైన ఇంధనంగా ప్రాచుర్యంలోకి వచ్చిన గ్రీన్ హైడ్రోజన్ను రవాణా (హైడ్రోజన్ సెల్ ఆధారిత వాహనాలు)తోపాటు ఎరువులు, రసాయనాల తయారీ, ఇతర కర్మాగారాల్లో ఇంధనంగా ప్రోత్సహించడం ద్వారా ‘నెట్ జీరో’ఉద్గారాల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యంలో భాగంగా..భూతాపాన్ని నియంత్రించేందుకు ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న చర్చ చాలాకాలం నుంచి సాగుతోంది. ఈ క్రమంలో శిలాజ ఇంధనాలకు బదులుగా కాలుష్య రహిత ‘గ్రీన్ హైడ్రోజన్’ను ఇంధనంగా వినియోగించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 2022 ఫిబ్రవరిలో ప్రకటించిన నేషనల్ హైడ్రోజన్ మిషన్లో 2030 నాటికి దేశంలో ఏటా 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ తయారీ, డెరివేటివ్స్ వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రీన్ హైడ్రోజన్ నుంచి ఉత్పత్తి చేసే గ్రీన్ అమోనియా, గ్రీన్ మిథనాల్ ఇంధనాలనే డెరివేటివ్స్గా పరిగణిస్తారు.పరికరాలపై 25% పెట్టుబడి రాయితీ!ఎలక్ట్రోలైజర్ ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులకు.. ప్రతి మెగావాట్ /1,400 టీపీఏకు గరిష్టంగా రూ.కోటి చొప్పున ఎలక్ట్రోలైజర్ పరికరాలు, ప్లాంట్ వ్యయంలో 25శాతం వరకు రాయితీని అందిస్తారు. కనీసం150 కేటీపీఏ సామర్థ్యముండే హైడ్రోజన్ ప్లాంట్లకే సబ్సిడీ ఇవ్వనున్నారు. ఇక గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లలో వినియోగించే ఎలక్ట్రోలైజర్ పరికరాల తయారీ ప్రాజెక్టులకూ పెట్టుబడి వ్యయంలో 25శాతం వరకు రాయితీ అందిస్తారు. కనీసం 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన తొలి 5 ప్లాంట్లకే ఇది వర్తిస్తుంది. గ్రీన్ హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కూడా పెట్టుబడి వ్యయంలో 25శాతం రాయితీ అందిస్తారు. తొలి 10 యూనిట్లకు మాత్రమే వర్తిస్తుంది. వీటికి అవసరమైన పరికరాల కొనుగోళ్లపై పూర్తి ఎస్జీఎస్టీని రీయింబర్స్ చేస్తారు.‘ఇంటిగ్రేటెడ్’ ప్రాజెక్టులకూ సబ్సిడీలుఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, గ్రీన్ మిథనాల్ (బయోజనిక్ కార్బన్ సహా) పరిశ్రమల ప్లాంట్, పరికరాల (ఎలక్ట్రోలైజర్ సహా) వ్యయంలో 25శాతం వరకు సబ్సిడీగా ప్రభుత్వం అందిస్తుంది. గ్రీన్ అమోనియా ప్లాంట్ల ప్రతి కేటీపీఏ సామర్థ్యానికి రూ.1.85 కోట్లు, గ్రీన్ మిథనాల్ ప్లాంట్ల ప్రతి కేటీపీఏ సామర్థ్యానికి రూ.2.25 కోట్లను పెట్టుబడి రాయితీగా ఇస్తుంది. గ్రీన్ హైడ్రోజన్, దాని డెరివేటివ్స్ నుంచి విమాన ఇంధనం (ఎస్ఏఎఫ్) తయారు చేసే ప్లాంట్లకూ ఈ రాయితీలు వర్తిస్తాయి.డీసాలినేషన్ ప్లాంట్లకు 20% పెట్టుబడి రాయితీగ్రీన్ హైడ్రోజన్, దాని డెరివేటివ్స్ తయారీ అవసరమైన డీసాలినేషన్ ప్లాంట్ల ఏర్పాటుకు 20శాతం పెట్టుబడి రాయితీ ఇస్తారు. ప్రతి ఎంఎల్డీ (రోజుకు మిలియన్ లీటర్ల) సామర్థ్యానికిగాను రూ.కోటికి మించకుండా ఈ రాయితీ వర్తిస్తుంది. ఇక గ్రీన్ హైడ్రోజన్ హబ్ల ఏర్పాటుకు కేంద్రం అందించే ఆర్థిక సాయానికి అదనంగా 25శాతం వరకు (రూ.10 కోట్లకు మించకుండా) రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది.ఇతర రాయితీ, ప్రోత్సాహకాలివీ..⇒ గ్రీన్ హైడ్రోజన్, అనుబంధ ఉత్పత్తుల ప్రాజెక్టుల స్థలాలకు వ్యవసాయేతర స్థలాలుగా తక్షణమే గుర్తింపు కల్పిస్తారు.⇒ వీటి ఉత్పత్తుల అమ్మకాలపై వసూలు చేసే రాష్ట్ర జీఎస్టీ మొత్తాన్ని ఐదేళ్లపాటు రీయింబర్స్ చేస్తారు.⇒ ప్రాజెక్టులకు ప్రభుత్వమే నీటిసరఫరా సదుపాయాన్ని కల్పిస్తుంది. నీటి చార్జీలపై ఐదేళ్లపాటు 25శాతం రాయితీ ఇస్తారు.⇒ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు కొనుగోలు చేసే పునరుత్పాదక విద్యుత్కు సంబంధించిన అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ చార్జీల్లో 50శాతం మేర ఐదేళ్ల పాటు రాయితీ ఇస్తారు. గరిష్టంగా మెగావాట్కు రూ.15లక్షల రాయితీ వర్తిస్తుంది.గ్రీన్ హైడ్రోజన్ అంటే..?సౌర, పవన విద్యుత్ వంటి కాలుష్య రహిత, పునరుత్పాదక విద్యుత్ను ఉపయోగించి నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్గా విడగొట్టడం ద్వారా.. ఉత్పత్తి చేసే హైడ్రోజన్ను ‘గ్రీన్ హైడ్రోజన్’ అంటారు. వాహనాలతోపాటు ఎరువులు, ఉక్కు, సిమెంట్ పరిశ్రమల్లో వాడే కాలుష్య కారక సాంప్రదాయ ఇంధనాలకు బదులుగా.. గ్రీన్ హైడ్రోజన్ను వినియోగించాలన్నది లక్ష్యం. తద్వారా కాలుష్యాన్ని తగ్గించడం, భూతాపం పెరగకుండా చూడటం వంటివి సాధ్యమవుతాయి. -
హైడ్రోజన్ ఉత్పత్తిలో అగ్రగామిగా భారత్!.. కేంద్రమంత్రి
చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి కేంద్రం తగిన ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే.. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం, సీఎన్జీ వాహనాల ఆవశ్యకతను గురించి వెల్లడించడం వంటివి చేస్తోంది. వాహన తయారీ సంస్థలకు కూడా ఫ్యూయెల్ వాహనాలకు ప్రత్యామ్నాయ వాహనాలను తయారు చేయాలనీ సూచిస్తోంది. రాబోయే రోజుల్లో మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా.. హైడ్రోజన్ ఉత్పత్తిలో కూడా భారత్ అగ్రగామిగా మారుతుందని పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రి 'హర్దీప్ సింగ్ పూరి' అన్నారు.6వ సౌత్ ఏషియన్ జియోసైన్స్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్లో మంత్రి 'హర్దీప్ సింగ్ పూరి' మాట్లాడుతూ.. నేచురల్ గ్యాస్ పైప్లైన్లలో హైడ్రోజన్ కలపడం, ఎలక్ట్రోలైజర్ బేస్డ్ టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి బయో-పాత్వేలను ప్రోత్సహించడం వంటి ప్రాజెక్టులలో భారత్ అభివృద్ధి చెందుతోందని అన్నారు. భవిష్యత్కు ఇంధనంగా భావించే గ్రీన్ హైడ్రోజన్కు మనదేశం కేంద్రంగా మారే అవకాశం ఉందని ఆయన అన్నారు.భారతదేశంలో రోజుకు 5.4 మిలియన్ బ్యారెల్స్ ఇంధన వినియోగం జరుగుతోంది. ఇది 2030నాటికి 7 మిలియన్ బ్యారెళ్లకు చేరుకుంటుందని అంచనా. ప్రతి రోజూ 67 మిలియన్ల మంది ప్రజలు పెట్రోల్ పంపులను సందర్శిస్తున్నట్లు హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. ఈ సంఖ్య యూకే, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాల జనాభాకు సమానమని ఆయన అన్నారు. రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రపంచ ఇంధన డిమాండ్లో 25 శాతం భారత్ నుంచి వస్తుందని అంచనా. -
దేశంలో కొత్త రకం రైలు.. నీళ్లుంటే చాలు!
దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్-శక్తితో నడిచే రైలు అతి త్వరలోనే పట్టాలెక్కనుంది. వచ్చే డిసెంబర్ నెలలోనే దీన్ని ఆవిష్కరించేందుకు ఇండియన్ రైల్వేస్ సిద్ధమైంది. డీజిల్ లేదా విద్యుత్తో పని లేకుండా నడిచే ఈ హైడ్రోజన్-ఆధారిత అద్భుతం 2030 నాటికి "నికర శూన్య కార్బన్ ఉద్గారిణి"గా మారాలన్న లక్ష్యంతో ఉన్న భారతీయ రైల్వేలకు ఒక ప్రధాన మైలురాయి కానుంది.హైడ్రోజన్తో నడిచే ఈ రైలు విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి నీటిని తన ప్రాథమిక వనరుగా ఉపయోగించుకుంటుంది. ఈ రైలులో హైడ్రోజన్ ఇంధన కణాలు ఆక్సిజన్తో రసాయన చర్య ద్వారా హైడ్రోజన్ వాయువును విద్యుత్తుగా మారుస్తాయి. ఈ విద్యుత్తుతో రైలు నడుస్తుంది. ఇందులో ఉప ఉత్పత్తులుగా వెలువడేవి నీరు, ఆవిరి మాత్రమే. అవసరమైన రసాయన ప్రక్రియల కోసం రైలుకు గంటకు సుమారు 40,000 లీటర్ల నీరు అవసరమవుతుంది.సాంప్రదాయ డీజిల్ లేదా ఎలక్ట్రిక్ ఇంజిన్ల మాదిరిగా కాకుండా ఈ వినూత్న రైలు కదలడానికి అవసరమైన విద్యుత్ను హైడ్రోజన్ ఇంధన కణాలను ఉపయోగించి ఉత్పత్తి చేసుకుంటుంది. హైడ్రోజన్ ఇంధన ఘటాలు, ఆక్సిజన్తో కలిసి విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రక్రియలో నీటి ఆవిరి, నీరు మాత్రమే వెలువడుతాయి. అంటే పర్యావరణానికి హానికరమైన ఎటువంటి ఉద్గారాలు ఉండవు. ఈ క్లీన్ ఎనర్జీ విధానం దేశంలో భవిష్యత్ రైళ్లకు ప్రమాణాన్ని ఏర్పరుస్తుందని భావిస్తున్నారు.ట్రయల్ రన్హైడ్రోజన్ రైలు ట్రయల్ రన్ హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో 90 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పురాతన పర్వత ప్రాంతాల రైల్వేలైన డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే , నీలగిరి మౌంటైన్ రైల్వే, కల్కా-సిమ్లా రైల్వేతో పాటు దేశంలోని సుందరమైన, మారుమూల ప్రాంతాల వంటి అదనపు మార్గాలు కూడా పరిశీలనలో ఉన్నాయి.ఈ రైలు గరిష్టంగా గంటకు 140 కిలో మీటర్ల వేగాన్ని అందుకోగలదని, ప్రయాణికులకు వేగవంతమైన , సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. రైలులోని హైడ్రోజన్ ఇంధన ట్యాంక్ ఒకసారి ఇంధనం నింపుకొంటే 1,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. దీంతో భవిష్యత్తులో సుదీర్ఘ మార్గాలకు కూడా ఈ రైళ్లు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. ఒక్కో హైడ్రోజన్ రైలు అభివృద్ధికి రూ.80 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. 2025 నాటికి 35 హైడ్రోజన్ రైళ్లు వివిధ మార్గాల్లో నడపాలని భావిస్తున్నారు. -
రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. తెలంగాణలో నీటి లభ్యత, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన స్థలాలకు లోటు లేనందున రాష్ట్రమంతా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయవచ్చన్నారు. దేశంలో గ్రీన్ హైడ్రోజన్కు చిరునామాగా తెలంగాణ నిలవాలని ఆకాంక్షించారు. జపాన్ పర్యటనలో భాగంగా రాజధాని టోక్యోకు 100 కి.మీ. దూరంలో ఉన్న యమానాషీ గ్రీన్ హైడ్రోజన్ కంపెనీని ఆయన సందర్శించారు. గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, ఇతర పునరుత్పాదక విద్యుత్ సాంకేతికతలను పరిశీలించి అక్కడి శాస్త్రవేత్తల బృందంతో మాట్లాడారు. సౌర విద్యుత్ వినియోగించి నీటిని ఎలక్రో్టలైజింగ్ ప్రక్రియ ద్వారా హైడ్రోజన్, ఆక్సిజన్గా విడగొట్టే యంత్ర విభాగాలను ఈ సంస్థ తయారు చేస్తోంది. ఇలా ఉత్పత్తి చేసిన హైడ్రోజన్ను రేసింగ్ కార్లకు ఇంధనంగా, సూపర్ మార్కెట్లలో ఫ్యూయల్ సెల్స్గా, ఫ్యాక్టరీల్లో బాయిలర్లకు ఉష్ణాన్ని అందించేందుకు ఇంధనంగా వినియోగిస్తున్నారని నిర్వాహకులు భట్టికి వివరించారు. ఈ ప్రక్రియలో సోలార్ విద్యుత్ను వినియోగిస్తుండటంతో దీన్ని గ్రీన్ హైడ్రోజన్గా పేర్కొంటున్నామని వివరించారు. రాష్ట్రంలో ఉత్పత్తి కానున్న గ్రీన్ హైడ్రోజన్ను స్థానిక ఎరువుల కర్మాగారాలు, ఆరీ్టసీ, ఇతర పరిశ్రమలకు సరఫరా చేయొచ్చని భట్టి అన్నారు. థర్మల్ విద్యుత్కు ప్రత్యామ్నాయంగా పునరుత్పాదక విద్యుదుత్పత్తిని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రంలో సౌర విద్యుత్, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఉమ్మడిగా ప్లాంట్ల ఏర్పాటుకు కలిసిరండి.. కంపెనీ తయారు చేస్తున్న ‘బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం’బ్యాటరీల తయారీ విభాగాన్ని భట్టి విక్రమార్క పరిశీలించారు. సోలార్ విద్యుత్ ప్లాంట్లు పగటిపూట ఉత్పత్తి చేసే విద్యుత్లో మిగులు విద్యుత్ను నిల్వ చేయడానికి ఈ బ్యాటరీలను ఉత్పత్తి చేస్తున్నారు. సింగరేణి ఏర్పాటు చేసిన 245 మెగావాట్ల సామర్థ్యంగల సోలార్ ప్లాంట్లతోపాటు త్వరలో ఏర్పాటు చేయనున్న మరో వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంట్లకు ఈ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుందని భట్టి అన్నారు.తెలంగాణలో గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం ప్లాంట్లను ఉమ్మడి భాగస్వామ్యంతో ఏర్పాటు చేసేందుకు తమతో కలిసి రావాలని కంపెనీ ప్రతినిధులను కోరారు. దీనిపై యమానాషీ అధికారులు సానుకూలంగా స్పందించారు. ఉన్నత స్థాయిలో చర్చించి నిర్ణయిస్తామన్నారు. ఈ పర్యటనలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ పాల్గొన్నారు. -
హైడ్రోజన్ ఉత్పత్తిలో అగ్రస్థానం!.. నితిన్ గడ్కరీ
సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ న్యూఢిల్లీలో 64వ వార్షిక సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. హైడ్రోజన్ ఉత్పత్తి గురించి ప్రస్తావించారు.ప్రపంచవ్యాప్తంగా హైడ్రోజన్ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉండగల దేశాల జాబితాలో భారత్ ముందు వరుసలో ఉండాలని గడ్కరీ పేర్కొన్నారు. ఆటోమోటివ్ పరిశ్రమ దేశం మొత్తం జీడీపీకి 6.8 శాతం అని వెల్లడిస్తూ.. తయారీ రంగం దేశాభివృద్ధికి కీలకమని అన్నారు. 2030 నాటికి కార్బన్ ఉద్గారాలను తగ్గించాలని చెప్పారు.దేశంలో హైడ్రోజన్ ఉత్పత్తిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని.. ఎలక్ట్రోలైజర్ల ఉత్పత్తిలో భారతదేశాన్ని అగ్రస్థానానికి తీసుకురావడానికి హైడ్రోజన్ ఉత్పత్తిని స్థానికీకరించే సాంకేతికత అవసరమని ఆయన అన్నారు. బయోహైడ్రోజన్ను ఉత్పత్తి చేయడానికి వ్యర్థాలను ఉపయోగించాలనే ప్రతిపాదన గురించి ఆయన మాట్లాడారు.ఇదీ చదవండి: వైకల్యాన్ని జయించి.. బిలియనీర్గా నిలిచి: జీవితాన్ని మార్చే స్టోరీభారతదేశం ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద మార్కెట్గా ఉంది. రాబోయే రోజుల్లో ఇది మరింత వృద్ధి చెందుతుంది. కాబట్టి ఫ్యూయెల్ వాహనాలను వీలైనంత వరకు తగ్గించాలని గడ్కరీ సూచించారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఉపయోగపడుతుందని అన్నారు. పెట్రోల్ దిగుమతులను తగ్గించుకోవాలని.. దీనికి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.📍𝑵𝒆𝒘 𝑫𝒆𝒍𝒉𝒊64th SIAM Annual Convention 2024 pic.twitter.com/jZP0723nAa— Nitin Gadkari (@nitin_gadkari) September 10, 2024 -
ఆవిరి శక్తితో..ఆకాశ యాత్ర
పల్లా రవికిరణ్, ఏపీ సెంట్రల్ డెస్క్: జేమ్స్వాట్ ఆవిష్కరించిన ఆవిరి యంత్రం చరిత్ర గతిని మార్చేసింది. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక విప్లవానికి దారి తీసింది. అదే ఆవిరి శక్తిని ఇంధనంగా వినియోగించుకుంటూ ఎయిర్ ట్యాక్సీలు సిద్ధమవుతున్నాయి. ఉబర్.. ఓలా.. రాపిడో తరహాలో ఎయిర్ ట్యాక్సీలు ఆకాశయానంతో సందడి చేసే రోజు దగ్గర్లోనే ఉందని ఏవియేషన్ సంస్థలు నమ్మకంగా చెబుతున్నాయి. తొలిసారిగా హైడ్రోజన్ ఇంధనంతో తయారైన ఎయిర్ ట్యాక్సీ కాలిఫోరి్నయా మీదుగా రికార్డు స్థాయిలో 561 మైళ్లు (902 కి.మీ.) విజయవంతంగా ప్రయాణించింది.ఆరిజోనాలోని ఎర్రరాతి శిలలతో కూడుకున్న విశాలమైన లోయ ప్రాంతం గ్రాండ్ కాన్యాన్తో పోలిస్తే ఇది రెండు రెట్లు ఎక్కువ. జోబి ఏవియేషన్ కంపెనీలో పురుడు పోసుకున్న ఈ ఫ్లైయింగ్ కార్ పూర్తిగా హైడ్రోజన్తో నడుస్తుంది. నీటి ఆవిరి మినహా ఎలాంటి ఉద్గారాలను విడుదల చేయకపోవడం దీని ప్రత్యేకత. ‘‘శాన్ ఫ్రాన్సిస్కో నుంచి శాండియాగో, బోస్టన్, బాలి్టమోర్ లేదా నాష్విల్లే నుంచి న్యూఓర్లాన్స్ వెళ్లేందుకు ఎయిర్పోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రయాణం చేయటాన్ని ఊహించుకోండి.నీటి ఆవిరి మినహా ఎలాంటి కాలుష్యం వెదజల్లని ఎయిర్ ట్యాక్సీలో ప్రయాణించే రోజు చాలా దగ్గర్లోనే ఉంది’’అని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో జో బెన్ బెవిర్ట్ వెల్లడించారు. అమెరికా సైనిక విభాగం ఈ ఎయిర్ ట్యాక్సీ ప్రయోగానికి పాక్షికంగా నిధులు సమకూర్చడం విశేషం. ఎంత మంది? జోబి ఏవియేషన్ తయారు చేసిన ఎయిర్ ట్యాక్సీకి ఆరు ప్రొఫెల్లర్లు ఉంటాయి. హెలికాఫ్టర్ తరహాలో గాల్లోకి ఎగిరేందుకు, కిందకు దిగేందుకు ఇవి తోడ్పడతాయి. టేకాఫ్ తీసుకుని గాల్లోకి ఎగిరిన తరువాత ప్రొఫెల్లర్లు నిట్ట నిలువు నుంచి బల్లపరుపుగా మారతాయి. రెక్కలున్న సంప్రదాయ ఎయిర్ క్రాఫ్ట్ తరహాలో ఎయిర్ ట్యాక్సీ ఆకాశంలో ఎగిరేందుకు ఇవి దోహదం చేస్తాయి. ఇందులో నలుగురు ప్రయాణించవచ్చు.ఏమిటి దీని ప్రత్యేకత? ఎయిర్ ట్యాక్సీ అనేది కొత్త ఆవిష్కరణ కాకపోయినా జోబీ ఎయిర్క్రాఫ్ట్లో ప్రొఫెల్లర్లకు సమకూర్చిన ఇంధనం మాత్రం కొత్త ప్రయోగమే. 40,000 కి.మీ. తిరిగిన ఎలక్ట్రిక్ ఎయిర్క్రాఫ్ట్ను ఆధునికీకరించి దీన్ని తయారు చేశారు. పాత ఎయిర్క్రాఫ్ట్ బ్యాటరీల స్థానంలో 40 కిలోల ద్రవ హైడ్రోజన్ సామర్థ్యం కలిగిన ఇంధన సెల్స్ను అమర్చారు. ట్యాక్సీకి అవసరమైన విద్యుత్తు, ఉష్ణోగ్రత, నీటి ఆవిరిని ఇవి అందిస్తాయి. టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో అదనపు శక్తి అందించేందుకు కొన్ని బ్యాటరీలు ఉంటాయి.బ్యాటరీ ట్యాక్సీల కంటే మెరుగైన సామర్థ్యం గతంలో రూపొందించిన బ్యాటరీలతో పనిచేసే ఎయిర్ ట్యాక్సీలు ఒక్కసారి చార్జింగ్ చేస్తే 100 – 150 మైళ్లు (160 – 240 కి.మీ.) ప్రయాణించాయి. హైడ్రోజన్తో నడిచే ఎయిర్ ట్యాక్సీలో మాత్రం ఒక నగరం నుంచి మరొక నగరానికి వెళ్లవచ్చని చెబుతున్నారు. ప్రయోగాత్మకంగా 561 మైళ్లు నడిపి చూశారు. లండన్ నుంచి ప్యారిస్, జ్యూరిచ్, ఎడిన్బర్గ్ ఆగాల్సిన అవసరం లేకుండా వెళ్లవచ్చు. ఎయిర్ ట్యాక్సీల నెట్వర్క్ను అనుసంధానించడం ద్వారా వివిధ నగరాలకు వెళ్లవచ్చని చెబుతున్నారు. హైడ్రోజన్ మోడల్ ఎయిర్ ట్యాక్సీలు కచి్చతంగా ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో ఆయన వెల్లడించలేదు.పోటాపోటీ..ఎలక్ట్రిక్ మోటార్లు, బ్యాటరీ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ వినియోగంలో వచి్చన ఆధునిక మార్పులు ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీల రంగంలో విప్లవాత్మక మార్పులకు దోహదం చేశాయి. ఎలక్ట్రిక్ క్యాబ్లపై విస్తృత పరిశోధనలు నిర్వహించిన ఏవియేషన్ స్టార్టప్లు జీ ఏరో, కిట్టీ హాక్లపై గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈవో లారీ పేజ్ లక్షల డాలర్ల నిధులను వెచి్చంచారు. ఎయిర్ స్పేస్ ఎక్స్ లాంటి పలు కంపెనీలు ఎయిర్ ట్యాక్సీలను తెచ్చేందుకు పోటీ పడుతున్నాయి.తమ ప్రయాణికులకు హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కలి్పస్తామంటూ ఊరిస్తోంది. వైద్య అవసరాల కోసం అత్యవసరంగా తరలించేందుకు కూడా సేవలందిస్తామంటోంది. ఇక క్యాబ్ సేవల సంస్థ ఉబర్ కూడా దీనిపై దృష్టి సారించింది. 2018 జనవరిలో నిర్వహించిన ఓ సాంకేతిక సదస్సులో ఉబర్ సీఈవో డారా ఖొస్రోవ్షాహి ఈమేరకు ఓ ప్రకటన చేశారు. వచ్చే పదేళ్లలో ఇవి సాకారం కానున్నట్లు అప్పట్లోనే చెప్పారు. దుబాయ్లో బీచ్ విహారం.. తమ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ నుంచి 3 – 5 దశల ధ్రువీకరణ పూర్తి చేసుకున్నట్లు జోబీ చెప్పారు. దుబాయ్ నుంచి వీటి సేవలు ప్రారంభం కానున్నట్లు గతంలోనే జోబీ ఏవియేషన్ కంపెనీ ప్రకటించింది. ఈమేరకు దుబాయ్ రోడ్డు రవాణా సంస్థతో కంపెనీ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. వీటి ద్వారా దుబాయ్ విమానాశ్రయం నుంచి ప్రముఖ పర్యాటక ప్రాంతం, కృత్రిమ దీవుల సముదాయం పామ్ జుమేరా బీచ్కు కేవలం పది నిమిషాల్లో చేరుకోవచ్చు.బ్యాటరీతో నడిచే ఎయిర్ ట్యాక్సీ పరీక్షలు విజయవంతం కావడంతో హైడ్రోజన్ మోడల్ కూడా సత్ఫలితాలనిస్తుందని కంపెనీ గట్టి నమ్మకంతో ఉంది. అయితే ఈ రెండు మోడళ్ల ధరలు ఎంత ఉంటాయనే విషయాన్ని ఇంతవరకు వెల్లడించలేదు. వాణిజ్యపరంగానూ వీటిని వినియోగించుకునే అవకాశం ఉంది. ఎయిర్ ట్యాక్సీల వాడకం 2028 నాటికి సాధారణంగా మారుతుందని, పైలెట్ల అవసరం లేకుండా ఎగిరే ట్యాక్సీలు 2030 నాటికి అందుబాటులోకి వస్తాయని బ్రిటన్ భావిస్తోంది. -
మరమనిషి, తొలి హైడ్రోజన్ ఫ్లైయింగ్ ట్యాక్సీ గురించి మీరెప్పుడైనా విన్నారా?
ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు రకరకాల రోబోలను రకరకాల పనుల కోసం రూపొందించారు. అవన్నీ మనుషుల ఆదేశాలకు అనుగుణంగా యాంత్రికంగా పనిచేసుకుపోయేవే తప్ప వాటికంటూ ప్రత్యేకంగా భావోద్వేగాలేవీ ఉండవు. అవి ఉత్త మరమనుషులు, అంతే! అయితే, చైనా శాస్త్రవేత్తలు ఇటీవల ప్రపంచంలోనే తొలిసారిగా మనసున్న మరమనిషిని రూపొందించారు. ఈ రోబో పేరు ‘పెప్పర్’. మనుషుల మాది1రిగానే ఈ రోబో కూడా ప్రేమ, సంతోషం, బాధ, కోపం వంటి భావోద్వేగాలను వ్యక్తం చేయగలదు.ఎదుటనున్న మనుషుల భావోద్వేగాలను గ్రహించి, అందుకు అనుగుణంగా నడుచుకోగలదు. షాంఘైలోని ఫుడాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ రోబోను రూపొందించారు. పూర్తిగా మనిషంత పరిమాణంలో 5.4 అడుగుల ఎత్తు, 62 కిలోల బరువుతో వారు తయారు చేసిన ఈ రోబో తన భావోద్వేగాలను ముఖంలో పలికించగలదు. షాంఘైలో జూలై 4 నుంచి 6 వరకు జరిగిన ‘వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్–2024’లో ఈ రోబో పనితీరును ప్రదర్శించారు. పెద్దలను స్నేహపూర్వకంగా పలకరించడం, చిన్నపిల్లలను ప్రేమగా దగ్గరకు తీసుకోవడం వంటి చేష్టలతో ఈ మనసున్న మరమనిషి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇళ్లల్లో ఒంటరిగా ఉండే వృద్ధుల బాగోగులను చూసుకునేలా, వారి ఆరోగ్య అవసరాలను కనిపెట్టుకుని, వేళకు మందులు అందించడం వంటి సేవలు చేసేలా దీనిని రూపొందించారు.తొలి హైడ్రోజన్ ఫ్లైయింగ్ ట్యాక్సీ..హైడ్రోజన్ ఇంధనంగా ఉపయోగించుకుని ప్రయాణించే తొలి ఫ్లైయింగ్ ట్యాక్సీ ఇది. విమానాలను తయారు చేసే అమెరికన్ కంపెనీ ‘జోబీ ఏవియేషన్స్’ ఇటీవల దీనికి రూపకల్పన చేసింది. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఎగిరే కార్లను రూపొందించాయి. ‘జోబీ ఏవియేషన్స్’ ఆరు ప్రొపెల్లర్లతో రూపొందించిన ఈ ఫ్లైయింగ్ ట్యాక్సీ ఎటువంటి ఉపరితలం పైనుంచి అయినా, ఉన్న చోటు నుంచి నిట్టనిలువుగా పైకి ఎగరగలదు. ఇటీవల కాలిఫోర్నియాలో పరీక్షాత్మకంగా దీని ప్రయాణాన్ని నిర్వహించినప్పుడు, హైడ్రోజన్ ఇంధనంతో ఇది ఏకధాటిగా 902 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, ఇదివరకటి ఫ్లైయింగ్ కార్ల రికార్డులను బద్దలు కొట్టింది.దీని గరిష్ఠ వేగం గంటకు 322 కిలోమీటర్లు. ఈ ఫ్లైయింగ్ ట్యాక్సీ రూపకల్పన కోసం అమెరికన్ సైన్యం కొంతవరకు నిధులు సమకూర్చినట్లు ‘జోబీ ఏవియేషన్స్’ వ్యవస్థాపకుడు, సీఈవో జోబెన్ బెవిర్ట్ వెల్లడించారు. రద్దీగా ఉండే పట్టణ ప్రాంతాల్లో ప్రయాణికులను ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకుపోయేందుకు ఇది బాగా ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. పట్టణ ప్రాంతాల్లోని స్థానిక అవసరాలకు మాత్రమే కాకుండా, దేశాల మధ్య కూడా ఇది ప్రయాణించగలదని, దాదాపు 900 కిలోమీటర్ల వరకు దీనికి ఇంధనం నింపాల్సిన అసరం ఉండదని బెవిర్ట్ చెప్పారు. ప్రస్తుతం ఈ ఫ్లైయింగ్ ట్యాక్సీ ఉత్పత్తిని 2050 నాటికి వాణిజ్యపరంగా ప్రారంభించనున్నామని వెల్లడించారు. -
మగ్గంలా పనిచేసే రోబో గురించి.. ఎప్పుడైనా విన్నారా!?
ఈ రోబో మగ్గంలా పనిచేస్తుంది. అయితే నూలు దుస్తులు, పట్టు వస్త్రాలు కాదు, ఊలు దుస్తులు నేస్తుంది. ఇది ఊలు దుస్తులను చకచకా నేసి, కోరుకున్న డిజైన్లలో అల్లేస్తుంది. ఈ రోబో మగ్గాన్ని డచ్ డిజైనర్ క్రిస్టీన్ మీండెర్స్మా రూపొందించారు..త్రీడీ ప్రింటర్లు పొరలు పొరలుగా వస్తువులను ముద్రించిన పద్ధతిలోనే ఈ రోబో మగ్గం పొరలు పొరలుగా ఊలు దుస్తులను నేస్తుంది. ఈ రోబో మగ్గానికి ‘ఫ్లాక్స్ వోబో’ అని పేరు పెట్టారు. ఊలు పరిశ్రమలో నేసే ముందు ఊలును నీటితో తడుపుతారు. అయితే, ఈ రోబో మగ్గానికి నేరుగా ఊలు అందిస్తే చాలు, ఏమాత్రం తడపాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి దీనిని నమూనాగా రూపొందించారు. త్వరలోనే పారిశ్రామిక స్థాయిలో దీని ఉత్పత్తిని ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.హైడ్రోజన్ బైక్..పెట్రోల్తో నడిచే బైక్లకు పోటీగా ఇటీవలి కాలంలో లిథియం అయాన్ బ్యాటరీలతో పనిచేసే ఎలక్ట్రిక్ బైక్ల వాడకం పెరిగింది. లిథియం అయాన్ బ్యాటరీలను మించిన సామర్థ్యం కలిగిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్తో నడిచే బైక్లు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. స్విట్జర్లాండ్కు చెందిన ‘హైడ్రోరైడ్ యూరోప్ ఏజీ’ కంపెనీ రకరకాల మోడల్స్లో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బైక్లను మార్కెట్లోకి విడుదల చేసింది.వీటికి 180 హైడ్రోజన్ సెల్తో పాటు, 25 సెంటీమీటర్ల పొడవైన హైడ్రోజన్ కంటెయినర్ ఉంటుంది. కంటెయినర్లోని హైడ్రోజన్ 1 మెగాపాస్కల్ పీడనంతో ఉంటుంది. ఈ హైడ్రోజన్ నుంచి ఇందులోని ఫ్యూయల్ సెల్ విద్యుత్తును తయారుచేసుకుంటుంది. ఒక కంటెయినర్ను పూర్తిగా నింపి అమర్చుకుంటే, ఈ బైక్పై ఏకధాటిగా 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ బైక్కు అమర్చుకునే విధంగా హైడ్రో జనరేటర్ కూడా ఉంటుంది.ఒకవేళ మార్గమధ్యంలో కంటెయినర్లోని హైడ్రోజన్ ఖాళీ అయిపోతే, ఈ జనరేటర్లో 200 మిల్లీలీటర్ల డిస్టిల్డ్ వాటర్ను నింపుకుంటే చాలు. దీని నుంచి ఉత్పత్తయ్యే హైడ్రోజన్ దాదాపు ఐదారు గంటల ప్రయాణానికి తగినంత ఇంధనంగా సరిపోతుంది. అయితే, హైడ్రోరైడ్ యూరోప్ ఏజీ’ కంపెనీ నేరుగా విక్రయానికి పెట్టకుండా.. యూరోప్లోని ఎంపిక చేసిన నగరాల్లో కస్టమర్లకు అద్దెకు ఇస్తోంది.ఉభయచర డ్రోన్..ఇప్పటి వరకు గాల్లోకి ఎగిరే డ్రోన్లు మాత్రమే తెలుసు. అయితే, కెనడియన్ కంపెనీ ‘ఏరోమావో’ ఉభయచర డ్రోన్ను రూపొందించింది. ఇది గాలిలో ఎగరడమే కాదు, నీటిలోనూ ప్రయాణించగలదు. ఈ డ్రోన్ను ‘వీటీ నాట్–వీటీఓఎస్ఎల్’ బ్రాండ్ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. ఈ బ్రాండ్ పేరుకు అర్థమేమిటంటే, ‘వెర్టికల్ టేకాఫ్ అండ్ షార్ట్ ల్యాండింగ్’. మ్యాపుల చిత్రణ, మనుషులు చొరబడలేని ప్రదేశాల్లో కూడా సర్వే జరపడం, వ్యవసాయ అవసరాలకు, నిఘా పనులకు ఉపయోగపడేలా దీనిని రూపొందించారు.గాల్లోకి ఎగిరేటప్పుడు దీని గరిష్ఠ వేగం గంటకు 85 కిలోమీటర్లు అయితే, నీటిలో ప్రయాణించేటప్పుడు గంటకు 55 కిలోమీటర్లు. రీచార్జబుల్ బ్యాటరీతో ఇది పనిచేస్తుంది. బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేసినట్లయితే, గంటన్నర సేపు నిరంతరాయంగా ప్రయాణిస్తుంది. దీని ధర 11,170 డాలర్లు (రూ.9.31 లక్షలు). -
మస్క్ సంచలన నిర్ణయం: 2026 నాటికి..
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఇలాన్ మస్క్ (Elon Musk) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలక్ట్రిక్ కార్ల తయారీలో అగ్రగామిగా ఉన్న టెస్లా రాబోయే రోజుల్లో హైడ్రోజన్ కార్లను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు.. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో చైనా కంపెనీ బివైడీ (బిల్డ్ యువర్ డ్రీమ్) గట్టి పోటీ ఇస్తోంది. ఈ తరుణంలో మస్క్ హైడ్రోజన్ కార్లను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. కంపెనీ 2026 నాటికి టెస్లా హైడ్రోజన్ కార్లను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.టెస్లా కంపెనీ త్వరలోనే హైడ్రోజన్ కార్ల ప్రాజెక్టు మీద పనిచేయనుంది. హైడ్రోజన్తో నడిచే మొదటి కారు 'మోడల్ హెచ్'ను 2026లో ఆవిష్కరించనున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ కార్లను కేవలం అమెరికా మార్కెట్లో మాత్రమే లాంచ్ చేస్తారా?.. ఇతర దేశాల్లో కూడా లాంచ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. -
టెక్ టాక్: ఈ సరికొత్త వాటిని గురించి ఎప్పుడైనా విన్నారా..!
నిత్య జీవితంలో.. టెక్నాలజీ పరంగా నూతన మార్పులు సంభవిస్తున్నాయి. మానవ అన్నీ అవసరాలను తీర్చిదిద్దేలాగా ఈ టెక్నాటజీ వృద్ధి చెందుతుంది. విద్య, వైద్య, ఉద్యోగాలలోనూ దీని అవసరం మరెంతగానో ఉండేలా కాలం మారుతుంది. అందుకు అనుగుణంగానే ఈ సరికొత్త పరికరాలు మీ ముందుకొచ్చాయి. మరి వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇది కట్టుకుంటే నొప్పులు మాయం.. జిమ్లో వ్యాయామం చేసేవారికి, మైదానాల్లో ఆటలాడే వారికి ఒక్కోసారి కీళ్లు పట్టేసి నొప్పులు తలెత్తడం మామూలే! ఇళ్లల్లో రోజువారీ పనులు చేసుకునేటప్పుడు కూడా ఒక్కోసారి నొప్పులు తలెత్తుతుంటాయి. ఇలాంటి నొప్పులకు నొప్పినివారణ మాత్రలు వాడటం, పైపూతగా ఆయింట్మెంట్లు పూసుకోవడం వంటివి చేస్తుంటారు. ఇకపై వాటితో పని లేకుండా, ఈ ఫొటోలో కనిపిస్తున్న పరికరాన్ని నొప్పి ఉన్నచోట పెట్టుకుని, దీనికి ఉన్న బెల్టుతో బిగించి కట్టుకుంటే చాలు, సత్వరమే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అమెరికన్ కంపెనీ ‘థెరాబాడీ’ ఇటీవల ‘రికవరీ థెర్మ్క్యూబ్’ పేరిట ఈ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మనం కోరుకున్న విధంగా చల్లదనం లేదా వెచ్చదనాన్ని ఎంచుకోవడానికి స్విచ్లు ఉంటాయి. నొప్పి ఉన్న చోట ఈ క్యూబ్ను అదిమిపెట్టి బిగించి బెల్ట్ కట్టుకుంటే చాలు, రెండు గంటల్లోనే పూర్తిగా నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీని ధర 149 డాలర్లు (రూ.12,350) మాత్రమే! హైడ్రోజన్తో పరుగులు తీసే కారు.. జపాన్కు చెందిన కార్ల తయారీ సంస్థ ‘హోండా’ తాజాగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్తో నడిచే కారును రూపొందించింది. హోండా మోడల్స్లోని ‘సీఆర్–వి’ మోడల్ ఎస్యూవీకి అవసరమైన మార్పులు చేసి, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్తో నడిచేలా ‘సీఆర్వీ: ఈఎఫ్సీఈవీ’ మోడల్కు రూపకల్పన చేసింది. ఇందులో ఉపయోగించే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ మాడ్యూల్స్ తయారీకి మరో కార్ల తయారీ సంస్థ ‘జనరల్ మోటార్స్’ సహకారం తీసుకుంది. ఇందులో అమర్చిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ మాడ్యూల్స్లోని 110 వోల్టుల పవర్ ఔట్లెట్ ద్వారా ఇంజిన్కు దాదాపు 1500 వాట్ల విద్యుత్తు సరఫరా అవుతుంది. బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేసుకున్నట్లయితే, ఇది ఏకంగా 435 కిలోమీటర్ల వరకు నిరంతరాయంగా ప్రయాణిస్తుంది. ఈ కారును హోండా మోటార్స్ వచ్చే ఏడాది నాటికి మార్కెట్లోకి విడుదల చేయనుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. బ్యాటరీతో నడిచే ఈ–విమానం ఇది బ్యాటరీతో నడిచే ఈ–విమానం నమూనా. ఇది అందుబాటులోకి వస్తే, విమానయాన రంగంలో విప్లవాత్మకమైన మార్పు రాగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే రోడ్లపైకి వచ్చిన ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగానే ఈ విమానం కూడా రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. డచ్ విమానాల తయారీ కంపెనీ ‘ఎలీసియన్’ ఈ బ్యాటరీ విమానం నమూనాకు ఇటీవల రూపకల్పన చేసింది. ‘ఎలీసియన్–ఈ9ఎక్స్’ పేరుతో రూపొందించిన ఈ విమానం 2033 నాటికి అందుబాటులోకి రానున్నట్లు ‘ఎలీసియన్’ కంపెనీ ప్రకటించింది. సాధారణ విమానాల కంటే చాలా తక్కువ బరువుతో రూపొందించిన ఈ విమానం వెయ్యి కిలోమీటర్ల పరిధిలోని ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. ఇందులో 90 మంది ప్రయాణికులు ప్రయాణించడానికి వీలవుతుంది. ఇవి చదవండి: వీటిని చూశారంటే.. మంత్ర ముగ్ధులు అవక తప్పదు! -
సెల్ఫ్ డ్రైవింగ్ కారు తయారు చేసిన రైతు బిడ్డ, ముచ్చటపడ్డారు కానీ రిజెక్ట్!
మహారాష్ట్రలోని చంద్రపూర్కు చెందిన రైతు బిడ్డ 'హర్షల్ నక్షనేని' (Harshal Nakshane) హైడ్రోజన్తో నడిచే AI కారును రూపొందించి.. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి 'దేవేంద్ర ఫడ్నవిస్' చేత ప్రశంసలందుకున్న విషయం గతంలో తెలుసుకున్నాం. అయితే ఈ కారు అభివృద్ధికి షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 3లోని పారిశ్రామిక వేత్తలు పెట్టుబడుల పెట్టడానికి నిరాకరించారు. స్టార్టప్ AI కార్స్కు చెందిన హర్షల్ మహదేవ్ నక్షనేని సుమారు 18 నెలలు శ్రమించి భారతదేశపు మొట్ట మొదటి ఏఐ ఆధారిత హైడ్రోజన్ కారు రూపొందించారు. ఈ కారు నిర్మాణానికి ఏకంగా రూ. 60 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ కారుని హర్షల్ షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 3లోని పారిశ్రామిక వేత్తలు ముందుకు తీసుకువచ్చారు. ఏఐ కారు రీఫ్యూయలింగ్ సమయం కేవలం ఐదు నిముషాలు మాత్రమే. ఇది 1000 కిమీ కంటే ఎక్కువ పరిధిని అందిస్తుందని హర్షల్ వెల్లడించారు. ఈ ఏఐ కారు పారిశ్రామిక వేత్తలను ఎంతగానో ఆకర్శించింది, అయితే పెట్టుబడి పెట్టడానికి మాత్రం నిరాకరించారు. ఇదీ చదవండి: ఏప్రిల్ నుంచి ఫాస్ట్ట్యాగ్లు పనిచేయవు! కారణం ఇదే.. హైడ్రోజన్ శక్తితో నడిచే వాహనాలకు మార్కెట్ తక్కువగా ఉండటమే కాకుండా.. ఇలాంటి వాటికి సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం కారణంగా పెట్టుబడి పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపలేదు. అయితే ఈ కారు వారు స్వయంగా డ్రైవ్ చేసి 'హర్షల్' పనితీరుని ప్రశంసించారు. -
అక్కడ మొదటి హైడ్రోజన్ రైలు.. త్వరలోనే ట్రయల్స్
ప్రత్యామ్నాయ ఇంధనాలకు ఇటీవల ప్రధాన్యత పెరుగుతోంది. కాలూష్య రహిత పర్యావరణం దిశగా ప్రపంచ దేశాలు పయనిస్తున్నాయి. ఇందులో భాగంగా హైడ్రోజన్ ఇంధనం వెలుగులోకి వచ్చింది. ఈ ఇంధనంతో నడిచే వాహనాలను పలు దేశాలు ప్రోత్సహిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా సౌదీ అరేబియా త్వరలోనే హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును ప్రారంభించనుంది. ఈమేరకు ఆ దేశ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ ప్రకటించారు. మధ్యప్రాచ్యంలో మొదటి హైడ్రోజన్ రైలును పరీక్షించడాన్ని తమ దేశం ప్రారంభిస్తుందని రియాద్లో జరిగిన UN MENA క్లైమేట్ వీక్ కార్యక్రమంలో వెల్లడించారు. (ఇండియన్ ఫుడ్కు భారీ డిమాండ్.. భారత్ను వేడుకుంటున్న దేశాలు) హైడ్రోజన్ రైలు అనేది విద్యుత్తును ఉత్పత్తి చేసే ఒక ప్రత్యేకమైన రైలు. హైడ్రోజన్ ఇంధన కణాలను ఉపయోగించి దాని ప్రొపల్షన్ సిస్టమ్కు శక్తినిస్తుంది. సంప్రదాయ డీజిల్తో నడిచే రైళ్ల కంటే పర్యావరణపరంగా మేలైనవి. ఇవి పర్యావరణానికి హాని కలిగించే ఎటువంటి ఉద్గారాలను విడుదల చేయవు. మొట్టమొదటి హైడ్రోజన్ రైలు "కోరాడియా ఐలింట్" అనేది హైడ్రోజన్ శక్తితో ప్రత్యేకంగా నడిచే ప్రపంచంలో మొట్టమొదటి ప్యాసింజర్ రైలు. ఫ్రెంచ్ బహుళజాతి రైలు రవాణా సంస్థ Alstom దీనిని తయారు చేసింది. 2016లో దీని పరిచయం రైలు ఆధారిత హైడ్రోజన్ ఇంధన సెల్ సాంకేతికత అభివృద్ధిలో ఒక కీలక మలుపు. ఈ రైలు ఒక ట్యాంక్ హైడ్రోజన్కు సుమారు 1,000 కిలోమీటర్లు నడుస్తోంది. ఇది మొదట 2018 సెప్టెంబర్లో జర్మనీలోని లోయర్ సాక్సోనీలో కమర్షియల్గా ప్రారంభమైంది. భారత్లోనూ.. భారత్ సైతం హైడ్రోజన్తో నడిచే రైళ్లను అభివృద్ధి చేస్తోందని, ఇవి 2023 డిసెంబర్ నాటికి సిద్ధమవుతాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గతంలో తెలిపారు. హర్యానాలోని జింద్-సోనీపట్ మార్గంలో వీటిని నడపనున్నారు. -
సోలార్పవర్తో ‘హైడ్రోజన్’
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/గోదావరిఖని: ఇప్పటికే సోలార్ విద్యుత్ రంగంలోకి అడుగిడిన ‘సింగరేణి’ మరో భారీ పర్యావరణహిత కార్యక్ర మానికి శ్రీకారం చుడు తోంది. సంస్థ నిర్వహణలో ఉన్న హైడ్రోజన్ ప్లాంట్ను గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్గా మార్చేందుకు సిద్ధమైంది. దీనిపై పరిశీలించి నివేదిక ఇవ్వాలని సింగరేణి సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) ఎన్.శ్రీధర్ సంస్థకు చెందిన విద్యుత్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో తాజాగా జరిగిన ఈ సమావేశంలో దీనిపై చర్చించారు. హైడ్రోజన్ అవసరం థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వాడే జనరేటర్లలోని వేడిని తగ్గించేందుకు శీతలీకరణ ధాతువుగా హైడ్రోజన్ను వినియోగిస్తున్నారు. ఇందుకు ప్లాంట్ ఆవరణలోనే ఒక హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తారు. మంచిర్యాల జిల్లాలోని జైపూర్ వద్ద 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఉంది. ఈ ప్లాంట్లో ఉన్న హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం ఏటా దాదాపు 10 వేల క్యూబిక్ మీటర్ల హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తోంది. గ్రీన్ హైడ్రోజన్ సాధారణంగా థర్మల్ విద్యుత్ వినియోగించి ఎలక్ట్రాలసిస్ రసాయనిక పద్ధతిలో హైడ్రోజన్ వాయువు ఉత్పత్తి చేస్తారు. అయితే థర్మల్ విద్యుత్కు బదులు సోలార్ విద్యుత్ వినియోగించి హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. ఇలా ఉత్పత్తి చేసే హైడ్రోజన్ను ‘గ్రీన్ హైడ్రోజన్’గా పేర్కొంటారు. సింగరేణి పవర్ ప్లాంట్లో హైడ్రోజన్ ఉత్పత్తి కోసం 100 కిలోవాట్ థర్మల్ విద్యుత్ను వినియోగిస్తుండగా, రాబోయే రోజుల్లో థర్మల్ బదులుగా సోలార్ విద్యుత్ ఉపయోగిస్తారు. జైపూర్లోనే... జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర ప్రాంగణంలోనే ప్రస్తుతం 10 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం, ఐదు మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు ఉన్నాయి. అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ నేరుగా హైడ్రోజన్ ప్లాంట్కు అనుసంధానం చేస్తారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రామగుండం రీజియన్లోనే మరో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటుకు సాధ్యాసా«ధ్యాలను పరిశీలించాలని చైర్మన్ సూచించారు. సోలార్ పవర్ ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి మొదలైతే దేశంలోనే గ్రీన్ హైడ్రోజన్ వినియోగిస్తున్న తొలి థర్మల్ విద్యుత్ కేంద్రంగా సింగరేణి నిలుస్తుంది. జియోపై దృష్టి వేడినీటి ఊట ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా సింగరేణి ప్రయోగాత్మకంగా జియో థర్మల్ ప్రాజెక్ట్ చేపట్టింది. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వద్ద మూడేళ్ల నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి. దీంతో పాటు సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్లోనే మిథనాల్ ప్రాజెక్ట్పై పరిశోధనలు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలని సీఎండీ శ్రీధర్ ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో సింగరేణిలోని సోలార్ ప్లాంట్ల ద్వారా 170 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశామని, తద్వారా ట్రాన్సోకు చెల్లించే విద్యుత్ బిల్లులో రూ.108 కోట్లు ఆదా చేసుకోగలి గామన్నారు. ఈ సమీక్ష సమావేశంలో డైరెక్టర్ డి.సత్యనారా యణరావు, సీటీసీ సంజయ్కుమార్ సూర్, చీఫ్ ఓఅండ్ఎం జే.ఎన్.సింగ్, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం జనరల్ మేనేజర్ చినబసివి రెడ్డి, జనరల్ మేనేజర్(సోలార్) జానకీరాం, చీఫ్ ఆఫ్ పవర్ ఎన్వీకేవీ.రాజు, జీఎం సూర్య నారాయణ, ఏజీఎంలు కేఎస్ఎన్.ప్రసాద్, సుధాకర్ పాల్గొన్నారు -
తుక్కు కేంద్రాలను కూడా ప్రారంభించండి
న్యూఢిల్లీ: ఆటోమొబైల్స్ డీలర్లు.. వాహనాల తుక్కు కేంద్రాలను కూడా ప్రారంభించాలని కేంద్ర రహదారులు, హైవేస్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం అనుమతులు ఇస్తుందని చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాలు, బయోఫ్యుయల్ వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, అలాగే హరిత హైడ్రోజన్ ఉత్పత్తిలో భారత్ను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కూడా కృషి చేస్తోందని మంత్రి వివరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ ఉందని అయిదో ఆటో రిటైల్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి తెలిపారు. 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్ ఎదగడంలో ఆటో డీలర్లు కీలక పాత్ర పోషించగలరని పేర్కొన్నారు. ప్యాసింజర్ వాహనాల తయారీలో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉన్న భారత్.. వాణిజ్య వాహనాల తయారీలో ఆరో స్థానంలో ఉందన్నారు. దేశాన్ని టాప్ ఆటోమొబైల్ హబ్గా తీర్చిదిద్దడం తన కల అని ఆయన చెప్పారు. -
గ్రీన్ హైడ్రోజన్కు అదానీ జేవీ
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ తాజాగా జపాన్ దిగ్గజం కోవా గ్రూప్తో చేతులు కలిపింది. సమాన వాటా(50:50)తో భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేసింది. తద్వారా జపాన్, తైవాన్, హవాయ్ మార్కెట్లలో గ్రీన్ హైడ్రోజన్ విక్రయాలను చేపట్టనుంది. రానున్న దశాబ్ద కాలంలో దేశీయంగా సమీకృత గ్రీన్ హైడ్రోజన్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే 50 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ ప్రణాళికలు ప్రకటించింది. దీనిలో భాగంగా తొలి దశలో మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి తెరతీయనుంది. తదుపరి దశలో సామర్థ్యాన్ని 3 మిలియన్ టన్నులకు పెంచనుంది. ఈ బాటలో తాజాగా సింగపూర్ అనుబంధ సంస్థ ద్వారా కోవా హోల్డింగ్స్ ఏషియా పీటీఈతో జేవీని నెలకొలి్పంది. వెరసి గ్రీన్ అమోనియా, గ్రీన్ హైడ్రోజన్, వీటి డెరివేటివ్ అమ్మకాలు, మార్కెటింగ్ చేపట్టనుంది. శుద్ధ ఇంధన తయారీకి హైడ్రోజన్ ఉపయోగపడనుంది. ప్రధానంగా రిఫైనింగ్, కెమికల్ రంగాలలో వినియోగిస్తారు. అదానీ ఇప్పటికే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన కంపెనీగా ఆవిర్భవించింది. గుజరాత్, ముంద్రా సెజ్లోని సోలార్ మాడ్యూల్ తయారీ సామర్థ్యాలను వార్షికంగా 10 గిగావాట్లకు పెంచుకునే ప్రణాళికల్లో ఉంది. ఇక్కడ మెటలర్జికల్ గ్రేడ్(ఎంజీ) సిలికాన్, పాలీసిలికాన్, ఇన్గాట్స్, వేఫర్స్, సెల్స్ తదితరాలను రూపొందించేందుకు వీలుంది. వీటిని సౌర ఇంధనం ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టే ప్రక్రియలో వినియోగిస్తారు. -
‘గ్రీన్’ ప్రాజెక్టులకు రెడ్ కార్పెట్
సాక్షి, అమరావతి: వాతావరణ కాలుష్య రహిత, నాణ్యమైన విద్యుత్తు అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న చర్యలతో రాష్ట్రం గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం (హబ్)గా అవతరిస్తోంది. తరిగిపోతున్న శిలాజ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా, పెరుగుతున్న వాతావరణ కాలుష్యానికి విరుగుడుగా స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగంలోకి తేవడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో ఏపీ భాగం అవుతోంది. ఈ ప్రాజెక్టు కోసం గతేడాది కేంద్రం ఎంపిక చేసిన ఐదు రాష్ట్రాల్లో మన రాష్ట్రం కూడా ఉంది. దీనికి అనుగుణంగా గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా పాలసీ 2023ని రాష్ట్రం రూపొందించింది. తాజాగా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) తయారు చేసిన నివేదిక శ్వేత పత్రాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు. అందులోని వివరాలను ‘ఎన్ఆర్ఈడీసీఏపీ’ వీసీ, ఎండీ ఎస్.రమణారెడ్డి ‘సాక్షి’ ప్రతినిధికి వెల్లడించారు. సమగ్రంగా శ్వేతపత్రం రాష్ట్ర ప్రభుత్వం సౌర, పవన విద్యుత్ వంటి స్వచ్ఛ ఇంధనాన్ని ప్రోత్సహిస్తోంది. హైబ్రిడ్ వ్యవస్థగా చెబుతున్న పంప్డ్ హైడ్రో స్టోరేజి ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపడుతోంది. ప్రస్తుతం రాష్ట్రానికి 9 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి స్థాపిత సామర్థ్యం ఉంది. అనేక ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో సౌర, పవన, పంప్డ్ హైడ్రో సిస్టం ప్రాజెక్టులు 24 గంటలూ విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. కొత్త టెక్నాలజీల ఆవిర్భావం, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ వంటి వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకుంటోంది. తద్వారా రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ రంగంలో 10 బిలియన్ డాలర్ల నుంచి 15 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులకు అవకాశాలున్నాయి. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు మౌలిక సదుపాయాలు ఉన్నాయి. రాష్ట్ర అవసరాలతోపాటు ఇతర రాష్ట్రాలకు విద్యుత్ను ఎగుమతి చేయడానికి అవసరమైన గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్రం అనుకూలంగా ఉంది. రాష్ట్రంలో ఏటా 400 కిలో టన్నుల దేశీయ హైడ్రోజన్ డిమాండ్ ఉంది. దేశ పారిశ్రామిక హైడ్రోజన్ డిమాండ్లో ఇది దాదాపు 8 శాతం. ప్రతి ఏటా పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా పాలసీ 2023 ప్రకారం 2030 నాటికి కనీసం 500 కిలో టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుంది.దీని సాయంతో శిలాజ ఇంధన వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలని(డీకార్బనైజ్) భావిస్తోంది. ఇందుకోసం యాక్సిలరేటింగ్ స్మార్ట్ పవర్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ ఇండియా (ఆస్పైర్) ప్రోగ్రామ్ కింద ఫారిన్, కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్ సాయంతో ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ హైడ్రోజన్ ఇన్వెస్ట్మెంట్ అవకాశాల నివేదిక సిద్ధం చేసింది. రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం వ్యాపారాలకు, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం, పర్యావరణ వ్యవస్థలపై ‘వైట్పేపర్’లో వివరించారు. ఇది పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అభివృద్ధి కార్యకలాపాలను ప్రోత్సహించడానికి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర సంసిద్ధంగా ఉందని శ్వేతపత్రంలో పొందుపరిచారు. కేంద్రం ఎంచుకున్న ఐదు రాష్ట్రాల్లో ఏపీ ఆంధ్రప్రదేశ్తో పాటు గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో ఐదు జాతీయ గ్రీన్ హైడ్రోజన్ హబ్లు ఏర్పాటు చేయాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. వీటిని 25 గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ క్లస్టర్లుగా విభజించి, వివిధ రంగాలకు ఉపయోగించుకునేలా ప్రణాళికలు రూపొందించింది. మొదటి తరం జాతీయ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులుగా పిలుస్తున్న వీటిలో పన్నెండు రసాయనాలు, రిఫైనరీ, ఉక్కు పరిశ్రమలలోని పారిశ్రామిక డీ–కార్బనైజేషన్ ప్రాజెక్టులు కాగా మూడు భారీ రవాణా ప్రాజెక్టులు, మరో మూడు సిటీ గ్యాస్ డ్రిస్టిబ్యూషన్ (సీజీడీ) ప్రాజెక్టుల్లో హైడ్రోజన్–బ్లెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. మిగిలిన ఏడు ప్రాజెక్టులు మునిసిపాలిటీల్లో వ్యర్థాల నుండి హైడ్రోజన్ను ఉత్పత్తి చేసేవి. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో వీటి ద్వారా 2025 నాటికి 150 మెగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యానికి గ్రీన్ హైడ్రోజన్ పాలసీతో ఏపీ జీవం పోసింది. -
కొత్త రకం బస్సు.. దేశంలో తొలిసారి
దేశంలో ఇప్పటి వరకూ ఎన్నో రకాల బస్సులను చూశాం. డీజిల్ నడిచే బస్సులతోపాటు ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ బస్సులు కూడా పెరుగుతున్నాయి. అయితే దేశంలో తొలిసారిగా కొత్త రకం బస్సు పరుగులు తీయనుంది. అదే హైడ్రోజన్ ఇంధనంతో నడిచే బస్సు. అత్యంత ఎత్తైన హిమాలయాల్లోని లేహ్ రోడ్లపై తిరగనుంది. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ను ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) చేపట్టింది. కార్బన్-న్యూట్రల్ లడఖ్ను సాధించే దిశగా ఎన్టీపీసీ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్, సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తోంది. లేహ్ ఇంట్రాసిటీ రూట్లలో ఆపరేషన్ కోసం ఐదు ఫ్యూయల్ సెల్ బస్సులను అందజేస్తున్నట్లు కంపెనీ ప్రకటన తెలిపింది. మూడు నెలలపాటు ఉండే ఫీల్డ్ ట్రయల్స్, రోడ్వర్తీనెస్ టెస్ట్లు, ఇతర చట్టబద్ధమైన ప్రక్రియల్లో భాగంగా మొదటి హైడ్రోజన్ బస్సు ఆగస్టు 17న లేహ్కు చేరుకుంది. దేశంలో హైడ్రోజన్ ఇంధన బస్సులను వినియోగించడం ఇదే మొదటిసారి. 11,562 అడుగుల ఎత్తులో గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్ట్లో భాగంగా 1.7 మెగావాట్ల ప్రత్యేక సోలార్ ప్లాంట్ను ఎన్టీపీసీ ఏర్పాటు చేసింది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో ప్రతికూల వాతావరణానికి సరిపోరిపోయేలా ఈ బస్సులను రూపొందించారు. 2032 నాటికి 60 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించి గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీలో అగ్రగామిగా నిలవాలని ఎన్టీపీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బస్సుల సరఫరాకు సంబంధించిన కాంట్రాక్ట్ను 2020 ఏప్రిల్లో దక్కించుకున్న అశోక్ లేలాండ్ సంస్థ.. ఒక్కొక్కటి రూ. 2.5 కోట్లకు అందజేసింది. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ఈ బస్సుల్లో ఛార్జీలు సాధారణ డీజిల్ బస్సుల్లో ఛార్జీల మాదిరిగానే ఉంటాయి. దీనివల్ల వాటిల్లే నష్టాన్ని ఎన్టీపీసీనే భరించనుంది. -
రాష్ట్రంలో స్వచ్ఛ ఇం‘ధనం’
సాక్షి, అమరావతి: గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అనుకూలమైన రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ ఎంపికైంది. స్వచ్ఛ ఇంధనం ఉత్పత్తికి అవసరమైన అన్ని వనరులు ఉండటం, ఇందుకోసం రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక పాలసీని తేవడంతో కీలకమైన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు రాష్ట్రానికి రానున్నాయి. వీటి ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రాష్ట్రాభివృద్ధికి మరింతగా చేయూతనిస్తాయి. ప్రకృతి పరిరక్షణకు ప్రపంచ దేశాలు చేసుకున్న ఒప్పందంలో భాగంగా మన దేశంలో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కొత్త పథకాలు, పాలసీలు తెస్తున్నాయి. వాటి ద్వారా ఈ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశంలో 4.5 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర పభుత్వం టెండర్లు పిలిచింది. ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఏపీ సహా 10 రాష్ట్రాలు అనుకూలమని తేలి్చంది. దీంతో త్వరలోనే రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ‘సైట్’తో ప్రోత్సాహకాలు ఏటా 125 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనంతో పాటు 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సాధించాలనే లక్ష్యంతో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని కేంద్రం తీసుకువచ్చింది. ఇందులో భాగంగా, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే పరిశ్రమలకు ఆర్థిక తోడ్పాటునందించడానికి స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ (సైట్) పథకాన్ని గత నెలాఖరులో ప్రవేశపెట్టింది. ఉత్పత్తిదారులకు ఆ ర్థికంగా చేయూతనందించేందుకు రూ.19,744 కోట్లు కేటాయించింది. 2029–30 వరకు ఈ పథకం అమలులో ఉంటుంది. తొలి ఏడాది రూ.4,440 కోట్లు, రెండో ఏడాది రూ.3,700 కోట్లు, మూడో ఏడాది రూ.2,960 కోట్లు, నాలుగో ఏడాది రూ.2,220 కోట్లు, ఐదో ఏడాది రూ.1,480 కోట్లు చొప్పున ఆరి్ధక ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఏపీ సొంత పాలసీ రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ఉత్పత్తిని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక పాలసీని రూపొందించింది. ఈ ఏడాది కేంద్రం పాలసీని తేవడానికి ఒక రోజు ముందే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పాలసీని తీసుకొచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్ డిమాండ్ ఏడాదికి దాదాపు 0.34 మిలియన్ టన్నులు (ఎంటీ) ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రానున్న ఐదేళ్లలో సంవత్సరానికి 0.5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్, 2 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక మిలియన్ టన్ను గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయగలిగితే 12 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేసింది. ఈ పాలసీ ఐదేళ్లపాటు లేదా కొత్త పాలసీ జారీ అయ్యే వరకు అమలులో ఉంటుంది. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ని ఉపయోగించడం ద్వారా నీటి నుంచి గ్రీన్ హైడ్రోజన్ లేదా గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేయాలనుకునే డెవలపర్లు ఈ పాలసీ పరిధిలోకి వస్తారు. ఈ పాలసీ అమలుకు న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వ విధానం, ప్రోత్సాహకాలతో రాష్ట్రానికి తప్పకుండా ప్రాజెక్టులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు ♦ ప్రాజెక్టు ప్రారంభించిన తేదీ నుంచి ఐదేళ్లపాటు గ్రీన్ హైడ్రోజన్ అమ్మకంపై డెవలపర్లకు స్టేట్ జీఎస్టీలో 100 శాతం తిరిగి చెల్లింపు ♦గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తికి ఉపయోగించే పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుకు వాణిజ్య ఆపరేషన్ తేదీ నుంచి ఐదేళ్ల పాటు విద్యుత్ సుంకంపై 100 శాతం మినహాయింపు ♦ ఇంట్రాస్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీల్లో 25 శాతం రీయింబర్స్మెంట్ ♦ క్రాస్–సబ్సిడీ సర్చార్జి ఐదేళ్లు వెనక్కు ♦ ప్రాజెక్టుకు భూమిని ప్రభుత్వమే నోడల్ ఏజెన్సీ ద్వారా నామ మాత్రపు ధరకు లీజుగా కేటాయింపు ♦ భూ వినియోగ మార్పిడి ఛార్జీలు, స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు -
హరిత హైడ్రోజన్ వినియోగ విధానాలపై కసరత్తు
న్యూఢిల్లీ: దేశీయంగా హరిత హైడ్రోజన్ వినియోగానికి సంబంధించి విధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ కార్యదర్శి భూపిందర్ సింగ్ భల్లా తెలిపారు. పరిశ్రమ తగు స్థాయిలో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు వీలుగా డిమాండ్ను మదింపు చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా భల్లా ఈ విషయాలు పేర్కొన్నారు. 2030 నాటికి ప్రతిపాదిత హరిత హైడ్రోజన్ ఉత్పత్తిలో 70 శాతం భాగం ఎగుమతుల కోసం ఉద్దేశించినదై ఉంటుందని ఆయన తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి సంబంధించి భారత్ను ప్రపంచ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ ఏడాది జనవరిలో కేంద్రం రూ. 19,744 కోట్లతో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రణాళికను ఆమోదించింది. మరోవైపు, హరిత హైడ్రోజన్ వినియోగానికి మారే క్రమంలో సిబ్బందికి శిక్షణ కల్పించేందుకు కేంద్రం కృషి చేస్తోందని భల్లా పేర్కొన్నారు. -
హైడ్రోజన్తో స్వావలంబన దిశగా..
సాక్షి, హైదరాబాద్: ఇంధన రంగంలో మన దేశం స్వావలంబన సాధించేందుకు హైడ్రోజన్ ఉపయోగపడుతుందని, ఈ దిశగా పరిశోధనలూ వేగంగా సాగుతున్నాయని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) హైడ్రోజన్ విభాగం జనరల్ మేనేజర్ డీఎంఆర్ పాండా వెల్లడించారు. జాతీయ సైన్స్ దినోత్సవాల్లో భాగంగా మంగళవారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో డీఎంఆర్ పాండా ‘గ్రీన్ హైడ్రోజన్ ఎమర్జింగ్ ట్రెండ్స్’’అన్న అంశంపై కీలకోపన్యాసం చేశారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పర్యావరణ అనుకూలమైన విధానాల్లో హైడ్రోజన్ను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా లేహ్, ఢిల్లీల్లో హైడ్రోజన్ బస్సులు ఇప్పటికే నడుస్తుండగా, సౌర విద్యుత్ సాయంతో హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వలకు కూడా పైలెట్ ప్రాజెక్టులు నిర్వహిస్తున్నామని చెప్పారు. గత పదేళ్లలో హైడ్రోజన్ ధర పదిరెట్లు తగ్గింది.. దేశంలో సౌర, పవన విద్యుదుత్పత్తులకు అపార అవకాశాలున్నాయని, ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్తో వేర్వేరు పద్ధతులను ఉపయోగించుకుని హైడ్రోజన్ను ఉత్పత్తి చేయడం ద్వారా దేశం పెట్రో ఉత్పత్తుల దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం తప్పుతుందని పాండా వివరించారు. అలాగే కర్బన ఉద్గారాల తగ్గింపూ సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుతం హైడ్రోజన్ ఉత్పత్తి ఖర్చులు ఎక్కువైనప్పటికీ, ఐఐసీటీ, ఇతర విద్యా, పరిశోధన సంస్థల సహకారంతో దాన్ని తగ్గించి విస్తృత వినియోగంలోకి తేవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో హైడ్రోజన్ ధర పదిరెట్లు తగ్గిందని గుర్తు చేశారు. ఎలక్ట్రలైజర్లు, ఒత్తిడిని తట్టుకోగల సిలిండర్లు, హైడ్రోజన్ను చిన్న చిన్న సిలిండర్లలోకి పంపేందుకు అవసరమైన కంప్రెషర్ల విషయంలో దేశం ఇప్పటికీ విదేశాలపైనే ఆధారపడుతోందని, ఫలితంగా ఈ ఇంధనాన్ని అందరికీ అందుబాటులోకి తేవడంలో ఆలస్యం జరుగుతోందని చెప్పారు. ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస రెడ్డి, డాక్టర్ సమీర్ దవే, డాక్టర్ నెట్టెం వి.చౌదరి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు ఎన్టీపీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ దేశంలో హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగంపై జరుగుతున్న ప్రయత్నాలను క్లుప్తంగా వివరించారు. ఆంధ్రప్రదేశ్లో హైడ్రోజన్ హబ్ దేశంలో హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగాలను పెంచే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో హైడ్రోజన్ హబ్ ఒకదాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఎన్టీపీసీ జనరల్ మేనేజర్ (హైడ్రోజన్ విభాగం) డీఎంఆర్ పాండా తెలిపారు. విశాఖపట్నంలోని ఎన్టీపీసీ కేంద్రానికి దగ్గరగా ఈ హబ్ ఏర్పాటు కానుందని ఆయన విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. మొత్తం 1200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే హైడ్రోజన్ హబ్లో హైడ్రోజన్ ఉత్పత్తితోపాటు దానికి సంబంధించిన టెక్నాలజీలు, రవాణా వ్యవస్థలపై విస్తృతమైన పరిశోధనలు జరగనున్నాయని, సౌర శక్తి కోసం పెద్ద ఎత్తున సోలార్ ప్యానెల్స్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ హబ్ ఏర్పాటుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని, అన్నీ సవ్యంగా సాగితే ఇంకో వారం రోజుల్లో ఎన్టీపీసీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య దీనిపై ఒక అవగాహన ఒప్పందం కూడా జరగనుందని వివరించారు. రానున్న పదేళ్లలో ఈ హబ్ ఏర్పాటుకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు పాండా తెలిపారు. ‘వన్ వీక్.. వన్ ల్యాబ్’ ఈ నెల ఏడు నుంచి! కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) పరిశోధనశాలల కార్యకలాపాలను ప్రజలకు వివరించేందుకు ఉద్దేశించిన ‘వన్ వీక్.. వన్ ల్యాబ్’కార్యక్రమం ఈ నెల ఏడవ తేదీ నుంచి ప్రారంభం కానుందని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఆరు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ఐఐసీటీలో జరుగుతున్న పరిశోధనలు, అభివృద్ధి చేసిన ఉత్పత్తులను ప్రదర్శించనున్నామని చెప్పారు. పరిశోధకులు, ఉపాధ్యాయులు, పారిశ్రామికవేత్తలు, టెక్నాలజిస్టులు, స్టార్టప్లు, సాధారణ ప్రజలు ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చునని సూచించారు. -
హైడ్రోజన్తో నడిచే బస్.. త్వరలో భారత్ రోడ్ల పైకి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజినీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కు (ఎంఈఐఎల్) చెందిన ఎలక్ట్రిక్ వాహన రంగ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్టెక్ హైడ్రోజన్తో నడిచే బస్ను తయారు చేసింది. రిలయన్స్ భాగస్వామ్యంతో ఈ వాహనాన్ని రూపొందించినట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. ఏడాదిలోగా వాణిజ్యపరంగా వీటి ఉత్పత్తి ప్రారంభించాలని ఒలెక్ట్రా లక్ష్యంగా చేసుకుంది. పూర్తి ఇంధన సామర్థ్యంతో 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించడం బస్ ప్రత్యేకత. బస్ పైభాగంలో టైప్–4 హైడ్రోజన్ సిలిండర్లను ఏర్పాటు చేశారు. 12 మీటర్ల పొడవు ఉన్న ఈ బస్సులో డ్రైవర్ సీటు కాకుండా ప్రయాణికులకోసం 32–49 సీట్లు ఏర్పాటు చేయవచ్చు. హైడ్రోజన్ నింపడానికి 15 నిమిషాలు పడుతుంది. (ఇదీ చదవండి: సింథటిక్ వజ్రాల ల్యాబ్.. ఎక్కడో తెలుసా?) -
హిండెన్బర్గ్ ఎఫెక్ట్ : అదానీ - టోటల్ ఎనర్జీ హైడ్రోజన్ ప్రాజెక్టుపై నీలినీడలు
హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదిక అదానీ గ్రూప్పై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా 50 బిలియన్ డాలర్ల హైడ్రోజన్ ప్రాజెక్ట్ కోసం అదానీ గ్రూప్తో జత కలిసే నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. హిండెన్బర్గ్ నివేదిక విషయమై స్పష్టత వచ్చే వరకు ముందుకెళ్లడం లేదని టోటల్ ఎనర్జీస్ సీఈవో పాట్రిక్ పౌయన్నె తెలిపారు. 2030 నాటికి 10 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో అదానీ గ్రూప్, టోటల్ ఎనర్జీస్ మధ్య చర్చలు జరిగాయి. ఇందుకోసం వచ్చే పదేండ్లలో అదానీ న్యూ ఇండస్ట్రీస్లో టోటల్ ఎనర్జీ 5000 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాల్సి ఉంది. ఒప్పందంలో భాగంగా గతేడాది జూన్లో చేసిన ప్రకటన ప్రకారం అదానీ న్యూ ఎనర్జీస్లో టోటల్ ఎనర్జీస్ 25 శాతం వాటా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో హిండెన్బర్గ్ నివేదికతో టోటల్ ఎనర్జీస్ వెనక్కి తగ్గింది. హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణలపై అదానీ గ్రూప్ నిర్వహిస్తున్న అడిటింగ్ నివేదిక వచ్చే వరకు అదానీ న్యూ ఇండస్ట్రీస్తో తమ పార్టనర్షిప్ నిలిపేస్తున్నట్లు టోటల్ ఎనర్జీస్ తెలిపింది. -
అదానీ గ్రూప్ బిజినెస్ల విడదీత
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ బిజినెస్ల విడదీతకు ప్రణాళికలు వేసింది. హైడ్రోజన్, ఎయిర్పోర్టులు, డేటా సెంటర్లను ప్రత్యేక బిజినెస్లుగా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ ప్రక్రియను 2025లో ప్రారంభించి 2028కల్లా ముగించాలని ఆశిస్తున్నట్లు సీఎఫ్వో జుగెశిందర్ సింగ్ తాజాగా తెలియజేశారు. కాగా.. ఇటీవల గ్రూప్లోని ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్(ఏఈఎల్) ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ. 20,000 కోట్లను సమీకరించే సన్నాహాల్లో ఉన్న సంగతి తెలిసిందే. తొలుత పోర్టులు, విద్యుత్, సిటీ గ్యాస్ బిజినెస్లను ఏఈఎల్ ప్రారంభించి తదుపరి ప్రత్యేక కంపెనీలుగా విడదీసి లిస్ట్ చేసింది. ఈ బాటలోనే ప్రస్తుతం హైడ్రోజన్ తదితర నూతనతరం బిజినెస్లపై రానున్న పదేళ్లలో 50 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయాలని ప్రణాళికలు వేసింది. పెట్టుబడుల జాబితాలో విమానాశ్రయాల నిర్వహణ, మైనింగ్, డేటా సెంటర్లు, రహదారులు, లాజిస్టిక్స్ ఉన్నాయి. అయితే ప్రత్యేక కంపెనీలుగా ఏర్పాటు చేసేందుకు ఆయా బిజినెస్లు తగిన స్థాయిలో వృద్ధి చెందవలపి ఉన్నట్లు సింగ్ తెలియజేశారు. వెరసి 2025–2028 మధ్యలో ఇందుకు వీలు చిక్కవచ్చని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. -
హరిత హైడ్రోజన్కు త్వరలో మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా హరిత హైడ్రోజన్ తయారీకి భారత్ను ప్రధాన హబ్గా తీర్చిదిద్దే విధంగా త్వరలోనే ప్రమాణాలు, మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. దేశీయంగా ఎలక్ట్రోలైజర్ల తయారీ కోసం 15 గిగావాట్ల సామర్థ్యానికి సంబంధించి ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకంపై (పీఎల్ఐ) కసరత్తు చేసినట్లు ఆయన చెప్పారు. 2030 నాటికి దీన్ని 60 గిగావాట్ల స్థాయికి పెంచుకోవాలని భావిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దేశీయంగా తయారీని ప్రోత్సహించే క్రమంలో ఎలక్ట్రోలైజర్లను తక్కువ సుంకాలతో ఎప్పటివరకూ దిగుమతి చేసుకోవచ్చనేది కేంద్రం నిర్దిష్ట గడువు నిర్దేశిస్తుందని, ఆ తర్వాత నుంచి భారీ సుంకాలు అమల్లోకి వస్తాయ ని చెప్పారు. అలాగే హరిత హైడ్రోజన్ తయారీలో దేశీ పరిశ్రమ తగు రీతిలో పోటీపడే స్థాయికి ఎదిగే వరకూ తొలుత కొన్నేళ్ల పాటు పీఎల్ఐ స్కీము అందుబాటులో ఉంటుందని సింగ్ వివరించారు. దాదాపు రూ. 19,744 కోట్ల జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ను కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన నేపథ్యంలో ఆయన వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మిషన్ కింద వచ్చే అయిదేళ్లలో 5 మిలియన్ టన్నుల హరిత హైడ్రోజన్ను ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. -
ఈజిప్ట్లో రెన్యూ పవర్ హైడ్రోజన్ ప్లాంట్
న్యూఢిల్లీ: ఈజిప్ట్లో రెన్యూ పవర్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనుంది. సూయిజ్ కెనాల్ ఎకనమిక్ జోన్లో 8 బిలియన్ డాలర్ల (రూ.64 వేల కోట్లు) పెట్టుబడులతో హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించి ఈజిప్ట్ ప్రభుత్వంతో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ పీఎల్సీ (రెన్యూ) అనుబంధ కంపెనీ ‘రెన్యూ పవర్ ప్రైవేటు లిమిటెడ్’ ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా ఏటా 2,20,000 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ ఏడాది జూలైలోనే ఈజిప్ట్తో అవగాహన ఒప్పందం చేసుకోగా, ఇప్పుడు కార్యాచరణ ఒప్పందంపై సంతకాలు చేసినట్టు పేర్కొంది. దశలవారీగా ఈ ప్రాజెక్టు ఉత్పత్తిని ఆరంభిస్తుందంటూ, మొదటి దశలో 20,000 టన్నుల గ్రీన్ హైడ్రోజన్, డెరివేటివ్లను ఉత్పత్తి చేయనున్నట్టు తెలిపింది. కార్యాచరణ ఒప్పందం కింద, ప్రాజెక్టు, క్షేత్రస్థాయి అధ్యయనం నిర్వహించి, వచ్చే 12–16 నెలల్లో తుది నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు స్థానిక డెవలపర్గా ఎల్స్వెడీ ఎలక్ట్రిక్ ఎస్ఏఈ పనిచేయనుంది. -
హైడ్రోజన్ కారుకు పేటెంట్.. మిర్యాలగూడ వాసి ఘనత
మిర్యాలగూడ: పెట్రోల్, డీజిల్ కారుకు నీటిలోని హైడ్రోజన్ సాయంతో మైలేజీ పెంచేలా తాను రూపొందించిన యంత్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పేటెంట్ లభించినట్లు బీఎస్ఎన్ఎల్రిటైర్డ్ ఉద్యోగి కాశీనాథుని పూర్ణమల్లికార్జున్రావు తెలిపారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఆదివారం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ఏడేళ్లు శ్రమించి నీటినుంచి హైడ్రోజన్ను వేరు చేసి కారు ఇంజన్కు అందించే సాంకేతికతను అభివృద్ధి చేశానన్నారు. 2021, జూన్ 6న కేంద్ర ప్రభుత్వ పేటెంట్ సంస్థకు దరఖాస్తు చేయగా పలు దశల్లో ఇంజనీర్లు పరిశీలించి ఈ నెల 27న పేటెంట్ పత్రం మంజూరు చేశారని చెప్పారు. యంత్రం పనితీరు ఇలా.. డీజిల్, పెట్రోల్ కార్లకు రూ.10 వేల వ్యయంతో నీటి నుంచి హైడ్రోజన్ను వేరుచేసే యంత్రాన్ని అమర్చి ఇంజన్కు అనుసంధానిస్తారు. కారు ఆన్ చేయగానే ఆటోమేటిక్గా ఈ యంత్రం పనిచేయడం ప్రారంభమవుతుంది. యంత్రం నీటి ట్యాంకులోని హైడ్రోజన్ను వేరు చేస్తుంది. అది ఇంజిన్లోకి వెళ్లి కారు ముందుకు వెళ్లేందుకు సాయం చేస్తుంది. దీంతో డీజిల్, పెట్రోల్ కార్లకు అదనంగా 10 కి.మీ. మైలేజీ పెరుగుతుంది. తన కారుకు యంత్రాన్ని అమర్చి ఏడాదికిపైగా పరిశీలిస్తున్నట్లు పూర్ణమల్లికార్జున్రావు తెలిపారు. పెరిగిపోతున్న ఇంధన ఖర్చులు తగ్గించుకునేందుకు ఈ యంత్రం ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం మందుకొస్తే తన ప్రాజెక్టును అందిస్తానన్నారు. -
ట్రెండ్ మారింది.. పెట్రోల్, డీజల్,గ్యాస్ కాదు కొత్త తరం కార్లు వస్తున్నాయ్!
జర్మనీకి చెందిన కార్ల్ బెంజ్ 1886లో తన కారుకి పేటెంట్ పొందారు. ఆ కారులో వాడిన ఇంధనమేంటో తెలుసా.. గ్యాస్. ఔను.. ప్రపంచంలో మొట్టమొదటి కారు గ్యాస్తోనే నడిచింది. ఆ తరువాత అనేక పరిశోధనలు, ప్రయోగాల కారణంగా పెట్రోల్, డీజిల్ను కార్లలో విరివిగా వినియోగించడం మొదలైంది. దశాబ్దాలుగా ఆ రెండిటితో పాటు గ్యాస్ ఆధారిత కార్లనే మనం రోడ్లపై చూస్తున్నాం. కానీ.. ప్రపంచ పర్యావరణంపై మొదలైన ఆందోళన, పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు చేపట్టిన ప్రయత్నాల ఫలితంగా సరికొత్త ఇంధన ఆవిష్కరణలపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. దాని ఫలితమే విద్యుత్ వాహనాల ప్రవేశం. ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తూ సౌర విద్యుత్, హైడ్రోజన్ పవర్తో నడిచే కార్లను తయారు చేసే స్థాయికి చేరుకున్నాం. ఢిల్లీలో పరుగులు నేషనల్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా 6 నెలల క్రితమే హైడ్రోజన్ స్పైక్డ్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్పై నడిచే వాహనాలను ప్రారంభించిన మొదటి భారతీయ నగరంగా ఢిల్లీ నిలిచింది. ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్టీపీసీ లిమిటెడ్ కూడా లేహ్, ఢిల్లీలో 10 హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఆధారిత ఎలక్ట్రిక్ బస్సులు, ఇంధన సెల్ ఎలక్ట్రిక్ కార్లను నడపడానికి పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. దేశవ్యాప్తంగా రానున్న ఐదేళ్లలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న హైడ్రోజన్ కార్లలో ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే బ్యాటరీలను హైడ్రోజన్ గ్యాస్తో చార్జ్ చేసి కారును నడిచేలా చేస్తారు. దీనికి అవసరమయ్యే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ఆంధ్ర రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఫరీదాబాద్లో హైడ్రోజన్ ఉత్పత్తి యూనిట్ను ఏర్పాటు చేయాలనుకుంటోంది. భారత్లో గ్రీన్ హైడ్రోజన్ కారు ప్రపంచంలోనే మొదటి గ్రీన్ హైడ్రోజన్ (హరిత ఉదజని)తో నడిచే కారును మన దేశంలో ఇటీవల పరిచయం చేశారు. బ్రౌన్ హైడ్రోజన్ అంటే పెట్రోల్, బ్లాక్ హైడ్రోజన్ అంటే బొగ్గు. మరి గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏమిటనేగా మీ సందేహం. దీనిని నీరు, చెత్త నుంచి తీస్తారు. వీటినుంచి ఉత్పత్తి అయ్యే గ్రీన్ హైడ్రోజన్తో నడిచే ఈ కారుకు ‘మిరాయి’ అని నామకరణం కూడా చేశారు. ఇలాంటి కార్లను అతి తొందరలోనే దేశమంతటా నడపనున్నారు. అందుకు అవసరమైన ఈ గ్రీన్ హైడ్రోజన్ స్టేషన్లను ముందుగా నిర్మించనున్నారు. ఆ తర్వాత ఈ కార్ల అమ్మకాలు ప్రారంభించనున్నారు. ఈ కారు కేవలం 5.69 కేజీల గ్రీన్ హైడ్రోజన్తో రెండు రోజుల్లో 1,359 కిలోమీటర్లు ప్రయాణించి రికార్డు సృష్టించింది. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 600 కిలోమీటర్లు వెళ్లిపోవచ్చని నిరూపించింది. దాదాపు రూ.17 లక్షల కోట్ల పెట్రోలియం ఉత్పత్తులను ఏటా దిగుమతి చేసుకుంటున్న మన దేశంలో ఈ గ్రీన్ హైడ్రోజన్ను విస్తరిస్తే రైతులు సైతం దానిని ఉత్పత్తి చేయగలిగే పరిస్థితి వస్తుంది. దూసుకొస్తున్న సోలార్ కార్ ఎలక్ట్రిసిటీ అవసరం లేని కార్ కూడా వస్తోంది. ప్రపంచంలోనే తొలి సోలార్ కార్ ఉత్పత్తికి సిద్ధంగా ఉంది. నెదర్లాండ్స్కు చెందిన స్టార్టప్ సోలార్ కారును డిజైన్ చేసింది. ‘లైట్ ఇయర్’ పేరుతో ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ కారుకు ఎండ ఉంటే చాలు. సూర్యరశ్మి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఈ కారును ముందుకు నడిపిస్తుంది. ఈ కారు కూడా త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. ఈ ఏడాది చివరి నాటికి ప్రీ–ఆర్డర్స్ ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది రోడ్లపైకి దూసుకురానుంది. దీనిలో 60 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్, నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. సోలార్ పవర్ ద్వారా బ్యాటరీ చార్జ్ అవుతుంది. అవసరమైతే ఇంట్లో సాధారణ ప్లగ్కు కనెక్ట్ చేసి విద్యుత్ చార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ పద్ధతి ద్వారా గంట చార్జింగ్ చేస్తే 32 కిలోమీటర్లు, ఫుల్ చార్జ్ చేస్తే 625 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అదే సోలార్ పవర్ ద్వారా అయితే 70 కిలోమీటర్ల రేంజ్ వరకు సపోర్ట్ చేస్తుంది. కారు పైకప్పు, హుడ్పై డబుల్ కర్వ్ సోలార్ గ్లాస్ ఉంటుంది. మరో విశేషం ఏమంటే.. ఈ కారు చక్రాల నుంచి కూడా కొంత మొత్తంలో విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా డిజైన్ చేయడం విశేషం. ఈ కారులో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 10 సెకన్లలో అందుకోవచ్చు. 10.1 అంగుళాల టచ్స్క్రీన్ ఉంటుంది. చదవండి: ఈ కంపెనీ ఉద్యోగులకు బంపరాఫర్, ‘వారానికి 4 రోజులే పని’ -
హరిత హైడ్రోజన్ దిగ్గజంగా భారత్
హ్యూస్టన్: త్వరలోనే భారత్ హరిత హైడ్రోజన్ విభాగంలో లీడరుగా ఎదుగుతుందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ధీమా వ్యక్తం చేశారు. ఈ దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇంధనాల్లో 20 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని 2030 నుంచి 2025 నాటికి కుదించుకున్నామని పేర్కొన్నారు. జీవ ఇంధనా లు, హరిత హైడ్రోజన్, పెట్రోకెమికల్స్, ప్రత్యా మ్నాయ వనరుల నుంచి జీవ ఇంధనాల ఉత్పత్తి మొదలైన విభాగాల్లో అమెరికా–భారత్ కలిసి పని చేసేందుకు అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి చెప్పారు. దీనికి సంబంధించి నాలుగు అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు అమెరికాలోని హ్యూస్టన్లో భారత కాన్సల్ జనరల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. అమెరికన్ ఇంధ న కంపెనీలు, అమెరికా భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం యూఎస్ఐఎస్పీఎఫ్ ప్రెసిడెంట్ ముకేశ్ అఘి తదితరులు ఇందులో పాల్గొన్నారు. కోల్ బెడ్ మీథేన్ (సీబీఎం) క్షేత్రాల వేలానికి సంబంధించి అంతర్జాతీయ బిడ్డింగ్ను మంత్రి ప్రారంభించారు. అలాగే 26 ఆఫ్షోర్ బ్లాకులకు కూడా బిడ్డింగ్ను ఆవిష్కరించారు. అంతర్జాతీయంగా ఇంధన మార్కెట్లలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ హరిత ఇంధనానికి మళ్లాలన్న లక్ష్యం నుంచి అమె రికా, భారత్ పక్కకు తప్పుకోలేదని పురి చెప్పారు. ఇరు దేశాల మధ్య గ్రీన్ ఎనర్జీ కారిడార్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. ప్రభుత్వా లు ఇందుకు అవసరమైన విధానాలు, వాతావరణా న్ని మాత్రమే కల్పించగలవని ప్రైవేట్ రంగమే దీన్ని సాకారం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
హైడ్రోజన్ సెల్.. ఎక్కడికైనా తేలికగా తీసుకుపోవచ్చు
హైడ్రోజన్ సెల్– దీనిని ఎక్కడికైనా తేలికగా తీసుకుపోవచ్చు. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ దీని ద్వారా విద్యుత్తును పొందవచ్చు. ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా అనుబంధ సంస్థ ‘వోవెన్ ప్లానెట్’ చిన్నసైజు సిలిండర్లాంటి ఈ హైడ్రోజన్ సెల్కు రూపకల్పన చేసింది. దీని బరువు 5 కిలోలు మాత్రమే! ఈ హైడ్రోజన్ సెల్ గంటకు 3.3 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఇంధనం అయిపోయాక వీటిని రీఫిల్ చేసుకోవచ్చు. ఈ హైడ్రోజన్ సెల్స్తో వాహనాలకు, విద్యుత్ పరికరాలకు, ఇళ్లకు విద్యుత్ సరఫరా చేసుకోవచ్చు. ప్రత్యేకించి విహారయాత్రకు వెళ్లేవారికి ఈ సెల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించని హైడ్రోజన్ సెల్స్ మరింతగా వినియోగంలోకి వస్తే, ఉద్గారాల సమస్య తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఇవి అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. చదవండి: వినడానికి కొత్తగా ఉన్నా.. ఈ టైర్ల కంపెనీ సేల్స్ టెక్నిక్ మైండ్బ్లోయింగ్! -
గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఆంధ్రప్రదేశ్!
సాక్షి, అమరావతి: గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించనుంది. తరిగిపోతున్న శిలాజ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగంలోకి తెచ్చే ప్రయత్నాల్లో ఏపీ భాగం కానుంది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం ఎంపిక చేసిన ఐదు రాష్ట్రాల్లో మన రాష్ట్రం కూడా ఉంది. విశాఖ, నెల్లూరు జిల్లాల్లో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి జరగనుంది. కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖకు, నీతీ ఆయోగ్కు ఇండియా హైడ్రోజన్ అలయన్స్ (ఐహెచ్2ఏ) తాజాగా సమర్పించిన హైడ్రోజన్ హబ్ డెవలప్మెంట్ ప్లాన్లో ఈ విషయాన్ని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ హబ్లను రూపొందిస్తారు. గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్లో ఐదు జాతీయ గ్రీన్ హైడ్రోజన్ హబ్లు ఏర్పాటు చేసి, వీటిని 25 ప్రాజెక్ట్ క్లస్టర్లుగా విభజిస్తారు. వీటి ద్వారా 2025 నాటికి గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేసే 150 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ ప్లాంట్ల ఏర్పాటు లక్ష్యంగా ఐహెచ్2ఏ నిర్దేశించింది. వీటిని మొదటి తరం జాతీయ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులుగా పిలుస్తారు. ఈ గ్రీన్ హైడ్రోజన్ను వివిధ రంగాలకు చెందిన సంస్థలు ఉపయోగించుకునేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా బళ్లారి–నెల్లూరు (కర్ణాటక–ఆంధ్రప్రదేశ్) మధ్య నేషనల్ గ్రీన్ స్టీల్, కెమికల్స్ కారిడార్లోని స్టీల్, కెమికల్ ప్లాంట్ల కోసం 30 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ ప్లాంట్తో సంవత్సరానికి 5 వేల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేస్తారు. దీనివల్ల పదేళ్లలో వాతావరణంలో 5 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్డయాక్సైడ్ను తగ్గించవచ్చు. విశాఖపట్నంలో నేషనల్ గ్రీన్ రిఫైనరీ ట్రాన్స్పోర్ట్ హబ్లో 20 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ ప్లాంట్తో సంవత్సరానికి 4 వేల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేస్తారు. ఇది ఒక దశాబ్దంలో 4 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్డయాక్సైడ్ను తగ్గిస్తుంది. దీని కోసం రాష్ట్ర గ్రీన్ హైడ్రోజన్ విధానాలను రూపొందించనున్నారు. -
భావి ఇంధనం గ్రీన్ హైడ్రోజన్.. ఒకసారి నింపితే చాలు సుదీర్ఘ ప్రయాణం..
(సాక్షి ప్రతినిధి, అమరావతి): విద్యుత్ వాహనాల్లో వాడే లిథియం అయాన్ బ్యాటరీ తయారీలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా గ్రీన్ హైడ్రోజన్ను ముందుకు తెస్తున్నారు శాస్త్రవేత్తలు. దీనిని భవిష్యత్ ఇంధనంగా కూడా చెబుతున్నారు. విద్యుత్ వాహనాల్లో గ్రీన్ హైడ్రోజన్ను ఇంధనంగా ఉపయోగించుకొని నడిచే ఫ్యూయల్ సెల్ ఆధారిత వాహనాల మీదా పలు దేశాలతోపాటు మన దేశంలోనూ ముమ్మరంగా పరిశోధనలు జరుగుతున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ మీద నడిచే వాహనాలనూ (ఫ్యూయల్ సెల్ ఎల్రక్టానిక్ వెహికల్స్) (ఎఫ్సీఈవీ) దేశంలో తయారు చేశారు. కాలుష్య రహితంగా రవాణా రంగం రూపు మార్చడానికి గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అదే సమయంలో కొన్ని సవాళ్లనూ మన ముందు ఉంచింది. చదవండి: గుజరాత్లో మూడుముక్కలాట.. కేజ్రీవాల్ కింగా? కింగ్ మేకరా? ఇదీ సాంకేతికత హైడ్రోజన్, ఆక్సిజన్ మధ్య ఎలక్ట్రో కెమికల్ రియాక్షన్ వల్ల విద్యుత్ పుడుతుంది. ఈ శక్తిని వాడుకుని ఇంజన్ నడుస్తుంది. లిథియం అయాన్ బ్యాటరీ తయారీలో వాడే ముడిపదార్థాల లభ్యత మన దేశంలో తక్కువగా ఉండటం మనకు సమస్య. కానీ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడంలో ఉపయోగించే ముడి పదార్థాల సమస్య మనకు లేదు. రానురాను తక్కువ ధరకే ఇంధనం దేశంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి పన్ను రాయితీలతో పాటు ఇతర రాయితీలను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తి ధరలు తగ్గుతున్నందున, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ధరలు కూడా క్రమేణా తగ్గుతాయని నీతి ఆయోగ్ ‘హార్నెసింగ్ గ్రీన్ హైడ్రోజన్’ నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం గ్రీన్ హైడ్రోజన్ ఒక కిలో ఉత్పత్తి చేయడానికి 2030లో 1.6 డాలర్లు, 2050కి 0.7 డాలర్లు అవుతుందని నీతి ఆయోగ్ అంచనా వేసింది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్తో ప్రయోజనాలు ఇవీ.. ♦ఒకసారి హైడ్రోజన్ నింపితే సుదీర్ఘ ప్రయాణం చేయొచ్చు. లిథియం అయాన్ బ్యాటరీ వాహనాలతో పోలిస్తే దీని రేంజ్ బాగా ఎక్కువ ♦రీ ఫ్యూయలింగ్ సులభం. వేగంగా పూర్తి చేయొచ్చు. చార్జింగ్ అవసరం లేదు. బ్యాటరీ చార్జ్ అయ్యే వరకు వేచి చూసే అవసరం ఉండదు. ♦కాలుష్యం వెలువడదు ♦దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం లేదు. అందువల్ల హైడ్రోజన్ను ప్రభుత్వాలు చౌకగా అందించే అవకాశం ఉంది. చౌకగా లభ్యమయితే వ్యయమూ బాగా తగ్గుతుంది. సవాళ్లూ ఉన్నాయి.. ♦హైడ్రోజన్కు మండే స్వభావం ఎక్కువ. నిల్వ చేసిన ట్యాంకు లోహాన్ని పెళుసుగా మార్చే గుణం ఉంటుంది. ఫలితంగా లీకేజీకి అవకాశాలు ఉంటాయి. ♦హైడ్రోజన్ ఉత్పత్తి అత్యంత జఠిలమైన ప్రక్రియ. ఉత్పత్తి వ్యయాన్ని ఇప్పుడే అంచనా వేయలేం. గ్రీన్ హైడ్రోజన్ కాకపోతే ఉత్పత్తి సమయంలో కాలుష్యం వెలువడుతుంది. సంప్రదాయ శిలాజ ఇంధనాలను ఉత్పత్తికి వాడితే వ్యయం తక్కువగా ఉంటుందని ఆశించలేం. ♦ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం.. హైడ్రోజన్ నిల్వ, రవాణా కష్టమైన అంశాలు. అందువల్ల రవాణా కూడా ఖరీదే. ♦దేశంలో డిమాండ్కు అనుగుణంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి చాలా సమయం పడుతుంది. వాహనాల తయారీతో పాటు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి టెక్నాలజీ మీద ఏకకాలంలో పనిచేయాలి. హైడ్రోజన్ పలు రకాలు ఉత్పత్తి విధానాన్ని బట్టి హైడ్రోజన్ను 6 రకాలుగా విభజించారు 1. గ్రీన్ హైడ్రోజన్ ఎలక్ట్రోలసిస్ ద్వారా నీటిని వినియోగించి హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తారు. ఈ విధానంలో పవన, సౌర విద్యుత్ లాంటి పునరుత్పాదక వనరులు వాడతారు. ఈ విధానంలో కాలుష్యానికి చోటు లేదు. 2. వైట్ హైడ్రోజన్ (సహజ హైడ్రోజన్) శిలాజ ఇంధనాలు, సహజ వాయువు లభించినట్లుగానే హైడ్రోజన్ కూడా భూమిలో లభిస్తుంది. సహజ వాయువు ఉత్పత్తి మాదిరే డ్రిల్లింగ్ పద్ధతిలో హైడ్రోజన్ను వెలికితీయవచ్చు. అయితే వాణిజ్యపరంగా ఇది ఖరీదైన వ్యవహారం. పరిశోధనలకు మాత్రమే ఈ విధానాన్ని శాస్త్రవేత్తలు వాడుతున్నారు. 3. బ్లూ హైడ్రోజన్ బయోగ్యాస్ను బయోమీథేన్గా మార్చి హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తారు. ఈ విధానంలో కార్బన్ డై ఆక్సైడ్ అత్యంత కనిష్ట స్థాయిలో వెలువడుతుంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ అసోసియేషన్ (ఐఈఏ) అంచనా ప్రకారం.. క్లీన్ ఎనర్జీరంగంలో 2050 నాటికి హైడ్రోజన్ ఉత్పత్తికి ఇదొక్కటే విధానం అనుసరిస్తారు. 4. పింక్ హైడ్రోజన్ ఎలక్ట్రోలసిస్ ద్వారా నీటిని వినియోగించి దీనిని ఉత్పత్తి చేస్తారు. విద్యుత్ను న్యూక్లియర్ ఎనర్జీ నుంచి తీసుకుంటారు. 5. యెల్లో హైడ్రోజన్ ఎలక్ట్రోలసిస్ ద్వారా నీటిని వినియోగించి దీనిని ఉత్పత్తి చేస్తారు. సంప్రదాయ విధానంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ను దీనికి వాడతారు. 6. బ్లాక్, బ్రౌన్ హైడ్రోజన్ హైడ్రోజన్ ఉత్పత్తికి బొగ్గు వాడితే బ్లాక్, లిగ్నైట్ వాడితే బ్రౌన్ హైడ్రోజన్ అంటారు. ఇది కాలుష్యకారకమైన విధానం. హైడ్రోజన్ కారు తయారయింది టయోటా, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటీవ్ టెక్నాలజీ (ఐసీఎటీ) పైలెట్ ప్రాజెక్టు కింద హైడ్రోజన్ ఇంధన వాహనాన్ని తయారు చేశాయి. ‘టయోటా మిరాయ్’ పేరిట రూపొందించిన ఈ కారును కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల విడుదల చేశారు. ఇన్టేక్ గ్రిల్ ద్వారా గాలిలోని ఆక్సిజన్ తీసుకొని, ఇంధన ట్యాంకులోని హైడ్రోజన్తో సంయోగం చెంది.. ఇంజన్ నడవడానికి కావాల్సిన శక్తిని విడుదల చేస్తుంది. పొగ గొట్టం నుంచి పొగ కాకుండా, నీరే వస్తుంది. పుణేలో రోడ్డెక్కిన తొలి హైడ్రోజన్ బస్సు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండ్రస్టియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), పుణేలోని మల్టీ నేషనల్ సాఫ్ట్వేర్ సంస్థ కేపీఐటీ కలిసి హైడ్రోజన్తో నడిచే బస్సును తయారు చేసి గత వారం రోడ్డెక్కించాయి. దేశంలో ఇదే తొలి హైడ్రోజన్ బస్సు. సాధారణ డీజిల్ బస్సు ఏడాది పాటు తిరిగితే కనీసం 100 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదల చేస్తుందని సీఎస్ఐఆర్ తెలిపింది. డీజిల్ బస్సులు దేశంలో లక్షల సంఖ్యలో ఉన్నాయని వాటి నుంచి వెలువడే కాలుష్యం అత్యధికమని పేర్కొంది. -
నితిన్ గడ్కారీ.. హైడ్రోజన్ ఫ్యూయల్పై భవీశ్ ఏమన్నాడో విన్నావా?
పెట్రోల్ డీజిల్కు ప్రత్యామ్నయ ఇంధనాలు ఉపయోగించాలంటూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ఎప్పటి నుంచో చెబుతున్నారు. అందులో భాగంగా హైడ్రోజన్ బేస్డ్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ కారు తయారీకి ప్రోత్సహాం అందించారు. ఈ టెక్నాలజీతో తయారైన తొలి కారులో పార్లమెంటుకు కూడా చేరుకున్నారు. మరోవైపు పెట్రోలు/డీజిల్లకు బదులు ఇథనాల్తో నడిచే ఫ్లెక్స్ ఇంజన్ వాహనాలు మార్కెట్లోకి తేవాలంటూ తయారీదారులకు కూడా సూచనలు చేశారు. నితిన్ గడ్కారీ వ్యాఖ్యాలకు పూర్తిగా విరుద్ధమైన అభిప్రాయం వ్యక్తం చేశారు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు భవీశ్ అగర్వాల్. హైడ్రోజనల్ బేస్డ్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీపై ఆయన స్పందిస్తూ.. ‘ఎలక్ట్రిసిటీ ఉపయోగించి భార హైడ్రోజన్ (హెచ్2)ను తయారు చేస్తారు. ఈ హెచ్2ను అధిక పీడనాల వద్ద ఫ్యూయల్ స్టేషన్లలో నిల్వ ఉంచుతారు. దీన్ని తిరిగి ఫ్యూయల్ స్టేషన్ ద్వారా కార్లలో నింపుతారు. కార్లలో ఉన్న సెల్స్ ఈ హైడ్రోజన్ నుంచి తిరిగి విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. ఆ శక్తితో కారు నడుస్తుంది. చూస్తుంటే రవాణా రంగంలో హైడ్రోజన్ వాడకం అంతగా ఉపయోగించే టెక్నాలజీలా అనిపించడం లేదు’ అన్నారు భవీశ్ అగర్వాల్. భవీశ్ అగర్వాల్ ఇప్పటికే ప్రపంచంలోనే అతి పెద్దదైన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ పరిశ్రమను స్థాపించారు. దేశంలో ఇప్పుడు నంబర్ బ్రాండ్గా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎదుగుతోంది. దీనికి తోడు త్వరలోనే ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తెచ్చేందుకు భవీశ్ ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో శిలాజ ఇంధనాలకు ప్రభుత్వం చెబుతున్న హైడ్రోజన్ బేస్డ్ ఫ్యూయల్ సెల్ అంత ఉపయోగకరం కాదంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. చదవండి: హైడ్రోజన్ కారుతో పైలట్ ప్రాజెక్టు.. స్వయంగా ప్రయాణించిన మంత్రి -
టోటల్ఎనర్జీస్తో అదానీ జట్టు
న్యూఢిల్లీ: బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ తాజాగా ఫ్రాన్స్కు చెందిన టోటల్ఎనర్జీస్తో చేతులు కలిపింది. తద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి వెంచర్ను ఏర్పాటు చేయనుంది. దీంతో అదానీ గ్రూప్ కర్బనరహిత ఇంధన తయారీని చేపట్టనుంది. రానున్న దశాబ్ద కాలంలో ఈ రంగంలో అనుబంధ విభాగాలతో కలిపి 50 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికలున్నట్లు అదానీ గ్రూప్ పేర్కొంది. అదానీ గ్రూప్ కొత్త ఇంధన బిజినెస్ విభాగం అదానీ న్యూ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఏఎన్ఐఎల్)లో టోటల్ఎనర్జీస్ 25 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. అయితే డీల్ విలువను రెండు సంస్థలూ వెల్లడించకపోవడం గమనార్హం. ఏఎన్ఐఎల్లో 25 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు గ్రూప్లోని ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు టోటల్ఎనర్జీస్ ప్రకటించింది. 2030కల్లా ఏఎన్ఐఎల్ వార్షికంగా మిలియన్ మెట్రిక్ టన్నుల(ఎంటీపీఏ) గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టోటల్ఎనర్జీస్ పేర్కొంది. తొలి మైలురాయికింద 30 గిగావాట్ల కొత్త పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అందుకునే ప్రణాళికలున్నట్లు తెలియజేసింది. ఈ జనవరిలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ కోసం అదానీ గ్రూప్ ఏఎన్ఐఎల్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దశాబ్ద కాలంలో.. నూతన ఇంధన విభాగంలో రానున్న 10 ఏళ్ల కాలంలో 70 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు అదానీ గ్రూప్ గతేడాది నవంబర్లో ప్రకటించింది. దీనిలో భాగంగా 2022–23కల్లా అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్(ఏజీఈఎల్) ఏడాదికి 2 గిగావాట్ల సోలార్ మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని నెలకొల్పే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెచ్చిస్తోంది. కాగా.. టోటల్ ఎనర్జీస్ ఇప్పటికే అదానీ గ్రీన్ ఎనర్జీతో జట్టు కట్టింది. -
అలా చేయడం శుద్ధ దండుగ పని - ఈలాన్మస్క్
ఎనర్జీ స్టోరేజీకి హైడ్రోజన్ని ఉపయోగించుకోవాలనే ఐడియా శుద్ధ దండుగ వ్యవహామని టెస్లా కార్ల అధినేత, ప్రపంచ కుబేరుడు ఈలాన్ మస్క్ అన్నారు. ఫైనాన్షియల్ టైమ్ష్ నిర్వహించిన ఫ్యూచర్ ఆఫ్ కార్ అనే సమ్మిట్లో మాట్లాడుతూ ఈలాన్ మస్క్ ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. పెట్రోల్,డీజిల్కు ప్రత్యామ్నయంగా సంప్రదాయేతర ఇంధన వనరులు ఉపయోగించాలనే ప్రచారం గత కొంత కాలంగా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎనర్జీ స్టోరేజీకి హైడ్రోజన్ను ఉపయోగించాలంటూ కొందరు చెబుతున్న విషయం మస్క్ దగ్గర ప్రస్తావించగా... ఎనర్జీ స్టోరేజీకి హైడ్రోజన్ బ్యాడ్ ఛాయిస్, ఎనర్జీని ద్రవ రూపంలో నిల్వ చేయాలన్నా అతి భారీ ట్యాంకులను నిర్మించాల్సి ఉంటుంది. ఇక అది వాయురూపమైతే నిల్వ చేసే పరిమాణం ఎంత పెద్దగా ఉండాలనేది చెప్పడమే కష్టం. కాబట్టి ఎనర్జీ స్టోరేజికి హైడ్రోజన్ వాడాలనుకోవడం శుద్ధ దండగ అంటూ తెలిపాడు మస్క్. మరోవైపు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ మాత్రం ఎనర్జీ స్టోరేజీకి హైడ్రోజన్ ఎంతో చక్కగా పనికొస్తుందని చెబుతోంది. ఇలా చేయడం వల్ల ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనే అభిప్రాయానికి కట్టుబడి ఉంటోంది. చదవండి: ట్విటర్ అలా చేయకుండా ఉండాల్సింది - ఈలాన్ మస్క్ -
మీ బాడీలో ఏమున్నాయో తెలుసా? మన బరువులో.. ఏ మూలకం ఎంత?
హైడ్రోజన్, ఆక్సిజన్ కలిస్తే నీళ్లు.. సోడియం, క్లోరిన్ కలిస్తే ఉప్పు.. ఐరన్, కార్బన్ కలిస్తే ఉక్కు.. ఇలా ప్రకృతిలో ఉన్న ప్రతిదీ వివిధ మూలకాల కలయికే. రాళ్లు, రప్పలు, వస్తువులే కాదు.. జీవులన్నీ కూడా రసాయన పదార్థాల సమ్మేళనమే. మరి మనం.. అంటే మనుషులం ఏ మూలకాలతో తయారయ్యాం? ఏమేం ఉంటాయి? ఎంతమేర ఉంటాయో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ 118 మూలకాలున్నా.. ఇప్పటివరకు భూమ్మీద 118 మూలకాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. అందులో కొన్ని విస్తారంగా ఉంటే.. మరికొన్ని మూలకాలు చాలా అరుదుగా లభిస్తాయి. భూమిపై మట్టి, నీళ్లు, గాలి, చెట్లు, జంతువులు, ఇళ్లు, వాహనాలు, వస్తువులు, మన ఫోన్లు.. ఇలా మనతోపాటు చుట్టూ ఉన్న ప్రతిదీ ఈ 118 మూలకాలతోనే తయారై ఉంటుంది. వేర్వేరు వస్తువుల్లో వేర్వేరు మూలకాలు ఉంటాయి. అదే చెట్లు, జంతువులు, ఇతర జీవజాలంలో మాత్రం ప్రధానంగా ఉండేవి నాలుగు మూలకాలే. మరికొన్ని మూలకాలు నామమాత్రస్థాయిలో ఉంటాయి. (చదవండి: పిల్లులూ పేర్లు గుర్తిస్తాయ్) లెక్కిస్తే.. హైడ్రోజన్ టాప్ మన శరీరంలో బరువుపరంగా ఆక్సిజన్ టాప్ అయినా.. పరమాణువుల సంఖ్య లెక్కన చూస్తే హైడ్రోజన్ శాతం చాలా ఎక్కువ. మన శరీర బరువులో నీటి శాతమే ఎక్కువ. రెండు హైడ్రోజన్, ఒక ఆక్సిజన్ పరమాణువులు కలిస్తే ఒక నీటి అణువు ఏర్పడుతుంది. అంటే ఆక్సిజన్ కంటే హైడ్రోజన్ రెండు రెట్లు ఎక్కువ. ► కానీ హైడ్రోజన్ పరమాణువు బరువు చాలా తక్కువ. 16 హైడ్రోజన్ పరమాణువులు కలిస్తే.. ఒక్క ఆక్సిజన్ పరమాణువు అంత అవుతాయి. నాలుగింటితోనే .. ఆక్సిజన్, కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్.. మన శరీరంలో 97 శాతం బరువు ఈ నాలుగు మూలకాలదే. అందులోనూ సగానికిపైగా బరువు ఒక్క ఆక్సిజన్దే కావడం విశేషం. ► నిజానికి మన శరీరంలో 60 శాతం నీళ్లే. ఆక్సిజన్, హైడ్రోజన్ మూలకాలు కలిసి ఏర్పడేవే నీళ్లు. దీనికితోడు శరీరంలోని అన్ని కణాలు, ప్రొటీన్లు, అమైనో ఆమ్లాల్లో ఆక్సిజన్ ఉంటుంది. ఇలా అన్నింటిలో కలిపితే శరీర బరువులో 65 శాతం ఆక్సిజనే. ఏ మూలకం.. ఎందుకోసం? మన శరీరం ప్రధానంగా నాలుగు మూలకాలతోనే నిర్మితమైనా.. మరికొన్ని మూలకాలు కూడా అత్యంత కీలకం. ఉదాహరణకు మన శరీరబరువులో సోడియం ఉండేది 0.2 శాతమే. కానీ అది తగ్గితే శరీరం పనితీరు దెబ్బతిని ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆక్సిజన్: శరీరంలో ఉండే నీటితోపాటు అన్ని జీవ పదార్థాల్లో (ఆర్గానిక్ కాంపౌండ్స్) ఉంటుంది. శ్వాసక్రియ, శక్తి ఉత్పాదనకు కీలకం. కార్బన్: జీవ పదార్థం, డీఎన్ఏలో కీలక మూలకం ఇది. కార్బోహైడ్రేట్స్, కొవ్వులు, న్యూక్లిక్ ఆమ్లాలు, ప్రొటీన్లు.. ఇలా చాలా వాటిలో ఉంటుంది. అసలు కార్బన్ ఆధారిత పదార్థాల (ఆహారం) నుంచి శరీరంలో శక్తి ఉత్పత్తి అవుతుంది. హైడ్రోజన్: జీవ పదార్థం, డీఎన్ఏలో కీలక మూలకమిది. నీటితోపాటు శరీరంలోని దాదాపు అన్ని ఆర్గానిక్ అణువుల్లో హైడ్రోజన్ ఉంటుంది. నైట్రోజన్: జీవానికి మూలమైన జన్యు పదార్థం (డీఎన్ఏ, ఆర్ఎన్ఏ), ఇతర ఆర్గానిక్ కాంపౌండ్స్, ప్రొటీన్లలో నైట్రోజన్ ఉంటుంది. కాల్షియం: శరీరంలో ఎముకలు, దంతాలు, కణాల మధ్య గోడలు (త్వచాలు) దీనితోనే నిర్మితమవుతాయి. ప్రోటీన్ల ఉత్పత్తికీ ఇది కీలకం. ఫాస్పరస్: ఎముకలు, దంతాలు, డీఎన్ఏ, ఏటీపీ ప్రొటీన్లో ఫాస్పరస్ ఉంటుంది. జీవం మనుగడకు కీలకమైన మూలకమిది. కొంచెమే అయినా అత్యవసరం.. నాడీ వ్యవస్థ పొటాషియం, సోడియం కీలకం. కణాలు, అవయవాల నుంచి నాడుల ద్వారా మెదడుకు వీటి అయాన్ల రూపంలోనే సమాచార ప్రసారం జరుగుతుంది. ఇక శరీరంలో ద్రవాల సమతుల్యతకు సోడియం, కండరాలు సరిగా పనిచేసేందుకు పొటాషియం అత్యవసరం. ► అత్యంత కీలకమైన అమైనో ఆమ్లాల్లో సల్ఫర్ ఉంటుంది. వెంట్రుకలు, గోర్లు, చర్మంలోని కెరాటిన్లో సల్ఫర్ కీలకం. ► రక్తంలోని హిమోగ్లోబిన్లో ఐరన్.. ప్రొటీన్ల తయారీ, రోగనిరోధకశక్తికి మెగ్నీషియం, జింక్ కీలకం. బంగారమూ ఉంటుంది మన శరీరంలో అతి సూక్ష్మ మొత్తంలో బంగారం కూడా ఉంటుంది. 70 కిలోల బరువున్న మనిషిలో సుమారు 0.2 మిల్లీగ్రాముల పుత్తడి ఉంటుందని.. శరీరంలో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ వేగంగా ప్రయాణించడానికి తోడ్పడుతుందని ఆక్స్ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొత్తం అణువులెన్నో తెలుసా? సాధారణంగా 70 కిలోల బరువున్న మనిషి శరీరంలో ఏడు ఆక్టేలియన్ల అణువులు ఉంటాయని శాస్త్రవేత్తల అంచనా. (ఒక ఆక్టిలియన్ అంటే పది లక్షల కోట్ల కోట్ల కోట్లు.. సులువుగా చెప్పాలంటే పది పక్కన 27 సున్నాలు పెడితే వచ్చే సంఖ్య) (చదవండి: సమ్మర్ డేస్: చలువ పందిరి జ్ఞాపకం) -
5 మిలియన్ టన్నుల హరిత హైడ్రోజన్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూలమైన హరిత హైడ్రోజన్ ఉత్పత్తిని 2030 నాటికి 5 మిలియన్ టన్నుల స్థాయికి పెంచుకోవాలని కేంద్రం నిర్దేశించుకుంది. ఇందుకోసం ఉపయోగించే పునరుత్పాదక విద్యుత్ పంపిణీపై పాతికేళ్ల పాటు అంతర్రాష్ట్ర చార్జీల నుంచి మినహాయింపు లభించనుంది. జాతీయ హైడ్రోజన్ విధానం తొలి భాగాన్ని ఆవిష్కరించిన సందర్భంగా కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్ ఈ విషయాలు తెలిపారు. కొత్త విధానాన్ని వివరించేందుకు త్వరలో పరిశ్రమ వర్గాలతో సమావేశం కానున్నట్లు ఆయన చెప్పారు. హరిత హైడ్రోజన్, అమోనియాల వినియోగం పెరిగితే పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. సాధారణంగా వివిధ ఉత్పత్తుల తయారీ కోసం చమురు రిఫైనరీలు మొదలు, ఉక్కు ప్లాంట్ల వరకూ చాలా సంస్థలకు హైడ్రోజన్ అవసరమవుతుంది. ప్రస్తుతం సహజ వాయువు లేదా నాఫ్తా వంటి శిలాజ ఇంధనాల నుంచి దీన్ని ఉత్పత్తి చేస్తున్నారు. అయితే, ఈ ప్రక్రియలో కర్బన ఉద్గారాలు వెలువడి కాలుష్య కారకంగా మారుతున్నందున పర్యావరణ అనుకూలమైన పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి హరిత హైడ్రోజన్, అమోనియా ఉత్పత్తిపై దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగానే తాజా విధానాన్ని రూపొందించినట్లు మంత్రి తెలిపారు. రెండో విడతలో దశలవారీగా ప్లాంట్లు హరిత హైడ్రోజన్, హరిత అమోనియా వినియోగించడాన్ని తప్పనిసరి చేయనున్నట్లు చెప్పారు. ఎక్కడైనా ప్లాంటు..: కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం.. పునరుత్పాదక వనరుల నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేసే ప్లాంట్లను కంపెనీలు దేశంలో ఎక్కడైనా సొంతంగానైనా లేదా డెవలపర్ ద్వారానైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఎక్సే్చంజీల నుంచి కూడా కొనుగోలు చేయొచ్చు. ఈ విద్యుత్ను హైడ్రోజన్ ఉత్పత్తి చేసే ప్లాంటు వరకు ట్రాన్స్మిషన్ గ్రిడ్ ద్వారా ఉచితంగా పంపిణీ చేయవచ్చు. ఇందుకోసం పాతికేళ్ల పాటు అంతర్రాష్ట్ర చార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది. 2025 జూన్ 30 లోగా ఏర్పాటైన ప్రాజెక్టులకు ఇది వర్తిస్తుంది. అలాగే వినియోగించుకోని పునరుత్పాదక విద్యుత్ను గ్రీన్ హైడ్రోజన్, అమోనియా తయారీదారులు.. 30 రోజుల పాటు పంపిణీ సంస్థ వద్దే అట్టే పెట్టుకుని, అవసరమైనప్పుడు తిరిగి పొందవచ్చు. -
విశాఖలో హైడ్రోజన్ ఎనర్జీ ప్రాజెక్టు
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అతి పెద్దదైన, దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టు మన రాష్ట్రంలో ఏర్పాటుకానుంది. విశాఖపట్నంలోని సింహాద్రి పవర్ ప్లాంట్లో స్టాండలోన్ ఫ్యూయల్–సెల్ ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ మైక్రోగ్రిడ్ ప్రాజెక్టును నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) లిమిటెడ్ స్థాపించబోతోంది. విద్యుదుత్పత్తికి అవసరమైన చమురులో 85 శాతం, గ్యాస్లో 53 శాతం దిగుమతి చేసుకునే మన దేశంలో ఈ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఓ గేమ్చేంజర్ కానుందని ఎన్టీపీసీ వర్గాలు చెబుతున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ కొనుగోలు తప్పనిసరి? స్వచ్ఛమైన ఇంధనాలను ప్రోత్సహించడానికి.. ఎరువుల కర్మాగారాలు, చమురు శుద్ధి కర్మాగారాలు గ్రీన్ హైడ్రోజన్ను కొనుగోలు చేయడాన్ని తప్పనిసరి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా పవన, సౌర వంటి పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా శక్తినిచ్చే ఎలక్ట్రోలైజర్ను ఉపయోగించి నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్గా విభజించడం ద్వారా గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేసే ప్రాజెక్టును రాష్ట్రంలో ఎన్టీపీసీ ద్వారా స్థాపించనుంది. దేశంలో ఇంధన భద్రతా చర్యల్లో భాగంగా నాలుగు గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ సామర్థ్యాన్ని సాధించడానికి త్వరలో కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలవనుంది. సింహాద్రి థర్మల్ కేంద్రం సమీపంలో ఉన్న ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు (నీటిలో తేలియాడే సౌర ఫలకలు) నుండి ఇన్పుట్ పవర్ తీసుకోవడం ద్వారా 240 కిలోవాట్ల సాలిడ్ ఆక్సైడ్ ఎలక్ట్రోలైజర్ ఉపయోగించి హైడ్రోజన్ను ఉత్పత్తి చేస్తారు. సూర్యరశ్మి సమయంలో ఉత్పత్తి చేసిన ఈ హైడ్రోజన్ను అధిక పీడనం వద్ద నిల్వచేస్తారు. 50 కిలోవాట్ల సాలిడ్ ఆక్సైడ్ ఇంధన కణాన్ని ఉపయోగించి విద్యుదీకరిస్తారు. ఇది సా.5 నుండి ఉ.7 వరకు స్వతంత్రంగా పనిచేస్తుంది. ఇక దేశంలో మరికొన్ని హైడ్రోజన్ శక్తి నిల్వ ప్రాజెక్టులను స్థాపించడానికి అవసరమైన అధ్యయనానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడనుంది. లద్దాఖ్తో ఒప్పందం గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు కోసం కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్తో ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (ఆర్ఈఎల్) ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటివరకు డీజిల్ జనరేటర్లపై ఆధారపడిన లద్దాఖ్, జమ్మూ–కశ్మీర్ వంటి దేశంలోని సుదూర ప్రాంతాలను డీకార్బోనైజ్ చేయడానికి ఈ ప్రాజెక్టు నమూనా కానుంది. 2070 నాటికి లద్దాఖ్ను కార్బన్ రహిత భూభాగంగా మార్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే మన రాష్ట్రంలో హైడ్రోజన్ ప్రాజెక్టును ఎన్టీపీసీ పైలెట్ ప్రాజెక్టుగా స్థాపిస్తోంది. -
100 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్
న్యూఢిల్లీ: దశాబ్ద కాలంలో (2030 నాటికి) పునరుత్పాదక వనరుల నుంచి కనీసం 100 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) నిర్దేశించుకుంది. హైడ్రోజన్ కేజీ ధరను 1 డాలర్ కన్నా చౌకగా అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయ వాతావరణ సదస్సు 2021లో పాల్గొన్న సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముకేశ్ అంబానీ ఈ విషయాలు తెలిపారు. పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తి చేసే పర్యావరణ హిత హైడ్రోజన్ను తిరిగి విద్యుత్గా మార్చవచ్చని, దీన్ని కార్లు, ఇళ్లు మొదలైన వాటిల్లో విద్యుత్ అవసరాల కోసం వినియోగించవచ్చని పేర్కొన్నారు. ‘ప్రస్తుతం ఎలక్ట్రోలసిస్ ప్రక్రియ ద్వారా హైడ్రోజన్ను ఉత్పత్తి చేసేందుకు వ్యయాలు భారీగా ఉంటున్నాయి. రాబోయే రోజుల్లో ఇవి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. హైడ్రోజన్ నిల్వ, రవాణా కోసం కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. వీటితో పంపిణీ వ్యయాలు భారీగా తగ్గగలవు‘ అని అంబానీ చెప్పారు. ప్రస్తుతం పునరుత్పాదక వనరులతో ఉత్పత్తి చేసే హరిత హైడ్రోజన్ ధర కేజీకి 3–6.54 డాలర్ల మధ్యలో ఉంటోందని వివరించారు. దీన్ని 2 డాలర్ల లోపునకు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తాము మరింత ముందుకెళ్లి రేటును 1 డాలర్ లోపునకు తగ్గించడంపై దృష్టి పెడుతున్నట్లు ముకేశ్ చెప్పారు. ఇందుకోసం 1–1–1 ప్రణాళిక రూపొందించుకున్నట్లు తెలిపారు. 1 దశాబ్దంలో 1 కేజీ హైడ్రోజన్ను 1 డాలర్ లోపు ధరకు అందించడం దీని ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు. -
డ్రైవర్ అవసరం లేని డైమ్లర్స్ భారీ ట్రక్
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రతిష్టాత్మక ట్రక్, బస్సు తయారీదారు సంస్థ డైమ్లెర్ ఎజీ భవిష్యత్ లో హైడ్రోజన్, బ్యాటరీ సహాయంతో నడిచే భారీ ట్రక్ లను మార్కెట్లోకి తీసుకు రానున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం జీరో ఎమిషన్ వాహనల తయారీ కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు లేనప్పటికీ డైమ్లెర్ ఎజీ ట్రక్ డివిజన్ 2025 నాటికి ఎక్కువ శాతం పర్యావరణ హిత వాహనాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. ఈ దశాబ్దం తర్వాత బ్యాటరీ, హైడ్రోజన్ శక్తితో పనిచేసే అతి పెద్ద వాహనాలు డీజిల్తో నడిచే వాహనలతో పోటీ పడతాయని కంపెనీ అంచనా వేసింది. అతిపెద్ద వాహనాలను బ్యాటరీలతో నడిచే విధంగా రూపోదించడానికి అయ్యే ఖర్చు భారీగా ఉందని, అలాగే సాంకేతికత పరంగా మరిన్ని మార్పులు చోటు చేసుకోవాలని డైమ్లెర్ ట్రక్ సీఈఓ మార్టిన్ డామ్ చెప్పారు. డైమ్లెర్ ఏజీ ట్రక్ ఈ ఏడాది చివరి నాటికి తన సహా బ్రాండ్లైన ఫ్రైట్లైనర్, మెర్సిడెస్ బెంజ్ నుంచి స్వతంత్ర సంస్థగా మారిన తర్వాత పర్యావరణ హిత వాహనాల అభివృద్ది కోసం వ్యూహ రచన చేస్తున్నట్లు డామ్ తెలిపారు. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆండ్రియాస్ గోర్బాచ్ 2025 నాటికి కంపెనీ బ్యాటరీ, హైడ్రోజన్ వాహనాల తయారీ కోసం ప్రణాళికలు రూపోదించినట్లు చెప్పారు. 2025 తర్వాత బ్యాటరీతో నడిచే వాహనాల ధర డీజిల్తో నడిచే వాహనాల ధరతో సమానంగా ఉంటుందని ఆయన ఊహించారు. ఈ దశాబ్దం చివరి నాటికి డ్రైవరు అవసరం లేని అతిపెద్ద ట్రక్ లను కూడా తయారు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. చదవండి: ఎయిర్టెల్: సైబర్ నేరాలు పెరుగుతున్నాయ్.. -
భవిష్యత్ ఇంధనంగా హైడ్రోజన్
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ తో నడుస్తున్న వాహనాల కారణంగా వెలువడే వాయు కాలుష్యం వల్ల పర్యావరణానికి ఎక్కువ హాని జరుగుతుంది. దింతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలు భవిష్యత్ లో దశల వారీగా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొనిరావాలని భావిస్తున్నాయి. ఇప్పటికే ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారివైపు దృష్టి సారిస్తున్నాయి. కానీ ఈ ఎలక్ట్రిక్ కార్లను వేధిస్తున్న ప్రధాన సమస్య బ్యాటరీ ఛార్జింగ్. ఎలక్ట్రిక్ కార్లను ఫుల్ ఛార్జింగ్ చేయడానికి ఒక గంట నుంచి రెండు గంటలు పడుతున్నాయి. దీనిని తగ్గించేందుకు కూడా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా పెట్రోల్, డీజిల్ వాహనాలలో ఇంధనానికి బదులు హైడ్రోజన్ ని వాడాలని కంపెనీలు చూస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే బ్యాటరీలను స్టేషనరీ ఛార్జర్తో నింపేందుకు హైడ్రోజన్ వాడనున్నారు. ఇలా చేయడం వల్ల కారులో విద్యుత్ ఉత్పత్తి అవ్వడమే కాకుండా.. కేవలం నీరు, వేడి మాత్రమే వాడి స్వచ్ఛమైన పద్ధతిలో వాహనాలను నడిపించవచ్చు. దీనివల్ల కూడా పర్యావరణానికి కూడా ఎటువంటి హాని జరగదు. అలాగే పెట్రోల్, డీజిల్ వాడకాలను తగ్గించొచ్చు. పెట్రోల్ మాదిరిగానే క్షణాల్లో కారు ఇందనాన్ని నింపేయొచ్చు. ఈ సాంకేతికతను త్వరగా అందుబాటులోకి తేవడానికి హ్యుందాయ్ మోటార్ గ్రూప్, చైనా ప్రభుత్వంతో చేసుకున్న పెట్టుబడి ఒప్పందంపై సంతకం చేసింది.(చదవండి: ఇక టెస్ట్ డ్రైవింగ్ అవసరం లేదు) -
కేటీపీఎస్లో హైడ్రోజన్ లీక్
సాక్షి, పాల్వంచ: కేటీపీఎస్ 5వ దశ కర్మాగారం 9వ యూనిట్లోని టర్బో జనరేటర్లో సోమవారం హైడ్రోజన్ గ్యాస్ లీకైంది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. హైడ్రోజన్కు గాల్లో కలిసి బాంబులా పేలే సామర్థ్యం ఉండటంతో ఉద్యోగులు, కార్మికులు పని ప్రదేశం నుంచి పరుగులు పెట్టారు. అయితే కొందరు ఉద్యోగులు అప్రమత్తమై ప్రమాదాన్ని నివారించారు. 250 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన 9వ యూనిట్లో రూ. 100 కోట్లతో రెన్నోవేషన్ అండ్ మోడర్నైజేషన్(ఆర్అండ్ఎం) పనులు చేపట్టారు. గత జూన్ మొదటి వారంలో పనులు ప్రారంభంకాగా, ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. సోమవారం ఉత్పత్తిని అందుబాటులోకి తెచ్చేందుకు సింక్రనైజేషన్ చేస్తున్నారు. స్టీమ్ జనరేట్ అయ్యేటప్పుడు ఏర్పడే ఉష్ణోగ్రతను తగ్గించేందుకు జనరేటర్కు హైడ్రోజన్ (హెచ్2) పంపిస్తున్నారు. ఈ క్రమంలో గ్యాస్ పైపులైన్ దగ్గర హైడ్రోజన్ లీక్ కావడంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. పని ప్రదేశం నుంచి వందలాది మంది దూరంగా పరుగులు తీశారు. అయితే కొందరు ఇంజనీర్లు, ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించి ఫైర్ ఇంజన్లను అందుబాటులోకి తెప్పించారు. ధైర్యసాహసాలతో హైడ్రోజన్ లీకైన చోట నుంచి కార్బన్డై ఆక్సైడ్ను పంపి ప్రమాదాన్ని అరికట్టారు. ఆ సమయంలో అక్కడ ఉన్నవారంతా ఊపిరి బిగపట్టి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వర్తించారు. లీకేజీ ఉన్న ప్రదేశంలో సీల్ వేయడంతో ప్రమాదం తొలగిపోయింది. ఈ క్రమంలో కర్మాగారంలోని అన్ని ఫైర్ ఇంజన్లను, ఇతర ఫైర్ సేఫ్టీ పరికరాలను తెప్పించుకున్నారు. హైడ్రోజన్ ఎక్కువ మోతాదులో గాలిలో కలిస్తే బాంబులా పేలి కర్మాగారం ధ్వంసమయ్యే పరిస్థితి ఉండేదని, ఆస్తి నష్టంతో పాటు, ప్రాణ నష్టం భారీగా ఉండేదని అధికారులు చెబుతున్నారు. ఒక రోజు ఆలస్యంగా సింక్రనైజేషన్.. ఓ వైపు కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్న తరుణంలో జెన్కో యాజమాన్యం ఆదేశాల మేరకు 9వ యూనిట్లో ఆధునీకరణ పనులు చేపట్టారు. బీహెచ్ఈఎల్ కంపెనీ పనులు నిర్వహిస్తోంది. పనులకు వందలాది మంది టెక్నీషియన్లు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. కరోనా వైరస్ ఉధృతిలోనూ ఉద్యోగులు విధులు నిర్వహించారు. ఈ క్రమంలో 50 రోజుల్లోపు పూర్తి కావాలి్సన పనులకు 60 రోజులు పట్టింది. చివరి క్షణంలో హైడ్రోజన్ గ్యాస్ లీక్ కలవరానికి గురిచేసింది. దీంతో సోమవారం సింక్రనైజేషన్ చే యాల్సి ఉండగా మంగళవారానికి వాయిదా వేశారు. సకా లంలో స్పందించి ప్రమాదాన్ని అరికట్టడంతో జెన్కో ఉన్నతాధికారులు సైతం ఇక్కడి ఉద్యోగులను అభినందించారు. ముప్పు తప్పింది హైడ్రోజన్ లీకేజీని సకాలంలో గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడంతో ఎలాంటి నష్టం లేకుండా బయటపడగలిగాం. పనిచేసిన సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. కోవిడ్ సమయంలోనూ ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో కలిసి పనిచేశాం. కరోనా వల్లే పనుల్లో కొంత జాప్యం జరిగింది. మంగళవారం సాయంత్రానికి విద్యుదుత్పత్తిని అందుబాటులోకి తెస్తాం. –కె.రవీంద్ర కుమార్, సీఈ -
అంగారకుడిపై జీవం ఉందా?
అంగారకుడిపై జీవం ఉండేదా? ఉందా? దశాబ్దాలుగా వేధిస్తున్న ఈ ప్రశ్నకు సమాధానం కనుగొన్నామంటున్నారు కొందరు పరిశోధకులు. మరో భూమి కాగలదని భావిస్తున్న అరుణ గ్రహంపై జీవం ఉండటమే కాదు.. ఇప్పుడు అక్కడ శిలీంధ్రాలు పెరుగుతున్నాయని వీరి వాదన. నీళ్లలో పెరిగే నాచు.. పుట్టగొడుగుల్లాంటి శిలీంధ్రాల రూపంలో ఇవి ఉన్నాయని, క్యూరియాసిటీ రోవర్ పంపిన చిత్రాల ఆధారంగా వీరు ఈ అంచనాకు వచ్చినట్లు.. జర్నల్ ఆఫ్ ఆస్ట్రో బయాలజీ అండ్ స్పేస్ సైన్స్లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం ద్వారా వెల్లడైంది. క్యూరియాసిటీ పంపిన కనీసం 15 చిత్రాల్లో అత్యంత సాధారణ స్థాయి జీవం తాలూకు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ రెజీనా డాస్ చెప్పారు. ఈ రకమైన జీవం ఇప్పుడు కూడా అక్కడ పెరుగుతూ ఉండొచ్చునని.. లేదంటే ఒకప్పుడు అక్కడ మనుగడ సాగించి ఉండవచ్చునని ఆయన అంటున్నారు. వీరి అంచనా ప్రకారం అంగారకుడి వాతావరణంలో ఉన్న మీథేన్ వాయువు ఒక క్రమ పద్ధతిలో హెచ్చుతగ్గులకు లోనవుతోంది. అక్కడి జీవం బతికి ఉన్నప్పుడు ఒకలా, చనిపోయినప్పుడు మరోలా మీథేన్ స్థాయిలు మారుతున్నాయన్నమాట. క్యూరియాసిటీ పంపిన చిత్రాలు మూడు రోజులకు సంబంధించినవైతే.. మొదటి రోజు చిత్రంలోని నాచు కంటే మూడో రోజు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. నాసా ఏమంటోంది? రెజీనా డాస్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం అరుణ గ్రహంపై జీవం ఆనవాళ్లను గుర్తించామని స్పష్టంగా చెబుతున్నప్పటికీ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) దీనిపై వ్యాఖ్యానించలేదు. నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఉల్కా శకలాలు ఢీకొట్టినందున ఒకప్పుడు అంగారకుడిపై జీవం ఉండేందుకు అవసరమైన అన్ని అనుకూల పరిస్థితులు ఉండే అవకాశం ఉందని తెలిపింది. అంగారక గ్రహం ఏర్పడిన తొలినాళ్లలో అక్కడి వాతావరణంపై హైడ్రోజన్ ఎక్కువగా ఉండి ఉంటే.. గ్రహశకలాలు ఢీకొట్టడం వల్ల జీవం ఏర్పడేందుకు అత్యంత కీలకమైన నైట్రోజన్ రూపాలు నైట్రైట్లు (ఎన్ఓ2), నైట్రేట్లు (ఎన్ఓ3)లు ఏర్పడతాయని, క్యూరియాసిటీ రోవర్ వీటిని గేల్ క్రేటర్ ప్రాంతంలో సేకరించిన మట్టి, రాతి నమూనాల్లో గుర్తించిందని పేర్కొంది. అంగారకుడిపై అత్యంత పురాతనమైన సరస్సులు, భూగర్భ జలాలు ఉన్నది ఈ గేల్ క్రేటర్లోనే కావడం గమనార్హం. క్యూరియాసిటీ గుర్తించిన నైట్రోజన్ రూపాలు అక్కడికి ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు నాసా ప్రయోగాలు చేసింది. ప్రయోగంలో హైడ్రోజన్ ఎక్కువైన కొద్దీ నైట్రేట్లు, నైట్రైట్ల మోతాదు ఎక్కువ కావడాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు.. అంగారకుడిపై హైడ్రోజన్ ఎక్కువగా ఉండి ఉంటే జీవం మనుగడకు అవసరమైన పరిస్థితులు ఉండేవన్న నిర్ధారణకు వచ్చారు. -
కాలుష్యంతోనే కరెంటు, హైడ్రోజన్..
ఒక్కదెబ్బకు రెండు పిట్టలంటే ఇదేనేమో. వాతావరణంలో పెరిగిపోతున్న కార్బన్డయాౖMð్సడ్ వాయువును తొలగించడంతోపాటు అటు కరెంటు ఇటు స్వచ్ఛమైన ఇంధనం హైడ్రోజన్ను తయారు చేసేందుకు జార్జియా, ఉల్సాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఒక కొత్త విధానాన్ని కనుక్కున్నారు. హైబ్రిడ్ ఎన్ఏ–సీఓ2 అని పిలుస్తున్న ఈ కొత్త టెక్నాలజీలో కార్బన్డయాక్సైడ్ వాయువును ద్రవంతో నిండిన ఓ పరికరంలోకి పంపుతారు. ఈ తొట్టిలో కాథోడ్ను ఉంచి.. పక్కనే ఎలక్ట్రోలైట్లో సోడియంతో తయారైన ఆనోడ్ను ఉంచుతారు. కార్బన్డయాక్సైడ్ ప్రవహించినప్పుడు అది కాథోడ్తో చర్య జరిపి ద్రవాన్ని మరింత ఆమ్లయుతం చేస్తుంది. ఫలితంగా అక్కడికక్కడ కరెంటుతోపాటు హైడ్రోజన్ కూడా ఉత్పత్తి అవుతుంది. వాడే కార్బన్డయాౖMð్సడ్లో కనీసం 50 శాతాన్ని కరెంట్, హైడ్రోజన్ రూపంలో వాడుకోవచ్చునని ఎలక్ట్రోడ్లకు ఏమాత్రం హాని జరక్కుండా ఈ పరికరాన్ని వెయ్యి గంటలపాటు వాడుకోవచ్చునని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న శాస్త్రవేత్త కిమ్ తెలిపారు. మిగిలిన సీఓ2ను కూడా ద్రవం నుంచి వేరుచేసి మళ్లీ వాడుకోవచ్చునని తెలిపారు. కొన్ని మార్పులు, చేర్పుల ద్వారా ప్రస్తుత డిజైన్ను మరింత మెరుగుపరిచే అవకాశం ఉందని.. ఉత్పత్తి అయ్యే హైడ్రోజన్ను వాహనాల్లో వాడుకోవచ్చునని తెలిపారు. -
రైలు బండి.. మారిందండి!
బ్రీజ్.. ఇది భవిష్యత్తు రైలు.. దీనికి డీజిల్ అక్కర్లేదు.. కరెంటుతో పనిలేదు.. అదే తయారుచేసుకుంటుంది. పైగా.. ఇప్పటి రైళ్లతో పోలిస్తే పూర్తిగా రివర్సు టైపు.. వచ్చినట్లే తెలియదు.. సౌండ్లెస్.. సూపర్ కదూ.. అంతేనా.. ఇది మనకు అందుబాటులోకి వస్తే.. పర్యావరణానికి చేటు చేసే డీజిల్ ఇంజిన్లను పక్కనపెట్టేయొచ్చు. ఎలక్ట్రిక్ ఇంజిన్ల కోసం బోలెడంత ఖర్చు పెట్టి.. విద్యుదీకరణ పనులు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రస్తుతం బ్రిటన్లో ఈ కొత్తతరం లోకోమోటివ్కు సంబంధించిన పనులు జోరుగా జరుగుతున్నాయి. ఫ్రెంచ్ కంపెనీ అల్స్టం ఈ పనులను చేపడుతోంది. అన్నీ సరిగ్గా సాగితే.. 2021 నాటికి ఓ 100 హైడ్రోజన్ టెక్నాలజీ రైళ్లు పట్టాలపై పరుగులు తీయనున్నాయి. -
వాయుకాలుష్యంతోనూ మధుమేహం?
ఒక్కసారి వస్తే వదలని, చికిత్స అనేది లేని మధుమేహానికి వాయు కాలుష్యమూ ఒక కారణమని అంటున్నారు వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఊబకాయం, వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మధుమేహానికి కారణమని ఇప్పటివరకూ అనుకుంటున్న విషయం తెలిసిందే. గాల్లోని సూక్ష్మ కాలుష్య కణాలు దుమ్ముధూళి శరీరం లోపలికి.. తద్వారా రక్తంలోకి చేరడం వల్ల గుండెజబ్బుల్లాంటి అనేక వ్యాధులు వచ్చే అవకాశముందని ఇప్పటికే అనేక పరిశోధనలు రుజువు చేశాయి. అయితే ఈ కాలుష్య కణాలు ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గించి, మంట/వాపులకు కారణమవుతున్నట్లు తాజాగా తెలిసింది. 2016లో ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన కొత్త మధుమేహుల్లో కనీసం 14 శాతం మంది అంటే 32 లక్షల మంది వాయుకాలుష్యం కారణంగా ఈ వ్యాధిబారిన పడినట్లు తాము అంచనా వేస్తున్నట్లు ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త జయాద్ అల్ అలీ తెలిపారు. అమెరికాలోని దాదాపు 17 లక్షల మంది మాజీ సైనికోద్యోగుల ఆరోగ్య సమాచారాన్ని 8.5 ఏళ్లపాటు సేకరించి విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్లు ఆయన చెప్పారు. కాలుష్యాన్ని మధుమేహ కారణంగా గుర్తిస్తే.. మరింత కఠినమైన చట్టాలతో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఉదజని ఉత్పత్తికి చౌక విధానం... మనం వాడే వంటగ్యాస్ కంటే మెరుగైన ఇంధనమైన ఉదజనిని నీటి నుంచి చౌకగా ఉత్పత్తి చేసేందుకు కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన విధానాన్ని ఆవిష్కరించారు. ఉదజని సామర్థ్యం గురించి చాలాకాలంగా తెలిసినప్పటికీ ఈ వాయువును చౌకగా ఉత్పత్తి చేసే అవకాశం లేకపోవడం, సురక్షిత నిల్వ, రవాణాల్లో ఉండే సమస్యల కారణంగా పెద్దగా వినియోగంలోకి రాలేదు. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఓ హైబ్రిడ్ ఉత్ప్రేరకం సాయంతో నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్లుగా సులువుగా విడగొట్టడంలో విజయం సాధించారు. వాడిన రెండు ఉత్ప్రేరకాల్లో ఒకటి ఉత్పత్తి అయిన హైడ్రోజన్ను వేరుచేసేందుకు ఉపయోగపడితే రెండోది ఆక్సిజన్ను ఉత్పత్తి చేసేందుకు పనికొస్తుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఝిఫెంగ్ రెన్ తెలిపారు. ఇప్పటివరకూ ఉదజని ఉత్పత్తి కోసం అభివృద్ధి చేసిన టెక్నాలజీలు పరిశోధనశాల స్థాయిలో మాత్రమే బాగా పనిచేసేవని, రెండు ఉత్ప్రేరకాలతో సిద్ధం చేసిన ఈ కొత్త విధానాన్ని వాణిజ్య స్థాయిలో వాడుకోవచ్చునని ఆయన చెప్పారు. హైడ్రోజన్ను ఎక్కడికక్కడ చౌకగా తయారు చేసుకోగలిగితే రవాణా చాలా చౌక అయిపోతుంది. అదే సమయంలో కాలుష్యాన్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చు. బ్యాటరీ ఛార్జ్ చేసుకునే విధంబెట్టిదనిన... స్మార్ట్ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ సున్నాకు దగ్గరైనప్పుడు హడావుడిగా ఛార్జ్ చేసుకోవడం. ఓ పది శాతం ఛార్జ్ చేసుకోగానే.. ఇకచాల్లే అని తీసేయడం మనలో చాలామంది సాధారణంగా చేసేపని. అయితే దీనివల్ల స్మార్ట్ఫోన్ బ్యాటరీపై ఎలాంటి ప్రభావం పడుతుందో అసలు ఆలోచించము. పైగా అప్పుడప్పుడూ కొంత కొంత ఛార్జ్ చేసుకుంటూ ఉంటే బ్యాటరీ ఎక్కువ కాలం మన్నుతుందని అనుకుంటూ ఉండటమూ కద్దు. ఈ నేపథ్యంలో బ్యాటరీ యూనివర్సిటీ అనే కంపెనీ ఒకటి అసలు స్మార్ట్ఫోన్ బ్యాటరీలను ఎలా ఛార్జ్ చేసుకోవాలి? అందుకు గల కారణాలేమిటి అని వివరించింది. దీని ప్రకారం.. పూర్తిగా ఛార్జ్ అయిన తరువాత ఛార్జర్ నుంచి ఫోన్ను కచ్చితంగా వేరు చేయాలి. వందశాతం ఛార్జింగ్ తరువాత సమయం గడుస్తున్న కొద్దీ కొంచెం కొంచెం ఛార్జ్ అవుతూండటం వల్ల బ్యాటరీకి నష్టం జరుగుతుంది. ఆ మాటకొస్తే బ్యాటరీని వందశాతం ఛార్జ్ చేయడమూ సరికాదని తెలిపింది. పదిశాతం ఛార్జ్ తగ్గిపోగానే మళ్లీ ప్లగ్ చేయడం మేలని, దీనివల్ల బ్యాటరీ ఎక్కువ కాలం మన్నడమే కాకుండా.. ఛార్జ్ అయిపోతోందన్న బెంగ కూడా ఉండదని వివరించింది. వీలైనంత వరకూ బ్యాటరీలను వేడి ప్రదేశాల్లో ఉంచకపోవడం మేలని సూచిస్తోంది. -
హైడ్రోజన్ కార్లు... ఇంకో అడుగు దగ్గరగా..
పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్తో కూడా కొద్దోగొప్పో కాలుష్యం సమస్య ఉంటుందేమోగానీ.. హైడ్రోజన్తో మాత్రం అస్సలు ఉండదు. ఈ విషయం చాలాకాలంగా తెలుసుగానీ.. ఈ వాయువును చౌకగా ఉత్పత్తి చేయడంతోపాటు, సురక్షితంగా నిల్వ చేయడం, సరఫరా చేయడంలో సమస్యలు ఉండటం వల్ల అవి ఇప్పటివరకూ పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. ఈ నేపథ్యంలో యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా (లాస్ఏంజిలెస్) శాస్త్రవేత్తలు నికెల్, ఐరన్, కోబాల్ట్లతో హైడ్రోజన్ను చౌకగా ఉత్పత్తి చేసేందుకు ఓ వినూత్న పరికరాన్ని తయారు చేశారు. దీనిద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని గ్రామీణ ప్రాంతాల్లో అక్కడికక్కడే విద్యుత్తు తయారు చేసుకునే అవకాశమేర్పడుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త రిచర్డ్ కానెర్ తెలిపారు. సాధారణ హైడ్రోజన్ ఫ్యుయల్సెల్స్, సూపర్ కెపాసిటర్లలో రెండు ఎలక్ట్రోడ్లు ఉంటే.. వీరు తయారు చేసిన పరికరంలో మూడు ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వీటిల్లో ఒకటి సూపర్ కెపాసిటర్గా విద్యుత్తును నిల్వ చేసుకుంటుంది. అదేసమయంలో నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్లుగా విడగొడుతుంది. -
చైనాలో తొలి హైడ్రోజన్ ట్రామ్ ప్రారంభం
బీజింగ్: ప్రజా రవాణా వ్యవస్థలో చైనా మరో ముందడుగు వేసింది. హైడ్రోజన్తో నడిచే తొలి పర్యావరణహితమైన ట్రామ్ను శుక్రవారం ప్రారంభించింది. ప్రపంచంలోనే తొలి పర్యావరణహితౖ హైడ్రోజన్ ట్రామ్గా ఇది రికార్డుల్లోకెక్కనుంది. ఈ ట్రామ్ద్వారా తొలిసారిగా నార్త్ చైనాలోని హెబీ ప్రావిన్స్లోని తంగ్షన్లో కమర్షియల్ సర్వీసులను అందించనున్నారు. మూడు బోగీలతో కూడిన ఈ ట్రామ్లో మొత్తం 66 సీట్లు ఉంటాయి. 12 కేజీల హైడ్రోజన్ను ఒకసారి నింపుకోగల సామర్థ్యమున్న ఈ ట్రామ్ గంటకు నలభై నుంచి 70 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. -
సముద్రపు నీటితో చౌకగా హైడ్రోజన్
సముద్రపు నీటి నుంచి ఇంధనం హైడ్రోజన్ ఇంధనాన్ని తయారు చేయొచ్చు. కానీ అందుకయ్యే ఖర్చు చాలా ఎక్కువ. నీటిని విడగొట్టేందుకు పెద్ద ఎత్తున విద్యుత్ అవసరం ఉండటమే కారణం. అయితే యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా శాస్త్రవేత్త యాంగ్ చౌకగా హైడ్రోజన్ను తయారు చేసేందుకు వినూత్న పద్ధతిని కనుగొన్నారు. సూర్యరశ్మిని ఉపయోగించి రసాయనిక పద్ధతుల్లో నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్లుగా విడగొట్టేందుకు ఓ ఉత్ప్రేరకాన్ని సిద్ధం చేశారు. ఇది మంచినీటితో పాటు, సముద్రపు నీటిలోని ఉప్పు, లవణాలను కూడా తట్టుకుని పని చేస్తుందని యాంగ్ చెబుతున్నారు. సముద్రపు నీటిని హైడ్రోజన్ ఉత్పత్తికి చౌకగా వాడుకోగలిగితే పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని యాంగ్ పేర్కొన్నారు. సౌర ఫలకాలతో నేరుగా విద్యుత్తును ఉత్పత్తిచేయడం కంటే హైడ్రోజన్ వంటి ఇంధనాల ఉత్పత్తి ఎంతో మేలని, ఈ వాయువును ఫుయెల్సెల్స్లో వాడుకోగలిగితే కాలుష్యం లేని విద్యుత్ను పొందొచ్చని వివరించారు. భవిష్యత్తులో వ్యర్థ జలాలతోనూ హైడ్రోజన్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలపై పరిశోధనలు చేస్తానని పేర్కొన్నారు. -
రంగేస్తే చాలు.. బోలెడంత ఇంధనం!
ఇంటికి రంగేస్తే ఏమవుతుంది? చూసేందుకు ముచ్చటగా ఉంటుంది. అంతేనా? ఇప్పటికైతే ఇది నిజం గానీ.. ఇంకొన్నేళ్లు పోతే మాత్రం ఇంటికేసే రంగు.. మీ పవర్ బిల్లును బోలెడంత తగ్గించవచ్చు. లేదంటే పూర్తిగా లేకుండా కూడా చేయవచ్చు. ఇంటికేసే రంగుకు... కరెంటు బిల్లుకు ఏమిటి సంబంధం అంటే మాత్రం మనం ఆస్ట్రేలియాలోని ఆర్ఎంఐటీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనల గురించి తెలుసుకోక తప్పదు. అంతకంటే ముందు కొంచెం ప్రాథమిక విషయాలను అర్థం చేసుకుందాం. ఇంట్లో వాడే వంటగ్యాస్ అదేనండీ మీథేన్ వాయువు తెలుసుకదా... దీంట్లో కార్బన్, హైడ్రోజన్ పరమాణువులు ఉంటాయి. మీథేన్ కంటే హైడ్రోజన్ చాలా మేలైన ఇంధనం. ఈ కారణంగానే హైడ్రోజన్తో కార్లను నడిపించాలని, విద్యుత్తును ఉత్పత్తి చేయాలని చాలామంది శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గాలి కంటే తేలికగా ఉండే ఈ హైడ్రోజన్ను నిల్వ, రవాణా చేయడం సమస్య కావడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. ఆర్ఎంఐటీ శాస్త్రవేత్తలు ఇప్పుడు ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ద్వారా ఇళ్లకేసే రంగుల ద్వారానే హైడ్రోజన్ను ఉత్పత్తి చేసే మార్గాన్ని కనుక్కున్నారు. గాల్లోని తేమను పీల్చుకోగల మాలిబ్డినం సల్ఫైడ్ అనే కృత్రిమ రసాయన పదార్థం సాయంతో ఇది పనిచేస్తుంది. రంగులోకి చేరిపోయే మాలిబ్డినం సల్ఫైడ్ గాల్లోని తేమ అంటే.. హెచ్2ఓను సేకరిస్తే.. టైటానియం డయాక్సైడ్ ద్వారా దీన్ని విడగొట్టి హైడ్రోజన్ను ఉత్పత్తి చేస్తారన్నమాట. ఇలా ఉత్పత్తి అయిన హైడ్రోజన్ను ఒకదగ్గరకు చేర్చేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియలో ఒకవైపు హైడ్రోజన్ వంటి స్వచ్ఛమైన ఇంధనం ఉత్పత్తి కావడంతోపాటు.. ఆక్సిజన్ కూడా విడుదలవుతుంది. ఫ్యుయెల్సెల్స్ సాయంతో హైడ్రోజన్ను ఇంధనంగా వాడుకోవచ్చునని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ టోర్బెన్ డానెకే తెలిపారు. ఎర్రటి ఎండలోనైనా.. గట్టకట్టే చలిలోనైనా సరే.. ఈ పెయింట్ భేషుగ్గా పనిచేస్తుందని.. దీనివల్ల మారుమూల గ్రామాల్లోనూ సులువుగా విద్యుత్తును ఉత్పత్తి చేయగలుగుతామని, గ్రిడ్ వ్యవస్థ అవసరమూ తప్పుతుందని ఆయన చెప్పారు. –సాక్షి, నాలెడ్జ్ సెంటర్ -
భవిష్యత్తు ఇంధనం.. హైడ్రోజన్ !
హైడ్రోజన్.. భవిష్యత్తులో మానవాళిని నడిపే ఇంధనం. ప్రస్తుతానికి నీటి అణువులో దాగి ఉన్న ఈ మరేదాని నుంచైనా ఉత్పత్తి చేయగలిగితే.. మన ఇంధన అవసరాలు తీరినట్టే. దీనిపై దృష్టిసారించిన జర్మనీ శాస్త్రవేత్తలు సూర్యకాంతి నుంచి హైడ్రోజన్ను ఉత్పత్తి చేయడంపై దృష్టిసారించారు. ఒకవేళ ఇది సాధ్యమైతే సూర్యుడి నుంచి వెలువడే అపార కాంతిని హైడ్రోజన్గా మార్చి, పర్యావరణ అనుకూల ఇంధనంగా వినియోగించుకోవచ్చు. ఇందుకోసం ఏకంగా ఓ కృత్రిమ సూర్యుడినే తయారు చేశారు. వివరాల్లోకెళ్తే... సిన్లైట్ టెస్ట్..: పర్యావరణ అనుకూల ఇంధన ఉత్పత్తికి దోహదపడేలా కాంతిని ఉపయోగించే పరీక్షను జర్మనీ శాస్త్రజ్ఞులు గురువారం చేపట్టారు. ఒకే ఫ్రేములో 149 స్పాట్లైట్లను అమర్చి వాటిని గురువారం స్విచాన్ చేసి పరీక్షించారు. ఈ 149 లైట్ల ఫ్రేమును అధికారికంగా ‘సిన్లైట్’అని పిలుస్తారు. అలాగే ప్రపంచపు అతిపెద్ద కృత్రిమ సూర్యుడిగా దీనిని వ్యవహరిస్తున్నారు. జర్మనీలోని జ్యూలిచ్లో జర్మన్ ఏరోస్పేస్ సెంటర్ శాస్త్రవేత్తలు ఈ పరీక్షను నిర్వహించారు. అసాధారణ ఉష్ణోగ్రత..: 149 లైట్ల కాంతిని కేవలం 20 చదరపు సెంటీమీటర్లున్న ఒక ప్రదేశంపైకి ప్రసరించేలా ఏర్పాటు చేశారు. అప్పుడు ఆ ప్రదేశం సాధారణం కన్నా పదివేల రెట్ల ఎక్కువ రేడియేష న్తో వెలిగిపోయింది. అక్కడ దాదాపు 3 వేల డిగ్రీ సెల్సియస్ దాకా ఉష్ణోగ్రతలు ఉండేలా చూసి హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి కొత్త మార్గాలను శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు. కర్బన ఉద్గారాలు లేని ఇంధనం..: హైడ్రోజన్ మండినప్పుడు కర్బన ఉద్గారాలు వెలువడవు. తద్వారా గ్లోబల్ వార్మింగ్కు హైడ్రోజన్ కారణమవ్వదు. అందువల్ల దానిని భవిష్యత్తు ఇంధనంగా చాలా మంది భావిస్తున్నారు. కానీ హైడ్రోజన్ సహజంగా ప్రకృతిలో దొరకదు. నీటి నుంచి విడదీయాలి. దీనికి పెద్దమొత్తంలో విద్యుత్తు అవసరం. అంత విద్యుత్తు వాడకుండా సూర్యకాంతితో హైడ్రజోజన్ను ఉత్పత్తి చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఈ పరీక్షను నిర్వహించారు. -
ఈ రైలు కుయ్ అనదు.. కయ్ అనదు!
మూగవైన ఏమిలే..... రైలంటే కూ ఛుక్ ఛుక్ అనాలి. ధడబడమని సౌండ్లు చేయాలి. ట్రాక్ పక్కన నిలుచున్నవారి చెవులు చిల్లులు పడేలా మోత చేయాలి. కాని ఈ రైలు కుయ్ అనదు. కయ్ అనదు. నిశ్శబ్దంగా వస్తుంది. నిశ్శబ్దంగా పోతుంది. బ్యాటరీ కారులా ఏ శబ్దమూ చేయని ఈ హైడ్రోజన్ రైలు ప్రస్తుతం జర్మనీలో పట్టాలెక్కింది. జర్మనీలో ఈ రైలును అందరూ కుతూహలంగా చూస్తున్నారు. ఎందుకంటే ఇది రేపటి తరం రైలు. ఫ్రెంచ్ కంపెనీ అల్స్టామ్ ఆవిష్కరించింది. పేరు ‘కొరాడియా ఐలింట్’. మామూలుగా రైలు వస్తూంటే కిలోమీటరు దూరంలోనే దాని చప్పుడు మనం వింటాం. ఇంజిన్ భుగభుగలు చూస్తాం కదా. కొరాడియా వస్తూంటే మాత్రం ఈ రెండూ అస్సలు ఉండవు. నిశ్శబ్దంగా దూసుకెళుతుంది. అక్కడక్కడ వేడి నీటిని మాత్రం వెదజల్లుతుంది! ఎలాగంటారా? ఇందులో డీజిల్కు బదులుగా హైడ్రోజన్ను వాడతారు మరి. ప్రపంచంలో అత్యంత సమర్థవంతమైన ఇంధనంగా హైడ్రోజన్కు పేరుంది. కొరాడియా రైల్లో ఓ ఫ్యుయెల్సెల్ ఉంటుంది. ట్యాంకుల్లో ఉన్న హైడ్రోజన్ను వాతావరణం నుంచి సేకరించిన ఆక్సిజన్లను జోడించి విద్యుత్తు ఉత్పత్తి చేస్తుంది. రైలు బోగీల అడుగు భాగాల్లో అక్కడక్కడా ఏర్పాటు చేసిన లిథియం ఐయాన్ బ్యాటరీల్లో ఈ విద్యుత్తు స్టోర్ అవుతుంది. ఇంజిన్ను ముందుకు నడిపిస్తుంది. అంతేకాదు. సాధారణ రైళ్ల మాదిరిగా దీంట్లో బ్రేకులు వేసినప్పుడల్లా శక్తి వృథా కాదు. అందులో ఎక్కువ శాతం తిరిగి బ్యాటరీల్లోకి విద్యుత్తుగా చేరిపోతుంది. కొరాడియా ఐలింట్ రైలు చాంతాడంత కూడా ఉండదు. కేవలం రెండు మూడు బోగీలు మాత్రమే ఉంటాయి. మొత్తమ్మీద 300 మంది ప్యాసింజర్లను మోసుకెళుతుంది. ట్యాంకు నిండా హైడ్రోజన్ ఉంటే కొరాడియా రైల్లో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో 600 నుంచి 800 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఇటీవల మన దేశంలో నడిపిన స్పెయిన్ దేశపు టాల్గో రైలు మాదిరిగా అన్నమాట. ధరవరల గురించి ప్రస్తుతానికి తెలియకపోయినా మరో రెండేళ్లలో ఇది అందరికీ అందుబాటులోకి వస్తుందని అంచనా. -
ట్యాంకులో హైడ్రోజన్ కొట్టు గురూ...
మనిషికి ఆక్సిజన్ కావాలి. కారుకు పెట్రోలు కావాలి. పోనీ డీజిల్ అయినా. కాని ఈ కారు హైడ్రోజన్ అడుగుతుంది. దాంతోనే పరిగెడుతుంది. నెదర్లాండ్స్కు చెందిన ఒక కంపెనీ తయారు చేసిన ఈ కారు పేరు ‘ఫోర్జ్ వీ2’. ఇది పెట్రోలు, డీజిల్, గ్యాస్ వంటి సంప్రదాయ ఇంధన వనరులు కాకుండా హైడ్రోజన్ను ఇంధనంగా వాడుకుంటుంది. హైడ్రోజన్ అత్యంత సమర్థమైన ఇంధనమే కాదు... ఏమాత్రం కాలుష్యం వెలువరించదు. కాకపోతే దీన్ని నిల్వ చేయడం, రవాణా చేయడంలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా మనం ఇప్పటికీ పెట్రోలు, డీజిల్ కార్లనే వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫోర్జ్ వీ2లో ఒక ఫ్యూయెల్ సెల్, హైడ్రోజన్ ట్యాంకులు ఉంటాయి. ఈ ఫ్యూయెల్ సెల్ హైడ్రోజన్ ట్యాంకులలోని హైడ్రోజన్ను వాతావరణంలోని ఆక్సిజన్తో చర్య జరిపి విద్యుత్తును, నీటిని తయారు చేసి ఇంజన్కు ఇంధనంగా అందిస్తుంది. ఒకసారి ట్యాంకుల్ని హైడ్రోజన్తో నింపితే దాదాపు 45 నిమిషాలపాటు వంద కిలోవాట్ల శక్తి విడుదలవుతుంది. ఈ శక్తి ఫోర్జ్ వీ2ను కేవలం నాలుగు సెకన్లలో వంద కిలోమీటర్ల వేగానికి తీసుకెళుతుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 210 కిలోమీటర్లు గనుక ఇప్పటికే పెట్రోలు, డీజిల్ కార్లతో పోటీపడుతూ కొన్ని రేసులను గెలిచింది. ప్రస్తుతం దీన్ని వీలైనంత ఎక్కువ దూరం నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలో 24 గంటలపాటు జరిగే లీమ్యాన్స్ రేస్లో పోటీకి దించాలని తయారీదారులు భావిస్తున్నారు. కేవలం హైడ్రోజన్తో నడిచే కార్లు మాత్రమే పోటీపడే రేస్ ఇది. ఇందులోనూ మంచి ఫలితాలు సాధిస్తే మరిన్ని రేసుల్లో పాల్గొనేందుకు మార్గం సుగమం అవుతుంది. -
నీటితో మండే పొయ్యి
నీటితో మంటలు ఆర్పవచ్చునని అందరికీ తెలుసు. కానీ... నీళ్లంటే.. రెండు వంతుల హైడ్రోజన్, ఒక వంతు ఆక్సిజన్ అని తెలిసిన వారు మాత్రం దాంతో నిప్పు ఎలా పుట్టించాలో ఆలోచిస్తారు. కోచీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని విమల్ గోపాల్, రిశ్విన్, ప్రవీణ్ శ్రీధర్ మాదిరిగా అన్నమాట. హైడ్రోజన్ బాగా మండుతుందని, ఆక్సిజన్ మంటను ఎగదోస్తుందనీ తెలిసిన వీరు... కరెంటు సాయంతో నీటిని అక్కడికక్కడే విడగొట్టి మండించగల ఓ సరికొత్త పొయ్యిని అభివృద్ధి చేశారు. ఇంకోలా చెప్పాలంటే... నీళ్లనే వంటగ్యాస్లా మార్చారన్నమాట. కోచీలోని స్టార్టప్ విలేజ్లో వీరు ఇప్పటికే ఓ ఫ్యాక్టరీ కూడా పెట్టేశారండోయ్! ముందుగా హోటళ్లకు అవసరమైన స్టవ్లను తయారు చేసి పరీక్షిస్తామనీ, ఆ తరువాత ఈ హైడ్గ్యాస్ స్టౌ అందరికీ అందుబాటులోకి తెస్తామనీ అంటున్నారు వీరు. గ్యాస్ అక్కడికక్కడే తయారవుతూండటం వల్ల రవాణా చేయాల్సిన పని లేదు.. మండి పేలిపోతుందన్న భయమూ అక్కరలేదని భరోసా కూడా ఇస్తున్నారు. చూద్దాం... ఎప్పుడు వస్తుందో ఈ నీటి గ్యాస్ స్టౌ! -
హైడ్రో బైక్..
ఎలాగుంది.. అదిరిపోలే.. పెడల్స్తో చూడ్డానికి సైకిల్లా కనిపిస్తున్నా.. ఇది బైక్.. హైడ్రో బైక్.. అంటే హైడ్రోజన్ ఇంధనంతో పనిచేస్తుందన్నమాట. ఇమ్రాన్ ఓథ్మాన్ అనే డిజైనర్ దీని రూపకర్త. ఇందులోని హైడ్రోజన్ ఇంధనం గాలిలోని ఆక్సిజన్ను గ్రహించి.. రసాయన చర్య జరిపి.. విద్యుత్ను పుట్టిస్తుంది. దాంతో ఇందులోని మోటారు నడిచి.. బైక్ దూసుకెళ్తుంది. ఇంతకీ ఈ పెడల్స్ ఎందుకనేగా.. ఇవి చూడ్డానికే తప్ప వాడ్డానికి పనికిరావు. పెడల్స్ ఉండటం వల్ల చాలా దేశాల చట్టాల ప్రకారం ఇది సైకిల్ విభాగం కిందకు వస్తుంది. దీని వల్ల లెసైన్స్, రోడ్ ట్యాక్స్ వంటి ఇబ్బందులుండవ ట.