Jubilee Hills
-
చెర్రీ మూవీలో స్టార్ హీరో.. జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్కుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ మూవీలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఆర్సీ16 వర్కింగ్ టైటిల్ తెరకెక్కిస్తోన్న చిత్రంలో ఆయన నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే అమెరికా వెళ్లి క్యాన్సర్ చికిత్స తీసుకుని ఇండియాకు తిరిగొచ్చారు. ప్రస్తుత చెర్రీ-బుచ్చిబాబు సనా కాంబోలో వస్తోన్న మూవీ షూట్ కోసం హైదరాబాద్కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రముఖ ఆలయాన్ని సందర్శించారు. అయితే క్యాన్సర్ చికిత్స తర్వాత ఆయన పూర్తిగా మారిపోయినట్లు కనిపించారు.భాగ్యనగరంలో అడుగుపెట్టిన శాండల్వుడ్ స్టార్ జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించారు. ఆయన సతీమణితో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శివరాజ్కుమార్ను చూసిన భక్తులు ఆయనతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. గతేడాది శివరాజ్కుమార్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ భైరాతి రణగల్ మూవీతో ప్రేక్షకులను అలరించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. 2024లో శివరాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం ఇదే కావడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్తో పాటు ఆహాలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. #TFNExclusive: Actor @NimmaShivanna visits Shri Peddamma Talli Temple to seek divine blessings while in Hyderabad for #RC16 shoot🙏🏻✨#ShivaRajKumar #TeluguFilmNagar pic.twitter.com/SnkF2ZQQFo— Telugu FilmNagar (@telugufilmnagar) March 23, 2025 -
జూబ్లీహిల్స్ : వైభవంగా టీటీడీ శ్రీ వేంకటేశ్వరస్వామి 5వ వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
జూబ్లీహిల్స్లో సందడి చేసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
ఇల్యూజన్ పబ్లో యువతిపై దాడి
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని ఇల్యూజన్ పబ్లో శనివారం రాత్రి మద్యం మత్తులో ఓ యువకుడు ఓ యువతిపై దాడి చేసి పొత్తి కడుపులో బూటు కాలితో తన్ని తీవ్రంగా గాయపరిచిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..పాతబస్తీకి చెందిన యువతి తన ముగ్గురు స్నేహితురాళ్లతో కలిసి శనివారం రాత్రి ఇల్యూజన్ పబ్కు వచ్చింది. రాత్రి 12.40 గంటల సమయంలో ఆమె మాజీ ప్రియుడు ఓల్డ్ సిటీకే చెందిన ఎండీ ఆసిఫ్జానీ మద్యం సేవించి అక్కడికి వచ్చాడు. సదరు యువతి స్నేహితురాళ్లతో బర్త్డే వేడుకలు జరుపుకుంటుండగా అక్కడికి వచ్చిన ఆసిఫ్జానీ ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ దూషిస్తూ దాడి చేశాడు. దీంతో ఆమె స్నేహితురాళ్లతో కలిసి కిందకు పరుగులు తీయగా అక్కడికి కూడా వచి్చన ఆసిఫ్జానీ ఆమె పొత్తి కడుపులో బూటు కాలితో తన్నడమేగాక తీవ్రంగా కొట్టాడు. అడ్డుకునేందుకు యతి్నంచిన ఆమె స్నేహితురాలిపై కూడా దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. గతంలో ఆసిఫ్జానీ, తాను ప్రేమించుకున్నామని, కొద్ది రోజులు కలిసి తిరిగామని, అయితే అతడి ప్రవర్తన నచ్చకపోవడంతో కొంతకాలంగా దూరంగా ఉంటున్నానని తెలిపింది. అయినా తనను వెంబడిస్తూ మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. జూబ్లీహిల్స్ పోలీసులు ఆసిఫ్జానీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొత్తవారికి ఈ నెల రేషన్ లేనట్లే..!
బంజారాహిల్స్: కొత్త రేషన్కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో దరఖాస్తుదారులు మీ–సేవా కేంద్రాలకు క్యూ కట్టారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్–7లోని మీ–సేవా కేంద్రంతో పాటు ఖైరతాబాద్లోని ఆర్టీఏ కార్యాలయ ఆవరణలోని సెంటర్ల వద్ద ఉదయం నుంచే బారులుదీరారు. కొత్త కార్డుతో పాటు ప్రస్తుత కార్డులో కొత్తపేర్లు చేర్చాలని ఆధార్తో పాటు కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లును జతచేసి దరఖాస్తు చేసుకున్నారు. సిబ్బంది సైతం అప్పటికప్పుడే ఆన్లైన్లో నమోదు చేశారు. బంజారాహిల్స్లోని మీ–సేవా కేంద్రానికి ఒక్కరోజే దాదాపు 1000 మంది వరకు, అలాగే బస్తీలు, కాలనీల్లోని మీ–సేవా కేంద్రాలకు కూడా దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.మరికొద్ది రోజుల పాటు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సిబ్బంది తెలిపారు. రేషనింగ్ ఖైరతాబాద్ సర్కిల్–7 పరిధి కిందికి వచ్చే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వేంకటేశ్వరకాలనీ, సోమాజీగూడ, ఖైరతాబాద్, రహమత్నగర్, యూసుఫ్గూడ, వెంగళరావునగర్, బోరబండ, ఎర్రగడ్డ, సనత్నగర్, అమీర్పేట డివిజన్ల పరిధిలోని 81 రేషన్ షాపుల పరిధిలో కొత్తగా రేషన్ కార్డు కోసం మీ–సేవా కేంద్రాలకు వెళ్లి సదరు దరఖాస్తు ఫారానికి సంబంధిత డాక్యుమెంట్లు జతపరిచి ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. సర్కిల్–7 పరిధిలో 83,013 రేషన్కార్డులు.. ఖైరతాబాద్ సర్కిల్–7 పరిధిలో 81 రేషన్ షాపులు ఉండగా ప్రస్తుతం వీటి పరిధిలో ఆహార భద్రత కార్డులు 79,531, అంత్యోదయ అన్నయోజన కార్డులు 3481, ఒక అన్నపూర్ణ కార్డు కలిపి మొత్తం 83,013 కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల్లో 2,92,882 మంది లబి్ధదారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా ఒక్కొక్కరికీ 6 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. సర్కిల్ పరిధిలో మొత్తం ప్రతినెలా 18,19,011 కిలోల రేషన్ బియ్యం అందిస్తున్నారు. కొత్తవారికి ఈ నెల రేషన్ లేనట్లే..!ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన దరఖాస్తుల్లో గత నెల 6,093 మందిని అర్హులుగా గుర్తించి సర్వే చేయగా ఇందులో 2,938 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో నూతన లబ్ధిదారులకు ఇప్పటివరకు పంపిణీ చేయలేదు. ఈనెల కూడా వారికి రేషన్ లేనట్లేనని తెలుస్తోంది. -
ఆకట్టుకున్న ఆర్ట్ & స్టాండప్ కామెడీ షో
హైదరాబాద్: జూబ్లీహిల్స్లోని కడరి ఆర్ట్ గ్యాలరీలో శుక్రవారం సాయంత్రం స్టాండప్ కామెడీ– చిత్ర కళాప్రదర్శన కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ప్రముఖ ఆర్టిస్ట్లు గుర్మీత్ మార్వా, మణాల్ రాజేశ్వర్రావు, నటరాజ్లు తమ సజనాత్మకతను జోడించి అందమైన కళాప్రదర్శన నిర్వహించి ఆకట్టుకున్నారు. ఇక ప్రముఖ స్టాండప్ కమేడియన్ అవినాష్ అగర్వాల్ తన మాటలు, పాటలతో అందర్లో నవ్వులు పూయించారు. హ్యూమర్ ఆన్ క్యాన్వాస్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కళను, కామెడీని ఒకే వేదికపైకి తీసుకు వచ్చినట్లు కడరి ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకురాలు సుప్రజా రావు తెలిపారు.ఆర్ట్ అండ్ స్టాండప్ కామెడీ షోలో అవినాష్ -
హైదరాబాద్లో సందడి చేసిన అనుపమ పరమేశ్వరన్ (ఫొటోలు)
-
జూబ్లీహిల్స్ : హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసిన బిగ్బాస్ ఫేమ్ సోనియా ఆకుల (ఫొటోలు)
-
హీరో రాణా సహా సంపన్నుల నివాసగృహాలు కేఫ్స్, రెస్టారెంట్స్గా
ప్రస్తుతం స్పెయిన్లో నివసిస్తూ ఫుడ్ అండ్ ట్రావెల్ బ్లాగర్గానూ పాపులర్ అయిన ఆశ్రిత ప్రముఖ నటుడు వెంకటేష్ కుమార్తె. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటితో కలిసి ఆశ్రిత దగ్గుబాటి ఇటీవల తాము సందర్శించిన ఓ రెస్టారెంట్ గురించి తన యూట్యూబ్ ఛానెల్లోని కొత్త వీడియోలో పంచుకున్నారు. అది గతంలో తమ దగ్గుబాటి కుటుంబానికి చెందిన పాత నివాసగృహం కాగా ఇప్పుడు రెస్టారెంట్గా మారింది. నాటి దగ్గుబాటి నివాసం.. ఇప్పుడు సరికొత్త ఇంటీరియర్లతో శాంక్చురీ బార్ అండ్ కిచెన్ అనే అత్యాధునిక రెస్టారెంట్గా మారిన తర్వాత ఆ ఇంటిని సందర్శించడం ఇదే తొలిసారి అని ఆశ్రిత తెలిపారు. కళాశాలలో చదువుతున్న సమయంలో ఆ పాత ఇంటిలో నివసించినట్లు ఆమె గుర్తు చేసుకున్నారు.ప్రకృతి మధ్యకు.... ఇళ్లను రెస్టారెంట్లుగా మార్చడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. తమ పిల్లలు విదేశాల్లో నివసిస్తూ ఉండడంతో తాము ఇక్కడ ఒంటరిగా లంకంత ఇళ్ల నిర్వహణ చూడలేక లీజ్కి ఇస్తున్నట్టు కొందరు సంపన్న తల్లిదండ్రులు చెబుతున్నారు. మరోవైపు ఈ రెస్టారెంట్లు.. పన్నులు విద్యుత్ బిల్లులతో సహా ఎంత అద్దె అయినా సరే చెల్లించడానికి వెనుకాడడం లేదు. రెసిడెన్షియల్ ప్రాపర్టీ అన్వేషకులు అద్దె బదులు ఇఎమ్ఐలు చెల్లించడానికి ఇష్టపడతారు. కానీ ఈ కేఫ్స్ అద్దెలు ఎక్కువైనా సై అంటాయి. ‘అని ఓ ప్రాపర్టీ యజమాని చెప్పారు. కరోనా తర్వాత కొన్ని కుటుంబాలు తమ ఆస్తులను లీజుకు ఇచ్చేసి నగరం నడిబొడ్డు నుంచి కాలుష్య రహిత ప్రాంతాలకు, శివార్లలోని విల్లాలకు తరలివెళ్లారు. ‘నా జీవితాంతం కష్టపడి పనిచేశాను. ఇప్పుడు నేను ప్రకృతి నీడలో నివసించాలని కోరుకుంటున్నాను. అందుకే గండిపేటలోని మా అర ఎకరం స్థలంలో చిన్న ఇంటిని నిర్మించుకుని అక్కడకు మారాను’ అని ఐదేళ్ల క్రితం జూబ్లీహిల్స్లో నివసించిన వ్యాపారి దినకర్ చెబుతున్నారు. మరికొందరు సినిమా సెలబ్రిటీలు.. గచ్చిబౌలి చుట్టుపక్కల ప్రాంతాలకు తమ నివాసాలను మారుస్తూ.. హిల్స్లోని తమ ఇళ్లను రెస్టారెంట్స్కి అద్దెకు ఇవ్వడం లేదా తామే రెస్టారెంట్స్, బ్రూవరీ.. వంటివి ఏర్పాటు చేయడం కనిపిస్తోంది. నాటి ఇంట్లో.. నేటి రెస్టారెంట్లో.. ‘మా ఇంటికి స్వాగతం. నేను 20 సంవత్సరాల పాటు ఇక్కడే నివసించాను’ అంటూ రానా సైతం గుర్తు చేసుకున్నారు. రానా, ఆశ్రిత ఆ రెస్టారెంట్లో తిరుగుతున్నప్పుడు గోడలపై రంగురంగుల కళాఖండాలు కనిపించాయి. కుటుంబ సభ్యులకు చెందిన వేర్వేరు గదుల్లో కలియ తిరిగారు. ఆ తర్వాత ఇద్దరూ తాము చాలా కాలం క్రితం నడిచిన బ్లాక్ రైలింగ్తో కూడిన స్పైరల్ చెక్క మెట్ల మీద నడిచారు. ఇంటి మొదటి అంతస్తు’ అని రానా గుర్తు చేసుకున్నారు. మొదటి అంతస్తులో చాలా గాజు తలుపులు కనిపించాయి. ఇప్పుడు బార్గా ఉన్న ఆ ప్రదేశం గురించి చెబుతూ ‘ఈ బార్ ఉన్న ప్లేస్లోనే అప్పట్లో నేను సినిమాలు చూసేవాడిని’ అని రానా చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తన పాత బెడ్రూమ్లో బ్లాక్ షాండ్లియర్లు, రెస్టారెంట్ అతిథుల కోసం సీటింగ్స్ ఏర్పాటు చేశారు. రానాకు ఇష్టమైన బాల్కనీ ఇప్పుడు ‘పిజ్జా ప్లేస్’ గా మారింది. హిల్స్లో.. ఇవే ట్రెండ్స్.. ఒక్క దగ్గుబాటి కుటుంబానికి చెందిన ఇల్లు మాత్రమే కాదు జూబ్లీహిల్స్లోని పలు ఇండిపెండెంట్ ఇళ్లు రెస్టారెంట్స్గా మారిపోతున్నాయి. రోడ్డు నెం.1, 10, 36, 45, 92లు మినహాయిస్తే మిగిలినవన్నీ నివాసప్రాంతాలే అయినప్పటికీ.. దాదాపు 350 దాకా వ్యాపార సంస్థలు నడుస్తున్నాయి. వాటిలో ఎక్కువ భాగం పబ్లు, బార్లు, కాఫీ హౌస్లు కాగా కొన్ని మాత్రం బొటిక్స్. జూబ్లీ హిల్స్లోని అనేక నివాసాలు ఇప్పుడు భారతీయ, ఇటాలియన్ జపనీస్ తదితర దేశ విదేశీ రుచికరమైన వంటకాలకు కేరాఫ్ అడ్రెస్.నగరంలో విశాలమైన స్థలంలో విలాసవంతంగా నిర్మించిన పలు నివాసాలకు ఒకేఒక చిరునామా జూబ్లీహిల్స్ అని చెప్పాలి. మరెక్కడా అంత చల్లటి, ప్రశాంతమైన వాతావరణం కనిపించదు.రెస్టారెంట్స్తో పాటు కేఫ్స్ సందర్శకులు, కేఫ్స్లో ఆఫీస్ వర్క్ చేసుకునే కార్పొరేట్ ఉద్యోగులు తరచూ ప్రశాంతమైన, హోమ్లీ వాతావరణాన్ని కోరుకుంటారు. అందుకే ఇక్కడ ఏర్పాటు చేస్తున్న కెఫేలు బాగా సక్సెస్ అవుతున్నాయి. ఐదారేళ్ల క్రితం ఒకటో రెండో కేఫ్స్ ఉండే పరిస్థితి నుంచి పదుల సంఖ్యకు విస్తరించడానికి ఈ పీస్ఫుల్ వాతావరణమే దోహదం చేసింది.ఇళ్లను మారుస్తున్నారు.. : గత కొంత కాలంగా ఈ ట్రెండ్ ఊపందుకుంది. మా రెస్టారెంట్ సైతం అలా ఏర్పాటు చేసిందే. మాలాంటి కొందరు పూర్తిగా రూపురేఖలు మారుస్తుంటే.. మరికొందరు మాత్రం స్వల్ప మార్పులకు మాత్రమే పరిమితమై ఇంటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా చూస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి జూబ్లీహిల్స్ ఒక మంచి ప్లేస్. -సంపత్, స్పైస్ అవెన్యూ రెస్టారెంట్ ఆపాతమధురం -
జూబ్లీహిల్స్లో బంగ్లా.. రూ.40 కోట్లు!
సాక్షి, సిటీబ్యూరో: కరోనా తర్వాత నుంచి లగ్జరీ గృహాలకు (luxury homes) ఆదరణ పెరిగింది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో రూ.80 కోట్ల ఖరీదైన రెండు బంగ్లాలు, ఒక్కోటి రూ.40 కోట్ల చొప్పున అమ్ముడుపోయాయి. గతేడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో రూ.40 కోట్లకు పైగా విలువైన 59 అల్ట్రా లగ్జరీ గృహాల విక్రయాలు జరిగాయని అనరాక్ గ్రూప్ నివేదిక వెల్లడించింది. వీటి విలువ రూ.4,754 కోట్లు. వీటిలో 53 అపార్ట్మెంట్లు కాగా.. 6 బంగ్లాలు ఉన్నాయి.2023లో సుమారు రూ.4,063 కోట్ల విలువైన 58 లగ్జరీ గృహాలు విక్రయించారు. మొత్తం అమ్మక విలువలో వార్షిక పెరుగుదల 17 శాతంగా ఉంది. 2024లో అమ్ముడైన అల్ట్రా లగ్జరీ గృహాలలో రూ.100 కోట్ల విలువైన యూనిట్లు 17 ఉన్నాయి. వీటి విలువ రూ.2,344 కోట్లు. గతేడాది 88 శాతం వాటాతో అత్యధికంగా ముంబైలో 52 అల్ట్రా లగ్జరీ యూనిట్లు సేల్ అయ్యాయి. ఢిల్లీ–ఎన్సీఆర్లో మూడు, బెంగళూరు, హైదరాబాద్లో రెండేసి గృహాలు అమ్ముడయ్యాయి.హెచ్ఎన్ఐ, ప్రవాసుల డిమాండ్ గత రెండేళ్లలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 130 అల్ట్రా లగ్జరీ గృహాలు విక్రయమ్యాయి. వీటి విలువ రూ.9,987 కోట్లు. 2022లో రూ.1,170 కోట్ల విలువైన 13 యూనిట్లు అమ్ముడుపోయాయి. వీటిలో 10 అపార్ట్మెంట్లు కాగా మూడు బంగ్లాలు ఉన్నాయి. 2023లో రూ.4,063 కోట్ల విలువైన 58 యూనిట్లు అమ్ముడయ్యాయి.హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), ప్రవాసులు వ్యక్తిగత వినియోగం, పెట్టుబడుల కోసం అల్ట్రా లగ్జరీ గృహాలను కొనుగోలు చేస్తున్నారు. ఇన్పుట్ వ్యయం పెరుగుదల, బలమైన కొనుగోలుదారుల డిమాండ్ కారణంగా మెట్రో నగరాలలో ఈ తరహా ఇళ్ల పెరుగుతున్నాయి. దీంతో గ్రేడ్–ఏ డెవలపర్లు అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్ల నిర్మాణాలకు మొగ్గు చూపుతున్నారు. -
ఎట్ల బతుకుతున్నరయ్యా ఈ బస్తీలో..
హైదరాబాద్: ‘ఎట్ల బతుకుతున్నరయ్యా ఈ బస్తీలో.. సరిగా నడవడానికి సైతం బాటల్లేవు.. నిలబడే జాగా లేదు.. ఇరుకు సందులు.. మురికి కూపాలు’ అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. మంగళవారం ఆయన జూబ్లీహిల్స్లోని గురుబ్రహ్మనగర్ బస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా గుడిసెల మధ్య ఉన్న మురికి కాల్వల మీదుగా.. ఇరుకు సందుల నుంచి బయటకి వస్తూ.. ‘ఇదేం సందయ్యా.. నేనంటే సన్నగా ఉన్నాను కాబట్టి ఇందులో నుంచి రాగలిగాను. అదే కొంచెం దొడ్డుగా ఉన్నోడి పరిస్థితి ఏంది? అసలు ఇక్కడ ఎలా ఉండగలుగుతున్నారయ్యా’ అంటూ బస్తీవాసుల పరిస్థితిని చూసి ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ‘గల్లీ చిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది.. అనే పాట విన్నదే కానీ ఇప్పుడు నాకు ప్రత్యక్షంగా కనిపించింది’ అంటూ ముందుకు సాగారు. -
కోర్టు ఆదేశించినా పట్టించుకోరా?
సాక్షి, హైదరాబాద్: సహకార సొసైటీల్లో అక్రమాలు, అవకతవకలు జరగకుండా పర్యవేక్షించాల్సిన ‘రిజిస్టార్ ఆఫ్ కో–ఆపరేటివ్ సొసైటీస్’విభాగం తీరుపై విమర్శలు వస్తున్నాయి. నిబంధనల ఉల్లంఘనపై హౌసింగ్ సొసైటీల స భ్యుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా ఏ మాత్రం స్పందించడం లేదనే ఆగ్రహం కనిపిస్తోంది. అక్రమాలపై విచారణ చేపట్టాలని సాక్షాత్తు న్యాయస్థానం ఆదేశించినా కూడా అలసత్వం వహించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ సొసైటీలో అక్రమాలపై విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించి రెండు నెలలైనా సహకార శాఖలో చలనం లేకుండా పోయిందని సభ్యులు మండిపడ్డారు. కో–ఆపరేటివ్ కార్యాలయం ముందు ఆందోళనను నిర్వహించేందుకు సీనియర్ సభ్యులు సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు. ఎన్నెన్నో ఆరోపణలు, ఉల్లంఘనలు.. 1962లో ఏపీ కో–ఆపరేటివ్ సొసైటీ చట్టం కింద ‘జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌజింగ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ (జీహెచ్సీహెచ్బీఎస్)’రిజిస్టర్ అయింది. ఇందులో 4,962 మంది సభ్యులు ఉండగా.. 3,035 మందికి ఇళ్ల స్థలాలు అందజేశారు. మరో 1,952 మంది వెయిటింగ్లో ఉన్నారు. సొసైటీకి సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి.చాలాకాలం పాటు వాటికి అనుగుణంగా సొసైటీ కార్యకలాపాలు సాగినా.. తర్వాత కొందరు స్వలాభాపేక్షతో సొసైటీని ఆర్థిక వనరుగా మార్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రస్తుత సొసైటీ పాలకవర్గం అక్రమాలకు అడ్డు అదుపులేకుండా పోయిందని సీనియర్ సభ్యులు ఆరోపిస్తున్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న 800 మంది సభ్యులను తొలగించే ప్రయత్నం చేయడం, కొత్త సభ్యులకు అవకాశం పేరుతో దరఖాస్తులు పంచుకుని సొమ్ము చేసుకోవడం, సొసైటీకి సంబంధం లేని ప్రైవేటు వెంచర్కు జూబ్లీహిల్స్–4 పేరుపెట్టి అక్కడ ప్లాట్స్ కొంటే సొసైటీలో సభ్యత్వం అంటూ ప్రచారం చేయడం వంటి ఎన్నో అవకతవకలు జరిగాయని చెబుతున్నారు. ప్రత్యేక పర్యవేక్షణ ఏది? సహకార చట్టం ప్రకారం ఎక్కువ సభ్యత్వం, ఉన్నతస్థాయి వ్యక్తులు సభ్యులుగా ఉన్న సొసైటీలపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. ఇలా రాష్ట్రస్థాయి రిజిస్టార్ ఆఫ్ కో–ఆపరేటివ్ సొసైటీస్ ప్రత్యేక పర్యవేక్షణలోకి ‘జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ’తోపాటు మరో నాలుగు సొసైటీలు కూడా వస్తాయి. కానీ జూబ్లీహిల్స్ సొసైటీపై కొన్నేళ్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నా.. పట్టించుకునేవారే లేరన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల సొసైటీ సభ్యులు కొందరు పాలకమండలి అక్రమాలపై కమిషనర్కు ఫిర్యాదు చేసినా స్పందన లేకుండా పోయిందని అంటున్నారు. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తే.. ఈ వ్యవహారం పోలీసుల పరిధిలోకి రాదని, అక్రమార్కులపై క్రిమినల్ కేసు పెట్టేలా సహకార శాఖలో అర్జీ పెట్టుకోవాలని వారు పేర్కొన్నారని చెబుతున్నారు. పోలీసులు ఇచ్చిన కాపీని సైతం జతపర్చి సహకార కమిషనర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సీనియర్ సభ్యులు వాపోతున్నారు. పాలక వర్గం అక్రమాలపై విచారణ జరిపించాలి సొసైటీ పాలక మండలి అక్రమాలపై తక్షణమే విచారణ జరిపించాలి. నిబంధనల ప్రకారం పాత సభ్యులందరికీ స్థలాల కేటాయింపు అనంతరమే కొత్త సభ్యత్వం చేపట్టాలి. సహకార రిజి్రస్టార్ తక్షణమే స్పందించాలి. – జ్యోతిప్రసాద్ కొసరాజు, సీనియర్ సభ్యుడు, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీఎలాంటి ఉత్తర్వులు అందలేదు..జూబ్లీహిల్స్ సొసైటీకి సంబంధించి ఎలాంటి ఉత్తర్వుల ప్రతి నాకు అందలేదు. రాష్ట్రంలోని 90 సొసైటీల్లో ఇదొకటి. సొసైటీలపై ఫిర్యాదులు రావడం సహజం. విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఉత్తర్వులు ఏవైనా వచ్చి ఉంటే.. సెక్షన్కు వచ్చి ఉండవచ్చు. – జి.శ్రీనివాసరావు, కో–ఆపరేటివ్ అడిషనల్ రిజి్రస్టార్ -
టీవీ సీరియల్ నటికి వేధింపులు...
బంజారాహిల్స్ : నా మాట వినకున్నా..నాతో కలవకున్నా..నన్ను పెళ్లి చేసుకోకున్నా..ఈ సంక్రాంతికి నీ ఫొటోలన్నీ బ్యానర్లుగా చేసి ఊరంతా కడతానంటూ టీవీ సీనియర్ నటిని వేధిస్తున్న వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..వెస్ట్ గోదావరి జిల్లా, కవటం గ్రామానికి చెందిన మహిళ (29) శ్రీకృష్ణానగర్లో ఉంటుంది. ఆమెకు 2012లో కృష్ణమోహన్ అనే వ్యక్తితో పెళ్లి కాగా కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో గత రెండేళ్లుగా భర్తకు దూరంగా పిల్లలతో కలిసి కృష్ణానగర్లో ఉంటోంది. గత సెపె్టంబర్ నుంచి శ్రావణ సంధ్య అనే సీరియల్లో నటిస్తుంది. ఈ సందర్భంగా బత్తుళ్ల ఫణితేజ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. గత నెలలో పెళ్లి చేసుకుంటానని చెప్పగా, అందుకు ఆమె నిరాకరించింది. అప్పటి నుంచి అసభ్యకరమైన మెసేజ్లు, వీడియోలు పెట్టడమే కాకుండా టీవీ ఇండస్ట్రీలో తాను వివిధ వ్యక్తులతో దిగిన ఫొటోలను చెడుగా ప్రచారం చేస్తున్నాడు. తనతో ఉండడానికి ఒప్పుకోకపోతే ఈ ఫోటోలతో సంక్రాంతికి ఆమె స్వ గ్రామంలో బ్యానర్లు కడతానని బెదిరిస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఫణితేజపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
Jubilee Hills: మద్యం మత్తులో కారు నడిపి..
బంజారాహిల్స్: ఓ యువకుడు మద్యం మత్తులో కారు నడిపి మితిమీరిన వేగంతో చెట్టుకు, డివైడర్కు ఢీకొట్టిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. వెస్ట్ మారేడ్పల్లి సుమన్ హౌసింగ్ కాలనీలో నివసించే తీగుళ్ల దయాసాయిరాజ్ (27) రైల్వే ఆఫీసర్స్ కాలనీలో నివసించే తన స్నేహితురాలు (27)తో కలిసి శనివారం రాత్రి ఫిలింనగర్ సమీపంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఓ విందుకు హాజరయ్యాడు. ఇద్దరూ ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల వరకు ఆ విందులో పాల్గొని మద్యం తాగారు. దయాసాయిరాజ్ మోతాదుకు మించి మద్యం తాగి ఇంటికి వెళ్లే క్రమంలో తన స్నేహితురాలిని తీసుకుని అర్ధరాత్రి 2.30 గంటలకు ఫంక్షన్ హాల్ నుంచి బెంజ్ కారు బయలుదేరాడు. సినీ నటుడు బాలకృష్ణ ఇంటి వద్దకు రాగానే కారు అదుపు తప్పి డివైడర్ను, ఆ తర్వాత చెట్టును ఢీకొని రోడ్డుకు అవతల వైపు బోల్తాపడింది. ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో కారులోని ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. చెట్టు విరిగిపడి డివైడర్ ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వీరిద్దరినీ స్టేషన్కు తరలించారు. ఆదివారం ఉదయం 3 గంటలకు స్టేషన్కు తీసుకువచి్చన వీరిద్దరినీ డ్రంకన్ డ్రైవ్ టెస్ట్కు యతి్నంచగా వీరు సహకరించలేదు. 3 గంటల పాటు పోలీసులను దూషిస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఠాణాలో న్యూసెన్స్ చేశారు. మద్యం మత్తులో స్టేషన్లో ఇద్దరూ వీరంగం సృష్టించారు. ఎట్టకేలకు వీరికి శ్వాస పరీక్షలు నిర్వహించగా దయాసాయిరాజ్కు 94 ఎంజీ, యువతికి 73 ఎంజీ రక్తంలో ఆల్కహాలిక్ నమోదైంది. వీరిద్దరిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. హత్యాయత్నం కింద సెక్షన్ విధించి ఆదివారం రిమాండ్కు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. -
పబ్లపై డేగ కన్ను
బంజారాహిల్స్: పబ్లు అంటేనే గుర్తుకు వచ్చేది జూబ్లీహిల్స్... నగరంలో ఎక్కడా లేనంత హడావుడి, హంగామా జూబ్లీహిల్స్ పబ్లలోనే కనిపిస్తుంది. చుక్కేసినా... చిందేసినా జూబ్లీహిల్స్ పబ్లో ఉంటేనే ఆ కిక్కెక్కుతుంది. అందుకే యువత కళ్లన్నీ జూబ్లీహిల్స్ పబ్లపైనే ఉంటాయి. మామూలు రోజుల్లోనే హంగామా జరిగే ఈ పబ్లలో న్యూ ఇయర్ విషయం చెప్పనక్కర్లేదు...ఈ నెల 31న రాత్రి న్యూ ఇయర్ వేడుకలకు జూబ్లీహిల్స్లోని పబ్లన్నీ సరికొత్త వేదికలతో సిద్ధమవుతున్నాయి. ప్రత్యేక ఆకర్శన కోసం బాలీవుడ్, టాలీవుడ్ తారలను రప్పిస్తున్నారు. అయితే పబ్ నిర్వాహకులు న్యూ ఇయర్ వేడుకల్లో శ్రుతిమించితే ఊరుకునే ప్రసక్తే లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏ మాత్రం హద్దు మీరినా కేసులు నమోదు చేస్తామన్నారు. ఏం చేయాలి.. ఏం చేయకూడదన్న దానిపై పబ్ల నిర్వాహకులకు పోలీసులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఒక పబ్లో మద్యం సేవించి ఆ నిషాలో మరో పబ్కు వెళ్లి తాగుతామంటే ఇప్పుడు కుదరదు అని చెప్పాలని.. నిషాలో ఉన్న వ్యక్తికి మద్యం సరఫరా చేయకూడదని ఒక వేళ అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పబ్ల నిర్వాహకులకు సమావేశాలు నిర్వహించిన పోలీసులు హద్దుమీరి ప్రవర్తిస్తే బాగుండదని హెచ్చరించారు. ప్రతి పబ్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పబ్ ముందు, పార్కింగ్ ప్లేస్లోనూ సీసీ కెమెరాలు ఉండాలని సూచిస్తున్నారు. పబ్లలో డ్రగ్స్ సరఫరా అయ్యే సూచనలు ఉండటంతో గత పది రోజులుగా టాస్క్ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు గతంలో డ్రగ్స్ సరఫరా చేసిన పెడ్లర్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. వారంతా ఇప్పుడు ఎక్కడున్నారు. ఎక్కడెక్కడ తిరుగుతున్నారు. ఎవరెవరితో మాట్లాడుతున్నారు అన్న అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ నెల 30, 31 తేదీల్లో న్యూ ఇయర్ వేడుకలు జరిగే అన్ని పబ్లపై పోలీసులు డేగ కన్ను వేయనున్నారు. అనుమానితుల కదలికలపై ఇప్పటికే దృష్టి సారించారు. ప్రతి పబ్లోనూ మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గంజాయి సరఫరాదారులపై నిఘా ఉచిన పోలీసులు గతంలో గంజాయి కేసులు నమోదైన వారిపై దృష్టి సారించారు. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత మద్యం సేవించే వారు జాగ్రత్తగా ఇంటికి వెళ్లేలా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని లేని పక్షంలో వారినే బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. నాలుగు పబ్లకు అనుమతి నో... జూబ్లీహిల్స్లోని హార్ట్కప్, అమ్నేషియా, బ్రాడ్వే, బేబీలాన్ పబ్లకు పోలీసులు అనుమతి ఇవ్వడం లే దు. గతంలో ఆయా పబ్లలో జరిగిన గొడవలు, పో లీసు కేసుల కారణంగా వాటిపై ఆంక్షలు విధిస్తూ వేదికలకు అనుమతులు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. సిద్ధమవుతున్న పబ్లు ఇవే... జూబ్లీహిల్స్లో మొత్తం 36 పబ్లు ఉండగా ఇందులో నాలుగింటికి అనుమతులు నిరాకరించారు. కొన్నింట్లో మాత్రం ప్రత్యేక వేడుకలు జరగడం లేదు. అయితే న్యూ ఇయర్ వేడుకల కోసం దరఖాస్తు చేసుకున్న వాటిలో లుఫ్ట్, క్లబ్ రోగ్, పోష్ నాష్, తబలారసా, జోరా, లార్డ్ ఆఫ్ డ్రింక్స్, ప్రోస్ట్, జిందగీ స్కై బార్, ఫోర్జ్ బ్రీవ్, 040 బ్రీవ్, హలో, ఎల్యూజన్, ఎయిర్లైవ్, గ్రీజ్ మంకీ, పోర్ ఫాదర్స్, జైథుమ్, స్టోన్ వాటర్, పోయిస్ట్ తదితర పబ్లు వేడుకలకు అనుమతులు పొందాయి. యువతను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా జాతీయ, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన డీజేలను రప్పిస్తున్నారు. గోవా నుంచి పేరొందిన డీజేలతో పాటు గాయనీ, గాయకులను పిలిపిస్తున్నారు. కొన్ని పబ్లకు బాలీవుడ్ తారలు కూడా వస్తుండటం గమనార్హం.అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి బంజారాహిల్స్: నూతన సంవత్సర వేడుకలను నిర్వహించే ఈవెంట్ ఆర్గనైజర్లు, పబ్లు, బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులు భద్రతా ప్రమాణాలు పాటించాలని, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని వెస్ట్జోన్ డీసీపీ విజయ్కుమార్ అన్నారు. ఈ నెల 31న నూతన సంవత్సర వేడుకల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం పబ్లు, బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పబ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్ల నిర్వాహకులు మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసుకోవాలని, భద్రతా సిబ్బందిని నియమించుకోవాలన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలన్నారు. అన్ని పబ్లు, బార్లు మైనర్లను అనుమతించరాదన్నారు. అర్ధరాత్రి ఒంటి గంటలోగా తమ ప్రాంగణాలను ఖాళీ చేయించాలన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటుచేసుకోవాలన్నారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వెస్ట్జోన్ అడిషనల్ కమిషనర్తో పాటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్ఆర్నగర్ డివిజన్ పోలీసులు పాల్గొన్నారు. -
హైదరాబాద్లో స్పీడ్ లిమిట్ 60 దాటితే ఫైన్.. ఏ రూట్లో తెలుసా?
హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో బైక్ రైడర్లు రయ్..రయ్ అంటూ దూసుకెళ్తున్నారు.. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వీరి స్పీడ్కు అద్దూఅదుపు లేకుండాపోతోంది. దీంతో తరచూ వీరు ప్రమాదాల బారీనపడటమే కాకుండా ఇతరుల ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీంతో వీరికి ముకుతాడు వేసేందుకు ట్రాఫిక్ అధికారులు లేజర్గన్లను ఏర్పాటు చేసి 60కి మించి వేగంతో వెళ్లిన వారికి జరిమానాలు విధిస్తూ ప్రమాదాలు అరికట్టేందుకు చర్యలు చేపట్టారు.బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రహదారులపై రయ్.. రయ్మంటూ మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్న స్పీడ్ రైడర్లకు ట్రాఫిక్ పోలీసులు ‘లేజర్ గన్’తో ముకుతాడు పెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అదుపుతప్పిన వేగంతో దూసుకెళ్లిన వాహనదారులపై కొరడా ఝళిపిస్తున్నారు. లేజర్ గన్ ద్వారా స్పీడ్ లిమిట్ దాటిన వాహనాలను గుర్తించి వారికి జరిమానాలు కూడా విధిస్తున్నారు. ఇటీవల కాలంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ రహదారులపై అతి స్పీడ్ కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో వీటిని అదుపు చేసేందుకు రోడ్డు పక్క న సీక్రెట్గా స్పీడ్ను నమోదు చేస్తూ హద్దులు దాటిన వారిని గుర్తిస్తున్నారు.1324 మందిపై కేసులుదీనిలో భాగంగానే బంజారాహిల్స్ రోడ్డునెంబర్–2లోని కేబీఆర్ పార్కు చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టుకు వెళ్లే రోడ్డులో ట్రాఫిక్ పోలీసులు లేజర్ గన్ ఏర్పాటు చేశారు. ఈ నెల 1వ తేదీ నుంచి స్పీడ్ లిమిట్ దాటిన వారిని గుర్తించి చలాన్లు విధిస్తున్నారు. ఈ రోడ్డులో స్పీడ్ లిమిట్ 60కి మించరాదని నిబంధనలు విధించారు. 18 రోజుల్లో ఇప్పటి వరకు లిమిట్ 60 దాటిన 1324 మందిపై కేసులు కూడా నమోదు చేశారు. ఒక్కొక్కరికీ రూ.1000 చొప్పున జరిమానా విధించారు.చదవండి: ప్యారడైజ్ వద్ద ట్రాఫిక్ కష్టాలకు త్వరలో చెక్..! ప్రతిరోజూ 100 నుంచి 150 మంది వరకు మితిమీరిన వేగంతో లిమిట్ 60 దాటి దూసుకుపోతున్నట్లుగా లేజర్ గన్ ద్వారా తేలింది. ఈ రోడ్లలో స్పీడ్ లిమిట్ 60 దాటితే జరిమానాలు విధిస్తామని పోలీసులు వెల్లడించారు. ప్రతిరోజూ ఇక్కడ ఉంటే ట్రాఫిక్ పోలీసు స్పీడ్గా వెళ్లే వాహనాలపై నిఘా పెడతారని పేర్కొన్నారు. కేబీఆర్ పార్కు నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వైపు వెళ్లే వాహనాలు ఇక నుంచి నిర్దేశించిన స్పీడ్లోనే వెళ్లాలని పేర్కొంటున్నారు. -
హైదరాబాద్ లో భారీ పేలుడు
-
ఉత్సవ్ దీక్షిత్ అరెస్టు
బంజారాహిల్స్: రోడ్డు ప్రమాదానికి కారకుడైన స్టాండప్ కమెడియన్ ఉత్సవ్ దీక్షిత్ (33)ను ఆదివారం బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్డునంబర్–6లో నివసించే ఉత్సవ్ దీక్షిత్ గత నెల 31వ తేదీ అర్ధరాత్రి తన భార్యతో గొడవపడి పోర్షే కారులో బయటకు వచ్చి రాత్రంతా నగరంలో చక్కర్లు కొట్టాడు. కారులో మితిమీరిన వేగంతో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మణికొండ ప్రాంతాల్లో తిరిగాడు. 1వ తేదీ తెల్లవారుజామున 5.45 గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో బంజారాహిల్స్ రోడ్డు నంబర్–12 నుంచి వెళ్తుండగా బసవతారకం కేన్సర్ ఆస్పత్రి సమీపంలో కారు అదుపుతప్పి స్టీరింగ్ లాక్ కావడంతో డివైడర్ను ఢీకొట్టి కేబీఆర్ పార్కు ఫెన్సింగ్ను దాటుకుని చెట్టు పైకి వెళ్లి కిందపడింది. స్వల్ప గాయాలతో ఉత్సవ్ బయటపడి పారిపోయాడు. కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. నిందితుడిపై ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవింగ్ లైసెన్స్ను సీజ్ చేసి రద్దు చేయాల్సిందిగా ఆర్డీఓకు లేఖ రాశారు. పోలీసుల విచారణలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతోనే కారు అదుపు తప్పినట్లు తేలింది. కాగా.. ఉత్సవ్ దీక్షిత్ స్టాండప్ కమెడియన్గా సుపరిచితుడు. పలు కార్యక్రమాల్లో కమెడియన్గా గుర్తింపు పొందాడు. ప్రేమ వివాహం చేసుకున్న ఉత్సవ్ దీక్షిత్ ఇంట్లో భార్యతో గొడవ పడి ఆ కోపాన్ని కారు మీద చూపించినట్లుగా నిర్ధారణ అయింది. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఉద్దేశపూర్వక నిర్లక్ష్యమైతే జైలు తప్పదు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ అక్రమా లపై ఏర్పాటైన విచారణ కమిటీ రూపొందించిన నివేదికను రెండు వారాల్లోగా పిటిషనర్కు ఇవ్వాల ని తాము ఆదేశిస్తే ఐదు నెలలైనా ఇవ్వకపోవడం సహకార శాఖ కమిషనర్ పూర్తి బాధ్యతా రాహిత్యమేనని హైకోర్టు మండిపడింది. ధిక్కరణ పిటిషన్ వేసి నోటీసులు జారీ చేశాక నివేదిక ఇస్తా రా? అంటూ కో–ఆపరేటివ్ సొసైటీస్ కమిషనర్, సహకార సంఘాల రిజిస్ట్రార్ ఎం.హరితను ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో ఇరుపక్షాల వాదనలు వింటామని.. ఒకవేళ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యమైతే శిక్ష తప్ప దని కమిషనర్ను హెచ్చరించింది. కోర్టు ధిక్క రణ ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అధికారులు జైలుకు వెళ్లాల్సిందేనని వ్యాఖ్యానించింది. కోర్టులంటే లెక్కలేనితనం సరికాదని.. న్యాయస్థానాల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులకు ఉంటుందని చెబుతూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.ఇదీ నేపథ్యం..జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ అక్రమాలపై ఏర్పాటైన కమిటీ సమర్పించిన నివేదికను తనకు ఇప్పించాలంటూ సొసైటీ మాజీ కార్యదర్శి మురళీ ముకుంద్ గతంలో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. మెరిట్స్లోకి వెళ్లడం లేదని... 2022 మార్చి 23న విచారణ కమిటీ సమర్పించిన నివేదికను రెండు వారాల్లోగా పిటిషనర్కు ఇవ్వాలని ఈ ఏడాది ఏప్రిల్లో సహకార కమిషనర్ను ఆదేశించింది. అయితే గడువులోగా కమిషనర్ నివేదిక ఇవ్వకపోవడంతో జూన్లో మురళీ ముకుంద్ ధిక్కరణ పిటిషన్ వేశారు. దీనిపై గత విచారణకు స్వయంగా హాజరైన కమిషనర్ హరితపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజా విచారణ సందర్భంగా కమిషనర్ స్పందిస్తూ హైకోర్టు ఆదేశాలు మే 6న అందాయని.. అవి పరిశీలన దశలో ఉండగానే లోక్సభ ఎన్నికలు వచ్చాయని కౌంటర్లో పేర్కొన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలతో పని ఒత్తిడి వల్ల నివేదిక ఇవ్వడంలో ఆలస్యం జరిగిందని.. నివేదికను సెప్టెంబర్ 11న పిటిషనర్కు అందజేశామన్నారు. అయితే ఈ కౌంటర్పై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. దానిపై రిప్లై ఇవ్వాలని పిటిషనర్ను ఆదేశించింది. ఇరుపక్షాల వాదనలు విన్నాక ఏం చేయాలన్నది నిర్ణయిస్తామంటూ విచారణ నవంబర్ 8కి వాయిదా వేసింది. కోర్టుకు హాజరు నుంచి కమిషనర్కు మినహాయింపు ఇచ్చింది. -
‘భూ’చక్రం తిప్పేశారు!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్లో అక్రమాల భూ‘చక్రం’ తిరిగింది. నిబంధనల ప్రకారం సీనియారిటీ ఉన్న సభ్యులకుగానీ, ప్రభుత్వానికి గానీ చెందాల్సిన భూమిని పాలకమండలిలోని ముఖ్యులు పక్కా ప్లాన్తో అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. సొసైటీలోని ముఖ్యులతోపాటు అధికార యంత్రాంగం కూడా ఈ తతంగంలో భాగస్వామ్యం కావడం గమనార్హం. ప్రభుత్వం ఈ సొసైటీకి కేటాయించిన భూమి నుంచి 304/జీ/111 ప్లాట్ను 1988లో సభ్యత్వం నంబర్ 4153గా ఉన్న ఐఏఎస్ నటరాజన్కు కేటాయించారు. నటరాజన్ మరణించిన కొన్నేళ్లకు ఆయన కుమారుడు శంకర్ నారాయణన్ పేరుపై సభ్యత్వ బదిలీ జరిగింది. కానీ ఆయన ఇప్పటివరకు ప్రభుత్వ విలువను చెల్లించి ప్లాట్ను రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు.ఇలాంటప్పుడు సదరు ప్లాట్ను సీనియారిటీ మేరకు తర్వాతి లబ్ధిదారులకు బదిలీ చేసి రిజిస్ట్రేషన్ చేయాలి. కానీ అలా చేయలేదు. 36 ఏళ్లు గడిచాయి. ఇప్పటి పాలకమండలి సభ్యులు ‘భూ’ చక్రం తిప్పారు. అతి ఖరీదైన ఈ ప్లాట్ను తొలుత శంకర్ నారాయణన్ పేరిట, ఆ వెంటనే సర్దార్ దల్జీత్ సింగ్ అనే మరో వ్యక్తి పేరిట ఒక్కరోజులోనే గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ చేశారు. ఇది పూర్తిగా సొసైటీ నిబంధనలకు విరుద్ధం.ప్లాట్ ఓనర్ కాకుండానే..సొసైటీ పాలకవర్గం చకచకా స్థలాన్ని శంకర్ నారాయణన్ పేరు మీదకు, తర్వాత గంటల వ్యవధిలోనే దల్జీత్ సింగ్కు బదిలీ చేయడం గమనార్హం. శంకర్ నారాయణన్కు రిజిస్ట్రేషన్ చేయాలంటే ప్రభుత్వ విలువను సొసైటీకి చెల్లించాల్సిన నేపథ్యంలో.. ఆ మొత్తాన్ని దల్జీత్ సింగ్ బదిలీ చేశారు. జూన్ 28న నారాయణన్ చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ కోసం రూ.25,89,735.. 29న రూ.60,80,550 చెల్లించారు. విచిత్రమేంటంటే అప్పటికి ఆయన ప్లాట్ ఓనర్ కానే కాదు. అలాగే సొసైటీకి చెల్లించాల్సిన రూ.3,40,67,600ను జూలై 1న బదిలీ చేశారు. డాక్యుమెంట్ నంబర్ 4244/2024తో 529 గజాల భూమి శంకర్ నారాయణన్ పేరు మీదకు మారింది. తర్వాత గంటల వ్యవధిలోనే ఆ భూమిని దల్జీత్ సింగ్ పేరిట మార్చే పని మొదలుపెట్టారు.ఇళ్లు నిర్మించకుండా అమ్మకం చెల్లదుసొసైటీలో భూమి పొందిన లబ్ధిదారులెవరైనా 18 నెలల్లో ఇల్లు నిర్మించకుంటే.. దాన్ని రద్దు చేసే అధికారం సొసైటీకి ఉంటుంది. అసలు ఇల్లు నిర్మించకుండా అమ్మడం చెల్లదనేది సొసైటీ నిబంధన కూడా. రిజిస్ట్రేషన్ పత్రాల్లోనూ ఈ విషయాన్ని పేర్కొంటారు. ఇవేమీ పట్టించుకోకుండా దల్జీత్ పేరు మీదకు రిజిస్ట్రేషన్ (డాక్యుమెంట్ నంబర్ 4257/2024) మారిపోయింది. సాధారణంగా ఎవరైనా రిజిస్ట్రార్ కార్యాలయంలో భూమి రిజిస్ట్రేషన్ చేశాక డాక్యుమెంట్లు రావడానికి వారం రోజుల సమయం పడుతుంది. కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే చేతికిచ్చారంటే.. అక్రమంలో అధికారుల పాత్ర ఏమిటో తెలిసిపోతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నారాయణన్ పేరు మీది డాక్యుమెంట్ రాకుండానే సబ్ రిజిస్ట్రార్ దల్జీత్ పేరిట రిజిస్ట్రేషన్కు ఏర్పాట్లు చేయడం గమనార్హం. రిజిస్ట్రేషన్ సమయంలో రూ.8 కోట్లు చెల్లిస్తున్నట్లు పేర్కొన్న దల్జీత్.. రూ.4,25,42,665ను డీడీ రూపంలో నారాయణన్కు బదిలీ చేసినట్టు చూపారు. సొసైటీలోని భూమి నారాయణన్ పేరు మీదకు జూలై 1న రిజిస్ట్రేషన్ కాగా.. అదే రోజున దల్జీత్ పేరు మీదకు మారడం గమనార్హం.నిబంధనలను పక్కకు నెట్టి..హౌసింగ్ సొసైటీ లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం స్థలం మంజూరు చేస్తుంది. కేటాయించిన స్థలంలో గృహ నిర్మాణం చేపట్టాలి. లేదంటే తిరిగి సొసైటీకి స్థలాన్ని అప్పగించాలి. అంటే శంకర్ నారాయణన్ పేరిట స్థలం మారినా.. అందులో ఎలాంటి నిర్మాణం చేపట్టకుండానే దల్జీత్కు విక్రయించడం సొసైటీ నిబంధనలకు విరుద్ధం. అంతేకాదు.. స్థలం బదిలీకి ఒకట్రెండు సంవత్సరాలు వేచిచూడాలి, లేదా సొసైటీలోని తర్వాతి లబ్ధిదారులకు కేటాయించాలని చట్టం చెబుతోంది. దీన్ని సొసైటీ పాలకమండలి పూర్తిగా ఉల్లంఘించింది. రిజిస్ట్రేషన్లు చేసిన సబ్ రిజిస్ట్రార్ కూడా ఈ అంశాన్ని పట్టించుకోకపోవడంతో అధికారులకూ ఈ అక్రమాల్లో భాగస్వామ్యం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. కోట్ల రూపాయల అక్రమం!దల్జీత్సింగ్ తన పేరుమీదకు మారిన స్థలంలో నిర్మాణం ప్రారంభించేందుకు జూన్ 18న జీహెచ్ఎంసీకి మార్టిగేజ్ చేశారు. సొసైటీ నుంచి నారాయణన్ పేరిట జరిగిన రిజిస్ట్రేషన్లో 529 గజాల ప్లాట్కు గజానికి రూ.64,400 చొప్పున మొత్తం రూ.3,40,67,600గా లెక్కగట్టారు. రూ.25,89,720 స్టాంప్ డ్యూటీగా చెల్లించారు. ఇదే ప్లాట్ను దల్జీత్ పేరిట మార్చిన రిజిస్ట్రేషన్లో మార్కెట్ విలువ చదరపు గజానికి రూ.1,54,228 చొప్పున లెక్కించారు. స్టాంపు డ్యూటీగా రూ.60,80,550 చెల్లించారు. అంటే మొత్తం ప్లాట్ ధర రూ.8 కోట్లుగా చూపారు. (జూన్ 8న ఆర్టీజీఎస్ ద్వారా రూ.25,89,735.. జూన్ 29న ఆర్టీజీఎస్ ద్వారా రూ.3,40,67,600.. జూలై 1న డీడీ రూపంలో రూ.4,25,42,665.. టీడీఎస్కు రూ.8 లక్షలు చెల్లించినట్టు చూపారు). నిజానికి జూబ్లీహిల్స్లో బహిరంగ మార్కెట్ విలువ చదరపు గజానికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంది. అంటే ఈ భూమి విలువ రూ.16 కోట్లకుపైనే! అందులో రూ.8 కోట్లు లెక్కకు వచ్చిందని, మిగతా సొమ్ము సంగతి తేల్చాలనే డిమాండ్ వస్తోంది. ఈ వ్యవహారంపై పలువురు ‘ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)’ను ఆశ్రయించే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసింది. -
సొసైటీలో ‘సభ్యత్వ’ బేరం!
సాక్షి, హైదరాబాద్: ‘‘రండి బాబు.. రండి.. అపార్ట్మెంట్ ఫ్లాట్లు కొనండి.. జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో భాగస్వాములు కండి.. ఇక్కడ కొనండి.. అక్కడ సభ్యత్వం పొందండి..’’ ఎన్నో అక్రమాలకు కేరాఫ్గా మారిన జూబ్లీహిల్స్ సొసైటీ పాలకవర్గం చేస్తున్న ప్రచారమిది. సొసైటీకి ఏ మాత్రం సంబంధం లేని, ఇంకా కట్టని, అసలు ఎలాంటి అనుమతుల్లేని వెంచర్లో ఫ్లాట్లను అంటగట్టేందుకు ప్రయత్నం చేస్తోంది. 13.713 ఎకరాలు.. 1,900 ఫ్లాట్లు.. 40 ఫ్లోర్లు.. రివర్ వ్యూ, హైరైజ్ అంటూ జూబ్లీహిల్స్–4 పేరిట విక్రయాలు చేస్తోంది. ఇదంతా నమ్మి రూ.లక్షలు పోసి కొనుగోలు చేస్తే.. ఏదో ఒకరోజు ‘హైడ్రా’ ఎటాక్ తప్పని పరిస్థితి. ఈ వెంచర్కు సంబంధించి స్థానికులు, కొందరు సభ్యులు పలు కీలక వివరాలు వెల్లడించారు. జూబ్లీహిల్స్–4 వెంచర్స్ పేరుతో.. ‘జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ (జేహెచ్సీహెచ్బీఎస్)’ పాలకవర్గం కొత్త దందాకు తెర తీసింది. ఓ ప్రైవేట్ వెంచర్లో ప్రపోజ్డ్ డెవలపర్గా ప్రవేశించి.. ఫ్లాట్లు విక్రయించే పని చేపట్టింది. ఫ్లాట్లు అమ్మేందుకు భారీ స్కెచ్ వేసింది. ఎంతో డిమాండ్ ఉన్న ‘జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ’లో కొత్తగా సభ్యత్వాలను మొదలుపెట్టింది. సభ్యత్వం కావాలంటే.. ప్రైవేట్ వెంచర్లో ఫ్లాట్ కొనాలని కొర్రీపెట్టి, అంటగడుతోంది. సొసైటీ నుంచి ఒక్క రూపాయి కూడా వినియోగించడం లేదని పాలకవర్గం చెప్తున్నా.. ఇక్కడ సభ్యత్వాలు ఇచ్చే సమయంలోనే వెంచర్ తెరపైకి ఎలా వచ్చింది? అది ప్రైవేట్ వెంచర్ అయినప్పుడు సొసైటీ ఎందుకు విక్రయిస్తోంది? అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీని వెనుక వందల కోట్ల స్కామ్ ఉందంటూ కొందరు ఆరోపిస్తున్నారు. ఫ్లాట్ల అమ్మకాలకు సంబంధించి చదరపు అడుగు (ఎస్ఎఫ్టీ)కు ఇంత అన్న లెక్కన కొందరి జేబుల్లోకి సొమ్ము చేరేలా తతంగం నడిపిస్తున్నారనే చర్చ సాగుతోంది. అందుకే కొత్తగా సభ్యత్వం కోసం వస్తున్నవారికి ‘‘దాదాపు 15 వేల కోట్ల ఆస్తులపై మీకు హక్కులు వస్తాయి. క్లబ్కు వెళ్లొచ్చు. స్కూల్లో మీ పిల్లలను చదివించొచ్చు. కమ్యూనిటీ సెంటర్ వంటివి వినియోగించుకోవచ్చు..’’ అంటూ ప్రచారం చేస్తున్నారని సభ్యులు చెప్తున్నారు. ఎలాంటి అనుమతులు లేని ఫేజ్–4లో ఫ్లాట్ కొనుగోలు చేయాల నే షరతు పెట్టారని, భవిష్యత్లో అన్ని అనుమతులు రా కుంటే పరిస్థితి ఏమిటనేది ఎక్కడా పేర్కొనలేదని అంటున్నారు. ఇదంతా తెలియని కొందరు మాత్రం సిటీ మధ్య లోని ఆస్తుల్లో భాగస్వాములం కాబోతున్నామనే ఆశతో సొసైటీ పాలకవర్గం బుట్టలో పడుతున్నారని చెప్తున్నారు. మాకే ఇంకా స్థలాలు ఇవ్వలేదంటూ.. మరోవైపు దశాబ్దాలుగా సొసైటీలో సభ్యులుగా ఉన్న తమకే స్థలాలు ఇవ్వలేదని.. ప్రైవేట్ వెంచర్లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఇక్కడ రూ.5 లక్షలు తీసుకుని సభ్యత్వం ఇవ్వడమేంటని కొందరు సభ్యులు మండిపడుతున్నారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కూడా తమ సొసైటీ సభ్యులుగా ఉన్నా.. ఈ అక్రమాలపై స్పందించడం లేదేమని ప్రశ్నిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఫేజ్–4 బ్రోచర్ను నేరుగా మంత్రి తుమ్మలతోనే ఆవిష్కరింపజేశారు. దీనివల్ల ఇబ్బందులు, అనుమానాలు ఉండవనే ఎత్తుగడ ఉన్నట్టు స్పష్టమవుతోందని సొసైటీ సభ్యులు చెప్తున్నారు. జనం ఫ్లాట్ల కొనుగోలుకు ముందుకొస్తారని, అధికారులు జోక్యం చేసుకోకుండా ఓ సంకేతం ఉంటుందని అంటున్నారు. నిజానికి ఇక్కడి మోసాలు, అక్రమాలు మంత్రికి తెలియకుండా తప్పుదారి పట్టించారని ఆరోపిస్తున్నారు. జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ సొసైటీని రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ సొసైటీ మార్చారని వాపోతున్నారు. ఒక్కో షేర్కు రూ.300 చొప్పున వసూలు చేసి.. రూ.15,000 కోట్ల ఆస్తులపై హక్కులు ఎలా కలి్పస్తారని కొందరు సభ్యులు ప్రశి్నస్తున్నారు. సొసైటీ మొత్తం సభ్యులు 5,000 మంది అనుకున్నా.. ఒక షేర్ కొన్న కొత్త సభ్యుడి వాటా సుమారు రూ.30 లక్షలు అవుతుందని... ఇలా ఇవ్వడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏమిటా వెంచర్.. ఎక్కడ? నార్సింగి పరిధిలోని మంచిరేవుల వద్ద టింబర్ చెరువును ఆనుకుని జూబ్లీహిల్స్ ఫేజ్–4 పేరుతో చేపడుతున్న ఈ వెంచర్కు రహదారి వివాదం ఉంది. దేవాదాయ శాఖ భూముల్లోంచి దారితీసే ప్రయత్నం చేయగా.. స్థానికులు అడ్డుకున్నారు. వెంచర్కు అనుమతి రావాలంటే దారి చూపించాలి. అది సాధ్యం కాదు గనుక వెంచర్ ఏర్పాటు కలేనని స్థానికులు అంటున్నారు. ఎవరైనా వాస్తవాలు తెలుసుకున్నాకే కొనుగోలు చేయాలని స్పష్టం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులకు ఇదంతా తెలిసినా.. వెంచర్ బ్రోచర్ను మంత్రి ఆవిష్కరించడంతో ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నారని సమాచారం. అలాగే వదిలేస్తే భవిష్యత్లో హైడ్రా దృష్టిలో పడితే ఎలాగని, తమ ఉద్యోగానికి ఎసరొచ్చే పరిస్థితి వస్తుందేమోనని కలవరపడుతున్నారు.జవాబు లేని ప్రశ్నలెన్నో.. » రహదారే లేకుండా హెచ్ఎండీఏ నుంచి వెంచర్కు అనుమతి ఎలా వస్తుంది? » అనుమతి లేని వెంచర్లో ప్లాట్లు తీసుకోవాలని సభ్యులపై ఒత్తిడి ఎందుకు? » షరతు విధిస్తూ సభ్యత్వ నమోదు ఫారం ఇస్తున్నా సహకార శాఖ అధికారులెక్కడ? » ఇలా అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నా సహకార శాఖ అధి కారులు కళ్లు మూసుకుని కూర్చోవడం వెనుక ఏం జరుగుతోంది?మా భూమిలో నుంచి రోడ్డు లేదు మంచిరేవుల రెవెన్యూ పరిధిలో జూబ్లీహిల్స్ ఫేజ్–4 పేరుతో వస్తున్న వెంచర్కు ఉత్తరం వైపు నుంచి 40 అడుగుల రోడ్డు మాత్రమే ఉంది. ఆ రోడ్డుతో అనుమతులు రావనే ఉద్దేశంతో.. 70ఏళ్లుగా సాగు చేసుకుంటున్న సర్వే నంబర్ 293లోని దేవాదాయ శాఖ భూమిలో నుంచి వంద అడుగుల రోడ్డు ఉన్నట్టు చూపుతూ హెచ్ఎండీఏ, ఇతర అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇప్పటికే రోడ్డు వేసేందుకు ప్రయతి్నస్తే అడ్డుకున్నాం. వారికి అనుమతులు రాకుండా హెచ్ఎండీఏలో ఫిర్యాదు చేస్తాం. ఇలాంటి అనుమతులు లేని వెంచర్లలో ఫ్లాట్లు కొని మోసపోవద్దు. – పి.సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్, మంచిరేవులప్రైవేటు కేసులు, రోడ్డు డాక్యుమెంట్లు చూసుకోవాలి మంచిరేవులలో సర్వే నంబర్ 234, 236, 237, 263, 264, 265, 266, 267లలో ఉన్న భూమి పట్టాభూమి. దానికి ఉత్తరం వైపు గ్రీన్ఫీల్డ్ లే–అవుట్లో నుంచి రోడ్డు ఉంది. రెవెన్యూపరంగా కేసులు లేవు. ప్రైవేటుగా ఉన్న కేసులు, రోడ్డు సౌకర్యం, ఇతర వివరాల డాక్యుమెంట్లను పరిశీలించుకోవాలి. కొంత మేర ఇటికిన్ చెరువు బఫర్ ఈ భూమికి తగిలి ఉంటుంది. ఇటీవల దేవా దాయ శాఖ భూమిలో నుంచి రోడ్డు ఏర్పాటు చేసేందుకు ప్రయతి్నస్తే స్థానికులు అడ్డుకున్నారు. కోర్టుల్లో కేసులు ఉన్నాయనే విషయం ప్రచారంలో ఉంది. – నర్రా శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్, గండిపేట మండలం -
Peddamma Temple: అమ్మలగన్నమ్మ.. పెద్దమ్మ
బంజారాహిల్స్: జంట నగరాల్లోనే జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి అటు భక్తుల రాకతోనూ, ఇటు ఆదాయంలోనూ ‘పెద్దమ్మ’గా దినదిన ప్రవర్ధమానమై వర్ధిల్లుతోంది. భక్తుల కోర్కెలు నెరవేర్చడంలోనే కాకుండా హుండీ ఆదాయంలోనూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నెంబర్–1 స్థానంలో కొనసాగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా చూస్తే అటు భక్త జనసందోహంలోనూ, ఇటు ఆదాయ ఆర్జనలోనూ పెద్దమ్మ గుడి ఏడో స్థానంలో నిలిచింది. యేటా ఆదాయం పెరుగుతూ భక్తులను మరింతగా ఆకర్షిస్తూ ఈ ఆలయం వెలుగొందుతోంది. పెద్దమ్మ గుడి వార్షిక నికర ఆదాయం రూ.13 కోట్లు ఉండగా ఫిక్స్డ్ డిపాజిట్ల రూపేణా రూ.25 కోట్లు ఉన్నాయి. అమ్మవారికి 15 కిలోల బంగారు వజ్రాభరణాలు ధగధగలాడుతూ భక్తుల కొంగుబంగారం అమ్మవారు కీర్తిప్రతిష్టలను మూటగట్టుకుంటున్నది.ప్రసాద విక్రయాలు, ఆదాయంలో.. హుండీ ఆదాయం ప్రతినెలా రూ.50 నుంచి రూ.60 లక్షల వరకూ వస్తుంది. ప్రసాద విక్రయాల్లోనూ ఈ ఆలయం నెంబర్–1 స్థానంలో ఉంటుంది. రోజుకు 8 క్వింటాళ్ల పులిహోర అమ్ముతుండగా, 12 వేల లడ్డూలు విక్రయిస్తున్నారు. వారంలో మంగళ, శుక్ర, శని వారాల్లో మూడు సార్లు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. యేటా మూడు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. వార్షిక రథోత్సవం, శాకాంబరి ఉత్సవాలు, దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు.. ఈ మూడు పండుగలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఒక్క ఆదివారం రోజే 40 వేల మంది దాకా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారికి మొక్కలు చెల్లించుకుంటున్నారు. -
ఘనంగా సమాజ్ వాదీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: సమాజ్ వాదీ పార్టీ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం జూబ్లీహిల్స్లో ఘనంగా జరిగాయి. గ్రేటర్ హైదరాబాద్ ఆ పార్టీ నేత దండు బోయిన నిత్య కళ్యాణ్ యాదవ్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ డివిజన్లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 దుర్గా భవాని నగర్ బస్తీలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కళ్యాణ్ యాదవ్ మాట్లాడుతూ సమాజ్వాది పార్టీ ఆవిర్భావ దినోత్సవంతో పాటు దసరా పండుగ నేపథ్యంలో పేదల మధ్య వేడుకలు జరుపుకోవాలని ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా 300 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేస్తామని.. తెలంగాణలో రాజ్యాధికారం లక్ష్యంగా పనిచేస్తామన్నారు.త్వరలోనే నగరవ్యాప్తంగా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఏ విధంగా అయితే విజయదుందిబి మోగించారో.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే తరహాలో విజయాన్ని నమోదు చేసి సీఎంగా అఖిలేష్ యాదవ్ ప్రమాణస్వీకారం చేస్తారని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో తెలంగాణ మాదిగ దండోరా ఫౌండర్ ప్రెసిడెంట్ నర్సింగ్ రావు, బస్తీ నేత శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
‘జూబ్లీహిల్స్’.. అక్రమాలు ఫుల్!
సాక్షి, హైదరాబాద్: సహకార హౌసింగ్ సొసైటీలు ఏవైనా.. సొసైటీలో ఇల్లు లేని వారికి తక్కువ ధరతో స్థలం అందేలా చూడటం, సభ్యులు చెల్లించే సొమ్మును, వారి ప్రయోజనాలను పరిరక్షించడం వాటి విధి. కానీ హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అందుకు పూర్తి విరుద్ధంగా తయారైంది. 1962లో ఎంతో మంచి ఉద్దేశంతో ఏర్పాటైన ఈ సొసైటీ.. కొన్నేళ్ల నుంచి రూట్ మార్చుకుంది. చట్టాన్ని పట్టించుకునేది లేదు.. నిబంధనలను అమలు చేసేది లేదు.. పాలక వర్గానికి తోచిందే చట్టం, వారు పెట్టిందే నిబంధన అన్నట్టు మారింది.కొందరు వ్యక్తులు స్వలాభాపేక్షతో సొసైటీని ఆర్థిక వనరుగా మార్చుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారు కొన్నేళ్లుగా సొసైటీని తమ చెప్పుచేతల్లో పెట్టుకున్నారని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో పాతవారికి స్థలాలు మంజూరు కాకుండానే కొత్తగా సభ్యులను చేర్చుకునే అక్రమానికి తెరలేపారని మండిపడుతున్నారు. దీనికోసం దశాబ్దాలుగా ఉంటున్న వారిని సొసైటీ నుంచి తొలగించేందుకు ప్రయతి్నంచారని.. సంబంధిత అధికారులు దీన్ని తిరస్కరించారని సమాచారం. తమ పథకం బెడిసికొట్టినా.. కొత్త సభ్యత్వాలను మాత్రం ప్రారంభించడం గమనార్హం. టీవీ–5 చానల్ అధినేత కుమారుడు రవీంద్రనాథ్ అధ్యక్షుడిగా ఉన్న ఈ జూబ్లీహిల్స్ సొసైటీ లీలలు మరెన్నో ఉన్నాయని కొందరు సభ్యులు పేర్కొంటున్నారు. సహకార సూత్రాల మేరకు ఏర్పాటై.. ‘ఆంధ్రప్రదేశ్ కో–ఆపరేటివ్ సొసైటీ చట్టం’కింద 1962 జూలై 7న ‘జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ (జేహెచ్సీహెచ్బీఎస్)’రిజిస్టర్ అయింది. సొసైటీ ఏర్పడినప్పుడు సభ్యుల సంఖ్య 300 మంది. సహకార సూత్రాలకు అనుగుణంగా సభ్యుల ప్రయోజనాలు కాపాడుతూ.. భూమి కొనుగోలు, అభివృద్ధి చేయాలన్నది నిబంధన. సొసైటీ కోసం 2,500 షేర్లను, ఒక్కో షేర్కు రూ.100 చొప్పున నిర్ణయించి.. మొత్తంగా రూ.2.5 లక్షల మూలధనంతో సొసైటీని ప్రారంభించారు. నిబంధనల మేరకు జూబ్లీహిల్స్లోనే ఈ సొసైటీ కార్యకలాపాలు నిర్వహించాలి.సభ్యుల్లో ఎవరైనా తన పేరిట, తన భార్య, పిల్లల పేరు మీద షేర్లు కొనుగోలు చేయవచ్చు. అయితే సొంత ఇల్లు లేనివారే సభ్యుడిగా ఉంటారు. 1964లో ప్రభుత్వం షేక్పేట్ సర్వే నంబర్ 403లో 1,195 ఎకరాలు, హకీంపేట్ సర్వే నంబర్ 102లో 203 ఎకరాలు కలిపి మొత్తంగా 1,398 ఎకరాలను కేటాయించింది. ఇందులో.. 1971లో 1,345.40 ఎకరాలను, 1972లో 40.67 ఎకరాలను కలిపి.. 1,386.07 ఎకరాలను సొసైటీకి అందజేసింది. సొసైటీ ఈ భూమిలో 1984 నుంచి 1991 మధ్య 3,035 మంది సభ్యులకు ప్లాట్లను అందజేసింది. సభ్యులకు ఒకసారి ప్లాట్ అందినా, లేదా సభ్యుడయ్యాక హైదరాబాద్ నగరంలో ఇల్లు ఉన్నా వారు మరో ప్లాట్ పొందేందుకు అనర్హులు. విక్రయించడం చట్టవిరుద్ధం ఒకరి ప్లాట్ను మరో సభ్యుడికి బదిలీ చేయడంగానీ, అసలు సభ్యత్వమే లేని వారికి విక్రయించడంగానీ చట్టవిరుద్ధం. ఒకవేళ ఏవైనా అనివార్య కారణాలతో సభ్యుడెవరైనా ప్లాట్ బదిలీ చేయాలని భావిస్తే.. దాన్ని సొసైటీకి అప్పగించాలి. ప్లాట్ పొందేటప్పుడు వారు చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా సొసైటీ తిరిగి చెల్లించాలి. ఈ స్థలాన్ని సొసైటీలో సీనియారిటీ ప్రకారం వెయిటింగ్లోని లబ్ధిదారులకు మంజూరు చేయాలి. వీరి నుంచి ప్రభుత్వ మార్కెట్ విలువ, ఇతర చార్జీలు వసూలు చేయవచ్చు. మేనేజింగ్ కమిటీ అనుమతి లేకుండా సభ్యుడు స్థలాన్ని విక్రయించడానికి వీలులేదు. అలా ఎవరైనా విక్రయిస్తే అది చట్టవిరుద్ధంగా, కొనుగోలు చేసినవారిని ఆక్రమణదారుగా పరిగణిస్తారు. ఇక సొసైటీలోని సభ్యులందరికీ ఇంటి స్థలం మంజూరుకాకుండా.. కొత్తగా సభ్యులను తీసుకోవద్దని నిబంధన చెబుతోంది. ఉదాహరణకు 90 మందికి స్థలాలు ఇచ్చే అవకాశం ఉంటే 100 మందిని సభ్యులుగా తీసుకోవాలి. లబి్ధపొందని వారు 10 శాతానికి మించి ఉండటానికి వీలులేదు. కానీ జూబ్లీహిల్స్ సొసైటీలో స్థలాలు అందనివారు 30 శాతానికి పైనే.. 800 మందిని తొలగించే ప్రయత్నం.. సొసైటీలో కేవైసీ (పూర్తి చిరునామా, ఇతర వివరాలు) లేదని, జనరల్ బాడీ సమావేశానికి హాజరుకావడం లేదని.. ఎక్కడ ఉంటున్నారో అడ్రస్ కూడా లేదని కారణాలు చూపుతూ దశాబ్దాలకుపైగా ఉన్న 800 మంది సభ్యుల తొలగింపునకు సొసైటీ పాలకవర్గం ఎత్తులు వేసింది. 2024 మార్చి 24లోగా కేవైసీ అందజేయాలంటూ సభ్యులను ఆదేశించింది. అనుకున్నదే తడవుగా వివరాలు ఇవ్వని 800 మందిని తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. జాబితా కూడా సిద్ధం చేసి పంపగా.. హౌసింగ్ అధికారులు దీనికి ససేమిరా అనడంతో తొలగింపు ప్రక్రియకు బ్రేక్ పడింది. అయితే అంగ బలం, ఆర్థిక బలంతో ఈ తొలగింపు జాబితాకు అధికారులు ఆమోదముద్ర వేసేలా తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. సొసైటీ పాలకవర్గం తీరును నిరసిస్తూ కొందరు సభ్యులు కరపత్రాలు వేసి, పంచినా కూడా.. వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. ‘రియల్’దందా కోసమే.. సొసైటీలో అసలు స్థలమే లేనప్పుడు సభ్యులను తొలగించడం ఎందుకు? కొత్త వారిని చేర్చుకోవడం ఎందుకు? అనే ప్రశ్నలూ వస్తున్నాయి. ఇక్కడే సదరు అక్రమార్కులు చక్రం తిప్పడం ప్రారంభించారు. కొత్త సభ్యత్వాల పేర రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టారు. సొసైటీకి సంబంధం లేని వెంచర్లో అమ్మకాలు ప్రారంభించారు. అభివృద్ధి ప్రతిపాదనలకే పరిమితమంటూ అంటగడుతున్న ఆ వెంచర్ ఏంటి? ఎక్కడ ఉంది? ప్లాట్ల అమ్మకాల ‘రియల్’కహానీ రెండో భాగంలో.. ప్రస్తుతం సొసైటీలో మొత్తం సభ్యుల సంఖ్య: 4,962 మంది వీరిలో స్థలం పొందిన లబి్ధదారులు: 3,035 మంది ఇంకా ప్లాట్లు రానివారు: 1,927 మంది మూడు దశాబ్దాలుగా ఎదురుచూపులే.. జూబ్లీహిల్స్ సొసైటీలో స్థలం మంజూరు కోసం మూడు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నవాళ్లు వందల సంఖ్యలో ఉన్నారు. ఇప్పటివరకు వారికి స్థలం అందించే దిశగా ఎలాంటి చర్యలు లేవు. మొత్తం 1,927 మంది ఎదురుచూస్తుండగా.. పలు కారణాలతో 800 మందిని తొలగించారు. వారి స్థానంలో నిబంధనలకు విరుద్ధంగా 800 మందిని తీసుకోవడానికి ప్రయతి్నస్తున్నారు. మిగిలిన 1,145 మందికి స్థలాలు వచ్చే వరకు కొత్త వారిని చేర్చుకోవద్దని డిమాండ్ చేస్తున్నాం. క్లబ్ కోసమంటూ కొత్త వారిని చేర్చుకుంటే ఒత్తిడి పెరిగి, అసౌకర్యంగా మారుతుంది. – ప్రభాకర్రావు, సొసైటీ సభ్యుడు10 శాతానికి మించి ఉండొద్దు.. కో–ఆపరేటివ్ చట్టంలోని సెక్షన్–19 ప్రకారం స్థలాలు ఉంటేనే కొత్త సభ్యులను చేర్చుకోవాలి. ప్రస్తుతానికి సొసైటీ వద్ద ఖాళీ స్థలం లేదు. అంతేకాదు స్థలం పొందని సభ్యులు 10శాతానికి మించి ఉండకూడదని హౌసింగ్ సొసైటీ నిబంధన. కొత్తవారి నుంచి షేర్ వ్యాల్యూ కేవలం రూ.300 తీసుకుని దాదాపు రూ.15 వేల కోట్ల విలువైన ఆస్తులపై వారికి కూడా హక్కులు వర్తింపజేస్తున్నారు. క్లబ్, స్కూల్, కమ్యూనిటీ సెంటర్ ఇలా అన్నింటిలో వారిని భాగస్వాములను చేస్తున్నారు. ఇది ఎంత వరకు సమంజసం? – విజయభాస్కర్రెడ్డి, సొసైటీ సభ్యుడుసొసైటీది సహాయక పాత్ర మాత్రమే.. వివిధ కారణాలతో సొసైటీ నుంచి 800 మంది వెళ్లిపోయారు. వారికి నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. జనరల్ బాడీ ఆమోదంతోనే వారిని తొలగించాం. కొత్త సభ్యుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. 800 మందికి మించి తీసుకోం. వీరితోపాటు ఇంకా స్థలాలు రానివారు దాదాపు 1,200 మంది ఉన్నారు. ఈ రెండు వేల మంది కలిసి నిర్మించుకుంటున్న వెంచర్ జూబ్లీహిల్స్ ఫేజ్–4. కాస్ట్ టు కాస్ట్ (ఖర్చులు) ధరకే వీరికి ఫ్లాట్లు అందనున్నాయి. వీరంతా సొసైటీ సభ్యులే అయినందున మేం ఫెసిలిటేటర్గా ముందుకు వచ్చాం. వెంచర్ను నిపుణులైన కమిటీ పర్యవేక్షిస్తుంది. సొసైటీకి సంబంధించి ఒక్క రూపాయి కూడా వెంచర్ కోసం ఖర్చు చేయడం లేదు. చట్టప్రకారం, జనరల్ బాడీ అనుమతితోనే చర్యలు చేపడుతున్నాం. – రవీంద్రనాథ్, సొసైటీ అధ్యక్షుడు సభ్యత్వం తొలగింపుపై చట్టం ఏం చెబుతోంది? చట్టప్రకారం ఎవరి సభ్యత్వమైనా తొలగించాలంటే.. ఎందుకు తీసివేస్తున్నామో కారణాలు వెల్లడిస్తూ వారికి నోటీసులు జారీ చేయాలి. తర్వాత వారి వివరణను పరిశీలించాలి. దానిపై సంతృప్తి చెందకుంటే తీసివేతపై మేనేజ్మెంట్ కమిటీ నిర్ణయం తీసుకోవచ్చు. ఒకవేళ ఈ తొలగింపు చట్ట వ్యతిరేకమని సభ్యుడు భావిస్తే.. ట్రిబ్యునల్ను, ఆ తర్వాత కోర్టును ఆశ్రయించవచ్చు. అయితే తొలగింపుపై సొసైటీ నోటీసులు జారీచేసినా అవి చాలా మందికి అందలేదని.. వారి వివరణ కూడా రాకుండానే, తొలగిస్తూ జాబితాను సిద్ధం చేశారని సమాచారం. ఇప్పటివరకు జూబ్లీహిల్స్ సొసైటీ సభ్యత్వం తొలగింపునకు సంబంధించి ఒక ఫిర్యాదు అందినట్టు తెలిసింది. ఇక కొత్తగా సభ్యులను చేర్చుకునే దానిపై కమిటీ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ సొసైటీలో లబి్ధపొందని వారు 10శాతం దాటకుండా ఉండాలి. అలాంటిది స్థలం దక్కనివారు ఇప్పటికే 30శాతం ఉన్నా.. కొత్త వారిని ఎలా తీసుకుంటున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై సొసైటీని వివరణ కోరగా.. వివిధ కారణాలతో 800 మందిని తొలగించామని, ఆ స్థానంలో కొత్తవారిని తీసుకుంటున్నామని వెల్లడించడం గమనార్హం. -
హైదరాబాద్లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం మొదలైంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్. కూకట్పల్లి, నిజాంపేట్, జేఎన్టీయూ, మూసాపేట్లో భారీ వర్షం కురుస్తోంది. కోఠి, వనస్థలిపురం, ఎల్బీనగర్లో కుండపోత వాన పడుతోంది. తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, దిల్సుఖ్నగర్, చంపాపేట్, సైదాబాద్, సరూర్నగర్, కోఠి, చాంద్రయణగుట్ట, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. నగరంలో కురుస్తున్న వర్షంతో రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. @balaji25_t Rain in amberpet 🌧️🌨️⚡⚡ pic.twitter.com/Q7cKQJGsQm— ஷேக் அஃப்ரோஸ் ഷെയ്ഖ് അഫ്രോസ്✨✨ (@iamshaikmoun) September 23, 2024Heavy Rains ⛈️ #HyderabadRains ⛈️⛈️@HiHyderabad @swachhhyd @PeopleHyderabad #Hyderabad #WeatherUpdate #Rains #thunderstorm #video #musheerabad #Telangana pic.twitter.com/Of1CGjxl17— Younus Farhaan (@YounusFarhaan) September 23, 2024 -
సీఎం రేవంత్ ఇంటి సమీపంలో బ్యాగ్ కలకలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇంటికి సమీపంలో ఓ బ్యాగ్ కలకలం రేపింది. జూబ్లీహిల్స్లోని ఆయన ఇంటికి సమీపంలో అనుమానాస్పదంగా ఓ బ్యాగ్ కనిపించడంతో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం స్వాధీనం చేసుకుంది. బ్యాగ్ను అక్కడి నుంచి మరో ప్రాంతానికి తరలించి తనిఖీ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: ట్యాంక్బండ్ వద్ద ఉద్రిక్తత.. గణేశ్ ఉత్సవ సమితి Vs పోలీసులు -
నో స్ట్రింగ్స్ కాఫీ ఫెస్టివల్..
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన నో స్ట్రింగ్స్ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో కాఫీ ప్రియుల కోసం నగరంలో తొలిసారిగా ది ఇండియన్ కాఫీ ఫెస్టివల్ కొలువుదీరింది. జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటైన ఈ ఫెస్ట్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆసియాలోనే తొలి కాఫీ మహిళగా పేరొందిన సునాలిని మీనన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఫెస్టివల్లో భాగంగా కాఫీ ఆర్ట్ సెషన్స్, బరిస్తా డిస్ప్లే, నిపుణుల చర్చలు.. తదితర విశేషాంశాలకు చోటు కల్పించారు. అదే విధంగా కుటుంబాలు, చిన్నారులు, పెట్స్ కోసం విభిన్న రకాల ఈవెంట్స్ కూడా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. కరాఫా కాఫీ, ట్రూ బ్లాక్ కాఫీ, బిగ్ స్టార్ కేఫ్, అరకు కాఫీ, ఎంఎస్పీ హిల్ రోస్టర్స్.. తదితర ప్రముఖ బ్రాండ్లన్నీ కొలువుదీరాయి. ఈ ఫెస్టివల్ ఈ నెల 15 వరకూ కొనసాగుతుంది. -
జూబ్లీహిల్స్లో ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ క్లబ్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రులు, మెగాస్టార్ సందడి (ఫొటోలు)
-
వైద్యరంగంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల పాత్ర కీలకం
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు వైద్యసేవలు అందించడంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు రెండూ కీలకపాత్ర పోషించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఈ విషయంలో ప్రైవేటు రంగం మరింత బాధ్యతాయుతంగా వైద్యసేవలు అందించాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఫిలింనగర్లో యూడెర్మ్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ రెండో శాఖను ఆదివారం ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ఇటీవలి కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికీ జుట్టు రాలడం, ఇతర చర్మ సంబంధిత ఇబ్బందులు వస్తున్నాయని... వాటన్నింటికీ సమగ్రంగా వైద్యసేవలు అందించడానికి వీలుగా ఒకేచోట అన్నిరకాల వైద్యం చేసేందుకు ఈ ప్రాంతంలో యూడెర్మ్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ను ప్రారంభించడం ఎంతో సంతోషకరమని ఆయన అన్నారు. డాక్టర్ సృశాంత్ లాంటి యువకులు ఈ రంగంలో అత్యాధునిక పద్ధతులు పాటిస్తూ ప్రజలకు తమవంతు సేవలు అందించాలని సూచించారు. ఈ దిశగా డాక్టర్ సృశాంత్, ఆయన బృందం మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు.ఆస్పత్రి ప్రారంభోత్సవం సందర్భంగా డాక్టర్ సృశాంత్ ముక్కా మాట్లాడుతూ, “ఇప్పటికే కోకాపేటలో ఒక ఆస్పత్రి నిర్వహిస్తున్న మేము.. ఇప్పుడు నగరవాసులకు కూడా సేవలందించేందుకు వీలుగా జూబ్లీహిల్స్లో సువిశాల ప్రాంగణంలో ఆస్పత్రిని ఏర్పాటుచేశాం. ఇక్కడ కేవలం ఒక్కరే కాకుండా.. అన్నిరకాల చర్మ, శరీర, జుట్టు సమస్యలకు సంబంధించిన వైద్యులు, మహిళా వైద్యులు, కాస్మెటాలజిస్టులు, డెర్మటాలజిస్టులు కూడా అందుబాటులో ఉంటారు. అందువల్ల సాధారణ చర్మసంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి సోరియాసిస్ లాంటి తీవ్ర సమస్యల వరకు.. అలాగే జుట్టు రాలడం, పూర్తిగా ఊడిపోవడండ లాంటి తీవ్రమైన ఇబ్బందుల వరకు అన్నింటికీ చికిత్సలు అందిస్తాం. అలాగే కాస్మెటిక్ చికిత్సలు కూడా ఇక్కడ అందించగలం. శరీరంలోని గుప్తభాగాలకు సంబంధించిన సమస్యలు, ఇన్ఫెక్షన్లు ఉన్నా.. వాటికి సైతం సమర్థవంతంగా చికిత్సలు చేయగల సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి.గతంలో 50-60 ఏళ్లు దాటిన తర్వాతే జుట్టు రాలడం, ఊడిపోవడం, బట్టతల ఏర్పడటం లాంటి సమస్యలు ఉండేవి. కానీ ఇప్పుడవి 18-20 ఏళ్ల వయసులో కూడా వస్తున్నాయి. దీనివల్ల చాలామంది యువతీ యువకులు ఇబ్బంది పడుతూ కాలేజీలకు వెళ్లడం కూడా మానుకుంటున్నారు. ఇలాంటివారికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి చికిత్సలు చేసి, వారిలో మళ్లీ ఆత్మవిశ్వాసం నింపడం, వారిని మళ్లీ కాలేజీకి పంపడం లాంటివి చేస్తున్నాం. ఇక్కడ మా ఆస్పత్రిలో పీడియాట్రిక్ డెర్మటాలజీ నుంచి.. అంటే పదేళ్ల వయసు వారికి వచ్చే సమస్యల నుంచి మొదలుపెట్టి జేరియాట్రిక్ సమస్యలు.. అంటే వయోవృద్ధులకు వచ్చే చర్మ సంబంధిత, ఇతర సమస్యల వరకు అన్నింటికీ చికిత్సలు అందించడానికి అంతర్జాతీయ స్థాయి పరికరాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి సంబంధించి వ్యక్తిగతీకరించిన చికిత్సలు అందించడం ఇక్కడ మా ప్రత్యేకత.చర్మ సమస్యలు అనేక రకాలుగా ఉంటాయి. డెంగ్యూ, చికున్ గన్యా లాంటివాటిలో కూడా చర్మసమస్యలు కొన్ని వస్తాయి. రోజూ తడిలో పనిచేసే గృహిణులకు కాళ్ల వద్ద ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి. ఇలాంటివాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పటికప్పుడు చర్మవైద్యులకు చూపించుకుని దానికి తగి చికిత్స తీసుకోవాలి. మొటిమలకు కూడా ఏవి పడితే ఆ క్రీములు వాడటం కాకుండా.. సరైన చికిత్స చేయించుకోవాలి” అని తెలిపారు. -
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానంపై కేసు నమోదు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–52లోని నందగిరిహిల్స్ హుడా లేఅవుట్లో ప్రభుత్వ స్థలం చుట్టూ నిరి్మంచిన ప్రహరీగోడను పక్కనే ఉన్న గురుబ్రహ్మనగర్ బస్తీవాసులు దౌర్జన్యంగా కూలి్చవేయడం జరిగిందని, ఇందుకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రోత్సాహం ఉందని, ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా హైడ్రా ఎన్ఫోర్స్మెంట్ ఇన్ఛార్జి వి.పాపయ్య ఇచి్చన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు దానం నాగేందర్పై కేసు నమోదు చేశారు. నందగిరిహిల్స్ లేఅవుట్లో 850 గజాల జీహెచ్ఎంసీ ఓపెన్ స్పేస్ ఉందని, ఇది ప్రభుత్వానికి చెందినదని, దీనిని కాపాడే యత్నంలో భాగంగా చుట్టూ ప్రహరీ నిరి్మంచడం జరిగిందన్నారు. ఈ నెల 10వ తేదీన ఉదయం గురుబ్రహ్మనగర్ బస్తీవాసులు ఇక్కడికి వచ్చి జీహెచ్ఎంసీ స్థలం చుట్టూ నిరి్మంచిన ప్రహరీని కూలి్చవేశారన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘటనా స్థలంలోనే ఉండి బస్తీవాసులను ప్రోత్సహించారని, బస్తీ నేతలు గోపాల్నాయక్, రాంచందర్లను ప్రోత్స హించి ఈ కూలి్చవేతలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కూలి్చవేతల వల్ల రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పాపయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే దానం, గురుబ్రహ్మనగర్ బస్తీ నేతలు గోపాల్నాయక్, రాంచందర్లపై బీఎన్ఎస్ 189 (3), 329 (3), 324 (4), రెడ్విత్ 190, సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ యాక్ట్ కింద కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వ్రతం.. వజ్రం..! వ్రతాన్ని పరిపూర్ణం చేసేలా ఈ డిజైన్..
సాక్షి, సిటీబ్యూరో: వరలక్ష్మి వ్రత పూజను పురస్కరించుకుని ప్రత్యేకంగా లిమిటెడ్ ఎడిషన్ కలెక్షన్ను బాలీవుడ్ ప్రముఖుడు కరణ్ జోహార్ ఆధ్వర్యంలోని ‘త్యాని బై కరణ్ జోహార్’ ఆభరణాల స్టోర్ రూపొందించింది. ఈ ఆభరణాల శ్రేణిని జూబ్లీహిల్స్లోని షోరూమ్లో మంగళవారం విడుదల చేశారు. ఈ కలెక్షన్లో సంప్రదాయాలను ఆధునికతలను మేళవించిన ఆభరణాలు ఉన్నాయని, వ్రతాన్ని పరిపూర్ణం చేసేలా ఇవి డిజైన్ చేయడం జరిగిందని త్యాని నిర్వాహకులు రిషబ్ తెలిపారు. అదేవిధంగా విభిన్న రకాల మేలిమి వజ్రాభరణాలు కూడా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా సరికొత్త కలెక్షన్ ప్రదర్శించారు. -
అర్థరాత్రి హైదరాబాద్ లో కారు బీభత్సం
-
జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో శాకాంబరి ఉత్సవాలు (ఫొటోలు)
-
మొదటిసారి డ్రగ్స్ కోసం స్నిఫర్ డాగ్స్ తో పోలీసుల రైడ్స్
-
జూబ్లీహిల్స్ లో అగ్నిప్రమాదం సాఫ్ట్వేర్ ఆఫీస్ లో చెలరేగిన మంటలు
-
రయ్.. రయ్.. గూబ గుయ్!
బంజారాహిల్స్: రాత్రీ పగలూ తేడా లేకుండా మోడిఫైడ్ సైలెన్సర్తో భీకర శబ్దాలతో దూసుకెళ్తున్న స్పోర్ట్స్ బైక్లు, కార్లపై అటు ట్రాఫిక్ పోలీసులు, ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు దృష్టిపెట్టారు. గడిచిన నెల రోజుల కాలంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజగుట్ట, ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు మితిమీరిన వేగంతో చెవులు దద్దరిల్లే శబ్దంతో దూసుకెళ్తున్న వాహనాలను సీజ్ చేయడంతో పాటు సదరు వాహనదారులపై కేసులు నమోదు చేశారు. ఇంత చేస్తున్నా ఇంకా కొంతమంది యువకులు స్పోర్ట్స్ బైక్లు, కార్లలో రయ్ రయ్మంటూ దూసుకెళ్తూనే ఉన్నారు. రాత్రి 10 గంటల తర్వాతనే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, నెక్లెస్రోడ్డు, మాసబ్ట్యాంక్, మాదాపూర్, దుర్గం చెరువు ప్రాంతాల వైపు యువకులు రేసింగ్లకు పాల్పడుతూ బైక్లపై దూసుకెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు ఉదయం 11 నుంచి గంట పాటు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు రెండు గంటలు మాత్రమే వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. తమ దృష్టికి వస్తే మాత్రమే కేసులు నమోదు చేస్తున్నారు. రాత్రి 7 తర్వాత తెల్లవారుజామున 6 గంటల వరకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రహదారులపై బైక్లు, కార్లు మోత మోగిస్తూ దూసుకెళ్తుండగా వాహనదారులు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నారు. చెవులు దద్దరిల్లే సౌండ్లతో నివాసితులు సైతం తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. రాత్రి 8 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు కనీసం వారానికి రెండు సార్లైనా ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు వేర్వేరుగా వాహన తనిఖీలు చేపడితే పెద్ద ఎత్తున మోడిఫైడ్ సైలెన్సర్ల వాహనాలను పట్టుకోవచ్చని స్థానికులు సూచిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
JC Diwakar Reddy: వేధించి, ఆపై సంతకాన్ని ఫోర్జరీ చేసి..
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. తనకు సంబంధించిన ఇంటిని ఖాళీ చేయకుండా వేధించడంతో పాటు తన సంతకాలను ఫోర్జరీ చేశారంటూ ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 62 లో దివాకర్ రెడ్డికి ఇల్లు ఉంది. దానిని సాహితీ లక్ష్మీనారాయణకు అద్దెకు ఇచ్చారు. అయితే ఒప్పందం గడువును మూడేళ్లుగా నిర్ణయించుకున్నారు. ఒప్పంద గడువు 2023 మేతో ముగియడంతో ఇంటిని ఖాళీ చేయాలని జేసీ పలుమార్లు కోరినా... స్పందించకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఆపై తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కోర్టులో అఫిడవిట్ వేసినట్లు జేసీ దివాకర్రెడ్డి గుర్తించారు. బూదాటి లక్ష్మీనారాయణ, అతని కుమారుడు సాత్విక్లు తమకు లీజు గడువు ఇంకా ఉన్నట్లు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేయడంతో జేసీకి కోర్టు నుంచి సమన్లు జారీ అయ్యాయి. లక్ష్మీనారాయణ, అతని న్యాయవాది కోర్టులో దాఖలు చేసిన పత్రాలను గమనించిన జేసీ.. ఒప్పందం తేదీని 2021 మే నెలగా చూపినట్లు గుర్తించారు. అంతేకాదు తన సంతకం ఫోర్జరీ జరిగిందని, నకిలీ పత్రాలతో బూదాటి లక్ష్మీనారాయణ, సాత్విక్, వారి న్యాయవాది మహమ్మద్ షాజుద్దీన్లు కోర్టును తప్పుదోవ పట్టించారని జేసీ పోలీసులను ఆశ్రయించారు. సోమవారం ఆయన ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
మద్యం మత్తులో సినీ కార్మికుడి హత్య
హైదరాబాద్: మద్యం మత్తులో జరిగిన గొడవలో స్నేహితుడిని దారుణంగా పొడిచి చంపిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. పంజగుట్ట వెంకటరమణ కాలనీలో నివసించే జె.మునిరాజు (28) సినీ పరిశ్రమలో సెట్ వర్క్ చేస్తుంటాడు. ఆయనకు 2012లో వివాహమైంది. మూడేళ్లుగా కృష్ణానగర్ ప్రాంతంలో ఒంటరిగా ఉంటున్నాడు. శనివారం అర్ధరాత్రి 11 గంటల సమయంలో తన మిత్రుడితో కలిసి జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–5లోని అన్నపూర్ణ స్టూడియో పెట్రోల్ బంకు సమీపంలో మద్యం తాగుతున్నారు. ఈ క్రమంలో స్నేహితుడితో గొడవ జరిగింది. దీంతో బీరు బాటిల్ను పగులగొట్టిన స్నేహితుడు.. మునిరాజును పొత్తి కడుపులో పొడిచి హత్య చేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. హత్యలో ఒక్కరే పాల్గొన్నట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు. హత్య చేసింది ఎవరనేది ఇంకా తెలియరాలేదని, గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇక్కడ సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
షకీల్ కొడుకు రాహిల్ కేసులో కొత్త ట్విస్ట్.. తెరపైకి మరో కేసు
సాక్షి, హైదరాబాద్: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు రాహిల్పై మరో కేసులో ఉచ్చు బిగుస్తోంది. జూబ్లీహిల్స్లో రెండు సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదం కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ ప్రమాదం సమయంలో షకీల్ కొడుకే రాహిల్ కారు నడిపినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, ఈ కేసుపై మళ్లీ దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-45లో 2022న మార్చి 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 నెలల చిన్నారి మృతి చెందాడు. ఈ కేసులో దర్యాప్తును పోలీసులు తిరిగి ప్రారంభించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ రోజు దుర్గం చెరువు నుంచి జూబ్లీహిల్స్ వైపు వచ్చిన మహీంద్రా థార్ వాహనం రాత్రి ఎనిమిది గంటలకు రోడ్డు దాటుతున్న యాచకులను ఢీకొట్టింది. ముగ్గురు మహిళలకు గాయాలు కాగా రెండు నెలల బాలుడు దుర్మరణం చెందాడు. కారులోని యువకులు పారిపోయినప్పటికీ వాహనంపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటంతో షకీల్ వాహనంగా తేలింది. అయితే అందులో తన కుమారుడు లేడని షకీల్ ప్రకటన ఇచ్చారు. మరోవైపు అఫ్రాన్ అనే మరో యువకుడు తానే కారు నడిపినట్లు అంగీకరించి లొంగిపోయాడు. స్టీరింగ్పై వేలిముద్రలు అఫ్రాన్వేనని అప్పట్లో పోలీసులు ప్రకటించారు. బాధితుల వాంగ్మూలాల సేకరణ సహా, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా మాజ్ అనే మరో యువకుడితో పాటు కారులో రాహిల్ ఉన్నట్లు తేలడంతో దర్యాప్తు మలుపు తిరిగింది. తాజాగా దర్యాప్తులో ఆరోజు కారు నడిపింది రాహిల్ అని పోలీసులు గుర్తించారు. మరోవైపు.. అప్పట్లో 304-B సెక్షన్ చేర్చకపోవడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ గురించి ఆరా తీయకపోవడం లాంటి కారణాలను విశ్లేషిస్తున్నారు. మహారాష్ట్రకు వెళ్లి బాధితులను నగరానికి తీసుకొచ్చి వారితోపాటు మరికొందరి వాంగ్మూలాలు సేకరించారు. ఘటన జరిగిన రోజు డ్రైవింగ్ సీట్ నుంచి లావుగా ఉన్న యువకుడు పారిపోయాడంటూ బాధితులు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. దీన్నిబట్టి రాహిల్ డ్రైవింగ్ సీట్లో ఉన్నట్లు పోలీసులు నమ్ముతున్నారు. ఇదిలా ఉండగా.. పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో ప్రజాభవన్ సమీపంలో రోడ్డుప్రమాదం కేసులో పరారీలో ఉన్న షకీల్, రాహిల్కు ఇప్పటికే లుక్ అవుట్ సర్క్యులర్ జారీ అయిన సంగతి తెలిసిందే. -
HYD: జూబ్లీహిల్స్లో మహిళ వీరంగం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్లో యువతి హంగామా సృష్టించింది. ట్రాఫిక్ హోంగార్డ్పై దాడి చేసి ఫోన్ పగలగొట్టింది. రాంగ్ రూట్లో వచ్చిన యువతిని హోంగార్డ్ అడ్డుకోగా, యువతి బూతులు తిడుతూ అతని బట్టలు చింపి దాడికి పాల్పడింది. యువతిపై హోంగార్డ్ విగ్నేష్ బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యువతిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. -
HYD: పంటి చికిత్స కోసం వెళితే ప్రాణం పోయింది..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. పంటి చికిత్స కోసం డెంటల్ ఆసుపత్రికి వెళ్లిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే యువకుడు మరణించడం వారి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడి ప్రాణం పోయిందని మృతుడి తండ్రి ఆరోపించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. మిర్యాలగూడలోని సరస్వతినగర్కు చెందిన వింజం లక్ష్మీనారాయణ (28) తన కుటుంబంతో కూకట్పల్లి సమీపంలోని హైదర్నగర్లో నివాసం ఉంటున్నారు. ఈ నెల 15న లక్ష్మీనారాయణకు నిశ్చితార్థం జరిగింది. మార్చి 13న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. లక్ష్మీనారాయణకు పంటినొప్పి ఉండటంతోపాటు కింది వరుస పళ్లను సరిచేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం ఆన్లైన్లో చూడగా జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 37లోని ఎఫ్ఎంఎస్ డెంటల్ ఆసుపత్రి గురించి తెలిసింది. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజు ఈ నెల 16న మధ్యాహ్నం 1.30 గంటలకు ఎఫ్ఎంఎస్ డెంటల్ క్లినిక్కు వెళ్లాడు. రూట్ కెనాల్ చికిత్స చేయించుకున్న తర్వాత కింది వరుసలో దంతాలు వంకరటింకరగా ఉన్నాయని, వాటిని సరిచేయాలని లక్ష్మీనారాయణ కోరాడు. దీనికోసం తమ వద్ద లేజర్ ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పగా.. చికిత్సకు అంగీకరించాడు. చికిత్స అనంతరం తీవ్రమైన నొప్పితోపాటు వాంతులు కావడంతోపాటు ఫిట్స్ వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. ఆందోళనకు గురైన ఎఫ్ఎంఎస్ దవాఖాన సిబ్బంది లక్ష్మీనారాయణను హుటాహుటిన అంబులెన్స్లో అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. డెంటల్ చికిత్స కోసం వెళ్లిన లక్ష్మీనారాయణ రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఫోన్ చేయగా అపోలో దవాఖానలో ఉన్నట్టు తేలింది. అక్కడకు వెళ్లిచూడగా అతడి మృతదేహం కనిపించింది. గుండెపోటుతో లక్ష్మీనారాయణ మృతి చెంది ఉంటాడని, డెంటల్ దవాఖాన వర్గాలు తెలిపాయి. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచడంతో ఎఫ్ఎంఎస్ డెంటల్ క్లినిక్ వైద్యుల నిర్లక్ష్యంతోనే కొడుకు మృతి చెందాడంటూ మృతుడి తండ్రి రాములు ఆరోపించారు. అనస్తీషీయా డోస్ ఎక్కువగా ఇచ్చారని.. దాని ప్రభావంతోనే తమ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆసుపత్రి ఎదుట ఆందోళన చెపట్టారు. అనంతరం ఈ నెల 17న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఐపీసీ 304 (ఏ) సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీనారాయణ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతికి గల కారణాలు తెలియాలంటే హిస్టో పాథాలజీ నివేదిక రావాల్సిందేనని, నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు. -
జూబ్లీహిల్స్లో స్పోర్ట్స్ కారు బీభత్సం
-
Hyderabad: హిట్ అండ్ రన్ కేసులో ఐదుగురు అరెస్ట్
హైదరాబాద్: అదుపుతప్పిన వేగంతో వెనుక నుంచి దూసుకొచ్చిన కారు ఢీకొట్టడంతో ఓ బౌన్సర్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బుధవారం జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్ సిక్ విలేజ్ గాంధీనగర్కు చెందిన లింగాల తారక్రామ్ (30), కె.రాజు మాదాపూర్ నోవాటెల్లో బౌన్సర్లుగా పని చేస్తున్నారు. ఎప్పటిలాగే మంగళవారం సాయంత్రం డ్యూటీకి వెళ్లి బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు బైక్పై జూబ్లీహిల్స్ మీదుగా ఇంటికి వెళ్తున్నారు. పెద్దమ్మ గుడి సమీపంలోకి రాగానే శ్రీ జ్యువెలర్స్ మలుపు వద్ద వెనుక నుంచి అతివేగంగా దూసుకువచ్చిన బ్లాక్ కలర్ కారు ఢీకొట్టి ఆగకుండా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తారక్రామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. రాజు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు తారక్రామ్కు రెండేళ్ల క్రితం సుధారాణితో వివాహం కాగా 7 నెలల కుమారుడున్నాడు. గత కొంతకాలంగా బౌన్సర్గా పని చేస్తున్నాడు. ప్రమాదానికి కారణమైన కారు కోసం జూబ్లీహిల్స్ పోలీసులు గాలింపు చేపట్టారు. గచ్చిబౌలి, మాదాపూర్ వైపు, జూబ్లీహిల్స్, పంజగుట్ట, బేగంపేట రోడ్లపై ఉన్న సీసీ ఫుటేజీలను వడబోస్తున్నారు. సీసీ కెమెరాలకు కూడా అందనంత స్పీడ్గా 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో కారు దూసుకెళ్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ వేగానికి కారు నంబర్ ఏ ఒక్క కెమెరాలో కూడా చిక్కడం లేదు. కారులో ఎంతమంది ఉన్నారని స్పష్టం తెలియడం లేదు. కారులో ఎంతమంది ఉన్నారు.. వీరు ఎక్కడి నుంచి వస్తున్నారు.. అన్నది తెలియాల్సి ఉంది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు డీసీపీ విజయ్కుమార్ బుధవారం రాత్రి ఎస్ఆర్నగర్ స్టేషన్ను సందర్శించారు. మరోవైపు గాయపడిన రాజు యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుడి బంధువుల ఆందోళన కారును అతివేగంగా నడిపిన నిందితుడ్ని ఇంతవరకు అరెస్టు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ మృతుడి కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేయడమే కాకుండా ఈ ఘటనకు కారకుడైన నిందితుణ్ణి తమ ముందు ప్రవేశపెట్టాలని, కారును కూడా చూపించాలని డిమాండ్ చేశారు. తారక్రామ్ తల్లి రాజమణి, భార్య సుధారాణి, సోదరుడు గణేష్, బావలు ప్రదీప్, సునీల్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో బంధుమిత్రులు మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి కన్నీరుమున్నీరవుతూ తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులు భారీ సంఖ్యలో మొహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. కాగా ఈ ఆందోళన కొనసాగుతున్న సమయంలోనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాన్వాయ్ అదే దారిలో వెళ్లడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల అదుపులో ఐదుగురు నిందితులు జూబ్లీహిల్స్లో బుధవారం తెల్లవారుజామున జరిగిన హిట్ అండ్ రన్ కేసులో తారక్రామ్ మృతికి కారణమైన ఐదుగురు నిందితులను గురువారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కారును కూడా స్వాదీనం చేసుకున్నారు. ఇది కొత్త వెర్నా కారు అని పోలీసులు గుర్తించారు. ద్వారంపూడి నాగ అనే పేరుతో ఈ కారు రిజిస్ట్రేషన్ అయిఉందని నిర్ధారించారు -
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో హిట్ అండ్ రన్
-
జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దమ్మగుడి వద్ద బైక్పై వెళుతున్నవ్యక్తిని అతివేగంగా వచ్చిన ఢీకొట్టింది. ఆ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని, పోస్టు మార్టం నిమిత్తం మృత దేహాన్ని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరూ పబ్లో బౌన్సర్లుగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. బైక్పై వెళ్తున్న వారిని డీకొట్టి కారుతో సహా నిందితుడు పరారైనట్లు చెప్పారు. ప్రమాదంలో తారక్ అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. అతడికి ఏడాది క్రితమే పెళ్లి జరిగినట్టు సమచారం. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. -
హైదరాబాద్ లో మితిమీరిన పబ్ ల ఆగడాలు
-
టాలీవుడ్ అగ్ర నిర్మాతపై అసభ్యకర కామెంట్స్.. ప్రముఖ సినీ రచయితపై కేసు.!
సినీ మాటల రచయిత రాజసింహపై కేసు నమోదైంది. ప్రముఖ నిర్మాత కూచిబొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కథల విషయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన వివాదమే కారణమని తెలుస్తోంది. రాజాసింహ తన కుటుంబ సభ్యులకు అసభ్యకరమైన, బెదిరింపు సందేశాలు పంపిస్తున్నట్లు వివేకానంద ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రతిష్టను అగౌరవపర్చేలా సామాజిక మాధ్యమాల్లోనూ సందేశాలు పెట్టాడని ఆయన ఆరోపించారు. అంతే కాకుండా దర్శకుడు రాఘవేంద్రరావు, వైవీఎస్ చౌదరి, ఠాగూర్ మధు లాంటి వారిని సైతం దూషిస్తూ సందే శాలు పెట్టాడని కూచిబొట్ల గురువారం పోలీసులను ఆశ్రయించారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నారు. అసలు రాజాసింహ ఎవరు? ఇదిలా ఉండగా.. రాజసింహ తడినాడ దాదాపు 60 సినిమాలకు పైగా రచయితగా పనిచేశాడు. అల్లు అర్జున్ నటించిన ‘రుద్రమదేవి’ సినిమాకి డైలాగ్ రైటర్గా పని చేశారు. ఆ సినిమాలో అల్లు అర్జున్ పోషించిన ‘గోన గన్నా రెడ్డి’ పాత్రకి రాజసింహ రాసిన డైలాగులకి చాలా మంచి గుర్తింపు వచ్చింది. అదే క్రేజ్తో దర్శకుడిగా మారిన రాజసింహ.. యంగ్ హీరో సందీప్ కిషన్తో 'ఒక అమ్మాయి తప్ప' అనే సినిమా చేశాడు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో రాజసింహకి సినిమా అవకాశాలు తగ్గాయి. అయితే పర్సనల్ లైఫ్లో ఇబ్బందుల కారణంగా రాజసింహ గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్పటినుంచి రాజసింహ బయట పెద్దగా కనిపించడం లేదు. -
Hyd: లిఫ్ట్ అడిగి మరీ రేప్ బెదిరింపులు!
హైదరాబాద్, సాక్షి: నడిరోడ్డుపై నిల్చుని కారులో వెళ్లేవాళ్లను లిఫ్ట్ అడుగుతుంది. జాలిపడి లిఫ్ట్ ఇచ్చారో ఇక అంతే!. రేప్ చేయబోయారని బెదిరించి మరీ డబ్బులు వసూలు చేస్తుంటుంది. అలా పదుల సంఖ్యలో బెదిరింపు ఉదంతాలకు పాల్పడిన కిలా(లే)డీని ఎట్టకేలకు జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డు మీద వెళ్లే వారిని ఆపి ఏదో అర్జంట్ పని ఉందంటూ లిఫ్ట్ అడగడం.. వాహనంలో ఎక్కిన తర్వాత ‘రేప్’ చేయబోయారని బెదిరిస్తూ డబ్బులు గుంజడం ఆమెకు బాగా అలవాటు అయ్యింది. పైగా తాను అడ్వకేట్ అని.. తనకు అన్ని సెక్షన్లు తెలుసు అంటూ దబాయింపులకు దిగుతుంది. తాజాగా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్ దాకా లిఫ్ట్ కావాలి అంటూ ఓ కారు ఎక్కింది. ఆపై దిగేముందు బట్టలు చించుకుని రేప్ కేసు పెడతా అంటూ అల్లరి చేసింది. దీంతో సదరు డ్రైవర్ పరమానంద.. జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె కదలికల మీద నిఘా వేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలిని సయీదా నయీమా సుల్తానాగా గుర్తించిన పోలీసులు.. నగర వ్యాప్తంగా పలు స్టేషన్లో ఆమెపై 17 కేసులు ఉన్నట్లు గుర్తించారు. -
Hyd: నిబంధనలు పాటించని పబ్లపై కొరడా.. ఆరు పబ్లపై కేసులు
సాక్షి, హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకల రోజు నిబంధనలు ఉల్లంఘించిన పబ్లపై పోలీసులు కొరడా ఝుళిపించారు. జూబ్లీహిల్స్లో ఆరు పబ్బులపై కేసులు నమోదు చేశారు. నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు నడిచిన హలో, టార్,గ్రీన్ మంకిస్, మకవ్,లాస్ట్, జీనా పబ్బులపై కేసులు నమోదయ్యాయి. నూతన సంవత్సర వేడుకల నిర్వహణకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలను పబ్ నిర్వాహకులు లెక్కచేయలేదు. అధిక డీజే సౌండ్తో స్థానికులను ఇబ్బందిపెట్టినందుకు కూడా కేసు నమోదు చేశారు. భారీ శబ్ధాలు వస్తున్నాయని స్థానికులు ఫిర్యాదు. ఐపీసీ సెక్షన్ 188, 290, సీపీ చట్టం కింద కేసు నమోదైంది. కాగా, కొత్త ఏడాదికి లిక్కర్ కిక్కు బాగానే ఎక్కింది. కొత్త సంవత్సర వేడుకల ప్రారంభమయ్యే రోజుతో పాటు రెండు రోజుల ముందు నుంచీ ఏకంగా రూ.620 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి వైన్షాపులకు చేరింది. డిసెంబర్ 31న ఆదివారం సెలవుదినం అయినా, మద్యం డిపోలు తెరచి ఉంచగా, రూ.127 కోట్ల విలువైన మద్యం షాపులకు చేరింది డిసెంబర్ 30న రూ.313 కోట్లు, డిసెంబర్ 29న రూ.180 కోట్ల మద్యం డిపోల నుంచి వెళ్లిందని ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, కొత్తగా ప్రారంభమైన షాపుల్లో అమ్మకాల కోసం ఈ నెల మొదట్లోనే పెద్ద ఎత్తున లిక్కర్ చేరిందని, ఈ నేపథ్యంలో కొంత తగ్గుదల కనిపిస్తుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి: నుమాయిష్ 2024 ప్రారంభం.. మాస్క్ కంపల్సరీ! -
Hyderabad: ఇక తెల్లవార్లూ డ్రంక్ అండ్ డ్రైవ్!
హైదరాబాద్: ఇక తెల్లవార్లూ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంగా రెండు షిఫ్ట్లలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు వేర్వేరు చోట్ల వాహనదారులకు శ్వాస పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించారు. వెస్ట్జోన్ పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మధురానగర్, పంజగుట్ట, బోరబండ, ఎస్ఆర్నగర్, మాసబ్ట్యాంక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం ఉదయం 4 గంటల వరకు ఎనిమిది చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్పరిధిలో డైమండ్ హౌజ్, ఫిలింనగర్ విజేత సూపర్మార్కెట్ వద్ద నిర్వహించిన డ్రంక్ డ్రైవ్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ 24 మంది మందుబాబులు పట్టుబడ్డారు. ఎస్ఆర్నగర్ ట్రాఫిక్ పోలీసులు ఎస్ఆర్నగర్ ఐసీఐసీఐ వద్ద రాత్రి 10 నుంచి ఒంటి గంట వరకు, జూబ్లీహిల్స్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద అర్ధరాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 4 గంటల వరకు నిర్వహించిన తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ 26 మంది పట్టుబడ్డారు. బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు స్టడీ సర్కిల్, గ్రీన్ బావర్చి వద్ద నిర్వహించిన తనిఖీల్లో 13 మంది పట్టుబడ్డారు. పంజగుట్ట ట్రాఫిక్ పోలీసులు రాత్రి 10 నుంచి ఒంటిగంట వరకు గ్రీన్ల్యాండ్స్ వద్ద, బంజారాహిల్స్ పార్క్ హయత్ వద్ద రాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 4 గంటల వరకు నిర్వహించిన తనిఖీల్లో 19 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. -
మంచోడే.. కానీ.. దొంగోడు!
హైదరాబాద్: దొంగలందు ఈ దొంగ వేరయా.. అన్నట్టు.. పెద్దలను దోచి పేదలకు పంచిపెడుతుంటాడు. చోరీ చేసిన సొత్తులో కొంత భాగాన్ని తన గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తాడు. కేవలం బంగారం, నగదు మాత్రమే తస్కరిస్తూ వెండి వస్తువుల జోలికి వెళ్లడు. సీసీ కెమెరాలకు చిక్కకుండా పక్కా ప్రణాళికతో ఒక ఇంటిపై నుంచి మరో ఇంటిపైకి దూకుతూ జారుకుంటాడు. జూబ్లీహిల్స్లోనే దొంగతనాలకు పాల్పడతాడు తప్ప నగరంలోని మరో ప్రాంతంపై దృష్టి పెట్టడు. పోలీసులకు ఏమాత్రం క్లూ దొరక్కుండా సెల్ఫోన్ సిమ్ వేసుకోకుండా కేవలం నెట్తో వాట్సాప్ కాల్స్ మాత్రమే వాడుతూ అత్యంత పకడ్బందీగా హైదరాబాద్, ముంబై మధ్య రాకపోకలు సాగిస్తున్నాడు. నాలుగేళ్లుగా బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ పోలీసులు గాలిస్తున్న ఈ అంతర్రాష్ట్ర దొంగను ఎట్టకేలకు జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసి శనివారం రిమాండ్కు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. సీసీ కెమెరాకు చిక్కి.. బిహార్కు చెందిన మహ్మర్ ఇర్ఫాన్ అలియాస్ రాబిన్హుడ్ అలియాస్ ఉజ్వల్ (33) ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్లలో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ నెల 9న జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 10సిలోని ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో నివసించే ధృవ అనురాగ్రెడ్డి ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. బంగారు నగలు తస్కరించి అదే రోజు రాత్రి ఇక్కడి నుంచి ఉడాయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగారు. ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో నాలుగైదు రోజులపాటు 75కిపైగా సీసీ కెమెరాలను వడపోసినా ఎక్కడా ఇర్ఫాన్ ఆనవాళ్లు చిక్కలేదు. సీసీ ఫుటేజీలు పరిశీలిస్తూ వెళ్తుండగా వెంకటగిరి సమీపంలో ఓ ఇంటి ముందు ఏర్పాటు చేసిన కెమెరాకు చిక్కాడు. లక్డీకాపూల్లోని హోటల్లో మకాం.. పాత నేరస్తుల ఫొటోలను, సీసీటీఎన్ఎస్ పరిశీలనలో రాబిన్హుడ్ మామూలోడు కాదని, కరడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగ అని తేలింది. నగరానికి దొంగతనానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా లక్డీకాపూల్లోని ఓ హోటల్లో తనకు అచ్చొచ్చిన గదిలో ఉంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారం రోజులపాటు ఆ హోటల్ వద్ద కాపు కాశారు. రాబిన్హుడ్ రాకను గుర్తించిన పోలీసులు అతన్ని అదే హోటల్ గదిలో అదుపులోకి తీసుకొన్నారు. విచారణ చేయగా ఈ నెల 8న దొంగతనానికి ఇక్కడికి వచ్చానని, ఓ ఖరీదైన కారులో జూబ్లీహిల్స్ ప్రాంతంలో తిరుగుతూ తనకు అనుకూలంగా ఏ ఇల్లు దొంగతనానికి సరిపోతుందో రెక్కీ నిర్వహించినట్లుగా చెప్పాడు. ఓ ఇంటిపైనుంచి మరో ఇంటిపైకి దూకుతూ.. ఓ ప్రముఖ నటుడి ఇంటి పరిసర ప్రాంతాల్లో చూడగా అక్కడ ఏ మాత్రం అనుకూలంగా లేకపోవడంతో ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో ధృవ అనురాగ్రెడ్డి ఇంటిని లక్ష్యంగా చేసుకొని దొంగతనానికి పాల్పడినట్లు వెల్లడించాడు. అదే రోజు రాత్రి ముంభైలోని తన రెండో భార్య బార్ గర్ల్ గుల్షన్ ఇంటికి వెళ్లానని, మళ్లీ దొంగతనం చేయడానికి రెండు రోజుల క్రితం అదే హోటల్కు వచి్చనట్లు తెలిపాడు. ప్రముఖులు, బడాబాబులు నివసిస్తున్న జూబ్లీహిల్స్లోని దొంగతనాలు చేస్తుంటానని, సీసీ కెమెరాలకు చిక్కకుండా ఒక ఇంటిపై నుంచి మరో ఇంటిపైకి 15 నుంచి 20 ఇళ్ల పైకప్పులు దూకుతూ వెళ్తుంటానని చెప్పాడు. తాను చోరీ చేసిన సొత్తులో 50 శాతం పేదలకు ఆహారం, స్కూల్ ఫీజులు, దుస్తులు, ఆసుపత్రుల ఫీజులు కడుతుంటానని చెప్పాడు. అందుకే తనకు రాబిన్ హుడ్ పేరు వచ్చినట్లు వెల్లడించాడు. ఇప్పటికే ముగ్గురు భార్యలు.. మరో యువతితో ప్రేమాయణం చోరీ సొత్తుతో స్వగ్రామంలో వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో ఉజ్వల్ అని పేరు పెట్టారని వెల్లడించారు. తన మొదటి భార్య పర్వీన్ బిహార్లో జెడ్పీ చైర్పర్సన్ అని.. రెండో భార్య ముంబైలో బార్గర్ల్ అని.. మూడో భార్య కోల్కతాలో ఉంటోందన్నాడు. ఇటీవలే పూజ అనే యువతితో ప్రేమలో పడ్డట్లు పోలీసులకు వెల్లడించాడు. నిందితుడిపై హైదరాబాద్లో నాలుగు కేసులు, బెంగళూరులో 7, న్యూఢిల్లీలో 4 కేసులు నమోదై ఉన్నాయి. ఇళ్ల తాళాలు పగులగొట్టి తనతో తీసుకెళ్లే స్రూ్కడ్రైవర్లు, రాడ్లతో అల్మారాలు తెరుస్తుంటాడని వాటిని స్వాదీనం చేసుకున్నట్లు జూబ్లీహిల్స్ డీఐ వీరశేఖర్ తెలిపారు. -
రైతుబిడ్డకు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు!
బిగ్బాస్ సీజన్-7 విన్నర్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్కు హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. ఆదివారం షో ముగిసిన తర్వాత పలువురు బిగ్బాస్ కంటెస్టెంట్స్ కార్లపై జరిగిన దాడులపై పోలీసులు సీరియస్ అయ్యారు. అమర్దీప్, అశ్విని, గీతూ రాయల్ కార్లతో పాటు పలు ఆర్టీసీ బస్సులపై సైతం ఫ్యాన్స్ దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడులను సుమోటోగా స్వీకరించిన పోలీసులు పల్లవి ప్రశాంత్తో పాటు అతని అభిమానులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే... ఫినాలే ముగిసిన తర్వాత అమర్ తన కారులో ఇంటికి వెళ్లిపోతుంటే.. అతడి కారుపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడికి దిగారు. వెనకవైపు అద్దం ధ్వంసం చేశారు. అలానే మరో కంటెస్టెంట్ అశ్విని, వీళ్లందరినీ ఇంటర్వ్యూలు చేసిన గీతూ రాయల్ కారుని కూడా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ధ్వంసం చేశారు. దీంతో గీతూ.. పోలీస్ కేసు పెట్టింది. ఇది కాదన్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ బయట ప్రశాంత్, అమర్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
క్యూలో నిలబడి ఓటు వేసిన అల్లు అర్జున్
-
మహ్మద్ అజారుద్దీన్పై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్ధీన్పై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కారణంతో ఫిల్మ్ నగర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో రేపు పోలింగ్ జరగనుంది. ఇన్నిరోజుల నుంచి రాజకీయ పార్టీలు ముమ్మరంగా సాగించిన ఎన్నికల ప్రచారానికి మంగళవారమే తెరపడింది. ప్రచారానికి గడువు ముగిసిన తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే.. చట్టపరమైన చర్యలను ఈసీ తీసుకుంటుంది. -
కేసీఆర్పై నిప్పులు చెరిగిన కేంద్రమంత్రి నిర్మలా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక లోటును దాచిపెడుతోందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణను రెవెన్యూ లోటుకు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని దుయ్యట్టారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం కృషి చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని మండిపడ్డారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం మధురానగర్లో నిర్వహించిన మీట్ ది గ్రీట్ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘బంగారు తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, ఒక్క ప్రాజెక్టు కూడా సరిగా పూర్తి చేయలేదని విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తానన్న హామీ ఎటు పోయిందని ప్రశ్నించారు. తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించిందని నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. కుటుంబ పాలనా, అవినీతికి పాల్పడిన ప్రభుత్వం మనకు కావాలా? అని నిలదీశారు బీఆర్ఎస్ ప్రజలకు పనికొచ్చే పనులు చేయడం లేదని అన్నారు. కేంద్రం పెట్రోల్ ధరలు తగ్గించినా.. కేసీఆర్, పెట్రోల్ మీద వ్యాట్ తగ్గించకుండా.. బీజేపీపై దురదజల్లే ప్రయత్నం చేశారని విమర్శించారు. దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ మారుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధిని విపక్ష నేతలు సైతం కొనియాడుతున్నారని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినకుండా.. భవిష్యత్తులో రాష్ట్రాలపై భారం పడకుండా కేంద్రం ప్రభుత్వాన్ని నడిపిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పాలసీ వల్ల హైదరాబాద్కు మంచి కంపెనీలు వస్తున్నాయని. రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరగాలంటే బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. -
రౌడీషీటర్లపై ఉక్కుపాదం
బంజారాహిల్స్: పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసుకునేందుకు వీలుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు దృష్టిసారించారు. స్వేచ్ఛాయుత వాతావరణానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీచేస్తూ ప్రతిరోజూ ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. గత మూడు వారాలుగా ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజక వర్గాల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, బీసీ పెట్రోలింగ్ పోలీసులు రౌడీషీటర్ల కదలికలను గమనిస్తూ వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల వేళ ఓటర్లను ప్రభావితం చేసే చర్యలకు పాల్పడితే రౌడీషీట్ కొనసాగుతుందని హెచ్చరిస్తున్నారు. వివిధ పారీ్టల అభ్యర్థులతో తిరిగినా, ప్రచారంలో పాల్గొన్నా పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. రౌడీషీటర్లతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. తమ పిల్లలు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో, రాత్రి పూట ఇంటికి వస్తున్నారో లేదో దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. దీంతో రౌడీషీటర్ల భయంతో వణికిపోతున్నారు. ఖైరతాబాద్ అసెంబ్లీ పరిధిలో... ఖైరతాబాద్ నియోజక వర్గ పరిధిలోని బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, నారాయణగూడ, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, సెక్రటేరియట్, దోమల్గూడ, సైఫాబాద్, ఆబిడ్స్, మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 45 మంది రౌడీషీటర్ల ఉండగా ఇప్పటికే 100 శాతం బైండోవర్లు పూర్తయ్యాయి. ఇందులో కొందరు జైలులో ఉండగా మిగతావారికి నిత్యం రాత్రివేళల్లో పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహస్తున్నారు. గత ఎన్నికల సమయంలో వివిధ ఘటనలకు పాల్పడిన 182 మందికి కూడా బైండోవర్ పూర్తి చేశారు. జూబ్లీహిల్స్ పరిధిలో.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధురానగర్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజగుట్ట, సనత్నగర్, హుమాయన్నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 101 మంది రౌడీషీటర్ల ఉండగా వీరందరికీ 100 శాతం బైండోవర్లు పూర్తి చేసినట్లు నియోజక వర్గ ఎన్నికల నోడల్ అధికారి, జూబ్లీహిల్స్ ఏసీపీ కట్టా హరిప్రసాద్ తెలిపారు. అలాగే గత ఎన్నికల సమయంలో వివిధ నేరాలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డ మరో 300 మందిని కూడా బైండోవర్ చేసినట్లు ఆయన వెల్లడించారు. రౌడీïÙటర్లకు నిత్యం కౌన్సెలింగ్ చేస్తున్నట్లు తెలిపారు. -
గోషామహల్, జూబ్లీహిల్స్ పోటీపై ఎంఐఎం ఆంతర్యం ఏమిటి?
హైదరాబాద్: ముస్లిం గొంతును వినిపించే ఆల్ ఇండియా మజ్లిస్–ఏ– ఇత్తేహదుల్ ముస్లిమీన్న్ (ఏఐఎంఐఎం) పార్టీ ‘గోషామహల్ –జూబ్లీహిల్స్’ అసెంబ్లీ స్థానాలపై వ్యవహరిస్తున్న తీరు ముస్లిం సామాజిక వర్గంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పాతబస్తీ పరిధిలోకి వచ్చే గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి, కరడుగట్టిన హిందుత్వవాది రాజాసింగ్పై పోటీకి దిగకపోవడం, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి, భారత క్రికెట్ దిగ్గజం అజహరుద్దీన్పై పోటీకి దింపడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ‘రెండింటి అపవాదు’ తలనొప్పిగా తయారై మజ్లిస్ ఆత్మరక్షణలో పడింది. ఇప్పటికే ఒకవైపు కాంగ్రెస్ విమర్శలు, బీజేపీ సవాళ్లు ఎదురవతుండగా, సొంత పార్టీలో సైతం తీవ్ర అసంతృప్తి నివురుగప్పిన నిప్పుగా మారింది. గోషామహల్, జూబ్లీహిల్స్ స్థానాలపై మజ్లిస్ అధిష్టానం తీరును తప్పుబడుతూ ఆ పార్టీ మాజీ కార్పొరేటర్ ఖాజా బిలాల్ రాజీనామా చేశారు. ఏకంగా మజ్లిస్ లక్ష్యం గోషామహల్లో రాజాసింగ్ను గెలిపించడమా? జూబ్లీహిల్స్లో అజహరుద్దీన్ను ఓడించడమా? అంటూ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి ప్రశ్నలు సంధిస్తూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేయడం మరింత చర్చనీంశంగా మారంది. మజ్లిస్ పార్టీ అగ్ర నేతలు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిసూ ఎన్నికల ప్రచారం, సభలు సమావేశాల్లో మునిగిపోయారు. గోషామహల్పై ఆంతర్యమేమిటో? ఈసారి కూడా గోషామహల్ అసెంబ్లీ స్ధానంలో ఎంఐఎం పోటీకి దిగలేదు. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 82 వేల మందికిపైనే ఓటర్లు ఉండగా, అందులో 79 వేల వరకు పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. అయినప్పటికీ ఎన్నికల బరిలో దిగకపోవడానికి ఆంత్యరేమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్టుకోవడమే తమ లక్ష్యంగా పేర్కొనే మజ్లిస్ గోషామహల్ నియోజకవర్గంలో ఎందుకు అడ్డుకోవడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే ప్రశ్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేవనెత్తారు. గతంలో మహరాజ్ గంజ్లో ఉన్న నియోజకవర్గం పునర్విభజనలో భాగంగా గోషామహల్గా రూపాంతరం చెందింది. ► 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, ఆ తర్వాత వరుసగా రెండు పర్యాయాలుగా బీజేపీ గెలుపొందింది. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి గోషామహల్ సెగ్మెంట్ వస్తున్నప్పటికి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీకి దూరంగా ఉంటుంది. రాజకీయ మిత్ర పక్షం కావడంతో గతంలో కాంగ్రెస్కు, ఆ తర్వాత బీఆర్ఎస్కు మద్దతు ఇస్తూ వస్తోంది. అయితే.. ఇక్కడి నుంచి వరుసగా రెండు పర్యాయాలు బీజేపీ పక్షానా గెలుపొందిన రాజాసింగ్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీ నుంచి సస్పెండయ్యారు. కానీ టికెట్ల ప్రకటనకు ముందు సస్పెన్షన్ ఎత్తివేస్తూ రాజాసింగ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. ► ఇస్లాంపై విషం చిమ్ముతున్న రాజాసింగ్ను ఓడిస్తామని మజ్లిస్ ప్రకటించింది. ఈ నియోజవర్గంలోని ఆరు డివిజన్లలో రెండింటికి మజ్లిస్ పాతినిధ్యం వహిస్తోంది. మిగతా డివిజన్లలో సైతం పట్టు ఉంది. దీంతో పోటీ చేసేందుకు మజ్లిస్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పలువురు నేతలు ముందుకు వచ్చారు. కానీ.. బీఆర్ఎస్ అభ్యర్థికి సహకరించేందుకు మజ్లిస్ పోటీలో దిగకపోవడాన్ని పార్టీతో పాటు ముస్లిం వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ► ముస్లిం సామాజిక వర్గం గర్వించ దగ్గ భారత క్రికెట్ దిగ్గజం అజహరుద్దీన్ ఓటమే లక్ష్యంగా మజ్లిస్ ఎన్నికల బరిలో దిగిందా? అనే ప్రశ్నకు సమాధానం అవుననే వస్తోంది. గతంలో జూబ్లీహిల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల బరిలో దిగని మజ్లిస్ ఈసారి దిగడాన్ని ముస్లిం వర్గాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ► ఈ నియోజకవర్గంలో 1.20 లక్షల మందికి పైగా మైనారిటీ ఓటర్లు ఉన్నారు. గత రెండు పర్యాయాల క్రితం మజ్లిస్ పార్టీ పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. గత ఎన్నికల్లో పోటీ చేయకుండా టీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యేకు మద్దతు ప్రకటించింది. ఈసారి మిత్ర పక్షమైన బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంపై పోటీ దిగింది. కేవలం కాంగ్రెస్ అభ్యర్థి, ముస్లిం సామాజిక వర్గానికి చెందిన అజహరుద్దీన్ను ఓడించేందుకు మజ్లిస్ ఎన్నికల బరిలో దిగడాన్ని మింగుడుపడని అంశంగా తయారైంది. దీంతో మజ్లిస్ తీరుతో ముస్లిం ఓటర్లు దూరమయ్యే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది. -
పనిమనిషిపై అత్యాచారం కేసులో మురళీ ముకుంద్ అరెస్ట్
బంజారాహిల్స్: హైదరాబాద్లో పేరొందిన ఒక స్కూలుకు ఒకప్పుడు చైర్మన్గా పనిచేసిన ఒక విద్యాధికుడు అత్యంత హీనమైన చర్యకు పాల్పడ్డాడు. తన ఇంటిలో పనిచేసే యువతిని బెదిరించి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒక స్కూలుకు మార్గదర్శకునిగా వ్యవహరించిన ఆ వ్యక్తి ఇటువంటి దుర్మార్గానికి పాల్పడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12, మిథులానగర్లో నివాసముంటున్న జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ చైర్మన్ మురళీముకుంద్ తన ఇంట్లో పని చేసే యువతిని బెదిరించి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టు న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. బాధితురాలు ఈ నెల 18న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన దరిమిలా పోలీసులు మురళీ ముకుంద్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మురళీ ముకుంద్కు 14 రోజుల పాటు జ్యుడీషీయల్ రిమాండ్ను విధించారు.ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా, పరారీలో ఉన్న కుమారుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
విజయదశమి కావడంతో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో భక్తుల రద్దీ
-
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై వీడని ఉత్కంఠ!
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మొదటి జాబితాలో అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్రెడ్డి, మాజీ ఎంపీ, టీం ఇండియా మాజీ సారథి మొహమ్మద్ అజహరుద్దీన్ ఉన్నారు. తమకే టికెట్ లభిస్తుందనే ధీమాతో ఇదివరకే వారు నియోజకవర్గంలో తమ ప్రచారాలను చేసేసుకుంటున్నారు. ఎవరికివారే తమకే టికెట్ ఖారారు అయిందని, డివిజన్ల నేతలతో మీటింగ్లు, బస్తీలు, కాలనీల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మొదటి జాబితాలో తన పేరు వస్తుందని ఆశించిన ఇద్దరికీ నిరాశే ఎదురైంది. మరో రెండు రోజుల్లో తమకే టికెట్ అని నేతలతో చర్చలు కూడా జరిపారు. అయితే గురువారం కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మాజీ ఎంపీ అజహరుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు జరిగిన అవినీతిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో అధిష్టానం అజహరుద్దీన్ సీటు ఇచ్చే విషయంలో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అవినీతి మరకతో ఎన్నికల బరిలోకి దిగితే ప్రత్యర్థి పార్టీలు దుమ్మెత్తిపోస్తాయనే ఆందోళన.. ఆలోచనలో పడింది. దాదాపు లక్షకుపైగా మైనార్టీ ఓట్లు ఉన్న నియోజకవర్గంలో అజహరుద్దీన్ అభ్యర్థి అయితే కాంగ్రెస్ కలిసివస్తుందని, సెటిలర్లు సైతం తమకే మొగ్గు అనే సంబరాల్లో ఉన్న అజహరుద్దీన్ టీం ఇప్పుడు ఇరకాటంలో పడిందనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్రెడ్డికే టికెట్ ఖరారయ్యే అవకాశాలున్నాయని ఆయన వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. మధ్యలో కాంగ్రెస్ అధిష్టానం మరో ట్విస్ట్కు తెరలేపింది. ఎంఐఎం నుంచి ఒకసారి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన నవీన్యాదవ్కు ఢిల్లీకి పిలిపించింది. యువనేతగా బలమైన పోటీనిచ్చే వ్యక్తిగా బలాన్ని తెలుసుకొని పిలిపించారని సమాచారం. అయితే టికెట్ ఇస్తేనే కాంగ్రెస్లో ఉంటానని, లేకుండా ఎంఐఎం లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ధీమాగా వారికి చెప్పారని రాజకీయ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సారి తమకు మద్దతు ఇవ్వాలని, ఎంపీ అవకాశం ఇస్తామని చెప్పారట. ఎమ్మెల్యేగానే అవకాశం ఇవ్వాలని కోరారట. కాంగ్రెస్ అధిష్టానం విష్ణు వైపు మొగ్గు చూపుతుందా... మైనార్టీల బలంతో అజహరుద్దీన్కే టికెట్ ఇస్తారా.. లేక.. పోటీలో ఉన్న ఇద్దరినీ కాదని.. కొత్త వ్యక్తి ప్రత్యర్థితో బలంగా నిలబడే నవీన్యాదవ్ లాంటి వ్యక్తికి చాన్స్ ఇస్తుందా అనే విషయంలో త్వరలో తేలిపోతుంది. -
జూబ్లీహిల్స్ లో అమానుష ఘటన
-
పంజరం నుంచి ఎగిరిపోయిన ఆస్ట్రేలియా జాతి గాలా కాక్టో
హైదరాబాద్: తాను ఎంతో ఇష్టంగా విదేశాల నుంచి తెచ్చుకొని పెంచుకుంటున్న అరుదైన చిలుక కనిపించకపోవడంతో యజమాని జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఒక రోజు వ్యవధిలోనే ఆ చిలుకను గుర్తించి యజమానికి అప్పగించారు. ఎస్ఐ ఎంఎం రాకేష్ తెలిపిన వివరాల ప్రకారం..జూబ్లీహిల్స్ రోడ్ నెం.44(ఏ)లో నరేంద్రచారి మైరు బిస్ట్రో కాఫీ షాపును నడిపిస్తున్నాడు. ఆయనకు పక్షులంటే మహా ప్రాణం. ఆస్ట్రేలియా జాతికి చెందిన గాలా కాక్టో అనే చిలుకను అక్కడి నుంచే తెప్పించుకొని అపురూపంగా పెంచుకుంటున్నాడు. అయితే ఇటీవల ఈ చిలుక పంజరం నుంచి ఎగిరిపోయింది. దీంతో తన చిలుక కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి దాని ఫొటోను కూడా అందించాడు. నాలుగు నెలల వయసున్న ఈ చిలుక ఖరీదు రూ.1.30 లక్షలుగా యజమాని తెలిపాడు. ఎక్సోటిక్ బర్డ్గా గుర్తింపు పొందిన ఈ చిలుకను తాను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నానని, దీనికి లైసెన్స్ కూడా ఉందని రెండు కాళ్లకు ఆ దేశం నుంచి ఇక్కడికి తీసుకొచ్చేందుకు రెండు రింగులు కూడా ఉంటాయని వెల్లడించారు. ఎస్ఐ ఈ చిలుక ఫొటోలను జూబ్లీహిల్స్లోని పెట్షాప్స్కు పంపించారు. ఎవరైనా ఈ చిలుకను అమ్మితే వారి వివరాలు తెలపాల్సిందిగా సూచించారు. ఓ వ్యక్తి ఈ చిలుకను ఎలా పట్టుకున్నాడో తెలియదు కానీ మూడు రోజుల క్రితం ఎర్రగడ్డలో రూ.30 వేలకు ఓ పక్షి ప్రేమికుడికి విక్రయించాడు. అదే వ్యక్తి ఆ తెల్లవారి రూ.50 వేలకు సయ్యద్ ముజాహిద్కు అక్కడే విక్రయించాడు. ఈ చిలుకను కొనుగోలు చేసిన ముజాహిద్ తన వద్ద ఖరీదైన, అరుదైన గాలా కాక్టో ఆస్ట్రేలియన్ జాతి చిలుక ఉందని రూ.70 వేలకు విక్రయిస్తానంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. జూబ్లీహిల్స్లోని ఓ పెట్షాప్ నిర్వాహకుడు ఈ స్టేటస్ చూసి జూబ్లీహిల్స్ ఎస్ఐకి సమాచారం ఇచ్చాడు. ఫోన్ నెంబర్ ఆధారంగా సదరు వ్యక్తిని గుర్తించి స్టేషన్కు రప్పించడమే కాకుండా తన దగ్గర బంధీగా ఉన్న చిలుకను యజమాని నరేంద్రాచారికి అప్పగించారు. దాదాపు ఇక దొరకదేమో అనుకున్న తన పెంపుడు చిలుక కనిపించేసరికి నరేంద్రాచారి ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. కష్టపడి చిలుకను పట్టుకొని అప్పగించినందుకు పోలీసులకు కతజ్ఞతలు తెలిపారు. -
జూబ్లీహిల్స్లోని ఎంపీఎఫ్ స్టైల్ క్లబ్లో మెన్స్ వాక్లో అదరగొట్టిన యువకులు (ఫోటోలు)
-
జూబ్లీహిల్స్ : అక్షర ఆనంద్ ఆధ్వర్యంలో వైట్ నైట్ థీమ్తో వేడుక (ఫొటోలు)
-
హవ్వ.. చెట్లను కొట్టేసి మొక్కలు నాటుతారట?
హైదరాబాద్: హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటేందుకు పార్కులో ఉన్న చెట్లను కొట్టేసిన వైనమిది. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 72లోని జీహెచ్ఎంసీ పార్కులో గత రెండు, మూడు రోజులుగా భారీ చెట్లను కొట్టేస్తుండటంతో కాలనీవాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉన్న చెట్లను కొట్టేసి కొత్తగా మొక్కలు నాటడం ఏంటని అధికారుల తీరుపై విరుచుకుపడ్డారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 72లో ప్రశాసన్నగర్ రోడ్డులో ఈ విశాలమైన పార్కులో దశాబ్ధాలుగా చెట్లు పెరుగుతున్నాయి. అయితే హరితహారంలో 2 వేల మొక్కలు నాటేందుకు సంబంధిత యూబీడీ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ మొక్కలు నాటేందుకు ఈ పార్కులో సుమారుగా 20 భారీ చెట్లను కొట్టేశారు. ఇదేమిటని కాలనీవాసులు అడిగితే మాకేమి తెలియదంటూ చేతులెత్తేశారు. కొట్టేసిన చెట్ల కొమ్మలను అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. జీహెచ్ఎంసీ సర్కిల్–18 యూబీడీ నిర్వాహకులు ఈ వ్యవహారంపై నోరుమెదపడం లేదు. కాంట్రాక్టర్ కొట్టేశాడని అటవీ శాఖాధికారులకు చెప్పి కేసు నమోదు చేయిస్తామంటూ బుకాయించారు. ఇన్ని చెట్లు కొట్టేశాక కేసు పెడితే ఉపయోగం ఏంటంటూ కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశం అయింది. హరితహారం సమయంలో పచ్చని చెట్లను కొట్టేయడం ఏ మేరకు సమంజసమో జీహెచ్ఎంసీ అధికారులే తెలపాలంటూ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జూబ్లీహిల్స్లో అజారుద్దీన్ వర్సెస్ విష్ణువర్ధన్!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీ హిల్స్ నియోజక వర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు బయటపడ్డాయి. మాజీ భారత క్రికెట్ కెప్టెన్ మహమద్ అజారుద్దీన్ జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఒకటి బలంగా నడుస్తోంది. ఈ క్రమంలో.. ఇవాళ(బుధవారం) నియోజకవర్గంలో అజారుద్దీన్ వర్గం సమావేశం నిర్వహించగా.. పీజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్రెడ్డికి చెందిన వర్గం ఎంట్రీతో పరిస్థితి వేడెక్కింది. అజారుద్దీన్ ఇవాళ రెహమత్ నగర్లో సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో విష్ణువర్ధన్రెడ్డి అనుచరులు సమావేశాన్ని అడ్డుకున్నారు. విష్ణుకు చెందిన నియోజకవర్గంలో ఆయనకు సమాచారం అందించకుండా మీటింగ్ ఎలా పెడతారంటూ నిలదీశారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకోగా.. పోలీసులు సైతం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ఇదే నిజయోకవర్గం నుంచి విష్ణువర్దన్రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. దీంతో రాబోయే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇక మహమద్ అజారుద్దీన్ 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరి.. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మోరాదాబాద్(యూపీ) నుంచి ఎంపీగా నెగ్గారు. 2019లో సికింద్రాబాద్ పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించినా.. భంగపాటే ఎదురైంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ప్రెసిడెంట్గా ఉన్న అజారుద్దీన్.. ఎలాగైనా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికలపై ప్రత్యేక కథనాల కోసం క్లిక్ చేయండి -
హైదరాబాద్లో మరోసారి ఈడీ సోదాలు కలకలం.. 15 బృందాలతో దాడులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మరోసారి ఈడీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. జూబ్లీహిల్స్, మణికొండ, పంజాగుట్టలో మంగళవారం(ఆగస్టు1) ఉదయం నుంచే దాడులు జరుపుతోంది. మాలినేని సాంబశివరావుతో పాటు పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మొత్తం 15 బృందాలతో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. కాగా మాలినేని సాంబశివరావు నాలుగు కంపెనీలకు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ట్రాన్స్ ట్రై పవర్ ప్రాజెక్ట్, టెక్నో యూనిట్ ఇన్ఫ్రా టెక్, కాకతీయ క్రిస్టల్ పవర్ లిమిటెడ్, ట్రాన్స్ ట్రై రోడ్డు ప్రాజెక్ట్లకు డైరెక్టర్గా ఉన్నారు. ఇదిలా ఉండగా 2020 జనవరిలో మలినేని సాంబశివరావు కంపెనీపై సీబీఐ దాడులు జరిపింది. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ నుంచి ట్రాన్స్ ట్రాయ్ సింగపూర్ లిమిటెడ్కు నిధులు బదిలీ అయ్యాయన్న ఆరోపణలతో సోదాలు జరిపింది. దీంతో మనీలాండరింగ్ జరిగినట్టు ఈడి అభియోగం మోపింది. యూనియన్ బ్యాంక్ నుండి ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ రూ. 300 కోట్ల రూపాయల రుణాలు పొందగా.. తిరిగి ఆ రుణాలు చెల్లించకపోవడంపై సీబీఐ కేసు నమోదు చేసింది. రూ. 260 కోట్ల రూపాయలను ఇతర కంపెనీకి మళ్ళీ ఇచ్చినట్టు సీబీఐ గుర్తించింది. లోన్ కోసం తీసుకున్న డబ్బులను బంగారం, వెండి ఆభరణాలకు ఖర్చు చేశారంటూ ఆరోపించింది. 2013లో ట్రాన్స్ ట్రాయ్ను కెనరా బ్యాంక్ ఆడిట్ చేసింది. అప్పటినుంచి బ్యాంక్ల లిస్ట్లో నాన్ పర్ఫామింగ్ అసెట్గా మారింది ట్రాన్స్ ట్రాయ్. ఇక ఇదే కంపెనీకి మలినేని సాంబశివరావు డైరెక్టర్గా ఉన్నారు. చదవండి: సీఎం కేసీఆర్ ప్రజలనే కాదు, రాముడినీ మోసం చేశారు: భట్టి -
ప్రజాగాయకుడు గద్దర్కు అస్వస్థత
హైదరాబాద్: ప్రముఖ కవి, ప్రజా గాయకుడు గద్దర్(74) అస్వస్థతకు లోనయ్యారు. చికిత్స కోసం హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరారు. అయితే ఆయన ఏ ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరాన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ప్రజా శాంతి పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించిన ఆయన గత నెలలో కొత్త పార్టీ ప్రకటించారు. గద్దర్ ప్రజా పార్టీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టి.. ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఆ టైంలో తెలిపారాయన. -
డింపుల్ హయాతి వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్!
ఐపీఎస్ అధికారి, డీసీపీ రాహుల్ హెగ్డే, రామబాణం హీరోయిన్ డింపుల్ హయాతి మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. డీసీపీ కారును కాలితో తన్నడమే కాకుండా తన బెంజికారుతో రివర్స్లో వచ్చి ఢీకొట్టి దుర్భాషలాడిందంటూ నటిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే తాజాగా ఈ కోర్టుపై డింపుల్ హయాతి హైకోర్టును ఆశ్రయించింది. (ఇది చదవండి: ఐపీఎస్ ఆఫీసర్ కారును తన్నిన డింపుల్ హయాతి..కేసు నమోదు..) తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో డింపుల్ హయాతి పిటిషన్ దాఖలు చేసింది. ట్రాఫిక్ డీసీపీ ఒత్తిడితోనే తప్పుడు కేసు పెట్టారని పిటిషన్లో పేర్కొంది. అయితే డింపుల్ హయాతికి సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. అయితే వాదనలు విన్న న్యాయస్థానం.. సీఆర్పీసీ 41ఏ నిబంధనల మేరకే వ్యవహరించాలని పోలీసులను ఆదేశించింది. కాగా.. ఐపీఎస్ అధికారి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారుపై డింపుల్ హయాతి దాడి చేశారన్న ఆరోపణలతో ఆయన డ్రైవర్ చేతన్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డింపుల్ హయాతి, డేవిడ్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. (ఇది చదవండి: ఆదిపురుష్ టీం సంచలన నిర్ణయం..వారి కోసమే!) -
నిధులు మళ్లించాం.. కానీ ఎక్కడికో తెలియదు
తమ చందాదారుల నుంచి ఎంత మొత్తం వసూలు చేశారో తెలియదు! బ్రాంచీలు, ప్రధాన కార్యాలయంలో ఉన్న నిధులెన్నో తెలియదు! మిగిలిన నిధులను ఎక్కడికి మళ్లించారో కూడా తెలియదు! కేంద్ర చిట్ఫండ్స్ చట్టం గురించి ఏమాత్రం తెలియదు! అసలు నాకేమీ తెలియదు.. తెలియదు.. తెలియదు!! –సీఐడీ విచారణలో మార్గదర్శి ఎండీ శైలజ తీరు ఇదీ సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో ఏ–2గా ఉన్న సంస్థ ఎండీ చెరుకూరి శైలజా కిరణ్ను సీఐడీ అధికారులు మంగళవారం హైదరాబాద్లో మరోసారి విచారించారు. సీఐడీ ఎస్పీలు అమిత్ బర్దర్, హర్షవర్థన్రాజు, విచారణ అధికారి రవికుమార్తోపాటు 30 మందితో కూడిన సీఐడీ అధికారుల బృందం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆమె నివాసానికి ఉదయం 10 గంటలకు చేరుకోగా దాదాపు అరగంటపాటు గేటు తాళం తీయలేదు. అనంతరం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సీఐడీ విచారణ కొనసాగింది. ‘మీరు మార్గదర్శి చిట్ఫండ్స్ ఎండీ కదా? మీ పేరిటే చెక్ పవర్ కూడా ఉంది. నిధుల మళ్లింపుపై ఆధారాలు ఇవిగో..! మరి వీటిపై ఏమంటారు..?’ అని సీఐడీ అధికారులు సూటిగా ప్రశ్నించడంతో ‘నాకు ఆరోగ్యం బాగా లేదు! నేను సమాధానాలు చెప్పలేకపోతున్నా.. ఇబ్బంది పెట్టొద్దు..’ అంటూ శైలజా కిరణ్ తప్పించుకునేందుకు యత్నించారు. విచారణకు సహకరించకుండా.. తనకు ఆరోగ్యం బాగా లేదని, విదేశాల నుంచి రావడంతో జ్వరం వచ్చిందంటూ శైలజా కిరణ్ విచారణకు సహకరించకుండా చాలాసేపు జాప్యం చేశారు. విచారణ మొదలైన కొద్దిసేపటికే జ్వరంగా ఉందని, కళ్లు తిరుగుతున్నాయంటూ వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆమెను పరీక్షించిన డాక్టర్ కొన్ని మాత్రలు సూచించి విచారణ కొనసాగించవచ్చని చెప్పారు. సీఐడీ అధికారులు మళ్లీ విచారణ చేపట్టిన కొద్దిసేపటికే మరోసారి తనకు ఆరోగ్యం సహకరించడం లేదని శైలజా కిరణ్ పేర్కొన్నారు. విచారణను అర్ధాంతరంగా ముగించేందుకు ప్రయత్నించగా సీఐడీ అధికారులు పూర్తి సహనం వహిస్తూ విచారణను కొనసాగించారు. మళ్లించాం... ఎక్కడికో తెలియదు! మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారుల నుంచి వసూలు చేసిన నిధులను ఎక్కడికి మళ్లించారనే విషయాన్ని తెలుసుకోవడంపై సీఐడీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. బ్రాంచీల కార్యాలయాల్లోని రికార్డుల ప్రకారం రూ.వేల కోట్లు చందాదారుల నుంచి వసూలు చేసినట్లు తేలింది. బ్యాంకు ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన రూ.793.50 కోట్లను అటాచ్ చేసేందుకు సీఐడీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చందాదారుల నుంచి భారీగా వసూలు చేసిన మిగతా నిధులను ఎక్కడికి మళ్లించారన్నది అంతుచిక్కని వ్యవహారంగా మారింది. రికార్డుల్లో సరైన వివరాలు లేకుండా ఆడిటర్ల ద్వారా అక్రమాలకు పాల్పడ్డారు. సీఐడీ అధికారులు అదే విషయంపై శైలజా కిరణ్ను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. ఏపీలోని 37 బ్రాంచి కార్యాలయాల ద్వారా వసూలు చేసిన చందా నిధులను ఇతర సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టామని పేర్కొనట్లు సమాచారం. నిర్దిష్టంగా ఎక్కడెక్కడ పెట్టుబడులుగా పెట్టారన్నది మాత్రం ఆమె వెల్లడించలేదు. దీనిపై సీఐడీ అధికారులు ఎంత ప్రశ్నించినా తనకేమీ తెలియదని శైలజా కిరణ్ చెప్పడం గమనార్హం. మార్గదర్శి చిట్ఫండ్స్ తమ చందాదారులకు చిట్టీల మొత్తాన్ని ఎందుకు చెల్లించలేకపోతోందని సీఐడీ అధికారులు శైలజా కిరణ్ను ప్రశ్నించగా సూటిగా సమాధానం ఇవ్వలేదు. చందాదారుల సొమ్ము భద్రంగా ఉందంటూ తప్పించుకునే యత్నం చేశారు. అదే నిజమైతే చిట్టీల మొత్తం ఎందుకు చెల్లించలేకపోతున్నారని సీఐడీ అధికారులు ప్రశ్నించగా ఆమె స్పందించలేదు. మరోసారి విచారణ విచారణకు శైలజా కిరణ్ సహకరించకపోవడంతో ఆమెకు మరోసారి నోటీసులు జారీ చేయాలని సీఐడీ అధికారులు నిర్ణయించారు. ఆమెకు అనుకూలంగా ఉన్న రోజే విచారించాలని భావిస్తున్నారు. ఈమేరకు త్వరలో మరోసారి నోటీసులు జారీ చేయనున్నారు. ఆ తరువాత రామోజీరావును కూడా మరోసారి విచారించాలని సీఐడీ భావిస్తోంది. చట్టాన్ని ఉల్లంఘించి... నిధులు కొల్లగొట్టి! మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థ ద్వారా చెరుకూరి రామోజీరావు, శైలజ భారీగా ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ సోదాల్లో ఆధారాలతో సహా వెల్లడైంది. రిజిస్ట్రేషన్ల శాఖ ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించి ఆర్థిక అక్రమాలను నిర్ధారించారు. కేంద్ర చిట్ఫండ్స్ చట్టం–1982 ప్రకారం చందాదారుల నుంచి వసూలు చేసిన నిధులను సంబంధిత బ్రాంచీ కార్యాలయాలున్న నగరాలు/పట్టణాల్లోని జాతీయ బ్యాంకుల్లోనే జమ చేయాలి. అందుకు విరుద్ధంగా మార్గదర్శి చిట్ఫండ్స్ రూ.వేల కోట్లను హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయానికి మళ్లించింది. చిట్ఫండ్స్ సంస్థలు తమ నిధులను ఇతర వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టకూడదు. మార్గదర్శి చిట్ఫండ్స్ మాత్రం తమ చందాదారుల నిధులను అత్యంత మార్కెట్ రిస్క్ ఉంటే మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లోకి మళ్లించింది. తమ కుటుంబ వ్యాపార సంస్థల్లో పెట్టుబడిగా పెట్టింది. చిట్ఫండ్స్ సంస్థలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదు. కానీ మార్గదర్శి చిట్ఫండ్స్ తమ చందాదారుల చిట్టీల మొత్తాన్ని పూర్తిగా వారికి ఇవ్వకుండా రశీదులిస్తూ 4 – 5 శాతం వడ్డీ చెల్లిస్తోంది. అంటే అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తోంది. పెద్ద ఎత్తున నల్లధననాన్ని తమ సంస్థ ముసుగులో చలామణిలోకి తెస్తున్నట్లు కూడా సీఐడీ గుర్తించింది. గత డిసెంబర్ నుంచి మార్గదర్శి చిట్ఫండ్స్ కొత్త చిట్టీలు వేయడం లేదు. ఇప్పటికే దాదాపు రూ.400 కోట్ల టర్నోవర్ నిలిచిపోయింది. చందాదారుల సొమ్మును గుర్తుతెలియని సంస్థల్లో పెట్టుబడిగా పెట్టింది. ఆ నిధులు ఇప్పటికిప్పుడు వచ్చే అవకాశం లేదు. దీంతో చందాదారులకు చిట్టీల మొత్తం చెల్లించలేకపోతోంది. -
జంక్షన్ క్లోజ్.. ట్రాఫిక్ జామ్
బంజారాహిల్స్: ట్రాఫిక్ సజావుగా సాగేందుకు బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ప్రయోగాలకు తెరలేపారు. ఇప్పటికే జూబ్లీహిల్స్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పలు సిగ్నళ్ల వద్ద జంక్షన్లను మూసివేయడంతో పాటు యూ టర్న్లను కొనసాగిస్తున్నారు. అదే పంథాను ఇప్పుడు బంజారాహిల్స్లో అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ రోడ్ నెం. 2లో ఎంతో కీలకమైన సాగర్ సొసైటీ సిగ్నల్ జంక్షన్ను అధికారులు మంగళవారం మూడు గంటల పాటు మూసివేశారు. మధ్యాహ్నం నుంచి 3 గంటల వరకు ట్రయల్ రన్గా ఈ జంక్షన్ను మూసివేసి వాహనాల రాకపోకలను ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో పాటు బంజారాహిల్స్ ట్రాఫిక్ సీఐ నరసింహ రాజు పరిశీలించారు. నాన్ పీక్ హవర్స్లో వాహనాల రాకపోకలు జంక్షన్ మూసివేత వల్ల ఎంత వరకు ఒత్తిడి పెరుగుతుంది, తగ్గుతుంది అనేది పరిశీలించారు. అయితే ఈ మూడు గంటల్లో రద్దీ లేని సమయాలు కాబట్టి వాహనాలు ముందుకు సాగాయని ట్రాఫిక్ పోలీసుల పరిశీలనలో వెల్లడైంది. టీవీ9 జంక్షన్ నుంచి సాగర్ సొసైటీ వైపు వెళ్లే వాహనదారులు కేబీఆర్ పార్కు చౌరస్తాలో యూ టర్న్ చేసుకుని రావాల్సి ఉంటుంది. అప్పటికే కేబీఆర్ పార్కు చౌరస్తాలో వందల సంఖ్యలో బారులు తీరిన వాహనాలకు తోడు ఈ వాహనాలు కూడా కలిపి చుక్కలు కనిపించాయి. ఇక కేబీఆర్ పార్కు వైపు సాగర్ సొసైటీ వైపు నుంచి వచ్చే వాహనాలు టీవీ 9 చౌరస్తాలో యూ టర్న్ తీసుకుని రావాల్సి ఉంటుంది. ఇది కూడా వాహనదారులకు నరకప్రాయంగా మారింది. రోడ్డు విస్తరించకుండా ఫుట్పాత్లు లేకుండా చేస్తున్న ఈ ట్రయల్ రన్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు తమకు తోచినట్లుగా ప్రయోగాలు చేస్తూ వాహనదారులపై రుద్దుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45 ట్రాఫిక్ మళ్లింపులతో చుట్టూ తిరిగి వస్తున్న వాహనదారులు ఒక వైపు అసహనం వ్యక్తం చేస్తుండగానే తాజాగా సాగర్ సొసైటీ చౌరస్తాలో మరో ప్రయోగానికి తెరలేపి గందరగోళం సృష్టించారు. ట్రాఫిక్ పోలీసులు చౌరస్తాల్లో ఉండి నియంత్రిస్తే ట్రాఫిక్ సజావుగా ముందుకు సాగుతుందని, అందుకు విరుద్ధంగా జంక్షన్లు మూసివేసి మీ దారిన మీరు పోండి అనే విధంగా ప్రయోగాలు చేస్తుండటంతో వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగర్ సొసైటీ జంక్షన్ మూసివేత విఫల ప్రయోగమని మొదటి రోజే తేటతెల్లమైంది. -
మూడేళ్ల క్రితం చూసి.. టార్గెట్ చేసి..
హైదరాబాద్: అసలే చాలీచాలని జీతం... ఆపై పెరిగిన ఖర్చులు... ఇవి చాలవన్నట్లు తండ్రి చేసిన అప్పులు... వెరసీ.. కస్టమర్ కేర్ స్పెషలిస్ట్గా ఉన్న పటేల్ మోతీరామ్ రాజేష్ యాదవ్ను నేరబాట పట్టించాయి. జూబ్లీహిల్స్లో నివసించే వ్యాపారి రాజు ఇంట్లోకి ఈ నెల 12న ప్రవేశించి, ఆయన కుమార్తె సహా కుటుంబీకులను ఆరు గంటలు నిర్బంధించి రూ.10 లక్షలు దోచుకుపోయిన ఇతగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్న సిబ్బందిని మంగళవారం తన కార్యాలయంలో అభినందించిన కొత్వాల్ సీవీ ఆనంద్.. కేసు పూర్వాపరాలు వెల్లడించారు. ప్రస్తుతం మాదాపూర్లోని ఓ సంస్థలో కస్టమర్ కేర్ స్పెషలిస్ట్గా పని చేస్తున్న రెజిమెంటల్ బజార్ వాసి రాజేష్ తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం నేరాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఓటీటీ ఫ్లాట్ఫామ్లో ఉన్న క్రైమ్ సిరీస్లు వరుసపెట్టి చూసిన ఇతగాడు దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నాడు. వాటి ద్వారానే ఏ ఆధారాలు దొరక్కుండా ఎలా చేయాలో కూడా నేర్చుకున్నాడు. మూడేళ్ల క్రితం మరో సంస్థలో పని చేసిన ఇతగాడిని నిత్యం కంపెనీ క్యాబ్ వచ్చి పికప్ చేసుకుని వెళ్లేది. ప్రతి రోజూ జూబ్లీహిల్స్ రోడ్ నెం.52లో మరికొందరినీ ఈ క్యాబ్ ఎక్కించుకునేది. అప్పట్లో రాజేష్ ప్రతి రోజూ రాజు ఇంటిని చూసేవాడు. దాని తీరుతెన్నులు, వచ్చిపోయే వాళ్లు ఇప్పటికీ గుర్తుండిపోవడంతోనే ఆ ఇంటిని టార్గెట్ చేసుకున్నాడు. నేరం చేయడానికి ఒక రోజు ముందు రెక్కీ చేశాడు. అదే రోజు అర్ధరాత్రి దాటాక ఇంట్లోకి ప్రవేశించి, గర్భిణిగా ఉన్న రాజు కుమార్తె నవ్య మెడపై కత్తి పెట్టి రూ.20 లక్షలు డిమాండ్ చేశాడు. ఆమె తమ ఇంట్లో ఉన్న రూ.2 లక్షలకు అదనంగా మరో చోట ఉన్న భర్త నుంచి మరో రూ.8 లక్షలు తెప్పించి ఇచ్చింది. ఈ ఆరు గంటలూ అతగాడు ఆమెతో ఆంగ్లంలో మాట్లాడుతూ, వివిధ రకాలైన అప్లికేషన్లు, సాఫ్ట్వేర్స్పై చర్చించాడు. చివరకు నవ్య ఫోన్ నుంచి క్యాబ్ బుక్ చేసుకుని పరారయ్యాడు. 1200 ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్తో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి ముందుకు వెళ్లిన జూబ్లీహిల్స్ పోలీసుల నిందితుడిని అరెస్టు చేసి రూ.9.5 లక్షలు రికవరీ చేశారు. -
జూబ్లీహిల్స్ పబ్లో పాములు, తొండలు.. కస్టమర్లను ఆకర్షించేందుకు
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా పబ్ అంటే అందరికీ గుర్తొచ్చేది మ్యూజిక్, డ్యాన్స్, మందు.. వీకెండ్ వచ్చిందంటే చాలు పబ్బులో యూత్ తెగ ఎంజాయ్ చేస్తుంటారు కానీ హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 36లోని ఓ పబ్ వినూత్నంగా ఆలోచించింది. ఇవన్నీ రొటీన్ అనుకొని ఏకంగా జంతువుల ప్రదర్శన ఏర్పాటు చేశారు నిర్వాహకులు. పాములు, తొండలు, కుక్కలు వంటి వైల్డ్ జంతువులను పెట్టి కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వైల్డ్ జంగిల్ పార్టీ థీమ్లో భాగంగా జూబ్లీహిల్స్లోని క్సోరా (Xora) నైట్ క్లబ్ ఇటీవల తమ పబ్లో విదేశీ వన్యప్రాణులను చేర్చింది. ట్విట్టర్ ద్వారా ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. క్సోరా నైట్క్లబ్ ఈ వారాంతంలో తమ పబ్లో అన్యదేశ వన్యప్రాణులను ప్రదర్శనకు ఉంచారని. దీనికి సంబంధించిన ఫోటోలు వారి ఇన్స్టాగ్రామ్ పేజీలో ఉన్నాయని, దయచేసి చర్యలు తీసుకోండంటూ ఆశిష్ అనే వ్యక్తి పోలీసులను కోరారు. Taking it up with @TelanganaDGP @CVAnandIPS @TelanganaCOPs and PCCF The audacity is shameful & shocking https://t.co/JADNkZLMAL — Arvind Kumar (@arvindkumar_ias) May 29, 2023 దీనిపై పలువురు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్లబ్బుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రీట్వీట్ చేస్తూ.. ఇది సిగ్గుచేటు సంఘటన అని వర్ణించారు. దీనిని తెలంగాణ డీజీపీ,సీపీ సీవీ ఆనంద్, తెలంగాణ పోలీస్, పీసీసీఎఫ్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులకు జూబ్లీహిల్స్ పోలీసులు సమాచారం అందజేశారు. కాగా నెల క్రితం కూడా సైబరాబాద్లోనూ ఇదే రీతిలో పబ్ లో జంతువులను ప్రదర్శనకు పెట్టారు నిర్వాహకులు. పాత బస్తీ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి నుంచి జంతువులను తీసుకొచ్చినట్టు నిర్వహకులు చెబుతున్నారు. అయితే పబ్లో జంతువులను ప్రదర్శించడంపై క్సోరా నైట్ క్లబ్ నిర్వాహకులు స్పందించారు. పబ్లో ఉపయోగిస్తున్న ఎక్సోటిక్ అనిమల్స్ లైసెన్స్తో పాటు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని తెలిపింది. సదరు జంతువుల వల్ల ఏ హాని ఉండదని పేర్కొంది. చదవండి: Aksha: ఆరేళ్ల క్రితం విడిపోయిన అమ్మానాన్నలను ఒక్కటి చేసిన చిన్నారి! Here's video footage of the wildlife on display from the Instagram page of Xora Bar & Kitchen, Jubilee Hills Rd#36 @cyberabadpolice. pic.twitter.com/XF56uI1keh — Ashish Chowdhury (@ash_chowder) May 29, 2023 Lol okay. pic.twitter.com/TdRQByEQQU — Ashish Chowdhury (@ash_chowder) May 30, 2023 -
Hyderabad: గర్భిణి మెడపై కత్తి పెట్టి రూ.10 లక్షలు చోరీ..
బంజారాహిల్స్: గర్భిణి మెడపై కత్తి పెట్టి రూ.10 లక్షలు చోరీ చేసిన ఘటనలో నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 58లో నివసించే ప్రముఖ వ్యాపారి ఎన్.ఎస్.ఎన్.రాజు ఇంట్లోకి ఈ నెల 12వ తేదీ తెల్లవారుజామున ఓ యువకుడు ప్రవేశించి ఆయన కూతురు నవ్య బెడ్రూంలోకి వెళ్లి ఆమె మెడపై కత్తి పెట్టి రూ. 25 లక్షలు డిమాండ్ చేశాడు. గదిలోకి వచి్చన ఆమె తల్లి లీలను కూడా బెదిరించాడు. తన భర్తకు ఫోన్ చేసిన బాధితురాలు రూ. 8 లక్షలు తెప్పించి ఇంట్లో ఉన్న రూ. 2 లక్షలు కలిపి మొత్తం రూ. 10 లక్షలు నిందితుడికి ఇవ్వడంతో పాటు తన సెల్ఫోన్ నుంచి క్యాబ్ బుక్ చేయడంతో అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. కేవలం సెల్ఫోన్ ఆధారాలు మాత్రమే ఉండగా నిందితుడి కోసం పోలీసులు సాంకేతికతను వినియోగించారు. అదే రోజు మధ్యాహ్నం షాద్నగర్కు వెళ్లిన నిందితుడు తన కదలకలను పోలీసులు గుర్తుపట్టకుండా ఉండేందుకు నాలుగైదు గంటలు అక్కడే గడిపి తిరిగి క్యాబ్ బుక్ చేసుకొని సికింద్రాబాద్లోని రెజిమెంటల్ బజార్లో ఉన్న తన ఇంటికి వచ్చాడు. ఆ తెల్లవారే దొంగిలించిన డబ్బులో నుంచి రూ. 2.50 లక్షలు వెచి్చంచి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనుగోలు చేశాడు. జల్సాలకు అలవాటుపడ్డ నిందితుడు శుక్రవారం ఉదయం శామీర్పేట్లోని ఓ ఫామ్ హౌజ్లో స్నేహితులకు విందు ఇస్తున్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా నిందితుడు రెజిమెంటల్ బజార్లో నివసించే మోతిరాం రాజేష్ యాదవ్ (27)గా తేలింది. తన ఇంట్లో అప్పులతో పాటు తన జల్సాలకు డబ్బుల కోసమే ఈ దొంగతనానికి పాల్పడినట్లుగా పోలీసుల విచారణలో ఒప్పుకొన్నట్లు సమాచారం. నిందితుడి నుంచి మరింత సమాచారాన్ని రాబడుతున్నారు. చోరీ చేసిన సొత్తును రికవరీ చేసే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. నిందితుడు జూబ్లీహిల్స్లోని ఏదైనా ఓ ఇంట్లోకి దూరి రూ. 25 లక్షలు ఎత్తుకెళ్లాలనే పథకంతో రోడ్ నెం 52లో తిరుగుతుండగా ప్రతి ఇంటి ప్రహరీ గోడ ఎత్తుగా ఉండటంతో లోపలికి దూకడం కష్టతరమైంది. ఒక్క ఎన్ఎస్ఎన్ రాజు నివాస ప్రహరీ మాత్రమే చిన్నగా ఉండటంతో ఆ ఇంటిని ఎంపిక చేసుకొని పక్కా ప్రణాళికతో ఇంట్లోకి దూరినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. -
సెల్ నెంబరే కీలకం!
బంజారాహిల్స్: సినీ ఫక్కీలో జరిగిన జూబ్లీహిల్స్ దొంగతనం కేసులో నిందితుడి జాడ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఒక వైపు టాస్్కఫోర్స్ పోలీసులు, ఇంకోవైపు క్రైం పోలీసులు ఎనిమిది బృందాలుగా రాష్ట్రంతో పాటు సరిహద్దులు, ఇతర రాష్ట్రాలను జల్లెడపడుతున్నాయి. ఎనిమిది గంటల పాటు గర్భిణిని బంధించి మెడపై కత్తి పెట్టి రూ.10 లక్షలతో ఉడాయించిన ఘటనలో నిందితుడు వాడిన సెల్ఫోన్ నెంబర్ కీలకంగా మారనుంది. మూడుచోట్ల ఈ సెల్ఫోన్ వినియోగించడంతో పోలీసులు టవర్డంప్ చేస్తూ నిందితుడు ఎవరెవరితో మాట్లాడాడు.. ఫోన్ నెంబర్ ఏంటి అన్నదానిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ఒకటి, రెండు రోజుల్లో నిందితుడి ఆచూకీ పట్టుకునే దిశలో పోలీసులు ప్రయత్నాలు ముమ్మరంచేశారు. వైన్ బాటిల్ ఖాళీ చేశాడు... జూబ్లీహిల్స్ రోడ్ నెం.52లో నివసించే ప్రముఖ వ్యాపారి నడింపల్లి సత్యనారాయణ రాజు అలియాస్ ఎన్ఎస్ఎన్.రాజు ఇంట్లోకి గురువారం రాత్రి గుర్తు తెలియని ఆగంతకుడు ప్రవేశించాడు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఎన్ఎస్ఎన్ రాజు ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించాడు. అదే సమయంలో శుభకార్యం ముగించుకొని ఇంటికి వచ్చి న రాజు..ఆయన పెద్ద కూతురు అత్త, మామలు ఇంట్లోకి రాగా వారి వెనుకాలనే నిందితుడు కూడా ప్రవేశించాడు. కొద్దిసేపటికే ఇంట్లోకి వచ్చిన పనిమనిషి అక్కడ నిల్చున్న ఆగంతకుడిని చూసి ఎన్ఎస్ఎన్.రాజు పెద్ద కూతురి అత్త, మామల డ్రైవర్ అని భ్రమపడి లోనికి వెళ్లిపోయింది. కొద్దిసేపట్లోనే పెద్ద కూతురు అత్తమామలు వెళ్ళిపోగా రాజు ఆయన భార్య లీల తమ గదిలో నిద్రించారు. మరో గదిలో చిన్న కూతురు నవ్య వర్క్ఫ్రం హోం ముగించుకొని రాత్రి 1.30 గంటల సమయంలో వాట్సాప్ మెసేజ్ చూస్తుండగా ఆగంతకుడు ఆమె బెడ్రూమ్లోకి ప్రవేశించాడు. అరిస్తే పొడిచేస్తానంటూ కత్తి చూపి బెదిరించాడు. దీంతో ఆమె నోరు మెదపలేదు. తనకు రూ. 20 లక్షలు కావాలని డిమాండ్ చేశాడు. ఇంట్లో అరకిలో ఆభరణాలు ఉన్నాయని, తన చెవులకు రూ.15 లక్షల విలువ చేసే వజ్రాలు పొదిగిన కమ్మలు ఉన్నాయని, అవి తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేయగా తనకు కేవలం డబ్బులే కావాలని, నగలు కాదని చెప్పాడు. ఓ వైపు ఆమెతో మాట్లాడుతూనే ఇంకోవైపు ఇంట్లోనే ఉన్న వైన్ తాగుతూ..ఆమెతో ముచ్చటిస్తూ మరో వైపు తన ఫోన్లో చాటింగ్చేస్తూ ఇంకోవైపు రూ.20 లక్షలు ఎలాగైనా తెప్పించాలంటూ ఆమెపై ఒత్తిడి పెంచాడు. మాట వినకపోతే పొడుస్తానంటూ తరచూ ఆమెను బెదిరించసాగాడు. ఆమె ఇంటి విషయాలపై కూడా చర్చించాడు. మీ అక్క నాలుగేళ్ల కూతురు ఉండాలి కదా..ఆమె ఎక్కడ అంటూ ప్రశ్నించాడు. మీ గుట్టు మొత్తం నాకు తెలుసు డబ్బులు లేవంటే నమ్మను అంటూ లీలను హెచ్చరించాడు. ఇంట్లో నుంచే ఫోన్లో చాటింగ్ చేస్తూ వారితో మాట్లాడుతూ వారి యోగ క్షేమాలు తెలుసుకుంటూ కుటుంబ వివరాలు కనుక్కుంటూ డబ్బులు వచ్చేదాకా కాలంగడిపాడు. రెక్కీ నిర్వహించిన సమయంలో రోడ్డుపై ఒకసారి నిందితుడు ఫోన్లో మాట్లాడినట్లుగా ఇక్కడ సీసీ ఫుటేజీలు స్పష్టం చేస్తున్నాయి. ఇంట్లో ఛాటింగ్ చేసిన విషయం కూడా బాధితురాలు తెలిపింది. షాద్నగర్లో కారు దిగి బస్టాప్కు వెళ్లే క్రమంలో ఓ చోట ఆగి ఫోన్ మాట్లాడినట్లుగా అక్కడి సీసీఫుటేజీలు వెల్లడిస్తున్నాయి. ఈ మూడు సంఘటనల్లో సెల్ఫోన్ సిగ్నల్స్పైనే పోలీసులు ప్రధానంగా దృష్టిపెట్టారు. తనది నాందేడ్ అని నిందితుడు చెప్పిన క్రమంలో ఓబృందం అటు వైపు వెళ్ళింది. మరో బృందం బెంగళూరుకు, గోవాకు, ముంబైకి వెళ్ళింది. -
ఆరు గంటలు.. ఇంట్లోనే మకాం వేసి.. 10 లక్షలు దోచేసి.. క్యాబ్లో చెక్కేసి..
బంజారాహిల్స్ (హైదరాబాద్): తల్లి, కూతురును కత్తితో బెదిరించి ఓ ఆగంతకుడు రూ.10 లక్షలతో ఉడాయించాడు. నిందితుడి కోసం జూబ్లీహిల్స్ పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నం. 52లో ప్రముఖ వ్యాపారి ఎన్.ఎస్.ఎన్.రాజు నివాసం ఉంటున్నారు. కుటుంబం అంతా గురువారం రాత్రి ఓ శుభకార్యానికి వెళ్లి శుక్రవారం తెల్లవారు జామున 3.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చింది. అప్పటి వరకు ఇంటి పరిసరాల్లో కాపుకాసిన ముసుగు ధరించిన ఓ యువకుడు.. గోడ మీదుగా నిచ్చెన వేసుకొని ఇంటి ఆవరణలో దిగాడు. రాజు కుటుంబ సభ్యులు ఇంట్లోకి వెళ్తున్న సమయంలోనే వారి కళ్లుగప్పి లోనికి ప్రవేశించాడు. తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో రాజు కూతురు నడింపల్లి నవ్య (30) ఉంటున్న గదిలోకి వెళ్లి కత్తి చూపించి బెదిరించాడు. ఈ హఠాత్ పరిణామంతో ఎనిమిదిన్నర నెలల నిండు గర్భిణి అయిన నవ్య.. ఆ ఆగంతకుడిని చూసి వణికిపోయింది. అరిచేందుకు యత్నించగా.. ఆమెను కత్తితో పొడుస్తానని హెచ్చరించాడు. రూ.10 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. తన ఒంటి మీద, బీరువాలో ఉన్న నగలు ఇస్తానని తన దగ్గర నగదు లేదని ఆమె వేడుకుంది. అయినాసరే ఆ దొంగ వినిపించుకోలేదు. ఈ క్రమంలో నవ్య పెట్టిన కేకలతో అప్రమత్తమైన ఆమె తల్లి లీల(54) ఆ గదిలోకి పరిగెత్తుకురాగా.. ఆ ఆగంతకుడు ఆమెను కూడా కత్తితో బెదిరించి ఓ మూలన కూర్చోబెట్టాడు. ఎవరికైనా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి డబ్బులు తెప్పించాల్సిందిగా బెదిరించాడు. దీంతో నవ్య డబ్బులు కావాలని తన భర్తకు ఫోన్ చేసింది. ఆయన రూ. 8 లక్షలు ఆమె బావతో పంపించాడు. దీంతో లీల గేటు వద్దకు వచ్చి అతడి నుంచి నగదు తీసుకొని లోనికి వెళ్లింది. ఈ విషయం ఎవరికైనా చెప్తే కూతురును హత్య చేస్తానని బెదిరించడంతో ఆమె రూ. 8 లక్షలు తీసుకొచ్చిన అల్లుడికి ఈ విషయం చెప్పలేదు. ఈ విషయాలు ఏమీ తెలియని ఎన్.ఎస్.ఎన్.రాజు తన గదిలో నిద్రిస్తున్నారు. ఇదిలా ఉండగా ఉదయం 10 గంటల సమయానికి తల్లీ, కూతురు ఇంట్లో ఉన్న రూ. 2 లక్షల నగదు కలిపి మొత్తం రూ.10 లక్షలను నిందితుడి చేతిలో పెట్టారు. అనంతరం నవ్య మొబైల్ ఫోన్ నుంచి ఓలా క్యాబ్ బుక్ చేయగా ఆగంతకుడు అందులో పరారయ్యాడు. షాక్ నుంచి తేరుకున్న బాధితులు ఉదయం 11 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓలా క్యాబ్లో నిందితుడు షాద్నగర్ బస్టాప్లో దిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆరుగంటల పాటు తల్లీ, కూతురును గదిలో బంధించి రూ. 10 లక్షలతో ఉడాయించిన ఆగంతకుడిని పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. క్లూస్టీమ్, డాగ్స్కా్వడ్ సిబ్బంది ఆధారాలు సేకరించారు. క్యాబ్ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుడు తెలుగు, ఇంగ్లిష్లో మాట్లాడినట్లు క్యాబ్ డ్రైవర్ వెల్లడించడంతో పోలీసులు పాత నేరస్తుల వివరాలను పరిశీలిస్తున్నారు. -
మలుపు తిరిగిన అమ్నీషియా పబ్ అత్యాచార కేసు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్లోని అమ్నీషియా పబ్లో గతేడాది మే 22వ తేదీన ఓ బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో మైనర్లను మేజర్లుగా పరిగణిస్తూ జువైనల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏ2 నిందితుడి తండ్రి హైకోర్టును ఆశ్రయించగా ఈ తీర్పుపై అభ్యంతరాలను పరిశీలించాలని జువైనల్ కోర్టును హైకోర్టు ఆదేశించింది. అమ్నీషియా పబ్లో గతేడాది ఓ పార్టీకి వచ్చిన బాలికను ట్రాప్ చేసి అయిదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. జువైనల్ జస్టిస్ బోర్డు నలుగురు నిందితులను మేజర్లుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ తన కొడుకును మైనర్గా పరిగణించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఓ తండ్రి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ విషయంలో తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని, కేవలం మరసారి పరిశీలించాలని మాత్రమే జువైనల్ కోర్టుకు సూచిస్తామని తెలిపింది. జువైనల్ కోర్టులో ఉన్న ఈ కేసు 12వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు(పోక్సో కోర్టు)కు బదిలీ చేశారు. అవకతవకలు జరిగాయని రివిజన్ పిటిషన్ వేయగా కోర్టు ఈ పిటిషన్ను డిస్మిస్ చేసింది. దీంతో ఏ2 నిందితుడి తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న జస్టిస్ అనుపమా చక్రవర్తి సంబంధిత కోర్టులోనే తేల్చుకోవాలంటూ ఆదేశాలు జారీ చేస్తూ అభ్యంతరాలు పరిశీలించాలని పోక్సో కోర్టుకు సూచించింది. అత్యాచారానికి పాల్పడ్డ నిందితుల మానసిక పరిపక్వత మేజర్ల తరహాలోనే ఉందని వారిని మైనర్లుగా పరిగణించకూడదని జూబ్లీహిల్స్ పోలీసులు గతంలోనే కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఇందుకు సంబంధించిన గట్టి శాసీ్త్రయ ఆధారాలు సమర్పించారు. -
హైదరాబాద్లో దారుణం.. మాజీ ప్రియురాలి ఇంట్లోకి దూరి..
సాక్షి, హైదరాబాద్: ప్రేమికులుగా విడిపోయిన తర్వాత తన మాజీ బాయ్ ఫ్రెండ్ అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించడమే కాకుండా లైంగికదాడికి యత్నించాడంటూ ఓ యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడిని గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల సమాచారం మేరకు.. పబ్లలో గిటారిస్ట్గా పని చేస్తున్న లలిత్ సెహెగల్కు 2016లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న యువతి (36)తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ 2021 వరకు స్నేహితులుగా ఉన్నారు. అదే ఏడాది ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగి.. ఎవరికి వారే వేర్వేరుగా ఉంటున్నారు. కొంత కాలంగా సదరు యువతి లలిత్ సెహగల్ స్నేహితుడితో సన్నిహితంగా మెలుగుతోందని, ఈ విషయంపై నిలదీసేందుకు గచ్చిబౌలిలోని హాస్టల్లో ఉంటున్న లలిత్ సెహెగల్.. యువతి ఉంటున్న ఫ్లాట్కు వచ్చాడు. చదవండి: పెళ్లయ్యాక ఆమెతో భర్త ఒక్కరోజు గడపలేదు.. మరో మహిళతో రీల్స్.. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు అరుపులు కేకలతో గొడవపడ్డారు. ఈ సమయంలోనే తన దుస్తులను చించేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించి లైంగికదాడికి యత్నించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడు లలిత్ సెహగల్పై ఐపీసీ సెక్షన్ 376 రెడ్విత్ 511, 323, 354, 509ల కింద కేసు నమోదు చేసి గురువారం రిమాండ్కు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్లాట్ కేటాయింపు సక్రమమే.. రవీంద్రనాథ్కు మళ్లీ చుక్కెదురు!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు బి.రవీంద్రనాథ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్లాట్ కేటాయింపును తప్పుబడుతూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ నిరాశే మిగిలింది. ఓ ప్లాట్ కేటాయింపునకు సంబంధించి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో సీహెచ్ శిరీషకు 853 ఎఫ్ ప్లాట్ కేటాయించారు. ఈ ప్లాట్ను రిజిస్ట్రేషన్ చేయాలని హైకోర్టు కూడా హౌసింగ్ సొసైటీని ఆదేశించింది. ఈ మేరకు 2020లో అప్పటి పాలకవర్గం ప్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసింది. అయితే, 2021 మార్చి నెలలో హౌసింగ్ సొసైటీ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్లాట్ అంశాన్ని తెరపైకి తెచి్చన రవీంద్రనాథ్.. ప్లాట్ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులు, ఇది సివిల్ ఇన్ నేచర్ అంటూ కోర్టుకు క్లోజర్ రిపోర్ట్ను సమర్పించారు. ఆ తర్వాత కేసును రీ ఓపెన్ చేయాలంటూ నాంపల్లి క్రిమినల్ కోర్టులో రవీంద్రనాథ్ ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు న్యాయస్థానం కేసును రీ ఓపెన్ చేసింది. కాగా, కేసును మళ్లీ తెరవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అప్పటి జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి హనుమంతరావు తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శిగా ఉన్న రవీంద్రనాథ్ స్థానంలో రాజేశ్వరరావు ఎన్నికైనందున ఈ కేసుతో రవీంద్రనాథ్కు ఎలాంటి సంబంధం లేదని హనుమంతరావు వినిపించిన వాదనలతో ఏకీభవించిన హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పు చెప్పింది. ఈ కేసు తీర్పులో న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. కోర్టును వ్యక్తిగత దూషణలకు వేదికగా మార్చుకోవద్దని హెచ్చరించింది. అసలు రవీంద్రనాథ్కు ఫిర్యాదు చేసే హక్కు లేదని తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రవీంద్రనాథ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇదే అంశంపై రవీంద్రనాథ్ ఈడీకి కూడా ఫిర్యాదు చేశారు. ఈడీ విచారణపై గతంలో హైకోర్టు స్టే విధించగా.. ఆ తర్వాత ఈడీ ఈసీఐఆర్ను కొట్టివేసింది. హైకోర్టు ఆదేశాలతో నాంపల్లి క్రిమినల్ కోర్టు కూడా నిందితులపై ఉన్న కేసులను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రవీంద్రనాథ్ సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. ఆయన పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలను సమరి్థస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ మాజీ అధ్యక్షుడు నరేంద్రచౌదరికి క్లీన్చిట్ లభించింది. నరేంద్ర చౌదరిపై రవీంద్రనాథ్ మోపిన అభియోగాలన్నీ వీగిపోయా యి. ఆదివారం జరిగే జూబ్లీహిల్స్ సొసైటీ జనరల్ బాడీ సమావేశం పర్యవేక్షణకు అధికారిని నియమించాలని సహకార సంఘాల కమిషనర్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
Shaakuntalam: జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో సమంత పూజలు (ఫొటోలు)
-
జూబ్లీహిల్స్లో విషాదం.. తుపాకీతో కాల్చుకుని డాక్టర్ ఆత్మహత్య..
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వియ్యంకుడు డాక్టర్ మజారుద్దీన్ అలీఖాన్ (60) తన లైసెన్స్డ్ పిస్టల్తో కాల్చుకొని సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్న ఆయన ఇంట్లోనే ఈ ఉదంతం జరిగింది. ఆర్థిక, కుటుంబ వివాదాలే కారణమని అనుమానిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మజారుద్దీన్ ప్రస్తుతం ఒవైసీ ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ విభాగం డీన్గా పనిచేస్తుండగా.. ఆయన కుమారుడు అబేద్ అలీఖాన్ అదే హాస్పిటల్లో పీడియాట్రిక్ సర్జన్గా ఉన్నారు. అబేద్కు అసదుద్దీన్ ఒవైసీ కుమార్తె యాస్మిన్ ఒవైసీతో 2020 సెప్టెంబర్ 22న వివాహమైంది. మజారుద్దీన్ ఇంట్లో భార్య అఫియా రషీద్ అలీఖాన్, అబేద్, యాస్మిన్ ఉంటుండగా.. మజారుద్దీన్ కుమార్తె జైనా అలీఖాన్ అమెరికాలో నివసిస్తున్నారు. ఆర్థిక, కుటుంబ వివాదాల నేపథ్యంలో కొన్నాళ్లుగా మజారుద్దీన్, అఫియా మధ్య విభేదాలు ఉన్నాయి. దీంతో వారు ఒకే ఇంట్లోనే వేర్వేరుగా ఉంటున్నారు. రెండు రోజులుగా వారి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. సోమవారం ఉదయం తన గదిలోకి వెళ్లిన మజారుద్దీన్ తలుపులు గడియపెట్టుకున్నారు. ఆపై తన వద్ద ఉన్న .32 క్యాలిబర్ లైసెన్స్డ్ పిస్టల్తో కుడివైపు చెవి పైభాగంలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గది పూర్తిగా మూసి ఉండటంతో శబ్దం ఎవరికీ వినిపించలేదు. మజారుద్దీన్ మధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్పత్రికి రాకపోవడంతో అబేద్ ఆయనకు ఫోన్ చేశారు. ఫోన్ ఎత్తకపోవడంతో తాజుద్దీన్కు ఫోన్ చేసి విషయం ఆరా తీయాలని సూచించారు. దాదాపు ఒంటి గంట ప్రాంతంలో తాజుద్దీన్ వెళ్లి మజారుద్దీన్ గది తలుపు తట్టినా ఎంతకీ తెరుచుకోకపోవడంతో కిటికీ నుంచి చూడగా మజారుద్దీన్ మంచంపై రక్తపు మడుగులో పడి ఉండటం గమనించాడు. వెంటనే మజారుద్దీన్ భార్య, పనిమనిషుల సాయంతో తలుపులు తీసి మజారుద్దీన్ను కారులో అపోలో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు, క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. తూటా మజారుద్దీన్ తల నుంచి బయటకు దూసుకెళ్లి గోడకు తలిగినట్లు గుర్తించారు. ఘటనాస్థలి నుంచి తూటా, ఖాళీ క్యాట్రిడ్జ్ను క్లూస్ టీమ్ స్వాధీనం చేసుకుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అందజేశారు. ప్రాథమికంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆస్తి తగాదాలు ఉన్నట్లుగా ప్రాథమిక విచారణలో తేలిందని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని వెస్ట్జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. డాక్టర్ మజహర్ అలీ మృతదేహనికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. -
జూబ్లీహిల్స్ లో డాక్టర్ ఆత్మహత్య
-
జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు
-
సినిమాను మించిన లవ్స్టోరీ.. విజయవాడ నుంచి పారిపోయి..
బంజారాహిల్స్(హైదరాబాద్): విజయవాడ నుంచి పారిపోయి వచ్చిన ప్రేమజంటను యువతి తల్లిదండ్రులు బలవంతంగా కారులోకి ఎక్కించుకొని తీసుకెళ్తుండగా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. విజయవాడ సమీపంలోని సూరంపల్లి మాదలవాడీ గూడెంలో నివసించే గంగుల నవీన్ కుమార్ (23), అదే ప్రాంతానికి చెందిన బీటెక్ విద్యార్థిని (21) నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. యువతికి పెళ్లి సంబంధాలు చూస్తుండగా శుక్రవారం ఉదయం విజయవాడ నుంచి పారిపోయి హైదరాబాద్ యూసఫ్గూడలోని నవీన్ బంధువు ఇంటికి వచ్చారు. యువతి తల్లిదండ్రులు నవీన్ మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేసి శుక్రవారం రాత్రి 8.30 గంటలకు యూసఫ్గూడ చేరుకున్నారు. అప్పటికే సమాచారం అందుకున్న నవీన్ తన ప్రియురాలిని తీసుకుని మరో చోటకు పారిపోయేందుకు బయటకు రాగా అప్పటికే అక్కడ వేచివున్న యువతి తల్లిదండ్రులు ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించారు. నవీన్ అరుస్తూ చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేయగా అక్కడ గుమిగూడిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ప్రేమజంటను, తల్లిదండ్రులను స్టేషన్కు తీసుకొచ్చి విచారిస్తున్నారు. సోమవారం ఆర్యసమాజ్లో పెళ్లి చేసుకుందామని ఇక్కడకు వచ్చినట్లు నవీన్ తెలిపారు. తన ప్రియురాలిని బలవంతంగా ఆమె తల్లిదండ్రులు కారులోకి ఎక్కించుకుని కిడ్నాప్ చేసి తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది అన్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: వేలి ముద్రలు వేస్తున్నారా?.. అయితే ఇది కచ్చితంగా చదవాల్సిందే.. -
జూబ్లీహిల్స్లో కారు బీభత్సం.. మద్యం మత్తులో యువతులు!
హైదరాబాద్: జూబ్లీహిల్స్ చెక్పోస్టు వద్ద కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెళ్లి అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. మద్యం మత్తులో ఉన్న యువతులు కారు నడిపినట్లు తెలుస్తోంది. తాగి రోడ్డుపై షికారు చేస్తూ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో కారు పాక్షికంగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తు ఎవరికీ తీవ్రగాయాలు కాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కారు నడిపిన వారిని విచారిస్తున్నారు. చదవండి: ఒక మర్రితో మరిన్ని..! చేవెళ్ల రోడ్డు విస్తరణతో 760 మర్రి చెట్లకు గండం -
జూబ్లీహిల్స్లో ట్రాఫిక్ను కంట్రోల్ చేసిన సురేష్ బాబు
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కారుదిగి స్వయంగా ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్లోని ఫిల్మ్నగర్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో అటువైపు వెళ్తున్న నిర్మాత సురేష్ బాబు స్వయంగా కారులోంచి దిగి ట్రాఫిక్ను కంట్రోల్ చేశారు. వాహనదారులకు సూచనలు చేస్తూ ట్రాఫిక్ను క్లియర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బాధ్యతగల పౌరుడిలా వ్యవహరించారంటూ సురేష్ బాబుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
New Year: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పబ్లకు హైకోర్టు షాక్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిధిలోని 10 పబ్లకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. రాత్రి 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ సౌండ్ అనుమతి ఇచ్చేది లేదంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. పబ్లపై గతంలో హైకోర్టు ఈ ఆదేశాలివ్వగా.. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పబ్స్ నిర్వాహకులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా గతంలో పబ్ల విషయంలో ఇచ్చిన తీర్పును తెలంగాణ హైకోర్టు సమర్ధించింది. న్యూఇయర్ సందర్భంగా నిబంధనలు పాటించాల్సిందేనని తెలిపింది. రాత్రి 10 గంటల తరువాత మ్యూజిక్ సౌండ్ పెట్టరాదని పేర్కొంది. గత ఆదేశాల ప్రకారమే న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించాలంటూ హైకోర్టు ఆదేశించింది. చదవండి: New Year Celebrations: కరో కరో జల్సా.. కరోనా ముప్పుంది జాగ్రత్త..! -
జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయానికి ఫుడ్ లైసెన్స్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు నాణ్యమైన ప్రసాదం అందించేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ అధికారి సుదర్శన్రెడ్డి, జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బాలాజీ రాజు ఫుడ్ ఇన్స్పెక్టర్లతో కలిసి హైదరాబాద్లో గుర్తించిన ప్రముఖ ఆలయాలను సందర్శించడంతో పాటు కార్యనిర్వహణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంతో పాటు జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయం సైతం ఎంపికైంది. సంబంధిత అధికారులు పెద్దమ్మ దేవాలయం ఈవో శ్రీనివాసరాజుతో ఇటీవల సమావేశమై చర్చించారు. ఫుడ్సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం దేవాలయాలకు జీహెచ్ఎంసీ జారీ చేసిన ఫుడ్ లైసెన్స్లను పెద్దమ్మ దేవాలయానికి సైతం అందజేయనున్నారు. ప్రఖ్యాత ఆలయాల్లో భక్తులకు నాణ్యమైన ప్రసాదాలు అందించే లక్ష్యంతో, ప్రసాదాల నాణ్యతకు సంబంధించి ఐదు అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ లైసెన్స్లు జారీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఫుడ్సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఎఫ్ఎస్ఏఐ) ప్రవేశ పెట్టిన బ్లిస్ ఫుల్ హైజనిక్ ఆఫరింగ్ టూ గాడ్(భోగ్) పథకంలో భాగంగా దేవాలయాలకు లైసెన్స్ల జారీ చేపట్టినట్లు జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బాలాజీ రాజు, సుదర్శన్రెడ్డి వెల్లడించారు. నగరంలో సుమారుగా ఎనిమిది దేవాలయాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటికే బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, ఉజ్జయినీ మహంకాళి దేవాలయానికి లైసెన్స్ అందజేసిన అధికారులు పెద్దమ్మ ఆలయానికి త్వరలోనే జారీ చేయనున్నారు. ఇప్పటికే ఫుడ్ ఇన్స్పెక్టర్లు స్వాతి, మౌనిక, లక్ష్మీకాంత్ తదితరుల ఆధ్వర్యంలో ఆయా దేవాలయాల్లో ఈవోలతో సమీక్ష సమావేశం నిర్వహించి నాణ్యమైన ప్రసాదాలపై చర్చలు జరిపారు. ఈ లైసెన్స్ జారీ చేయడం ద్వారా ఇప్పటికే పరిశుభ్రమైన, రుచికరమైన ప్రసాదాలు అందజేస్తున్న ఆలయాలు మరింత నాణ్యమైన ప్రసాదాలను అందజేసేందుకు వీలవుతుంది. ఈ నిర్ణయం పట్ల పెద్దమ్మ భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియకు ఆలయ అధికారులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ఇప్పటికే పెద్దమ్మ గుడి ప్రసాదానికి నగర వ్యాప్తంగా విశేషమైన ఆదరణ ఉన్న నేపథ్యంలో ఈ కొత్త నిబంధనతో భక్తులు మరిన్ని ప్రయోజనాలు పొందనున్నారు. చదవండి: బాలుడిపై దాష్టీకం.. బట్టలూడదీసి, చేతులు కాళ్లు కట్టేసి చిత్ర హింసలు -
తన భార్య గోల్డ్ తాకట్టులో ఉందని.. మాజీ సీఎస్ను నమ్మించి..
బంజారాహిల్స్(హైదరాబాద్): త్రిపుర రాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ ఉసురుపాటి వెంకటేశ్వర్లును మోసం చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... మాజీ చీఫ్ సెక్రటరీ వెంకటేశ్వర్లు జూబ్లీహిల్స్లోని ప్రశాషన్నగర్లో నివాసం ఉంటున్నారు. ఆయనకు నానక్రాంగూడలో నివాసం ఉండే కొండ రవిగౌడ్ అనే వ్యక్తి కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాడు. పరిచయం అయిన మొదటి రోజు నుంచి రవి గౌడ్ పూర్తిగా అతడిని నమ్మించాడు. అయితే తన భార్య గోల్డ్ తాకట్టులో ఉందని, దాన్ని విడిపించడం కోసం అర్జెంటుగా రూ. 21 లక్షలు అప్పుగా ఇవ్వాలని కోరాడు. 2020 జనవరి 21న తన కుమార్తె పుట్టిన రోజు ఉందని ఫంక్షన్ అవ్వాగానే విడిపించిన బంగారాన్ని తిరిగి కుదువ బెట్టి, ఆ మొత్తాన్ని 3 నెలల్లో తిరిగి ఇస్తానని మాట ఇచ్చాడు. అతని మాటలు నమ్మి ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాకింగ్ ద్వారా రూ. 21 లక్షలు అతని అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. అప్పటి నుంచి తన డబ్బులు తిరిగి ఇవ్వాలని పలుమార్లు ఫోన్ ద్వారా, వ్యక్తిగతంగా కలిసి అడిగినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో మోసపోయానని భావించిన వెంకటేశ్వర్లు రవిగౌడ్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ట్విస్ట్.. నిందితులకు బెయిలిచ్చినా.. -
జూబ్లీహిల్స్లో ట్రాఫిక్ ట్రయల్ రన్.. అయోమయంలో వాహనదారులు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసుల ప్రయోగాత్మక ఆంక్షల నడుమ వాహనాలు ఆగుతూ... సా..గుతూ కనిపించాయి. సీవీఆర్ జంక్షన్, రోడ్ నెం. 45 జంక్షన్లో రైట్ టర్న్ను తొలగించడంతో తొలి రోజు ఎక్కువ మందికి అవగాహన లేకపోవడంతో చుట్టూ తిరుగుతూ ప్రయాణించాల్సి వచ్చింది. ► జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45 బాలకృష్ణ నివాసం చౌరస్తాతో పాటు జర్నలిస్టు కాలనీ, సీవీఆర్, బీవీబీపీ చౌరస్తా, జూబ్లీహిల్స్ చెక్పోస్టులో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ను నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు కొన్ని మార్గాల్లో ట్రయల్ రన్ కింద మళ్లింపులు చేపట్టి శుక్రవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఇద్దరు ట్రాఫిక్ ఏసీపీలు, ఇద్దరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, ఎనిమిది మంది ఎస్ఐలు కలిసి మొత్తం 32 మంది ట్రాఫిక్ పోలీసులు ఈ ట్రాఫిక్ మళ్లింపును పర్యవేక్షించారు. ► మధ్యాహ్నం 12 గంటల నుంచి ట్రాఫిక్ మళ్లింపులు ప్రారంభించారు. చాలా మందికి అవగాహన లేకపోవడంతో ఎటు వెళ్లాలో తెలియక గజిబజిగా ముందుకు సాగుతుండగా ట్రాఫిక్ పోలీసులు వారికి దారి చూపారు. ► అయితే పలుచోట్ల ట్రాఫిక్ చాంతాండాంత దూరానికి నిలిచిపోవడంతో వాహనదారులు అసహనానికి గురయ్యారు. మొదటి రోజు వాహనాలు వివిధ మార్గాల నుంచి మళ్లించడంతో చుట్టూ తిరుగుతూ వాహనదారులు గమ్యస్థానాలకు వెళ్లారు. ► నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ రంగనాథ్, ఏసీపీ జ్ఞానేందర్రెడ్డి పలుచోట్ల యూటర్న్లు, రైట్ టర్న్లను పరిశీలించారు. రాంగ్ రూట్లో ఆర్టీసీ బస్సు జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36 ప్రధాన రోడ్డులో పెద్దమ్మ గుడి కమాన్ నుంచి మాదాపూర్ వెళ్లే టర్నింగ్ వద్ద పిల్లర్ నెంబర్ సి–1659 నుంచి హెచ్సీయూ డిపోకు చెందిన సిటీ బస్సు శుక్రవారం ఉదయం రాంగ్రూట్లో వస్తూ కనిపించింది. సాధారణంగా ఆటో వాలాలు, ద్విచక్ర వాహనదారులు రాంగ్రూట్లో వెళ్లడం కనిపిస్తుంది. ఏకంగా సిటీ బస్సు రాంగ్రూట్లో వస్తుండటంతో స్థానికులు అవాక్కయ్యారు. ఈ విషయాన్ని ఓ స్కూటరిస్ట్ ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. సర్వీసు రోడ్డులో నిండుగా... జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45ల కేబుల్ బ్రిడ్జి నిర్మించి దానికి అనుసంధానంగా ఫ్లై ఓవర్ నిర్మించిన తర్వాత ఇప్పటి వరకు సర్వీసు రోడ్డులో వాహనాలు ఏ రోజు కూడా నిండుగా కనిపించలేదు. కానీ తొలిసారి శుక్రవారం నుంచి జూబ్లీహిల్స్లోని ఆయా జంక్షన్ల వద్ద పోలీసులు ఆంక్షలు విధించి మళ్లింపులు చేపట్టడంతో సర్వీసు రోడ్లు సైతం వాహనాలతో కిక్కిరిసిపోయాయి. మరో వైపు రోడ్ నెం.45లోని ఫ్లై ఓవర్ మీదుగా కేబుల్ బ్రిడ్జి వైపు వాహనాలు తక్కువగా వెళ్లడం గమనార్హం. (క్లిక్ చేయండి: 20 నిమిషాల్లో పంజాగుట్ట నుంచి ఓఆర్ఆర్కు) జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు నుంచి బాలయ్య ఇంటి దగ్గర రైట్ టర్న్ తీసేసిన ట్రాఫిక్ పోలీసులు. ఫిల్మ్ నగర్ జంక్షన్ వద్ద కూడా యూ టర్న్ లేదు. సిగ్నల్ ఫ్రీ అంటే మమ్మల్ని సిటీ అంతా తిప్పడం కాదు సర్ అట్టర్ ఫ్లాప్ ప్రయోగం. Please Look into this. @HYDTP. @HiHyderabad #Hyderabad @KTRTRS — Vidya Sagar Gunti (@GVidya_Sagar) November 25, 2022 నగర వాసులు ఏమంటున్నారు.. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ట్రయన్ రన్పై నగర వాసులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించమంటే తమను ఊరంతా తిప్పుతున్నారని అంటున్నారు. So! The city traffic police woke up one day and said - everything is fine, let’s mess up? Was that the thought behind all these diversions/ no U-turns in Jubilee Hills? Such chaos! #Hyderabad #HyderabadTraffic #WhatOnly🤯 pic.twitter.com/WpDIaB0u7Y — Revathi (@revathitweets) November 26, 2022 -
పవన్ కల్యాణ్ ఇంటి ముందు రెక్కీపై తెలంగాణ పోలీసులు చెప్పిందిదే..
సాక్షి, బంజారా హిల్స్: సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇంటి వద్ద కొంత మంది రెక్కీ నిర్వహించినట్టుగా వచ్చిన వార్తలు అవాస్తవమని పోలీసులు స్పష్టం చేశారు. మద్యం మత్తులో ముగ్గురు యువకులు పవన్ ఇంటి ముందు కారు ఆపిన సమయంలో బౌన్సర్లతో వాగ్వాదం జరిగిందని, ఇందులో భాగంలో బౌన్సర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసినట్టు శుక్రవారం పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే..శ్రీరామ్ నగర్ చెందిన చిట్నేని సాయికృష్ణ చౌదరి, చిట్నేని విజయ్ ఆదిత్య చౌదరి, జవహర్ నగర్కు చెందిన వినోద్ ముగ్గురు కలిసి గత నెల 31వ తేదీ రాత్రి 12:15 సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 35 లోని తబలా రసా పబ్లో మద్యం సేవించి బయటకు వచ్చిన తర్వాత వారి (జీజే 21ఏహెచ్ 1905) టాటా సఫారీ కారులో వెళుతూ పవన కళ్యాణ్ ఇంటి ముందు కారును అపి మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ కారు ఎందుకు అపారని పవన్ బౌన్సర్లు వెంకటేష్, ప్రసాద్ వారిని ప్రశ్నించారు. మేమిక్కడ కారు ఆపితే మీకేం సమస్య అంటూ కారులో కూర్చున్న ముగ్గురు వ్యక్తులు ప్రశ్నించగా తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది పవన్ ఇల్లు అని బౌన్సర్లు చెప్పినా వినకుండా దుర్భాషలాడారు. ఈ గొడవలో బౌన్సర్ ప్రసాద్కు గాయమైంది. ఈ మేరకు ఈ నెల 1న ఉదయం 11:30 గంటలకు జనసేన నేతలతో కలిసి బాధిత బౌన్సర్లు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కారు నంబర్ ఆధారంగా పోలీసులు ముగ్గురు యువకులపై ఐపీసీ సెక్షన్ 341, 323, 506 కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పవన్ కల్యాణ్ ఇంటి ముందు రెక్కీ నిర్వహించారని, గత రెండు రోజుల నుంచి మీడియా లో వార్తలు ప్రసారం అవుతున్నాయని, టీఎస్ 15 ఈక్యూ 6677 కారులో వచ్చారంటూ ప్రసారాలు చేస్తూ ఆరోపిస్తున్నారని, ఆ కారుతో గాని, ఆ రోజు పవన్ ఇంటి వద్ద జరిగిన గొడవకు ఈ కారుతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు. -
బస్టాప్లో బస్సు ఆపొద్దంటూ బోర్డు.. పాపం ప్రయాణికులు..
హైదరాబాద్: బస్టాప్లు ఏర్పాటు చేసేదే బస్సులు ఆపేందుకు.. కానీ బస్టాప్లో బస్సులు ఆగడం వల్ల వెనక ట్రాఫిక్ నిలిచిపోతుందంటూ ట్రాఫిక్ పోలీసులు ఆ బస్టాప్లో బస్సులు ఆగొద్దంటూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ పోలీసుల నిర్ణయం వల్ల ప్రయాణికులు, వాహనదారుల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి అపోలో ఆస్పత్రి వైపు వెళ్లే రోడ్డులో బస్టాప్ ఉంది. ఈ బస్టాప్లో గత కొన్ని సంవత్సరాలుగా బస్సులు ఆగుతుంటాయి. వందల సంఖ్యలో ప్రయాణికులు ఇక్కడినుంచి రాకపోకలు సాగిస్తుంటారు. అయితే బస్టాప్లో బస్సులు ఆగడం వల్ల ట్రాఫిక్ నిలిచిపోతుందంటూ జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఈ బస్టాప్లో బస్సులు, ఆటోలు నిలపవద్దంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో బస్సులు ఎక్కడ ఆపాలంటూ ఒక వైపు ఆర్టీసీ డ్రైవర్లు, మరోవైపు బస్సులు ఎక్కేందుకు వస్తున్న ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. కొరవడిన సమన్వయం... జూబ్లీహిల్స్ చెక్పోస్టులో సిగ్నళ్లకు దగ్గరగా ఉన్న బస్టాప్ల వద్ద సమస్య ఎదురైతే ట్రాఫిక్ పోలీసులు ముందుగా ఆయా బస్టాప్లను తొలగించి మరికొంత దూరంలో ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీకి సూచించాల్సిన అవసరం ఉంది. కానీ అలాంటి ప్రతిపాదన చేయకుండా సంబంధిత అధికారులు బస్టాప్లో బస్సులు ఆపొద్దంటూ బోర్డులు పెట్టడం ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది. ఇంకాస్త దూరం వెళ్లాక బస్సులు ఆపేందుకు అనువైన స్థలం కూడా లేదు. ఇక్కడ ఇరుకైన రోడ్డులో నిత్యం వేలాది వాహనాలు ప్రయాణం చేస్తుంటాయి. నిత్యం ఫిలింనగర్, అపోలో ఆస్పత్రి వైపు వెళ్లే వందలాది మంది ఇక్కడ బస్సు సేవలను వినియోగించుకుంటుంటారు. రెండు శాఖల అధికారులు ఈ ప్రాంతంలో పర్యటించి ట్రాఫిక్ సమస్య ఉన్నట్లయితే వీటిని ఇక్కడి నుంచి తొలగించి ప్రయాణికులకు అనువైన స్థలంలో బస్టాప్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. (క్లిక్ చేయండి: ముందు బైక్... వెనకాల కాన్వాయ్.. అభిమానిని చూసి ఆగిన ఎంపీ) -
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనంగా మారిన జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ గ్యాంగ్ రేప్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. నలుగురు నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ జువైనల్ కోర్టు తీర్పు వెలువరించింది. ఐతే.. ఎమ్మెల్యే కొడుకును మాత్రం జువైనల్గా పరిగణించాలని పేర్కొంది. మొత్తం ఆరుగురు నిందితుల్లో ఐదుగురు మైనర్లుగా పేర్కొంటూ కేసు నమోదు కాగా.. జువైనల్ కోర్టు తీర్పు కీలకంగా మారనుంది. ఇదీ కేసు.. జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్లో మే 28 ఓ బాలికను ట్రాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుగురు నిందితులు. అందులో ఒకరు మేజరు కాగా.. ఐదుగురు మైనర్లుగా పోలీసులు తేల్చారు. బాలికను రోడ్డు నెంబర్ 44లో ఉన్న ఖాళీ ప్రదేశంలో గ్యాంగ్ రేప్ చేసి.. ఆ తర్వాత సాయంత్రం మళ్లీ పబ్ దగ్గర వదిలిపెట్టారు. ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. మెడపై గాయాలను చూసి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. మే 31న పోక్సో యాక్ట్ ప్రకారం.. జూబ్లీహిల్స్ పీఎస్లో కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: ప్లాన్ ప్రకారమే జూబ్లీహిల్స్ గ్యాంగ్రేప్ ఘటన.. మైనర్లు ఉన్నందున పేర్లు కుదరదన్న సీపీ -
అర్ధరాత్రి ఆపన్నహస్తం.. గ్రీన్ఛానెల్తో గుండెను తరలించిన మెట్రో
సాక్షి,హైదరాబాద్: నగరవాసులకు అవసరమైన సహాయం చేయడానికి తామెప్పుడూ ముందే ఉంటామని మరోసారి ఎల్&టీ హైదరాబాద్ మెట్రో రైల్ నిరూపించింది. గతంలో ఫిబ్రవరి 2021లో ఏ విధంగా అయితే జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటల్ నుంచి ఓ ప్రాణం కాపాడటానికి గుండెను తరలించాలని ఎల్&టీ ఎంఆర్హెచ్ఎల్ ఎస్ఓఎస్కు కాల్ వచ్చిందో అదే తరహాలో మరోసారి కాల్ వచ్చింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ మెట్రో.. సెప్టెంబర్ 26న తెల్లవారుజూమున గ్రీన్ ఛానెల్ ఏర్పాటుచేయడంతో నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ మెట్రో స్టేషన్కు గుండెను రవాణా చేసింది. కాగా, గుండె తరలింపులో భాగంగా ఎల్బీనగర్లోని కామినేని హాస్పిటల్ డాక్టర్లు , ఇతర మెడికోలు.. రాత్రి ఒంటి గంట సమయంలో నాగోల్ మెట్రోస్టేషన్ వద్దకు గుండెను తీసుకువచ్చారు. అనంతరం, గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి కేవలం 25 నిమిషాల్లోనే గుండెను ప్రత్యేక రైలు జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ స్టేషన్కు చేర్చారు. తర్వాత, అంబులెన్స్ సాయంతో ఆసుపత్రికి చేర్చారు. ఈ స్పెషల్ ఆపరేషన్ కోసం లైన్-3 సెక్యూరిటీ అధికారులతో పాటుగా మెట్రో అధికారులు ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగేలా చేశారు. ఈ సందర్భంగా ఎల్&టీ ఎంఆర్హెచ్ఎల్ ఎండీ సీఈఓ కెవీబీ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రయాణీకుల సేవకు హైదరాబాద్ మెట్రో రైల్ కట్టుబడి ఉంటుంది. అవసరమైన సమయంలో వారికి సేవ చేసేందుకు కట్టుబడి ఉంది. మా అవసరం ఎక్కువగా ఉన్నవారికి, అవసరమైన సమయంలో తోడుండాలనేది మా సిద్ధాంతం. ఈసారి కూడా మేము గ్రీన్ఛానెల్ ఏర్పాటుచేయడంతో పాటుగా వీలైనంత త్వరగా గుండెను తరలించి, ఓ ప్రాణం కాపాడాము. ప్రాణంతో ఉన్న అవయవాన్ని తరలించడంలో తోడ్పడిన డాక్టర్లు, హెచ్ఎంఆర్ సిబ్బందికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము’ అని అన్నారు. కాగా, ఆదివారం రాత్రి ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన క్రికెట్ మ్యాచ్ సందర్భంగా మెట్రో రైలు సేవలు అర్ధరాత్రి వరకు అందుబాటులోనే ఉన్నాయి. ఓవైపు.. క్రికెట్ అభిమానులకు తరలిస్తూనే.. అటు మెట్రో అధికారులు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేయడం విశేషం. మ్యాచ్ సందర్భంగా దాదాపు 20వేల మంది క్రికెట్ ఫ్యాన్స్ మెట్రో ప్రయాణించినట్టు సమాచారం. -
Hyderabad Metro: అర్ధరాత్రి ఆపన్నహస్తం.. గ్రీన్ఛానెల్తో గుండెను తరలించిన మెట్రో
-
జూబ్లీహిల్స్లో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్లో అగ్నిప్రమాదం జరిగింది. రోడ్ నెం.36లోని ఓ ఆఫీస్లో మంటలు చెలరేగాయి. దీంతో ఆఫీస్లోని 2,3 అంతస్తుల్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. పొగలు దట్టంగా అలుముకున్నాయి. ఫైర్ సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. చదవండి: (తెలంగాణ ఇంటెలిజెన్స్ మరో ఫెయిల్యూర్) -
రేవంత్పై పరువు నష్టం దావా వేస్తా: మాజీ ఎమ్మెల్యే విష్ణు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పబ్ లైంగిక దాడి ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి ఆవరణలో మైనర్నపై లైంగికదాడి జరిగిందని ఆరోపించారు. అయితే రేవంత్ వ్యాఖ్యలను ఆలయ ట్రస్ట్ సభ్యులు ఖండించారు. రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పెద్దమ్మ గుడి ఆలయ ట్రస్ట్ సభ్యులు ఫిర్యాదు చేశారు. మరోవైపు రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై పీజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత విష్ణువర్దన్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవాలయంలో ఎలాంటి ఆసాంఘిక కార్యక్రమాలు జరగలేదన్నారు. రేవంత్రెడ్డి అసత్య ఆరోపణలు చేశారని, ఆలయ ఆవరణలో బాలికపై అత్యాచారం జరగలేదని స్పష్టం చేశారు. సీపీ క్లారిటీ ఇచ్చినా రేవంత్ బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది పార్టీ వ్యవహారం కాదని.. పెద్దమ్మ తల్లి భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. రేవంత్రెడ్డి చెప్పిన మాటలు తప్పు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. రేవంత్పై టెంపుల్ తరపున పరువు నష్టం దావా వేస్తామని తెలిపారు.. పెద్దమ్మ టెంపుల్పై మాట్లాడేముందు తనను రేవంత్ కనీసం సంప్రదించలేదని పేర్కొన్నారు. -
జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లి గుడివద్ద కారు బీభత్సం
-
అమ్నీషియా పబ్ కేసు: ప్రధాన నిందితుడు సాదుద్దీన్కు బెయిల్ మంజూరు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్లోని అమ్నీషియా పబ్ అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్కు బెయిల్ లభించింది. సాదుద్దీన్కు నాంపల్లి కోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. కాగా ఇప్పటికే ఈ కేసులో జువైనల్లో ఉన్న అయిదుగురు మైనర్ నిందితులకు తెలంగాణ హైకోర్టు కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా గత వారమే పబ్ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. చదవండి: ప్రజలారా జర పైలం.. మూడు వారాలు మస్తు వానలే! -
అమ్నీషియా పబ్ కేసు.. ఎమ్మెల్యే కొడుక్కి బెయిల్ మంజూరు
సాక్షి, హైదరాబాద్: అమ్నీషియా పబ్ రేప్ కేసులో ఎమ్మెల్యే కొడుకుకి బెయిల్ లభించింది. ఎమ్మెల్యే కొడుకు రహిల్ ఖాన్కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మొదట జువెనైల్ బోర్డు బెయిల్కు నిరాకరించడంతో.. హైకోర్టులో బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్నాడు. దీంతో హైకోర్టు బుధవారం మైనర్ అయిన ఎమ్మెల్యే కొడుక్కి బెయిల్ మంజూరు చేసింది. కాగా జువైనల్ హోమ్లో ఉన్న నలుగురు నిందితులకు మంగళవారమే బెయిల్ వచ్చింది. సుమారు ఘటన జరిగిన 48 రోజుల తర్వాత ఈ కేసులోని నలుగురు మైనర్లకు జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఇప్పటికే నలుగురు బెయిల్పై బయటకొచ్చారు. అయితే ఈ కేసులో A1గా ఉన్న సాదుద్ధీన్ మాలిక్కు మాత్రం బెయిల్ విషయంలో నిరాశే ఎదురైంది. ఇక రేప్ కేసులో పోలీసులు చార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. చదవండి: రాజగోపాల్రెడ్డి వ్యవహారంపై స్పందించిన రేవంత్ -
జూబ్లీహిల్స్ మైనర్ ఆత్యాచార కేసులో విచారణ పూర్తి
-
Hyderabad: రెస్టారెంట్లో పెట్టుబడులంటూ రూ.13 కోట్లు స్వాహా
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్లో ఏర్పాటు చేసి క్యూబా డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ను చూపిస్తూ అందులో పెట్టుబడుల పేరుతో అనేక మంది నుంచి రూ. 13 కోట్ల వరకు వసూలు చేసి మోసం చేసిన కేసులో తల్లీకుమారులను సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. క్యూబా డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ నిర్వహించే నాగెల్లి రూపస్ ఆయన భార్య నాగెల్లి సుకన్య, కుమారుడు జసింత్ జీటీఎఫ్ఎల్ మినిస్ట్రీస్ పేరుతో చర్చిల్ని నిర్వహిస్తున్నారు. అక్కడకు వచ్చిన వారిని నమ్మించిన ఈ త్రయం వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో భారీగా వసూలు చేశారు. 2017–18ల్లో దాదాపు 30 మంది నుంచి రూ.13 కోట్ల వరకు తీసుకున్నారు. తమ డబ్బు ఇవ్వమని అడిగిన వారిని బెదిరించడం వారిపైనే కేసులు పెట్టడం చేస్తున్నారు. వీరికి రూ.కోటి వరకు ఇచ్చి మోసపోయిన కేవీ ప్రసాద్ అనే బాధితుడు సీసీఎస్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసిన ఏసీపీ సందీప్కుమార్ బుధవారం సుకన్య, జసింత్లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న రూపస్ కోసం గాలిస్తున్నారు. వీళ్లు విదేశాల్లోని వారి నుంచి డబ్బు తీసుకున్నారని, తెనాలీలోనూ వీరిపై కేసులు ఉన్నాయని ప్రసాద్ తెలిపారు. చదవండి: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన.. టెన్షన్.. అటెన్షన్! -
బంజారాహిల్స్: ఖరీదైన కార్లే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు
స్పెషల్ డ్రైవ్లో భాగంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు హై ఎండ్ కార్ల భరతం పట్టారు. ఈ రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పది వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ దర్జాగా తిరుగుతున్న ఖరీదైన కార్లు పెద్ద ఎత్తున పట్టుబడ్డాయి. సాక్షి, బంజారాహిల్స్: బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్టడీ సర్కిల్, తాజ్ మహల్ హోటల్, టీవీ చౌరస్తా, కళింగ కల్చరల్ సెంటర్ చౌరస్తా, తాజ్కృష్ణ ఎదురుగా బంజారాహిల్స్, ఎస్సార్నగర్, సైఫాబాద్, నారాయణగూడ, చిక్కడపల్లి ట్రాపిక్ పోలీస్ స్టేషన్లకు చెందిన ఎస్ఐలు బృందాలుగా ఏర్పడి తనఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా డ్రైవింగ్ లైసెన్సు లేకుండా నడుపుతున్న ఓ వ్యక్తి కారును సీజ్ చేశారు. ► నంబర్ ప్లేటు లేకుండా తిరుగుతున్న నాలుగు కార్లను సీజ్ చేశారు. ఈ అయిదు కార్లపై ఛార్జిషీటు దాఖలు చేయనున్నారు. ►బ్లాక్ ఫిల్మ్లతో తిరుగుతున్న 35 మంది కారు యజమానులకు ఒకొక్కరికి రూ. 700లు చొప్పున జరిమానా విధించారు. ఇర్రెగ్యులర్, ఇన్ప్రాపర్ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న 32 మంది వాహనదారులకు రూ. 200ల చొప్పున జరిమానా విధించారు. ►ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న 39 మంది వాహనదారులకు రూ. 200ల చొప్పున జరిమానా విధించారు. రిజిస్ట్రేషన్ లేకుండా తిరుగుతున్న మూడు కారు యజమానులకు రూ. 2000ల ప్రకారం జరిమానా విధించారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. ► జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జూబ్లీహిల్స్ చెక్పోస్టు, నీరూస్ జంక్షన్, రోడ్ నంబర్ 45, ఫిలింనగర్, రోడ్ నంబర్ 36 కళాంజలి వద్ద జూబ్లీహిల్స్ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ముత్తు, మారేడుపల్లి, మహంకాళి, గోపాలపురం ట్రాఫిక్ పోలీసు స్టేషన్ల నుంచి అయిదు చోట్ల స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ► బ్లాక్ ఫిల్మ్లతో తిరుగుతున్న 48 టాప్ మోడల్ కార్ల యజమానులకు రూ. 700ల ప్రకారం జరిమానా విధించారు. ► ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న 13 వాహనాలపై జరిమానా విధించారు. ► ఇంప్రాపర్, ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్లతో ప్రయాణిస్తున్న 45 కార్లకు రూ. 200ల వంతున జరిమానా విధించారు. నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న 2 వాహనాలపై చార్జిషీట్ దాఖలు చేయనున్నారు. సర్వీసు రోడ్డులో పార్కింగ్ చేసిన ఒక వాహనంపై జరిమానా విధించారు. ► ఇద్దరు వాహనదారులపై 41(ఐ) సీపీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఫుట్పాత్లను ఆక్రమించి పాదచారులకు ఇబ్బంది కల్గిస్తున్న ఒక వాహనదారుడిపై కేసు నమోదైంది. అక్రమ పార్కింగ్ చేసిన ఇద్దరు వాహనదారులకు జరిమానా విధించారు. -
యువకుడితో సహజీవనం.. పెళ్లికి నో చెప్పిందని వివాహిత కుమారుడిని
సాక్షి, బంజారాహిల్స్: పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడం లేదని ఓ వివాహిత కుమారుడిని కిడ్నాప్ చేసిన యువకుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి చిన్నారి కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు తెలిపిన మేరకు.. బబ్బుగూడలో నివసించే షేక్ తబస్సుమ్(24) భర్తతో విడిపోయి ఈవెంట్ ఆర్గనైజర్గా రహ్మత్నగర్లో పని చేస్తోంది. ఈమెకు ఇద్దరు కుమారులు. తన ఇంటి సమీపంలోనే నివసించే శంకర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త గత మూడు నెలలుగా సహజీవనానికి దారి తీసింది. ఇద్దరూ బబ్బుగూడలో సహజీవనం చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీన పెళ్లి చేసుకోవాలంటూ శంకర్ ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఇందుకు ఆమె అంగీకరించలేదు. దొంగతనాలు చేస్తూ పోలీసులకు కూడా పట్టుబడ్డట్లు శంకర్పై అభియోగాలు ఉండటంతో పెళ్లికి నిరాకరించింది. కక్ష పెంచుకున్న శంకర్ బాధితురాలు రహ్మత్నగర్లో ఓ కార్యక్రమంలో ఉండగా తనతో పాటు వచ్చిన రెండేళ్ల కుమారుడిని ఎత్తికెళ్లినట్లు ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు శంకర్పై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. నాందేడ్లో ఉన్నట్లుగా ఫోన్ కాల్డేటా ఆధారంగా గుర్తించారు. నాందేడ్కు ఒక పోలీస్ బృందం గురువారం వెళ్లింది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Hyderabad: వైద్యుల నిర్లక్ష్యం.. నిండు గర్భిణి మృతి -
జూబ్లీహిల్స్ పబ్ కేసు: ప్లాన్ ప్రకారమే ఆ వాహనం వినియోగించాం.. కానీ..
సాక్షి,బంజారాహిల్స్(హైదరాబాద్): జూబ్లీహిల్స్లో విదేశీబాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు మైనర్ల పోలీసు కస్టడీ మంగళవారం ముగిసింది. ఈ నెల 9న వీరిని నాలుగు రోజుల కస్టడీకి న్యాయమూర్తి అనుమతించిన విషయం తెలిసిందే. అంతకుముందే ఏ1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్ను కస్టడీకి తీసుకోగా సోమవారమే ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు. గత నాలుగు రోజులుగా బంజారాహిల్స్ ఏసీపీ ఎం.సుదర్శన్ కస్టడీలో ఉన్న మైనర్లను వేర్వేరుగా, ఒకేచోట కూర్చోబెట్టి విచారించారు. అత్యాచారం ఎక్కడ జరిగింది, ఇందుకు ఉసిగొల్పింది ఎవరు అనే విషయాలపై ఆరా తీయగా, జూబ్లీహిల్స్లోని ఓ గుడి వెనుకాల నిర్మానుష్య ప్రదేశంలో అత్యాచారం జరిపినట్లు చెప్పారు. ఒకేచోట అందరం కలిసి అత్యాచారానికి పాల్పడినట్లుగా వెల్లడించారు. నిందితుల్లో ఓ ఎమ్మెల్యే కొడుకుతోపాటు వక్ఫ్బోర్డ్ చైర్మన్ కొడుకు, సంగారెడ్డి మున్సిపాలిటీ కో–ఆప్షన్ మెంబర్ కొడుకు ఉండగా ఆ రోజు అధికారిక వాహనాన్ని ఎవరు తీసుకు రమ్మన్నారని పోలీసులు ప్రశ్నించారు. ప్రభుత్వ వాహనం అని రాసి ఉన్న ఇన్నోవా కారును పథకం ప్రకారమే తీసుకొచ్చామని, ఈ కారుకు బ్లాక్ ఫిలింఉండటమే కాకుండా గవర్నమెంట్ వెహికిల్ అని ఉంటే ఎవరూ టచ్ చేయరన్న ఉద్దేశంతో దీన్ని ఎంపిక చేసుకున్నామని వెల్లడించారు. ముందస్తు పథకంలో భాగంగానే కండోమ్ ప్యాకెట్లు కూడా తీసుకొచ్చినట్లు విచారణలో చెప్పారు. ఫోరెన్సిక్ విభాగం అధికారులు కారును తనిఖీ చేసినప్పుడు కండోమ్లు దొరికిన విషయం తెలిసిందే. కస్టడీలో భాగంగా ఆదివారం మైనర్లందరినీ సీన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్కు తీసుకెళ్లారు. పోలీసు కస్టడీలో మైనర్లందరూ కూడబలుక్కున్నట్లుగా ఒకే సమాధానం చెప్పారు. పోలీసు కస్టడీ ముగియగానే మంగళవారం సాయంత్రం ఈ ఐదుగురు మైనర్లను జువనైల్ హోంకు తరలించారు. కార్ల యజమానులపై కేసులు: ఈ ఘటనలో మైనర్లు నడిపిన కార్లకు సంబంధించి కేసుల నమోదుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. బంజారాహిల్స్లో నివసించే ఓ ఎమ్మెల్యే కుమార్తెకు చెందిన బెంజ్ కారును ఆమె కుమారుడు నడిపాడు. అలాగే ఇన్నోవా డ్రైవర్ని బంజారాహిల్స్లోని కాన్సు బేకరీ వద్ద దించి ఆ వాహనాన్ని మరో మైనర్ నడిపాడు. ఈ ఉదంతాల్లో మైనర్లతో పాటు వారికి వాహనాలిచ్చిన వారిపైనా కేసులు నమోదు చేయనున్నారు. చదవండి: Hyderabad: హెరిటేజ్ పాల లారీ బీభత్సం.. చెల్లెల్ని బైక్పై తీసుకొస్తుండగా -
జూబ్లీహిల్స్ బాలికపై గ్యాంగ్ రేప్ వార్త నన్ను షాక్కు గురిచేసింది: సోనుసూద్
-
జూబ్లీహిల్స్ పబ్ కేసు: ఇలాంటి ఘటనలకు పబ్స్ కారణం కాదు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ మైనర్ బాలిక అత్యాచార కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే! రొమేనియాకు చెందిన బాలికను ఇంటి వద్ద డ్రాప్ చేస్తామని కారులో ఎక్కించుకుని ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులోని నిందితుల్లో ఎమ్మెల్యే కొడుకు, కార్పొరేటర్ కొడుకు, వక్ఫ్బోర్డు చైర్మన్ కొడుకు, మాజీ ఎమ్మెల్యే మనవడితోపాటు మరో ఇద్దరు మైనర్లు ఉన్నారు. ఇప్పటికే క్రైమ్సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించిన పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. తాజాగా ఈ ఘటనపై నటుడు సోనూసూద్ స్పందించాడు. ఇలాంటి ఘటనలకు పబ్స్ కారణమనేది తప్పని వారించాడు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, మనం చూసే విధానం తప్పుగా ఉంటే చెడు ఆలోచనలు వస్తాయని పేర్కొన్నాడు. చదవండి: పెళ్లి చేసుకున్నాం, కానీ మా లైఫ్లో పెద్ద ఛేంజ్ ఏం లేదు మైనర్లతో సీన్ రీకన్స్ట్రక్షన్ -
జూబ్లీహిల్స్ పబ్ కేసు: సాదుద్దీన్ కస్టడీ విచారణలో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ పోలీస్ కస్టడీ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ కేసులో శాస్త్రీపురం కార్పొరేటర్ కుమారుడు అసలు సూత్రధారి అని సాదుద్దీన్ పోలీసులకు వివరించాడు. కార్పొరేటర్ కుమారుడు, ఎమ్మెల్యే కొడుకు పబ్లోకి ఎంటర్ కాగానే అమ్మాయిలను వెతకడం ప్రారంభించారని, పబ్లోనూ మైనర్ అమ్మాయిలను వేధించినట్లు పేర్కొన్నాడు. ‘పబ్ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే కొడుకు, కార్పొరేటర్ కొడుకు మైనర్ వెంట పడ్డారు. నేను వారిని వద్దని వారించాను. దీంతో నన్ను బెంజ్ కారులో ఎక్కొద్దని ఎమ్మెల్యే కొడుకు ఆదేశించాడు. నన్ను పబ్ దగ్గర వదిలి అమ్మాయిని బెంజ్ కారులో ఎక్కించుకున్నాడు. నేను బెంజ్ కారులో కాకుండా ఇన్నోవాలో బేకరికి వెళ్లాను. బెంజ్ కారులోకి ఎక్కగానే మైనర్ అమ్మాయిని ఏమ్మెల్యే కుమారుడు వేధించడం ప్రారంభించాడు. మార్గ మధ్యలో ఇద్దరు, మరొక ముగ్గురు పెద్దమ్మతల్లి ఆలయం పక్కన ఖాళీ స్థలంలో అఘాయిత్యానికి ఒడిగట్టారు. నా ఫ్రెండ్స్ బలవంతం కారణంగానే నేనూ ఈ అత్యాచారం చేయాల్సి వచ్చింది. వారి ప్రోద్బలంతోనే ఇదంతా జరిగింది’ అని సాదుద్దీన్ పోలీసుల ముందు తెలిపాడు. సంబంధిత వార్త: జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ కేసు: అత్యాచార ఉద్ధేశంతోనే పబ్కు అయితే అత్యాచారంలో ఎవరి పాత్ర ఎంత ఉందనేది పోలీసులు తేల్చారు. శాస్త్రీపురం కార్పొరేటర్ కుమారుడు ఈ కేసులో అత్యంత కీలక సూత్రధారి అని అతని తరువాత సాదుద్దీన్, వక్ఫ్బోర్డ్ చైర్మన్ కొడుకు, ఎంఐఎం ఎమ్మెల్యే సోదరి కొడుకు, సంగారెడ్డి కార్పొరేటర్ కొడుకు, ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఉన్నట్లు తెలిపారు నిందితుల మధ్య ఘర్షణ మరోవైపు జూబ్లీహిల్స్ పబ్ కేసులోని నిందితుల మధ్య ఘర్షణ జరిగింది. జువైనల్ హోంలో ఉన్న ఐదుగురు మైనర్లు ప్లేట్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. శాస్త్రిపురం కార్పొరేటర్ కుమారుడు సాదుద్దీన్ టార్గెట్గా ఈ దాడి జరిగింది. నీ వల్లే విషయం బయటకు వచ్చిందని సాదుద్దీన్పై మిగతా నిందితులు దాడి చేశారు. చివరికి పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగింది. సాదుద్దీన్కు రిమాండ్ అమ్నీషియా పబ్ అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్కు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నాంపల్లి కోర్టు నుంచి చంచల్గూడ జైలుకు సాదుద్దీన్ను తరలించారు. -
జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ కేసు: అత్యాచార ఉద్ధేశంతోనే పబ్కు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ మైనర్ బాలిక అత్యాచార కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసులో తవ్వేకొద్దీ అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. నిందితులు పబ్లోకి ఎంటర్ అయ్యే ముందే ఇన్నోవా, బెంజ్ కారులో పోలీసులు కండోమ్ ప్యాకెట్లను తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కండోమ్ ప్యాకెట్లు తెచ్చినట్లు నిందితులు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. రేప్ ఇంటెన్షన్తోనే పబ్కు వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ కస్టడీ ముగిసింది. కాసేపట్లో అతన్ని నాంపల్లి కోర్టులో హాజరుపర్చనున్నారు. అత్యాచార కేసులో మైనర్లతోపాటు సాదుద్దీన్ మాలిక్ను జూబ్లీహిల్స్ పోలీసులు విచారించారు. ఈ కేసులో కస్టడీకి తీసుకున్న ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్బోర్డ్ చైర్మన్ కుమారుడు, పొరుగు జిల్లా కార్పొరేటర్ కుమారుడు సహా ఐదుగురు మైనర్లతో పోలీసులు ఆదివారం క్రైమ్సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. పబ్, కాన్సూ బేకరీ, రోడ్ నంబర్ 44లోని పవర్స్టేషన్, తిరిగి పబ్ మధ్య వారిని తిప్పుతూ ప్రశ్నించారు. ఘటన జరిగిన రోజు పబ్ నుంచి ఎవరెవరు, ఏ కారులో వెళ్లారు? ఆ రోజు బాధిత బాలిక ఏ కారులో కూర్చుంది? తిరిగి వచ్చే క్రమంలో ఎలా వచ్చారు? ఏయే ప్రాంతాల్లో ఆమెపై అత్యాచారం చేశారన్న వివరాలను సేకరించి రికార్డు చేశారు. సంబంధిత వార్త: జూబ్లీహిల్స్ గ్యాంగ్రేప్ కేసులో దర్యాప్తు ముమ్మరం అయితే సోమవారం మరోసారి అయిదుగురు మైనర్లను పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. జువైనల్ హోమ్ నుంచి జూబ్లీహిల్స్ పీఎస్కు తరలించనున్నారు. సాదుద్దీన్ మాలిక్ రెచ్చగొట్టడం వల్లే తాము బాలికపై అత్యాచారం చేశామంటూ మైనర్లు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ముందుగా ఎమ్మెల్యే కుమారుడే బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని సాదుద్దీన్ పోలీసులకు తెలిపాడు. -
మైనర్లతో సీన్ రీకన్స్ట్రక్షన్
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: జూబ్లీహిల్స్లో రొమేనియా బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో కస్టడీకి తీసుకున్న ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్బోర్డ్ చైర్మన్ కుమారుడు, పొరుగు జిల్లా కార్పొరేటర్ కుమారుడు సహా ఐదుగురు మైనర్లతో పోలీసులు ఆదివారం క్రైమ్సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. పబ్, కాన్సూ బేకరీ, రోడ్ నంబర్ 44లోని పవర్స్టేషన్, తిరిగి పబ్ మధ్య వారిని తిప్పుతూ ప్రశ్నించారు. ఘటన జరిగిన రోజు పబ్ నుంచి ఎవరెవరు, ఏ కారులో వెళ్లారు? ఆ రోజు బాధిత బాలిక ఏ కారులో కూర్చుంది? తిరిగి వచ్చే క్రమంలో ఎలా వచ్చారు? ఏయే ప్రాంతాల్లో ఆమెపై అత్యాచారం చేశారన్న వివరాలను సేకరించి రికార్డు చేశారు. అనంతరం మైనర్లను జువెనైల్ హోమ్కు తరలించారు. సోమవారం ఉదయం వీరిని ఠాణాకు తీసుకువచ్చి మళ్లీ విచారించనున్నారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్తో ఇప్పటికే క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తి చేశారు. సాదుద్దీన్ కస్టడీ గడువు ముగియడంతో సోమవారం కోర్టులో హాజరుపర్చనున్నారు. సాదుద్దీన్ చెప్పిన వివరాలు, మైనర్లు చెప్పిన వివరాలను పోల్చి చూడనున్నారు. రెండుసార్లు ‘గుర్తింపు’ పరేడ్ సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితు డు సాదుద్దీన్, మిగతా ఐదుగురిని బాలిక గుర్తించి కన్ఫర్మ్ చేయాల్సిన ‘టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ (టీఐపీ)’ విషయంలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. బాలికతో రెండు సార్లు, వేర్వేరు ప్రాంతాల్లో టీఐపీ చేయించడం అనివార్యంగా మారింది. రెండు వేర్వేరు కోర్టుల్లో కేసు విచారణ జరుగుతుండటం.. సాదుద్దీన్ చంచల్గూడ జైల్లో, మైనర్లు జువెనైల్ హోంలో ఉండటమే దీనికి కారణమని పోలీసులు చెప్తున్నారు. మేజర్ అయిన సాదుద్దీన్కు సంబంధించి నాంపల్లిలోని పోక్సో ప్రత్యేక కోర్టులో, మైనర్లకు సంబంధించి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సమీపంలోని జువెనైల్ జస్టిస్ కోర్టులో సోమవారం టీఐపీ పిటిషన్లను దాఖలు చేయనున్నారు. టీఐపీ’ చేసేదిలా.. గ్యాంగ్ రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి శిక్ష పడాలంటే.. సాక్షులతో ‘టీఐపీ’ నిర్వహణ చాలా కీలకం. డిజిగ్నేటెడ్ న్యాయమూర్తి సమక్షంలో ఈ ప్రక్రియ జరుగుతుంది. నిందితులను పోలిన వయసు, శారీరక లక్షణాలున్న వారిని దాదాపు ఆరు నుంచి పది మందిని ఎంపిక చేస్తారు. వారి మధ్యలో నిందితులను ఉంచి.. బాధితులు, సాక్షులను పిలిచి గుర్తించాలని కోరుతారు. నిందితుల స్థానాన్ని రెండు, మూడు సార్లు మార్చి మళ్లీ గుర్తించాలని కోరుతారు. పరేడ్లో పాల్గొనే బాధితులు/సాక్షులకు ముసుగు వేయడం లేదా ప్రత్యేకమైన అద్దం వెనుక ఉంచడం ద్వారా.. వారిని నిందితులు గుర్తించకుండా జాగ్రత్త పడతారు. తాజా కేసులో.. అమ్నీషి యా పబ్, కాన్సూ బేకరీ, ఇతర ప్రాంతాల్లో నిందితులను చూసిన వారితో (సాక్షులతో) కూడా టీఐపీ నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని జైళ్లలో కేవలం శనివారం మాత్రమే టీఐడీ పరేడ్లు జరుగుతున్నాయి. దీనికి ఏర్పాటు చేయాల్సిందిగా ముందుగా జైలు అధికారులకు లేఖ రాయాల్సి ఉంటుంది. వీలును బట్టి జువెనైల్ హోమ్లోనూ టీఐపీ పరేడ్ నిర్వహించనున్నారు. -
జూబ్లీ హిల్స్ కేసులో కీలక వీడియో లభ్యం..!!
-
Jubilee Hills Pub Case: జూబ్లీ హిల్స్ కేసు సీన్ ను రీ-కన్ స్ట్రక్షన్ చేస్తున్న పోలీసులు
-
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన.. టాటూలా ఉండాలనే మెడపై కొరికినట్లు..
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఘటన జరిగి 15 రోజులు కావొస్తున్నా.. నిత్యం కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచార కేసులోని ఆరుగురు నిందితులను పోలీసులు విచారణ నిమిత్తం తమ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులోని A1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్ కస్టడి నేటీతో ముగియనుంది. నిందితుల్లో ఎమ్మెల్యే కొడుకు, కార్పొరేటర్ కొడుకు, వక్ఫ్బోర్డు చైర్మన్ కొడుకు, మాజీ ఎమ్మెల్యే మనవడితోపాటు మరో ఇద్దరు మైనర్లు ఉన్నారు. మొత్తం ఆరుగురిని పోలీసులు విచారిస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం అయిదుగురు మైనర్లతో పాటు సాదుద్దీన్ను విచారించనున్నారు. పోలీసులు శనివారం నిందితులందరికి ఉస్మానియాలో పొటెన్సీ పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఐదుగురు మైనర్లను జువెనైల్ హోంకు, సాదుద్దీన్ మాలిక్ను జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఇక ఈ కేసులో బాధితురాలి మెడికల్ రిపోర్టు కీలకంగా మారనుంది. ఈ మెడికల్ రిపోర్టు ప్రకారం లైంగిక దాడి సమయంలో మైనర్ మెడపై నిందితులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడినట్లు వెల్లడైంది. ఈ సమయంలో మైనర్ లైంగిక దాడికి నిరాకరించడంతో నిందితులు ఆమె మెడపై కొరకడం వంటి దాడికి పాల్పడ్డారు. దీంతో మైనర్ శరీరంపై 12 గాయాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే టాటూలా ఉండాలనే మెడపై కొరికినట్లు నిందితుల వాగ్మాలం ఇచ్చారు. బాలిక ప్రతిఘటించడంతో గాయాలైనట్లు ఒప్పుకున్నారు. చదవండి: మైండ్ బ్లోయింగ్: అమ్నేషియా పబ్ కేసులో మరో ట్విస్ట్ -
మైండ్ బ్లోయింగ్: అమ్నేషియా పబ్ కేసులో మరో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ కేసు తెలంగాణలోనే సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. పోలీసులు నిందితులను విచారిస్తున్న క్రమంలో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. కాగా, పోలీసులు శనివారం నలుగురు నిందితులను కస్టడీలో విచారించారు. A1 సాదుద్దీన్ మాలిక్తో పాటుగా ముగ్గురు మైనర్లను పోలీసులు ప్రశ్నించారు. ఈ క్రమంలో మైనర్లు పోలీసులకు ట్విస్టులు ఇచ్చినట్టు సమాచారం. లైంగిక దాడి కేసులో మైనర్లు తమ తప్పులేదని పోలీసులకు చెప్పారు. తమను సాదుద్దీన్ మాలికే రెచ్చగొట్టాడని తెలిపారు. దీంతో తాము మైనర్పై లైంగిక దాడి చేశామని ఒప్పుకున్నారు. అయితే, సాదుద్దీన్ను విచారిస్తున్న క్రమంలో పోలీసులకు అతను.. ముందుగా మైనర్లే ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పుకొచ్చాడు. దీంతో పోలీసులు గందరగోళానికి గురవుతున్నారు. విచారణలో భాగంగా సాదుద్దీన్.. ఎమ్మెల్యే కుమారుడే ముందుగా ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపాడు. తర్వాత తామూ అనుసరించామని చెప్పాడు. కాన్సూ బేకరీ వద్ద ఎమ్మెల్యే కుమారుడు కారు దిగి వెళ్లిపోయినట్టు తెలిపాడు. ఇక, విచారణ అనంతరం.. నిందితులకు పోలీసులు ఉస్మానియా ఆసుపత్రిలో పొటెన్సీ టెస్టులు నిర్వహించారు. ఆసుపత్రిలో టెస్టుల కారణంగా శనివారం కేవలం గంటసేపు మాత్రమే నిందితులను విచారించినట్టు ఇన్వెస్టిగేషన్ అధికారి బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ తెలిపారు. ఇది కూడా చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. గరిమెళ్ల ప్రత్యూష మృతి -
Amnesia Pub Case: అమ్నిషియా పబ్ రేప్ కేసులో సంచలనాలు
-
జూబ్లీహిల్స్ గ్యాంగ్రేప్ ఘటన: బాధితురాలిని ట్రాప్ చేసింది ఎవరంటే..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ మైనర్ సామూహిక అత్యాచార ఘటనలో.. పోను పోను సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యే మనవడు, పాతబస్తీ ఎమ్మెల్యే కుమారుడి అరెస్ట్ రిమాండ్లో మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. కార్పొరేటర్ కుమారుడే బాధితురాలిని ట్రాప్ చేశాడన్న నిందితులు వెల్లడించారు. పబ్లో బాధితురాలితో, కార్పొరేటర్ కుమారుడు అనుచిత ప్రవర్తించాడు. మళ్లీ పబ్ బయటకు వచ్చాక కార్పొరేటర్ కొడుకే మాయమాటలు చెప్పి ట్రాప్ చేశాడు. ఆపై ఆమెను కారులో ఎక్కించాడని నిందితులు వెల్లడించారు. ‘‘బెంజ్ కారులో మొదట ఎమ్మెల్యే కుమారుడు.. బాధితురాలిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అతని తర్వాత.. కార్పొరేటర్ కొడుకు అసభ్యంగా వ్యవహరించాడు. కాన్సూ బేకరీ దగ్గరికి వెళ్లేసరికి ముందు సీట్లో నుంచి సాదుద్దీన్ వెనక సీట్లోకి మారాడు. ఆమెపై సాదుద్దీన్ లైంగిక దాడి చేశాడు. కాన్సూ బేకరీ దగ్గర బాధితురాలిని కార్లోనే కూర్చోబెట్టాం. బేకరీలో అందరూ ఫుడ్తిని, సిగరెట్లు తాగాం. అక్కడి నుంచి అంతా కలిసి ఇన్నోవా కారులో పబ్కి బయల్దేరాం. ఆమె సెల్ఫోన్, కళ్లద్దాలను బలవంతంగా లాక్కున్నాం. అవి కావాలంటే ఇన్నోవా ఎక్కాలని బెదిరించాం. కారులో ఒకరి తర్వాత ఒకరం లైంగిక దాడి చేశాం’’ అని నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. అమ్నీషియా పబ్ రేప్ కేసులో జువనైల్స్ని కస్టడీకి అనుమతించింది కోర్టు. దీంతో రేపటి నుంచి నాలుగు రోజులపాటు పోలీస్ కస్టడీకి అనుమతి దొరికినట్లయ్యింది. ఇప్పటికే ఈ కేసులో ఏ-1గా ఉన్న సాదుద్దీన్ మాలిక్ను విచారిస్తున్నారు. ఐదుగురిని కలిసి రేపటి నుంచి విచారించనున్నారు. చదవండి: బాధితురాలి రెండో స్టేట్మెంట్లో సంచలన విషయాలు -
రాజీనామా చేయాల్సిందే.. వక్ఫ్బోర్డ్ ఛైర్మన్కు టీఆర్ఎస్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: తక్షణం వక్ఫ్బోర్డ్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని మసీవుల్లాను టీఆర్ఎస్ పార్టీ ఆదేశించింది. జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసు ఘటనలో వక్ఫ్బోర్డ్ ఛైర్మన్ కుమారుడు నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. వక్ఫ్బోర్డు కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అత్యాచారం కేసుకు సంబంధించి తీవ్ర ఆరోపణలు రావడంపై పార్టీ సీరియస్ అయ్యింది. చర్యలు తీసుకునే బాధ్యతను హోంమంత్రి మహమూద్ అలీకి పార్టీ అప్పగించింది. పదవి నుంచి తప్పుకోవాలని మసీవుల్లాకు హోంమంత్రి సూచించారు. చదవండి: జూబ్లీహిల్స్ అత్యాచారం కేసు.. బాలిక రెండో స్టేట్మెంట్లో సంచలన విషయాలు కాగా, బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఇన్నోవా కారు.. అధికారిక వాహనమా, లేక వక్ఫ్ బోర్డు చైర్మన్ వ్యక్తిగతంగా వినియోగిస్తున్న వాహనమా అనే దానిపై స్పష్టత రాలేదని పోలీసులు అంటున్నారు. 2019లో ఖరీదు చేసిన ఆ వాహనం సనత్నగర్ ప్రాంతానికి చెందిన దినాజ్ జహాన్ పేరుతో ఉంది. వక్ఫ్బోర్డు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఈ కేసులో నిందితుడైన ఓ బాలుడి తండ్రి దాన్ని లీజుకు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కారు టెంపరరీ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా వివరాలు ఇవ్వాల్సిందిగా ఆర్టీఏ అధికారులకు పోలీసులు లేఖ రాశారు. మరోవైపు వాహనం వివరాలు కోరుతూ దినాజ్ జహాన్తో పాటు వక్ఫ్ బోర్డుకు నోటీసులు ఇవ్వాలని, లేఖ రాయాలని నిర్ణయించారు. వీటికి సమాధానాలు వస్తే.. అది వక్ఫ్బోర్డు లీజుకు తీసుకుని చైర్మన్కు కేటాయించిన అధికారిక వాహనమా? లేక చైర్మన్ వ్యక్తిగతంగా తీసుకున్నదా? అనేది స్పష్టం కానుంది. ఇక బెంజ్ కారు మాత్రం కేసులో నిందితుడైన ఓ బాలుడి తల్లి పేరుతో ఉందని, దాన్ని అతడే వినియోగిస్తున్నాడని తేల్చారు. మైనర్కు వాహనం ఇవ్వడంతో ఆమెకూ నోటీసులు జారీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
Amnesia Pub: జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో పోలీసుల సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అత్యాచారం కేసు నిందితులను ట్రయల్ సమయంలో మేజర్లుగా పరిగణించాలని పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్డును కోరారు. ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ట్రయల్ జరిగే సమయంలో ఐదుగురిని అడల్ట్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డుకు హైదరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పోలీసుల వినతిపై జువైనల్ జస్టిస్ బోర్డు తుది నిర్ణయం తీసుకోనుంది. మైనర్ల మానసిక స్థితి, నేరం చేయడానికి వారికి ఉన్న సామర్థ్యం అన్నిటిని పరిగణలోకి తీసుకొని జువైనల్ జస్టిస్ బోర్డు నిర్ణయం వెల్లడించనుంది. మైనర్లకు 21 ఏళ్లు దాటిన తర్వాత వారిని జువైనల్ హోం నుంచి సాధారణ జైలుకు తరలించనున్నారు. చదవండి: (Amnesia Pub Case: జువైనల్ హోమ్కు ఎమ్మెల్యే కుమారుడు) -
జూబ్లీహిల్స్ అత్యాచారం కేసు.. బాలిక రెండో స్టేట్మెంట్లో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అత్యాచార బాధితురాలి రెండోసారి స్టేట్మెంట్ రికార్డ్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటి వద్ద దింపుతామని ట్రాప్ చేసి అత్యాచారం చేసినట్లు బాధితురాలు వెల్లడించింది. బాధితురాలిని వెంబడించి క్యాబ్ బుక్ చేస్తామంటూ నిందితులు ఫోన్ లాక్కున్నారు. ఫోన్ సిగ్నల్ సరిగా లేదని.. ఇంటి వద్ద డ్రాప్ చేస్తామంటూ బెంజ్ కారులో తీసుకెళ్లిన నిందితులు.. బాధితురాలి హ్యాండ్ బ్యాగ్, కళ్లజోడు లాక్కున్నారు. కాన్స్ బేకరీ వద్దకు రాగానే ఇన్నోవాలోకి షిఫ్ట్ చేశారు. ఇన్నోవాలో తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు వెల్లడించింది. చదవండి: అశ్లీలం.. విశృంఖలం!.. ఇంటర్నెట్లో రాజ్యమేలుతున్న పోర్న్ వెబ్సైట్లు -
జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్
-
అత్యంత బాధాకరం.. సమాజం ఎటు పోతోంది?
ఇటీవల హైదరాబాద్ నగరంలో ‘నిర్భయ’ ఘటన తరహాలో కారులో నడిరోడ్డు మీద సామూహిక అత్యాచార పర్వం చోటుచేసుకోవడం అత్యంత బాధాకరం. ఇందులో ప్రముఖుల పుత్ర రత్నాలు ఉండటంతో అనేకమంది రాజకీయ నాయకులు ఉలిక్కిపడ్డారు. మే 8న చౌటుప్పల్ ప్రాంతంలో ఓ ఆదివాసీ మహిళపై అత్యాచారం జరిగింది. ఆ మధ్య... వికారాబాద్ సమీపంలో మరో మహిళా అత్యాచారానికి గురైంది. ఇలా... ప్రతిరోజూ దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట ఇటువంటి దురాగతాలు జరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీ ‘నిర్భయ’ దుర్ఘటన తరువాత ప్రత్యేకంగా ‘నిర్భయ’ చట్టాన్ని తీసుకొచ్చారు. 2012–2013 సంవత్సరాల మధ్య హైదరాబాద్ సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఇటువంటి మరో ఉదంతం వెలుగు చూడటంతో ఆ ఘటనకు ‘అభయ’ ఘటన అని పేరు పెట్టారు. ఇలాగే... 2019లో హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్– షాద్నగర్ల మధ్య జరిగిన అత్యాచార ఘటనకు ‘దిశ’ అని పేరు పెట్టారు. ఈ ‘దిశ’ పేరుతో ఏకంగా ఆంధ్రప్రదేశ్లో ‘దిశ’ చట్టాన్ని తీసుకొచ్చారు. దీని అమలుకు ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు... ఈ మధ్య ఓ యాప్ను కూడా రూపొందించారు. తెలంగాణలో సైతం ప్రత్యేకంగా ‘షీ టీమ్స్’ను, స్పెషల్ మొబైల్ వెహికిల్స్ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వాలు ఇలా... అత్యాచారాలను అరికట్టడానికి అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ... కొందరి పురుషుల మనస్తత్వాల్లో ఏమాత్రం మార్పు రాకపోవడమే విడ్డూరం. మానవత్వాన్ని పూర్తిగా కోల్పోయిన వారు ముక్కుపచ్చలారని చిన్నారుల మీద కూడా అత్యాచారాలు చేస్తూ... చట్టాలపట్ల ఏమాత్రం భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. (క్లిక్: హైదరాబాద్: పబ్బుల్లో ఏం జరుగుతోంది?) ముఖ్యంగా యువకులు ఇటువంటి పెడ ధోరణి వైపు పయనించడానికి నేటి సామాజిక మాధ్యమాలు, అందుబాటులో ఉన్న డ్రగ్స్, మద్యం వంటివే ప్రధాన కారణాలని చెప్పవచ్చు. – కె. ధనలక్ష్మి, సెక్రటరీ, లీగల్ సర్వీసెస్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ -
వీడియోలు బయటకు, రఘునందన్పై కేసు.. ఎమ్మెల్యే రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి తనపై కేసులు పెడితే లీగల్గా ఎదుర్కొంటానని బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్ రావు తెలిపారు. నోటీసులు ఇచ్చినా, పోలీసులు అరెస్ట్ చేసేం దుకు వచ్చినా సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. పార్టీ కార్యాల యంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. న్యాయం జరిగే దాకా బాధితురాలి పక్షాన పోరాడతానని స్పష్టం చేశారు. ఈ కేసులో కాంగ్రెస్ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్థం కావడం లేద న్నారు. అమ్నీషియా పబ్ మైనర్ అమ్మాయి కేసులో కాంగ్రెస్ నేతల పిల్లలు కూడా ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేశారు. అత్యాచార ఘటనలో నిందితులకు శిక్ష పడే వరకు బండి సంజయ్ నేతృత్వంలో పోరాడుతామని పేర్కొన్నారు. సంబంధిత వార్త: Amnesia Pub Case: ఎమ్మెల్యే రఘునందర్రావుపై కేసు నమోదు -
జూబ్లీహిల్స్ పబ్ కేసు: ఆరుగురిలో ఐదుగురు మైనర్లే!
-
జూబ్లీహిల్స్ గ్యాంగ్రేప్ ఘటన.. కీలక వివరాలు వెల్లడించిన సీపీ
సాక్షి, హైదరాబాద్: సంచలన సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ సామూహిక అత్యాచార కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు నగర సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించిన నగర కమిషనర్.. ఈ కేసులో నిందితులు మైనర్లు కాబట్టి పేర్లు, ఇతర వివరాలు వెల్లడించడం కుదరని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ కేసును లోతుగా దర్యాప్తు చేశాం. ఆరుగురిలో ఒకరు మేజర్, ఐదుగురు మైనర్లు. కేసులో మైనర్లు ఉన్నందున పేర్లు చెప్పడం లేదు. మార్చి 28న ఈ వ్యవహారం మొదలైంది. బెంగళూరులో ఉండే ఒక స్టూడెంట్.. స్కూల్ మొదలుకాక ముందు పార్టీ చేసుకోవాలని హైదరాబాద్లో స్నేహితులతో ప్లాన్ చేశాడు. అందుకోసం అమ్నీషియా పబ్ను ఎంచుకుని.. ఏప్రిల్లో పార్టీ గురించి పోస్ట్ చేశాడు. నాన్ ఆల్కాహాలిక్, స్మోకింగ్ పార్టీ కోసం అప్లై చేసుకున్నారు. ఉస్మాన్ అలీఖాన్ అనే వ్యక్తి ద్వారా పబ్ను బుక్ చేయించారు. మే 28వ తేదీన పార్టీ గురించి సదరు స్టూడెంట్ మళ్లీ పోస్ట్ చేశాడు. మే 28వ తేదీన మధ్యాహ్నాం బాధితురాలు పబ్కు వెళ్లింది. నిందితులు.. పబ్లో ముందుగానే పథకం వేసుకున్నారు. ఆమె ఫాలో చేసి ట్రాప్ చేశారు. అదే రోజు సాయంత్రం రోడ్డు నెంబర్ 44లో ఉన్న ఖాళీ ప్రదేశంలో సామూహిక అత్యాచారం జరిగింది. ఒకరి తర్వాత ఒకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. సాయంత్రం మళ్లీ పబ్ దగ్గర బాధితురాలిని వదిలిపెట్టారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. మెడపై గాయాలను చూసి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. మే 31న పోక్సో యాక్ట్ ప్రకారం.. జూబ్లీహిల్స్ పీఎస్లో కేసు నమోదు చేశారు. భరోసా సెంటర్లో కౌన్సెలింగ్ తర్వాత బాధితురాలు వివరాలు చెప్పింది. ఆ తర్వాత మరికొన్ని సెక్షన్లు నమోదు చేశాం. పబ్, బేకరి వద్ద అన్ని సీసీ ఫుటేజీలను పరిశీలించాం. ఏ1 సాదుద్దీన్తో పాటు మైనర్ నిందితులు, బాధితురాలు వాహనంలో వెళ్లారు. మైనర్తో పాటు సాదుద్దీన్ బాధితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. నిందితులను బాధితురాలు గుర్తించలేకపోయింది. ఆధారాలతో సహా జూన్ 2వ తేదీన నిందితులను గుర్తించాం. జూన్ 3న సాదుద్దీన్ను అరెస్ట్ చేశాం. ఏ1 సాదుద్దీన్తో పాటు మిగతా వాళ్లపై కేసు నమోదు అయ్యింది. సాదుద్దీన్తో పాటు నలుగురిని అరెస్ట్చేశాం. మరొకరి కోసం స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశాం. దర్యాప్తు చాలా పారదర్శకంగానే జరిగిందని.. పలు కోణాల్లో దర్యాప్తు చేయడం వల్లే ఆలస్యమైందని చెప్పారు. ఇలాంటి కేసుల్లో శిక్షలూ కఠినంగానే ఉంటాయని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. పబ్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. -
జూబ్లీహిల్స్ లోని పలు పబ్ లలో పోలీసుల తనిఖీలు
-
జూబ్లీహిల్స్ అత్యాచారం కేసు రిమాండ్ రిపోర్ట్లో సంచలనాలు
-
భార్యను చంపి ఇంట్లో పాతిపెట్టిన భర్త!
-
ఆమ్నీషియా పబ్ కేసు.. మరో మైనర్తోనూ అసభ్యంగా..!
సాక్షి, హైదరాబాద్/ బంజారాహిల్స్: రొమేనియా బాలికపై జరిగిన ఘాతుకం కేసుకు సంబంధించి మరో కోణంలోనూ పోలీసుల నిర్లక్ష్యం బయటపడింది. ఈ నేరానికి పాల్పడిన నిందితులు ఆమ్నేషియా పబ్లో మరో బాలికతోనూ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ అంశం రొమేనియా బాలిక వాంగ్మూలంతో వెలుగులోకి వచి్చనా ఇప్పటివరకు తదుపరి చర్యలు తీసుకోలేదు. అలా చేస్తే నిందితులపై మరో కేసు నమోదవుతుందనే ఒత్తిళ్ల నేపథ్యంలోనే పోలీసులు మిన్నకుండిపోయారని తెలుస్తోంది. మరోపక్క ‘కారులో బాలిక’ వీడియోలను వైరల్ చేసిన మూడు యూట్యూబ్ చానళ్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వీటిని మీడియాకు విడుదల చేసిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావుపై చర్యలు తీసుకునే అంశంలోనూ పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు సమాచారం. అది కాలేజీ పార్టీ కాదు ... ఆమ్నేíÙయా పబ్లో గత నెల 28న జరిగింది ఓ కార్పొరేట్ స్కూల్కు సంబంధించిన ఫేర్వెల్ పార్టీ అని ఇప్పటివరకు భావించారు. పబ్ సిబ్బందిని క్షుణ్ణంగా విచారించిన పోలీసులు అది ఓ ప్రైవేట్ పార్టీగా తేల్చారు. నగరానికి చెందిన హాదీ, సుల్తాన్ తదితరులు వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో పార్టీ ఏర్పాటుకు నిర్ణయించారు. హాదీ రొమేనియా బాలికను పార్టీకి హాదీ తీసుకువెళ్లాడు. మధ్యాహ్నం 1.30 గంటలకు వీళ్లు వెళ్లగా... 3.15 గంటలకు నిందితులు వచ్చారు. పబ్లోనే ఈమెకు మరో బాలికతో పరిచయమైంది. వీరిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో సమీపించిన సాదుద్దీన్, ఉమేర్లతో పాటు మిగిలిన నిందితులు అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో విసుగు చెందిన బాలికలు ఇద్దరూ పార్టీ ముగియడానికి ముందే పబ్ నుంచి బయటకు వచ్చేశారు. మరో బాలిక క్యాబ్లో వెళ్లిపోగా.. హాదీ కోసం ఎదురుచూస్తూ రొమేనియా బాలిక బయటే ఆగింది. ఈ సమయంలో బయటకు వచి్చన ఎమ్మెల్యే కుమారుడు, నిందితులు ఆకర్షణీయమైన మాటలు చెప్పి ఆమెను లోబరుచుకున్నారు. ఈ వ్యవహారంలో సదరు కార్పొరేటర్ కుమారుడు కీలకంగా వ్యవహరించాడు. కాగా కారులోనూ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తూ కాన్సూ బేకరీ వద్దకు తీసుకువచ్చారు. అక్కడ నుంచి వెళ్లిపోవడానికి బాలిక సిద్ధమవగా.. ఇంటి వద్ద దింపుతామన్న నిందితులు, బెంజ్ కారులో పెట్రోల్ అయిపోయిందని చెప్పి ఇన్నోవాలో ఎక్కించుకుని అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే ఎమ్మెల్యే కుమారుడు బేకరీ వద్ద నుంచే వెళ్లిపోయాడు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత నిందితులు బేకరీకి వచ్చారు. తాము ఎంజాయ్ చేశామని గ్రూప్ ఫోటో దిగి ఇన్స్ట్రాగామ్లో పోస్టు చేశారు. అక్కడ నుంచి ఎవరి ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ వివరాలు రొమేనియా బాలిక, నిందితుల వాంగ్మూలాల్లో బయటకు వచ్చాయి. పోక్సో చట్టం కింద కేసు నమోదుకు అవకాశం చిన్నారులపై జరిగే లైంగిక దాడులు నిరోధించడానికి ఉద్దేశించిన పోక్సో చట్ట ప్రకారం ఏదైనా నేరం జరిగిందని తెలిసీ ఫిర్యాదు చేయకపోవడం, తదుపరి చర్యలు తీసుకోకపోవడం సైతం నేరమే. అలాగే పబ్లో మరో బాలిక పట్ల సాదుద్దీన్, ఉమేర్ తదితరులు అసభ్యంగా ప్రవర్తించడమూ నేరమే అవుతుంది. దీనికి సంబంధించి ఆ బాలిక లేదా ఆమె సంబం«దీకుల నుంచి వాంగ్మూలం నమోదు చేసి పోక్సో చట్టం కింద మరో కేసు రిజిస్టర్ చేయడానికి ఆస్కారం ఉంది. కానీ నగర పోలీసులు మరో బాలికను గుర్తించి, వాంగ్మూలం నమోదు చేయడం దిశగా చర్యలు తీసుకోలేదు. ఆమెపై జరిగిన అసభ్య ప్రవర్తన విషయం తెలిసినప్పటికీ మిన్నకుండిపోయారు. సోమవారం పోలీసులు పబ్లోని సీసీ కెమెరాలను పరిశీలించినప్పుడూ ఈ దృశ్యం వారికి స్పష్టంగా కనిపించింది. నిందితుల రిమాండ్ రిపోర్టులోనూ ఈ అంశాలను పోలీసులు చేర్చారు. ఎమ్మెల్యే కుమారుడికి చెక్ పెట్టేందుకే వీడియో? ఈ ఉదంతానికి సంబంధించి బయటకువచి్చన వీడియోల చిత్రీకరణ వెనుక మరో కోణం ఉన్నట్లు నిందితుల విచారణ సందర్భంగా పోలీసులు గుర్తించారు. ఎమ్మెల్యే కుమారుడు, ఈ కేసులో నిందితులు స్నేహితులే అయినప్పటికీ వారి మధ్య కొన్ని స్పర్ధలు ఉన్నాయి. ఎమ్మెల్యే కుమారుడు వీరిపై ఆధిపత్యం చెలాయిస్తుండేవాడని సమాచారం. దీంతో అతడికి చెక్ పెట్టడానికి అవకాశం కోసం మిగిలిన వాళ్లు ఎదురు చూశారు. బెంజ్ కారులో ప్రయాణిస్తున్న సమయంలో వెనుక సీట్లో కూర్చున్న ఎమ్మెల్యే కుమారుడు బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది చూసిన ఉమేర్ తన ఫోన్ను ముందు సీట్లో కూర్చున్న వ్యక్తికి ఇచ్చి రికార్డు చేయించాడు. దీని ఆధారంగా ఎమ్మెల్యే కుమారుడిని బెదిరించాలని వాళ్లు భావించారు. అయితే దారుణం బయటకు వచ్చి కేసు నమోదు కావడం, పోలీసుల గాలింపు నేపథ్యంలో వీడియోలను మరో రకంగా వాడుకున్నారు. ఆ ఉదంతంలో తమ తప్పు లేదని, బాలిక సమ్మతితోనే అంతా జరిగిందని చెప్పడానికి ఎంపిక చేసుకున్న వారికి ఓ నిందితుడి తండ్రి లీక్ చేశాడు. ఇలా చేసిన వ్యక్తితో పాటు నిందితులకు ఫామ్హౌస్లో ఆశ్రయం ఇచి్చన వారికీ నోటీసులు జారీ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఎమ్మెల్యేపై కేసు వద్దంటూ ఒత్తిళ్లు... సంబంధించిన కారులోని వీడియోలు వైరల్ చేస్తున్న యూట్యూబ్ చానళ్లు, సోషల్ మీడియాపై చర్యలకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ణయించారు. ఇప్పటికే యూట్యూబ్ను పరిశీలించిన అధికారులు ఈ వీడియోలు పోస్టు చేసిన మూడు యూట్యూబ్ చానళ్లను గుర్తించారు. ఆదివారం వాటిపై సుమోటో కేసులు నమోదు చేసిన అధికారులు ఓ చానల్ రిపోర్టర్కు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. అయితే బెంజ్ కారులో బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే కుమారుడిపైనా, ‘కారులో బాలిక’వీడియోలను మీడియాకు విడుదల చేసిన ఎమ్మెల్యే రఘునందన్రావుపైనా కేసు నమోదు చేసే విషయంలో పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి. చట్ట ప్రకారం ఈయనపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని పోలీసులు స్పష్టం చేస్తున్నాయి. అయితే అలా చేస్తే అది రాజకీయ ఇబ్బందులకు కారణమవుతుందంటూ పోలీసులపై ఒత్తిడి వస్తున్నట్లు తెలిసింది. న్యాయస్థానంలో బాలిక వాంగ్మూలం జూబ్లీహిల్స్ పోలీసులు రొమేనియా బాలికను సోమవారం న్యాయస్థానానికి తీసుకువెళ్లి మేజి్రస్టేట్ ఎదుట హాజరుపరిచారు. ఆయన సమక్షంలో బాధితురాలి నుంచి మరోసారి వాంగ్మూలం సేకరించారు. దీని ఆధారంగా ఎమ్మెల్యే కుమారుడిని ఆరో నిందితుడిగా చేర్చాలని ఎట్టకేలకు పోలీసులు నిర్ణయించారు. మరోపక్క ఫోరెన్సిక్ నిపుణులు సోమవారం మరోసారి బెంజ్, ఇన్నోవా కార్లను తనిఖీ చేసి పలు నమూనాలు సేకరించారు. -
జూబ్లీహిల్స్లో దారుణం: భార్యను చంపి డ్రమ్ములో కుక్కి..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను చంపేశాడు ఓ వ్యక్తి. అంతేకాదు భార్యను రెండు ముక్కలుగా చేసి.. వాటర్ డ్రమ్ములో దాచిపెట్టి పరారయ్యాడు. మహబూబ్ నగర్ తండాకు చెందిన అనిల్, సరోజలు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ తరుణంలో పెద్దలు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. అయినా కూడా పరిస్థితి మారలేదు. శుక్రవారం సాయంత్రం సైతం ఇద్దరూ గొడవ పడినట్లు స్థానికులు చెప్తున్నారు. ఈ తరుణంలో శనివారం నుంచి సరోజా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మరోవైపు అనిల్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో సరోజ తండ్రికి అనుమానం వచ్చింది. ఈ క్రమంలో.. రెహమత్నగర్ సుభాష్ నగర్లో ఈ జంట ఉంటున్న ఇంటికి వచ్చాడు ఆయన. బయట తాళం వేసి ఉండడంతో మరోసారి అనిల్కు కాల్ చేశాడు. ఈసారి ఫోన్ లిఫ్ట్ చేసిన అనిల్.. పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. అనుమానంతో తాళం పగలగొట్టిన సరోజ తండ్రి.. లోపల దృశ్యాలు చూసి గుండె పగిలేలా రోదించాడు. చిన్న వాటర్ డ్రమ్లో సరోజ మృతదేహాం రెండు ముక్కలై పడి ఉంది. సరోజను డంబెల్తో కొట్టి చంపి.. ఆపై రెండు ముక్కలుగా చీల్చేసి వాటర్ డ్రమ్లో కుక్కేశాడు అనిల్!. సరోజ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అనిల్ జాడ కోసం గాలింపు చేపట్టారు. సరోజ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి.. పోస్ట్మార్టం రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. -
జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో మరొకరు అరెస్ట్
-
Hyderabad: మొన్న జూబ్లీహిల్స్.. నిన్న మొఘల్పుర... తాజాగా కాలాపత్తర్
సాక్షి, హైదరాబాద్: మొన్న జూబ్లీహిల్స్.. నిన్న మొఘల్పుర... తాజాగా కాలాపత్తర్... కామాంధుల చేతుల్లో ముగ్గురు బాలికలు నలిగిపోయారు. లైంగిక దాడుల నుంచి మైనర్లకు రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన పోక్సో యాక్ట్–2012 అమలులో ఉన్నా ఘోరాలు ఆగట్లేదు. ఏదైనా కొత్త చట్టం తీసుకురావడంలో నిందితుల్ని కఠినంగా శిక్షించడానికి అనేది పైకి కనిపించే అంశమైతే... అంతర్గతంగా ఉండే దీని ప్రధాన ఉద్దేశం ఆ తరహా నేరాలు పునరావృతం కాకుండా చూడటమే. కేంద్ర ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పోక్సో యాక్ట్ ఈ కోణంలో ఆశించిన స్థాయి ఫలితాలు ఇవ్వట్లేదనే వాదన వినిపిస్తోంది. ఈ పరిస్థితులు తలెత్తడానికి ప్రధాన కారణం అవగాహన లోపమని నిపుణులు చెబుతున్నారు. ప్రేమ పేరుతో వల.. బాలికలపై జరుగుతున్న ఘోరాల్లో అనేకం ప్రేమ పేరుతో వలలో పడేసుకుని చేసేవే ఉంటున్నాయి. తెలిసీ తెలియని వయసులో ఆకర్షణనే ప్రేమగా భావిస్తున్న మైనర్లు ఈ వలలో పడుతున్నారు. సోషల్ మీడియా, ఇంటర్నెట్ ప్రభావంతో విపరీత పోకడలు అనుసరించి భవిష్యత్తును బుగ్గి చేసుకుంటున్నారు. ఓ బాలికను ఆమె అనుమతితో పెళ్లి చేసుకున్నా, సన్నిహితంగా గడిపినా కూడా అది నేరమే అవుతుంది. అభ్యంతరకంగా కామెంట్స్ చేయడమూ పోక్సో చట్ట ప్రకారం తీవ్రమైన అంశమే. ఇలాంటి చట్టాన్ని చేసిన యంత్రాంగాలు అక్కడి తమ పని అయిపోయిందన్నట్లు చేతులు దులుపుకొన్నాయి. అవగాహనలో విఫలం.. కేంద్ర ప్రభుత్వం అత్యంత శక్తిమంతమైందని చెప్పుకున్న పోక్సో చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చినప్పటికీ చిన్నారులు, బాలికలపై అఘాయిత్యాలు తరచూ జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ‘పోక్సో’పై అందరికీ అవగాహన కల్పించడంలో విఫలం ఒక కారణమైతే... మిగిలిన కీలకాంశాలను పట్టించుకోక మరో కారణం. కేవలం ఓ చట్టాన్ని తీసుకురావడం ద్వారా కుటుంబ, సామాజిక తదితర పరిస్థితుల్లో పూర్తి మార్పు తీసుకురావడమనేది దుర్లభమని నిపుణులు చెబుతున్నారు. ఇవి మారాలంటే సమస్యని లోతుగా అధ్యయనం చేయాలి. ఇలాంటివి పునరావృతం కావడానికి కారణాలను గుర్తించాలని సూచిస్తున్నారు. వాటిని సాధ్యమైనంత వరకు కూకటివేళ్లతో సహా పెకిలించి వేయడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నారు. చదవండి: లవ్ ఫెయిల్యూర్.. యువతి ఆత్మహత్య.. మృతిపై భిన్న కథనాలు.. అఘాయిత్యాలకు కారణాలు అనేకం... చిన్నారులపై అఘాయిత్యాలకు ప్రధానంగా అనేక కారణాలు ఉంటున్నాయని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం, విదేశీ సంస్కృతి మోజులో యువత దారి తప్పడం, తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య సరైన సత్సంబంధాలు లేకపోవడం, మత్తుమందులు, వ్యసనాలకు బానిసైన యువకులు, సినిమా, సోషల్ మీడియాల్లో మితిమీరుతున్న అశ్లీలం, మహిళల్ని వ్యాపార వస్తువుగా చిత్రీకరిస్తున్న ప్రకటనలు, చదువుకునే వయసులో తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగా ఆకర్షణ, ప్రలోభాలకు లోనుకావడం ప్రధానమైనవని వివరిస్తున్నారు. ఇళ్లల్లో పిల్లలపై పెద్దలు శ్రద్ధ పెట్టాలి. ఆడపిల్లల్ని గౌరవించడం, మహిళలతో మర్యాదగా ప్రవర్తించడం, సమాజంలో వారికి ఉండాల్సిన సముచిత స్థానం తెలియజేస్తూ సభ్యత, సంస్కారాలకు నేర్పించాలి. మహిళలపై అఘాయిత్యాలు జరిగిన తరవాత బాధపడేకంటే... జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మానసిక నిపుణుడు ప్రతాప్కుమార్ తెలిపారు. చిన్నారులు, మహిళలపై జరుగుతు న్న దారుణాల్లో సగం కూడా పోలీసు వరకు రావడం, రికార్డుల్లోకి ఎక్కడం జరగట్లేదు. దీనికి పరువు, కుటుంబ నేపథ్యం వంటి ఎన్నో కారణాలు ఉంటున్నాయి. బాధితుల మౌనంతో వస్తున్న ఈ ఉదాసీనత ముష్కరులు మరింతగా రెచ్చిపోవడానికి ఊతం ఇచ్చినట్లేనని గుర్తుంచుకోవాలి. -
జూబ్లీహిల్స్ పబ్ కేసు: చిక్కిన ఐదుగురు నిందితులు
-
జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసు.. కీలక ఆధారం లభ్యం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసులో నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. ఇప్పటివరకు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు, ఒక మేజర్ కాగా.. ఇద్దరు మైనర్లను జువైనల్ హోమ్కు తరలించారు. నిందితుడు మాలిక్కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ను కోర్టు విధించింది. బాలికపై అత్యాచారం జరిగిన ఇన్నోవా కారు ఆచూకీ లభ్యమైంది. క్లూస్ టీమ్తో ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. చదవండి: అమ్నీషియా పబ్ కేసు: కారులో ఉంది ఎమ్మెల్యే కొడుకే! ఈ కేసులో ఓ విద్యాసంస్థ పేరుతో ఈవెంట్ కోసం పబ్ను బుక్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మే 28న మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పబ్లో పార్టీ జరిగినట్లు సమాచారం. పబ్లో పార్టీ కోసం రూ.2లక్షలు చెల్లించినట్లు తెలిసింది. 150 మంది విద్యార్థుల కోసం నిర్వాహకులు బుక్ చేశారు. పబ్లో ప్లస్ టూ విద్యార్థుల ఫేర్వెల్ పార్టీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. -
అమ్నీషియా పబ్ కేసు: బెంజ్కారులో అత్యాచారం.. ఇన్నోవా కారులోని వారి అరెస్టా?
సాక్షి, హైదరాబాద్: రొమేనియా బాలికపై అత్యాచారం ఘటనలో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నాడని.. కానీ పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు ఆరోపించారు. బెంజ్ కారులో అత్యాచారం జరిగితే.. ఇన్నోవాలో ఉన్న వారిని అరెస్ట్ చేసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బెంజ్ కారులో ఉన్న వారినెవరినీ ముద్దాయిలుగా చూపకపోవడం బాధాకరమన్నారు. అత్యాచార ఘటనకు సంబంధించి తాము సేకరించిన ఫొటోలు, వీడియోలను శనివారం బీజేపీ కార్యాలయంలో మీడియాకు విడుదల చేశారు. ఎరుపు రంగు బెంజ్ కారులో బాధితురాలిపై ఎమ్మెల్యే కుమారుడు, ఇతరులు లైంగిక దాడి చేశారని నిరూపించడానికి ఈ ఆధారాలు ఉపయోగపడతాయన్నారు. క్లీన్చిట్ ఎలా ఇస్తారు? అత్యాచార ఘటనతో సంబంధమున్న వారి ని ఇతర రాష్ట్రాలు, దేశాలకు పంపించినట్టు.. కొందరిని దుబాయ్ విమానం ఎక్కించినట్టు తనకు సమాచారం ఉందని రఘునందన్రావు తెలిపారు. ఈ కేసు చల్లబడ గానే వారిని తిరిగి హైదరాబాద్కు రప్పించుకునే ప్లాన్లో ఉన్నారని.. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దోషులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. పోలీసు అధికారులు విచారణ జరపకుండానే ఘటనలో ఎమ్మెల్యే కొడుకు లేడని, హోంమంత్రి మనవడి ప్రమేయం లేదని క్లీన్చిట్ ఎలా ఇస్తా రని నిలదీశారు. పబ్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న, అత్యాచార ఘటనలో పాల్గొనవారి ఫొటోలు, వీడియోలు తమ వద్ద ఉన్నాయని.. హైకోర్టుకు సమర్పించి.. సీబీఐ విచారణ కోరుతామన్నారు. పోలీసులకు ఆధారాలు ఇచ్చేందుకు తాను సిద్ధమేనని.. కానీ పోలీసులు వాటిని ధ్వంసం చేసి అంతా ఉత్తుత్తివేనంటే పరిస్థితి ఏమిటనే అనుమానం ఉందన్నారు. ఎంఐఎం వారిని కాపాడేందుకు.. అత్యాచార ఘటనలో ఎంఐఎం వారిని కాపాడేందుకు టీఆర్ఎస్ వారిని బలిపశువులను చేస్తున్న విషయాన్ని కేటీఆర్ గ్రహించడం లేదని రఘునందన్ అన్నారు. హైదరాబాద్లో పోలీసు వ్యవస్థ మొత్తాన్ని ఎంఐఎం నేతలే నడిపిస్తున్నారని.. ఈ కేసులో వాళ్లు చెప్పినట్టే ఎఫ్ఐఆర్లలో పేర్లు, విచారణ జరుగుతోందన్నారు. దోషులకు శిక్షపడే దాకా పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి.. ఈ ఘటనపై సీబీఐతోగానీ, హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలోగానీ విచారణ చేపట్టాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను రఘు నందన్రావు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ పోలీసులను ఎంఐఎం నేతలు కీలుబొమ్మలుగా చేసి ఆడిస్తున్నారని.. అందుకే సీబీఐ, హైకోర్టు జడ్జితో విచారణ చేయించాలని కోరుతున్నట్టు తెలిపారు. -
అమ్నీషియా పబ్ కేసు: ఇంట్లో డ్రాప్ చేస్తామంటూ బాలికను కారులో తీసుకెళ్లిన నిందితులు
-
అత్యాచార ఘటనతో నాకు సంబంధం లేదు: హోంమంత్రి మనవడు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్లో మైనర్ అత్యాచార ఘటనతో తనకు సంబంధం లేదని హోంమంత్రి మనవడు ఫుర్ఖాన్ అహ్మద్ స్పష్టం చేశారు. తనెవరికీ పార్టీ ఇవ్వలేదన్నారు. వాళ్లు ఎవరో కూడా తనకు తెలియదన్నారు. ఘటన జరిగిన రోజు తాను ముంబైలో ఉన్నట్లు తెలిపారు. ఆరోపణలు చేసిన వారు నిజాలు తెలుసుకోవాలని సూచించారు. సీసీ ఫుటేజ్ తీస్తే ఎవరున్నారో తెలుస్తుందన్నారు. తనకు అసలు బెంజ్ కారు లేదని తెలిపారు. కాగా జూబ్లీహిల్స్లోని అమ్నేషియా పబ్కు వెళ్లిన 17 ఏళ్ల బాలికను బలవంతంగా కారులో తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు చేశారు. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు గోవాలో ఉన్నట్లు గుర్తించారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
బాలిక అత్యాచారం కేసు.. పోలీసుల అదుపులో వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు గోవాలో ఉన్నట్లు గుర్తించారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక అత్యాచారం ఘటనపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని హోంమంత్రి, డీజీపీకి ఆదేశాలిచ్చారు. నిందితులు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని కేటీఆర్ అన్నారు. చదవండి: పబ్కు వచ్చిన బాలికపై సామూహిక అత్యాచారం.. అసలేం జరిగింది? కాగా, గత నెల 28న బంజారాహిల్స్ రోడ్ నెం.14లో నివసించే బాలిక (16) ఓ పార్టీకి హాజరయ్యేందుకు తన ఇంటి సమీపంలో ఉండే హాదీతో కలిసి ఆయన బెంజ్ కారులో (టీఎస్ 09 ఎఫ్ఎల్ 6460)లో అమ్నేషియా పబ్కు వెళ్లింది. సాయంత్రం 5 గంటల వరకు అక్కడే పార్టీ చేసుకున్నారు. అనంతరం పబ్ నుంచి బాలిక బయటకు వచ్చింది. బాలికను బలవంతంగా బెంజ్ కారులో తీసుకెళ్లి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఓ బేకరీ దగ్గరకు వెళ్లి ఆహారం కొనుగోలు చేశారు. అనంతరం కారును నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. కార్లోనే బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత 7.30 నిమిషాల సమయంలో పబ్ వద్ద వదిలేసి వెళ్లారు. అనంతరం బాలిక ఫోన్ చేయడంతో తండ్రి వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లినట్లు సమాచారం. -
Hyderabad: బాలికపై సామూహిక అత్యాచారం.. స్పందించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలో మైనర్ బాలికపై అత్యాచారం వార్త విని షాక్కు గురయ్యానని, తీవ్ర ఆగ్రహం కలిగిందని మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఈ సంఘటనలో ఎంతటి వారున్నా కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్రెడ్డి, సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ సంఘటనలో పాల్గొన్న వారు ఎంత హోదాలో ఉన్నా, ఎలాంటివారితో అనుబంధమున్నా క్షమించరాదని స్పష్టం చేశారు. కఠిన చర్యలు తీసుకుంటాం... కేటీఆర్ ట్వీట్కు హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు. ఈ సంఘటన దారుణమైనదని, దీనికి పాల్పడిన వారు ఎంతటి వారైనా, ఎంత బలమైన వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని రీట్వీట్ చేశారు. వారిని త్వరగా అరెస్టు చేసి, చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని ఇప్పటికే డీజీపీని, నగర పోలీసు కమిషనర్ను ఆదేశించినట్లు పేర్కొన్నారు. Outraged & shocked with the news of the rape of a minor in Hyderabad Request HM @mahmoodalitrs Garu @TelanganaDGP Garu and @CPHydCity to take immediate & stern action. Please don’t spare anyone involved irrespective of their statuses or affiliations — KTR (@KTRTRS) June 3, 2022 -
పబ్కు వచ్చిన బాలికపై సామూహిక అత్యాచారం.. అసలేం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్లోని అమ్నేషియా పబ్ వ్యవహారంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. పబ్, బేకరీతోపాటు పలు ప్రాంతాల్లో సీసీఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. బాలికపై అత్యాచారం జరిగింది వాస్తవమేనని పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్కు తరలించినట్లు తెలిపారు. ఈ కేసులో మొత్తం నాలుగు బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. నలుగురు నిందితులు మైనర్లేనని వారిపై పోక్సో, నిర్భయ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులు గోవాకు పరారయ్యారని సమాచారం అందిందని, గోవాలో రెండు బృందాలుగా పోలీసులు జల్లెడ పడుతున్నారని పేర్కొన్నారు. బాలికను పబ్కు తీసుకెళ్లిన హదీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంజ్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హాదీని బురిడి కొట్టించి బాలురు బాలికను తీసుకెళ్లారని, రెండు గంటలపాటు బాలికపై మైనర్ బాలురు అత్యాచారానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. అత్యాచారం చేసి మరో కారులో పబ్ వద్ద బాలికను వదిలివెళ్లారన్నారు. ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్న విచారణలో తేలుతుందని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సంబంధిత వార్త: ఆమ్నేషియా పబ్ కేసు.. జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద ఉద్రిక్తత లిక్కర్ పార్టీ జరగలేదు. అమ్నేషియా పబ్లో లిక్కర్ పార్టీ జరగలేదని, పబ్లో న్యూసెన్స్ జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు. పబ్ నుంచి బాలిక స్నేహితులతో బయట వెళ్ళిన తరువాత బెంజ్ కారులోనే అఘాయిత్యానికి పాల్పడ్డారని అన్నారు. బాలిక తనపై జరిగిన అఘాయిత్యం గురించి తండ్రికి చెప్పడంతో బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఆయన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. బాలిక స్టేట్మెంట్ ఆమ్నేషియా పబ్ వ్యవహారంలో బాధిత బాలిక.. తనపై అత్యాచారం జరిగిందంటూ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. ‘మే 28న సా.5 గంటలకి గుర్తుతెలియని యువకులు నన్ను బలవంతంగా కారులో తీసుకెళ్లారు. ఆమ్నేషియా పబ్లో మేం పార్టీ చేసుకున్నాం, పార్టీలో కొందరు యువకులు నన్ను బెంజ్ కారులో బలవంతంగా తీసుకెళ్లారు. బెంజ్ కారులో నాపై అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రి 7 గంటలకు పబ్ దగ్గర తనను వదిలిపెట్టారు. నా మెడ వద్ద గాయాలైన విషయాన్ని మా నాన్న గమనించారు. నాపై జరిగిన అఘాయిత్యం గురించి ఆయనకు చెప్పాను. దీంతో ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు’ అని పేర్కొంది. అసలేం జరిగింది? కాగా గత నెల 28న బంజారాహిల్స్ రోడ్ నెం. 14లో నివసించే బాలిక (16) ఓ పార్టీకి హాజరయ్యేందుకు తన ఇంటి సమీపంలో ఉండే హాదీతో కలిసి ఆయన బెంజ్ కారులో (టీఎస్ 09 ఎఫ్ఎల్ 6460)లో అమ్నేషియా పబ్కు వెళ్లింది. సాయంత్రం 5 గంటల వరకు అక్కడే పార్టీ చేసుకున్నారు. అనంతరం పబ్ నుంచి బాలిక బయటకు వచ్చింది. బాలికను బలవంతంగా బెంజ్ కారులో తీసుకెళ్లి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఓ బేకరీ దగ్గరకు వెళ్లి ఆహారం కొనుగోలు చేశారు. అనంతరం కారును నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. కార్లోనే బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత 7.30 నిమిషాల సమయంలో పబ్ వద్ద వదిలేసి వెళ్లారు. అనంతరం బాలిక ఫోన్ చేయడంతో తండ్రి వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. ఇది కూడా చదవండి: Amnesia Pub Case: ‘హోంమంత్రి పీఏ.. అమ్మాయిని లోపలికి పంపాడు’ నిందితుల్లో ప్రజాప్రతినిధుల పిల్లలు ఇదిలా ఉండగా అత్యాచార నిందితుల్లో ప్రజాప్రతినిధుల పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. హోమంత్రి మనవడు, ఎమ్మెల్యే కొడుకు, వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు, ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు పాత్ర ఉన్నట్లు పలు అరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటి వరకైతే దీనిపై పోలీసులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. -
బంజారాహిల్స్: బాలికను కారులో తీసుకెళ్లి అసభ్యకర ప్రవర్తన
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్లోని ఒక పబ్కి వెళ్లిన బాలికను కారులో తీసుకెళ్లి కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ చెందిన ఒక బాలిక(17) జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని అమ్నేషియ ఇన్సోనియా పబ్కు స్నేహితులు ఇచ్చిన పార్టీకి గత నెల 28న హాజరైంది. అదే రోజు సాయంత్రం 5.30 గంటల సమయంలో ఒక బెంజి, ఇన్నోవా కార్లలో వచ్చిన కొందరు యువకులు ఆ బాలికను తీసుకెళ్లారు. ఆ తరువాత రెండు గంటల తరువాత బాలిక తిరిగి వచ్చింది. అయితే.. బాలికతో అసభ్యంగా ప్రవర్తించారని బాలిక తండ్రి బుధవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె మెడపై చిన్న గాయం అయ్యిందని, సంఘటన జరిగిన సమయం నుంచి షాక్లో ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఆయన ఫిర్యాదు చేయగా పోలీసులు పొక్సో కింద కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. చదవండి: అదృశ్యమైన బాలికను నాలుగు నెలలు గదిలో బంధించి.. -
టీవీ 5 బీఆర్ నాయుడు నిర్వాకం.. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో అక్రమాలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో అక్రమాలు వెల్లువెత్తుతున్నాయి. సొసైటీ ప్రెసిడెంట్ బి. రవీంద్రనాథ్ (టీవీ–5 అధిపతి బీఆర్ నాయుడు), ట్రెజరర్ పి.నాగరాజులు సొసైటీ బైలాస్కు విరుద్ధంగా, కో–ఆపరేటివ్ రిజిస్ట్రార్ నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా విలువైన స్థలాన్ని ప్రముఖ హీరో కొణిదెల చిరంజీవికి విక్రయించారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 25లోని ప్లాట్ నంబర్–303–ఎన్లో చిరంజీవికి 3,333 గజాల స్థలంలో ఇల్లు ఉంది. దాన్ని ఆనుకొని వెనుక భాగంలో షేక్పేటలోని కొత్త సర్వే నంబర్ 120 (పాత సర్వే నంబర్ 403/1), హకీంపేట గ్రామంలోని సర్వే నంబర్ 102/1లోని 595 గజాల అదనపు స్థలాన్ని (అడిషినల్ ల్యాండ్) అక్రమంగా చిరంజీవికి రిజిస్ట్రేషన్ చేశారు. బహిరంగ మార్కెట్లో దీని విలువ గజానికి రూ. 4 లక్షలపైనే పలుకుతుండగా ప్రభుత్వ ధర ప్రకారం రూ. 64 వేల చొప్పున రిజిస్ట్రేషన్ చేశారు. అంటే రూ. 23.80 కోట్లు విలువజేసే స్థలాన్ని కేవలం రూ. రూ. 3.80 కోట్లకే అప్పగించి ప్రతిఫలంగా మిగిలిన సొమ్ములో పెద్ద మొత్తంలోనే దండుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాలక వర్గం అక్రమాలపై సొసైటీ సభ్యులు ప్రభాకర్రావు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్కు, విజిలెన్స్, కో–ఆపరేటివ్ రిజిస్ట్రార్లకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదుల నేపథ్యంలో శుక్రవారం షేక్పేట మండల సర్వేయర్ సాయికాంత్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ రాజేశం క్షేత్రస్థాయిలో పర్యటించి తనిఖీలు చేపట్టారు. సొసైటీ మీటింగ్లోనూ చెప్పలేదు ఇది ప్రభుత్వ స్థలమని, రోడ్డు ఆక్రమించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ప్రభాకర్రావు ఆరోపించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా సొసైటీలోని కొందరు అక్రమంగా ఈ రిజిస్ట్రేషన్ చేశారన్నారు. సబ్ రిజిస్ట్రార్కు తెలిసే ఈ తతంగం జరిగిందని, సొసైటీ లేఔట్ను పరిశీలించకుండానే దీన్ని రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. ఈ ప్రక్రియలో కో–ఆపరేటివ్ నిబంధనలను తుంగలో తొక్కారని ఆయన దుయ్యబట్టారు. సొసైటీ జనరల్ బాడీ మీటింగ్లోనూ రిజిస్ట్రేషన్ సంగతి సభ్యులకు ప్రెసిడెంట్, ట్రెజరర్ తెలియజేయలేదని ఆరోపించారు. బెదిరింపు కాల్స్ వస్తున్నాయి ఫిర్యాదు చేసినప్పటి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఎవరు చేస్తున్నారో వాళ్ల నంబర్లు కూడా కనిపించట్లేదు. వెంటనే ఫిర్యాదు ఉపసంహరించుకోకపోతే ప్రాణాలకు ముప్పు ఉంటుందని బెదిరిస్తున్నారు. బెదిరింపు కాల్స్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తా. – ప్రభాకర్రావు, సొసైటీ సభ్యుడు -
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లలో బడా బాబుల కక్కుర్తి
జూబ్లీహిల్స్ రోడ్ నెం. 67లో మాజీ ఎంపీ సి.ఎం.రమేష్ తన ఇంటి సెట్బ్యాక్లో దుకాణాలను అక్రమంగా నిర్మించగా టౌన్ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. ఈ దుకాణాలను అద్దెకు ఇచ్చుకోవడానికి ఆయన నిర్మించారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 14లో ఓ సినీ నిర్మాత, పారిశ్రామిక వేత్త తన ఇంటి సెట్బ్యాక్ను అక్రమంగా మూడు దుకాణాలను నిర్మించారు. జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ అధికారులు సదరు నిర్మాణదారుడికి నోటీసులు జారీ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో ఓ పారిశ్రామికవేత్త తన ఇంటి సెట్బ్యాక్లో మూడు అంతస్తుల భవనం నిర్మించి ఓ ఫర్నీచర్ షాపు అద్దెకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 10లో అపార్ట్మెంట్ను ఆనుకొని సెట్బ్యాక్లో అపార్ట్మెంట్ నిర్మించిన బిల్డర్ కామన్ ఏరియాలో దుకాణాలు నిర్మించగా జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. సాక్షి, హైదరాబాద్: సంపన్న వర్గాలు నివసించే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో గజం స్థలం ప్రస్తుతం రూ. 2.50 లక్షలు పలుకుతోంది. గతంలో తమ ఇంటి ఆవరణలో వెలుతురు, గాలి కోసం చాలా మంది బడా బాబులు చక్కటి ఇళ్లను సెట్బ్యాక్ వదిలేసి నిర్మించుకున్నారు. ఇప్పటిదాకా బాగానే నడిచింది. అయితే ప్రస్తుతం భూముల ధరలు ఆకాశన్నంటుతుండటంతో పది గజల స్థలాన్ని కూడా ఏ ఒక్కరూ ఖాళీగా వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. ► జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ప్రతి రోడ్డు కమర్షియల్ కావడంతో ఈ రోడ్లలో నిర్మించుకున్న ఇళ్ల సెట్బ్యాక్లు ఇప్పుడు దుకాణాలుగా మారుతున్నాయి. ► గతంలో అనుమతులు తీసుకొని సెట్బ్యాక్ వదలగా ఇప్పుడు ఆ సెట్బ్యాక్లోనే అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా చేపడుతున్నారు. ► ఒక వైపు జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ అధికారులు వాటిని నేలమట్టం చేస్తున్నా కొంత మంది యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. పది నుంచి 50 గజాల స్థలం ఉంటే చాలు రెండు మడిగెలు వేసి అద్దెకిస్తున్నారు. ఐస్క్రీం షాపులు, టిఫిన్ సెంటర్లు, మెడికల్షాపులు, ఇలా అద్దెకివ్వడం వల్ల నెల నెలా రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు అద్దె వస్తుండటంతో ఖాళీగా ఉన్న కామన్ ఏరియాలను వాణిజ్య ప్రాంతాలుగా మారుస్తున్నారు. 87 అక్రమ నిర్మాణాలు... ► జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్ తదితర సంపన్న వర్గాలు నివసించే ప్రాంతాల్లో ఇప్పటికే నివాసాల సెట్బ్యాక్లలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. 87 ప్రాంతాల్లో సెట్బ్యాక్లు, దుకాణాలుగా రూపాంతరం చెందినట్లుగా రికార్డులు వెల్లడిస్తున్నాయి. చాలా మందికి నోటీసులు జారీ చేసి నా ఉపయోగం లేకుండా పోతున్నది. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరిపి అద్దెలకు ఇస్తున్నారు. (క్లిక్: ఇల్లు కడుతున్నారా.. వెంటనే పర్మిషన్ ఇలా..) పార్కింగ్ స్థలం నో... ► నివాసాల ముందు, వెనుక భాగాల్లో కామన్ ఏరియాలను దుకాణాలుగా మారుస్తున్న నివాసితులు పార్కింగ్ విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం లేదు. పార్కింగ్తో తమకు సంబంధం లేదని అగ్రిమెంట్ల సమయంలోనే చెప్పేస్తున్నారు. దీంతో రోడ్లపైనే పార్కింగ్లు చేసుకుంటూ ఈ దుకాణంలోకి వెళ్లి వస్తున్నారు. ‘అందరి’ అండదండలు ► బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో నివాసాల సెట్బ్యాక్లలో జరుపుతున్న అక్రమ నిర్మాణాలు కూల్చివేసేందుకు వెళ్తున్న జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో పాటు ప్రజాప్రతినిధులు ఫోన్లు చేస్తూ అటు వైపు వెళ్లవద్దంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో నిర్మాణదారులు యథేచ్ఛగా అక్రమాలకు తెగబడుతున్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు ఎంతో కొంత ముట్టచెబుతూ తమ పని కానిచ్చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ఫోన్లో అతిగా మాట్లాడుతున్నావని మందలించినందుకు...
సాక్షి, బంజారాహిల్స్: నెల రోజులుగా తన భార్య ఫోన్లో విపరీతంగా మాట్లాడుతుండటాన్ని గమనించి మందలించడంతో పాటు కొట్టానని ఇందుకు అలిగి తన భార్య ఇద్దరు పిల్లలను తీసుకొని అనుమానాస్పదంగా అదృశ్యమైందంటూ బాధితుడు ఎల్లప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని తల్లీ, పిల్లల కోసం గాలింపు చేపట్టారు. వివరాలివీ... మహబూబ్నగర్ జిల్లా కోస్గి గ్రామానికి చెందిన ఎరుకల ఎల్లప్ప భార్య మంగమ్మ అలియాస్ పద్మ, కూతుళ్లు సువర్ణ, స్వప్నలతో కలిసి రహ్మత్నగర్ వీడియో గల్లీలో అద్దెకుంటున్నారు. భార్య పద్మ యూసుఫ్గూడ చౌరస్తాలోని ఉడుపి హోటల్లో పని చేస్తున్నది. ఎప్పటిలాగే ఈ నెల 6న డ్యూటీకి వెళ్లింది. రాత్రి ఇంటికి వచ్చి చూడగా భార్యా, పిల్లలు కనిపించలేదు. దీంతో ఉడిపి హోటల్కు వెళ్లి ఆరా తీయగా పద్మ తన పిల్లలతో కలిసి మధ్యాహ్నం ఇంటికి వెళ్లిపోయినట్లు చెప్పిందని వెల్లడించారు. దీంతో స్వగ్రామంతో పాటు బంధుమిత్రుల ఇళ్లల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో తన భార్య, పిల్లలు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు ఫోన్: 62813 86209లో సంప్రదించాలని పోలీసులు కోరారు. చదవండి: పారిశుద్ధ్య కార్మికులకు కేటీఆర్ పలకరింపు -
జూబ్లీహిల్స్: తాళాలు పగలగొట్టి.. దౌర్జన్యంగా ప్రవేశించి..
సాక్షి, బంజారాహిల్స్: పబ్ నిర్మాణం కోసం సిద్ధం చేస్తున్న భవనంలోకి తాళాలు పగలగొట్టి దౌర్జన్యంగా ప్రవేశించడంతోపాటు బౌన్సర్లను తీసుకొచ్చి బీభత్సం సృష్టించిన ముగ్గురిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. జూబ్లీహిల్స్రోడ్ నెం. 36లోని ఎఫ్హౌజ్ భవనాన్ని రామ్ నరేష్ దండా అనే వ్యక్తి గత ఏడాది నవంబర్లో ఎం.రోహిత్రెడ్డి అనే వ్యక్తి నుంచి లీజుకు తీసుకున్నారు. దీనిలో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ పబ్ ఏర్పాటు చేస్తున్నారు. గత ఏడాది నవంబర్ నుంచి రామ్ నరేష్ దండా ఆధీనంలో ఉన్న ఈ భవనంలో రినోవేషన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 11న జెట్టి సంతోష్రెడ్డి, భరత్, రాజేష్ అనే వ్యక్తులు ఏడుగురు బౌన్సర్లను తీసుకొచ్చి పబ్ పనులు నడుస్తున్న భవనం తాళాలు పగలగొట్టి దౌర్జన్యంగా లోనికి ప్రవేశించారు. అక్కడున్న సీసీ కెమెరాలను ఆపేయడంతో పాటు డీవీఆర్తోపాటు మేనేజర్ క్యాబిన్లోని డెస్క్లో ఉండాల్సిన రూ. లక్షను తస్కరించారు. చదవండి: సర్కారు గొర్రెల్ని తీసుకొని.. లాభాలు పంచుకుందామంటూ.. గతంలో ఈ పబ్ను నడిపించేందుకు ప్రయత్నించిన సంతోష్రెడ్డి తదితరులు భాగస్వాములతో విభేదాల కారణంగా దీన్ని రాంనరేష్కు విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే మరిన్ని డబ్బులు డిమాండ్ చేసేందుకు భవనాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు బాధితుడు రాంనరేష్ దండా జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై ఐపీసీ 455, 380 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు -
బంజారాహిల్స్: చిమ్మచీకట్లో.. లాకర్ గదిలో.. 18 గంటలు
సాక్షి, బంజారాహిల్స్: అసలే 85 ఏళ్ల వృద్ధాప్యం.. ఆపై మధుమేహం, రక్తపోటు. సమయానికి మందులు వేసుకోకపోతే ఆరోగ్యం పాడయ్యే పరిస్థితి. గాలి సరిగా లేదు.. మంచి నీళ్లు లేవు. చిమ్మ చీకట్లో ఒంటరిగా ఓ వ్యక్తి 18 గంటల పాటు నరకం అనుభవించాడు. ఒంటరిగా స్ట్రాంగ్రూమ్లో చిక్కుకున్నా.. గుండెదిటవు చేసుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రోడ్ నెం.67లోని ప్లాట్ నంబర్1338లో నివసించే వి.కృష్ణారెడ్డి (85)కి జూబ్లీహిల్స్ చౌరస్తాలోని యూనియన్ బ్యాంకు (ఆంధ్రా బ్యాంకు)లో లాకర్ ఖాతా ఉంది. కొంత నగదు తీసుకోవడానికి సోమవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఆయన బ్యాంకుకు వచ్చారు. లాకర్ తెరిచి డబ్బులు లెక్క పెట్టుకుంటున్నారు. బ్యాంకు వేళలు ముగియడంతో లాకర్ గదిలో ఖాతాదారు ఉన్న విషయాన్ని మరిచిన సిబ్బంది సాయంత్రం 5.30 గంటలకు లాకర్ గదికి, బ్యాంకుకు తాళాలు వేసి వెళ్లిపోయారు. తలుపులు వేసిన శబ్దం కూడా వినిపించకపోవడంతో ఇంకా బ్యాంకు సేవలు కొనసాగుతున్నాయని కృష్ణారెడ్డి భావించారు. కొద్దిసేపటి తర్వాత విషయాన్ని గుర్తించి అరిచినా ఫలితం లేకుండాపోయింది. ఇంటి వద్దే ఫోన్ మరిచిరావడంతో ఫోన్ చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. మిస్సింగ్ కేసుగా నమోదు.. రాత్రి అవుతున్నా తండ్రి ఇంటికి రాకపోయేసరికి కృష్ణారెడ్డి కుమారుడు సందీప్ రెడ్డి అన్ని ప్రాంతాలు గాలించి చివరికి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఇంటి నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టులోని పెట్రోల్బంక్ వరకు కృష్ణారెడ్డి నడుచుకుంటూ వెళ్లిన ఫుటేజీ కనిపించింది. ఆ తర్వాత సీసీ కెమెరాలు పనిచేయలేదు. దీంతో పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా, సీసీ టీవీ ఫుటేజీలను జల్లెడ పట్టినా ఫలితం లేకపోయింది. చివరకు ఎస్ఐ చంద్రశేఖర్ మంగళవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో బ్యాంకు వద్ద సీసీ కెమెరాలను పరిశీలించగా.. కృష్ణారెడ్డి బ్యాంకు లోపలికి వచ్చి, లాకర్గదిలోకి వెళ్లిన దృశ్యాలు కనిపించాయి. బయటికి వచ్చిన ఆనవాళ్లు కనిపించలేదు. అనుమానం వచ్చిన పోలీసులు బ్యాంకు సిబ్బందిని అప్రమత్తం చేసి 10.40 గంటలకు లాకర్ గది తెరిచి చూడగా కృష్ణారెడ్డి వణికిపోతూ, చెమటలతో కుప్పకూలి కనిపించారు. పోలీసులు, బ్యాంకు సిబ్బంది వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో బ్యాంకు సిబ్బందిపై ఐపీసీ సెక్షన్ 336, 342ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం.. ప్రతిరోజూ సాయంత్రం బ్యాంకు వేళలు ముగిసిన తర్వాత లాకర్గదితో పాటు ప్రాంగణం మొత్తం పరిశీలించాకే తాళాలు వేయాల్సి ఉంటుంది. ఇంటికి వెళ్లాలనే తొందరలో సిబ్బంది సోమవారం తనిఖీలు చేపట్టలేదు. ఈ ఘటనలో తమ నిర్లక్ష్యం ఉందని బ్యాంకు మేనేజర్ మురళీ మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. లాకర్ గది తాళాలు మేనేజర్ వేయాల్సి ఉంటుంది. ఆ సమయానికి ఆయన లేకపోవడంతో అసిస్టెంట్ మేనేజర్ రాధ తాళాలు వేశారు. -
హైదరాబాద్: జూబ్లీహిల్స్ యూనియన్ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం
-
హైదరాబాద్: జూబ్లీహిల్స్ చెక్పోస్టు వద్ద కారు బీభత్సం
-
జూబ్లీహిల్స్ కేసులో నిందితుడి అరెస్ట్
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్లో నిర్లక్ష్యంగా కారు నడిపి రెండు నెలల పసికందు మరణానికి కారణమైన యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రెండురోజులుగా పలు మలుపులు తీసుకున్న కేసును జూబ్లీహిల్స్ పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలు, స్థానికుల వాంగ్మూలం ఆధారంగా కొలిక్కి తీసుకొచ్చారు. గురువారం రాత్రి ప్రమాదం జరిగిన సమయంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ స్నేహితుడు సయ్యద్ అఫ్నాన్(19) కారు నడిపిస్తున్నట్లు తేలడం తో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. మెహిదీపట్నంకు చెందిన సయ్యద్ అఫ్నాన్ బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నా డు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న బీబీఏ రెండో సంవత్సరం విద్యార్థి మహ్మద్ మాజ్, ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ స్నే హితులు. సంఘటన జరిగిన వెంటనే నిందితుడితోపాటు మిగతా ఇద్దరూ అక్కడి నుం చి పారిపోవడంతో కారు నడిపిందెవరు అనే విషయంపై అనేక సందేహాలు తలెత్తాయి. ఘటనాస్థలంలో సీసీ కెమెరాలు, ప్రత్యక్ష సాక్షులు అందుబాటులో లేకపోవడం తో దారి పొడవునా సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. దీంతోపాటు సంఘట న జరిగిన వెంటనే కాస్త దూరంలో ఉన్న ఓ కారు డెకా ర్ స్టోర్లో ఉన్న సీసీ ఫుటేజీలో అస్పష్టంగా ముగ్గురు యువకులు పారిపోతున్న దృశ్యా లు గుర్తించారు. ఈ ఘటన జరిగిన సమయంలో కొంత మంది యువకులు కారు నడిపిస్తున్న అఫ్నాన్ను కొట్టిన ట్లు తెలిసింది. శుక్రవారంరాత్రి పోలీసులు అఫ్నాన్ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించ గా కారు తానే నడిపినట్లు ఒప్పుకున్నట్లు తె లిసింది. అతడిని సంఘటనా స్థలానికి తీసు కెళ్లి సాక్షులకు చూపించగా అతడే కారు నడిపినట్లు నిర్ధారణ అయింది. దీంతోపాటు సైబర్ టవర్స్ సమీపంలో కారు ఎక్కేటప్పు డు వచ్చిన సీసీ ఫుటేజీలు కూడా పరిశీలించి నిందితుడు అఫ్నాన్ అని గుర్తించారు. -
జూబ్లీహిల్స్ ప్రమాదం.. కారులో ఎమ్మెల్యే కొడుకు కూడా
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. బాలుడి మృతికి కారణమైన బండిలో.. ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ కూడా ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్ని అధికారికంగా పోలీసులు ప్రకటించారు. రాహిల్ కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఏసీపీ సుదర్శన్ వివరాలను వెల్లడించారు.. ఫిలింనగర్ నుండి ఇన్ ఆర్బిట్ మాల్ మీదుగా తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. కారులో ఎంఎల్ఏ కొడుకు రాహిల్ ఉన్నాడు. రాహిల్ తో పాటు అఫ్నాన్, నాజ్ మొత్తం ముగ్గురు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు పారిపోయారు. నిందితులు పారిపోయిన రూట్ లో సీసీ కెమెరాలు, సెల్ ఫోన్ టవర్ ఆధారంగా గుర్తించాం. అన్ని రకాల ఎవిడెన్స్ సేకరించాం. ప్రమాదం జరిగిన టైంలో కారు నడిపింది అఫ్నాన్. రాహిల్ పక్కనే ఉన్నాడు. ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా కారు నడిపింది అఫ్నాన్ అని నిర్ధారించుకున్నాం. ప్రమాదానికి నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ ప్రధాన కారణాలని ఏసీపీ వెల్లడించారు. గురువారం రాత్రి దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి మీద నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1 వైపు మహేంద్ర థార్ వేగంగా దూసుకొచ్చింది. ఆ టైంలో రోడ్డు దాటుతున్న కాజల్ చౌహాన్, సారికా చౌహాన్, సుష్మా బోస్లేలను ఢీకొట్టింది. ఈ ఘటనలో కాజల్ చౌహాన్ రెండు నెలల బిడ్డ కిందపడి.. మృతి చెందిన విషయం తెలిసిందే. బండిపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ అహ్మద్ పేరుతో స్టిక్కర్ ఉండడంతో కేసు ఆసక్తికరంగా మారింది. కాజల్ చౌహాన్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆపై పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కారు నడిపింది ఎమ్మెల్యే కొడుకేనంటూ ప్రచారం మొదలైంది. అభం శుభం తెలియని రెండు నెలల చిన్నారి మృతి చెందడంతో.. విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ ఘటనతో తనకు ఎటువంటి సంబంధం లేదని, ఆ కారు తమ బంధువులదని, ఓ ఫంక్షన్కు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగిందని, ఆ కారులో తన కొడుకు లేడని ఎమ్మెల్యే షకీల్ వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఆ కారులో తమ బంధువులు మాత్రమే ఉన్నారని ఎమ్మెల్యే శుక్రవారం వివరణ ఇవ్వగా.. అందులో ఆయన కొడుకు కూడా ఉన్నాడంటూ తాజాగా పోలీసులు ప్రకటించడం విశేషం. -
జూబ్లీహిల్స్ ఘటనలో కొత్త ట్విస్ట్..