Justin Langer
-
IPL 2025: అతడే గనుక బతికి ఉంటే.. పంత్ రికార్డు బ్రేక్ చేసేవాడు!
ఆస్ట్రేలియా మాజీ హెడ్కోచ్ జస్టిన్ లాంగర్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు. ఫిలిప్ హ్యూస్ గనుక బతికి ఉంటే ఐపీఎల్ వేలంలో కోట్లు కొల్లగొట్టేవాడని.. కానీ తను ఇప్పుడు ఈ లోకంలో లేడంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా సౌదీ అరేబియాలో ఇటీవల ఐపీఎల్-2025 మెగా వేలం జరిగిన విషయం తెలిసిందే.అమాంతం ఏడు కోట్లు పెంచిఇందులో భాగంగా రూ. 2 కోట్ల కనీస ధరతో అందుబాటులో ఉన్న టీమిండియా స్టార్ రిషభ్ పంత్ కోసం ఫ్రాంఛైజీలు ఎగబడ్డాయి. ఢిల్లీ క్యాపిటల్స్తో పాటు సన్రైజర్స్ హైదరాబాద్ పోటీకి రాగా.. లక్నో సూపర్ జెయింట్స్ కళ్లు చెదిరే మొత్తానికి ఈ వికెట్ కీపర్ బ్యాటర్ను సొంతం చేసుకుంది. పంత్ ధర రూ. 20 కోట్లకు చేరినపుడు ఢిల్లీ రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా పంత్ను తిరిగి దక్కించుకునే ప్రయత్నం చేయగా.. లక్నో అమాంతం ఏడు కోట్లు పెంచేసింది.దీంతో ఢిల్లీ రేసు నుంచి తప్పుకోగా.. లక్నో రూ. 27 కోట్లకు రిషభ్ పంత్ను తమ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ రికార్డు సాధించాడు. ఈ నేపథ్యంలో లక్నో జట్టు హెడ్కోచ్, ఆసీస్ మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ ‘ది వెస్ట్ ఆస్ట్రేలియన్’కు రాసిన కాలమ్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘‘ఐపీఎల్లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా పంత్ చరిత్ర సృష్టించాడు. మా ఫ్రాంఛైజీ.. లక్నో సూపర్ జెయింట్స్ అతడి సేవల కోసం ఐదు మిలియన్ డాలర్ల మేర ఖర్చు చేసింది. కేవలం ఎనిమిది వారాలకు ఇంత మొత్తం అంటే మాటలు కాదు.అతడే గనుక బతికి ఉంటేఒకవేళ హ్యూస్ గనుక బతికి ఉంటే.. ఐపీఎల్ వేలంలో అతడు కూడా భారీ ధర పలికేవాడు. కేవలం తన డైనమిక్ బ్యాటింగ్ మాత్రమే ఇందుకు కారణం కాదు.. తనలోని ఎనర్జీ కూడా ఇందుకు కారణం. కానీ.. విచారకరం ఏమిటంటే.. తను ఇప్పుడు మన మధ్యలేడు. ఎప్పటికీ వేలంలోకి రాలేడు’’ అంటూ ఆసీస్ దివంగత స్టార్ ఫిలిప్ హ్యూస్ను గుర్తుచేసుకున్నాడు. అదే విధంగా.. పంత్ క్రికెటింగ్ నైపుణ్యాలను కొనియాడిన లాంగర్.. ఆస్ట్రేలియా గడ్డ మీద టీమిండియా(2020-21)ను ఒంటిచేత్తో గెలిపించిన తీరు ఎన్నటికీ మరువలేనిదన్నాడు. కాగా 2014లో ఫిలిప్ హ్యూస్ ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచివెళ్లాడు. ఆసీస్ దేశీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్లో భాగంగా న్యూ సౌత్వేల్స్- సౌత్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. సీన్ అబాట్ వేసిన రాకాసి బంతి బలైన హ్యూస్ఆసీస్ బౌలర్ సీన్ అబాట్ వేసిన రాకాసి బంతి హ్యూస్ మెడకు బలంగా తాకడంతో అతడు కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలాడు. నవంబరు 27న హ్యూస్ పదో వర్ధంతి జరిగింది. ఈ నేపథ్యంలో అతడిని తలచుకుంటూ జస్టిన్ లాంగర్ ఉద్వేగానికి గురయ్యాడు.కాగా న్యూ సౌత్ వేల్స్లో జన్మించిన హ్యూస్ 2009లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేశాడు. అంతర్జాతీయ కెరీర్లో 26 టెస్టులు, 25 వన్డేలు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 1535, 826 పరుగులు చేశాడు. తన 26వ పుట్టినరోజు కంటే మూడు రోజుల ముందు.. క్రికెట్ ఆడుతూ తుదిశ్వాస విడిచాడు. చదవండి: ఐసీసీ దెబ్బకు దిగివచ్చిన పాకిస్తాన్.. ‘హైబ్రిడ్ మోడల్’కు ఓకే!.. కానీ.. -
BCCI: అవన్నీ అబద్ధాలే: ఆసీస్ మాజీలకు జై షా కౌంటర్
టీమిండియా కొత్త హెడ్ కోచ్ విషయంలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా కొట్టిపారేశారు. ఈ బాధ్యతలు స్వీకరించాల్సిందిగా తాము ఇంత వరకు ఎవరినీ సంప్రదించలేదని స్పష్టం చేశారు.కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత రాహుల్ ద్రవిడ్ భారత జట్టు ప్రధాన కోచ్గా పదవీ కాలం ముగియనుంది. ఈ క్రమంలో ఇప్పటికే బీసీసీఐ అతడి వారసుడిని ఎంపిక చేసే క్రమంలో దరఖాస్తులు ఆహ్వానించింది. విదేశీ కోచ్ల పేర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది.హెడ్ కోచ్ రేసులోఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు రిక్కీ పాంటింగ్, జస్టిన్ లాంగర్ సహా న్యూజిలాండ్ మాజీ ఆటగాడు స్టీఫెన్ ఫ్లెమింగ్, శ్రీలంక లెజెండ్ మహేళ జయవర్ధనే తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో రిక్కీ పాంటింగ్ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. బీసీసీఐ తనకు ఆఫర్ ఇచ్చినా తిరస్కరించానని పేర్కొన్నాడు. మరోవైపు.. జస్టిన్ లాంగర్ సైతం కేఎల్ రాహుల్ తన కళ్లు తెరిపించాడంటూ టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం తాను అప్లై చేసుకోనని పరోక్షంగా వెల్లడించాడు.వాళ్లకు మేమే ఆఫర్ ఇవ్వలేదురిక్కీ పాంటింగ్, జస్టిన్ లాంగర్ వ్యాఖ్యలపై బీసీసీఐ కార్యదర్శి జై షా తాజాగా స్పందించారు. ‘‘టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం నేను గానీ, బీసీసీఐ గానీ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లెవరికీ ఆఫర్ చేయలేదు.మీడియా వస్తున్న వార్తలన్నీ నిజం కాదు. జాతీయ జట్టు కోసం సరైన కోచ్ను ఎంపిక చేసుకోవడం క్లిష్టతరమైన ప్రక్రియ. భారత క్రికెట్ స్వరూపాన్ని చక్కగా అర్థం చేసుకోగల వ్యక్తుల కోసం అన్వేషిస్తున్నాం.పూర్తి అవగాహన ఉన్నవాళ్లకే ప్రాధాన్యంటీమిండియా హెడ్ కోచ్గా ఉన్నవారికి భారత దేశవాళీ క్రికెట్ గురించి, ఆటగాళ్ల గురించి పూర్తి అవగాహన ఉండాలి. అలాంటి వాళ్ల కోసమే మేము ఎదురుచూస్తున్నాం.భారత జట్టు ప్రధాన కోచ్గా ఉండటం కంటే అంతర్జాతీయ క్రికెట్లో ప్రతిష్టాత్మకమైన పదవి ఇంకోటి ఉంటుందని అనుకోను. ప్రపంచవ్యాప్తంగా టీమిండియాకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. భారత క్రికెట్ చరిత్ర, ఔన్నత్యం.. ఆట పట్ల మా అంకితభావం.. అన్నీ వెరసి ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయిలో ఉన్నాం.ఇలాంటి చోట జాబ్ చేయడం కంటే గొప్ప విషయం ఏముంటుంది?. ఇలాంటి జట్టుకు గురువుగా బాధ్యతలు నిర్వర్తించే సరైన వ్యక్తి కోసం మేము జల్లెడపట్టాల్సి ఉంటుంది’’ అని జై షా ఇండియన్ ఎక్స్ప్రెస్తో వ్యాఖ్యానించారు. చదవండి: SRH vs RR: అతడి మీదే భారం.. అలా అయితేనే సన్రైజర్స్ ముందుకు -
BCCI: రాహుల్ నా కళ్లు తెరిపించాడు: జస్టిన్ లాంగర్ కీలక వ్యాఖ్యలు
టీమిండియా హెడ్ కోచ్ రేసులో వినిపిస్తున్న పేర్లలో జస్టిన్ లాంగర్ పేరు ఒకటి. గతంలో ఆస్ట్రేలియా ప్రధాన కోచ్గా పనిచేసిన లాంగర్.. ఆటగాళ్లతో విభేదాల నేపథ్యంలో ఆ బాధ్యతల నుంచి వైదొలిగాడు.ఈ క్రమంలో కొన్నాళ్ల పాటు విరామం తీసుకున్న జస్టిన్ లాంగర్ 2024లో ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్తో జట్టుకట్టాడు. పదిహేడో సీజన్లో లక్నోకు కోచ్గా నియమితుడయ్యాడు ఈ ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్.లాంగర్ మార్గదర్శనంలో కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో లక్నో అద్భుతాలు సాధిస్తుందనుకుంటే కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే నిష్క్రమించింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచి సీజన్ను ముగించింది.ద్రవిడ్ వారసుడు ఎవరు?ఇదిలా ఉంటే.. బీసీసీఐ రాహుల్ ద్రవిడ్ స్థానంలో కొత్త కోచ్ వేట మొదలుపెట్టిన నేపథ్యంలో జస్టిన్ లాంగర్, రిక్కీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తదితర విదేశీ కోచ్ల పేర్లు తెరమీదకు వచ్చాయి.ఈ విషయంపై స్పందించిన జస్టిన్ లాంగర్ బీబీసీతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కోచ్గా బాధ్యతలు చేపడితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో కేఎల్ రాహుల్ తనకు వివరించాడంటూ బాంబు పేల్చాడు.అంతకు మించి.. వెయ్యి రెట్లు అధికంగా‘‘కోచ్ పాత్ర ఎలాంటిదో నాలుగేళ్ల పాటు ఆస్ట్రేలియా జట్టుతో గడిపినపుడే నాకు అర్థమైంది. అప్పుడు నేనైతే పూర్తిగా అలసిపోయాను. ఇక భారత జట్టు హెడ్ కోచ్ బాధ్యత ఎలా ఉంటుందన్న విషయం గురించి నేను కేఎల్ రాహుల్తో మాట్లాడినపుడు ఆసక్తికర సమాధానం విన్నాను.‘ఐపీఎల్ జట్టు విషయంలో ఒత్తిడి, రాజకీయాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు. అందుకు వెయ్యి రెట్ల ఒత్తిడి, పాలిటిక్స్ టీమిండియా కోచ్గా ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని చెప్పాడు.అంతకంటే గొప్ప సలహా మరొకటి ఉంటుందని నేను అనుకోను’’ అని జస్టిన్ లాంగర్ పేర్కొన్నాడు. భారత జట్టు ప్రధాన కోచ్ పదవి విషయంలో తనకు ఇప్పుడు పూర్తి స్పష్టత వచ్చిందని తెలిపాడు. ఒక విధంగా కేఎల్ రాహుల్ తన కళ్లు తెరిపించాడని పేర్కొన్నాడు.రిక్కీ పాంటింగ్ సైతంఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ సైతం టీమిండియా హెడ్కోచ్ పదవి చేపట్టేందుకు సిద్ధంగా లేనని పేర్కొన్న విషయం తెలిసిందే. తన కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలనుకుంటున్నానని.. అందుకే బీసీసీఐ ఆఫర్ ఇచ్చినా తాను తిరస్కరించానని తెలిపాడు.చదవండి: IPL 2024: టైమ్కి చెక్ వస్తుంది.. రూ. 11 కోట్లు.. ఇంకెందుకు ఆడటం? -
టీమిండియాకు హెడ్ కోచ్ కావలెను.. ఆ మాజీకి ఛాన్స్ దక్కేనా?
టీ20 వరల్డ్ కప్ 2024తో రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెచ్ కోచ్ పదవీ కాలం ముగియనుంది. దీంతో ఆయన మరోసారి దరఖాస్తు చేసుకుంటారా? లేదంటే ఆ అవకాశం మరొకరిని వరిస్తుందా?.. టీమిండియాకు కాబోయే హెడ్ కోచ్ ఎవరు? అనే చర్చ నడుస్తోంది. ఈ లోపే హెడ్ కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులకు ఆహ్వానించింది.కొత్త కోచ్ పదవీకాలం ఈ ఏడాది జులై 1 నుంచి 2027 డిసెంబర్ 31వ తేదీ వరకు ఉంటుందని బీసీసీఐ తాజాగా స్పష్టం చేసింది. అంటే కొత్తగా కోచ్ పదవికి ఎంపికయిన వ్యక్తి 2027 వన్డే ప్రపంచకప్ వరకు భారత జట్టుకు ప్రధాన కోచ్గా కొనసాగుతారన్నమాట. అలాగే.. కొత్త కోచ్కు దరఖాస్తు చేసుకునేవాళ్ల వయసు 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలి. పారితోషికం అనుభవాన్ని బట్టి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. వీటితో పాటు.. మూడు ఫార్మాట్లలో జట్టుకు హెడ్ కోచ్ గా కొనసాగుతాడు. కోచ్కు 14-16 మంది సహాయక సిబ్బంది ఉంటారు. టీమ్ ప్రదర్శన, నిర్వహణకు ప్రధాన కోచ్ పూర్తి బాధ్యత వహిస్తాడు. అలాగే స్పెషలిస్ట్ కోచ్లు, సహాయక సిబ్బంది బృందానికి నాయకత్వం వహిస్తాడు. భారత జట్టులోని క్రమశిక్షణా కోడ్లను సమీక్షించడం, నిర్వహించడం, అమలు చేయడం ప్రధాన కోచ్ బాధ్యతఅర్హతలుకనీసం 30 టెస్ట్ మ్యాచ్లు లేదా 50 వన్డేలు ఆడి ఉండాలి. లేదంటే.. టెస్టు క్రికెట్ ఆడే దేశానికి ప్రధాన కోచ్గా కనీసం 2 సంవత్సరాల పాటు పనిచేసిన అనుభవం ఉండాలి.ఐపీఎల్ జట్టు లేదా సమానమైన ఇంటర్నేషనల్ లీగ్/ఫస్ట్ క్లాస్ జట్లకు/ జాతీయ అ జట్లకు ప్రధాన కోచ్గా కనీసం మూడేళ్లు పనిచేసి ఉండాలి.బీసీసీఐ లెవల్ 3 సర్టిఫికేషన్ కలిగి ఉండాలి.పై కండిషన్లలో ఏది ఉన్నా సరే.. దరఖాస్తు చేసుకోవచ్చు.ఉవ్విళ్లూరుతున్న మాజీ ప్లేయర్టీమిండియా హెడ్ కోచ్ దరఖాస్తుల నేపథ్యంలో.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ ఈ పదవిపై ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఈ ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్ గా ఉన్నాడు‘‘టీమిండియా హెచ్ కోచ్ పదవిపై నేను ఆసక్తిగా ఉన్నాను. దీని గురించి ఎప్పుడూ నేను ఆలోచించలేదు. ప్రతి అంతర్జాతీయ కోచ్ పై నాకు అమితమైన గౌరవం ఉంది. ఎందుకంటే అందులో ఉండే ఒత్తిడి నాకు తెలుసు. కానీ ఇండియన్ టీమ్ కోచింగ్ అద్భుతమైన జాబ్. ఈ దేశంలో ఉన్న టాలెంట్ చూసిన తర్వాత కోచ్ పదవి అనేది ఆకర్షణీయంగా కనిపిస్తోంది’’ అని లాంగర్ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు.లాంగర్ కెరీర్జస్టిన్ లాంగర్ ఆస్ట్రేలియా తరఫున 105 టెస్టులు ఆడాడు. 45 సగటుతో 7696 రన్స్ చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా టీమ్ కోచ్ గా ఉన్నాడు. అతని కోచింగ్ లోనే 2021లో ఆస్ట్రేలియా తొలిసారి టీ20 వరల్డ్ కప్ గెలిచింది. ఇక ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ కు కూడా కోచ్ గా ఉన్నాడు. గత రెండు సీజన్లలోనూ ఆ టీమ్ ప్లేఆఫ్స్ చేరుకుంది.ఫారినర్కు ఛాన్స్ దక్కేనా?డంకన్ ఫ్లెచర్ తర్వాత గత పదేళ్లలో మరో విదేశీ కోచ్ ను నియమించలేదు. కుంబ్లే, రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్ ఈ బాధ్యతను చేపట్టారు. దీంతో.. బీసీసీఐ మరోసారి విదేశీ కోచ్ ను నియమిస్తుందా లేదా అన్నది చూడాలి. అయితే ఈసారి ఓ విదేశీ కోచ్ ను నియమించే అవకావాలను కూడా కొట్టిపారేయలేం అన్నట్లుగా బీసీసీఐ సెక్రటరీ జై షా మాటలను బట్టి అర్థమవుతోంది. -
Mayank: అభిమానులకు బ్యాడ్న్యూస్: ఇప్పట్లో కష్టమే!
ఐపీఎల్-2024లో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న లక్నో సూపర్ జెయింట్స్ శుక్రవారం సొంత మైదానంలో మరో మ్యాచ్ ఆడనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో అటల్ బిహారీ వాజ్పేయి ఏక్నా స్టేడియంలో తలపడేందుకు సిద్దమైంది. అయితే, ఈ మ్యాచ్కు లక్నో యుంగ్ స్పీడ్గన్ మయాంక్ యాదవ్ దూరం కానున్నాడు. తదుపరి కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్కు కూడా అతడు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. కాగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ సందర్భంగా 21 ఏళ్ల పేస్ సంచలనం మయాంక్ యాదవ్ గాయపడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో కేవలం ఒకే ఒక్క ఓవర్ వేసి మైదానం వీడిన మయాంక్.. తీవ్రమైన తొంటి నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ విలువైన ఆటగాడిని కాపాడుకోవాలని.. మ్యాచ్ ఫిట్నెస్ సాధించిన తర్వాతే అతడిని మళ్లీ బరిలోకి దించాలని లక్నో యాజమాన్యం భావిస్తోంది. ఈ విషయం గురించి లక్నో సూపర్ జెయింట్స్ కోచ్ జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ.. చెన్నై సూపర్ కింగ్స్తో ఏప్రిల్ 19 నాటి మ్యాచ్ కోసం మయాంక్ను ఫిట్గా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. మయాంక్ లాంటి ప్రతిభావంతుడి సేవలను ప్రతీ మ్యాచ్లో ఉపయోగించుకోవాలని భావించడం సహజమేనన్న లాంగర్.. అన్నింటికంటే అతడి ఫిట్నెస్గా ఉండటం ముఖ్యమని పేర్కొన్నాడు. ఢిల్లీతో మ్యాచ్లో బరిలోకి దిగేందుకు మయాంక్ సిద్ధమయ్యాడని.. అయితే పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాతే మళ్లీ ఆడిస్తామని లాంగర్ తెలిపాడు. ఢిల్లీతో పాటు కేకేఆర్తో మ్యాచ్కు కూడా మయాంక్ దూరంగా ఉంటాడని ఈ సందర్భంగా జస్టిన్ లాంగర్ వెల్లడించాడు. కాగా గంటకు 150కి పైగా కిలో మీటర్ల వేగంతో బంతులు విసురుతున్న మయాంక్ యాదవ్ అరంగేట్రంలోనే ఓవర్నైట్ స్టార్ అయిపోయాడు. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ యూపీ పేసర్ 3/27తో సత్తా చాటాడు. లక్నోను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆర్సీబీతో మ్యాచ్లోనూ మూడు వికెట్లు పడగొట్టి మరోసారి ఈ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే, దురదృష్టవశాత్తూ గాయం కారణంగా వరుస మ్యాచ్లకు మయాంక్ యాదవ్ దూరం కానున్నాడు. అతడి స్పీడ్ డెలివరీలను చూడాలనుకున్న అభిమానులకు నిజంగా ఇది బ్యాడ్న్యూస్!! చదవండి: IPL 2024 MI VS RCB: ఆర్సీబీ ఖాతాలో మరో చెత్త రికార్డు.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ముంబైకి గుడ్బై.. ఆ జట్టులో చేరనున్న రోహిత్ శర్మ?!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టును వీడనున్నాడా? ఐపీఎల్-2025 ఆరంభానికి ముందై ఎంఐతో తెగదెంపులు చేసుకోనున్నాడా?.. అవమానాన్ని తట్టుకోలేక ఫ్రాంఛైజీకి గుడ్బై చెప్పాలనుకుంటున్నాడా?.. ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ ఆరంభమైన నాటి నుంచే హిట్మ్యాన్ గురించి క్రీడా వర్గాల్లో ఈ చర్చ నడుస్తూనే ఉంది. కాగా ఐపీఎల్-2024కు ముందు గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను భారీ ధరకు ట్రేడ్ చేసుకున్న ముంబై ఇండియన్స్.. రోహిత్ శర్మపై వేటు వేసిన విషయం తెలిసిందే. ఏకంగా ఐదుసార్లు జట్టుకు ట్రోఫీ అందించిన రోహిత్ను కాదని పాండ్యాను కెప్టెన్గా నియమించింది. ఇందుకు బదులుగా రోహిత్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ముంబై ఫ్రాంఛైజీ తీసుకున్న నిర్ణయంపై తమకున్న కోపాన్ని పాండ్యాపై నేరుగానే ప్రదర్శిస్తున్నారు అభిమానులు. మైదానంలో అతడిని హేళన చేస్తూ చుక్కలు చూపిస్తున్నారు. రోహిత్ వద్దని వారించినా వారు వినే స్థితిలో లేరు. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ పట్ల కూడా హార్దిక్ ప్రవర్తన కాస్త భిన్నంగానే ఉంది. పదే పదే అతడి ఫీల్డింగ్ పొజిషన్ మార్చడంతో పాటు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సేవలను కూడా సరిగ్గా వాడకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇక ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ వరుసగా మూడు మ్యాచ్లు ఓడి.. నాలుగో మ్యాచ్లో గెలిచినా రోహిత్ ముఖంలో పెద్దగా సంతోషం కనిపించకపోవడం జట్టులోని విభేదాలను తేటతెల్లం చేశాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఎవరూ ఊహించని జట్టులోకి రోహిత్? ఈ నేపథ్యంలో తాజాగా ఓ ప్రచారం తెర మీదకు వచ్చింది. ఐపీఎల్-2025 మెగా వేలంలో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రోహిత్ శర్మను సొంతం చేసుకోనుందని అందులోని సారాంశం. ఈ వార్త పుట్టుకు రావడానికి ఓ కారణం ఉంది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా లక్నో కోచ్ జస్టిన్ లాంగర్కు ఓ ప్రశ్న ఎదురైంది. ఐపీఎల్లో మీరు ఏ ఆటగాడిని సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఇంటర్వ్యూయర్ అడగ్గా.. ‘‘ఒక్కరి పేరు మాత్రమే చెప్పాలా? ఎవరి పేరైనా చెప్పవచ్చా? నేను ఎవరి పేరు చెబుతానని మీరు అనుకుంటున్నారు’’ అని లాంగర్ తిరిగి ప్రశ్నించాడు. ఇందుకు బదులుగా.. ‘‘మేము చాలా మంది పేర్లు అనుకుంటున్నాం గానీ రోహిత్ శర్మను మీరు జట్టులో చేర్చుకోగలరా?’’ అని పేర్కొన్నారు. దీంతో ఆశ్చర్యపోయిన లాంగర్.. ‘‘ఏంటీ రోహిత్ శర్మనా? ఒకే అతడిని ముంబై నుంచి మేము ట్రేడ్ చేసుకుంటాం. నాకు తెలిసి ఈ డీల్ మీరే కుదర్చగలరు’’ అని సరదాగా సమాధానమిచ్చాడు. ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. కాగా 2011లో ముంబై ఇండియన్స్ జట్టులో చేరిన రోహిత్ శర్మ 13 సీజన్లుగా అదే జట్టుకు ఆడుతున్నాడు. కెప్టెన్గా ఐదుసార్లు టైటిల్ గెలిచాడు. చదవండి: రోహిత్, కోహ్లి కాదు.. భూగ్రహం మొత్తం మీద అతడే బెస్ట్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'సచిన్, లారా కాదు.. నా లైఫ్లో నేను చూసిన బెస్ట్ ప్లేయర్ అతడే'
ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్ అదరగొడుతోంది. ఆడిన నాలుగు మ్యాచ్లు మూడింట విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో మూడో స్ధానంలో కొనసాగుతోంది. అయితే లక్నో విజయాల వెనుక ఓ మాస్టర్ మైండ్ ఉంది. అతడే లక్నో హెడ్ కోచ్, ఆసీస్ లెజెండరీ క్రికెటర్ జస్టిన్ లాంగర్. ఈ ఏడాది సీజన్తో లక్నో హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టిన లాంగర్ తన అనుభవంతో జట్టును విజయ పథంలో నడిపిస్తున్నాడు. అయితే లాంగర్ తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో తన లైఫ్లో చూసిన అద్బుతమైన క్రికెటర్లు గురించి లాంగర్ చర్చించాడు. "ఇప్పటివరకు నా జీవితంలో నేను చూసిన బెస్ట్ ఆటగాడు విరాట్ కోహ్లినే. ఈ విషయాన్ని నేను ఇప్పటికే చాలా సార్లు పబ్లిక్గా చెప్పాను. నాకు లెజండరీ క్రికెటర్లు వివ్ రిచర్డ్స్, అలన్ బోర్డర్, మార్టిన్ క్రోవ్లు అంటే కూడా నాకు ఇష్టం. మార్టిన్ క్రోవ్కు ప్రత్యర్ధిగా కూడా నేను ఆడాను. అదేవిధంగా బ్రియాన్ లారా, సచిన్ టెండూల్కర్ కూడా గొప్ప ఆటగాళ్లు. కానీ విరాట్ ఎనర్జీ వీరిందరి కంటే అద్భుతం. అతడు చాలా ఫిట్గా ఉన్నాడు. విరాట్ మైదానంలో వికెట్ల మధ్య పరిగెత్తడం, ఫీల్డింగ్లో చాలా యాక్టివ్గా ఉంటాడు. కాబట్టి అతని ఆట చూడటం నాకు చాలా ఇష్టం. మాతో మ్యాచ్లో కోహ్లిని తొందరగా ఔట్ చేయడం ఔట్ చేయడం చాలా సంతోషంగా అన్పించిందని" లక్నో సూపర్ జెయింట్స్ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూలో లాంగర్ పేర్కొన్నాడు. -
లక్నో సూపర్ జెయింట్స్లో కీలక పరిణామం.. అసిస్టెంట్ కోచ్పై వేటు
ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ విజయ్ దాహియాపై ఫ్రాంచైజీ యాజమాన్యం వేటు వేసింది. ఈ విషయాన్ని ఇరు పక్షాలు ధృవీకరించాయి. ఎల్ఎస్జీతో రెండేళ్ల బంధాన్ని తెంచుకుంటున్నట్లు దాహియా తన సోషల్మీడియా అకౌంట్ ద్వారా ప్రకటించగా.. లక్నో మేనేజ్మెంట్ దాహిదాకు ఆల్ ద బెస్ట్ చెప్పింది. హెడ్ కోచ్గా జస్టిన్ లాంగర్ బాధ్యతలు చేపట్టాక లక్నో ఫ్రాంచైజీలో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల గౌతమ్ గంభీర్ లక్నో మెంటార్షిప్ను వదులకుని తన హోం ఫ్రాంచైజీ అయిన కేకేఆర్కు వెళ్లిపోగా.. లాంగర్ పట్టుబట్టి శ్రీధరన్ శ్రీరామ్ను అసిస్టెంట్ కోచ్గా తన బృందంలో చేర్చుకున్నాడు. తాజాగా దాహియా కూడా ఫ్రాంచైజీని వీడటంతో జట్టులొ అంతర్గతంగా ఎదో జరుగుతుందని అంతా అనుకుంటున్నారు. View this post on Instagram A post shared by Vijay Dahiya (@vijay.dahiya.1973) కాగా, కొన్ని రోజుల కిందట లక్నో యాజమాన్యం ఆండీ ఫ్లవర్ను హెడ్ కోచ్ పదవి నుంచి తొలగించి, ఆ స్థానంలో జస్టిన్ లాంగర్ను కూర్చోబెట్టింది. లాంగర్కు ఆసీస్ హెడ్ కోచ్గా మంచి ట్రాక్ రికార్డు ఉంది. దీంతో ఎల్ఎస్జీ యాజమాన్యం అతని కోసం భారీ మొత్తాన్ని వెచ్చించి అక్కున చేర్చుకుంది. ఎల్ఎస్జీతో జతకట్టినప్పటి నుంచి లాంగర్ తనదైన ముద్రను వేసుకుంటున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2024 వేలంలోనూ అతను చాలా కీలకంగా వ్యవహరించాడు. ఈ వేలంలో లక్నో ఆరుగురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. దాహియా స్థానంలో కొత్త అసిస్టెంట్ కోచ్గా సురేశ్ రైనాను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి రైనా తన స్థాయికంటే చిన్నదైన అసిస్టెంట్ కోచ్ పదవి చేపడతాడో లేదో వేచి చూడాలి. మరోవైపు రైనాను గంభీర్ స్థానంలో లక్నో మెంటార్గా నియమిస్తారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. All the best for your next chapter, @vijdahiya !🙏💙 pic.twitter.com/7RhyyOuXnD — Lucknow Super Giants (@LucknowIPL) January 1, 2024 కాగా, లక్నో సూపర్ జెయింట్స్ 2022 సీజన్తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు సీజన్లలో ఆ జట్టు ఓ మోస్తరు ప్రదర్శనలు చేసి ఫైనల్ ఫోర్ వరకు చేరింది. కేఎల్ రాహుల్ నేతృత్వంలో ఈ జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. మరోవైపు లక్నోతో పాటే ఐపీఎల్ అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ ఓ సారి ఛాంపియన్గా, మరోసారి రన్నరప్గా నిలిచింది. లక్నో కోచింగ్ సిబ్బంది: హెడ్కోచ్ : జస్టిన్ లంగర్ అసిస్టెంట్ కోచ్ : శ్రీధరన్ శ్రీరామ్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ : మోర్నీ మోర్కెల్ ఫీల్డింగ్ కోచ్ : జాంటీ రోడ్స్ స్పిన్ బౌలింగ్ కోచ్ : ప్రవీణ్ తాంబే -
ఐపీఎల్ ఒలింపిక్స్తో సమానం.. చాలా సంతోషంగా ఉంది: లక్నో హెడ్ కోచ్
ఐపీఎల్పై ఆస్ట్రేలియా మాజీ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్ ఒలిపింక్స్తో సమానమని లాంగర్ అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2024 సీజన్కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ తమ ప్రధాన కోచ్గా నియమించుకుంది. ఆండీ ప్లవర్ స్ధానాన్ని లంగర్తో లక్నో ఫ్రాంచైజీ భర్తీ చేసింది. ఐపీఎల్లో హెడ్కోచ్ పదివి చేపట్టడం లంగర్కు ఇదే తొలిసారి కావడం గమనార్హం. లంగర్కు కోచ్గా అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. అతడి నేతృత్వంలోనే ఆసీస్ తొలి టీ20 వరల్డ్కప్(2021)ను సొంతం చేసుకుంది. అదే విధంగా బిగ్బాష్ లీగ్లో కూడా లంగర్ కోచ్గా విజయవంతమయ్యాడు. ఈనేపథ్యంలో లక్నో ఫ్రాంచైకి ఇచ్చిన ఇంటర్వ్యూలో లంగర్ మాట్లాడుతూ.. "రికీ పాటింగ్కు ఐపీఎల్ టోర్నీ అంటే చాలా ఇష్టం. అతడితో నేను ఎప్పుడు మాట్లాడిన ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్తో తన ప్రయాణం గురించే చెబుతూ ఉంటాడు. అదే విధంగా నా బెస్ట్ ఫ్రెండ్ టామ్ మూడీ సైతం ఐపీఎల్లో చాలా కాలంగా తన సేవలు అందిస్తున్నాడు. అతడు కూడా చాలా సార్లు ఈ టోర్నీ కోసం నాతో మాట్లాడాడు. ఐపీఎల్ అనేది ఒలింపిక్స్ క్రీడలు వంటిది. ఇది చాలా పెద్ద ఈవెంట్. ప్రతీ మ్యాచ్ ఒక అద్భుతం. ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్కు ఆదరణ ఉంది. మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్టేడియాలు దద్దరిల్లిపోతాయి. ఇటువంటి లీగ్లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. చదవండి: PAK vs AUS: పాకిస్తాన్తో మూడో టెస్టు.. ఆసీస్ జట్టు ప్రకటన! వార్నర్కు ఆఖరి మ్యాచ్ -
IPL 2024: లక్నో సూపర్ జెయింట్స్ కీలక ప్రకటన.. ఇకపై గంభీర్..
IPL 2024- Lucknow Super Giants: ఐపీఎల్-2024 నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ తమ కోచింగ్ సిబ్బందిని ప్రకటించింది. టీమిండియా మాజీ స్టార్ గౌతం గంభీర్ను గ్లోబల్ మెంటార్గా ప్రమోట్ చేసిన మేనేజ్మెంట్.. శ్రీధరన్ శ్రీరామ్ను తమ కుటుంబంలోకి ఆహ్వానించింది. హెడ్కోచ్ అతడే గతంలో ఆస్ట్రేలియా క్రికెట్ స్పిన్ కన్సల్టెంట్గా పనిచేసిన శ్రీరామ్ ఎల్ఎస్జీ అసిస్టెంట్ కోచ్గా సేవలు అందించనున్నాడు. ఇక లక్నో ఫ్రాంఛైజీ తమ జట్టు హెడ్కోచ్గా ఇప్పటికే జస్టిన్ లాంగర్ను నియమించిన విషయం తెలిసిందే. అతడికి తోడుగా.. విజయ్ దహియా, ప్రవీణ్ తాంబేలతో పాటు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్లు మోర్నీ మోర్కెల్, జాంటీ రోడ్స్ అసిస్టెంట్ కోచ్లుగా పనిచేయనున్నారు. PC: LSG బంగ్లాదేశ్ను గెలుపుబాటలో నడిపి శ్రీధరన్ శ్రీరామ్ చేరిక లక్నో సూపర్ జెయింట్స్కు అదనపు బలంగా మారనుంది. 47 ఏళ్ల ఈ టీమిండియా మాజీ స్పిన్నర్ గతంలో బంగ్లాదేశ్ పురుషుల టీ20 జట్టుకు మార్గదర్శనం చేశాడు. టీ20 వరల్డ్కప్-2022లో సూపర్-12లో బంగ్లా అద్భుతంగా ఆడేలా కోచింగ్ ఇచ్చాడు. ఆస్ట్రేలియా జట్టుకు సైతం అంతేకాదు.. ఆస్ట్రేలియా జట్టుకు సైతం శ్రీరామ్ కోచ్గా వ్యవహరించాడు. టీ20 వరల్డ్కప్, 2021-22 యాషెస్ సిరీస్ సమయంలో జట్టుతో ప్రయాణించాడు. అదే విధంగా.. గతంలో ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అసిస్టెంట్ కోచ్గా పనిచేశాడు. ప్లేఆఫ్స్ చేరినా.. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయంతో సీజన్ మధ్యలోనే వైదొలిగినా జట్టు ఐపీఎల్-2023 ప్లే ఆఫ్స్నకు అర్హత సాధించగలిగింది. కోల్కతా నైట్ రైడర్స్ కేవలం ఒకే ఒక్క రన్ తేడాతో టాప్-4లో నిలిచిన లక్నో కీలక మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. కోహ్లి- గంభీర్ వివాదం ఇదిలా ఉంటే.. లక్నో- ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా నవీన్ ఉల్ హక్ కారణంగా విరాట్ కోహ్లి- గంభీర్ మధ్య తలెత్తిన గొడవ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. స్థాయి మరిచి ప్రవర్తించిన ఈ ఇద్దరు స్టార్లపై క్రికెట్ దిగ్గజాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చదవండి: అవసరం లేదు! సంజూ శాంసన్ను స్వదేశానికి పంపిన బీసీసీఐ S Sriram joins to complete our coaching staff for 2024 💙 Full story 👉 https://t.co/4svdieJytL pic.twitter.com/8EgX2Pg8uP — Lucknow Super Giants (@LucknowIPL) September 9, 2023 -
IPL: లక్నో సూపర్ జెయింట్స్కు కొత్త కోచ్.. ప్రకటించిన ఫ్రాంఛైజీ
ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ కొత్త హెడ్ కోచ్ను నియమించుకుంది. ప్రస్తుత కోచ్ ఆండీ ఫ్లవర్ కాంట్రాక్ట్ 2023 సీజన్తో ముగియడంతో, అతని స్థానాన్ని ఆసీస్ మాజీ కోచ్ జస్టిన్ లాంగర్తో భర్తీ చేసింది. ఈ విషయాన్ని ఎల్ఎస్జీ యాజమాన్యం ఇవాళ (జులై 14) అధికారికంగా ప్రకటించింది. ఎల్ఎస్జీకి ఆండీ ఫ్లవర్ చేసిన సేవలను అభినందిస్తూ ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసిన మేనేజ్మెంట్.. కొత్త కోచ్ పేరును ప్రకటించింది. ఫ్లవర్ కాంట్రాక్ట్ను పొడిగించేందుకు సముఖత చూపని లక్నో మేనేజ్మెంట్.. మెంటార్గా గౌతమ్ గంభీర్ సేవలను మాత్రం ఎక్స్టెండ్ చేసింది. గంభీర్తో పాటు బౌలింగ్ కోచ్గా మోర్నీ మోర్కెల్ను, ఫీల్డింగ్ కోచ్గా జాంటీ రోడ్స్ను, అసిస్టెంట్ కోచ్గా విజయ్ దాహియాను కొనసాగించింది. ఇదిలా ఉంటే, కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్యాల నేతృత్వంలో, ఆండీ ఫ్లవర్ ఆధ్వర్యంలో ఎల్ఎస్జీ గత రెండు సీజన్లలో ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపించింది. ఈ రెండు సీజన్లలో ఆ జట్టు మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఓ పక్క తమతో పాటు ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ఓ సీజన్లో విజేతగా, మరో సీజన్లో రన్నరప్గా నిలువడంతో ఎల్ఎస్జీ పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే హెడ్ కోచ్ను మార్చింది. మున్ముందు ఈ జట్టులో భారీ మార్పులు ఉంటాయన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కెప్టెన్గా కేఎల్ రాహుల్ను కూడా తప్పించవచ్చని ప్రచారం జరుగుతుంది. ఐపీఎల్-2024కు మరో ఏడాది సమయం ఉంది కాబట్టి, కెప్టెన్ మార్పు విషయంలో ఎల్ఎస్జీ యాజమాన్యం ఎలాంటి ముందస్తు ప్రకటన చేయకపోవచ్చు. లక్నో కొత్త కోచ్ విషయానికొస్తే.. 52 ఏళ్ల లాంగర్ ఆసీస్ను 2021 టీ20 వరల్డ్కప్ విజేతగా, బిగ్బాష్ లీగ్లో పెర్త్ స్కార్చర్స్ను మూడుసార్లు ఛాంపియన్గా (కోచ్గా) నిలబెట్టాడు. కోచ్గా మంచి ట్రాక్ రికార్డు కలిగిన లాంగర్ను ఎల్ఎస్జీ యాజమాన్యం ఏరికోరి ఎంచుకుంది. 1993-2007 మధ్యకాలంలో ఆసీస్ తరఫున 105 టెస్ట్లు 8 వన్డేలు ఆడిన లాంగర్.. సక్సెస్ఫుల్ ఓపెనింగ్ బ్యాటర్గా పేరు తెచ్చుకున్నాడు. వన్డేల్లో పెద్దగా రాణించని లాంగర్ టెస్ట్ల్లో సత్తా చాటాడు. 182 ఇన్నింగ్స్ల్లో 23 సెంచరీలు, 30 అర్ధసెంచరీల సాయంతో 45.3 సగటున 7696 పరుగులు చేశాడు. -
లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్గా ఆసీస్ మాజీ ఓపెనర్..?
వచ్చే ఐపీఎల్ సీజన్ (2024) కోసం లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ ఇప్పటినుంచే సన్నాహకాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఆ జట్టు.. తమ హెడ్ కోచ్ను మార్చాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హెడ్ కోచ్గా ఉన్న ఆండీ ఫ్లవర్ కాంట్రాక్ట్ 2023 సీజన్తోనే ముగియడంతో ఆ జట్టు కొత్త కోచ్ అన్వేషణలో పడింది. ఈ పదవి కోసం ఎల్ఎస్జీ మేనేజ్మెంట్ ఆసీస్ మాజీ హెడ్ కోచ్, ఆ జట్టు మాజీ ఓపెనర్ జస్టిన్ లాంగర్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై లాంగర్ కాని, ఎల్ఎస్జీ యాజమాన్యం కాని ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. ఇరు వర్గాల మధ్య మంతనాలు జరుగుతున్నట్లు క్రికెట్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే వచ్చే సీజన్ నుంచి ఎల్ఎస్జీ హెడ్ కోచ్గా లాంగర్ వ్యవహరించే అవకాశం ఉంది. 52 ఏళ్ల జస్టిన్ లాంగర్.. ఆసీస్ను 2021 టీ20 వరల్డ్కప్ విజేతగా, బిగ్బాష్ లీగ్లో పెర్త్ స్కార్చర్స్ను మూడుసార్లు ఛాంపియన్గా (కోచ్గా) నిలబెట్టాడు. ఇదిలా ఉంటే, కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్యాల నేతృత్వంలో, ఆండీ ఫ్లవర్ ఆధ్వర్యంలో ఎల్ఎస్జీ గత రెండు సీజన్లలో ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపించింది. ఈ రెండు సీజన్లలో ఆ జట్టు మూడో స్థానంలో నిలిచింది. వ్యాపార దిగ్గజం సంజీవ్ గోయెంకా కొనుగోలు చేసిన ఎల్ఎస్జీ ఫ్రాంచైజీకి టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మెంటార్గా, మోర్నీ మోర్కెల్ బౌలింగ్ కోచ్గా, జాంటీ రోడ్స్ ఫీల్డింగ్ కోచ్గా, విజయ్ దాహియా అసిస్టెంట్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. -
ఇంగ్లండ్ తిక్క కుదిరింది.. బజ్బాల్ అప్రోచ్కు అదే విరుగుడు
బజ్బాల్ విధానం అంటూ టెస్ట్ క్రికెట్లో వేగం పెంచే ప్రయత్నం చేస్తూ, ఇటీవలే ఆసీస్ చేతిలో చావు దెబ్బ (యాషెస్ సిరీస్ తొలి టెస్ట్లో ఓటమి) తిన్న ఇంగ్లండ్ టీమ్ను ఉద్దేశిస్తూ ఆసీస్ మాజీ ఓపెనర్, మాజీ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒత్తిడిలో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ కనబర్చిన సంయమనం ఇంగ్లండ్ బజ్బాల్ పద్ధతికి విరుగుడు అని ఆయన అభిప్రాయపడ్డాడు. యాషెస్ తొలి టెస్ట్ ఆఖరి రోజు ఇంగ్లండ్ ఆసీస్ను తెగ ఇబ్బంది పెట్టిందని, అయితే కమిన్స్ క్రీజ్లోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నాడు. కమిన్స్ తీవ్రమైన ఒత్తిడిలో ఎంతో ఓర్పును, సహనాన్ని ప్రదర్శించి తన జట్టును విజయతీరాలకు చేర్చాడని.. ఒత్తిడిలో కమిన్స్ ప్రదర్శించిన ఆ ఓర్పు,సహనమే ఆసీస్ను గెలిపించిందని తెలిపాడు. కమిన్స్కు లయోన్ అద్భుతంగా సహకరించాడని, వారిద్దరు ఒత్తిడిని అధిగమించి, తమ జట్టుకు చారిత్రక విజయాన్ని అందించారని పేర్కొన్నాడు. ఎంతటి ఒత్తిడిలోనైనా గెలవడం వల్లే ఆసీస్ వరల్డ్ నంబర్ జట్టుగా చలామణి అవుతుందని, ఇందుకు యాషెస్ తొలి టెస్ట్ ఉదాహరణ అని చెప్పుకొచ్చాడు. బజ్బాల్కు విరుగుడు ఏమిటనే దానిపై గతంలో చాలా సందర్భాల్లో ప్రశ్నలు తలెత్తాయని.. ఆసీస్ కెప్టెన్ తొలి టెస్ట్లో బంతితో పాటు కీలక ఇన్నింగ్స్ ఆడి ఆ ప్రశ్నకు జవాబిచ్చాడని తెలిపాడు. కాగా, యాషెస్ సిరీస్ తొలి టెస్ట్లో ఆసీస్ 2 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయం సాధించిన విషయం తెలిసిందే. పాట్ కమిన్స్ (0/59, 38, 4/63, 44 నాటౌట్) ఆల్రౌండర్ ప్రదర్శనతో ఆసీస్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. వికెట్లు చేతిలో ఉన్నా, తొలి రోజే తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి ఇంగ్లండ్ చేతులు కాల్చుకోగా.. తమ ముందు బజ్బాల్ గిజ్బాల్ జాన్తానై అంటూ ఆసీస్.. ఇంగ్లండ్ ఎత్తుగడను తిప్పికొట్టింది. ఛేదనలో కమిన్స్ ప్రదర్శించిన ఓర్పు, సంయమనం ఇంగ్లండ్ బజ్బాల్ అప్రోచ్ను తుంగలో తొక్కి ఆసీస్కు చారిత్రక విజయాన్ని అందించింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ జూన్ 28 నుంచి లార్డ్స్ వేదికగా జరుగనుంది. -
'నెంబర్ వన్ స్థానం నావల్లే.. వాడుకొని వదిలేశారు'
ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు జస్టిన్ లాంగర్ క్రికెట్ ఆస్ట్రేలియాతో పాటు టెస్టు, వన్డే కెప్టెన్ పాట్ కమిన్స్ తీరును ఎండగట్టాడు. అవసరం ఉన్నప్పుడు వాడుకున్నారని.. మరో అవకాశం ఇవ్వాలని అడిగితే పదవి నుంచి తొలగించారంటూ అసహనం వ్యక్తం చేశాడు. విషయంలోకి వెళితే.. 2021లో జరిగిన టి20 ప్రపంచకప్లో ఎలాంటి అంచనాలు లేకుండా అండర్డాగ్స్గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా టైటిల్ను ఎగురేసుకుపోయి అందరిని ఆశ్చర్యపరిచింది. దీని వెనకాల ప్రధాన కారణం అప్పటి కోచ్ జస్టిన్ లాంగర్. ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ను 4-0తేడాతో గెలవడంలోనూ లాంగర్దే ప్రముఖ పాత్ర అని చెప్పొచ్చు. అతని హయాంలోనే ఆస్ట్రేలియా మళ్లీ టెస్టుల్లో నెంబర్వన్ ర్యాంక్కు చేరుకుంది. ఇప్పటికీ ఆస్ట్రేలియానే టెస్టుల్లో నెంబర్వన్గా ఉంది. ఎంత కాదన్నా కోచ్, ఆటగాళ్లు కలిస్తేనే ఇది సాధ్యమవుతుంది. అలా ఏడాది వ్యవధిలో రెండు గొప్ప ఫీట్లు సాధించిన కోచ్గా లాంగర్ పేరు గడించాడు. ఆ తర్వాత తన పదవిని పొడిగించాలని క్రికెట్ ఆస్ట్రేలియాను కోరాడు. కానీ క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం లాంగర్ పదవిని మరో ఆరు నెలల పాటు మాత్రమే పొడిగించింది. పాకిస్తాన్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లిన సమయంలోనే లాంగర్ను తొలగించి ఆండ్రూ మెక్డొనాల్డ్ను కొత్త కోచ్గా ఎంపిక చేసింది. అలా లాంగర్కు క్రికెట్ ఆస్ట్రేలియాతో బంధం ముగిసింది. తాజాగా తనకు జరిగిన అన్యాయంపై లాంగర్ డెయిలీ మెయిల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో స్పందించాడు.''తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన వారు పిరికివాళ్లని.. కానీ మెజారిటీ ఆటగాళ్లు మద్దతు ఇచ్చారు. పాట్ కమిన్స్ సహా కొందరు ఆటగాళ్లు నా ముందు మంచిగా నటించి వెనుక మత్రం గోతులు తవ్వినట్లుగా అనిపించింది. కోచ్గా నేను నచ్చకపోతే ముఖం మీద చెప్పాల్సింది.. ఇలా వెనుక మాట్లాడడం తగదు. కోచ్కు, ఆటగాళ్లకు మధ్య చిన్న చిన్న మనస్పర్థలు రావడం కామన్. నాకు తెలియకుండా పాట్ కమిన్స్ లాంటి కొందరు వ్యక్తులు తమ స్వలాభం కోసం మాలో జరిగిన కొన్ని విషయాలను లీక్ చేశారు. ఇది నా దృష్టిలో పెద్ద తప్పు. ఇక నేను పదవికి రాజీనామా చేసే సమయానికి జట్టు నెంబర్వన్లో ఉంది. దానిని కూడా సరిగ్గా ఎంజాయ్ చేయకుండానే నన్ను కోచ్ పదవి నుంచి తప్పించారు.'' అంటూ పేర్కొన్నాడు. చదవండి: బంధం ముగిసింది.. రొనాల్డోతో మాంచెస్టర్ యునైటెడ్ తెగదెంపులు సరికొత్త ఫార్మాట్లో 2024 టి20 వరల్డ్కప్ -
లాంగర్ రాజీనామా.. ఆస్ట్రేలియా కొత్త కోచ్ ఎవరంటే!
Australia Cricket Team New Head Coach: జస్టిన్ లాంగర్ రాజీనామా నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా అతడి స్థానంలో తాత్కాలిక హెడ్కోచ్ను నియమించింది. ఆండ్రూ మెక్డొనాల్డ్ను పురుషుల క్రికెట్ జట్టు కోచ్గా నియమిస్తున్నట్లు తెలిపింది. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తామని పేర్కొంది. ఇందుకు సంబంధించి ట్విటర్ వేదికగా అధికారిక ప్రకటన చేసింది. కాగా ఆసీస్ కోచ్గా కొనసాగాలని భావించిన జస్టిన్ లాంగర్ విజ్ఞప్తి పట్ల బోర్డు సానుకూలంగా స్పందించలేదు. దీంతో అతడు తన పదవి నుంచి వైదొలిగాడు. ఈ క్రమంలో ఆండ్రూకు కోచ్గా బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చింది. ఇక ఆస్ట్రేలియా తరఫున 2009లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆండ్రూ అదే ఏడాది తన చివరి మ్యాచ్ ఆడాడు. వన్డేల్లో టీమిండియాతో 2009లో జరిగిన సిరీస్లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళరూకు ప్రాతినిథ్యం వహించాడు. 2013లో ఆండ్రూ తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. చదవండి: Justin Langer: ఆసీస్ హెడ్కోచ్కు షాకిచ్చిన బోర్డు.. టీ20 వరల్డ్కప్, యాషెస్ విజయాలు.. అయినా తప్పని రాజీనామా U19 WC Final Ind Vs Eng: 11 మందిలో ఏకంగా 8వ వరుస బ్యాటర్ దాకా పరుగులు చేసే సత్తా వాళ్లది.. హోరాహోరీ తప్పదు! JUST IN: @CricketAus confirms Andrew McDonald has been appointed interim head coach of the Aussie men's team. More to come. — cricket.com.au (@cricketcomau) February 5, 2022 -
Justin Langer: ఆసీస్ హెడ్కోచ్కు షాకిచ్చిన బోర్డు.. రాజీనామా చేయక తప్పలేదు!
Justin Langer Resigns As Australia Coach: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోచ్గా కొనసాగాలని భావించిన జస్టిన్ లాంగర్కు చేదు అనుభవం ఎదురైంది. తానెంతగానో ప్రేమించే హెడ్కోచ్ పదవికి రాజీనామా చేయక తప్పలేదు. క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)తో అనేక చర్చల అనంతరం.. జస్టిన్ లాంగర్ తన పదవి నుంచి వైదొలిగినట్లు అతడి మేనేజ్మెంట్ కంపెనీ డీఎస్ఈజీ శనివారం ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు... ‘‘మా క్లైంట్ జస్టిన్ లాంగర్.. ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టు హెడ్కోచ్గా ఈరోజు ఉదయం రాజీనామా చేశారు. క్రికెట్ ఆస్ట్రేలియాతో నిన్నటి చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే ఆయన తన పదవి నుంచి వైదొలుగుతున్నారు’’ అని పేర్కొంది. కాగా ఆసీస్ క్రికెట్ బోర్డుతో కుదిరిన ఒప్పందం ప్రకారం జస్టిన్ లాంగర్ జూన్ వరకు తన పదవిలో కొనసాగాల్సి ఉంది. అయితే, దీర్ఘకాలం పాటు పదవీ కాలాన్ని పొడిగించాలని కోరగా... బోర్డు అందుకు సుముఖంగా లేనట్లు సమాచారం. ఈ క్రమంలో సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ హాక్లే, సీఏ నేషనల్ టీమ్స్ హెడ్ బెన్ ఒలివిర్తో ఈ విషయం గురించి చర్చించగా.. సానుకూల ఫలితం రాలేదు. దీంతో లాంగర్ రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే... ఆసీస్ మాజీ కెప్టెన్ టిమ్ పైన్, ప్రస్తుత టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్, పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ సహా పలువురు కీలక ఆటగాళ్లతో లాంగర్కు అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు సమాచారం. ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటనలో ఆస్ట్రేలియాకు పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. చదవండి: సాండ్విచ్ కూడా తినడానికి అవకాశం ఇవ్వలేదు.. కోచ్గా నా బాధ్యత నిర్వర్తించడం తప్పా? ఈ క్రమంలో ఆటగాళ్లతో విభేదాలు తారస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటాడని, అంతా తాను చెప్పినట్లే జరగాలనే నియంతృత్వ ధోరణితో ఉంటాడని ఆటగాళ్లు అతడి వ్యవహారశైలిపై మండిపడినట్లు సమాచారం. ఆయనతో తమకు పొసగడం లేదంటూ కోచ్కు వ్యతిరేకంగా గళం విప్పడంతో ఆయనను కొనసాగించేందుకు బోర్డు విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా లాంగర్ మార్గదర్శనంలో ఆస్ట్రేలియా తొలిసారిగా టీ20 వరల్డ్కప్ చాంపియన్గా అవతరించింది. అంతేకాదు ఇటీవల ఇంగ్లండ్తో ముగిసిన యాషెస్ సిరీస్లోనూ 4-0 తేడాతో ట్రోఫీని కైవసం చేసుకుంది. చదవండి: U19 WC Final Ind Vs Eng: 11 మందిలో ఏకంగా 8వ వరుస బ్యాటర్ దాకా పరుగులు చేసే సత్తా వాళ్లది.. హోరాహోరీ తప్పదు! -
3 ఫార్మాట్లలో కొనసాగుతా.. ఐసీసీ ట్రోఫీలు గెలవడమే లక్ష్యం: హెడ్కోచ్
Justin Langer: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన ఆస్ట్రేలియాకు మరోసారి మహర్దశ నడుస్తోందని చెప్పవచ్చు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్కప్-2021 ట్రోఫీ గెలిచి కొత్త చాంపియన్గా అవతరించింది ఆసీస్. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఏకంగా ట్రోఫీ సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లోనూ అదరగొడుతోంది. ఇప్పటికే ఇంగ్లండ్పై తొలి రెండు టెస్టులలో ఏకపక్ష విజయం సాధించి.. సిరీస్ కైవసం చేసుకునే దిశగా ముందుకు సాగుతోంది. వీటన్నింటిలో హెడ్కోచ్ జస్టిన్ లాంగర్ పాత్ర ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాల్ టాంపరింగ్(దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో) ఉదంతం తర్వాత ఆ అప్రదిష్టను చెరిపేసుకునేలా ఆట తీరుతో విమర్శకులకు సమాధానాలు ఇచ్చేలా జట్టును ప్రోత్సహించాడు. విజయాల బాట పట్టించి చాంపియన్గా నిలిపాడు. ఇక రానున్న రెండేళ్ల పాటు కంగారూలు బిజీబిజీగా గడుపనున్న సంగతి తెలిసిందే. అంతేగాక పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్-2022 టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఆ తర్వాత 2023 వరల్డ్కప్ ఆడనున్నారు. ఈ నేపథ్యంలో క్రిక్ఇన్ఫోతో మాట్లాడిన జస్టిన్ లాంగర్ మూడు ఫార్మాట్లకు కోచ్గా కొనసాగుతానని స్పష్టం చేశాడు. ‘‘వేరే ఆలోచనకు తావే లేదు. అవును.. నేను మూడు ఫార్మాట్లలో కొనసాగుతాను. గత నాలుగేళ్లుగా మా జట్టు నిలకడైన ప్రదర్శన కనబరుస్తోంది. హెడ్కోచ్గా నా పనిని నేను ప్రేమిస్తున్నాను. మావాళ్లు చాలా బాగా ఆడుతున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. వారితో మమేకం కావడం నాకు ఎంతో సంతోషం. ఇక ముందు కూడా ఇలాగే ఉంటుందని భావిస్తున్నా’’ అని లాంగర్ చెప్పుకొచ్చాడు. 2022, 2023 ప్రపంచకప్లతో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ టైటిల్ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నాడు. కాంట్రాక్ట్ పొడిగించాలనుకుంటున్నట్లు పరోక్షంగా తన మనసులోని మాటను వెల్లడించాడు. చదవండి: Kapil Dev: కపిల్లా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, కెప్టెన్సీ చేయండి.. అప్పుడే కప్ గెలుస్తారు! రోహిత్.. ఇంకా కోహ్లి... IPL 2022- SRH: సన్రైజర్స్ బ్యాటింగ్ కోచ్గా బ్రియన్ లారా.. కొత్త సిబ్బంది వీళ్లే.. పరిచయం చేసిన ఫ్రాంఛైజీ -
T20 World Cup: గెలిచింది మన జట్టే కదా.. మనోడే కదా
మాథ్యూ హేడెన్.. జస్టిన్ లాంగర్.. వీరిద్దరు ఒకప్పుడు ఆసీస్కు ఓపెనింగ్ జోడీ. 2000 దశకంలో వీరు ఆసీస్ క్రికెట్ను ఒక ఊపు ఊపేశారు. ప్రధానంగా టెస్టుల్లో ఈ జోడీ అత్యంత భయంకరమైన జోడీగా గుర్తింపు పొందింది. టెస్టుల్లో ఆసీస్కు అత్యుత్తమ ఓపెనింగ్ ద్వయంగా నిలిచింది. టెస్టు క్రికెట్లో ఈ జోడి ఆసీస్ తరఫున నాల్గో అత్యుత్తమ ఇన్నింగ్స్ను నమోదు చేయడం వారు సక్సెస్ఫుల్ జోడీగా చెప్పడానికి ఒక ఉదాహరణ. 2004లో శ్రీలంకపై చేసిన 255 పరుగుల వీరి తొలి వికెట్ అత్యుత్తమ భాగస్వామ్యం. ఇదిలా ఉంచితే, వీరిద్దరూ ఇప్పుడు ప్రత్యర్థులుగా తలపడ్డారు. కానీ ముఖాముఖి పోరులో కాదు.. కోచ్లుగా అమీతుమీ తేల్చకున్నారు. ప్రస్తుతం యూఏఈ వేదికగా జరిగే టీ20 వరల్డ్కప్లో భాగంగా మాథ్యూ హేడెన్ పాకిస్తాన్ బ్యాటింగ్ కన్సల్టెంట్గా పనిచేస్తుంటే, ఆసీస్కు జస్టిన్ లాంగర్ కోచ్గా ఉన్నాడు. కాగా, గురువారం జరిగిన సెమీ ఫైనల్లో పాకిస్తాన్పై ఆసీస్ విజయం సాధించడంతో లాంగర్దే పైచేయి అయ్యింది. పాకిస్తాన్పై ఆసీస్ విజయం సాధించడంతో ఫైనల్లోకి ప్రవేశించింది. 2010 తర్వాత టీ20 వరల్డ్కప్లో ఆసీస్ ఫైనల్కు చేరడం ఇదే తొలిసారి. ఓవరాల్గా ఈ పొట్టి ఫార్మాట్ వరల్డ్కప్లో ఆసీస్ రెండుసార్లు మాత్రమే తుది పోరుకు అర్హత సాధించింది. మరొకవైపు ఈ వరల్డ్కప్లో బ్యాటింగ్లో పాకిస్తాన్ రాణించడంతో హేడెన్ హీరో అయ్యాడు. తొలి మ్యాచ్ మొదలుకొని చూస్తే పాకిస్తాన్ బ్యాటింగ్ పదును పెరిగింది. ఇది గత పాకిస్తాన్ క్రికెట్ జట్టేనే అన్నట్లుగా మెరిసింది. ఇందుకు హేడెన్ ప్రధాన కారణమనే చర్చ తెరపైకి వచ్చింది. హేడెన్ బ్యాటింగ్ వ్యూహాలతోనే పాకిస్తాన్ అద్బుతమైన ఫలితాలు సాధించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 12 జట్లు తలపడే టీ 20వరల్డ్కప్లో పాక్ జట్టు సెమీస్కు చేరుతుందనే అంచనాలు పెద్దగా లేవు. 2019 వన్డే వరల్డ్కప్లో ఘోరమైన ప్రదర్శన కారణంతో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టడమే ఆ జట్టుపై పెద్దగా అంచనాలు లేకపోవడానికి కారణం. కానీ అంచనాలను తలక్రిందులు చేస్తూ పాకిస్తాన్ సెమీస్కు రావడమే కాకుండా, బెస్ట్ ఆఫ్ ఫోర్లో గట్టిపోటీ ఇచ్చింది. ఈ వరల్డ్కప్ సెమీ ఫైనల్లో తొలుత ఆ జట్టు బ్యాటింగ్ చేసిన తీరు పాకిస్తాన్ ఫైనల్కు చేరుతుందని అంతా అనుకున్నారు. బోర్డుపై 177 పరుగుల టార్గెట్ను ఉంచడంతో పాకిస్తాన్ విజయం సాధిస్తుందని సగటు అభిమాని భావించాడు. కానీ మాథ్యూ వేడ్, స్టోయినిస్ల మెరుపు ఇన్నింగ్స్లు ఆసీస్ను గెలిపించాయి. ఒకవేళ నిన్నటి మ్యాచ్లో పాకిస్తాన్ గెలుచుంటే ఆ క్రెడిట్ కచ్చితంగా హేడెన్ ఖాతాలోకి వెళ్లేది. కానీ ఆసీస్ ఫైనల్కు చేరడంతో మిత్రడు హేడెన్పై లాంగర్దే ఆధిక్యమైంది. దీంతో ‘ఎవరు గెలిస్తే ఏముంది’.. గెలిచింది మన జట్టే కదా.. మనోడే కదా అని హేడెన్ సర్దిచెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ఆ స్లో ఓవర్రేట్ మా కొంపముంచింది: లాంగర్
సిడ్నీ: టీమిండియాతో మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ మా కొంపముంచిందంటూ ఆసీస్ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ.. ఆ మ్యాచ్లో మా బౌలర్లు గంటలో 15 ఓవర్లు వేయాల్సి ఉండగా.. రెండు ఓవర్లు తక్కువగా వేశారు. దాంతో మాపై స్లో ఓవర్ రేట్ నమోదైంది. ఐసీసీ నిబంధనల ప్రకారం మేము నాలుగు పాయింట్లు కోల్పోవాల్సి వచ్చింది. దాంతో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. అప్పటికీ ఈ విషయంపై మా జట్టు మేనేజర్ గెవిన్ డెవోయ్తో పాటు ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్తో చర్చించాను. స్లో ఓవర్ రేట్ వల్ల పాయింట్లు కోల్పోయే అవకాశం ఉందని.. అది ప్రపంచ టెస్టు చాంపియన్షిప్పై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నా. ఇదే విషయంలో ఆసీస్ బౌలర్లను కూడా హెచ్చరించా. సిడ్నీ, బ్రిస్బేన్ టెస్టుల్లో స్లో ఓవర్రేట్ కాకుండా చూసుకోవాలని తెలిపా. కానీ అనూహ్యంగా కరోనా కారణంగా దక్షిణాఫ్రికా టూర్ రద్దవడం మాకు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఆ సిరీస్ రద్దు కావడం.. టీమిండియాతో జరిగిన సిరీస్ను మేం చేజార్చుకోవడంతో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ అర్హతకు మరింత దూరం కావాల్సి వచ్చింది. అంటూ తెలిపాడు. ఇదిలా ఉంచితే.. ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా విజయం సాధించడం ద్వారా టెస్టుల్లో అగ్రస్థానంలో నిలవడంతో పాటు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో సగర్వంగా అడుగుపెట్టింది. జూన్లో సౌతాంప్టన్ వేదికగా జరగనున్న ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్ను ఎదుర్కోనుంది. అయితే డబ్ల్యూటీసీ పట్టికలో పీసీటీ పాయింట్ల పరంగా చూస్తే టీమిండియా 72 శాతంతో మొదటి స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ 70 శాతంతో రెండో స్థానంలో.. ఆసీస్ 69.2 శాతంతో మూడో స్థానంలో ఉన్నాయి. పాయింట్ల పరంగా చూస్తే.. కివీస్కు, ఆసీస్కు 0.8 శాతం తేడా మాత్రమే ఉంది. ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం... అనుకున్న సమయానికి ఒక ఓవర్ తక్కువ వేస్తే.. మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానాతో పాటు రెండు ఫెనాల్టీ పాయింట్లు విధిస్తారు. ఆ విధంగా ఆసీస్ రెండు ఓవర్లు తక్కువ వేయడంతో మ్యాచ్ ఫీజులో 40 శాతం జరిమానాతో పాటు నాలుగు ఫెనాల్టీ పాయింట్లు దక్కించుకుంది. చదవండి: 'ఆ వార్తలు నా కుటుంబాన్ని బాధించాయి' ఆసీస్ జట్టులో విభేదాలు.. కారణం అతనే! -
'ఆ వార్తలు నా కుటుంబాన్ని బాధించాయి'
సిడ్నీ: టీమిండియాతో ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోపీని 2-1 తేడాతో ఆసీస్ ఓడిపోయిన తర్వాత ఆ జట్టు ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్పై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. జట్టులో ఉన్న కొందరు ఆటగాళ్లతో లాంగర్కు పొసగడం లేదని.. అతని ప్రవర్తనతో వారు ఇబ్బందులకు గురవుతున్నారంటూ అక్కడి మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. డ్రెస్సింగ్ రూమ్లో లాంగర్ ఆటగాళ్లతో ముభావంగా ఉండడం... తాను ఏం చెబితే అది చేయాలని.. ముఖ్యంగా గబ్బా టెస్టు జరుగుతున్న సమయంలో బౌలింగ్ విషయంలో జోక్యం చేసుకొని అనవసర సలహాలు ఇచ్చేవాడని.. ఆసీస్ బౌలర్లు కూడా అతని తీరుతో సంతృప్తిగా లేరంటూ పేర్కొంది. ఈ విషయాలను తాను సీరియస్గా తీసుకున్నానని.. జట్టుతో తనకు ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తానని లాంగర్ అప్పట్లో స్పందించాడు. అయితే తాజాగా ఆటగాళ్లతో కోచ్గా తన ప్రవర్తన బాలేదంటూ మీడియాలో మరోసారి వార్తలు లీక్ అవడం తనను బాధించిందని లాంగర్ తెలిపాడు. ఈ వార్తలతో తాను మానసికంగా కుంగిపోతున్నానని.. నా ఫ్యామిలీకి ఈ విషయాలు తెలిసి బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ''నా వరకు నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా. ఎన్నో ఏళ్లు ఆటగాడిగా జట్టుకు సేవలందించా. ఆటగాడిగా ఉన్నప్పుడు రాని విమర్శలు కోచ్ పదవిలో ఉన్నప్పుడు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు. టెస్టు సిరీస్ ముగిసిన రెండు వారాలకు ఆటగాళ్లతో నా ప్రవర్తన బాలేదంటూ వార్తలు వచ్చాయి. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే ఆటగాళ్లు లేక అసిస్టెంట్ కోచ్ నా వద్దకు వచ్చి సమస్యను చెప్తే సరిపోతుంది. ఈ విషయం వాళ్లకు అప్పుడే చెప్పా. నేను ఎక్కడ పనిచేసినా నిజాయితీతో ఉంటూ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తా. బహుశా నేను ఏంచుకన్న దారి ఆటగాళ్లకు నచ్చలేదు. అందుకే వారు నాతో సరిగా ఉండలేకపోయారు. అయితే పదే పదే అదే విషయాన్ని గుర్తు చేస్తూ మీడియాలో కథనాలు లీక్ అవడం భాదించింది. చివరకు నా భార్య కూడా ఇన్ని అవమానాలు పడుతూ ఆసీస్ సీనియర్ జట్టుకు కోచ్గా పనిచేయడం అవసరమా అని ప్రశ్నించింది. నేను మాట్లాడే మాటలు సూటిగా ఉండొచ్చు.. కానీ నాకు మనసు ఉంటుంది. పైకి అది గట్టిగా కనిపించినా.. లోపల మాత్రం చాలా బాధ ఉంది. ఆటగాళ్లతో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు నేను ఎప్పటికి సిద్ధమే'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: కోచ్గా నా బాధ్యత నిర్వర్తించడం తప్పా? ఆసీస్ జట్టులో విభేదాలు.. కారణం అతనే! -
కోచ్గా నా బాధ్యత నిర్వర్తించడం తప్పా?
బ్రిస్బేన్: ఆసీస్ యువ ఆటగాడు మార్నస్ లబుషేన్తో వివాదంపై ఆసీస్ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ స్పందించాడు. గబ్బా వేదికగా జరిగిన నాలుగోటెస్టులో లబుషేన్ తన జేబులో సాండ్విచ్ తీసుకురావడంపై లాంగర్ అభ్యంతరం చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై ఆసీస్ జట్టులోని పలువురు ఆటగాళ్లు లాంగర్ ప్రవర్తన పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. లాంగర్ ఒక స్కూల్ హెడ్మాస్టర్లాగా ప్రవర్తిస్తున్నాడని.. అతనితో తమకు పొసగడం లేదంటూ పరోక్ష్య వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సిడ్నీ హెరాల్డ్ పత్రిక ఆసీస్ జట్టులో విభేదాలు వచ్చాయని.. దీనికి కారణం లాంగర్ అంటూ పేర్కొంది. పత్రికలో వచ్చిన కథనంపై లాంగర్ స్పందిస్తూ.. అవన్నీ తప్పుడు కథనాలని.. వాటిలో నిజం లేదని తేల్చి చెప్పాడు.చదవండి: ఆసీస్ జట్టులో విభేదాలు.. కారణం అతనే! అయితే తాజాగా తనను కనీసం సాండ్విచ్ కూడా తినడానికి అవకాశం ఇవ్వలేదంటూ లబుషేన్ పేర్కొనడంతో వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో లాంగర్ మళ్లీ స్పందిస్తూ.. ' మ్యాచ్ సమయంలో లబుషేన్కు సాండ్విచ్ తినొద్దు అని మాత్రమే చెప్పా.. ఎందుకంటే అప్పటికే ఆటకు 40 నిమిషాల పాటు లంచ్ బ్రేక్ ఇచ్చారు.. అప్పుడు తినకుండా.. దానిని జేబులో పెట్టుకొని ఎందుకు వచ్చావంటూ ప్రశ్నించాను. ఒక్క విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా. కోచ్గా నా జట్టును ఉన్నతస్థానంలో నిలిపాలని ఆశిస్తుంటా. అందుకే కాస్త క్రమశిక్షణగా మెలిగి ఉండొచ్చు. అంతమాత్రానికే కొందరు ఆటగాళ్లు నన్ను తప్పుబడుతూ బ్యాడ్ చేయాలని చూస్తున్నారు.చదవండి: ధోనీ అరుదైన రికార్డు.. తొలి క్రికెటర్గా! నేను చేసే పనులు కొందరికి నచ్చకపోవచ్చు.. కానీ కోచ్గా నా బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి.బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత ఆటగాళ్లు మైదానంలోకి ఎలాంటి వస్తువులు తీసుకురావడానికి అనుమతి లేదని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. అదే నిబంధనను నేను లబుషేన్ విషయంలో అమలు చేశాను. కొన్నిసార్లు నేను కోపంగా ప్రవర్తించి ఉండొచ్చు.. అలా అని ప్రతీసారి అదే విషయాన్ని గుర్తుచేస్తు తప్పుబట్టడం సరికాదు అంటూ చెప్పుకొచ్చాడు. కాగా 2018 బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత లాంగర్ ఆసీస్ జట్టుకు ప్రధాన కోచ్గా ఎంపికయిన సంగతి తెలిసిందే. కాగా టీమిండియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 2-1తేడాతో కోల్పోవడంపై ఆసీస్పై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.చదవండి: అతడి కెప్టెన్సీలో టీమిండియా స్వేచ్ఛగా ఆడుతుంది -
ఆసీస్ జట్టులో విభేదాలు.. కారణం అతనే!
మెల్బోర్న్: ఆసీస్ జట్టులో విభేదాలు ఉన్నాయని.. దానికి కారణం ఆ జట్టు ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ అని సిడ్నీ హెరాల్డ్ ప్రతిక పేర్కొంది. కోచ్ వ్యవహారశైలితో ఆటగాళ్లు ఇబ్బందులకు గురవుతున్నారని.. దీంతో పాటు పలువురు సీనియర్ ఆటగాళ్లు లాంగర్ పట్ల అసంతృప్తిగా ఉన్నట్లుగా రాసుకొచ్చింది. ఈ విషయం తన దృష్టికి రావడంతో కోచ్ లాంగర్ స్పందించాడు. 'ఆటగాళ్లతో విభేదాలు ఉన్నాయన్న వార్తల్లో నిజం లేదు. అయినా ఇందులో నిజమెంతనేది నేను పట్టించుకోను. ఆటగాళ్లు తమ తిండి విషయాల్లో ఒకరు కావాలనుకుంటే నా పని నేను చేసినట్లు కాదు. ఇటీవలే టీమిండియాతో జరిగిన గబ్బా టెస్టులో మా ఆటగాడు సాండ్విచ్ తినడానికి మైదానంలోకి తీసుకువచ్చాడు. గత అనుభవాల దృష్యా ఆసీస్ ఆటగాళ్లపై నిరంతరం నిఘా ఉందని.. జేబులో ఏదైనా తీసుకెళ్తే అది ప్రమాదంగా మారే అవకాశం ఉందని.. తీసుకురావద్దని అతనికి చెప్పా. దీనిని కూడా తప్పే అంటే ఇంకేం చేయలేను.చదవండి: దుమ్మురేపిన పుజారా.. కోహ్లి మాత్రం అక్కడే ఇక బౌలింగ్ వ్యవహారాల్లో తలదూర్చకపోవడానికి కారణం ఉంది. బౌలింగ్ కోచ్ ఉన్నప్పుడు అతనే బౌలర్లను పర్యవేక్షిస్తాడు. పైగా నేనెప్పుడు బౌలర్ల సమావేశానికి హాజరుకాను.. కానీ కొన్ని నెలలుగా వాటిలో కూడా మార్పులు చోటుచేసుకోవడంతో దానిపై దృష్టి పెట్టాల్సి వచ్చిందంటూ' చెప్పుకొచ్చాడు. కాగా ఇప్పటికే టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్ను కోల్పోయిన ఆసీస్ జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా కోచ్ లాంగర్ వివాదం ఎక్కడికి తీసుకెళుతుందో వేచి చూడాలి. చదవండి: ఐపీఎల్లో ఆడేందుకు నేను సిద్ధం -
పాపం లాంగర్.. ఓడిపోయాకా తెలిసొచ్చినట్లుంది
బ్రిస్బేన్: గబ్బా వేదికగా ఆసీస్తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆసీస్ విధించిన 328 పరుగులు భారీ లక్ష్యాన్ని భారత్ 7 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ విజయంపై పలువురు మాజీ క్రికెటర్ల నుంచి టీమిండియాకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆసీస్ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ కూడా టీమిండియాను అభినందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. (అద్భుత విజయం : బీసీసీఐ భారీ నజరానా) 'ఈ మ్యాచ్లో విజయం సాధించేందుకు టీమిండియాకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఈరోజు భారత ఆటతీరు ఔట్ స్టాండింగ్ అనే చెప్పొచ్చు. ఈ ఓటమితో మాకు గుణపాఠం కలిగింది. 150 కోట్ల మంది బలమున్న టీమిండియాను ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదనేది ఈరోజే తెలిసొచ్చింది. కీలక ఆటగాళ్ల గైర్హాజరీలోనూ టీమిండియా అద్బుత ప్రదర్శనతో 2-1 తేడాతో సిరీస్ను ఎగురేసుకుపోయింది. ఏది ఏమైనా ఇండియా-ఆసీస్ టెస్టు సిరీస్ మాత్రం మరుపురానిదిగా నిలిచిందనడంలో సందేహం లేదు.. మ్యాచ్ల్లో గెలుపోటములు అనేవి సహజం.. ఈ విజయంతో టెస్టు క్రికెట్కున్న విలువేంటో మరోసారి కనిపించింది. (చారిత్రాత్మక విజయం : నీతా అంబానీ ప్రశంసలు ) రిషబ్ పంత్ లాంటి ఆటగాడు టీమిండియాకు దొరకడం అదృష్టం.. అసలు ఏ మాత్రం భయం అనేది లేకుండా పంత్ సాగించిన ఇన్నింగ్స్ చూస్తే.. ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్ హెడ్డింగేలో ఆడిన ఇన్నింగ్స్ను గుర్తుకు తెచ్చకునేలా చేసింది. శుబ్మన్ గిల్ కూడా మంచి బ్యాటింగ్ కనబరిచాడు. కీలక సమయంలో మంచి ఇన్నింగ్స్ ఆడిన గిల్కు టెస్టు క్రికెట్లో మంచి భవిష్యత్తు ఉంది.'అని చెప్పుకొచ్చాడు. లాంగర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. టీమిండియా మ్యాచ్ గెలిచాకా లాంగర్కు విషయం అర్థమయినట్లుంది అంటూ కామెంట్స్ జతచేశారు. 🗣 "Pant's innings reminded me a bit of Ben Stokes at Headingley actually. 🗣 "You can never take anything for granted. Never ever underestimate the Indians." - Justin Langer talks to @haydostweets about the series #AUSvIND pic.twitter.com/lnbnjqWjmg — 7Cricket (@7Cricket) January 19, 2021 -
ఇదంతా ఐపీఎల్ వల్లే జరిగింది
బ్రిస్బేన్: ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్, టీమిండియాల మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో ఇరు జట్ల ఆటగాళ్లు గాయపడడం వెనుక ప్రధాన కారణం ఐపీఎల్ అని లాంగర్ పేర్కొన్నాడు. ఎప్పుడు సమయానికి జరిగే ఐపీఎల్ గతేడాది కరోనాతో ఆలస్యంగా ప్రారంభకావడంతోనే ఆటగాళ్లు గాయాలతో సతమతమవుతున్నారని తెలిపాడు. అయితే తాను ఐపీఎల్ను తప్పు బట్టడం లేదని.. కేవలం ఐపీఎల్ ప్రారంభించిన సమయాన్ని మాత్రమే తప్పుబడుతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. (చదవండి: పాపం పకోవ్స్కీ.. మళ్లీ ఔట్!) మూడో టెస్టు అనంతరం ఆసీస్ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడాడు. 'ఈసారి ఆసీస్, టీమిండియాల మధ్య జరుగుతున్న సిరీస్ నాకు కాస్త విచిత్రంగా కనిపిస్తుంది. వన్డే సిరీస్తో మొదలైన గాయాల బెడద ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మొదట మా జట్టు ఆటగాళ్లు గాయాల బారీన పడగా.. ఇప్పుడు టీమిండియా వంతు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. వన్డే సిరీస్, టీ20 సందర్భంగా మా జట్టు తరపున డేవిడ్ వార్నర్, మార్కస్ స్టొయినిస్లు గాయపడగా.. టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే కామెరాన్ గ్రీన్, విల్ పకోవ్స్కీ లాంటి వారు గాయాలతో ఇబ్బంది పడ్డారు. (చదవండి: 'ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కేందుకు నేను సిద్ధం') తాజాగా టెస్టు సిరీస్ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లలో షమీ మొదలుకొని ఉమేశ్, జడేజా, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రాలు గాయపడ్డారు. దీంతో పాటు తొడ కండరాలు పట్టేయడంతో టీమిండియా కీలక స్పిన్నర్ అశ్విన్ నాలుగో టెస్టుకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా ఐపీఎల్ వల్లే జరిగింది. ఐపీఎల్ ఆలస్యంగా జరగడం వల్లే ఇలా జరిగిందనేది నా అభిప్రాయం. ఇలాంటి పెద్ద సిరీస్కు ముందు ఐపీఎల్ సరికాదు. ఐపీఎల్ అంటే నాకూ ఇష్టమే. ఇంగ్లిష్ కౌంటీ ఎలాగైతే ప్లేయర్స్కు ఉపయోగపడేదో.. ఇప్పుడు ఐపీఎల్ కూడా అంతే ' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఇరు జట్ల మధ్య జనవరి 15 నుంచి బ్రిస్బేన్ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. -
ఆ స్థానంలో నన్ను ఊహించుకోలేను: ఆసీస్ కోచ్
సిడ్నీ: చెత్త ప్రదరర్శన కారణంగా ప్రత్యర్థి జట్టు ఎదుర్కొంటున్న బాధను అర్థం చేసుకోగలనని, అయితే వారి కోచ్ స్థానంలో మాత్రం తనను ఊహించుకోలేనని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ అన్నాడు. ప్రస్తుతం టీమిండియాపై ఒత్తిడి ఉందని, అది తమ జట్టుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. క్రిస్మస్ వీకెండ్ను తాము సంతోషంగా గడుపుతామని చెప్పుకొచ్చాడు. కాగా ఆసీస్తో అడిలైడ్లో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయం మూటగట్టుకున్న విషయం తెలిసిందే. పింక్ బాల్ టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో 36 పరుగులకే ఆట ముగించి చెత్త రికార్డు నమోదు చేసింది. ఇక ఇన్నింగ్స్లో ఒక్క ఆటగాడు కూడా డబుల్ డిజిట్ దాటకపోవడం 96 ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే తొలిసారి కావడంతో కోహ్లి సేనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అదే విధంగా టీమిండియా కోచ్ రవిశాస్త్రి ఇందుకు బాధ్యత వహిస్తూ తన పదవి నుంచి వైదొలగాలంటూ నెటిజన్లు మండిపడ్డారు. అతడిపై విమర్శలు గుప్పించారు. కాగా సోని నెట్వర్క్ నిర్వహించిన వర్చువల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న లాంగర్కు ఈ అంశం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. రవిశాస్త్రి స్థానంలో మీరుంటే ఏం చేసేవారు అని అడుగగా.. ‘‘అసలు ఆ విషయంతో నాకు సంబంధం లేదు. ఇప్పటికే నాకున్న ఒత్తిళ్లు చాలు. అయితే వారి బాధను నేను సహానుభూతి చెందగలను. ఇక ఇప్పుడు టీమిండియాపై ఒత్తిడి ఉందనేది వాస్తవం’’ అని పేర్కొన్నాడు. (చదవండి: టీమిండియా మా రికార్డును బ్రేక్ చేసింది: అక్తర్) వాళ్లిద్దరూ లేకపోవడం మంచిదే ఇక కోహ్లి, షమీ గైర్హాజరీ తమకు లాభిస్తుందన్న లాంగర్.. తదుపరి మ్యాచ్కు తాము పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నామని తెలిపాడు. ‘‘ఏ ఆటలోనైనా స్టార్లు లేకుంటే ప్రత్యర్థి జట్టుకు ఉపయోగకరమే కదా. విరాట్ కోహ్లి గొప్ప ఆటగాడు. షమీ కూడా మంచి ప్లేయర్. వాళ్లు లేకపోవడం మాకు సానుకూలాంశమే. ఇక రెండో టెస్టులో మొదటి రోజు నుంచే రహానే(తాత్కాలిక కెప్టెన్)పై ఒత్తిడి పెంచుతూ ముందుకు సాగుతాం’’ అని పేర్కొన్నాడు. -
రబ్బిష్.. కోహ్లిని మేమెందుకు తిడతాం
అడిలైడ్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని ఎలా అవుట్ చేయాలనే దానిపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు ఆసీస్ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ అభిప్రాయపడ్డాడు. డిసెంబర్ 17 నుంచి అడిలైడ్ వేదికగా తొలి డే నైట్ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా ఆసీస్ కోచ్ లాంగర్ విరాట్ కోహ్లిని కట్టడి చేయడంతో పాటు టీమిండియాపై అమలు చేయనున్న ప్రణాళికలను వెల్లడించాడు. (చదవండి : టెస్ట్ చాంపియన్ షిప్ : నెంబర్ 1 ఆసీస్) 'ఇంకో మూడు రోజుల్లో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. టీమిండియాపై గెలిచేందుకు మా ప్రణాళికలను రచించుకుంటున్నాం. ఇందులో భాగంగానే విరాట్ కోహ్లిని ఎలా అవుట్ చేయాలనే దానిపై చర్చించుకున్నాం. అంతేకాని కోహ్లిని తిట్టడం వాటి గురించి మేమెందుకు మాట్లాడతాం..ఇదంతా రబ్బిష్. మేము కేవలం అతని నైపుణ్యంపైనే దెబ్బతీస్తాం తప్ప.. ఎమోషన్స్తో ఆడుకోం. మాకు ఎమోషన్స్ ఉంటాయి.. వాటిని కంట్రోల్ చేసుకొని ముందుకు సాగుతాం. కోహ్లిలో గొప్ప ఆటగాడే కాదు మంచి నాయకత్వ లక్షణాలు కూడా ఉన్నాయి. కోహ్లి టీమిండియాకు చాలా విలువైన ఆటగాడు.. ఫాంలో ఉన్నాడంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. నాకు అతనిపై చాలా గౌరవం ఉంది. కానీ అతన్ని అవుట్ చేస్తేనే మా పని సులువుగా జరిగిపోతుంది. కోహ్లి ఒక్క టెస్టు మ్యాచ్కు మాత్రమే అందుబాటులో ఉంటాడన్న విషయం తెలుసు.. అందుకే ఎలా అవుట్ చేయాలన్న దానిపై ఆలోచిస్తున్నాం'అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఆసీస్తో జరిగే మొదటి టెస్టు తర్వాత స్వదేశానికి వెళ్లిపోనున్న సంగతి తెలిసిందే. పెటర్నిటీ సెలవులపై స్వదేశానికి వెళ్లనున్న కోహ్లి స్థానంలో అజింక్యా రహానే మిగిలిన టెస్టులకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. (చదవండి : కొట్టేస్తా... ఏమనుకున్నావ్!) -
పాండ్యా ఇప్పుడు ధోనిలా కనిపిస్తున్నాడు
సిడ్నీ : టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాపై ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తరహాలోనే హార్దిక్ కూడా చివరి వరకు క్రీజులో నిలబడి జట్టును గెలిపిస్తూ మంచి ఫినిషర్గా పేరు సంపాదించాడు. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. హార్దిక్ 22 బంతుల్లో 42 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ విజయంతో సిరీస్ నెగ్గిన టీమిండియా వన్డే సిరీస్ ఓటమికి బదులు తీర్చుకుంది. (చదవండి : ఏబీ ఎలా స్పందిస్తాడో చూడాలి : కోహ్లి) మ్యాచ్ ముగిసిన అనంతరం ఆసీస్ కోచ్ లాంగర్ మాట్లాడుతూ... ' ఆసీస్తో జరిగిన రెండో టీ20లో టీమిండియా అద్భుతంగా ఆడింది. మ్యాచ్ గెలవడంలో హార్దిక్ కీలకపాత్ర పోషించాడు. పాండ్యా ఎంత ప్రమాదకారే నాకు ముందే తెలుసు. అయితే ధోని తరహాలో హార్దిక్ మంచి ఫినిషర్గా మారుతున్నాడు. గతంలో ధోనీ కూడా ఇలాగే మ్యాచ్లను గెలిపించాడు. భారత్ విజయానికి చివరి 12 బంతుల్లో 25 పరుగులు అవసరమైన దశలో నాన్స్ట్రైక్ ఎండ్లో శ్రేయాస్ అయ్యర్ ఉన్నప్పటికీ.. హార్దిక్ తానే పూర్తిగా బాధ్యత తీసుకున్నాడు. ధోనీ తరహాలోనే లెక్కలు వేసుకుని మరి బంతులను బాదాడు.' అని చెప్పుకొచ్చాడు. (చదవండి : 'తన కెరీర్ను తానే నాశనం చేసుకున్నాడు') -
అలా ప్రవర్తిస్తే సహించేది లేదు: ఆసీస్ కోచ్
సిడ్నీ: స్లెడ్జింగ్ పేరిట హద్దులు దాటి ప్రవర్తిస్తే సహించే ప్రసక్తే లేదని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ తమ ఆటగాళ్లకు స్పష్టం చేశాడు. మ్యాచ్ మధ్యలో సరదా సంభాషణలకు చోటు ఉంటుందని, పోటీతత్వంతో ముందుకు సాగాలే తప్ప అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నాడు. కాగా ఆస్ట్రేలియా జట్టు అంటేనే స్లెడ్జింగ్కు పెట్టింది పేరన్న సంగతి తెలిసిందే. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ల దృష్టి మరల్చేందుకు మాటల యుద్ధానికి దిగుతూ వారిని మానసికంగా దెబ్బకొట్టడం ఆసీస్ క్రికెటర్లకు వెన్నతో పెట్టిన విద్య. ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడటం ద్వారా గతంలో వారు అనేక విజయాలు తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో బాల్ టాంపరింగ్ వివాదం తర్వాత ఆసీస్ ఆటగాళ్లు కాస్త దూకుడు తగ్గించారు.(చదవండి: ఓపెనర్గా అతడే సరైన ఆప్షన్: సచిన్) కాగా ప్రస్తుతం టీమిండియా సుదీర్ఘ ఆసీస్ పర్యటన నేపథ్యంలో జస్టిన్ లాంగర్ ఈ విషయం గురించి విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘గత రెండేళ్లుగా ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయో మీరు గమనించవచ్చు. మైదానం లోపల, వెలుపల మా ఆటగాళ్ల ప్రవర్తన ఎలా ఉందో చూస్తునే ఉన్నాం. ఇక ఇప్పుడు కూడా సరదా సంభాషణలకు, పరిహాసాలకు చోటు ఉంటుందేమో గానీ, అసభ్య దూషణలకు దిగితే ఊరుకునే ప్రసక్తే లేదు’’ అని చెప్పుకొచ్చాడు. ఇక 2018-19 నాటి భారత పర్యటనలో ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పెన్- టీమిండియా సారథి కోహ్లి మధ్య జరిగిన వాగ్యుద్ధం గురించి ప్రస్తావిస్తూ.. ‘‘కోహ్లి వ్యవహారశైలిని మేమెంతగానో ప్రేమిస్తాం. అందులో హాస్య చతురతే తప్ప, అంతగా తప్పుబట్టాల్సిన విషయమేదీ లేదు. నిజానికి ఆసీస్- ఇండియా సిరీస్ అంటే ప్రేక్షకులకు మంచి వినోదం లభిస్తుంది. ముఖ్యంగా కరోనా సమయంలో మజాను పంచుతుంది. ఆర్థికంగా కూడా టీమిండియా టూర్ ఇప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియాకు ఎంతగానో అవసరం’’ అని పేర్కొన్నాడు. ఇక యువ ఆటగాడు విల్ పుకోవ్స్కీను జట్టులోకి తీసుకునే అంశం గురించి లాంగర్ మాట్లాడుతూ.. ‘‘అమోఘమైన ప్రతిభ అతడి సొంతం. అవకాశం వచ్చినప్పుడు కచ్చితంగా అతడు టెస్టు తుదిజట్టులోకి వస్తాడు. అది ఈ సిరీస్లోనైనా లేదా వచ్చే సిరీస్లోనైనా కావొచ్చు’’ అని అతడి అరంగేట్రంపై సంకేతాలు ఇచ్చాడు. కాగా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్ కోసం టీమిండియా ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్న సంగతి తెలిసిందే.(చదవండి: కోహ్లి దూరం: ఆ చాన్స్ కొట్టేస్తే లక్కీయే!) -
కోహ్లి లేకపోతే టీమిండియాకు కష్టమే
మెల్బోర్న్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి గైర్హాజరీ ఆ జట్టుపై పెను ప్రభావం చూపిస్తుందని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ అన్నాడు. అయితే తండ్రి కాబోతున్న సమయంలో సెలవు తీసుకోవాలనే అతని నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని చెప్పాడు. ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో వచ్చే నెలలో ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీ టెస్టు సిరీస్ మొదలవుతుంది. నాలుగు టెస్టుల పూర్తి స్థాయి సిరీస్లో కోహ్లి కేవలం తొలి టెస్టుకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాడు. తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ డెలివరీ కోసం అతను స్వదేశానికి పయనమవుతాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ హెడ్కోచ్ లాంగర్ మాట్లాడుతూ ‘నా జీవితంలో నేను చూసిన అత్యుత్తమ ఆటగాడు కోహ్లి. ఒక్క బ్యాటింగ్లోనే కాదు... శక్తిసామర్థ్యాలు, క్రికెట్ కోసం కష్టపడే తత్వం, ఫిట్నెస్ స్థాయి ఇవన్నీ చూసి చెబుతున్నా. మ్యాచ్లో రాణించేందుకు అతను కనబరిచే పట్టుదల అద్భుతం. ప్రతీసారి అతనికి ఇదెలా సాధ్యమవుతుందో నాకు అంతుబట్టడం లేదు. అందుకే కోహ్లి అంటే నాకెంతో గౌరవం. అలాగే ఇప్పుడు కుటుంబం కోసం తను తీసుకున్న నిర్ణయాన్ని కూడా నేను గౌరవిస్తాను’ అని అన్నారు. ఆటగాళ్లు కెరీర్తో పాటు కుటుంబానికి సమయమివ్వాలని చెప్పారు. అతను లేకపోవడం భారత జట్టుకు పూడ్చలేని లోటేనని, ఇది జట్టుపై తప్పకుండా ప్రభావం చూపిస్తుందని లాంగర్ వివరించారు. అయితే గత పర్యటన (2018–19)లో ఆసీస్ను ఓడించిన భారత్ను విరాట్ ఉన్నా లేకపోయినా తక్కువ అంచనా వేయబోమని, టీమిండియా పటిష్టమైన జట్టని విశ్లేషించారు. సుదీర్ఘ పర్యటన కోసం ఇప్పటికే టీమిండియా ఆసీస్కు చేరింది. ప్రస్తుతం కరోనా ప్రొటోకాల్ పాటిస్తున్న భారత జట్టు, క్వారంటైన్ పూర్తవగానే నవంబర్ 27న తొలి వన్డే ఆడుతుంది. -
కోహ్లి నేను చూసిన బెస్ట్ క్రికెటర్: లాంగర్
మెల్బోర్న్ : ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ భారత క్రికెట్ జట్టు సారధి విరాట్ కోహ్లిపై ప్రశంసల జల్లు కురిపించారు. కోహ్లిపై తనకు ఎంతో గౌరవం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాంగర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నా జీవితంలో నేను చూసిన బెస్ట్ క్రికెటర్ విరాట్ కోహ్లి. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. కేవలం బ్యాటింగ్ మాత్రమే కాదు, అతడి ఎనర్జీ, ఆట పట్ల మక్కువ.. ఫీల్డింగ్ చేసే విధానం ఇవన్నీ. అతడిపై గౌరవం కలగడానికి తాజాగా తీసుకున్న ఆ నిర్ణయం( అనుష్క డెలివరీ సమయానికి ఇండియాకి వెళ్లాలనుకోవటం) కూడా కారణం. మనలాగే అతడు కూడా ఓ సాధారణ మనిషి. ( కృనాల్ పాండ్యా నిర్బంధం ) నేనెవరికైనా సలహా ఇవ్వాలనుకుంటే.. మీ పిల్లల పుట్టుకను మిస్ చేసుకోకండని కచ్చితంగా చెబుతాను. ఎందుకంటే అది మన జీవితంలో ఎంతో గొప్పది’’ అని ఆయన పేర్కొన్నారు. కాగా, కోహ్లి భార్య అనుష్క శర్మ జనవరి నెలలో మొదటి బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 21న ముగియనున్న అడిలైడ్ ఓపెనింగ్ టెస్ట్ తర్వాత ఆస్ట్రేలియానుంచి కోహ్లి ఇంటి ముఖం పట్టనున్నాడు. ఒక వేళ ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చినట్లయితే 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సి వస్తుంది. దీంతో చివరి మూడు టెస్టులకు అతడు దూరం అయ్యే అవకాశం ఉంది. -
‘ఇక టీమిండియాను ఓడించడమే లక్ష్యం’
మెల్బోర్న్: అంతర్జాతీయ టెస్టు ర్యాంకింగ్స్లో టీమిండియాను వెనక్కినెట్టి ఆస్ట్రేలియా టాప్ను కైవసం చేసుకోవడంతో ఆ జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ ఆనందం వ్యక్తం చేశాడు. 42 నెలలు పాటు టాప్లో కొనసాగిన టీమిండియా స్థానాన్నిఆసీస్ దక్కించుకోవడం తమ జట్టు సమష్టి కృషికి నిదర్శమన్నాడు. ప్రస్తుతం తమ ముందున్న టార్గెట్ టీమిండియాను వారి గడ్డపై ఓడించడమేనని పేర్కొన్నాడు. భారత్ను వారి స్వదేశంలో ఓడించడం అత్యంత కఠినమని ఈ సందర్భంగా లాంగర్ తెలిపాడు. తాము పర్యటించిన దేశాల్లో భారతే క్లిష్టమనదిగా స్పష్టం చేశాడు. దాంతో భారత్ను వారి దేశంలో ఓడించి తమకు తిరుగులేదని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. తమ జట్టు అగ్రస్థానానికి ఎగబాకడంతో అందరి ముఖాల్లో నవ్వులు కనిపిస్తున్నాయన్నాడు. కాగా, తమ అంతిమ లక్ష్యం మాత్రం వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ను గెలవడమేనన్నాడు. (టీమిండియా ‘అతి పెద్ద’ రికార్డుకు బ్రేక్) ఈ టైటిల్ గెలవాలంటే భారత్ను వారి దేశంలో ఓడించడమే కాకుండా, తమ దేశంలో కూడా ఓడించాల్సి ఉందన్నాడు. మనం మెరుగైన జట్టు అని నిరూపించుకోవాలంటే పటిష్టమైన జట్టును ఓడించడమే ఒక్కటే మార్గమన్నాడు. శుక్రవారం విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో ఆసీస్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆస్ట్రేలియా 116 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకోగా, న్యూజిలాండ్ 115 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక టీమిండియా టీమిండియా 114 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది. 2016 అక్టోబర్లో అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్న టీమిండియా.. ఇప్పటివరకూ ఆ స్థానాన్ని పదిలంగా ఉంచుకుంది. 2016-17 సీజన్లో 12 టెస్టుల్లో విజయం సాధించిన టీమిండియా.. కేవలం ఒక టెస్టులో మాత్రమే ఓటమి పాలైంది. ఫలితంగా ఆ సీజన్లో టాప్ ర్యాంకును కైవసం చేసుకుంది. సుదీర్ఘ కాలం ఆ ర్యాంకులో కొనసాగి గదను సగర్వంగా అందుకుంది. అయితే వార్షిక లెక్కల ప్రకారం 2019 మే నుంచి ఫలితాల్ని పరిగణిస్తారు. ఈ తాజా విజయాలకు 100 శాతం పాయింట్లు, గత రెండేళ్లకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు. దీంతో ఆసీస్ ముందంజ వేయగా... భారత్ మూడో స్థానానికి పడిపోక తప్పలేదు. (బీసీసీఐ... ప్రకటించిన నజరానా ఇవ్వండి) -
అదో మేలుకొలుపు
సిడ్నీ: భారత టెస్టు క్రికెట్ చరిత్రలో చిరకాలంగా పూర్తి కాని లక్ష్యాలలో ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ గెలవడం ఒకటి. అయితే కోహ్లి సేన గత పర్యటనలో (2018–19) దీనిని చేసి చూపించింది. 2–1తో సిరీస్ నెగ్గిన టీమిండియా ఈ ఘనత సాధించిన తొలి భారత జట్టుగా నిలిచింది. సహజంగానే ఈ ఫలితం ఆసీస్ జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ను అమితంగా బాధించింది. తన కెరీర్లో విపరీతంగా బాధపడే క్షణాలలో ఇది ఒకటని అతను చెప్పుకున్నాడు. 2018 మార్చిలో బాల్ ట్యాంపరింగ్ ఉదంతం అనంతరం లాంగర్ జట్టు కోచ్గా బాధ్యతలు చేపట్టగా... ప్రధాన ఆటగాళ్లు స్మిత్, వార్నర్ లేకుండానే ఆసీస్ బరిలోకి దిగింది. ‘నా కోచింగ్ కెరీర్లో ఈ పరాజయం పెద్ద దెబ్బ. ఇది ఎప్పటికీ నన్ను వెంటాడుతుంది. నిజంగా నా జీవితంలో అది కఠిన సమయం. ఇంకా చెప్పాలంటే ఈ ఓటమి అందించిన కుదుపు మాకు మేలుకొలుపులాంటిది. ఆటగాడిగా 2001 యాషెస్ సిరీస్ ఆరంభంలో నన్ను తుది జట్టు నుంచి తప్పించినప్పుడు ఎంతగా బాధపడ్డానో ఇప్పుడు అదే తరహాలో బాధకు గురయ్యాను. అయితే నాడు యాషెస్ తర్వాత నా కెరీర్ అద్భుతంగా సాగింది. ఇప్పుడు కూడా అంతే. కఠిన పరిస్థితుల నుంచే మనం పాఠాలు నేర్చుకుంటాం’ అని లాంగర్ అభిప్రాయపడ్డాడు. -
టీమిండియాతో ఓడిపోవడమే..
మెల్బోర్న్: 2018-19 సీజన్లో ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లి సారథ్యంలోని టీమిండియా 2-1తో సిరీస్ను సాధించింది. ఫలితంగా ఆస్ట్రేలియాపై వారి దేశంలో తొలిసారి టెస్టు సిరీస్ను గెలిచి కోహ్లి సేన కొత్త చరిత్ర నెలకొల్పింది. అయితే ఆసీస్ స్వదేశంలో సిరీస్ ఓడిపోవడం తనకు ఒక పెద్ద గుణపాఠమని అంటున్నాడు ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్. (లాక్డౌన్ ముగిస్తే నేను ఇంటికి రానే రాను) తన కోచింగ్ కెరీర్ తొలినాళ్లలో ఎదురైన అనుభవాలను లాంగర్ షేర్ చేసుకున్నాడు. 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్లు ఏడాది పాటు నిషేధానికి గురి కాగా, అదే సమయలో లాంగర్ కోచింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. అప్పటివరకూ లీమన్ కోచ్గా ఉండగా ఆ స్థానంలో లాంగర్కు పర్యవేక్షణ బాధ్యతలు అప్పచెప్పారు. ఆ తర్వాత టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్ను ఆసీస్ సొంత గడ్డపై కోల్పోవడం ఒక మేలుకొలుపు లాంటిదని లాంగర్ అభివర్ణించాడు. తాను కోచ్గా పటిష్టంగా మారడానికి భారత్తో సిరీస్ను కోల్పోవడమే ప్రధాన కారణమన్నాడు. ‘భారత్ చేతిలో సిరీస్ ఓటమి..నా జీవితంలో చాలా క్లిష్టమైన సమయం. సొంతగడ్డపై పరాజయం కోచింగ్ కెరీర్లో నాకో మేలుకొలుపు లాంటిది. ఇంకో పదేండ్ల తర్వాత ఒక్కసారిగా వెనుతిరిగి చూసుకుంటే నా కెరీర్ ఎలా మొదలైందో చూసుకోవచ్చు. దీనికి తోడు 2001లో నన్నుజట్టు నుంచి తప్పించారు. 31 ఏండ్ల వయసులో ఇక నా పని అయిపోయిందనుకున్నా. క్లిష్టమైన పరిస్థితులే జీవితంలో ఎలా నిలదొక్కుకోవాలో నేర్పిస్తాయి. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న కరోనా వైరస్ సమస్యను చూడండి. ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది. మనం పాఠాలు నేర్చుకుని ఎలా గాడిన పడాలనేది గుర్తిస్తే.. అద్భుతమైన వ్యక్తిగా మారేందుకు అవకాశం లభిస్తుంది’లాంగర్ అన్నాడు. (కరోనా వ్యాక్సిన్ వచ్చాకే... మైదానాలకు వస్తాం!) -
సరైన సన్నాహకం ఐపీఎల్
సిడ్నీ: ఈ ఏడాది జరిగే టి20 ప్రపంచకప్కు సన్నద్ధమయ్యేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సరైన వేదిక అని ఆస్ట్రేలియా జట్టు హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ అభిప్రాయ పడ్డాడు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో లీగ్ గురించి ఏమీ చెప్పలేమని అతను అన్నాడు. ‘ప్రస్తుతం కోవిడ్–19 విజృంభిస్తుండటంతో ప్రణాళికలు మారిపోయాయి. ఇలాంటి సంక్షోభం రాకముందు మా ఆటగాళ్లంతా ఐపీఎల్లో ఆడాలని మేం కోరుకున్నాం. టి20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో సన్నద్ధతపరంగా చూస్తే ఐపీఎల్కు మించిన వేదిక మరేదీ లేదు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ఆటగాళ్ల ఆరోగ్యమే కాదు...మా దేశం, భారత్ కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది’ అని లాంగర్ వ్యాఖ్యానించాడు. తమ టి20 జట్టు పటిష్టంగా ఉందని, కొత్తగా సెలక్షన్పరంగా ఎలాంటి సమస్యలు లేవని అతను అన్నాడు. ‘ఒకటి, రెండు స్థానాలు మినహా మా టి20 జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం లేదు. అంతా కుదురుకొని ఉంది. దక్షిణాఫ్రికాపై మేం బాగా ఆడి సిరీస్ గెలిచాం’ అని ఆసీస్ కోచ్ అన్నాడు. -
‘మాకు ధోనిలాంటి ఫినిషర్ కావాలి’
మెల్బోర్న్: వన్డేలు, టి20ల్లో తమ జట్టుకు ఒక సరైన ఫినిషర్ అవసరం ఉందని ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ అభిప్రాయపడ్డాడు. అందుకు భారత స్టార్ ఎమ్మెస్ ధోని తరహా ఆటగాడైతే సరిగ్గా సరిపోతాడని అతను అన్నాడు. ‘గతంలో ఆస్ట్రేలియా జట్టుకు మైకేల్ బెవాన్, మైక్ హస్సీలాంటి వారు మ్యాచ్ను ముగించే బాధ్యతను సమర్థంగా నిర్వర్తించారు. ఇంగ్లండ్కు ఇప్పుడు బట్లర్ అలాంటి పని చేస్తున్నాడు. ఇక ఎమ్మెస్ ధోని అయితే ఈ విషయంలో మాస్టర్లాంటివాడు. ప్రపంచంలో ప్రతీ జట్టు ఇప్పుడు ఇలాంటి క్రికెటర్లను కోరుకుంటోంది’ అని లాంగర్ వ్యాఖ్యానించాడు. ఇక ఆస్ట్రేలియా జట్టులో ‘ఫినిషర్’గా తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఆటగాళ్లు పోటీ పడాలని కూడా కోచ్ సూచించాడు. గతంలో మార్కస్ స్టొయినిస్ను ఆసీస్ ప్రయత్నించినా అతను ఘోరంగా విఫలమయ్యాడు. -
'మాకు ధోని లాంటి ఫినిషర్ కావాలి'
సిడ్నీ : ఆసీస్ జట్టుకు పరిమిత ఓవర్లలో ఎంఎస్ ధోని లాంటి ఫినిషర్ ఉంటే బాగుంటుందని మాజీ ఆటగాడు, ప్రస్తుత ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ పేర్కొన్నాడు. ఇప్పుడు జట్టు మేనేజ్మెంట్ ధోనీ లాంటి ఫినిషర్ కోసమే వెతుకుందని అభిప్రాయపడ్డాడు. 'గతంలో మా జట్టులో మైక్ హస్సీ, మైఖేల్ బెవాన్ వంటి ఫినిషర్లు ఉండేవారు. అయితే బెస్ట్ ఫినిషర్గా మాత్రం ధోనిని మించిన వారు ఎవరు లేరు. ఎందుకంటే ఇప్పటికే ధోని ఎన్నోసార్లు అది రుజువు చేశాడు. ఉదాహరణకు 2011 ప్రపంచకప్ చూసుకుంటే మహీ నాలుగో స్థానంలో వచ్చి 90 పరుగులతో అజేయంగా నిలిచి టీమిండియాకు కప్ను అందించాడు. ఇంగ్లండ్ క్రికెట్లోనూ జాస్ బట్లర్ మంచి ఫినిషర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏది ఏమైనా ప్రసుత్తం మా జట్టుకు కూడా ధోని లాంటి ఫినిషర్ అవసరం ఉంది. జట్టు ఇన్నింగ్స్లో ఐదు, ఆరు స్థానాల్లో వచ్చే ఆటగాళ్లు మంచి ఫినిషర్లు అయి ఉండాలి.. అందుకోసం అన్వేషిస్తున్నాం' అంటూ లాంగర్ పేర్కొన్నాడు. (పాకిస్తాన్లో ధోని ఫీవర్!) కాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను ఆసీస్ ఆతిథ్య జట్టుకు క్లీన్స్వీప్తో సమర్పించేసుకుంది. కాగా సరైన ఫినిషర్ లేకనే జట్టు ఓటమి పాలయిందని పలువురు ఆసీస్ మాజీ క్రికెటర్లు తెలిపారు. అయితే ప్రొటీస్తో జరిగిన రెండు, మూడు వన్డేల్లో మిచెల్ మార్ష్ ఆరవ స్థానంలో వచ్చి 32, 36 పరుగులు సాధించాడు. తాజాగా మార్చి 13 నుంచి కివీస్తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. కాగా ఆసీస్ తరపున టెస్టు ఓపెనర్గా ప్రాతినిథ్యం వహించిన జస్టిన్ లాంగర్ 105 టెస్టుల్లో 7696 పరుగులు, 8 వన్డేల్లో 160 పరుగులు చేశాడు. కాగా మాథ్యూ హెడెన్తో కలిసి ఆసీస్కు టెస్టుల్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించి పెట్టాడు.(హోలీ శుభాకాంక్షలు తెలిపిన టీమిండియా క్రికెటర్లు) -
మా కోచ్ ఇడియట్ అన్నారు!
ఇటీవల ముగిసిన యాషెస్ సిరీస్లో భాగంగా చివరి టెస్టులో ఐదు వికెట్లతో సత్తాచాటిన ఆసీస్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్.. దేశవాళీ మ్యాచ్ల్లో భాగంగాడ్రెస్సింగ్ రూమ్లోని గోడకు పంచ్ ఇచ్చి గాయం బారిన పడ్డాడు. షెఫిల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు సారథిగా వ్యహరించిన మిచెల్ మార్ష్.. పెర్త్లో తస్మానియాతో జరిగిన మ్యాచ్ తర్వాత నిరాశకు గురయ్యాడు. ఆ మ్యాచ్ డ్రాగా ముగియడంతో కలత చెందిన మార్ష్ తన చేతిలో డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న గోడను గట్టిగా కొట్టాడు. అనంతరం గాయంతో విలవిల్లాడిపోయాడు. అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఈ క్రమంలోనే అతని చేతికి పలు స్కానింగ్లు చేసిన తర్వాత అతనికి మధ్య వేలు చిట్టినట్లు వైద్యులు తేల్చారు. దాంతో ఆరు వారాల విశ్రాంతి అనివార్యమైంది. అదే సమయంలో పాకిస్తాన్తో జరుగనున్న టెస్టు సిరీస్కు సైతం మార్ష్ దూరమయ్యాడు. తరచు గాయాల బారిని సాధ్యమైనన్ని ఎక్కువ అవకాశాలు దక్కించుకోవడంలో విఫలమవుతూ వస్తున్న మిచెల్ మార్ష్.. ఈసారి తన స్వీయ తప్పిదంతో సిరీస్లకు దూరం కావాల్సిన పరిస్థితి. ప్రస్తుతం క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ఎంపిక చేయబోయే జాబితాలో ఆల్ రౌండర్ కోటాలో ప్రధానంగా మార్ష్ పేరు వినిపించినా, అతను చేతికి చేసుకున్న గాయంతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. దీనిపై మార్ష్ మాట్లాడుతూ.. ‘ ఇదొక దురదృష్టకరమైన ఘటన. ఇది మళ్లీ జరగదు. ఈ గాయం నాకు ఒక గుణపాఠం నేర్పింది. మిగతావారికి కూడా ఇదొక పాఠమే అనుకుంటున్నా. నేను చేసుకున్న తప్పిదంతో మణికట్టు వద్ద చిట్లింది. నా మధ్య వేలి కింది భాగంలో పగులు వచ్చింది. మనం కొన్ని సందర్భాల్లో గెలుస్తాం. ఔట్లు కూడా అవుతాం. కానీ గోడకు పంచ్లు ఇవ్వొదు. నేను 18 నెలల నుంచి జాతీయ జట్టులో రాకకోసం యత్నిస్తున్నా. అలానే యాషెస్ సిరీస్లో అవకాశం వచ్చింది.. ఉపయోగించుకున్నా. కానీ నా తప్పిదం ఇప్పుడు నన్ను జట్టుకు దూరం చేసింది. మా కోచ్(ఆసీస్) జస్టిన్ లాంగర్ నన్ను ఒక ఇడియట్ అన్నారు. నేను ఇలా గాయం చేసుకోవడంతో లాంగర్ చాలా నిరుత్సాహ పడ్డారు. ఇందుకు నేను క్షమాపణలు చెప్పడం తప్ప చేసేదేమీ లేకపోయింది’ అని మార్ష్ వివరించాడు. -
‘నువ్వు ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు’
లండన్: ఐపీఎల్-12, ప్రపంచకప్-2019 హీరో డేవిడ్ వార్నర్ తాజాగా ముగిసిన యాషెస్ సిరీస్లో అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. పది యాషెస్ ఇన్నింగ్స్ల్లో కేవలం 95 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచాడు. వార్నర్ చెత్త ప్రదర్శన ఆసీస్పై తీవ్ర ప్రభావం చూపింది. యాషెస్ సిరీస్లో ఆసీస్ బ్యాటింగ్కు వెన్నుముకగా వార్నర్, స్టీవ్ స్మిత్లను భావించారు. అయితే స్మిత్ ఒంటరి పోరాటంతో ఆకట్టుకోగా.. వార్నర్ పేలవ ఫామ్తో ఆసీస్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే వార్నర్ చెత్త ప్రదర్శనపై ఫ్యాన్స్తో సహా ఆసీస్ మాజీ ఆటగాళ్లు మండిపడుతున్నారు. అయితే వార్నర్ను ఆ జట్టు ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ వెనకేసుకొచ్చాడు. ‘వార్నర్కు ఈ సిరీస్ కష్టతరంగా గడిచింది. అతడు చెత్త ప్రదర్శన చేసినప్పటికీ వార్నర్ ఎల్లప్పుడూ చాంపియన్ ప్లేయరే. తిరిగి ఫామ్ అందుకుంటాడని ఆశిస్తున్నా. చాంపియన్ ప్లేయర్స్ కూడా కొన్ని సార్లు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటారు. అంతమాత్రానా ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు’అంటూ లాంగర్ వివరించాడు. నిర్ణయాత్మకమైన ఐదో టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించడంతో ఆసీస్కు నిరాశ తప్పలేదు. దీంతో ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. అయితే గత యాషెస్ సిరీస్ను ఆసీస్ కైవసం చేసుకోవడంతో తిరిగి టైటిల్ను నిలబెట్టుకుంది. -
కోహ్లికి స్మిత్ ఏమాత్రం తీసిపోడు
బర్మింగ్హామ్: యాషెస్ తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీలు కొట్టిన స్టీవ్ స్మిత్ను ఆస్ట్రేలియా బ్యాటింగ్ కోచ్ జస్టిన్ లాంగర్ ఆకాశానికెత్తాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి స్మిత్ ఏమాత్రం తీసిపోడని అన్నాడు. స్పిన్నర్గా కెరీర్ ప్రారంభించిన స్మిత్... ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్మన్గా ఎదిగిన తీరును ప్రస్తావించాడు. తీవ్ర ఒత్తిడిలో చెక్కుచెదరని సంకల్పం, ధైర్యం, ఏకాగ్రతతో చేసిన తాజా సెంచరీలు స్మిత్ను మరో మెట్టు ఎక్కించాయన్నాడు. ఇది కేవలం గొప్ప ఆటగాళ్లకే సాధ్యమని లాంగర్ కొనియాడాడు. స్మిత్ను నెట్స్లోనూ ఔట్ చేయడం సాధ్యం కాదని... ఈ విషయం ఇంగ్లండ్ ఆటగాళ్లను అడిగితే చెబుతారని అన్నాడు. మూడో ర్యాంక్కు స్మిత్... స్టీవ్ స్మిత్ టెస్టు బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో టాప్ 3లోకి వచ్చాడు. తాజాగా ప్రకటించిన జాబితాలో అతడు 903 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. టీమిండియా వన్డౌన్ బ్యాట్స్మన్ చతేశ్వర్ పుజారా (881) నాలుగో స్థానానికి పడిపోయాడు. యాషెస్ తొలి టెస్టుకు ముందు స్మిత్ 857 పాయింట్లతో నాలుగో ర్యాంకులో ఉండటం గమనార్హం. ఈ జాబితాలో కోహ్లి (922 పాయింట్లు), కేన్ విలియమ్సన్ (913) తొలి రెండు స్థానాలను నిలబెట్టుకున్నారు. -
అప్పుడు కోహ్లి.. ఇప్పుడు స్మిత్
బర్మింగ్హమ్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అత్యుత్తమ బ్యాట్స్మెన్ అని గతంలో చెప్పానని, కానీ స్టీవ్ స్మిత్ తాజా ప్రదర్శన దానికి మించి ఉందని ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్లాంగర్ అభిప్రాయపడ్డాడు. ప్రతిష్టాత్మక యాషెస్ తొలి టెస్ట్లో ఆసీస్ మాజీ కెప్టెన్ స్మిత్ 144,142 వీరోచిత సెంచరీలతో ఆస్ట్రేలియాకు ఘన విజయాన్నందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్మిత్పై ఆసీస్ కోచ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ‘ వేసవికాలంలో విరాట్ కోహ్లి వంటి గొప్ప ఆటగాడిని ఎప్పుడూ చూడలేదన్నాను. కానీ స్మిత్ తాజా ఇన్నింగ్స్ ఆ స్థాయికి మించి ఉంది. సమకాలిన క్రికెట్లో ఒత్తిడిని జయిస్తూ 60 సగటుతో ఆడే స్మిత్లాంటి ఆటగాడిని ఇప్పటి వరకు చూసుండరు. ఇది కేవలం అతని నైపుణ్యం మాత్రమే కాదు. అపారమైన సాహసం, విశాలమైన వ్యక్తిత్వం, ధైర్యం, మొక్కవోని దీక్ష, శారీరక ధృడత్వం, మెంటల్ స్టామినా అన్ని కలగలివడం వల్లే ఇది సాధ్యమైంది.’ అని లాంగర్ స్మిత్ కొనియాడాడు. బాల్ ట్యాంపరింగ్ నిషేధం అనంతరం బరిలోకి దిగిన తొలి టెస్ట్లోనే స్మిత్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. చీటర్స్ అంటూ సాండ్ పేపర్స్తో ఎగతాళి చేసిన ఇంగ్లండ్ ప్రేక్షకులకు తన ఆటతోనే సమాధానమిచ్చాడు. -
‘సచిన్ను మళ్లీ మైదానంలో చూసినట్టుంది’
లండన్: ఏడాది నిషేధం తర్వాత ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి అడుగుపెట్టిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్పై ఆ జట్టు ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ ప్రశంసల జల్లు కురిపించాడు. బాల్ టాంపరింగ్ ఉదంతంతో ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన స్టీవ్ స్మిత్ ఐపీఎల్లో తన పునరాగమనాన్ని ఘనంగానే చాటాడు. ఐపీఎల్ అనంతరం ప్రపంచకప్పై దృష్టి పెట్టిన స్మిత్ నెట్స్లో తీవ్రంగా కష్టపడుతున్నాడు. ప్రపంచకప్ కోసం ఇప్పటికే ఇంగ్లండ్ చేరుకున్న ఆసీస్ జట్టు కఠోర సాధన చేస్తోంది. అయితే ప్రాక్టీస్లో భాగంగా స్మిత్ బ్యాటింగ్కు లాంగర్ ఫిదా అయ్యాడు. ఆసీస్ ఆటగాళ్ల ప్రాక్టీస్కు సంబంధించిన ఫోటోలను క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్లో పోస్ట్ చేసింది. స్మిత్ బ్యాటింగ్కు సంబంధించిన ఓ ఫోటోను షేర్ చేస్తూ.. స్మిత్ బ్యాటింగ్ చూస్తుంటే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గుర్తుకొస్తున్నాడంటూ లాంగర్ పేర్కొన్న కామెంట్ను జత చేసింది. ముఖ్యంగా కౌల్టర్నైల్ బౌలింగ్లో ఆడిన ఓ షాట్ సచిన్ను మైదానంలో మళ్లీ చూసినట్లుందని లాంగర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హలచల్ చేస్తున్నాయి. లాంగర్ కామెంట్స్కు సచిన్ ఫ్యాన్స్ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. -
‘అతనొక విధ్వంసకర ఆటగాడు’
హైదరాబాద్: గత కాలంగా పేలవ ఫామ్లో కొనసాగుతున్న ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ అరోన్ ఫించ్కు ఆ జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ మద్దతుగా నిలిచాడు. అరోన్ ఫించ్ త్వరలోనే తిరిగి గాడిలో పడతాడనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘అతనొక విధ్వంసకర ఆటగాడనే సంగతి మనకు తెలుసు. ప్రస్తుతం ఫించ్ ఫామ్ లేడు. కానీ అతను ఎంతో విలువైన ఆటగాడు. ఫామ్లో లేని అతనికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఫించ్ రాణించడం మొదలు పెడితే అతన్ని ఆపడం కష్టం. ఇక నాయకుడిగా కూడా ఫించ్ ఆకట్టుకుంటున్నాడు. జట్టులో ఎటువంటి తారతమ్యాలు లేకుండా ముందుకు తీసుకెళుతున్నాడు. అతనిది చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం’ అని లాంగర్ కొనియాడాడు.ఇక రెండో టీ20లో శతకం సాధించి ఆసీస్ సిరీస్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన మ్యాక్స్వెల్పై కూడా లాంగర్ ప్రశంసలు కురిపించాడు. తమకు మ్యాక్సీ చాలా కీలక ఆటగాడని, ఇటీవల కాలంలో అతని ఆట తీరులో మరింత నిలకడ పెరగడం ఆసీస్ జట్టుకు శుభపరిణామమన్నాడు. (ఇక్కడ చదవండి: కప్పుకు ముందు కంగారూ సన్నాహం) -
‘ధోనికి అవకాశం ఇవ్వడమే మా కొంప ముంచింది’
మెల్బోర్న్ : టీమిండియా సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనికి పలు అవకాశాలు ఇవ్వడం వల్లే తాము ఓడిపోయామని ఆస్ట్రేలియా జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘ఆసీస్ ఆటగాళ్లు సాయశక్తుల పోరాడారు. కానీ 2-1తో సిరీస్ కోల్పోయాం. టెస్ట్ సిరీస్లానే ఈ సిరీస్ను గెలిచే అవకాశాలను చేతులారా చేజార్చుకుని ఓడిపోయాం. గొప్ప ఆటగాళ్లకు ఎప్పుడూ అవకాశం ఇవ్వద్దు. కానీ మా ఆటగాళ్లు అదే చేశారు. రెండు సార్లు ధోనిని ఔట్ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నారు. ఇదే మా విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ సిరీస్లో మాకు కొన్ని సానుకూల అంశాలు కనిపించాయి. స్టోయినిస్ అద్భుతంగా రాణించాడు. ఈ సిరీస్ ద్వారా రిచర్డ్సన్ వెలుగులోకి వచ్చాడు. అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మిడిలార్డర్లో హ్యాండ్స్కోంబ్ ఆసాధారణ ప్రదర్శన కనబర్చాడు. షాన్ మార్ష్ సిరీస్ ఆసాంతం ఆకట్టుకున్నాడు. మాకు లభించిన అవకాశాలను అందుకోలేక ఓటమి పాలయ్యాం. మరోసారి ధోని అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అతని ప్రదర్శన బ్యాటర్స్ అందరికి ఓ మార్గదర్శకత్వంలాంటింది.’ అని చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిలో తనకు సచిన్ టెండూల్కర్ కనిపిస్తున్నాడని, అతను మైదానంలో 360 కోణంలో ఆడే షాట్స్ అద్భుతమని జస్టిన్ లాంగర్ కితాబిచ్చాడు. సచిన్ ఆటను ఎప్పుడూ ఆస్వాదించేవాడినని, ఈ సిరీస్లో విరాట్ ఆట చూస్తే అలానే అనిపించిందని ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లి, ధోని, రోహిత్ శర్మలు ఆల్టైం గ్రేట్ క్రికెటర్స్ అని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచి.. 2-1తో సిరీస్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన ధోని(87 నాటౌట్: 114 బంతులు,6 ఫోర్లు)కి ఆసీస్ ఆటగాళ్లు రెండు సార్లు అవకాశం ఇచ్చారు. తొలి బంతికే ధోని ఇచ్చిన సునాయస క్యాచ్ను మ్యాక్స్వెల్ జారవిడచగా.. మరోసారి అప్పిల్ చేయకుండా తగిన మూల్యం చెల్లించుకున్నారు. సిడిల్ వేసిన 39వ ఓవర్లో బంతి ధోని బ్యాట్కు ఎడ్జై కీపర్ అలెక్స్ క్యారీ చేతిలో పడింది. కానీ ఆసీస్ ఫీల్డర్లు పెద్దగా అప్పీల్ చేయకపోవడంతో ధోని బతికిపోయాడు. -
స్టీవ్ స్మిత్, బాన్క్రాఫ్ట్లపై మండిపడ్డ కోచ్
మెల్బోర్న్: తమ దేశ క్రికెట్ను కుదిపేసిన ట్యాంపరింగ్ వివాదం ముగిసిపోయిన అధ్యాయమని, మళ్లీ ఇప్పుడు దానిపై పదే పదే చర్చించుకోవడం అనవసరమైన సబ్జెక్ట్ అని ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ పేర్కొన్నాడు. ట్యాంపరింగ్ కారణంగా నిషేధం ఎదుర్కొంటున్న స్టీవ్ స్మిత్, బాన్క్రాఫ్ట్లు ఇటీవల మీడియాకు ముందుకొచ్చి తమకు ఏ తప్పు తెలియదంటూ మొత్తం నెపాన్ని డేవిడ్ వార్నర్పై నెట్టివేసే యత్నం చేశారు. ఆ ట్యాంపరింగ్ వివాదానికి డేవిడ్ వార్నరే కారణమంటూ ఫాక్స్స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇప్పటికే స్మిత్, బాన్క్రాఫ్ట్ల తీరును పలువురు మాజీలు తప్పుబట్టగా, తాజాగా కోచ్ లాంగర్ సైతం పెదవి విప్పాడు. ఒక చేదు జ్ఞాపకాన్ని వదిలేయకుండా ఒక సీరియల్ డ్రామాలా సాగదీస్తున్నారంటూ ధ్వజమెత్తాడు. స్మిత్, బాన్క్రాఫ్ట్ వ్యాఖ్యలు చూస్తే ఆ డ్రామాకు తానొక డైరక్టర్నా అనే భావన కలుగుతుందన్నాడు. ఆ ఇంటర్య్వూ తర్వాత మరొక చికాకును స్మిత్, బాన్క్రాఫ్ట్లు తెచ్చిపెట్టారంటూ మండిపడ్డాడు. ఇదిలా ఉంచితే, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్లు పునరాగమనం చేసే వరకు టిమ్ పైన్, అరోన్ ఫించ్లు తమ వేర్వేరు జట్లకు కెప్టెన్లగా కొనసాగుతారని లాంగర్ స్పష్టం చేశాడు. -
మీకే చెడ్డ పేరుంది: గావస్కర్ ఫైర్
అడిలైడ్: టీమిండియాతో మొదటి టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ ఓపెనర్ అరోన్ ఫించ్ క్లీన్ బౌల్డ్ రూపంలో వెనుదిరిగిన క్రమంలో విరాట్ కోహ్లి సంబరాలు చేసుకోవడం పట్ల ఆస్ట్రేలియా కోచ్ లాంగర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కోహ్లి అతి చేశాడంటూ వ్యాఖ్యానించాడు. అదే సమయంలో తమ జట్టు ఆటగాళ్లు విరాట్లా చేస్తే అత్యంత మొరటవాళ్లుగా క్రికెట్ ప్రపంచం పేర్కొంటుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తాజాగా దీనిపై సునీల్ గావస్కర్ మండిపడ్డాడు. ఇలాంటి వ్యాఖ్యలతో లాంగర్ సానుభూతి పొందలేడంటూ ఘాటుగా బదులిచ్చాడు. ‘విరాట్ అలా సంబరాలు చేసుకోవడం, నాకు తప్పుగా ఏం అనిపించలేదు. అది అతడికి ఆటపై ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తోంది. ఆసీస్ ఆటగాళ్లు దుర్భాషలాడుతూ సంబరాలు చేసుకుంటారు. అందుకే ఆస్ట్రేలియా జట్టుకు చెడ్డ పేరుంది. లాంగర్ సానుభూతి పొందడానికి ప్రయత్నిస్తున్నాడు. అలాంటిదేమీ జరగదు’ అని గావస్కర్ అన్నాడు. అంతకముందు లాంగర్ మాట్లాడుతూ.. ‘కోహ్లి ఒక సూపర్ స్టార్. అంతేకాదు ఓ జట్టుకు కెప్టెన్ కూడా. అలాంటి ఆటగాడు ఇలా ప్రవర్తించడం సరికాదు. మేం కూడా అలా చేస్తే, ప్రపంచం ముందు అత్యంత మొరటవాళ్లుగా మిగిలిపోతాం’ అంటూ కోహ్లిని ఎగతాళి చేస్తూ మాట్లాడాడు. దీనిపై ఇప్పటికే స్పందించిన వీవీఎస్ లక్ష్మణ్.. ‘ కోహ్లిపై ‘మొరటితనం’ వ్యాఖ్యలు మాని క్రికెట్పై దృష్టి పెడితే ఆసీస్కు మంచిదంటూ చురకలంటించాడు. (మేము కోహ్లిలా మొరటోళ్లం కాదు!) -
ఫించ్కే టీ20 పగ్గాలు
సిడ్నీ: ఆస్ట్రేలియా టీ20 జట్టు కెప్టెన్గా విధ్వంసక ఓపెనర్ ఆరోన్ ఫించ్ ఎన్నికయ్యాడు. ఈ నెల 24 నుంచి యూఏఈ వేదికగా పాకిస్థాన్తో జరగనున్న మూడు టీ20ల సిరీస్కు ఫించ్ సారథ్యం వహించనున్నాడు. తొలి సారి వినూత్నంగా ప్రయత్నించిన సెలక్షన్ కమిటీ ఇద్దరు వైస్ కెప్టెన్లను నియమించింది. దీంతో మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ వైస్ కెప్టెన్లుగా అవకాశం లభించింది. ఇటీవల జింబాబ్వేలో జరిగిన ముక్కోణపు సిరీస్లో కెప్టెన్సీతో ఆకట్టుకున్న ఫించ్పై పూర్తి నమ్మకం ఉందని కోచ్ జస్టిన్ లాంగర్ తెలిపాడు. ‘పొట్టి క్రికెట్లో ఫించ్ అత్యుత్తమ ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతను జట్టును ముందుండి నడిపించగలడు’ అంటూ ఫించ్ను కోచ్ లాంగర్ ప్రశంసలతో ముంచెత్తాడు. గాయాలతో గత సిరీస్కు దూరమైన క్రిస్ లిన్, కౌల్టర్నైల్ తిరిగి జట్టులోకి రాగా, యువ స్పిన్నర్ ఆడమ్ జంపా, బెన్ మెక్ డెర్మాట్ సైతం చోటు దక్కించుకున్నారు. -
స్లెడ్జింగ్ మంచిదే: ఆసీస్ కోచ్
లార్డ్స్ : స్లెడ్జింగ్తో తాము ఎంత నష్టపోయామో ఆస్ట్రేలియా జట్టుకు తెలిసిరానట్లుంది. గత దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న బాల్ట్యాంపరింగ్ ఉదంతానికి మూలం స్లెడ్జింగ్ అనే విషయాన్ని ఆసీస్ క్రికెటర్లు ఇంకా గుర్తించనట్లున్నారు. బాల్ ట్యాంపరింగ్తో ప్రపంచం ముందు తల వంచుకున్న ఆసీస్ జట్టు కీలక ఆటగాళ్లను దూరం చేసుకొవడమే కాకుండా కోచ్ డారెన్ లెహ్మెన్ సేవలను కోల్పోయింది. అతని స్థానంలో వచ్చిన నూతన కోచ్ జస్టిన్ లాంగర్ అయినా తమ ఆటగాళ్లు స్లెడ్జింగ్ పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటాడని అనుకుంటే ఆయన ఏకంగా స్లెడ్జింగ్ మంచిదే అని ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఏమన్నాడంటే.. ‘‘స్లెడ్జింగ్ చాలా మంచింది. కానీ శృతిమించకూడదు. స్లెడ్జింగ్ అంటే అందరు తిట్టుకోవడం అని భావిస్తారు. కానీ స్లెడ్జింగ్ ఓ పరిహాసం. ఆస్ట్రేలియాలో స్లెడ్జింగ్ సహజమైన విషయం. నా కూతురితో యూనో (కార్డ్ గేమ్) ఆడినప్పుడు ఇద్దరం ఒకరికొకరం స్లెడ్జ్ చేసుకుంటాం. నేను మా తల్లిదండ్రులతో గోల్ఫ్ ఆడినప్పుడు కూడా వారిని నేను. నన్ను వారు స్లెడ్జ్ చేస్తారు. గత ముప్పై ఏళ్లుగా ఆస్ట్రేలియన్స్ స్లెడ్జింగ్కు పాల్పడుతున్నారు’’. అని చెప్పుకొచ్చాడు. ఇక స్టీవ్ స్మిత్ స్థానంలో కెప్టెన్గా ఎంపికైన టీమ్ పెయిన్ సైతం మైదానంలో నిశబ్దంగా ఉండమని, మర్యాదకరమైన స్లెడ్జింగ్కు పాల్పడుతూ.. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టేస్తామని తెలిపాడు. అయితే కేవలం పరిహాసమే ఆడుతాం తప్పా.. వ్యక్తిగత దూషణలకు దిగమని చెప్పుకొచ్చాడు. ఇక లాంగర్ కామెంట్స్పై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: ఆస్ట్రేలియా.. పాంటింగ్ రీ ఎంట్రీ.! -
ఆస్ట్రేలియా.. పాంటింగ్ రీ ఎంట్రీ.!
సిడ్నీ : ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఆ జట్టు కోచింగ్ బృందంలో చేరనున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా 5 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్కు పాంటింగ్ సహాయ కోచ్గా సేవలందించనున్నాడు. తన మాజీ సహచర ఆటగాడు, ఆసీస్ నూతన కోచ్ జస్టిన్ లాంగర్తో కలిసి పాంటింగ్ పనిచేయనున్నాడు. ఈ విషయాన్ని జస్టిన్ లాంగరే ఓ ప్రకటనలో తెలిపాడు. ‘‘రికీ ఒక గొప్ప ఆటగాడు. కామెంటేటర్గా ఒప్పందాల నేపథ్యంలో ఇప్పటికే అతను ఇంగ్లండ్లోనే ఉన్నాడు. ముఖ్యమైన సిరీస్లకు ఆయన కోచింగ్ బృందంలో చేరడం చాలా మంచి విషయం. మ్యాచ్ పట్ల అతనికి ఉన్న అవగాహన, అనుభవం, మాకు కచ్చితంగా ఉపయోగపడుతోంది.’’ అని జస్టిన్ చెప్పుకొచ్చాడు. బాల్ట్యాంపరింగ్ ఉదంతం క్రికెట్ ఆస్ట్రేలియాను (సీఏ) అతలా కుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన పట్ల బాధ్యత వహిస్తూ మాజీ కోచ్ డారెన్ లెహ్మెన్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో జస్టిన్ను సీఏ నూతన కోచ్గా నియమించిన విషయం తెలిసిందే. తన సారథ్యంలో ఆసీస్కు మూడు సార్లు ప్రపంచకప్ అందించిన పాంటింగ్ తన కామెంటేటర్ ఒప్పందాలు నేపథ్యంలో జూన్ 10 నుంచి జట్టుతో చేరనున్నాడు. గతంలో కూడా పాంటింగ్ ఆసీస్ జట్టుకు అసిస్టెంట్ కోచ్గా వ్యవహరించాడు. గతేడాది శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్, ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్, ఇంగ్లండ్లతో జరిగిన ట్రై సిరీస్లకు సహాయ కోచ్గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఇక ఈ సీజన్ ఐపీఎల్లో ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టు హెడ్ కోచ్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. -
‘అతని స్థానంలో నేనున్నా మోసం చేసేవాడిని’
సిడ్నీ: ఇటీవలే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కొత్త కోచ్గా నియమితులైన జస్టిన్ లాంగర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆసీస్ క్రికెటర్ బాన్ క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్ వివాదాన్ని ప్రస్తావిస్తూ.. అతని స్థానంలో తానున్నా కచ్చితంగా మోసం చేసేవాడినన్నాడు. తాను ఆడే సమయంలో సీనియర్ క్రికెటర్లు మోసం చేయమని ఆదేశిస్తే అది తప్పకుండా చేసే వాడినని చెప్పాడు. దీనిలో భాగంగా అలెన్ బోర్డర్, స్టీవ్ వా, డేవిడ్ బూన్, ఇయాన్ హేలీ, బాబీ సింప్సన్ తదితరులతో డ్రెసింగ్ రూమ్ విషయాలని లాంగర్ షేర్ చేసుకున్నాడు. అలెన్ బోర్డర్ వంటి సీనియర్ ఆటగాళ్లు తనను కనుక బంతిని ట్యాంపరింగ్ చేయమని అడిగి ఉంటే యువ ఆటగాడిగా తాను ఆ పని చేసి ఉండేవాడినని పేర్కొన్నాడు. అయితే ట్యాంపరింగ్ అంటే బోర్డర్కు కూడా భయమేనని, అలా చేయడానికి ఆయన ఎప్పుడూ ఇష్టపడలేదన్నాడు. ఇక ట్యాంపరింగ్ పాల్పడిన ఏ ఆటగాడ్ని క్షమించే గుణం బాబీ సింప్సన్కు లేదన్నారు. కొన్ని నెలల క్రితం దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లో బాల్ ట్యాంపరింగ్ ఘటనలో డేవిడ్ వార్నర్ అడగడంతో బాన్ క్రాఫ్ట్ బంతిని ట్యాంపర్ చేసిన సంగతి తెలిసిందే. నూతన కోచ్ లాంగర్ చేసిన వ్యాఖ్యలు.. వార్నర్, స్మిత్ల వ్యవహార శైలిని పరోక్షంగా తప్పుబడుతున్నట్లు ఉండగా, క్రాఫ్ట్కు మద్దతుగా ఉన్నాయి. -
ఆస్ట్రేలియా ప్రధాన కోచ్గా జస్టిన్ లాంగర్ ఎంపిక
-
ఆస్ట్రేలియా కోచ్గా లాంగర్
సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోచ్ స్థానాన్ని మరో మాజీ ఆటగాడు భర్తీ చేశాడు. వచ్చే నాలుగేళ్ల కాలానికి కోచ్గా జస్టిన్ లాంగర్ను నియమిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. బాల్ ట్యాంపరింగ్ వివాదం తర్వాత పదవి నుంచి తప్పుకున్న డారెన్ లీమన్ స్థానంలో 47 ఏళ్ల లాంగర్ను ఎంపిక చేశారు. లీమన్ తప్పుకున్న తర్వాత కోచ్గా లాంగర్ పేరు ప్రముఖంగా వినిపించగా... అతని నియామకాన్ని గురువారం అధికారికంగా ఖరారు చేశారు. జూన్ 13 నుంచి ఇంగ్లండ్తో జరిగే ఐదు వన్డేల సిరీస్ కోచ్గా లాంగర్కు తొలి పర్యటన కానుంది. ఆసీస్ జట్టుతో కోచింగ్కు సంబంధించి లాంగర్కు గతానుభవం ఉంది. టిమ్ నీల్సన్, మికీ ఆర్థర్లు కోచ్లుగా వ్యవహరించిన సమయంలో అతను సహాయక కోచ్గా పని చేశాడు. ఆ తర్వాత వెస్ట్రన్ ఆస్టేలియా, బిగ్బాష్లో పెర్త్ స్కార్చర్స్ జట్లకు కూడా కోచ్గా బాధ్యతలు నిర్వర్తించాడు. అతని శిక్షణలో పెర్త్ స్కార్చర్స్ మూడు సార్లు బిగ్బాష్ టైటిల్ గెలుచుకోవడం విశేషం. ‘ఆస్ట్రేలియా జట్టుకు కోచ్గా ఎంపిక కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. క్రికెట్ ప్రపంచం దృష్టిలో మా జట్టుపై గౌరవం పెంచడం కూడా నాకు అన్నింటికంటే ముఖ్యం. రాబోయే రోజుల్లో ఆటపరంగా అనేక సవాళ్లు నా కోసం సిద్ధంగా ఉన్నాయి. అయితే అన్నింటికంటే పెద్దది మాత్రం భారత్లో భారత్తో సిరీస్ ఆడటమే. అక్కడి ప్రదర్శనపైనే మా జట్టు గొప్పతనం గురించి ఒక అంచనాకు రాగలను. ఎందుకంటే 2004లో అక్కడ సిరీస్ గెలిచిన జట్టులో నేనూ ఉన్నాను. నా కెరీర్లో అదే మౌంట్ ఎవరెస్ట్లాంటి ఘటన’ అని లాంగర్ వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియా తరఫున అత్యుత్తమ టెస్టు క్రికెటర్లలో ఒకడిగా జస్టిన్ లాంగర్కు గుర్తింపు ఉంది. కొత్త మిలీనియంలో కంగారూలు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన సమయంలో జట్టులో ఓపెనర్గా అతను కీలక పాత్ర పోషించాడు. 14 ఏళ్ల కెరీర్లో లాంగర్ 105 టెస్టుల్లో 45.27 సగటుతో 7696 పరుగులు చేశాడు. ఇందులో 23 సెంచరీలు ఉన్నాయి. మరో ఓపెనర్ మాథ్యూ హేడెన్తో కలిసి ఆసీస్కు చిరస్మరణీయ విజయాలు అందించాడు. హేడెన్–లాంగర్ జంట 113 టెస్టుల్లో కలిపి సంయుక్తంగా 5655 పరుగులు జత చేసి టెస్టు క్రికెట్లో గ్రీనిడ్జ్–హేన్స్ (6482) తర్వాత రెండో అత్యుత్తమ ఓపెనింగ్ జోడిగా గుర్తింపు పొందారు. -
తాత్కాలిక కోచ్గా లాంగర్
సిడ్నీ:ఆస్ట్రేలియా ట్వంటీ 20 క్రికెట్ జట్టుకు తాత్కాలిక కోచ్గా జస్టిన్ లాంగర్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇలా ఆస్ట్రేలియా ట్వంటీ 20 జట్టుకు కొంత కాలం కోచ్గా లాంగర్ వ్యవరించడం ఇది రెండోసారి. త్వరలో భారత్లో పర్యటించే ఆస్ట్రేలియా జట్టు నాలుగు టెస్టు మ్యాచ్లు ఆడనుంది. అదే సమయంలో ఆస్ట్రేలియాలో టీ 20 సిరీస్ జరుగనుంది. దాంతో ప్రధాన ఆటగాళ్లు మాత్రమే భారత్లో పర్యటనకు రానున్నారు. భారత్ కు వచ్చే ఆసీస్ జట్టుకు డారెన్ లీమన్ కోచ్గా వ్యవహరించనుండగా, ఆ క్రమంలో ఆసీస్ టీ 20 జట్టుకు లాంగర్ కోచింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తాడు .ఫిబ్రవరి 23వ తేదీన పుణెల్ ఆసీస్-భారత్ల తొలి టెస్టు మ్యాచ్తో సిరీస్ ఆరంభం కానుంది. ఇదిలా ఉండగా, అదే నెల్లో ఆస్ట్రేలియా-శ్రీలంక జట్ల మధ్య టీ 20 సిరీస్ ఆరంభం కానుంది. ఫిబ్రవరి 17వ తేదీన ఆసీస్-శ్రీలంక జట్లు మధ్య తొలి టీ 20 జరుగనుంది. -
లాంగర్ దగ్గర గంభీర్ శిక్షణ
అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేయాలనే లక్ష్యంతో గౌతమ్ గంభీర్ ఆస్ట్రేలియాలోని పెర్త్లో శిక్షణ తీసుకుంటున్నాడు. పశ్చిమ ఆస్ట్రేలియా జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ దగ్గర ఈ శిక్షణ సాగుతోంది. ‘చాంపియన్స్ లీగ్ సమయంలో పెర్త్ జట్టు కోచ్గా భారత్కు వచ్చినప్పుడు లాంగర్తో మాట్లాడాను. నా ఆటను ఆయన అద్భుతంగా విశ్లేషించారు. తన దగ్గర శిక్షణ తీసుకుంటే కచ్చితంగా మెరుగై, తిరిగి భారత జట్టులోకి ఎంపికవుతాననే నమ్మకం ఉంది’ అని గంభీర్ చెప్పాడు. -
పెర్త్తోనే లాంగర్
న్యూఢిల్లీ : భారత జట్టు కోచ్గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ పేరు చర్చకు వచ్చినా... అతను మాత్రం ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో పెర్త్ జట్టుకు కోచ్గా కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. పశ్చిమ ఆస్ట్రేలియా క్రికెట్ సంఘం తమ కోచ్గా మరో రెండేళ్ల పాటు లాంగర్ ఒప్పందాన్ని పొడిగించింది. మరోవైపు ఇంగ్లండ్ కోచ్ రేసులో లాంగర్ ఉన్నాడనే వార్తలు ఇప్పటిదాకా వినిపించాయి. ‘ఆటగాడిగా, కోచ్గా దాదాపు 20 ఏళ్లు కుటుంబానికి దూరంగా ఉన్నాను. ఇప్పుడు అంతర్జాతీయ జట్టుకు కోచ్గా వెళితే మళ్లీ కుటుంబానికి దూరంగా ఉండాలి. ప్రస్తుతానికి పెర్త్ జట్టుతోనే కొనసాగుతాను. భవిష్యత్లో ఇలాంటి ప్రతిపాదనలు వచ్చినప్పుడు అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాను’ అని లాంగర్ స్పష్టం చేశాడు. -
'టీమిండియా కోచ్ గా చేసే ఉద్దేశం లేదు'
మెల్ బోర్న్:టీమిండియా క్రికెట్ కొత్త కోచ్ గా తనపై వచ్చిన వార్తలకు సంబంధించి ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ జస్టిన్ లాంగర్ స్పందించాడు. ప్రస్తుతం తనకు టీమిండియా కోచ్ గా పని చేసే ఉద్దేశం లేదని తాజాగా స్పష్టం చేశాడు. తనకు అంతర్జాతీయంగా క్రికెట్ కోచ్ గా పనిచేసే అభిలాష ఉన్నా.. మరికొంత కాలం వేచి చూడాలనుకుంటున్నట్లు తెలిపాడు. కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న లాంగర్ .. తాను అంతర్జాతీయ కోచ్ గా పనిచేయడానికి ఇది సరైన సమయం కాదన్నాడు. మంగళవారం వెస్ట్రన్ ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్(డబ్యూఏసీఏ)తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో లాంగర్ పై విధంగా స్పందించాడు. తన ముందున్నది డబ్యూసీఏ క్రికెట్ ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడమేనని పేర్కొన్నాడు. భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ జస్టిన్ లాంగర్ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. డంకెన్ ఫ్లెచర్ వారసుడిగా అతను పగ్గాలు స్వీకరించే అవకాశాలున్నాయని వార్తలు చోటు చేసుకున్నాయి. గతంలో ఆసీస్ జాతీయ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్గా పని చేసిన లాంగర్.. ప్రస్తుతం వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్టుకు ఛీప్ కోచ్గా పని చేస్తున్నారు. -
తెరమీదకు లాంగర్ పేరు
న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ జస్టిన్ లాంగర్ పేరు తెరపైకి వచ్చింది. ఫ్లెచర్ వారసుడిగా అతను పగ్గాలు స్వీకరించే అవకాశాలున్నాయని ఓ కథనం చక్కర్లు కొడుతోంది. గతంలో ఆసీస్ జాతీయ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్గా పని చేసిన లాంగర్.. ప్రస్తుతం వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్టుకు ఛీప్ కోచ్గా పని చేస్తున్నారు. ఆసీస్ తరఫున 105 టెస్టుల్లో 7696 పరుగులు చేసిన లాంగర్కు మంచి వ్యూహకర్తగా పేరుంది. మరోవైపు జింబాబ్వే మాజీ ప్లేయర్ ఆండీ ఫ్లవర్ పేరు కూడా వినబడుతోంది. ఈ ఇద్దరి గురించి బీసీసీఐలోని ఉన్నతస్థాయి వ్యక్తులు చర్చించినట్లు సమాచారం. -
జస్టిన్ లాంగర్ సరైన వ్యక్తి
మెల్ బోర్న్:ఆస్ట్రేలియా క్రికెట్ కోచ్ గా తదుపరి బాధ్యతలు చేపట్టేందుకు జస్టిన్ లాంగర్ కు అన్ని అర్హతలున్నాయని జట్టు ప్రధాన కోచ్ డారెన్ లీమన్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే కోచ్ గా అతను సక్సెస్ సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా లీమన్ గుర్తు చేశాడు. పశ్చిమ ఆస్ట్రేలియా కోచ్ గా ఉన్న లాంగర్ చాలా విజయాలను అందించినట్లు తెలిపాడు. 2017 వరకూ ఆస్ట్రేలియా కోచ్ గా ఉండనున్న లీమన్.. అటు తరువాత కోచ్ గా చేసే అవకాశం లేదన్నాడు. దాంతో లాంగర్ పేరును తాజాగా ముందుకు తీసుకొచ్చాడు. అతను సాధించిన విజయాలు అద్భుతమని లీమన్ పేర్కొన్నాడు. 2009 లో లాంగర్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ కోచ్ గా, మెంటర్ గా పనిచేశాడు.