Kanti Velugu
-
నేత్ర దరహాసం... వికారాబాద్ జిల్లాలో ‘కంటి వెలుగు’ సంపూర్ణం
వికారాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమం పూర్తయ్యింది. వంద పని దినాల్లో ప్రోగ్రామ్ను పూర్తిచేయాల్సి ఉండగా.. గడువులోపే ముగించి సర్కారు సంకల్పాన్ని విజయవవంతం చేశారు. ఇందుకోసం వైద్య సిబ్బంది, అధికారులు ఎంతగానో శ్రమించారు. రోజువారీ విధులు నిర్వర్తిస్తూనే కంటివెలుగు శిబిరాలు కొనసాగించారు. ఇదిలా ఉండగా అద్దాలు పంపిణీ చేసే విషయంలో మిగితా జిల్లాలతో పోలిస్తే వికారాబాద్ ముందు వరుసలో నిలిచింది. కలెక్టర్, డీఎంఅండ్హెచ్ఓ ఇతర అధికారుల నిరంతర పర్యవేక్షణతో పరీక్షలు, చికిత్సలు, అద్దాల పంపిణీ పూర్తయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతీ వ్యక్తికి నేత్ర పరీక్షలు చేయాలని ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం జిల్లాలో త్వరగా పూర్తి కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పరీక్షలు.. అవగాహన జిల్లాలోని 566 గ్రామ పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీలు, 97 వార్డులు ఉన్నాయి. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల పరిధిలోని 20 మండలాల్లో సుమారు 9.27 లక్షల జనాభా ఉంది. వీరందరికీ నేత్ర పరీక్షలు చేసేందుకు 42 వైద్య బృందాలను నియమించారు. ఓ పక్క కంటి వెలుగు స్క్రీనింగ్ చేస్తూనే.. మరోపక్క నేత్ర సమస్యల నివారణపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలో స్క్రీనింగ్ కేంద్రాలకు వచ్చి పరీక్షలు చేయించుకున్నవారిలో 25శాతం (1,24,364) మంది ఏదో ఒక కంటి సమస్యతో బాధ పడుతున్నట్లు తేలింది. ఇందులో కొందరికి రీడింగ్ గ్లాసెస్ అవసరమవగా మరికొందరికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అవసరమని గుర్తించిన వైద్యులు వీటిని పంపిణీ చేశారు. మనమే నంబర్ వన్ జిల్లాలో జనవరి 19న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపిక చేసిన గ్రామాలు, పట్టణాల్లో నిత్యం 42 బృందాలతో శిబిరాలు నిర్వహించారు. ఒక్కో క్యాంపులో నిత్యం 150 నుంచి 170 మందికి కళ్ల స్క్రీనింగ్ చేశారు. ప్రతీ శిబిరంలో వైద్యాధికారితో పాటు నేత్రవైద్యుడు, సిబ్బంది కలిపి ఎనిమిది మంది పాల్గొన్నారు. జిల్లాలో మొత్తం 9.27 లక్షల జనాభా ఉండగా.. ఇందులో 18 ఏళ్లు పైబడిన 4,83,794 మందికి నేత్ర పరీక్షలు పూర్తిచేశారు. వీరిలో 64,798 మందికి రీడింగ్ గ్లాసెస్ అవసరమని తేల్చి ఆరుగురు మినహా 64,792 మందికి అద్దాలు అందజేశారు. 59,566 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అవసరమని నిర్ధారించి.. ఇప్పటివరకు 50,235 మందికి అద్దాలు అందజేశారు. మిగిలిన వారికి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన అద్దాలను పంపిణీ చేయడంలో మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. సమష్టి కృషితోనే.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని పూర్తిచేశాం. పరీక్షలు నిర్వహించిన వారిలో తొంభైశాతం మందికి పైగా అద్దాలు పంపిణీ చేశాం. మిగిలిన వారికి త్వరలోనే అందజేస్తాం. అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితోనే కార్యక్రమం విజయవంతమైంది. – పల్వాన్కుమార్, డీఎంహెచ్ఓ -
లక్షలాది అవ్వాతాతల కళ్లల్లో వెలుగులు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవ్వాతాతల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. వారికి క్రమం తప్పకుండా ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంచనుగా వారున్న చోటుకే పింఛను డబ్బు పంపిస్తున్నారు. మరో పక్క వైఎస్సార్ కంటి వెలుగు పథకం ద్వారా మలి వయసులో చూపు మసకబారిన అవ్వాతాతల కళ్లల్లో వెలుగులు నింపుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదే సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోవిడ్ మహమ్మారి రావడంతో ఆ సమయంలో కొంత అవరోధం కలిగింది. కోవిడ్ ప్రభావం తగ్గగానే మళ్లీ ప్రారంభించారు. రాష్ట్రంలోని 60 సంవత్సరాలు దాటిన అవ్వా తాతలకు ఉచితంగా కంటి పరీక్షలు చేసి, అవసరమైన వారికి కళ్లద్దాలు, మందులు ఉచితంగా ఇస్తున్నారు. అవసరమైన వారికి క్యాటరాక్ట్ ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నారు. 56,88,424 మంది అవ్వా తాతలకు కంటి పరీక్షలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటికే 31,77,994 మందికి పరీక్షలు చేశారు. 11,46,659 మందికి కళ్లద్దాలు అవసరమని గుర్తించారు. ఇప్పటివరకు 8,81,659 మంది అవ్వా తాతలకు ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. మిగతా వారికి కూడా కళ్లద్దాలను ఆర్డర్ ఇచ్చారు. 1,86,628 మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయాల్సి ఉందని గుర్తించగా ఇప్పటి వరకు 53,416 మందికి ఉచితంగా ఈ సర్జరీలు చేసి, వారి జీవితాల్లో కొత్త వెలుగులు తెచ్చారు. త్వరగా సర్జరీలు చేయండి సీఎస్ కె.ఎస్.జవహర్ రెడ్డి వైఎస్సార్ కంటి వెలుగు కింద అవ్వా తాతలకు ఉచిత కంటి పరీక్షలు, కళ్లద్దాల పంపిణీ, క్యాటరాక్ట్ ఆపరేషన్ల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ కార్యక్రమంపై వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలతో కలిసి విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. కంటి పరీక్షల బృందం గ్రామాల పర్యటన షెడ్యూల్ను ముందుగానే విలేజ్ హెల్త్ క్లినిక్స్, గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్యశ్రీ ఎంప్యానల్ ఆస్పత్రులతో సమన్వయం చేసుకొని క్యాటరాక్ట్ సర్జరీలను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. వైఎస్సార్ జిల్లా అధికారులు పక్షం రోజుల్లోనే 3,650 శస్త్రచికిత్సలు చేయించారని చెప్పారు. మిగతా జిల్లాలు కూడా ఆపరేషన్లు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. శస్త్ర చికిత్సలకు జిల్లాకు లక్ష రూపాయల చొప్పున మొబిలైజేషన్ నిధులను విడుదల చేశామన్నారు. వైఎస్పార్ కంటి వెలుగు కార్యక్రమం పురోగతిని పక్షం రోజులకోసారి పోర్టల్లో అప్డేట్ చేయాలని ఆదేశించారు. కంటి వెలుగుతో చూపు మాది పేద కుటుంబం. భర్త చనిపోయాడు. ఎవరూ లేరు. జగనన్న ఇస్తున్న పింఛను మీద జీవిస్తున్నాను. ఒక రోజు కంటిలో మసక వచ్చింది. వస్తువులు కనపడడంలేదు. మా ప్రాంతంలోని ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ రత్నంను సంప్రదించగా, కంటికి క్యాటరాక్ట్ సమస్య ఉందని చెప్పారు. దాని కి ఖర్చు భరించలేనని చెప్పడంతో వెంటనే కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఉచితంగా చేస్తామన్నారు. మార్చి 29న ఆపరేషన్ చేశారు. ఇప్పుడు కన్ను బాగా కనిపిస్తోంది. నా పని నేను చేసుకుంటున్నాను. జగనన్న ఇస్తున్న పింఛన్ డబ్బులు, కంటి వెలుగు పథకం ద్వారా ఆపరేషన్ చేయించుకొని సంతోషంగా జీవిస్తున్నాను. –డి. లక్ష్మీ నారాయణమ్మ, 65 సంవత్సరాలు, మధురవాడ,బాపూజీ నగర్, విశాఖపట్నం -
అన్నిఅక్రమాలే డాక్టర్ సెల్ఫీ వీడియో
-
ప్రజలకు ఆనందబాష్పాలు.. ప్రతిపక్షాలకు కన్నీటిబాష్పాలు
సాక్షి, సిద్దిపేట: కంటి వెలుగు కార్యక్రమంతో ప్రజలకు ఆనంద బాష్పాలు.. ప్రతిపక్షాలకు కన్నీటి బాష్పాలు వస్తున్నాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు. గురువారం ఆయన సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కంటి వెలుగు కేంద్రాన్ని సందర్శించారు. ఇప్పటిదాకా 50 లక్షల మందికి కంటి పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అంధత్వరహిత తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. 25 పని దినాల్లో 50 లక్షల మందికి కంటి పరీక్షలు చేశామన్నారు. గతంలో 827 బృందాలు పనిచేస్తే, ఈసారి 1500కు పెంచామని హరీశ్రావు తెలిపారు. 50 లక్షల మందికి పరీక్షలు చేస్తే 16 లక్షల మందికి దృష్టి లోపం ఉన్నట్టు తేలిందన్నారు. ఇప్పటివరకు 1,68,062 మందికి కంటి పరీక్షలు నిర్వహించి రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో ఉందని కొనియాడారు. దక్షిణ భారత దేశ ధాన్యాగారంగా తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చిదిద్దారని హరీశ్రావు చెప్పారు. దేశంలో వ్యవసాయం వృద్ధి రేటు 4% శాతం ఉంటే, రాష్ట్రంలో 7.8% శాతం ఉందన్నారు. -
ఖాళీగా కళ్లద్దాల పెట్టెలు.. అవాక్కయిన కంటి రోగులు
కామారెడ్డి టౌన్: కంటి వెలుగు కార్యక్రమంలో పరీక్ష చేయించుకున్నారు. కళ్లద్దాల పెట్టె అందిస్తే ఆనందంగా అందుకున్నారు.. తీరా దాన్ని తెరిచి చూస్తే ఖాళీగా కనిపించడంతో అవాక్కవుతున్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం అంచనూర్ గ్రామానికి చెందిన దూడ బీరయ్య కంటి వెలుగు కార్యక్రమంలో తనిఖీ చేయించుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయనకు వైద్య సిబ్బంది కళ్లద్దాల పెట్టె అందజేశారు. కానీ పెట్టె తెరిచాక అందులో కళ్లద్దాలు లేకపోవడంతో బీరయ్య, అక్కడి వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది విస్తుపోయారు. మళ్లీ వివరాలను నమోదు చేసుకుని ఆర్డర్ చేస్తామని తెలిపారు. చాలాచోట్ల ఇలాగే జరుగుతోందని సిబ్బంది వాపోతున్నారు. -
‘కంటి వెలుగు’కు అనూహ్య స్పందన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘కంటి వెలుగు’కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నాటికి 14,92,450 మంది కంటి పరీక్షలు చేయుంచుకున్నారు. మంగళవారం ఒక్కరోజే 2,11,184 మంది వైద్య పరీక్షలు చేయించుకోగా...42 వేల మందికి కళ్లజోళ్లు ఉచితంగా పంపిణీ చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,38,608 మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. జనవరి 19 నుంచి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం జనవరి 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమైంది. కంటి వెలుగు వైద్య శిబిరాలు స్థానిక ప్రజా ప్రతినిధుల సమన్వయంతో సందడిగా ఉన్నాయి. క్యాంపుల నిర్వహణకు జిల్లా అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడంతో ఎక్కడ ఎలాంటి ఫిర్యాదులు నమోదు కాలేదు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు.. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్య శిబిరాలు కంటి పరీక్షలు చేస్తున్నాయి. వైద్య శిబిరాల్లో ప్రత్యేక సాప్ట్వేర్ సహాయంతో కంటి పరీక్షలు చేస్తున్నారు. డీఈవో, ఏఎన్ఎంలు ట్యాబ్ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని నమోదు చేస్తున్నారు. కంటి పరీక్షల తర్వాత అదే వైద్య శిబిరంలో అవసరమైతే అక్కడికక్కడే రీడింగ్ గ్లాసులు పంపిణీ చేస్తున్నారు. దీంతో కంటి వైద్య శిబిరాల నిర్వహణపై ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రభుత్వ సిబ్బందికి సంబంధిత కార్యాలయాలలో, పత్రిక విలేకరులకు ఆయా ప్రెస్క్లబ్ల వద్ద, పోలీస్ బెటాలియన్ సిబ్బందికి వారి కార్యాలయాల్లోనే ప్రత్యేకంగా కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. -
కేసీఆరే నా కొడుకు..
ఖమ్మంమయూరిసెంటర్ : ఖమ్మం పాత మున్సిపల్ కార్యాలయంలోని బస్తీ దవాఖానాలో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాన్ని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సోమవారం సందర్శించారు. ఈసందర్భంగా పరీక్షలు చేయించుకున్న పలువురితో ఆయన మాట్లాడారు. ఈక్రమంలో వృద్ధురాలు పద్మతో ‘కళ్లజోడు పెట్టుకున్నావు కదా మంగా కనిపిస్తోందా’ అని ఆరా తీశారు. దీంతో ఆమె స్పందిస్త ‘మంచిగా కనబడుతుంది కొడకా.. దండం పెడతా’ అంటూ సమాధానం చెప్పారు. ‘నాకు కొడుకులు లేరు.. కంటి పరీక్షలు ఉతంగా చేయడమే కాక అద్దాలు ఇప్పించి కేసీఆరే నా కొడుకు’ అని ఆమె సమాధానం చెప్పడంతో మంత్రి హర్షం వ్యక్తం చేశారు. దృష్టి లోపాలను దూరం చేసి, అంధ రహిత సమాజాన్ని నిర్మించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పువ్వాడ ఈ సందర్భంగా తెలిపారు. -
రెండు రోజుల్లో 3.87 లక్షల మందికి కంటి పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: కంటి వెలుగు కార్యక్రమం క్షేత్రస్థాయి క్యాంప్ల నిర్వహణ విజయవంతంగా జరుగుతుండటంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొదటి రెండు రోజుల్లో 3.87 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, ఇందులో 97,335 మందికి కళ్లద్దాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. కంటి వెలుగు అమలుపై శనివారం ఆమె బీఆర్కేఆర్ భవన్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఎ.ఎం. రిజ్వీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి ఇందులో పాల్గొన్నారు. కాగా, అన్ని జిల్లాల్లోని బఫర్ టీమ్స్ను ఉపయోగించి ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కోర్టు భవన సముదాయాలు, పోలీస్ బెటాలియన్లు, జర్నలిస్టుల కోసం ప్రెస్క్లబ్ల వద్ద ప్రత్యేక కంటి వెలుగు క్యాంప్లను నిర్వహించాలని శాంతి కుమారి సూచించారు. -
రెండో రోజు 2.14 లక్షల మందికి కంటి వెలుగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమం రెండో రోజు శుక్రవారం 2.14 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. దీంతో రెండ్రోజుల్లో 3.81 లక్షల మందికి పరీక్షలు నిర్వహించినట్లయింది. రెండో రోజు 53,719 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేశారు. 38 వేలమందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అవసరమని గుర్తించారు. కంటి సమస్యలు లేనివారు 1.22 లక్షల మంది ఉన్నట్లు తెలిపారు. -
బడిలో ‘కంటి వెలుగు’.. పక్కింట్లో పాఠాలు..
కురవి: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కంటి వెలుగు–2 కార్యక్రమా న్ని నిర్వహించడంతో విద్యార్థులకు పక్కింట్లో తరగతులు నిర్వహించారు. పైగా ఈ కార్యక్రమాన్ని జిల్లాకు చెందిన మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించడం గమనార్హం. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కొత్తూరు(జీ) శివారు తాట్య తండాలో గురువారం జరిగింది. తాట్య తండాలోని ప్రాథమిక పాఠశాలలో కంటి వెలుగు–2 కార్యక్రమానికి ఆరోగ్య, వైద్య శాఖ సిబ్బంది ఏర్పాట్లు చేయగా, మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. పాఠశాలలో కంటి వెలుగు శిబిరం ఏర్పాటు చేయడంతో ఆ పక్కనే భూక్య భద్రు అనే వ్యక్తి ఇంట్లో ఉపాధ్యాయురాలు పద్మ విద్యార్థులకు తరగతులు నిర్వహించారు. పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని సైతం అదే ఇంటి ఆవరణలో వడ్డించారు. దీనిపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తాయి. కంటివెలుగు కార్యక్రమాన్ని వేరేచోట కాకుండా బడిలో నిర్వహించి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం ఏమిటని తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరును తప్పుపట్టారు. -
కంటి‘వెలుగు’ షురూ
సాక్షి నెట్వర్క్: రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఖమ్మంలో దీనిని ప్రారంభించగా, గురువారం నుంచి రాష్ట్రంలోని 1,500 కేంద్రాల్లో కంటి పరీక్షలు చేపట్టారు. తొలిరోజు 1.60 లక్షల మందికి పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 72,580 మంది పురుషులు, 87,889 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు పరీక్షలు చేయించుకున్నారు. మొత్తం 70 వేల మందిలో సమస్యలు గుర్తించారు. 37 వేల మందికి దగ్గరి చూపు లోపానికి సంబంధించి అద్దాలు అందజేశారు. మరో 33 వేల మందిలో ఇతరత్రా సమస్యలు గుర్తించి అద్దాల కోసం సిఫారసు చేశారు. అతి తక్కువ మందికి శస్త్ర చికిత్సలు అవసరమని తేల్చారు. మొత్తం మీద తొలిరోజు పరీక్షించిన వారిలో 43.75 శాతం మందికి రకరకాల చూపు సమస్యలు ఉన్నట్లు తేలింది. పట్టణ ప్రాంతాల్లో రద్దీ తక్కువగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 40 ఏళ్ల పైబడ్డ వారితో క్యూ లైన్లు నిండిపోయాయి. పలువురు ప్రముఖులకు అద్దాలు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్లో కంటి పరీక్ష చేసుకోగా, ఆయనకు దగ్గరి చూపు (షార్ట్ విజన్) లోపం ఉన్నట్లు గుర్తించి అద్దాలు అందజేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి వేములపల్లి మండల కేంద్రంలో పరీక్ష చేసుకోగా లోపం ఉందని గుర్తించి రీడింగ్ గ్లాసులు అందజేశారు. సూర్యాపేటలో పరీక్ష చేయించుకున్న రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డికి ఎలాంటి అద్దాలు అవసరం లేదని నిర్ధారించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాస్కర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి పరీక్షలు చేయించుకున్నారు. వీరిద్దరికీ అద్దాలు అందజేశారు. ఎక్కడ కావాలంటే అక్కడికే.. గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలు, బస్తీలు, అపార్ట్మెంట్లు.. ఎక్కడ సేవలు కావాలన్నా ట్విట్టర్ లేదా వెబ్సైట్లో రిక్వెస్ట్ పెడితే అక్కడికే కంటి వెలుగు బృందాలు వస్తాయని మంత్రి హరీశ్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఏపని చేపట్టినా ప్రజల మంచి గురించి ఆలోచించి చేస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. టీఎస్ఎంఐడీసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, ఆరోగ్య శాఖ కమిషనర్ శ్వేత మహంతి తదితరులు పాల్గొన్నారు. అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యం.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్తో కలిసి హైదరాబాద్ అమీర్పేటలో కంటి వెలుగు పరీక్షా శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..అంధత్వ రహిత తెలంగా ణ కంటి వెలుగు లక్ష్యమని చెప్పారు. ఎవరూ కంటి చూపు సమస్యతో బాధపడకూడదనే ఉద్దేశంతో 2018లో సీఎం కేసీఆర్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. గతంలో 8 నెలల పాటు కంటి వెలుగు నిర్వహిస్తే ఈసారి 100పనిదినాల్లో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ దఫా కంటి వెలుగు ద్వారా 55 లక్షల కళ్ళ జోళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. -
100 రోజుల్లో కోటిన్నర మందికి స్క్రీనింగ్
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం బుధవారం మొదలుకానుంది. ఖమ్మంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. దీనికోసం వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 19 నుంచి రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాల్లో ప్రారంభిస్తారు. ఇందులో ప్రజాప్రతినిధులందరూ పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,500 కేంద్రాల్లో కంటి స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారు. 100 పనిదినాల్లో కోటిన్నర మందికి పరీక్షలు నిర్వహించనున్నారు. తద్వారా గిన్నిస్ బుక్లో నమోదయ్యేలా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. 18 ఏళ్లు నిండిన వారందరికీ పరీక్షలు చేస్తారు. అవసరమైన వారికి కళ్లద్దా్దలు ఇస్తారు. మొత్తం 55 లక్షల కళ్లద్దాలు సిద్ధం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని కేంద్రాల్లో ఒక్కోచోట 300 మందికి, పట్టణ ప్రాంతాల్లో 400 మందిని పరీక్షించాలన్నది లక్ష్యం. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శిబిరాలు నిర్వహిస్తారు. 15 వేల మంది సిబ్బంది : కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 15 వేల మంది సిబ్బంది పాల్గొంటారు. కంటి పరీక్షలకు అవసరమైన ఏఆర్ యంత్రాలు, కళ్లద్దాలు సిద్ధంగా ఉంచారు. కంటి వెలుగు శిబిరాల్లో కంటి శుక్లం, మెల్ల కన్ను, టెరీజియం పరీక్షలు చేస్తారు. అవసరమైన వారికి చుక్కల మందులు, మాత్రలు ఇస్తారు. శిబిరాల్లో స్క్రీనింగ్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. -
‘కంటి వెలుగు’కు ఆధార్ తప్పనిసరి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్టంలో చేపడుతున్న కంటివెలుగు రెండో దశ కార్యక్రమానికి అన్ని శాఖలు సహకరించాలని ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. ఈనెల 18న ఖమ్మంలో కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. శిబిరానికి వచ్చే ప్రజలు తప్పనిసరిగా ఆధార్ కార్డు తెచ్చుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఖమ్మం కలెక్టరేట్ నుంచి సోమవారం ఆయన సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వి, కమిషనర్ శ్వేతతోపాటు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. శిబిరాల నిర్వహణ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగిన భద్రత కల్పించాలని హరీశ్రావు సూచించారు. ఈనెల 18న ఖమ్మంలో సీఎం లాంఛనంగా ప్రారంభించనుండగా, జిల్లాల్లో ఈనెల 19న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్మన్లు తదితరులు కంటివెలుగును ప్రారంభించాలని చెప్పారు. వైద్యబృందాలు సమీప పట్టణాలు, మండల కేంద్రాల్లోనే రాత్రిబస చేసేలా పర్యవేక్షిస్తూ ప్రతిరోజూ ఉదయం 8–45 గంటలకల్లా తప్పనిసరిగా శిబిరాలను తెరవాలని స్పష్టంచేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగును నిర్వహిస్తున్నందున కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతికుమారి సూచించారు. ఈ సమావేశంలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
కంటి ‘వెలుగు’ కావాలి!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమం రెండో విడత మొదలవనుండటంతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది. గతంలో కంటి పరీక్షలు చేసినప్పుడు ఇచ్చిన అద్దాలు ఇప్పుడు పనిచేయడం లేదని, కొత్తవి ఇవ్వాలన్న విజ్ఞప్తులతోపాటు.. ఆపరేషన్లు అవసరమయ్యే వారికి వెంటనే చేయించేలా ఏర్పాట్లు చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి. కేవలం పరీక్షలు జరిపి అద్దాలు, మందులతో సరిపెట్టవద్దని.. శస్త్రచికిత్స చేయించాలని బాధితులు కోరుతున్నారు. ఘనంగా ప్రారంభించినా.. రాష్ట్రంలో ప్రజల దృష్టి సమస్యలను నివారించేందుకు ప్రభుత్వం 2018 ఆగస్టు 15న ‘కంటి వెలుగు’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్ర జనాభాలో 25% మంది ఏదో ఒక స్థాయిలో కంటి సమస్యలతో బాధపడుతున్నారన్న విషయాన్ని గుర్తించి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, వార్డులు, పట్టణాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎనిమిది మందితో కూడిన వైద్యబృందాలు పరీక్షలు చేపట్టాయి. రూ.196.79 కోట్ల వ్యయంతో 826కిపైగా బృందాలతో నాలుగున్నర నెలలపాటు కార్యక్రమం కొనసాగింది. తొలిరోజున 1,09,000 మందిని పరీక్షించారు. గరిష్టంగా ఒక రోజున లక్షన్నర మందికి కంటి పరీక్షలు చేశారు. మొత్తంగా 38 లక్షల మందికిపైగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో అవసరమైన వారికి అద్దాలు, మందులు ఇచ్చారు. ఆరున్నర లక్షల మందికిపైగా శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించారు. ఇందులో మూడో వంతు మందికి ఆపరేషన్లు చేసినా.. ఆస్పత్రుల్లో సిబ్బంది, పరికరాలు, మౌలిక సదుపాయాల కొరత కారణంగా మిగతా వారికి నిర్వహించలేకపోయారు. ఈసారి ఆపరేషన్లు చేస్తారా? ‘కంటి వెలుగు’ పథకం రెండో విడత ఈనెల 18న ఖమ్మం వేదికగా మొదలుకానుంది. శస్త్రచికిత్సలు అవసరమయ్యే పలు రకాల కంటి వ్యాధులతో బాధపడేవారు ఈసారి తమకు ఊరట లభిస్తుందనుకున్నా.. అధికారుల తీరుతో ఆందోళన నెలకొంది. ‘కంటి వెలుగు’కు సంబంధించిన ప్రకటనల్లో, వివరాల్లో ఎక్కడా శస్త్రచికిత్సల ప్రస్తావన రావడం లేదు. గతంలో చేసిన పరీక్షల ప్రకారమే నాలుగున్నర లక్షల మందికిపైగా శస్త్రచికిత్సల కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి దానికి అదనంగా బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అందువల్ల ఆపరేషన్లు చేయించే విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు వయసు మీద పడుతున్న కొద్దీ కంటి సమస్యలు తీవ్రమవుతుంటాయని, అందువల్ల ఏటా కంటి పరీక్షలు నిర్వహించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. మసకబారుతున్న చూపు! క్రితంసారి ఇచ్చిన కంటి అద్దాల్లో చాలామందికి ఇప్పుడవి పనిచేయడం లేదు. వారిలో చూపు మసకబారి దృష్టి లోపాలు పెరిగిపోతున్నాయి. వీరిలో కొందరు శస్త్రచికిత్స అవసరమైన స్థితికి చేరినట్టు అంచనా. కంటిచూపు బాధితుల్లో అధికులు పేద, మధ్య తరగతివారే. వీరిలో కొందరు అప్పోసప్పో చేసి ప్రైవేటులో చికిత్స చేయించుకుంటున్నా.. చాలామందికి ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేక అంధత్వం బారిన పడుతున్నారు. అప్పుడిచ్చిన అద్దాలు సరిగా పనిచేయట్లేదు.. ప్రభుత్వం కంటి వెలుగు పథకం కింద కంటి అద్దాలు ఇచ్చింది. అయితే కొన్నిరోజుల నుంచి అవి సరిగా పనిచేయట్లేదు. సరిగా కనిపించడం లేదు. ఆ అద్దాలు పెట్టుకోవట్లేదు. కొత్త అద్దాలు ఇవ్వాలి. – తోకునూరి నర్సమ్మ, చింతపల్లి, సీరోలు మండలం, మహబూబాబాద్ జిల్లా ఈసారైనా ఆపరేషన్ చేస్తారో..లేదో! నాకు ఒక కన్ను పూర్తిగా కనిపించదు. తొలివిడత కంటి వెలుగు కార్యక్రమంలో డాక్టర్లు పరీక్షించి.. ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఇంతవరకు చేయలేదు. చాలా ఇబ్బంది అవుతోంది. ఈసారి చేయిస్తామని అధికారులు చెప్తున్నారు. ఇప్పుడైనా అవుతుందో లేదో.. – రంగమ్మ, సోంపురం, కేటీదొడ్డి, జోగుళాంబ గద్వాల జిల్లా కంటి వెలుగుకు సహకరిస్తాం ప్రభుత్వం పేదల కోసం మంచి కార్య క్రమం చేపట్టింది. దృష్టి సమస్యలతో బాధపడుతున్న వారికి కంటి పరీక్షలు నిర్వ హించి అద్దాలు ఇవ్వడం అభినందనీయం. ప్రభుత్వం పిలిస్తే ప్రైవేటుగా ప్రాక్టీసు చేస్తున్న వేలమంది ఆప్తా ల్మాలజిస్టులు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తరఫున స్వచ్ఛందంగా కంటివెలుగులో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. – డాక్టర్ బీఎన్ రావు, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు -
18న సీఎం చేతులమీదుగా ‘కంటివెలుగు’ ప్రారంభం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కంటివెలుగు రెండో దశ కార్యక్రమాన్ని ఈనెల 18న మధ్యాహ్నం ఒంటిగంటకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం నుంచి ప్రారంభిస్తారని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. కంటివెలుగు ఏర్పాట్లపై మంత్రి గురువారం ఖమ్మం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఎంహెచ్ఓలతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. సీఎం కేసీఆర్ కార్యక్రమాన్ని ప్రారంభించిన వెంటనే అన్ని జిల్లాల్లో కంటి పరీక్షలు మొదలుపెట్టేలా ప్రజాప్రతినిధులు, జిల్లాస్థాయి అధికారులు కార్యాచరణ రూపొందించుకోవాలని ఆయన సూచించారు. పరీక్షలు నిర్వహించే అన్ని కేంద్రాలకు శుక్రవారం సాయంత్రానికల్లా కంటి పరీక్షల యంత్రాలు, అద్దాలు, మందులు చేరవేయాలని, ఏవైనా ఇబ్బందులు ఎదురైతే కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతికి తెలపాలని చెప్పారు. జిల్లాస్థాయి అధికారులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని సమన్వయం చేసుకోవాలని, సంబంధిత బృందాలు ఉదయం 9 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఒకసారి వాట్సాప్లో వివరాలు అప్డేట్ చేయాలని మంత్రి సూచించారు. ప్రచార కార్యక్రమాలు చేపట్టండి ప్రజలకు కంటివెలుగుపై అవగాహన కల్పించేలా గ్రామాలు, పట్టణాల్లో ప్రచారం చేయాలని, వారికి అర్థమయ్యేలా పూర్తి వివరాలతో ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేయాలని.. ఆధార్ కార్డు తప్పక తీసుకురావాలన్న విషయాన్ని చెప్పాలని మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం ఎనిమిది నెలలు కొనసాగితే, ఈసారి వంద రోజుల్లో పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం గతంలో ఉన్న 827 బృందాలను ఈసారి 1,500కు పెంచామని చెప్పారు. వైద్య బృందం సభ్యులకు పరీక్షా కేంద్రాలకు సమీపంలో వసతి ఏర్పాటుచేయాలన్నారు. విడతల వారీగా, 16,533 కేంద్రా (గ్రామాల్లో 12,763, పట్టణ ప్రాంతాల్లో 3,788)ల్లో క్యాంపులు ఏర్పాటు చేయనుండగా, ప్రాథమికంగా 30 లక్షల రీడింగ్ గ్లాస్లు, 25 లక్షల ప్రిస్కిప్షన్ అద్దాలను అవసరమైన వారికి ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి వివరించారు. క్యాంపులను సందర్శించాలి.. ఎంపీడీఓ, తహసీల్దార్, మండల స్పెషల్ ఆఫీసర్, ఎంపీఓలు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో డీఎంహెచ్ఓ, డిప్యూటీ డీఎంహెచ్ఓ, ప్రోగ్రాం ఆఫీసర్లు కంటివెలుగు క్యాంపులను పర్యవేక్షించాలని మంత్రిహరీశ్రావు ఆదేశించారు. ప్రతిరోజూ క్యాంపులను సందర్శించేలా కలెక్టర్ టూర్ రూపొందించాలని.. మొత్తంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు పర్యవేక్షించాలని చెప్పారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజాప్రతినిధులంతా ఇందులో భాగస్వాములై అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యానికి, సీఎం కేసీఆర్ సంకల్పానికి చేయూతనివ్వాలని మంత్రి పిలుపునిచ్చారు. వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, కమిషనర్ శ్వేతా మహంతి, డీఎంఇ.రమేశ్రెడ్డి, డీహెచ్ శ్రీనివాసరావు, టీఎస్ఎంఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. -
‘కంటివెలుగు’పై అవగాహన కల్పించండి
సాక్షి, హైదరాబాద్/ ఏజీవర్సిటీ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం అమలుకోసం గ్రామాల్లో తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అధికారులకు సూచించారు. ఈనెల 18 నుంచి కంటి వెలుగు రెండో విడత ప్రారంభించనున్న నేపథ్యంలో గ్రామాలలో ఈ కార్యక్రమం తేదీలను తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గురువారం అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన ఈ పథకంపై ఏర్పాట్లను సమీక్షించారు. ఎస్హెచ్జీల ఆదాయం పెంచడమే లక్ష్యం.. స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) ఆదాయ మార్గా లను పెంపొందించే లక్ష్యాన్ని మరువరాదని పీఆర్ ‘సెర్ప్’సీఈవో సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. గురువారం వివిధ జిల్లాల అధికారుల ఓరియెంటేషన్ వర్క్ షాపులో ఆయన మాట్లాడారు. గత సీజన్లో ఖమ్మం జిల్లాలో ఎస్హెచ్జీ ద్వారా ప్రయోగాత్మకంగా ఎండుమిర్చి కొనుగోలు, మార్కెటింగ్ ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంతో పాటు మహబూబాబాద్, వరంగల్, జనగామ, సూర్యాపేట జిల్లాలకు దీనిని విస్తరించనున్నట్లు వెల్లడించారు. -
‘కంటివెలుగు’ కోసం 1,500 బృందాలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 18 నుంచి ప్రారంభించనున్న రెండో దఫా కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు కార్యక్రమం సన్నద్ధతపై మంగళవారం మంత్రులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయనతోపాటు ఇతర మంత్రులు జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్రావు, సీఎస్ సోమేశ్కుమార్, వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులు శ్వేత మహంతి, డాక్టర్ శ్రీనివాస్రావు, చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల నుంచి పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు, పంచాయతీ, మున్సిపల్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హరీశ్రావు మాట్లాడుతూ మొదటిదఫా కంటివెలుగు కార్యక్రమంలో 1.54 కోట్ల మందికి స్క్రీనింగ్ చేసి, 50 లక్షల కళ్లద్దాలు ఇచ్చామని చెప్పారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు గ్రామం, మున్సిపల్ వార్డు కేంద్రంగా క్యాంపుల నిర్వహణ ఉంటుందని చెప్పారు. మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం 8 నెలలు జరిగిందని, రెండోవిడత కంటి వెలుగు వంద పనిదినాల్లో పూర్తి చేస్తామన్నారు. మొదటి దఫా కంటివెలుగులో 827 బృందాలు పనిచేయగా, ఇప్పుడు 1,500 బృందాలను ఏర్పాటు చేశామని, తద్వారా గిన్నిస్ రికార్డులో నమోదయ్యేలా కృషి చేయాలని అన్నారు. ఒక్కో బృందంలో అప్టో మెట్రిస్ట్, సూపర్వైజర్, ఇద్దరు ఏఎన్ఎం, ముగ్గురు ఆశా, డీఈవో ఉంటారన్నారు. 55 లక్షల కళ్లద్దాల పంపిణీ... పరీక్షలు చేసి ఉచితంగా అద్దాలు పంపిణీ చేస్తామని మంత్రి హరీశ్ అన్నారు. ఇందులో 30 లక్షల రీడింగ్ గ్లాసెస్, 25 లక్షల ప్రిస్క్రిçప్షన్ గ్లాసెస్ ఉంటాయని, మొత్తం 55 లక్షల కళ్లద్దాలు పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. రోజువారీ వైద్యసేవలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 12వ తేదీలోగా అన్ని జిల్లాల్లో మంత్రుల నేతృత్వంలో కంటివెలుగు సమావేశాలు నిర్వహించాలని, అన్ని మున్సిపాలిటీలు, మండల పరిషత్లకు షెడ్యూల్ ఖరారు చేయాలన్నారు. రేషన్ షాపుల్లో, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో క్యాంపుల నిర్వహణ తేదీలు అందరికీ తెలిసేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రస్థాయిలో 10, జిల్లాకొక క్వాలిటీ కంట్రోల్ టీమ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కంటి వెలుగు కార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని మంత్రి ఆదేశారు. -
75 బృందాలు..100 రోజులు
సాక్షి,మేడ్చల్ జిల్లా: రెండో విడత కంటివెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. వచ్చే నెల 18న కార్యక్రమం ప్రారంభం కానుండగా, ఇప్పటికే గ్రామీణ, పట్టణ జనాభాకు అనుగుణంగా వైద్య బృందాల నియామకం పూర్తయింది. ఈ మేరకు నేత్ర వైద్య సహాయకులు, కంప్యూటర్ ఆపరేటర్లను తాత్కాలిక పద్ధతిలో నియమించారు. వంద రోజుల పాటు నిర్వహించే కంటివెలుగుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. వారానికి అయిదు రోజుల పాటు నిర్దేశించిన కేంద్రాల్లో శిబిరాలు నిర్వహిస్తారు. 2018లో మొదటి విడత కంటివెలుగు నిర్వహించిన సమయంలో పరీక్షలు నిర్వహించి దృష్టి లోపం ఉన్నవారిలో కొందరికే శస్త్రచికిత్స చేశారు. ఈసారైనా శస్త్రచికిత్స చేసి కంటి అద్దాలు పంపిణీ చేస్తారని కంటి రోగులు ఆశిస్తున్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కంటి శస్త్రచికిత్స చేసేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఒక్కో బృందంలో ముగ్గురు.. మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో 27,75,067 మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 40 డివిజన్ల పరిధిలో 20,92,711 మందికి పరీక్షలు చేపట్టాలని నిర్ణయించగా, ఇందుకు 43 బృందాలను నియమించారు. జిల్లాలోని బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్నగర్,నిజాంపేట నగర పాలక సంస్థలు , మేడ్చల్, గుండ్లపోచంపల్లి ,దుండిగల్ ,కొంపల్లి, తూముకుంట, నాగారం, దమ్మాయిగూడ, ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీ పరిధిలో మొత్తంగా 289 డివిజన్లు/ వార్డులు ఉండగా, 5,36,567 మందికి కంటి పరీక్షలు నిర్వహించాలన్న లక్ష్యంతో 18 బృందాలను నియమించారు. అలాగే, 61 గ్రామ పంచాయతీల్లో సుమారు 1,45,789 జనాభా ఉన్నట్లు వైద్య శాఖ అధికారులు అంచనా వేసి, 10 బృందాలను నియమించారు. జిల్లావ్యాప్తంగా మొత్తంగా 75 బృందాలను నియమించారు. ఒక్కో బృందంలో వైద్యుడు, నేత్ర వైద్య సహాయకుడు, ఆపరేటర్ ఉంటారు. వీరికి స్థానికంగా ఉండే ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు సహకరిస్తారు. ఇటీవలే వైద్య బృందాలకు శిక్షణ ఇచ్చారు. సెలవు దినాలు మినహా వారానికి అయిదు రోజుల చొప్పున 100 రోజుల పాటు వైద్య పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్షించే పరికరాలను, ఆటో రిఫ్రాక్టర్(ఏఆర్) మీటర్లను ప్రభుత్వం సమకూరుస్తుంది. నిరంతరాయంగా శిబిరాలు.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కంటివెలుగు కార్యక్రమం నిర్వహణకు వైద్యఆరోగ్య శాఖ సన్నద్ధమైంది. ఇటీవలి కాలంలో కంటి సంబంధిత సమస్యలతో బాధ పడే వారి సంఖ్య పెరిగిన నేపథ్యంలో కంటివెలుగు కార్యక్రమం అధికారులు చెబుతున్నారు. వైద్య పరీక్షలతో సరిపెట్టకుండా లోపాలున్న ఇకపై నిరంతరాయంగా కొనసాగుతుందని వారందరికీ శస్త్రచికిత్స నిర్వహిస్తేనే పేదలకు ప్రయోజనం కలగనుంది. ఈసారైనా శస్త్రచికిత్సలు జరిగేనా.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో తొలి విడతలో 1,27,146 మందిని పరీక్షించగా 82,157 మందికి మాత్రమే కంటి అద్దాలు అందజేశారు. జిల్లాలో 42,148 మందికి అధిక దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించటంతోపాటు కంటి ఆపరేషన్లు చేయాలని నిర్ణయించినప్పటికిని, 545 మందికి మాత్రమే కంటి ఆపరేషన్లు చేశారు. మిగతా వారందరికి విడతల వారిగా శస్త్రచికిత్సలు చేస్తామని చెప్పినా ఆచరణకు నోచుకోలేదు.బాధితులు శస్త్రచికిత్స కోసం అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. ప్రతి ఒక్కరికీ పరీక్షలు.. జిల్లాలో కంటివెలుగు నిర్వహణ కోసం వైద్య బృందాలను నియమించాం. పరికరాలు, ఇతర వనరులపై ప్రభుత్వానికి నివేదించాం. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటాం. –డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జిల్లా వైద్యాధికారి -
ఈసారి ఆపరేషన్లు లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: కంటి వెలుగు రెండో విడతలో ఆపరేషన్లు ఉండవని తెలుస్తోంది. మొదటి విడత లో కొందరికి ఆపరేషన్లు చేయించగా అవి వికటించడంతో వాటిని నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత అనుభవాల దృష్ట్యా కళ్లద్దాలు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించినట్లు అధికారవర్గాల సమాచారం. ఇదిలా ఉండగా కంటి వెలుగు రెండో విడతలో కోటిన్నర మందికి పరీక్షలు చేస్తే, దాదాపు 10 లక్షల మందికి కంటి ఆపరేషన్లు అవసరం అవుతాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. చాలామందికి క్యాటరాక్ట్ ఆపరేషన్లు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వచ్చే జనవరి 18వ తేదీ నుంచి రాష్ట్రంలో కంటి వెలుగు–2 కార్యక్రమం ప్రారంభం కానున్న విష యం తెలిసిందే. పని దినాల ప్రకారం వంద రోజు ల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా 55 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేయాలని ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా రీడింగ్ గ్లాసులు, చత్వారం అద్దాలను అందజేస్తారు. బ్రాండెడ్ కంపెనీలకు చెందిన కళ్లద్దాలనే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఇప్పటికే టెండర్లు పిలిచింది. మొదటి విడతలో 1.54 కోట్ల మందికి పరీక్షలు 2018లో ప్రారంభమైన కంటి వెలుగు మొదటి విడత దాదాపు 8 నెలలపాటు జరిగింది. అప్పుడు 1.54 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు చేయించుకున్న వారిలో 90.25 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలే ఉండటం గమనార్హం. అప్పట్లో ఎన్నికలకు ముందు సర్కారుకు ఇది మంచి పేరు తెచ్చిపెట్టింది. కంటి ఆపరేషన్లు సహా ఇతరత్రా తదుపరి వైద్యం కోసం దాదాపు 9.30 లక్షల మందిని గుర్తించారు. కాగా, ఇందులో కొందరికి ఆపరేషన్లు చేయించారు. ఒకట్రెండు చోట్ల ఆపరేషన్లు వికటించడంతో ఆపరేషన్ల ప్రక్రియను నిలిపివేశారు. ఇదిలా ఉండగా రెండో విడత కంటి వెలుగులో ఆపరేషన్లపై సర్కారు స్పష్టత ఇవ్వలేదు. కేవలం కళ్లద్దాలు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించినట్లు ఒక అధికారి తెలిపారు. ఆపరేషన్లు ఎక్కడైనా వికటిస్తే అది మొత్తం కార్యక్రమానికే చెడ్డపేరు తెస్తుందని అంటున్నారు. కాగా, ప్రైవేట్ ఆసుపత్రులతో ఒప్పందం చేసుకొని ఆపరేషన్లు చేయించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. -
గిన్నిస్లోకి కంటి వెలుగు
సాక్షి, హైదరాబాద్: కంటి వెలుగు కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదయ్యేలా నిర్వహించాలని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. వంద రోజుల్లో కోటిన్నర మందికి పరీక్షలు చేస్తే గిన్నిస్లోకి చేరుతుందని ఆయన చెప్పారు. జనవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించే కంటి వెలుగు–2 కార్యక్రమంపై జిల్లా వైద్యాధికారులు, జిల్లా ఉప వైద్యాధికారులు, ప్రోగ్రాం ఆఫీసర్లకు హైదరాబాద్లో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని హరీశ్రావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొదటి కంటి వెలుగు కార్యక్రమంలో 1.54 కోట్ల మందికి స్క్రీనింగ్, 50 లక్షల కళ్ళ అద్దాలు ఇచ్చామన్నారు. అది ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక కంటి పరీక్షల కార్యక్రమంగా నిలిచిందన్నారు. ఈసారి కోటిన్నర మందికి పరీక్షలు చేసి 55 లక్షల మందికి అద్దాలు ఇవ్వాలని నిర్ణయించామనీ, ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ.200 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. మొదటి కంటి వెలుగును 8 నెలల్లో పూర్తి చేయగా, ఈసారి 100 పని దినాల్లో చేయాలని నిర్ణయించామన్నారు. వంద రోజుల్లో పూర్తి చేసేందుకు 1,500 బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 969 మంది డాక్టర్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 969 మంది డాక్టర్లను నియమించేందుకు వచ్చే నెల ఒకటో తేదీన తుది జాబితాను విడుదల చేస్తున్నామని మంత్రి హరీశ్రావు వెల్లడించారు. పల్లె దవాఖానాల్లో 811 మంది బీఏఎంఎస్ డాక్టర్లను నియమించామని చెప్పారు. 1,500 ఆప్టో మెట్రిషన్స్, 1,500 డేటా ఎంట్రీ ఆపరేటర్లను త్వరగా నియమించాలన్నారు. కంటి వెలుగును విజయవంతం చేసేందుకు ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని, కలెక్టర్ల సహకారం తీసుకోవాలని కోరారు. మహిళా ఉద్యోగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. జనవరి 1వ తేదీ నాటికి ఆటో రీఫ్రాక్తో మెషీన్లు జిల్లాలకు వస్తాయని చెప్పారు. కార్యక్రమం ప్రారంభించడానికి ముందుగానే రీడింగ్ గ్లాసెస్ వస్తాయని, పరీక్షలు చేసిన నెల రోజుల్లో ప్రిస్క్రిప్షన్ అద్దాలు పంపిణీ చేస్తామని వివరించారు. ఆఖరి సంవత్సరం వైద్య విద్యార్థులకు కూడా శిక్షణ ఇచ్చి వినియోగిస్తామన్నారు. రాష్ట్రస్తాయిలో 10, జిల్లాకొకటి చొప్పున క్వాలిటీ కంట్రోల్ టీంలు ఏర్పాటు చేస్తామని హరీశ్రావు వివరించారు. ప్రభావవంతంగా కార్యక్రమం జరుగుతుందా లేదా అని ఈ టీంలు పరిశీలన చేస్తాయన్నారు. ఎల్ వీ ప్రసాద్, సరోజినీ దేవి కంటి ఆసుపత్రుల సహకారంతో ఆ టీంలకు రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాప్ ద్వారా ఎప్పటికప్పుడు అద్దాల డిమాండ్ తీర్చేలా ఆటోమేటిక్ ఆర్డర్ ఫెసిలిటీ ఉంటుందన్నారు. జనవరి 10 వరకే 10 నుంచి 15 లక్షల కళ్ళ జోళ్లు జిల్లాలకు చేరతాయన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, కంటి వెలుగు కార్యక్రమానికి తమ శాఖ పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. -
మళ్లీ కంటి వెలుగు.. జనవరి 18 నుంచి షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 18 తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. కంటి వెలుగు అమలు తీరు, నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానాల నమూనాల పరిశీలన, ప్రజారోగ్యం, వైద్యం అంశాలపై సీఎం కేసీఆర్ గురువారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదల కన్నుల్లో వెలుగులు నింపాం ‘గతంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమం ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నది. ముఖ్యంగా కంటి చూపు కోల్పోయిన పేదలైన వృద్ధులకు ఈ పథకం ద్వారా కంటి చూపు లభించింది. రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా పరీక్షలు నిర్వహించి కళ్లజోళ్లు అందించింది. తద్వారా వారు పొందిన ఆనందానికి అవధులు లేవు. పేదల కన్నుల్లో వెలుగులు నింపి వారి ఆనందాన్ని పంచుకోవడం గొప్ప విషయం. అందువల్ల మరోసారి రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు పథకం కింద ఉచితంగా నేత్ర పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారందరికీ ఉచితంగానే కంటి అద్దాలు కూడా అందిస్తాం’ అని సీఎం తెలిపారు. ఇందుకు అవసరమైన సిబ్బందిని, కళ్లద్దాలు, పరికరాలు ఇతర ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, వి.శ్రీని వాస్గౌడ్, ఇంద్రకరణ్రెడ్డి, సబితాఇంద్రా రెడ్డి, ఎమ్మెల్యేలు ఎ.జీవన్రెడ్డి, బాల్క సుమన్, కంచర్ల భూపాల్ రెడ్డి, జి.విఠల్రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పల్లా రాజే శ్వర్రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేశ్రెడ్డి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి, ప్రభు త్వ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇదీ చదవండి: బుల్లెట్ ప్రూఫ్తో సీఎం ఛాంబర్.. అత్యాధునిక హంగులతో నూతన సచివాలయం -
'కంటివెలుగు పథకం నిర్వీర్యంగా మారింది'
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కంటివెలుగు పథకం నిర్వీర్యంగా మారిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ. జీవన్రెడ్డి శాసనమండలిలో ఆవేదన వ్యక్తం చేశారు. కంటివెలుగు పథకం కింద కంటి ఆపరేషన్లు ఎవరికి చేయడం లేదని, ఆరోగ్య శ్రీ రోగుల పట్ల కార్పొరేట్ ఆసుపత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ను అమలు చేస్తే ఆరోగ్య శ్రీని నిలిపివేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఆయుష్మాన్ భారత్తో పాటు ఆరోగ్య శ్రీని కూడా కంటిన్యూ చేయాలన్నారు. కాగా బడ్జెట్లో విద్య కోసం రూ.14728 కోట్లు కేటాయించారని, అయితే విద్యపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. (‘అప్పుడు కరెంట్ బందు.. ఇప్పుడు రైతు బంధు’) బుధవారం అసెంబ్లీ ముట్టడికి యత్నించిన విద్యార్థుల పట్ల పోలీసులు నియంతృత్వంగా వ్యవహరించడం దారుణంగా అభివర్ణించారు. రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్ ఊసే లేదని, గ్రూఫ్స్ నోటిఫికేషన్ ఇప్పటికి ఇవ్వలేదన్నారు. యునివర్సిటీల్లోనూ పోస్టులు చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకొని నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ అమలు కావడం లేదన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో ఎలాంటి కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని తెలిపారు. రేషన్షాపుల్లో ఇవ్వాల్సిన తొమ్మిది రకాల సరుకులు ఏమయ్యాయని ప్రశ్నించారు. పండుగ పూట ఇవ్వాల్సిన చక్కెర, గోధుమలు, కిరోసిన్ లాంటివి ఇవ్వకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వెల్లడించారు. రుణమాఫీలో భాగంగా రూ. 50వేల వరకు ఉన్న రైతులకు ఒకసారి, 50 వేలకు పైగా ఉన్న రైతులకు రెండు విడతల్లో రుణమాఫీ చేస్తే బాగుంటుందని జీవన్రెడ్డి అభిప్రాయపడ్డారు. -
టీడీపీ నేతలను నిలదీయండి: మంత్రి అవంతి
సాక్షి, విశాఖపట్నం: గత ఐదేళ్ల టీడీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని.. టీడీపీ నేతలు త్వరలో చేపట్టనున్న జన చైతన్య యాత్రలో వారిని నిలదీయాలని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖ నార్త్, కంచరపాలెంలో మూడవ విడత వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉత్తర నియోజకవర్గంలో ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే ఎక్కడని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ముందుంటారని తెలిపారు. ఆయన హామీలను కేవలం 8 నెలల్లో అమలు చేసి చూపిస్తున్నారని పేర్కొన్నారు. కంటి వెలుగు ద్వారా జిల్లాలో నాలుగు లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించామని మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు.(ప్రజల దృష్టి మళ్లించేందుకే.. ఆ యాత్ర) -
స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: అర్హత ఉన్నా పెన్షన్ రాలేదన్న మాట ఎక్కడా వినిపించకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వెరిఫికేషన్ చేసి అర్హత ఉందని తేలితే... రెండు నెలలకు కలిపి ఒకేసారి పెన్షన్ ఇస్తామని స్పష్టం చేశారు. అదే విధంగా అర్హత ఉండి దరఖాస్తు చేసుకుంటే.. ఐదు రోజుల్లో పెన్షన్కార్డు ఇస్తామని పేర్కొన్నారు. ‘స్పందన’ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొత్తగా 6,14,244 పెన్షన్లు ఇచ్చామనీ.. అయినప్పటికీ పథకం అందలేదన్న మాటలు వినిపిస్తున్నాయన్నారు. పెన్షన్ దరఖాస్తులను ఫిబ్రవరి 17 నాటికి కలెక్టర్లు రీ వెరిఫికేషన్ చేయాలని, 18కల్లా అప్లోడ్ చేసి, 19, 20 తేదీల్లో సోషల్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. తుది జాబితా 20న ప్రకటించాలని సూచించారు. మార్చి 1న కార్డుతో పాటు, పెన్షన్ ఇవ్వాలని ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి వివక్ష చూపకూడదని పునరుద్ఘాటించారు. బియ్యం కార్డుల విషయంలోనూ రీ వెరిఫికేషన్ పూర్తిచేయాలని ఆదేశించారు. అదే విధంగా అర్హులు ఎవ్వరికీ బియ్యం కార్డు రాలేదనే మాట వినిపించకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. ‘‘ఫిబ్రవరి 18 కల్లా రీ వెరిఫికేషన్ పూర్తి కావాలి. ఫిబ్రవరి 15 నుంచి బియ్యంకార్డుల పంపిణీ. ఎవరికైనా రాకపోతే ఆందోళన చెందవద్దని చెప్పండి. దరఖాస్తు చేసుకున్న 5 రోజుల్లోగా కార్డు వస్తుంది. అలాగే ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఫిబ్రవరి 15 నుంచి పంపిణీ చేస్తారు. మార్చి 31 నాటికి అన్ని జిల్లాల్లో ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ. కర్నూలు, వైఎస్సార్ కడప, విశాఖపట్నం, శ్రీకాకుళంలో ఫిబ్రవరి 15 నుంచి... అనంతపురం, ఉభయగోదావరి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మార్చి 7 నుంచి... కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో మార్చి 25 నుంచి... ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ .1.41 కోట్ల మందికి క్యూఆర్ కోడ్తో ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలి. కాబట్టి కొంత సమయం పడుతుంది. రూ. 5లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నాం’’అని పేర్కొన్నారు. చంద్రబాబు అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు.. ‘‘ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా కొన్ని అంశాలు నా దృష్టికి వచ్చాయి. స్పందన ద్వారా 2 లక్షల పైచిలుకు వినతులు వస్తే 1 లక్షా 3 వేల వినతులకు శాంక్షన్ ఇచ్చాం. కరెంటు బిల్లులు ఎక్కువగా రావడం వల్ల దాదాపు 40 వేల వినతులను పెండింగులో ఉన్నట్టు చూస్తున్నాం. పూరిగుడిసెలో ఉన్నవాళ్లకు కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చిందని ఆపేయడం కరెక్టు కాదు. గ్రామ వాలంటీర్ ద్వారా లబ్ధిదారులను గుర్తించి.. ఇళ్లపట్టా పొందడానికి అర్హుడు అని అనిపిస్తే.. వెంటనే ఇళ్లపట్టా ఇవ్వండి. నేను గ్రామాల్లో తిరిగే సరికి... ఇంటి పట్టా మాకు లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదు. ఇళ్లపట్టాల విషయంలో కలెక్టర్లు చురుగ్గా పనిచేయాల్సి ఉంది. లక్షలమంది మనపై ఆశలు పెట్టుకున్నారు. వచ్చే 2 వారాలు అధికారులు ఇళ్లపట్టాలపై దృష్టిపెట్టాలి. ప్లాటింగ్, మార్కింగ్ పనులు త్వరితగతిన పూర్తికావాలి. ఇళ్లపట్టాలకు అవసరమైన భూమిని మార్చి 1 కల్లా సిద్ధం చేయాలి. 25 లక్షలమంది పట్టాలు ఇవ్వాలన్న మంచి కార్యక్రమం దిశగా మనం అడుగులు వేస్తుంటే... దీన్ని అడ్డుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కేసులు పెట్టి.. అడ్డుకోమని టెలికాన్ఫరెన్స్ల్లో తన నాయకులకు చెప్తున్నాడు. భూములు కొనుగోలు విషయంలో చురుగ్గా ముందుకు సాగాలి. అనుకున్నచోట భూములు దొరకని పక్షంలో ప్లాన్- బీ కూడా కలెక్టర్లు సిద్ధంచేసుకోవాలి. ఇంటి స్థలం లేని నిరుపేద రాష్ట్రంలో ఉండకూడదు. కావాల్సిన నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఉగాది రోజు ఆ కుటుంబాల్లో కచ్చితంగా పండుగ వాతావరణం ఉండాలి. వచ్చే ఏడాది నుంచి ఏడాదికి 6 లక్షల ఇళ్లు చొప్పున నిర్మించుకుంటూ పోతాం’’ అని సీఎం జగన్ అధికారులతో పేర్కొన్నారు. కంటి వెలుగు పథకం మూడో విడతలో భాగంగా... పిల్లలకు చేయాల్సిన సర్జరీలను వేసవి సెలవులు నాటికి వాయిదా వేసినట్లు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ‘‘25 రోజుల విశ్రాంతి అవసరం ఉన్న దృష్ట్యా తల్లిదండ్రుల కోరిక మేరకు కంటి శస్త్రచికిత్సలు వాయిదా వేశాం. కళ్లజోళ్లు కూడా అవసరమైన విద్యార్థులకు పంపిణీచేస్తున్నాం. మూడోవిడత కంటి వెలుగు కింద 56 లక్షలమంది అవ్వాతాతలకు స్క్రీనింగ్. అవ్వాతాతలకు పెన్షన్ల పంపిణీతో పాటు వాలంటీర్లచే కళ్లజోళ్లు పంపిణీ. మార్చి నుంచి అవసరమైన వారికి కంటి శస్త్రచికిత్సలు. గ్రామ సచివాలయాల్లోనే స్క్రీనింగ్. ప్రతి మండలానికి 2 నుంచి 3 టీంలు. దీనికోసం రూట్మ్యాప్లు సిద్ధంచేస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘కలెక్టర్లంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. నియోజకవర్గాల వారీగా బృందాలను ఏర్పాటు చేయాలి. కంటివెలుగు మూడోవిడత ‘‘అవ్వా-తాత’’ కార్యక్రమం 18న కర్నూలులో ప్రారంభం. ఈ కార్యక్రమంలో నేను పాల్గొంటాను. ఆస్పత్రుల్లో నాడు-నేడు పనులకూ అదే రోజు శంకుస్థాపన. 4906 సబ్ సెంటర్లను నిర్మిస్తున్నాం. 4472 సబ్ సెంటర్లకు స్థలాలు గుర్తించారు. మిగిలిన వాటికి వెంటనే స్థలాలను గుర్తించాలి. ఈ నెలాఖరుకల్లా పనులు ప్రారంభం అవుతాయి’’అని తెలిపారు. జగనన్న వసతి దీవెన ఫిబ్రవరి 24న ప్రారంభం ‘‘ఉన్నత చదువులు చదువుతున్నవారికి అండగా వసతి దీవెన కార్యక్రమం. విజయనగరంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. సంవత్సరానికి రూ.20వేల రూపాయలు రెండు దఫాల్లో ఇస్తాం.11,87,904 మందికి లబ్ధి. 53720 ఐటీఐ చదువుతున్న వారికి మొదటి దఫా రూ.5వేలు, ఏడాదికి రూ.10వేలు. పాలిటెక్నిక్ చదువుతున్న వారికి మొదటి దఫా రూ. 7,500వేలు, ఏడాదికి రూ.15వేలు. డిగ్రీ ఆపై చదువులు చదువుతున్న వారికి మొదటి దఫా రూ.10వేల రూపాయలు. ఏడాదికి రూ.20వేలు. విద్యార్థుల తల్లుల అకౌంట్లోకి డబ్బు జమ చేస్తాం’’అని సీఎం జగన్ పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. షాపులు నడుపుకుంటున్న రజకులు, నాయీబ్రాహ్మణులు, టైలర్లకు వచ్చే మార్చిలో ఏడాదికి రూ.10వేలు కాపు నేస్తంలో భాగంగా మహిళలను ఆదుకునే కార్యక్రమం కూడా మార్చిలో ప్రారంభం మార్గదర్శకాలు తయారుచేసి వాలంటీర్ల సహాయంతో లబ్ధిదారులను ఎంపిక చేయాలి చిరునామాల మ్యాపింగ్ అనేది గ్రామ, వార్డు సచివాలయాల్లో ముఖ్యమైన కార్యక్రమం గ్రామ వాలంటీర్ల చేతిలో మొబైల్ ఫోన్లు ఉన్నాయి అడ్రస్ మ్యాపింగ్ సరిగ్గా చేయని కారణంగా.. పెన్షన్లు ఇవ్వడానికి కొన్నిచోట్ల సమయం పడుతుంది మ్యాపింగ్ జరిగితే.. వేగవంతంగా పెన్షన్లు ఇవ్వగలుగుతాం వచ్చే నెల పెన్షన్లు మొదటి 2 రోజుల్లోనే పూర్తికావాలి గ్రామ, వార్డు సచివాలయాలను కలెక్టర్లు ఓన్ చేసుకోవాలి ఎక్కడా గ్యాప్ లేకుండా చూసుకోవాలి వాలంటీర్లు అందుబాటులో ఉన్నారా? లేదా? అన్న కనీస సమాచారం మనవద్ద ఉండాలి లేకపోతే ఆ యాభై కుటుంబాలకు సంబంధించిన సేవలు పెండింగులో ఉంటాయి ఇక వార్డు, గ్రామ సచివాలయాల్లోని ఉద్యోగులు కూడా సమయానికి వస్తున్నారా? లేదా? చూసుకోవాలి గ్రామ, వార్డు సచివాలయాల్లో మనం అందిస్తామన్న 541 సేవలు అనుకున్న సమయానికి అందుతున్నాయా? లేదా? చూసుకోవాలి ఈ పరిశీలనలవల్ల లోపాలు ఎక్కడున్నాయో తెలుస్తాయి, వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది గ్రామ సచివాలయాలనుంచే వినతులు, దరఖాస్తులు నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలి రైతు భరోసా కేంద్రాల గురించి.. ఈ ఏడాది ఖరీఫ్ కల్లా రైతుభరోసా కేంద్రాలు ప్రారంభం ప్రతి 2వేల జనాభాకు సంబంధించి పూర్తి వ్యవసాయ అవసరాలను ఈ రైతు భరోసా కేంద్రాలు తీరుస్తాయి ఇ-క్రాపింగ్ తప్పనిసరిగా అమలు చేయాలి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మారుస్తాయి రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలకు అవసరమైన స్థలాలను గుర్తించాలి ఎక్కడైనా రైతు ఆత్మహత్యచేసుకుంటే... కలెక్టర్ కచ్చితంగా వెళ్లాలని చెప్పాం పరిహారం అందని రైతు కుటుంబాలకు వెంటనే చెల్లింపులు చేయాలి ఎలాంటి ఆలస్యం లేకండా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు చెల్లింపులు చేయాలి 2014 నుంచి 2019లో మనం అధికారంలోకి వచ్చేంత వరకూ ఆత్మహత్య చేసుకున్న రైతుకుటుంబాల్లో పరిహారం అందని 422 మంది కుటుంబాలకు ఈనెల 24న పరిహారం అందించాలి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయా కుటుంబాల దగ్గరికి వెళ్లి వారికి పరిహారం ఇవ్వాలి -
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో బోధనాసుపత్రి
రాష్ట్రంలోని 13 జిల్లాలను ఐదు జోన్లుగా ఏర్పాటు చేసుకుని, వాటిలో సూపర్ స్పెషాలిటీ మెడికల్ కోర్సులు ప్రారంభించడంపై దృష్టి సారించాలి. ఇదే సమయంలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు మెడికల్ యూనివర్సిటీల ఏర్పాటుపై దృష్టి పెట్టాలి. వాటి పరిధిలోని మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల నిర్వహణ అంశాలపై సమగ్ర విధానం ఉండాలి. – సీఎం వైఎస్ జగన్ మే నాటికి వైద్య, ఆరోగ్య శాఖలో అవసరమైన సిబ్బందిని రిక్రూట్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రజలకు వైద్య సేవల్లో ఎలాంటి లోపం ఉండకూడదు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏప్రిల్ నుంచి డబ్ల్యూహెచ్ఓ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్), జీఎంపీ (గుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్) ప్రమాణాలతో కూడిన మందులు పంపిణీ చేయాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక బోధనాసుపత్రి ఉండేలా చూడాలని, జిల్లా ఆసుపత్రులను బోధనాసుపత్రులుగా మార్చడంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. దీనివల్ల సిబ్బంది కొరత తీరే అవకాశాలుంటాయని, మరిన్ని మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఆస్పత్రుల్లో నాడు–నేడు, సబ్ సెంటర్ల నిర్మాణం, కంటి వెలుగు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్యకార్డుల జారీపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డితో మంగళవారం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న విధానం చాలా పాతది అని, కొత్త విధానం గురించి ఆలోచించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో తొమ్మిది చోట్ల బోధనాసుపత్రులు పెట్టేందుకు అవకాశాలున్నాయని అధికారులు సూచాయగా తెలుపుతూ.. నాలుగైదు ఆసుపత్రుల్లో వెంటనే ఈ ప్రతిపాదనను అమలు చేయవచ్చని సీఎంకు వెల్లడించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక బోధనాసుపత్రి ఉండేలా చూడాలని, ఈ బోధనాసుపత్రులు స్వయం శక్తితో నడిచేలా ఆలోచించాలని సీఎం సూచించారు. ప్రజారోగ్య రంగం గురించి ఇదివరకటి ప్రభుత్వాలు ఆలోచించలేదని, అందువల్లే ఇవాళ పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తు తరాలకు మెరుగైన ఆరోగ్య వ్యవస్థను అందించడానికి కృతనిశ్చయంతో ఉన్నామని, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక బోధనాసుపత్రి ఏర్పాటు చేసి, భవిష్యత్తులో అవి మెరుగ్గా నడిచేలా ప్రణాళిక తయారు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న 11 కాలేజీలకు అదనంగా ప్రతిపాదిస్తున్న కాలేజీలతో కలిపి కనీసం 27 నుంచి 28 కాలేజీలు అవుతాయని, దీంతో భవిష్యత్తులో డాక్టర్లు, సిబ్బంది కొరత లేకుండా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. అవ్వాతాతలకు కంటి పరీక్షలు మూడో విడత వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం కింద ఈ నెల 17వ తేదీ నుంచి అవ్వాతాతలకు కంటి పరీక్షలు నిర్వహించనున్నామని, దాదాపు 10 లక్షల మందికి శస్త్రచికిత్సలు అవసరమవుతాయని అంచనా వేశామని అధికారులు సీఎంకు వివరించారు. జూలై వరకూ మూడో విడత కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతుందని, ఆపరేషన్లు ఎక్కువగా చేయాల్సి ఉన్నందున ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. స్క్రీనింగ్, లోపాల గుర్తింపు, కంటి అద్దాల పంపిణీ, ఆపరేషన్లు అన్నీ సమకాలంలో జరుగుతాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కాగా, అవసరం లేకున్నా సిజేరియన్లు చేయడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. సహజ ప్రసవాలను ప్రోత్సహించాలని ఆదేశించారు. ఆ మేరకు వైద్యులకు సూచనలు చేయాలని, తల్లులకు అవగాహన కల్పించాలని సూచించారు. రోగుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి తీవ్ర రోగాలతో బాధపడుతున్న వారికి ఇస్తున్న పెన్షన్లపై ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. అర్హులు ఎవ్వరూ కూడా మిగిలిపోకూడదని, ఎవరైనా మిగిలిపోతే వలంటీర్లను వినియోగించుకుని గుర్తించాలని ఆదేశించారు. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద 46,725 మందికి ఫిబ్రవరి 2 వరకు రూ.33.14 కోట్లు పంపిణీ చేసినట్లు అధికారులు వివరించారు. ఆస్పత్రి నుంచి రోగి డిశ్చార్జి అవుతున్న సందర్భంలోనే రోగుల విశ్రాంతి సమయానికి ఇవ్వాల్సిన డబ్బును చేతిలో పెట్టాలని, మరింత సమర్థవంతంగా ఈ కార్యక్రమం కొనసాగించాలని సీఎం స్పష్టం చేశారు. డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్, టీబీ, లెప్రసీ వ్యాధిగ్రస్తుల గుర్తింపునకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి విస్తృతంగా పరీక్షలు నిర్వహించనున్నామని, గుర్తించిన వారి వైద్యం వివరాలు ఆరోగ్య కార్డులో పొందుపరచనున్నట్లు అధికారులు వివరించారు. పశ్చిమగోదావరి జిల్లాలో రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు పైలట్ ప్రాజెక్టు అమలుపై సీఎం ఆరా తీశారు. 17న ఆసుపత్రుల్లో నాడు–నేడు ప్రారంభం ఆరోగ్య ఉప కేంద్రాల (సబ్ సెంటర్లు) నిర్మాణంపై ముఖ్యమంత్రి సమీక్షిస్తూ.. ‘నాడు– నేడు’లో చేపట్టే పనులు నాణ్యంగా ఉండాలని, ఈ విషయంలో రాజీ పడరాదని స్పష్టం చేశారు. నాడు – నేడులో భాగంగా 1,138 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 52 ఏరియా ఆస్పత్రులు, 169 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. నాడు –నేడు కింద 11 మెడికల్ కాలేజీలు, 6 బోధనాసుపత్రుల్లో ,13 జిల్లా ఆసుపత్రుల్లో కూడా అభివృద్ధి పనులు చేపడతారు. కొత్తగా 7 మెడికల్ కాలేజీలు, 8 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, 1 క్యాన్సర్ ఆసుపత్రి, 7 నర్సింగ్ కాలేజీల నిర్మాణం చేపడతారు. కాగా, ఈ నెల 17న ఆసుపత్రుల్లో నాడు– నేడు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కర్నూలులో ప్రారంభించనున్నారు. అదే రోజు సబ్సెంటర్ల నిర్మాణానికి శంకుస్థాపన, మూడో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని కర్నూల్లోనే ప్రారంభిస్తారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి 1.43 కోట్ల కుటుంబాలు వైఎస్సార్ నవశకం ద్వారా రాష్ట్రంలో 1.43 కోట్ల కుటుంబాలను ఆరోగ్యశ్రీకి అర్హులుగా గుర్తించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వార్షికాదాయ పరిమితిని రూ.5 లక్షల వరకు చేసినందున ఇంత మందికి లబ్ధి కలుగుతోందన్నారు. వీరందరికీ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కొత్త కార్డులను మార్చి 15వ తేదీలోగా ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్లో 72, చెన్నైలో 23, బెంగళూరులో 35 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నామని, ఇప్పటి వరకు 3 వేల మంది రోగులు చికిత్స చేయించుకున్నారని అధికారులు వివరించారు. ఈ నెల 17న ఎనీమియా ముక్త్ భారత్లో భాగంగా ఐఎఫ్ఏ టాబ్లెట్లు, సిరప్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సదరం సెంటర్లు 52 నుంచి 167కు పెంచామని, వారానికి 8,680 మందికి స్లాట్లు ఇస్తున్నామని, డిసెంబర్ 3 నుంచి ఫిబ్రవరి 3 వరకు 20,642 మందికి సర్టిఫికెట్లు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఐదు జోన్లు ఇలా.. 1. కర్నూలు, వైఎస్సార్, అనంతపురం 2. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు 3. కృష్ణా, గుంటూరు 4. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి 5. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం -
కళ్లజోడు బాగుంది..
గురువారం గుంటూరు పోలీసు పరేడ్ గ్రౌండ్లో వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన ఉచిత కళ్లజోళ్ల పంపిణీ స్టాల్స్లో కలెక్టర్ శామ్యూల్ ఆనంద్కుమార్ ఇచ్చిన కళ్ల జోడు పెట్టుకుని స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తోన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ -
‘కంటి వెలుగు’.. కదులుతున్న డొంక
సాక్షి, సిద్దిపేట : కంటి వెలుగు పథకం అమలులోని అక్రమాలపై జిల్లా కేంద్రంలో రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో విచారణ జరుపుతున్నారు. నెలలు గడిచినా యూసీలు సమర్పించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ‘సాక్షి’ 19న ప్రచురించిన ‘కాకి లెక్కలు!’ కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. జిల్లా కేంద్రంలోని ద్యారోగ్యశాఖ కార్యాలయాన్ని 21న సందర్శించి ఇందుకు సంబంధించిన పలు అంశాలపై ఆరా తీశారు. జిల్లాలో కంటి వెలుగు పథకం అమలు తీరు, వైద్యులు పరీక్షించిన రోగుల వివరాలు, పంపిణీ చేసిన కంటి అద్దాలు, ప్రభుత్వం నుంచి మంజూరైన అద్దాలతో పాటు పలు వివరాలతో కూడిన రికార్డులను పరిశీలించారు. ముఖ్యంగా కంటి వెలుగు పథకంలో భాగంగా వైద్యులకు చెల్లించిన వేతనాలు, క్యాంపుల నిర్వహణకు సంబంధించిన ఖర్చులను, రవాణా కోసం వినియోగించిన వాహనాల వివరాలు, వాటికి చెల్లించిన ఖర్చుల వివరాలపై ఆరా తీశారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్ఓ కార్యాలంలోని స్టోర్ రూంను పరిశీలించి లబ్ధిదారులకు అందాల్సిన కంటి అద్దాలు పెండింగ్లో ఉండడంతో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పంపిణీ చేసిన కంటి అద్దాల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో పూర్తి వివరాలతో కూడిన నివేదికలను పంపాలని జిల్లా అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లా అదనపు ప్రజా ఆరోగ్య అధికారి డాక్టర్ మనోహర్ నంగునూర్ మండలం రాజగోపాల్పేట పీహెచ్సీలో లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన అద్దాలు, మండలంలో కంటి వెలుగు పథకం నిర్వహణకు అయిన ఖర్చుల వివరాలను సంబంధిత మెడికల్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించి తెలుసుకున్నారు. మూడు రోజులుగా డీఎంహెచ్ఓ కార్యాలయంలో సంబంధిత ఏఎన్ఎంలతో ఆన్లైన్లో వివరాలను నమోదు చేయిస్తున్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ విజయరాణి వెద్య సిబ్బందితో సమావేశం నిర్వహించి కంటి వెలుగుకు జిల్లాలో అయిన ఖర్చుల పూర్తి వివరాలతో కూడిన ఫైల్ను పరిశీలించారు. నెలరోజుల్లోపు పూర్తి వివరాలతో కూడిన యూసీలను సమర్పించాలని జిల్లాలోని అన్ని పీహెచ్సీల పరిధిలోని మెడికల్ ఆఫీసర్లను ఆదేశించామని డీఎంహెచ్ఓ తెలిపారు. గడువులోపు సమర్పించని వారి బిల్లులను క్యాన్సల్ చేస్తామని, పూర్తి వివరాలతో కూడిన ఫైల్ను కలెక్టర్కు సమర్పిస్తామని తెలిపారు. తప్పుడు నివేధికలు తయారుచేస్తే అట్టి వారిపై చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ హెచ్చరించారు. దీంతో పలువరు డాక్టర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో విధులు నిర్వహించే సిబ్బంది రెండు రోజులుగా చర్చించుకుంటున్నారు. -
‘కంటి వెలుగు’లో కాకి లెక్కలు!
సాక్షి, సిద్దిపేట: కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా గతేడాది ఆగస్టు 15న జిల్లాలో కంటి పరీక్షలు ప్రారంభించారు. ఈ ఏడాది పిబ్రవరి 24వ తేదీతో పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 3,47,120 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1,17,872 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఇందులో 43,010 మందికి దగ్గరి చూపులోపించడంతో వారికి అద్దాలు అందజేశారు. మిగిలిన వారిలో 51,850 మందికి దూరం చూపు, ఇతర కంటి సమస్యలతో కళ్లు కన్పించకుండా ఉన్నవారు ఉన్నారు. వీరికి అద్దాలు పంపిణీ చేయడం కోసం ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు. ఇందుకు గాను జిల్లాలో 24 బృందాలను నియమించారు. ఒకొక్క బృందంలో మెడికల్ ఆఫీసర్, ఒక కంటి వైద్య నిపుణుడు, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్తోపాటు ఒక ఫార్మసిస్టు, హెల్త్ అసిస్టెంట్, సూపర్వైజర్, ముగ్గురు ఏఎన్ఎంలు, ముగ్గురు ఆశలు పనిచేశారు. జిల్లాలో 2,806 క్యాంపులు నిర్వహించారు. ఒకొక్క క్యాంపు ఖర్చుగా రూ.2500 చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి. అయితే ఈ క్యాంపు ఖర్చులకి తాగునీరు, టెంట్లు, కుర్చీలు, పనిచేసిన బృందానికి స్నాక్స్, భోజనం మొదలైనవి అందజేయాలి. అయితే ఈ క్యాంపుల్లో అత్యధికంగా ప్రభుత్వ పాఠశాలలు, గ్రామ పంచాయతీలు, మహిళా సమాఖ్య భవనాలు, యువజన సంఘాల భవనాల్లో నిర్వహించారు. తాగునీరు, కుర్చీలు, టెంట్ల ఖర్చు పెద్దగా కాలేదు. అదేవిధంగా పలు గ్రామాల్లో గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు భోజన సౌకర్యం కూడా కల్పించారు. పలు క్యాంపుల్లో పెద్దగా ఖర్చు కాలేదని క్యాంపులో పాల్గొన్న వారు చెప్పడం గమనార్హం. వైద్యులకు, ఇతర ఉద్యోగులకు ముందస్తుగా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, సమావేశాలు, ఇతర మెటీరియల్, వెహికిల్ స్టిక్కరింగ్ కోసం రూ.5లక్షలు ఖర్చుచేసినట్లు చూపిస్తున్నారు. కానీ ఇందులో సగం కూడా ఖర్చు కాలేదని ఆరోపణలు ఉన్నాయి. నేటికి సమర్పించని యూసీలు కంటి వెలుగు పథకం అమలుకోసం ప్రభుత్వం నుంచి నిధులు మాత్రం విడుదలయ్యాయి. కానీ ఏడు నెలలు గడిచినా నేటికి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించలేదు. నిధులు తొలివిడత రెండు సార్లు రూ.1,59,35,000 తర్వాత, రెండో విడత రూ. 44,65,000, మూడో విడత రూ. 30,11,396 మొత్తం రూ. 2,34,11,396 ప్రభుత్వం నుంచి విడుదల చేశారు. ఈ నిధులను క్యాంపు ఖర్చులకోసం ఒకొక్క క్యాంపుకు రూ. 2500 చొప్పున రూ. 70,15,000 కాగా ఇందులో రూ. 34,50,000 క్యాంపు నిర్వాహకుల ఖాతాలో జమచేశారు. రూ. 35,65,000 చెల్లించాల్సిఉంది. 25 వాహనాలకు ఒకొక్క వాహనానికి నెలకు రూ. 33వేల చొప్పున ఏడు నెలల కాలానికి రూ.57,75,000 కాగా ఇప్పటి వరకు రూ. 49,50,000 చెల్లించారు. మిగిలిన రూ. 8,25,000 చెల్లించాల్సి ఉంది. అదేవిధంగా మెడికల్ ఆఫిసర్కు నెలకు రూ.30వేల చొప్పున, కంటి వైద్యులకు నెలకు రూ.20వేలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు నెలకు రూ. 15వేల చొప్పున మొత్తం రూ. 86,97,700 చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.66,75,000 చెల్లించగా రూ. 20,22,700 చెల్లించాలి. ఏఆర్ హైరింగ్, వాహనాలకు స్టిక్కర్లు, పెషెంట్లకు అందజేసిన కార్డుల ప్రింటింగ్ మొదలైన వాటికి రూ. 10,52,331 ఖర్చు అయినట్లు చూపించారు. ఇందులో ఇప్పటి వరకు రూ.3,60,000 చెల్లించగా రూ.6,92,331 చెల్లించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు చెల్లించిన డబ్బులు, క్యాంపుల నిర్వాహణ ఖర్చులకు సంబంధించిన యూసీలను ఇవ్వకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు చెల్లించిన డబ్బులు పోగా.. మిగిలిన చెల్లింపులకు కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అనుమతి కోరగా.. ఖర్చుల వినియోగం ఫైల్స్ అస్పష్టంగా ఉందని, యూసీలు లేకపోవడంతో ఫైల్ వెనక్కి పంపినట్లు సమాచారం. యూసీలు ఇప్పటికీ రాలేదు.. కంటి వెలుగు పరీక్షల నిర్వాహణ, కంటి అద్దాల పంపిణీ కోసం నిర్వహించిన క్యాంపుల కోసం ఖర్చు సంబంధించిన యూసీలు ఇప్పటి వరకు అందజేయలేదు. క్యాంపు నిర్వహణకు రూ. 2500లకు మించకుండా ఖర్చుల వివరాలు అందజేస్తే, మిగిలిన డబ్బులు విడుదల చేస్తాం. తప్పుడు బిల్లులు సమర్పిస్తే చర్యలు తీసుకుంటాం. –నర్సింహం, ఏఓ డీఎండీహెచ్ఓ కార్యాలయం -
వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రారంభించిన కొడాలి నాని
-
‘ఉచితంగా కంటి ఆపరేషన్ చేపిస్తాం’
సాక్షి, విజయవాడ: విజయవాడలోని సత్యనారాయణపురంలో అంద్ర నలంద మున్సిపల్ హైస్కూల్లో ‘వైఎస్సార్ కంటి వెలుగు’పథకాన్ని మంత్రి కొడాలి నాని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ కంటి వెలుగు ద్వారా ప్రతి విద్యార్థికి కంటి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అవసరమైతే విద్యార్థులకు కళ్లజోళ్లను కూడా అందిస్తామన్నారు. కంటి వెలుగు పరీక్షల్లో ఆపరేషన్లు అవసరమైనవారికి ప్రభుత్వమే ఉచితంగా ఆపరేషన్ చేపిస్తుందని ప్రకటించారు. రాష్ట్రంలో ఎవరూ అవగాహన లోపంతో కంటి చూపును కోల్పోకూడదన్న ఆశయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. రాష్ట్రంలో ఆరు దశలలో వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం అమలవుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 5.40 కోట్ల ప్రజలకు పరీక్షలు నిర్వహిస్తామని పునరుద్ఘాటించారు. -
అందరికీ 'కంటి'వెలుగు అందిస్తాం
విద్యార్థుల్లో దృష్టి లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంధత్వ నివారణ లక్ష్యంగా ‘కంటి వెలుగు’ అమలు చేయనుంది. ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా గురువారం ఉదయం 11 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రారంభిస్తారు. తొలి దశలో ఈనెల 10 నుంచి 16 వరకు విద్యార్థులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు. మలి దశలో దృష్టి లోపాలు ఉన్న విద్యార్థులకు మందులు కళ్లద్దాలు పంపిణీ చేస్తారు. అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. సాక్షి, చిత్తూరు : నిత్య జీవితంలో ఎంతో ప్రాధాన్యం ఉన్న కళ్లను మారుతున్న జీవనశైలి కారణంగా అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఆహారపు అలవాట్లు, కనీస జాగ్రత్తలు పాటించకపోవడం, రాత్రిళ్లు ఎక్కువగా మేల్కొని టీవీ, సెల్ఫోన్లు చూడడం ద్వారా అనేకమంది దృష్టి లోపాల బారిన పడుతున్నారు. ఈ పరి ణామం కొందరి కళ్లల్లో వెలుగును శాశ్వతంగా దూరం చేస్తుండగా మరికొందరికి శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తోంది. ఇటువంటి బాధల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించారు. దృష్టిలోపం నివారణ దిశగా అడుగులు వేస్తున్నారు. అక్టోబరు 10న ప్రపంచ కంటి దృశ్య దినోత్సవం సందర్భంగా వైఎస్సార్ కంటి వెలుగును ప్రారంభించనున్నారు. మొత్తం రెండు దశలు.. తొలి దశలో 15 ఏళ్లలోపు పిల్లలకు, రెండో దశలో మిగిలిన వారికి కంటి పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మొత్తం 6,256 ఉన్నాయి. ఇందులోని 5,73,491 మంది విద్యార్థులకు స్క్రీనింగ్ చేయనున్నారు. కంటి పరీక్షలకు సంబంధించి బాల ఆరోగ్య రక్ష అధికారులు, పీహెచ్సీ వైద్యాధికారులకు, మండల విద్యాధికారులకు, ఏఎన్ఎంలు, ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి కిట్లు, కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమం కింద 3 మీటర్ల దూరంగా ఉన్నవి కన్పించకపోతే దృష్టి దోషం ఉన్నట్లు భావించనున్నారు. దృష్టి దోషం ఉన్నవారిని గుర్తించి ఆర్బీఎస్కే వాహనాల్లో పీహెచ్సీలో నిర్వహించే ప్రత్యేక వైద్య శిబిరాలకు తీసుకెళ్తారు. కంటి వైద్య నిపుణులు మరోసారి వారికి పరీక్షలు నిర్వహించి సమస్య ఉన్నవారికి కళ్లద్దాలు అందజేస్తారు. మెల్లకన్ను, శుక్లం ఉంటే వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా శస్త్రచికిత్సలకు సిఫారసు చేస్తారు. రెండోదశలో.. పెద్దలకు, వృద్ధులకు స్కీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆశా, అంగన్వాడీ వర్కర్లు, సచివాలయ ఏఎన్ఎంలు ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహిస్తారు. కంటి సమస్యలున్న వారిని గుర్తించి ఆరోగ్య ఉప కేంద్రానికి ప్రత్యేక శిబిరానికి తీసుకువెళ్తారు. అక్కడ మెడికల్ ఆఫీసర్, ఆప్తాల్మిక్ అసిస్టెంట్ కంటి పరీక్షలు చేస్తారు. అవసరమైన వారికి కళ్లద్దాలు ఇస్తారు. శస్త్రచికిత్సకు సిఫారుసు చేస్తారు. నేటి నుంచి ఎస్సార్ కంటి వెలుగు డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబరు 10 నుంచి 16 వరకు నిర్వహించనున్నట్లు డీఎంఅండ్హెచ్ఓ రామగిడ్డయ్య బుధవారం తెలిపారు. గురువారం ఉదయం 11 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రారంభిస్తారన్నారు. -
కంటివెలుగుపై ప్రత్యేక దృష్టి
అనంత మనవడు.. అలుపెరుగని బాటసారి.. అఖిలాంధ్రుల మనస్సు చూరగొన్న నేత.. అభివృద్ధికి ప్రతీక.. అధికార హోదాలో నేడు జిల్లాకు రానున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా జిల్లాలో పాదయాత్ర చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ‘అనంత’కు విచ్చేస్తున్నారు. ఇక్కడి నుంచే ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు సీఎంకు ఘన స్వాగతం పలికేందుకు అధికార పార్టీ నేతలంతా సిద్ధమయ్యారు. స్వాగత తోరణాలు, హోర్డింగ్లతో నగరాన్ని అలంకరించారు. సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తరహాలోనే అధికారం చేపట్టిన వెంటనే ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 108, 104 సర్వీసులకు పునర్జీవం పోశారు. వైద్యసేవలు మెరుగుపర్చేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నారు. తాజాగా దృష్టిలోపంతో బాధపడుతున్న చిన్నారులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ‘వైఎస్సార్ కంటి వెలుగు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని సీఎం ‘అనంత’ నుంచే ప్రారంభించనున్నారు. ఇందుకోసం నగరంలోని జూనియర్ కళాశాలలో జిల్లా ఉన్నతాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 5,78,330 విద్యార్థులకు ‘కంటి వెలుగు’ ‘వైఎస్సార్ కంటి వెలుగు’ అమలుకు జిల్లాలో 4,114 ప్రభుత్వ, 775 ప్రైవేట్ పాఠశాలను అధికారులు గుర్తించారు. తొలి రెండు దశల్లో జిల్లాలోని 4,889 ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలోని 5,78,330 మంది విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. మొదటి దశలో ఈ నెల 10 నుంచి 16వ తేదీ వరకు ఎంపిక చేసిన విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం 2,440 మంది ఆశ, ఏఎన్ఎం, ఉపాధ్యాయులు విద్యార్థులకు స్క్రీనింగ్ చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే 2,440 మెడికల్ కిట్లను వివిధ పీహెచ్సీలకు పంపారు. నవంబర్ 1వ తేదీ నుంచి 31 వరకు రెండో దశలో భాగంగా దృష్టిలోపంతో బాధపడుతున్న విద్యార్థులకు కళ్లద్దాలు పంపిణీ చేయడంతో పాటు సమస్య తీవ్రత అనుగుణంగా శస్త్ర చికిత్సలకు రెఫర్ చేస్తారు. రెండో దశకు రూ.48.025 లక్షల బడ్జెట్ను కేటాయించారు. 7,799 మంది భాగస్వామ్యం ‘వైఎస్సార్ కంటి వెలుగు’ విజయవంతం చేయడానికి కలెక్టర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు ఆరోగ్యశాఖాధికారులు, జిల్లా అంధత్వ నివారణ సంస్థ, తదితర శాఖలు 7,799 మందిని భాగస్వామ్యులు చేయనున్నారు. ఆరు దశల్లో 22 లక్షల మందికి.. ‘వైఎస్సార్ కంటి వెలుగు’ ద్వారా ఆరు దశల్లో జిల్లాలోని 22,10,491 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అంతే కాకుండా ఉచితంగా కళ్లద్దాల పంపిణీ, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేస్తారన్నారు. జిల్లా జనాభా 44,20,986 కాగా... అందులో 50 శాతం మందికి విద్యార్థులు, మహిళలు, వృద్ధులు తదితరులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. సర్వం సిద్ధం వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. సీఎం జగన్మోహన్రెడ్డి నగరంలోని జూనియర్ కళాశాలలో ఉదయం 11 గంటల నుంచి వివిధ స్టాళ్లను పరిశీలించనున్నారు. దీంతో పాటు నేత్రదానం, మాతా, శిశు సంరక్షణ, వైఎస్సార్ ఆరోగ్యరక్ష, విద్యార్థులకు స్క్రీనింగ్, కళ్లద్దాల పంపిణీ తదితర విషయాలను అధికారులు సీఎం జగన్మోహన్రెడ్డికి వివరిస్తారు. ఉదయం 11.35 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సీఎం వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం చిన్నారులకు కళ్లద్దాలు పంపిణీ చేయనున్నారు. జిల్లా జనాభా : 44,20,986 వైద్య పరీక్షలకు ఎంపిక చేసిన విద్యార్థులు : 5,78,330 ప్రభుత్వ పాఠశాలల సంఖ్య : 4,118 ప్రైవేట్ పాఠశాలల సంఖ్య : 775 కంటి పరీక్షలు నిర్వహించే బృందాలు : 2,440 మెడికల్ కిట్లు పంపిణీ చేసింది : 2,440 కార్యక్రమంలో పాల్గొనే సిబ్బంది, ఎన్జీఓలు : 7,799 -
వైఎస్ఆర్ కంటి వెలుగు నేడే ప్రారంభం
-
నేడు ‘వైఎస్సార్ కంటి వెలుగు’ ప్రారంభం
సాక్షి, అమరావతి: ప్రజారోగ్య రంగంలో మరో విప్లవాత్మక కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం శ్రీకారం చుట్టబోతున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కంటి సమస్యలను దూరం చేయడానికి ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పేరుతో బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. దీన్ని ఈ నెల 10 (గురువారం)న అనంతపురం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ‘కంటి వెలుగు’ కింద రాష్ట్రంలో 5.40 కోట్ల మందికి నేత్ర పరీక్షలతోపాటు అవసరమైన చికిత్సలను ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైద్యం, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన తనకు అత్యంత ప్రాధాన్య రంగాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అధికారులతో సమీక్షల సందర్భంగా ఈ రంగాల్లో చేపట్టాల్సిన ముఖ్యమైన అంశాలపైన కూడా సీఎం దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ప్రజలు పౌష్టికాహార లోపం, రక్తహీనతతోపాటు కంటి సమస్యలతో కూడా ఎక్కువగా బాధపడుతున్నారని, వీటిని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంట్లో భాగంగానే వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. ప్రతి మంగళవారం ‘స్పందన’పై సమీక్ష సందర్భంగా వైఎస్సార్ కంటి వెలుగును ఎలా నిర్వహించాలనే అంశంపై వైద్యారోగ్య శాఖ అధికారులతోపాటు జిల్లా కలెక్టర్లతోనూ సీఎం సమీక్షించారు. సమావేశాల్లో వ్యక్తమైన అభిప్రాయాలను, సూచనలను పరిగణనలోకి తీసుకుని ‘వైఎస్సార్ కంటి వెలుగు’కు కార్యాచరణ సిద్ధం చేశారు. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు చికిత్సలు వైఎస్సార్ కంటి వెలుగులో భాగంగా మొదటి దశలో సుమారు 70 లక్షల మంది విద్యార్థులకు ప్రాథమిక నేత్ర పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటిలోనూ పరీక్షలు జరుగుతాయి. ప్రపంచ దృష్టి దినం సందర్భంగా అక్టోబర్ 10 నుంచి 16 వరకు ఆరు పనిదినాల్లో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. తర్వాత రెండో దశలో కంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్టుగా గుర్తించిన వారిని నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు విజన్ సెంటర్లకు పంపించి అవసరమైన చికిత్స చేస్తారు. కళ్లద్దాలు, క్యాటరాక్ట్ ఆపరేషన్లు, ఇతర సేవలు ఉచితంగా అందిస్తారు. జిల్లా కలెక్టర్లు చైర్మన్లుగా వ్యవహరిస్తున్న టాస్క్ఫోర్స్ కమిటీలు జిల్లా స్థాయిలో కార్యక్రమాన్ని అమలు చేస్తాయి. 160 మంది జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్లు, 1,415 మంది వైద్యాధికారులు దీంట్లో భాగస్వాములవుతారు. ఇప్పటికే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ)కు నేత్ర పరీక్షలకు సంబంధించిన కిట్లను పంపించారు. 42,360 మంది ఆశా వర్కర్లు, 62,500 మంది టీచర్లు, 14 వేల మంది ఏఎన్ఎంలు, 14 వేల మంది ప్రజారోగ్య సిబ్బంది అన్ని స్కూళ్లలో జరిగే కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొంటారు. మూడు, నాలుగు, ఐదు, ఆరో దశల్లో కమ్యూనిటీ బేస్ ఆధారంగా కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1, 2020 నుంచి వీరికి పరీక్షలు, చికిత్సలు మొదలుపెడతారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని మొత్తం ఆరు దశల్లో మూడేళ్లపాటు అమలు చేస్తారు. నేడు పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న సీఎం అనంతపురం జూనియర్ కాలేజీ గ్రౌండ్లో గురువారం ఉదయం 11.30 గంటలకు కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. నేత్రదాన శిబిరం, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి, పోషణ్ అభియాన్, తల్లీబిడ్డల ఆరోగ్యానికి సంబంధించిన స్టాళ్లను సందర్శిస్తారు. పలు అభివృద్ధి పనులకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేస్తారు. తర్వాత జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం కంటి వెలుగు లబ్ధిదారులతో మాట్లాడతారు. -
ఏపీ ప్రభుత్వం మరో విప్లవాత్మక కార్యక్రమం
-
ఏపీ ప్రభుత్వం మరో విప్లవాత్మక కార్యక్రమం
సాక్షి, అమరావతి : ప్రజారోగ్య రంగంలో మరో విప్లవాత్మక కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలోని ప్రజలందరికీ కంటి సమస్యలు దూరంచేయడానికి బృహత్తర కార్యక్రమం అమలు చేయనుంది. ప్రపంచ కంటిచూపు దినోత్సవం(అక్టోబర్ 10) సందర్భంగా ‘వైయస్సార్ కంటి వెలుగు’ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. అనంతపురం జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ వేదికగా గురువారం ఉదయం 11.30 గంటలకు ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టునున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 5.40 కోట్ల మందికి నేత్ర పరీక్షలు చేసి, వారికి అవసరమైన చికిత్సలను అందిస్తారు. కంటి పరీక్షల నుంచి శస్త్రచికిత్సల వరకు అన్ని సేవలనూ ప్రభుత్వమే ఉచితంగా కల్పించనుంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 70 లక్షల మందికి పైగా విద్యార్థులకు మొదటి విడతలో కంటి పరీక్షలు నిర్వహిస్తారు. స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్ శస్త్ర చికిత్స, ఇతరత్రా వైద్య సేవలు ఉచితంగా అందిస్తారు. ఆ తర్వాత మిగిలిన మూడు, నాలుగు, ఐదు, ఆరు దశల్లో కమ్యూనిటిబేస్ ఆధారంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి వీరికి పరీక్షలు, చికిత్సలు మొదలుపెడతారు. మొత్తం ఆరు దశల్లో.. మూడేళ్ల పాటు ఈ కార్యక్రమం అమలుకానుంది. వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం తొలిదశలో భాగంగా అక్టోబర్ 10 నుంచి 16 వరకు 70 లక్షల మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. కంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్టు గుర్తించిన వారిని నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు రెండోదశలో అవసరమైన వైద్య చికిత్సలు అందిస్తారు. జిల్లా కలెక్టర్లు చైర్మన్లుగా వ్యవహరిస్తున్న టాస్క్ఫోర్స్ కమిటీలు జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాయి. 160 మంది జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్లు, 1415 మంది వైద్యాధికారులు దీంట్లో భాగస్వాములు అవుతారు. అన్ని పీహెచ్సీలకు కంటిపరీక్షలకు సంబంధించిన కిట్లను ఇప్పటికే పంపించారు. 42360 మంది ఆశావర్కర్లు, 62500 మంది టీచర్లు, 14000 మంది ఏఎన్ఎంలు, 14000 మంది ప్రజారోగ్య సిబ్బంది అన్ని స్కూళ్లలో జరిగే వైయస్సార్ కంటి వెలుగు కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. వైద్యం, విద్య, వ్యవసాయం, ఉపాధికల్పన తనకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వనున్నట్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఆయన ఒక్కో కార్యక్రమాన్ని అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా అధికారులతో సమీక్షల సందర్భంగా ఈ రంగాల్లో చేపట్టాల్సిన ముఖ్యమైన అంశాలపై కూడా ఆయన దృష్టి సారించారు. ఏపీలో చాలా మంది పౌష్టికాహారం, రక్తహీనత, కంటి సమస్యలతోకూడా ఎక్కువగా బాధపడుతున్నారని, దీన్ని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం రూపొందింది. ప్రతి మంగళవారం స్పందన కార్యక్రమంపై నిర్వహించే సమీక్ష సందర్భంగా ‘వైఎస్సార్ కంటి వెలుగు’ ఎలా నిర్వహించాలన్న దానిపై వైద్యారోగ్య శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లతో చర్చించారు. -
రేపు వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రారంభించనున్న సీఎం జగన్
-
రేపటి నుంచి ఏపీలో వైఎస్సార్ కంటి వెలుగు
-
10న వైఎస్సార్ కంటి వెలుగు ప్రారంభించనున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట్మాతకంగా చేపట్టనున్న ‘వైఎస్సార్ కంటి వెలుగు’ కార్యక్రమాన్ని గురువారం(10వ తేదీన) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతపురం జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో జరిగే సభలో పాల్గొననున్న సీఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ వైఎస్సార్ కంటి వెలుగు కింద ఉచితంగా కంటి పరీక్షలు, శస్త్రచికిత్సలు లభించనున్నాయి. 6 విడతలుగా మూడేళ్లపాటు ఈ కార్యక్రమం అమలు కానుంది. బుధవారం రాజమండ్రికి సీఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం రాజమండ్రి వెళ్లనున్నారు. వైఎస్సార్సీపీ నేత శివరామసుబ్రహ్మణ్యం కుమార్తె విహహ వేడుకకు సీఎం జగన్ హాజరుకానున్నారు. -
సీఎం సభను విజయవంతం చేయండి
సాక్షి, అనంతపురం : అనంతపురం వేదికగా ఈ నెల పదో తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్న ‘వైఎస్సార్ కంటి వెలుగు’ కార్యక్రమం, బహిరంగ సభను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ప్రజలకు అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై సోమవారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్రెడ్డి అధ్యక్షతన పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథి ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని అన్నారు. ప్రతికార్యకర్తకూ అండగా ఉంటామని, ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్నీ ప్రజలకు చేరవేసే విధంగా చూడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కంటి సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని గుర్తించి, దానిని నివారించేందుకు ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేసి, అవసరమైన శస్త్రచికిత్సలు, కళ్లద్దాలు అందించే బృహత్తర కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుడుతున్నారన్నారు. రాష్ట్రంలో విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదర్శ సీఎంగా నిలుస్తున్నారని జగన్మోహన్రెడ్డిని కొనియాడారు. విమర్శించే నైతిక హక్కు టీడీపీకి లేదు ఐదేళ్ల పాలనలో పనులను అసంపూర్తిగా చేపట్టి.. ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు టీడీపీకి లేదని అనంత పేర్కొన్నారు. కమీషన్ల కోసం పనుల వ్యయాలను ఇష్టారాజ్యంగా పెంచి ప్రభుత్వ నిధులను దోచుకున్న టీడీపీ నేతలకు వైఎస్సార్సీపీ పాలన గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. అనంతను సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు పెద్ద ఎత్తున నిధులను కేటాయించి పనులు చేస్తున్నామన్నారు. పండుగలా సీఎం పర్యటన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన జిల్లాకు పండుగలాంటిదని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంటు అద్యక్షులు నదీం అహమ్మద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు రాగే పరుశురాం, మహాలక్ష్మిశ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శులు వై మధుసూదన్రెడ్డి, ఎల్ఎం మోహన్రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు వై.వి.శివారెడ్డి, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, మీసాల రంగన్న, సీనియర్ నాయకులు కోగటం విజయభాస్కర్రెడ్డి, అనంత చంద్రారెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి, చవ్వా రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందన్నారు. సీఎం హోదాలో జిల్లాకు తొలిసారి వస్తున్న నేపథ్యంలో కార్యక్రమ విజయవంతానికి అందరి తోడ్పాటు అవసరమన్నారు. ‘కంటి వెలుగు’ కార్యక్రమంలో భాగంగా తొలివిడత 90 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలను చేయించడం శుభపరిణామమన్నారు. రాష్ట్రానికి దిశానిర్దేశం చేసే విద్యార్థులకు ఇలాంటి పరీక్షలు చేసి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు బోయ గిరిజమ్మ, జానకి, వాసంతి సాహిత్య, కృష్ణవేణి, శ్రీదేవి, మన్సూర్, కొర్రపాడు హుస్సేన్పీరా, చింతకుంట మధు, రిలాక్స్ నాగరాజు, ఏకేఎస్ ఫయాజ్, మునీరాబేగం, ఉమామహేశ్వరి, సాకే చంద్ర, దుర్గేష్, నజీర్అహమ్మద్, బాలాంజినేయులు, కాగజ్ఘర్ రిజ్వాన్, రియాజ్, బాలకృష్ణారెడ్డి, శివారెడ్డి, అనిల్కుమార్గౌడ్, శోభ, ఉష, ఖాజా, నియాజ్, రాజేష్రెడ్డి, రియాజ్, చంద్రశేఖర్రెడ్డి, నాగిరెడ్డి, గోగుల పుల్లయ్య, వడ్డే గోపాల్, కుళ్లాయిస్వామి, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 10న విద్యార్థులతో సీఎం ముఖాముఖి అనంతపురం అర్బన్: ‘‘వైఎస్సార్ కంటి వెలుగు’ రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 10న అనంతపురం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు. అక్కడే బహిరంగసభలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి’ అని కలెక్టర్ ఎస్.సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ సత్యనారాయణ. చిత్రంలో జేసీ, జేసీ–2, కమిషనర్ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమావేశం నిర్వహించారు. కంటి వెలుగుకు సంబంధించి మూడు స్టాళ్లతో పాటు నేత్రదాన శిబిరం, వైఎస్సార్ ఆరోగ్య శ్రీ, పోషణ్ అభియాన్, అమ్మ ఒడి స్టాళను ఏర్పాటు చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా కార్యక్రమం ప్రారంభోత్సవానికి తీసుకుంటున్న చర్యలను డీఎంహెచ్ఓ అనిల్కుమార్ వివరించారు. విద్యార్థులను బహిరంగసభకు తీసుకొచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలని డీఈఓ, సంక్షేమ శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జేసీ ఎస్.డిల్లీరావు, జేసీ–2 సుబ్బరాజు, డీఆర్ఓ ఎం.వి.సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఇఇదిలా ఉండగా సీఎం బహిరంగ సభకు సంబంధించి కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను సోమవారం కలెక్టర్ సత్యనారాయణ పరిశీలించి అధికారులకు తగు సూచనలిచ్చారు. -
సీఎం జగన్ ‘అనంత’ పర్యటన ఖరారు
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనంతపురం జిల్లా పర్యటనకు తేదీ ఖరారైంది. ఈ నెల 10వ తేదీన కంటివెలుగు కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి నిర్వహించేందుకు జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల, పీటీసీ మైదానాలను శనివారం సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్యే అనంత వెంట్రామిరెడ్డి, విద్యా సంస్కరణల కమిటీ సభ్యులు ఆలూరు సాంబశివారెడ్డిలు పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ సత్యయేసుబాబు సమీక్ష నిర్వహించారు. ఐదు కోట్ల మంది ప్రజల కోసమే కంటివెలుగు ఈ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభిస్తున్నారని మంత్రి శంకర్ నారాయణ ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యాన్ని అందించటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రపంచ కంటి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని చేపట్టామని అనంతపురం అర్భన్ ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి చెప్పారు. తొలిదశలో విద్యార్థులకు కంటి పరీక్షలు జరగనున్నాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనను విజయవంతం చేయాలని ఆయన కోరారు. కాగా, ఆటోలు, క్యాబ్లు, కార్లు నడుపుకొని జీవించే పేద వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఏటా రూ.10 వేలు చొప్పున అందించే ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకాన్ని సీఎం జగన్ శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రారంభించారు. -
10న అనంతపురంలో ‘వైఎస్సార్ కంటి వెలుగు’
సాక్షి ప్రతినిధి, అనంతపురం: వచ్చే నెల 10న అనంతపురం జిల్లాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్నారు. వైఎస్సార్ కంటి వెలుగు పథకం కింద విద్యార్థులతో పాటు అందరికీ ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్ల కార్యక్రమాన్ని జిల్లా నుంచే సీఎం ప్రారంభించనున్నట్టు ఇన్చార్జి మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కలెక్టర్ సత్యనారాయణ ఆధ్యర్వంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశం (డీఆర్సీ)లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై ఆయన చర్చించారు. ఇంటి వద్దకే పాలన అందించేందుకే గ్రామ సచివాలయ వ్యవస్థను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చారని.. అక్టోబర్ 2 నుంచి ఈ వ్యవస్థ ప్రారంభమవుతుందన్నారు. గ్రామ సచివాలయ పరీక్షల్లో అర్హత సాధించిన వారందరికీ 30వ తేదీలోగా నియామక ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. గ్రామ సచివాలయ పరీక్ష పేపర్ లీకేజీ అంటూ ఎల్లో మీడియా తప్పుడు కథనాలను ప్రచురించిందని ఆయన మండిపడ్డారు. తప్పుడు వార్తలు రాసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రక్రియకు ఇబ్బంది కలగకుండా.. అక్టోబర్ 2న సచివాలయాల వ్యవస్థ ఏర్పడిన తర్వాత చట్టపరంగా ముందుకెళ్తామన్నారు. ఇక ఒక్కో నియోజకవర్గానికి రూ.10 కోట్లను ఇవ్వడంతోపాటు స్వచ్ఛాంధ్ర కింద మరో రూ.5 కోట్లు కేటాయిస్తామన్నారు. ఈ నిధులను గ్రామ సచివాలయాల నిర్మాణంతో పాటు అంగన్వాడీల నిర్మాణానికి వినియోగిస్తామన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు సుపరిపాలన అందించడమే సీఎం వైఎస్ జగన్ ఉద్దేశమని మంత్రి శంకరనారాయణ తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. -
కంటి పాపలకు వైఎస్సార్ వెలుగు
సాక్షి, కొత్తవలస /శృంగవరపుకోట: పసిపిల్లల నుంచి పండుటాకుల వరకూ ఉచిత నేత్ర చికిత్సలుపౌష్టికాహార లోపం.. ఒత్తిడితో కూడిన విద్య.. ఏదైనా కారణం కావచ్చు.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఇటీవల కాలంలో దృష్టి లోపాలతో బాధపడుతున్నారు. పసిపిల్లల నుంచి పండుటాకుల వరకూ అందరికీ దృష్టిలోపాలు సవరించి అవసరమైన కంటి శస్త్రచికిత్సలు ఉచితంగా నిర్వహించేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ‘డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని’ అక్టోబర్ 10 తేదీ నుంచి 16 తేదీ వరకూ జిల్లాలో అమలు చేయనుంది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మానస పుత్రికగా భావించి ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. జిల్లా జనాభాలో ఎలాంటి కంటి సమస్యలున్నా పరిష్కరించడమే ధ్యేయంగా వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని రూపొందించారు. జిల్లాలోని సుమారు 3,504 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 3,09,000 మంది విద్యార్థులకు మెదటి దశలో అక్టోబర్ 10 నుంచి 16 వరకూ ప్రాథమిక కంటి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. తాజాగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులకు పీహెచ్సీ పరిధిలో శిక్షణ కూడా ఇచ్చారు. ప్రాథమిక స్థాయిలో గుర్తింపు పాఠశాలల్లో ఉపాధ్యాయులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు 10 నుంచి 15 సంవత్సరాల వయసున్న చిన్నారులకు ప్రాథమిక పరీక్షలు (స్క్రీనింగ్) నిర్వహించి దృష్టి లోపాలున్న వారిని గుర్తిస్తారు. అనంతరం పీహెచ్సీల్లో ఏఎన్ఎంలు దృష్టి లోపాలున్న విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. రెండోదశలో ఆప్తాలమిస్టులు వచ్చి పాఠశాలల వారీగా ప్రాథమిక పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు అందజేస్తారు. కంటి శస్త్రచికిత్సలు అవసరమైన వారికి జిల్లా ఆసుపత్రి, ప్రభుత్వ, ఏరియా, రోటరీ, లైన్స్క్లబ్ ఆస్పత్రుల్లో ఏర్పాట్లు చేస్తారు. ఇప్పటికే జిల్లా అంధత్వ నివారణ సంస్థ విద్యార్థుల జాబితా తయారు చేసినట్టు సమాచారం.రెండు డివిజన్లలో..జిల్లా అంధత్వ నివారణ సంస్థతోపాటు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 10 నుంచి 16 వరకూ రెండు డివిజన్లలో అమలు చేస్తారు. 2022 లోపు పథకాన్ని పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. రెండోదశలో నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకూ ఎంపిక చేసిన పిల్లలకు కళ్లద్దాలు అందించడం లేదా కంటి శస్త్రచికిత్సలు చేస్తారు. పక్కాగా అమలు జిల్లాలో వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని పక్కాగా అమలు చేస్తాం. ఇందుకోసం జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో టాస్స్ఫోర్సు కమిటీ పనిచేస్తుంది. ఆరు దశల్లో జిల్లాలో పూర్తిగా అంధత్వ నివారణ చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. జిల్లాలోని 23,40,000 మంది జనాభాలో మెదటి, రెండు దశల్లో పాఠశాల విద్యార్థులు, మూడోదశలో 20,31,000 పెద్దలకు ఫిబ్రవరి 1 నుంచి 15 వరకూ ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తాం. ప్రతి 10 పీహెచ్సీలకు ప్రోగ్రాం అధికారుల్ని నియమిస్తున్నాం . – కె.విజయలక్ష్మి, డీఎంఅండ్హెచ్ఓ కార్యాచరణ సిద్ధం వైఎస్సార్ కంటి వెలుగు పథకం అమలుకు కార్యాచరణ సిద్ధం చేశాం. కలెక్టర్ చైర్మన్గా డీఎంఅండ్హెచ్, నోడల్ అధికారి, డీసీహెచ్ఎస్, డీపీఎం, డీఈఓ కలిపి టాస్క్ఫోర్స్ కమిటీగా పనిచేస్తున్నారు. విధి విధానాలపై ఇప్పటికే మండలస్ధాయి పీహెచ్సీల్లో శిక్షణ నిర్వహించాం. జిల్లాలో పథకాన్ని అక్టోబర్ 10న ప్రారంభిస్తాం. – డాక్టర్ కేఎన్ మూర్తి, జిల్లా అంధత్వ నివారణాధికారి ఉపాధ్యాయులు సహకరించాలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ కంటిచూపు ప్రసాదిస్తున్నారు. ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది సమన్వయంతో చేయూతనిస్తే పాఠశాలల్లో ఇక దృష్టి లోపాలున్న విద్యార్థులు ఉండరు. అందువల్ల విద్య అభ్యసించేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. – తారకేశ్వరరావు, ఉపాధ్యక్షుడు, రాష్ట్ర ఆప్తాలమిక్ ఆఫీసర్ల సంఘం -
అక్టోబర్ 10న వైఎస్సార్ కంటి వెలుగు పథకం
సాక్షి, అమరావతి: 'వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం' అక్టోబరు 10 నుంచి ప్రారంభం కానుంది. పథకంలో భాగంగా రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. కంటి వెలుగు పథకం కింద.. స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్ శస్త్ర చికిత్స, ఇతరత్రా అవసరమైన పరీక్షలను నిర్వహిస్తారు. కాగా వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని మొత్తం ఐదు దశల్లో అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి రెండు దశల్లో స్కూల్ విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మిగిలిన మూడు, నాలుగు, ఐదు దశల్లో కమ్యూనిటిబేస్ ఆధారంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పథకం పర్యవేక్షణకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఛైర్మన్గా వ్యవహరిస్తారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటయిన టాస్క్ఫోర్స్ కమిటీలు కంటి వెలుగు పరీక్షల నిర్వహణ, వసతుల కల్పనకు సంబంధించిన ఏర్పాట్లను చూస్తోంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. -
కంటి వెలుగవుతాం
ప్రజలందరికీ కంటి పరీక్షలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు శంకర నేత్రాలయ, ఎల్వీ ప్రసాద్ ఐ ఆసుపత్రి, ఇతర ఎన్జీఓల సహకారం తీసుకుంటాం.ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు జిల్లాల్లో టాస్క్ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేస్తాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 5.3 కోట్ల మంది ప్రజలకు ఆరు విడతలుగా వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం కింద కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. మూడేళ్ల కాలంలో మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ కంటికి సంబంధించిన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రూ.560 కోట్లతో వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం చేపట్టనున్నామని.. స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్ శస్త్ర చికిత్స, ఇతరత్రా అవసరమైన పరీక్షలన్నీ ఈ పథకం కింద జరుగుతాయని చెప్పారు. ‘స్పందన’ కార్యక్రమంపై మంగళవారం ఆయన సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం కోసం చేసిన ఏర్పాట్లపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. అక్టోబరు 10 నుంచి 16 వరకు తొలి దశలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని 70 లక్షల మందికి పైగా విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తామని, రెండో విడతలో నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు అవసరమైన విద్యార్థులకు శస్త్రచికిత్సలు చేయిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మూడు, నాలుగు, ఐదు, ఆరు విడతల్లో మిగిలిన ప్రజలందరికీ దశల వారీగా కంటి పరీక్షలు, చికిత్సలు అందిస్తామని స్పష్టం చేశారు. జిల్లాల్లో టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసి పటిష్టంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని సీఎం సూచించారు. మొదటి స్క్రీనింగ్లో చికిత్స అవసరమున్న విద్యార్థులను గుర్తించి ఆ మేరకు వారికి తదుపరి చికిత్స అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా వెబ్సైట్ను రూపొందించామని చెప్పారు. రక్తహీనతను అధిగమించాల్సిందే పౌష్టికాహార లోపం, రక్తహీనతతో బాధపడుతున్న మహిళలకు రోజుకు రూ.43, చిన్నారులకైతే రూ.18 ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా పౌష్టికాహార లోపం, రక్తహీనతను అధిగమించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్లు, అంగన్వాడీ కేంద్రాలను సమర్థవంతంగా వినియోగించుకోగలిగితే ఈ సమస్యను అధిగమించవచ్చన్న విశ్వాసం ఉందని సీఎం పేర్కొన్నారు. వలంటీర్లు ప్రతి ఇంటినీ సర్వే చేసి, పిల్లలను, తల్లులను, మహిళలను అంగన్వాడీ కేంద్రాల దగ్గరకు వెళ్లేలా మోటివేట్ చేయించి, అక్కడ వారికి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. రక్తహీనత పరీక్షలు నిర్వహించాక వారి ఆరోగ్య కార్డులో వివరాలు పొందుపరిచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. పర్యవేక్షణ బాధ్యతను వలంటీర్లకు అప్పగించాలన్నారు. అంగన్వాడీల ద్వారా ఏమేమి ఇవ్వబోతున్నామో వలంటీర్లకు సమాచారం ఇచ్చి, ఆ మేరకు అవన్నీ కూడా పిల్లలు, తల్లులకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందన్నారు. పారిశుద్ధ్యం, ఆహారం, తాగునీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని, వచ్చే సమీక్షా సమావేశానికి దీనిపై ఏం చర్యలు తీసుకున్నారన్న దానిపై నివేదించాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయాల్లో సోషల్ ఆడిట్ అక్టోబర్ 2 నుంచి ప్రారంభిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల్లో సోషల్ ఆడిట్కు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో సామాజిక తనిఖీలు పూర్తి చేయాలని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాలు అందుబాటులోకి రాగానే అక్కడే ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాలను ఉంచాలన్నారు. పెన్షన్లు, రేషన్కార్డులు ఉన్న వారి జాబితాను బోర్డులో పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇళ్ల స్థలాల పట్టాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితా కూడా పెట్టే ప్రయత్నం చేయాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాలన్నింటినీ బోర్డులో ఉంచాలని చెప్పారు. ఈ జాబితాలపై ఏమైనా అభ్యంతరాలుంటే, పథకం ఎవరికైనా అందకపోతే ఆ సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. కొత్త రేషన్కార్డులు, పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి డిసెంబర్ నుంచి ఇవ్వాలన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు అందాలని, వారికి అందించాల్సిన ధర్మం, బాధ్యత మనదేనని సీఎం స్పష్టం చేశారు. వైఎస్సార్ రైతు భరోసాపై అవగాహన కల్పించాలి కౌలు రైతులకు సంబంధించి వైఎస్సార్ రైతు భరోసా మార్గదర్శకాలపై గ్రామ సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు పూర్తి స్థాయి అవగాహన ఉండాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. దరఖాస్తులు, ప్రొఫార్మాలు అన్నీ కూడా అక్టోబర్ 2 నాటికి అందుబాటులో ఉంచడంతో పాటు లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తి చేయాలన్నారు. ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు లబ్ధిదారుల ఎంపిక, వెరిఫికేషన్ వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. సెప్టెంబర్ ఆఖరు నాటికి డేటా కలెక్షన్, వెరిఫికేషన్ పూర్తి కావాలన్నారు. అక్టోబర్ చివరి నాటికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి ఎంతో తేల్చాలని, నవంబర్ నుంచి అవసరమైన చోట భూముల కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని చెప్పారు. అధికారులందరూ ఈ కార్యక్రమంపై దృష్టి పెట్టాలని సూచించారు. సొంతంగా ఆటో, ట్యాక్సీ, మాక్సీ కాబ్లు నడుపుకుంటున్న వారికి ఏడాదికి రూ.10 వేల ఆర్థిక సాయం పథకానికి సంబంధించి దరఖాస్తులు, తనిఖీలు, ఆమోదంపై ఆరా తీశారు. వరద జలాలు సద్వినియోగం చేసుకోవాలి కర్నూలు, వైఎస్సార్, ప్రకాశం తదితర ప్రాంతాల్లో భారీ వర్షాల సమాచారం వస్తోందని, అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. అనంతపురంలో చిరుధాన్యాల విత్తనాలను పంపిణీ చేస్తున్నామని ఈ సందర్భంగా ఆ జిల్లా కలెక్టర్ తెలిపారు. వచ్చే ఏడాది నాటికి రాయలసీమ ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో నింపేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. 117 టీఎంసీల నీరు వెళ్లినా రిజర్వాయర్లు నిండలేదంటే.. కాల్వల పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందోని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్ వరద జలాలు సద్వినియోగం చేసుకునే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాలు, వరదల కారణంగా ఇసుక అందుబాటులోకి రాలేదని వివిధ జిల్లాల అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. గోదావరి, కృష్ణా నదుల్లో ఇంకా ప్రవాహం కొనసాగుతోందని, వరద తగ్గిన వెంటనే రీచ్లు అందుబాటులోకి వస్తాయని వివరించారు. వరద తగ్గగానే వీలైనంత ఇసుకను స్టాక్ యార్డుల్లోకి తరలించడానికి ముమ్మర ప్రయత్నాలు చేయాలని సీఎం ఆదేశించారు. మానవీయ దృక్పథంతో ప్రజల వినతులు పరిష్కరించాలి ప్రజల నుంచి వచ్చే వినతుల పరిష్కారంలో మరింత మానవీయ దృక్పథంతో ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రధానంగా ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు మానవీయ కోణంలో ప్రజల వినతులకు పరిష్కారం చూపాలని కోరారు. వినతులు ఇచ్చే వారి స్థానంలో మనం ఉంటే ఎలా ఆలోచిస్తామో అదే రీతిలో మనం స్పందించాలని, అప్పుడే స్పందనకు అర్థం ఉంటుందన్నారు. స్పందన ద్వారా అందే వినతుల పరిష్కారంలో నాణ్యత కోసం కార్యాచరణ ప్రణాళిక తయారు చేశామని, ఇందులో భాగంగా ఎమ్మార్వోలు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు వర్క్షాపు నిర్వహిస్తామని చెప్పారు. సమస్యలు తీరుస్తామన్న ఆశతో ప్రజలు మన దగ్గరకు వస్తారని, అందుకు అనుగుణంగానే అధికారులు స్పందించాలని కోరారు. ఇందు కోసమే ఈ వర్క్షాపులని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ నెల 24, 27 తేదీల్లో, అక్టోబర్లో జిల్లాల స్థాయిలో రెండు రోజుల పాటు వర్క్షాపులు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. దిగువ స్థాయి అధికారుల్లో మరింత మోటివేషన్ పెంచడమే దీని ఉద్దేశమని, కలెక్టర్లు కూడా ఈ వర్క్షాపులో పాల్గొనాలని సూచించారు. నవంబర్ నుంచి స్పందన వినతుల విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజలందరికీ కంటి పరీక్షలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు శంకర నేత్రాలయ, ఎల్వీ ప్రసాద్ ఐ ఆసుపత్రి, ఇతర ఎన్జీఓల సహకారం తీసుకుంటాం. ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు జిల్లాల్లో టాస్క్ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఇతర వర్గాల్లో పేదరికంతో ఉన్న మహిళలు, తల్లులు, పిల్లలను పౌష్టికాహార లోపం సమస్య నుంచి గట్టెక్కించాల్సిందే. ప్రభుత్వం ఇంతగా ఖర్చు చేస్తున్నా, పౌష్టికాహార లోపం ఎందుకు వస్తోంది? అవసరమైతే మరింత ఖర్చు చేద్దాం.. కానీ సమస్య పరిష్కారం కావాల్సిందే. -
కంటిపాపకు వెలుగు
విశేష పథకాలు.. వినూత్న కార్యక్రమాలు.. విప్లవాత్మక మార్పులు.. ఇదీ రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన తీరు. ఈ క్రమంలోనే ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ మరో బృహత్తర కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుడుతున్నారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్న పెద్దల మాటలను ఉటంకిస్తూ ‘వైఎస్సార్ కంటి వెలుగు’ను ప్రారంభిస్తున్నారు. దీని ద్వారా దృష్టి లోపం ఉన్న వారికి ఉచితంగా పరీక్షలు చేయించి.. అవసరమైన వారికి కంటి అద్దాలు, మందులు.. ఇంకా అవసరమైతే శస్త్రచికిత్సలు కూడా ఉచితంగానే చేయించాలనే ఆదర్శప్రాయమైన విధానానికి నాంది పలుకబోతున్నారు. సాక్షి, కృష్ణా: రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా కంటి పరీక్ష నిర్వహించాలనినే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పేరుతో కొత్త పథకాన్ని తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా చిన్నారులతో పాటు పెద్దల్లో దృష్టి లోప సమస్యల నివారణకు చర్యలు చేపట్టనున్నారు. అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు, మందులు, శస్త్రచికిత్సలు కూడా నిర్వహించనున్నారు. అక్టోబర్ పదో తేదీ ప్రపంచ దృష్టి దినోత్సవం.. దీనిని పురస్కరించుకుని ఆ రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పథకం ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. రెండు దశల్లో.. ఈ కార్యక్రమాన్ని రెండు దశల్లో చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. తొలి దశలో 15 ఏళ్లలోపు పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. రెండో దశలో రాష్ట్రంలోని వారందరికీ నేత్ర పరీక్షలు.. అవసరమైతే శస్త్ర చికిత్సలు చేయనున్నారు. చిన్నారులతో మొదలు.. చిన్నారుల్లో కంటి సమస్యలు మొదటి దశలోనే గుర్తించి అవసరమైన చికిత్సలు చేసి దృష్టిలోప సమస్యల నుంచి బయటపడవచ్చు. దురదృష్టవశాత్తు కొన్నేళ్లుగా విద్యార్థులకు కంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం లేదు. కేవలం ప్రకటనలకే పరిమితమవుతూ వచ్చారు. దీని ద్వారా వేలాది మంది విద్యార్థులు కంటి సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. జిల్లాలోని 6,12,812 మంది ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు మొద టి ప్రాధాన్యత మండల, డివిజన్ స్థాయిలో కంటి వైద్య పరీక్షలు చేయనున్నారు. స్క్రీనింగ్లో కనిపెడతారు.. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తొలిదశలో గ్రామస్థాయిలో జిల్లాలోని విద్యార్థులకు (1 నుంచి 10వ తరగతి) అంగన్వాడీ వర్కర్లు, ఆశా, టీచర్లు ప్రైమరీ స్క్రీనింగ్ నిర్వహిస్తారు. దృష్టి సమస్యతో బాధపడుతున్న వారిని గుర్తించి, స్థానిక పీహెచ్సీల్లో ఏర్పాటు చేసే క్యాంపులకు తీసుకువెళ్తారు. కంటి వైద్యనిపుణులు దృష్టి లోపంతో ఇబ్బందిపడుతున్న విద్యార్థులకు మరోసారి కంటి పరీక్షలు నిర్వహించి, సమస్య ఉన్న వారికి కళ్లద్దాలు పంపిణీ చేస్తారు. మెల్లకన్ను, శుక్లం సమస్య ఉంటే ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా శస్త్రచికిత్సలకు సిఫార్సు చేస్తారు. 2020 జనవరి నుంచి రెండో దశ.. రెండో దశలో పెద్దలు, వృద్ధులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. 2020 జనవరిలో రెండో దశ కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆశా, అంగన్వాడీలు, కొత్తగా విధుల్లో చేరతున్న గ్రామ, వార్డు సచివాలయ వైద్య సహాయకులు ఇంటింటికి తిరిగి సర్వే చేస్తారు. కంటికి సంబంధించిన జబ్బులున్న వారిని గుర్తించి ఆరోగ్య ఉప కేంద్రానికి ప్రత్యేక శిబిరానికి తీసుకువెళతారు. మెడికల్ ఆఫీసర్, ఆప్తాల్మిక్ అసిస్టెంట్ ప్రారంభదశలో చెక్ చేస్తారు. అవసరమైన వారికి కళ్లద్దాలు, శస్త్ర చికిత్సలకు సిఫారసు చేస్తారు. అందరికీ కంటి పరీక్షలు.. ప్రభుత్వం వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం కింద ప్రజలందరికి కంటి పరీక్షలు చేయాలని నిర్ణయించి ంది. మొదటి దశలో విద్యార్థులు, రెండోదశలో మిగిలిన వారికి. దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించి అవసరమైన వారికి అద్దాలు ఉచితంగా ఇవ్వటంతో పాటు శస్త్రచికిత్సలు సిఫారుసు చేస్తాం. –టి. శ్రీరామచంద్రమూర్తి, డీఎంహెచ్ఓ -
‘చీకట్లు’ తొలగేనా..?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటివెలుగు కార్యక్రమం మసకబారుతోంది. శస్త్ర చికిత్స చేస్తే మసక చీకట్లు తొలగి కంటిచూపు మెరుగు పడుతుందని ఆశించిన వారికి ఆ చూపేమో కానీ.. ఎదురుచూపులు మాత్రం తప్పడం లేదు. కంటివెలుగు పరీక్షలు చేయించుకుని ఆపరేషన్ల కోసం ఆరు నెలలుగా వేలాది మంది వేచి చూస్తున్నారు. ప్రభుత్వం తమపై ఎప్పుడు కరుణ చూపుతుందో.. తమ జీవితాల్లో చీకట్లు ఎప్పుడు తొలగిపోతాయో అని వారు నిరీక్షిస్తున్నారు. సాక్షి, ఖమ్మం(బూర్గంపాడు) : రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అగస్టులో కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. జిల్లాలోని అన్ని గ్రామాలలో ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స నిర్వహించారు. దృష్టి లోపం ఉన్నవారికి పరీక్షలు జరిపారు. రీడింగ్ గ్లాస్లు, మందులు అవసరమైన వారికి వెంటనే అందించారు. ప్రత్యేకంగా తయారు చేసిన కళ్లజోళ్లు కావల్సిన వారికి కూడా ఐదు నెలల తర్వాత పంపిణీ చేశారు. శస్త్ర చికిత్సలు అవరసమైన వారిని గుర్తించి రిఫరల్ ఆస్పత్రులకు పంపేందుకు ఆన్లైన్లో నమోదు చేశారు. అయితే కంటివెలుగు శిబిరాలు పూర్తయి ఆరు నెలలు కావస్తున్నా.. ఆపరేషన్లు అవసరమైన వారికి మాత్రం ఇప్పటి వరకూ చేయలేదు. దీంతో పేర్లు నమోదు చేసుకున్న వారు తమకు శస్త్ర చికిత్సలు ఎప్పుడు చేస్తారోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. 4.93 లక్షల మందికి కంటి పరీక్షలు... జిల్లాలో కంటివెలుగు కార్యక్రమం కింద 4.93 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1.20 లక్షల మందికి కళ్లద్దాలు, మందులు అందించారు. మరో 45 వేల మందికి ప్రత్యేకంగా కళ్లజోళ్లు తయారు చేయించి పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 23 వేల మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించారు. వారి పేర్లు, ఎదుర్కొంటున్న సమస్యల వివరాలను ఆన్లైన్ చేశారు. ఏ ఆస్పత్రిలో ఎవరికి ఆపరేషన్లు చేయాలనే ప్రక్రియ కూడా పూర్తి చేశారు. ఈ తంతు పూర్తయి ఆరు నెలలు గడిచింది. కానీ ఇప్పటివరకు ఆపరేషన్లు మాత్రం ప్రారంభించలేదు. వైద్యాధికారులను సంప్రదిస్తే ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని చెపుతున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో 23 వేల మంది కంటివెలుగు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. సాధ్యమైనంత తొందరగా ఆపరేషన్లు చేయించాలని వారు కోరుతున్నారు. ఆపరేషన్లు చేయటం లేదు కంటివెలుగు శిబిరంలో పరీక్షలు చేసి ఆపరేషన్ చేయాలన్నారు. ఇప్పటికి ఆరునెలలైనా ఎవరూ పట్టించుకోవడం లేదు. మాకు కళ్లజోళ్లు కూడా ఇవ్వలేదు. ఆపరేషన్ చేస్తారని ఎదురు చూస్తున్నాం. – పుట్టి లక్ష్మి, గౌతమిపురం ప్రైవేటు ఆస్పత్రులకు పోతున్నారు కంటివెలుగులో ఆపరేషన్ చేయకపోవటంతో కొంతమంది ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి చేయించుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే కంటివెలుగులో ఆపరేషన్లు చేయాలి. లేకపోతే ఆ కార్యక్రమానికి అర్థమే లేదు. స్వచ్ఛంద సంస్థల వారు కూడా క్యాంపులు పెట్టి కళ్లజోళ్లు ఇస్తున్నారు. – ఎడారి అచ్చారావు, బూర్గంపాడు ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు జిల్లాలో 23 వేల మందికి కంటి శస్త్ర చికిత్సలకు రికమండ్ చేశాం. వారి పేర్లు, చేయాల్సిన ఆపరేషన్ వివరాలను ఆన్లైన్లో నమోదు చేశాం. రిఫరల్ ఆస్పత్రుల వివరాలను కూడా ఆన్లైన్ చేశాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే తదుపరి చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ భావ్సింగ్, కంటివెలుగు జిల్లా ఇన్చార్జ్ -
ఆరోగ్య తెలంగాణ లక్ష్యం
సిరిసిల్ల: ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హైదరాబాద్కు చెందిన ఎల్వీ ప్రసాద్ వైద్యవిజ్ఞాన సంస్థ సిరిసిల్లలో ఏర్పాటు చేస్తున్న కంటి ఆస్పత్రి భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కంటి సమస్యల పరిష్కారానికి కంటి వెలుగు పథకాన్ని కేసీఆర్ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రం లో కంటి సమస్యలు లేకుండా చేస్తామని వివరించారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి ఆరోగ్య స్థితిగతులను సేకరించి హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తున్నామని వివరించారు. ఆరోగ్య తెలంగాణను సాధించేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. ప్రైవేటు సంస్థలూ ముందుకు రావాలి.. సర్వేంద్రియానాం నయనం ప్రధానమని, మనిషికి ప్రపంచాన్ని చూపించేవి కళ్లని, అలాంటి కంటి వైద్యంలో ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాల పేదల సేవలో ముందుందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న సేవలకు తోడుగా ప్రైవేటు సంస్థలు కూడా పేదల సేవకు ముందుకు వస్తే బాగుంటుందన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)లో భాగంగా ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాల, హెటెరో వంటి సంస్థలు సిరిసిల్లలో పేదలకు సేవలందించేందుకు ముందుకు రావడం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. హెటెరో ఫౌండేషన్ సిరిసిల్లలో రూ.5 కోట్లతో 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కంటి ఆస్పత్రి భవనాన్ని నిర్మిస్తుందని వివరించారు. వీరి స్ఫూర్తితో మరిన్ని సంస్థలు పేదల వర్గాలకు సేవలందించేందుకు ముందుకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎల్వీ ప్రసాద్ సంస్థ వైస్చైర్మన్ ఆత్మకూరి రామన్ మాట్లాడుతూ.. 32 ఏళ్లుగా ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాల 2.80 కోట్ల మంది పేదలకు వైద్య సేవ లు అందించిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కంటి వైద్యసేవల్లో ఎల్వీ ప్రసాద్ సంస్థ ముందుందని పేర్కొన్నారు. హెటెరో సంస్థ ప్రతినిధి రత్నాకర్రెడ్డి మాట్లాడుతూ.. మా సంస్థ సంపద సృష్టించి పది మందికి పంచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుందని తెలిపారు. భవన నిర్మాణానికి రూ.50 లక్షల చెక్కును కేటీఆర్కు అందించారు. -
ఎన్జీవోల ద్వారా ‘కంటి వెలుగు’
సాక్షి, హైదరాబాద్: కంటి వెలుగు కార్యక్రమంలో పెండింగ్లో ఉన్న ఆపరేషన్లను పూర్తిచేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు స్వచ్ఛంద సంస్థ లు, ఎల్వీ ప్రసాద్ వంటి ప్రముఖ ఆస్పత్రుల్లో వీలైనంత త్వరగా కంటి ఆపరేషన్లు చేయాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. సరోజినీదేవి కంటి ఆస్పత్రిలోనూ అదనపు వసతులు కల్పించి ఆపరేషన్లు జరిగేలా ఏర్పా ట్లు చేయాలని ఆ శాఖ భావిస్తోంది. దీనికి సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎన్నికల వల్ల నిలిచిన ఆపరేషన్లను సత్వరం పూర్తిచేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఈ పథకం కోసం మంజూరై నిలిచిన రూ. 87.29 కోట్ల నిధులను ప్రభుత్వం 2 రోజుల క్రితం విడుదల చేసింది. గతేడాది ఆగస్టు 15న ‘కంటి వెలుగు’ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఎన్నికల నాటికి 1.55 కోట్ల మందికి కంటి పరీక్షలు చేశారు. పరీక్షలు చేయించుకున్న వారిలో చాలా మంది 18 ఏళ్లకు పైబడిన వారే ఉన్నారు. పరీక్షలు చేయించుకున్న వారిలో దాదాపు 90% మంది బడుగు బలహీనవర్గాలకు చెందిన వారే ఉన్నారు. పరీక్షల సందర్భంగా 35 లక్షల మంది కి రీడింగ్ గ్లాసులు ఇచ్చారు. 20 లక్షల మందికి చత్వారీ గ్లాసులు ఇవ్వాలని ప్రిస్క్రిప్షన్ రాశారు. పరీక్షలు చేయించుకున్న వారిలో 7.04 లక్షల మందికి పలు రకాల ఆపరేషన్లు అవసరమని నిర్ధారించారు. అందులో 6.64 లక్షల మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్లు అవసరమని తేల్చగా 2018–19 ఆర్థిక సంవత్సరంలో 23,629 మందికి ఆపరేషన్లు నిర్వహించారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా... లక్షలాది మందికి కంటి ఆపరేషన్లు చేయడమ నేది కత్తిమీద సాములాంటిది. అందుకే సాధారణ ప్రైవేటు ఆస్పత్రుల్లో కాకుండా సరోజినీ, ఎల్వీ ప్రసాద్ వంటి ప్రముఖ ఆస్పత్రుల్లోనే ఆపరేషన్లు నిర్వహించాలని సర్కారు భావిస్తోంది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆపరేషన్లు చేయడానికి ముందుకు వచ్చినట్లు వైద్య ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల ఆపరేషన్ల సందర్భంగా ఇబ్బందులు తలెత్తాయి. అవి పునరావృతం కాకుండా సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో అదనపు వసతులు కల్పించి ఆపరేషన్లు మొదలుపెట్టాలని ఆ శాఖ యోచిస్తోంది. ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వర్గాలతోనూ సంప్రదించి రోజుకు ఎన్ని ఆపరేషన్లు చేయవచ్చన్న దానిపై స్పష్టతకు రానుంది. మరోవైపు కొన్ని స్వచ్ఛంద సంస్థలను గుర్తించి వాటిల్లోనూ చేయనున్నారు. ఇప్పటికే ఆపరేషన్లు అవసరమైన కొందరు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో చేయించుకున్నారని ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి. ఎందరు ఆపరేషన్లు చేయించుకున్నారనే సమాచారం తమ వద్ద లేద ని చెబుతున్నాయి. కంటి వెలుగు తర్వాత దంత వైద్య పరీక్షలపైనా సర్కారు దృష్టిసారించనుంది. అయితే ఎప్పుడన్నది తర్వాత చెబుతామని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. -
ఎదురు‘చూపు’
కరీంనగర్హెల్త్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం అభాసుపాలవుతోంది. దృష్టి లోపం, కళ్ల సమస్యలపై పరీక్షలు నిర్వహించి కొందరికి కళ్లద్దాలు పంపిణీ చేసింది. కానీ శస్త్రచికిత్స అవసరమని గుర్తించిన వారిపై పట్టింపు కరువైంది. ఆపరేషన్ ఎప్పుడు చేస్తారో తెలియక బాధితులు ఎదురు చూడాల్సి వస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం 16శాతం మంది కంటిచూపు మందగించి కళ్లజోళ్లు వాడుతున్నారు. రాష్ట్రంలో జరిపిన సర్వే ప్రకారం 40శాతం మంది కళ్లద్దాలు వాడుతున్నట్లు తేలింది. అందరికీ చూపు ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో లక్షలాదిమంది ప్రజలు వివిధ రకాల కంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని వెల్లడైంది. కంటి వెలుగుకు సంబంధించిన కార్యక్రమం ద్వారా వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా సర్కారుకు పంపిన నివేదికలో అనేక అంశాలను వెల్లడించింది. గత యేడాది ఆగస్టు నుంచి అందరికీ కంటి పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు అందజేయడంతోపాటు అవసరమైన వారందరికీ కంటి శస్త్రచికిత్సలు నిర్వహించాలని సకల్పించింది. జిల్లాలో 24 బృందాలు కంటిపరీక్షలు నిర్వహిస్తున్నాయి. కంటి వెలుగు పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 5,88,339 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు పోగ్రాం అధికారులు తెలిపారు. 22,689 మందికి ఆపరేషన్లు అవసరం ఉన్నట్లు నిర్ధారించి కేసులను సంబంధిత ఆస్పత్రులకు రెఫర్ చేశారు. రెఫర్ చేసినవారికి ఇంతవరకు ఆపరేషన్లు చేయకపోవడంతో ఎదురుచూస్తున్నారు. ఈ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ ఇప్పటివరకు ఒక శస్త్రచికిత్స కూడా నిర్వహించలేదు. ప్రభుత్వం అందజేస్తున్న కళ్లద్దాల్లో నాణ్యతలేదని, వృద్ధులకు ఇచ్చే కళ్లద్దాల ఫ్రేములు పిల్లలకు, పిల్లలవి వృద్ధులకు ఇస్తుండడంతో ధరించడం ఇబ్బందికరంగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్ష్యం చేరని కంటివెలుగు.. అందరిలోనూ కంటి చూపు సమస్యలు నివారించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకం జిల్లాలో కొనసాగుతున్నా లక్ష్యం చేరడం లేదు. ఈ కార్యక్రమం ద్వారా విధిగా పరీక్షలు నిర్వహిస్తున్నా ఇప్పటివరకు ఒక్కరికి కూడా శస్త్రచికిత్స జరుపలేదు. ఆరంభంలో పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్సలు అవసరమైన వారికి ఆపరేషన్లు నిర్వహించింది. వరంగల్, నాగర్కర్నూల్తోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్ కారణంగా ఆపరేషన్లు ఫెయిలై బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో వెంటనే ప్రభుత్వం ఆపరేషన్లు నిలిపివేసింది. ప్రత్యేక కంటి వైద్యశాలల్లోనే ఆపరేషన్లు నిర్వహిస్తామని అప్పటి వరకు కేసులను గుర్తించి జాబితా తయారు చేసుకోవాలని సూచించింది. శస్త్రచికిత్సల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆపరేషన్లు చేయడానికి కావాల్సిన ఆస్పత్రులను సమకూర్చుకునేందుకు సిద్ధం అవుతోంది. ఈ కార్యక్రమం చేపట్టి ఆరు నెలలు కావస్తున్నా అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుండడంతోపాటు బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రభుత్వం ఇస్తున్న కళ్లద్దాలలో నాణ్యత లేదని, మొక్కుబడిగా అందజేస్తున్నారని, సరైన సైజుల్లో అద్దాలు లేక వాటిని ధరించలేకపోతున్నట్లు ప్రజలు పేర్కొంటున్నారు. ఆదేశాలు రాగానే ఆపరేషన్లు.. ప్రభుత్వం అదేశాలు రాగానే కంటి వెలుగు పథకంతో కంటి ఆపరేషన్లు నిర్వహిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కంటివెలుగు ద్వారా ఎంతమందికి ఆపరేషన్లు అవసరం ఉందో డేటా అంతా ప్రభుత్వం వద్ద ఉంది. కంటి ఆపరేషన్లు నిర్వహించడానికి కావాల్సిన సౌకర్యాలు అన్ని సమకూర్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ఆపరేషన్లు అవసరమైన వారందరికీ త్వరలోనే అనుమతిరాగానే తప్పకుండా శస్త్రచికిత్సలు నిర్వహించడం జరుగుతుంది. – డీఎంహెచ్ఓ డాక్టర్ రాంమనోహర్రావు -
‘కంటి వెలుగు’కు ఆపరేషన్ల ఫోబియో!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’కార్యక్రమం ముగిసినా, లక్షలాది మందికి చేయాల్సిన ఆపరేషన్ల ప్రక్రియ మాత్రం ఇప్పటికీ తిరిగి మొదలు కాలేదు. ఈ ఆపరేషన్లు చేయించడానికి అధికారులు సుముఖత చూపడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా సీఎం కేసీఆర్ ఆశయాలకు వైద్య ఆరోగ్యశాఖ తూట్లు పొడుస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒకట్రెండు చోట్ల చేసిన ఈ ఆపరేషన్లు వికటించడంతో మొత్తం ఆపరేషన్ల ప్రక్రియను నిలిపివేశారు. ‘మనకెందుకు ఈ రిస్క్. ఒకవేళ ఆపరేషన్లు తిరిగి ప్రారంభించాక ఎక్కడైనా వికటించినా, సమస్య వచ్చినా బదనాం అవుతా’మన్న ధోరణిలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులున్నట్లు తెలుస్తోంది. వారి తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే పరిస్థితి నెలకొందని అంటున్నారు. ‘లక్షలాది మందికి ఆపరేషన్లు చేస్తే ఒకట్రెండు చోట్ల చిన్నచిన్న సమస్యలు రావడం సహజం. పేరున్న ప్రైవేటు ఆసుపత్రుల్లో చేసినా ఇలాంటివి జరుగుతుంటాయి. అలాగని ఆపరేషన్లు చేయడం ఆపేస్తామా?’అని ఒక కంటి వైద్య నిపుణుడు అభిప్రాయపడ్డారు. కచ్చితమైన మార్గదర్శకాలు జారీచేసి ఆ ప్రకారం జాగ్రత్తలు చెప్పి, ప్రముఖ కంటి ఆసుపత్రుల్లో చేసేలా నిర్ణయాలు తీసుకుంటే బాగుండేదని అంటున్నారు. ఎల్వీ ప్రసాద్ వంటి కంటి ఆసుపత్రులతో ఒప్పందం చేసుకుంటే బాగుండేదంటున్నారు. కానీ ఉన్నతాధికారులు రిస్క్ తీసుకోకుండా కేవలం ఉద్యోగం చేస్తున్నామా? ఇంటికి పోతున్నామా? అన్న ధోరణిలోనే ఉన్నారన్న విమర్శలు వస్తున్నాయి. పైగా ఈ కార్యక్రమాన్ని కేంద్రం ఆధ్వర్యం లోని అంధత్వ నివారణ కార్యక్రమం ద్వారా చేపట్టే అవకాశం కూడా ఉంది. 9.30 లక్షల మందికి కంటి లోపం... ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం గత నెలలో ముగిసింది. కీలకమైన ఎన్నికల సమయంలో ఈ కార్యక్రమంతో గ్రామాల్లో కేసీ ఆర్కు ఎంతో కలిసి వచ్చింది. ఆనాడు కోటి కళ్లు ఆయన్నే దీవించాయి. ఏడు నెలలపాటు కంటి వెలుగు కింద 1.54 కోట్ల మందికి పరీక్ష లు నిర్వహించారు. 9,882 గ్రామాల్లో (99. 50%) కంటి పరీక్షలు పూర్తిచేశారు. వారిలో అత్యధికంగా 90.25 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలే ఉండటం గమనార్హం. అందులో అత్యధికంగా బీసీలు 89.90 లక్షల (58.12%) మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఎస్సీలు 16.60 శాతం, ఎస్టీలు 11.02 శాతం, మైనారిటీలు 4.51 శాతం ఉపయోగిం చుకున్నారు. అంటే బడుగు బలహీన వర్గాలకు ఈ పథకం కింద కంటి పరీక్షలు జరిగాయంటే సర్కారు అనుకున్న లక్ష్యం నెరవేరింది. అంతే కాదు 22.92 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు అక్కడికక్కడే అందజేశారు. మరో 10.12 లక్షల మందికి చత్వారీ అద్దాలు ఇచ్చారు. మరో 8 లక్షల మందికి చత్వారీ అద్దాలు సరఫరా చేయడంలో లోపంపైనా విమర్శలు వస్తున్నాయి. ఇక కంటి సమస్యలున్నాయని, ఆపరేషన్లు సహా ఇతరత్రా తదుపరి వైద్యం కోసం 9.30 లక్షల మందిని పై ఆసుపత్రులకు రిఫర్ చేశారు. వారిలో దాదాపు ఆరు లక్షల మందికి వివిధ రకాల ఆపరేషన్లు అవసరమని, మిగిలిన వారికి తదుపరి వైద్యం అవసరమని అంచనా వేశారు. లక్ష మందికి మాత్రం తీవ్రమైన కంటి లోపం ఉందని, వారికి ఆపరేషన్లు తక్షణమే చేయాల్సి ఉందని తేల్చారు. కానీ వైద్య ఆరోగ్యశాఖ మాత్రం కాలయాపన చేస్తూ సర్కారుకు చెడ్డ పేరు తెస్తోంది. అధికారుల తీరుపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వికటిస్తాయన్న భయమే కారణమా... కంటి ఆపరేషన్లు చేయకపోవడానికి కేవలం అవి వికటిస్తాయన్న భయమే కారణమని ఓ కీలక అధికారి అభిప్రాయపడ్డారు. దీంతో ముఖ్యమంత్రి వద్దకు సమగ్రమైన మార్గదర్శకాలతో వెళ్లి కంటి ఆపరేషన్లు మొదలుపెట్టడానికి ఎవరూ సాహసించడంలేదు. మరో వైపు బాధితులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అటు అధికారులు ఇటు ప్రభుత్వం చొరవ చూపి బాధితులకు ఊరటనివ్వాల్సిన అవసరం ఉంది. ∙ కంటి శస్త్రచికిత్సలపై చేతులెత్తేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ ∙ దీంతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన ప్రక్రియ -
బలహీనవర్గాల కళ్లలో ‘వెలుగు’
సాక్షి, హైదరాబాద్: ‘కంటి వెలుగు’ పథకాన్ని అత్యధికంగా బడుగు, బలహీన వర్గాలే ఉపయోగించుకున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కార్యక్రమంపై అధికారులు శుక్రవారం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీనిప్రకారం 99.41 శాతం గ్రామాల్లో ‘కంటి వెలుగు’ పూర్తయింది. 9,873 గ్రామాల్లో ‘కంటి వెలుగు’ శిబిరాలు నిర్వహించారు. మొత్తం 1.54 కోట్ల మంది ప్రజలు ఈ పథకం కింద నేత్ర పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 90.25 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలే ఉన్నారని నిర్ధారించారు. 9.75 శాతం మంది ఓసీలు ఉపయోగించుకున్నట్లు తేల్చారు. అత్యధికంగా బీసీలు 89.87 లక్షల (58.12%) మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఎస్సీలు 16.60 శాతం, ఎస్టీలు 11.02 శాతం, మైనారిటీలు 4.51 శాతం ఉపయోగించుకున్నారు. 22.91 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు గత ఆగస్టు 15న కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమైంది. 7 నెలల పాటు కొనసాగి విజయవంతంగా ముగిసింది. కోటిన్నర మందికిపైగా కళ్లల్లో వెలుగులు నింపిన ఈ కార్యక్రమం రెట్టింపు స్థాయిలో విజయవంతమైందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా 9 గ్రామాలు, 8 మున్సిపల్ వార్డుల్లో కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 828 బృందాలు గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. నేత్ర పరీక్షలు చేయించుకున్నవారిలో దృష్టి సమస్యలున్న 22.91 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు అందించారు. ఇక చత్వారం ఉన్నవారు 18.13 లక్షలుండగా, వారిలో ఇప్పటివరకు 9.70 లక్షల మందికి కళ్లజోళ్లు అందజేశారు. మరో 8.42 లక్షలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. పరీక్షలు చేయించుకున్నవారిలో 1.04 కోట్ల మందికి ఎటువంటి కంటి సమస్యలు లేవని నిర్ధారణ అయింది. 9.3 లక్షల మందికి ఆపరేషన్లు కంటి పరీక్షల అనంతరం 9.30 లక్షల మందికి ఆపరేషన్లు, ఇతరత్రా ప్రత్యేక వైద్యం అవసరమని వైద్యులు నిర్ధారించారు. మొదట్లో ఆపరేషన్లు చేయాలని భావించినా అసెంబ్లీ ఎన్నికల కారణంగా నిలిపివేశారు. అప్పుడు ఒకట్రెండు చోట్ల చేపట్టిన కంటి ఆపరేషన్లు వికటించాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా ఆపరేషన్లపై అధికారులు ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. -
‘వెలుగు’ వెల్లకిలా..!
అధికారుల నిర్లక్ష్యం.. సిబ్బంది పనితీరు కంటి వెలుగు కార్యక్రమాన్ని అభాసుపాలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే అయినప్పటికీ లక్ష్యం మేరకు కంటి పరీక్షలు చేయడంలో ఇక్కడి అధికారులు, సిబ్బంది విఫలమయ్యారు. దీంతో రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా కంటి వెలుగులో వెనుకబడిపోయిందనే అపవాదును మూటగట్టుకుంది. దీనిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తలెత్తుకోలేని పరిస్థితి నెలకొంది. – ఖమ్మంవైద్యవిభాగం కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభంలో ఉధృతంగా సాగింది. ఆ తర్వాత క్రమక్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోయింది. సీఎం కేసీఆర్ ఆలోచనలో పుట్టిన కార్యక్రమాన్ని కార్యరూపంలోకి తెచ్చేందుకు గత ఏడాది ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి సమస్యతో బాధపడొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాన్ని చేపట్టి.. ప్రజల చెంతకు చేర్చింది. గ్రామస్థాయి నుంచి శిబిరాలు నిర్వహించి.. ప్రతి ఒక్కరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేయడంతోపాటు సమస్యలు ఉన్నవారికి ఉచితంగా మందులు అందించడం.. కళ్లద్దాలు అవసరం ఉన్నవారికి అందజేయడంతోపాటు శస్త్ర చికిత్సలు అవసరం ఉన్న వారిని నిర్దేశించిన ఆస్పత్రులకు పంపించి ఆపరేషన్లు నిర్వహించే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. కార్యక్రమ నిర్వహణలో జిల్లాకు చెడ్డపేరొచ్చింది. పూర్తిస్థాయిలో కంటి వెలుగు విజయవంతం కాకపోగా.. రాష్ట్రంలోనే అన్ని జిల్లాలతో పోల్చితే ఖమ్మం జిల్లా చాలా వెనుకబడిపోయింది. సగం కూడా పూర్తికాలే.. రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించే ముందు నాలుగు నెలల్లో ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు పూర్తి చేస్తామని ప్రకటించింది. మళ్లీ ఆ కార్యక్రమాన్ని 6నెలలకు పొడిగించింది. జిల్లాలో కంటివెలుగు కార్యక్ర మం నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు 32 వైద్యబృందాలను ఏర్పాటు చేశారు. షెడ్యూల్ ప్రకారం జిల్లా అంతటా ఒకేసారి అన్ని బృందాలతో కంటి శిబిరాలు ఏర్పాటు చేశారు. కానీ.. ప్రారంభంలో కొంతమేర పరీక్షలు చేయడంలో మెరుగ్గా ఉన్నా.. ఆ తర్వాత క్రమంలో పరీక్షలు మందగించాయి. జిల్లావ్యాప్తంగా 14,39,000 జనాభా ఉండగా.. ఖమ్మం నగరం లో 3,20,000 మంది ఉన్నారు. ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. దీనినిబట్టి కనీసం 10లక్షల మందికి పరీక్షలు చేయాల్సి ఉండగా.. సగం కూడా పరీక్షలు పూర్తి చేయలేదనే అపవాదొచ్చింది. పరీక్షల నిర్వహణకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయించినా.. జిల్లాలో ఎందుకు విఫలమైం దనేది ఉన్నతాధికారులకు అంతుపట్టకుండా ఉంది. దీనిపై ఉన్నతాధికారులు.. ఇక్కడి అధికారులపై ఆగ్ర హం వ్యక్తంచేశారు. పరీక్షలు నిర్వహించడంలో ఎందుకు విఫలమయ్యారో తెలియజేయాలని ఆదేశాలిచ్చారు. క్షేత్రస్థాయిలో వైఫల్యం కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడానికి కొందరు సిబ్బంది అత్యుత్సాహమే కారణమని తెలుస్తోంది. ప్రణాళిక ప్రకారం కార్యక్రమాన్ని నిర్వహించకపోవడం వల్లే వెనుకబడటానికి కారణమని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో అంతంతమాత్రంగా నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమం వల్ల అపవాదు వస్తుందని కొందరు సిబ్బంది గణాంకాలు కూడా మార్చినట్లు తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా నాలుగు నెలల్లో కార్యక్రమం పూర్తి కావాల్సి ఉండగా.. మరో రెండు నెలలు సమయం ఇచ్చినా కార్యక్రమ నిర్వహణలో ముందుకెళ్లలేకపోయింది. జిల్లాలో 10లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. ఇప్పటివరకు 6లక్షల మందికి మాత్రమే పరీక్షలు చేశారు. అయితే ఆ లెక్కలు కూడా తప్పుడువనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు 50వేల మందికిపైగా దృష్టి లోపం ఉన్న వారు ఉన్నట్లు గుర్తించారు. వారికి కళ్లద్దాలు ఎప్పుడు అందుతాయో తెలియని పరిస్థితి. చాలా మంది పరీక్షల్లో దృష్టి లోపం ఉన్న వారు కళ్లద్దాలు ఎప్పుడు వస్తాయోనని శిబిరాల చూట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రీడింగ్ గ్లాసులు మాత్రమే ఇచ్చి.. దృష్టి లోపం గ్లాసులు అందించడంలో విఫలం కావడంతో కార్యక్రమంపై చాలా మంది పెదవి విరుస్తున్నారు. నేటితో ముగింపు ఆరు నెలలపాటు కొనసాగిన కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో శుక్రవారంతో ముగియనుంది. 22 పీహెచ్సీలు, 3 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 3 అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో కార్యక్రమం కొనసాగుతోంది. శుక్రవారంతో ముగియనుండడంతో అధికారులు ఈ ఒక్కరోజు శిబిరాలు నిర్వహించి బృందాలను వెనక్కి రమ్మని ఆదేశాలిచ్చారు. దీంతో ఆరు నెలలపాటు శిబిరాల్లో పాల్గొన్న బృందాల్లో పనిచేస్తున్న డాక్టర్లు, ఇతర సిబ్బంది ఊపిరి పీల్చుకోనున్నారు. మొత్తం 32 బృందాల్లో సుమారు 300 మంది సిబ్బంది వారివారి విధుల్లో చేరనున్నారు. మొత్తానికి కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో మసకబారడంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖకు కొంతమేర చెడ్డపేరు మూటగట్టుకుందనే అపవాదు మిగిలింది. -
49 లక్షల మందికి కంటి సమస్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడో వంతు మందికి కంటి సమస్యలున్నట్లు ‘కంటి వెలుగు’ కింద ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమంలో వెల్లడైంది. మంగళవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 1.49 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అం దులో 49 లక్షల మంది ఏదో ఒకరకమైన కంటి సమస్యతో బాధపడుతున్నారని వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి పంపిన నివేదికలో తెలిపింది. ఆ నివేదిక ప్రకారం ఇప్పటివరకు 67.68 లక్షల మంది పురుషులు, 81.24 లక్షల మంది మహిళలు కంటి పరీక్షలు చేయించుకున్నారు. పురుషుల కంటే మహిళలు 13.56 లక్షల మంది అధికంగా పరీక్షలు చేయించుకున్నట్లు తేలింది. 9,104 గ్రామాల్లో (91.66%) కంటి వెలుగు కార్యక్రమం పూర్తయింది. మిగిలిన గ్రామాల్లో ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 22.3 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు.. శని, ఆదివారాలు, సెలవు రోజులు మినహా మిగిలిన రోజుల్లో గ్రామాలు, బస్తీల్లో కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, కంటి వైద్య నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పరీక్షలు చేసిన అనంతరం అవసరమైన వారికి అక్కడికక్కడే రీడింగ్ గ్లాసులు ఇస్తున్నారు. ఇప్పటివరకు 22.30 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు అందజేశారు. చత్వారం గ్లాసుల పెండింగ్.. చత్వారం ఉన్న వారికి ప్రిస్క్రిప్షన్ రాసిస్తున్నారు. దాని ప్రకా రం ప్రభుత్వమే ప్రత్యేకంగా గ్లాసులు తయారుచేసి ఇస్తోంది. ఇప్పటి వరకు 17.56 లక్షల మందికి ప్రిస్క్రిప్షన్ రాసివ్వగా, అందులో 7.54 లక్షల మందికి మాత్ర మే ఆయా గ్లాసులను ఇచ్చారు. 10.02 లక్షల మందికి చత్వారం గ్లాసులు ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది. ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా చత్వారం గ్లాసులు అందజేయాల్సి ఉన్నందున జాప్యం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. 9 లక్షల మంది ఎదురుచూపు కంటి సమస్యలున్న వారిలో 9.07 లక్షల మందికి ఆపరేషన్లు, ఇతరత్రా వైద్య సేవలు అవసరమని వైద్య, ఆరోగ్యశాఖ నివేదికలో తెలిపింది. రాష్ట్రంలో ఎన్నికల ముందు వరకు కొం దరికి ఆపరేషన్లు నిర్వహించగా కొన్ని చోట్ల వికటించడంతో ఆపరేషన్లు నిలిపివేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడినా ఇప్పటికీ ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. కంటి వెలుగు కార్యక్ర మం ముగింపు దశలో ఉంది. లక్షలాది మంది ఆపరేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఆపరేష న్లు ఎప్పుడు చేస్తారో అధికారులు కూడా చెప్ప డంలేదు. దీనిపై అనిశ్చితి నెలకొంది. -
కొందరికే వెలుగు
గీసుకొండ(పరకాల): కంటి వెలుగు పథకం కొందరికే వెలుగునిచ్చింది.. పరీక్షలు చేసి చేతులు దులుపుకోవడమే వైద్యాధికారులకు అలవాటుగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరి చూపును కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం విధితమే. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో చేపట్టిన ఈ కార్యక్రమం అనుకున్న రీతిలో ముందుకు సాగడం లేదు. కంటి పరీక్షలు చేయించుకుని కంటి అద్దాలు, ఆపరేషన్లు అవసరం ఉన్న వారు వాటి కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. పీహెచ్సీలు, హెల్త్ సబ్సెంటర్లతో పాటు గ్రామాల్లోని ఏఎన్ఎంలు, ఆశ వర్కర్ల చుట్టూ తిరుగుతున్నారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా నేత్ర పరీక్షలు నిర్వహించి అద్దాలు, అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తామని అధికారులు చెప్పడంతో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిం చింది. గత ఏడాది ఆగస్టులో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో కంటి పరీక్షలు చేయించుకోవడానికి జనం కంటి వెలుగు శిబిరాలకు అధికంగా వస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నా పరీక్షలు చేయించుకున్న వారికి అద్దాలను పంపిణీ చేయడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది. ముఖ్యంగా వృద్ధుల నుంచి శిబిరాలకు విశేష స్పందన కనిపిస్తోంది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు, సిబ్బంది చీటీలను బాధితుల చేతిలో పెట్టి ఆపరేషన్ల గురించి ఊసెత్తడం లేదు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తుందని కంటి వెలుగు శిబిరాలపై ఆశలు పెట్టుకున్న వారి నమ్మకాన్ని ప్రభుత్వం నిలబెట్టుకోలేక పోతోంది. జిల్లా వ్యాప్తంగా ‘కంటి వెలుగు’లెక్క.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమాచారం మేరకు జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 2,72,758 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 1,10,729 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో దూరదృష్టి లోపం ఉన్నవారు 38,139 మంది కాగా కేవలం 13,867 మందికి కంటి అద్దాలు(ప్రిస్కిప్షన్ గ్లాసెస్) ఇప్పటివరకు పంపిణీ చేశారు. అలాగే 50,895 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేసినట్లు చెబుతున్నారు. కాగా కంటి ఆపరేషన్ల కోసం జిల్లాలో 21,695 మంది ఎదురు చూస్తున్నారు. వీరిలో కొందరు వరంగల్ ప్రాంతీయ కంటి ఆస్పత్రిలో ఆపరేషన్లు చేయించుకున్నారని, అధికారులు చెబుతున్నా వారి వద్ద వీటికి సంబంధించిన సమాచారం లేదు. జయ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్లు వికటించడంతో ప్రభుత్వం ఆపరేషన్ల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. అందుకే తొందరపడి ఆపరేషన్లు చేయించడం లేదని, పరీక్షల శిబిరాలు ముగిసిన తర్వాత నిపుణులైన వైద్యుల టీంలను ఏర్పాటు చేసి విడతల వారిగా ఆపరేషన్లు చేయిస్తామని చెబుతున్నారు. ఫిబ్రవరి మొదటి వారం వరకు ‘కంటి వెలుగు’ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఫిబ్రవరి మొదటి వారం వరకు కొనసాగిస్తాం. అన్ని గ్రామాల్లో కంటి వెలుగు శిబిరాలను పూర్తి చేస్తాం. దూరపు చూపు కంటి అద్దాల పంపిణీ గ్రామాల్లో లబ్దిదారులకు విడతల వారిగా జరుగుతోంది. ఆపరేషన్ల విషయంలో నిపుణులైన వైద్యులతో టీంలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఆపరేషన్లు చేయిస్తాం. – డాక్టర్ సీహెచ్.మధుసూదన్, డీఎంహెచ్ఓ -
‘కంటి వెలుగు’ ఆపరేషన్లు ఇంకెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: ‘కంటి వెలుగు’ఆపరేషన్లపై నీలినీడలు అలుముకున్నాయి. వచ్చే నెలలో కంటివెలుగు కార్యక్రమం పూర్తి అయ్యే పరిస్థితి ఉన్నా ఇప్పటికీ ఆపరేషన్లపై సర్కారు నిర్ణయం తీసుకోలేదు. కంటి శిబిరాలు నిర్వహించాక అవసరమైన వారందరికీ ఆపరేషన్లు చేస్తామని ఇదివరకు సర్కారు స్పష్టం చేసింది. అక్కడక్కడా ఆపరేషన్లు వికటించడం, వరంగల్లో ఏకంగా 18 మందికి ఒకే ఆసుపత్రిలో ఆపరేషన్లు వికటించి పరిస్థితి సీరియస్ కావడంతో వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు కంగుతిన్నాయి. అప్పుడు ఎన్నికల సీజన్ కావడంతో ఆపరేషన్లను నిలిపివేశారు. ఎన్నికలై కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలరోజులైనా వైద్య, ఆరోగ్య శాఖ వాటిపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆపరేషన్ కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం కంటివెలుగు కార్యక్రమాన్ని గతేడాది ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభించింది. ఇప్పటివరకు 1.28 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 43.44 లక్షల(33.92%) మందికి ఏదో రకమైన కంటి లోపాలున్నట్లు గుర్తించారు. వారిలో 20 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు అందజేశారు. మరో 15.40 లక్షల మందికి చత్వారం ఉన్నట్లు నిర్ధారించి 5.21 లక్షల మందికి కళ్లద్దాలు ఇచ్చారు. 8.06 లక్షలమంది లబ్ధిదారులకు ఆపరేషన్లు అవసరమని వైద్యులు నిర్ధారించినా అవి నిలిచిపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. కంటి వెలుగుపై వైద్య, ఆరోగ్యశాఖ యంత్రాంగం కేంద్రీకరణ తగ్గించింది. వైద్యాధికారులంతా ఇప్పుడు ఈఎన్టీ, దంత పరీక్షలపైనే దృష్టి సారించారు. ఏ నిర్ణయమూ తీసుకోని దుస్థితిలో యంత్రాంగం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ఆయుష్మాన్భవ’లో క్యాటరాక్ట్ ఆపరేషన్కు రూ.6 వేలు ఇస్తున్న నేపథ్యంలో తమకు కనీసం రూ.5 వేలైనా చెల్లించాలని ప్రైవేటు కంటి ఆసుపత్రుల యాజమాన్యాలు కోరుతున్నాయి. ఆపరేషన్కు రెండు వేల రూపాయలే ఇస్తుండటంతో తమకు గిట్టుబాటు కావడంలేదని అంటున్నాయి. గ్రామాల్లో ఈఎన్టీ, దంత పరీక్షలకు వెళితే కంటివెలుగు బాధితులు నిలదీసే పరిస్థితి రానుంది. -
మందగించిన ‘కంటివెలుగు’
ఆదిలాబాద్టౌన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘కంటి వెలుగు’ కార్యక్రమం ముందుకు సాగుతున్నా.. వైద్య పరీక్షలు చేయించుకున్న వారు శస్త్ర చికిత్సల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. దీంతో వారిచూపు మందగిస్తోంది. కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆగస్టు 15న ప్రారంభించారు. నాలుగు నెలలు గడిచినా ఇంతవరకు జిల్లాలో ఒక్కరికి కూడా కంటి ఆపరేషన్ చేసిన దాఖలాలు లేవు. దీంతో బాధితులు ఆపరేషన్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. కాగా ఈ కార్యక్రమం ఫిబ్రవరిలో ముగియనుంది. జిల్లాలో 7లక్షల 8వేల మందికి కంటి పరీక్షలు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 2లక్షల 49వేల మందికి మాత్రమే పరీక్షలు జరిపారు. గడువులోగా పరీక్షలు పూర్తవ్వడం గగనంగానే కనిపిస్తోంది. జిల్లాలోని 18 మండలాల్లో 18 బృందాలతో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొత్తం 7లక్షల 8వేల మంది ఉండగా, ఇప్పటి వరకు 2లక్షల 49వేల 88 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో పురుషులు 1లక్ష 12వేల 120 మంది ఉండగా, మహిళలు 1లక్ష 36వేల 950 ఉన్నారు. దాదాపు 40 శాతం వరకు మాత్రమే లక్ష్యం పూర్తయినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. అప్పటిలోగా అందరికి కంటి పరీక్షలు జరిగేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా 4లక్షల 50వేల మంది వరకు కంటి పరీక్షలు చేయాల్సి ఉంది. అయితే అధికారుల లెక్కల ప్రకారం మరో లక్ష మంది వరకు మాత్రమే కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు అంచనా వేస్తున్నారు. కళ్లాద్దాల పంపిణీలోనూ జాప్యమే.. పరీక్షలు పూర్తిచేశాక కంటి సమస్యతో బాధపడుతున్న వారికి కంటి అద్దాలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో బాధితులకు అద్దాల పంపిణీలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇప్ప టి వరకు 44,035 మందికి రీడింగ్ అద్దాలు పంపి ణీ చేశారు. అలాగే దూరపు, దగ్గరి చూపునకు సంబంధించిన కంటి అద్దాలు 27,428 పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 7,215 మందికి మాత్రమే పంపిణీ చేశారు. దాదాపు 20వేల మందికి ఇంకా పంపిణీ కావాల్సి ఉంది. కంటి పరీక్షలు చేయించుకున్న వీరు కంటి అద్దాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. శస్త్రచికిత్స సంగతేంటి? పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కంటి వెలుగు కార్యక్రమం ద్వారా కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో కొంత మందికి శస్త్ర చికిత్సలు అవసరం కాగా, ఇప్పటివరకు ఏ ఒక్కరికి సైతం శస్త్ర చికిత్స చేసిన దాఖలాలు లేవు. కేవలం కంటి పరీక్షలకే పరిమితమవుతున్నట్లు తెలుస్తోంది. కంటి సమస్యతో బాధపడుతున్న 25,447 మందిని శస్త్ర చికిత్సల కోసం వివిధ ఆస్పత్రులకు రిఫర్ చేయగా, ఎక్కడ కూడా ఇప్పటివరకు ఆపరేషన్ చేయలేదు. కంటి సమస్యతో బాధపడుతున్న వారు అధికారులను ఆపరేషన్ ఎప్పుడు చేస్తారని అడిగితే దాటవేస్తున్నారని చెబుతున్నారు. లక్ష్యం పూర్తయ్యేనా.. ఫిబ్రవరిలోగా కంటి వెలుగు కార్యక్రమ లక్ష్యం పూర్తవ్వడం అనుమానంగానే కనిపిస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఆగస్టులో ప్రారంభించగా జిల్లాలో 50 శాతానికి కూడా లక్ష్యం చేరుకోలేదు. మరో 60 రోజుల్లో వంద శాతం కంటి పరీక్షలు చేసేలా పరిస్థితులు కనిపించడం లేదు. ప్రభుత్వ సెలవులు, పండుగ రోజుల్లో ఈ శిబిరాలకు సెలవు ఉండడంతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు. కాగా గడిచిన నాలుగు నెలల్లో 2లక్షల 49వేల మందికి పరీక్షలు జరిపారు. ఇంకా 4లక్షల 50వేల వరకు పరీక్షలు చేయాల్సి ఉంది. మార్చిలో కంటి ఆపరేషన్లు కంటి వెలుగు కార్యక్రమం ద్వారా జిల్లాలో 2.60లక్షల మందికి కంటి పరీక్షలు చేశాం. శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి 2019 మార్చి మొదటి వారంలో చేయిస్తాం. ఫిబ్రవరి చివరి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. 80 శాతం వరకు స్క్రీనింగ్ పూర్తవుతుంది. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలి. – రాజీవ్రాజ్, డీఎంహెచ్వో, ఆదిలాబాద్ -
తిండిలో తొండి
ఖమ్మంవైద్యవిభాగం: శిబిరాలకు వేళకు వస్తారు.. రోగులను పరీక్షిస్తారు.. కంటి అద్దాలతోపాటు మందులు అందిస్తారు.. శస్త్ర చికిత్సలు అవసరముంటే ప్రభుత్వం గుర్తించిన ఆస్పత్రులకు రెఫర్ చేస్తారు.. ఇంత సేవ చేసినా భోజన విరామంలో సమయానికి కడుపునిండా తినలేని పరిస్థితి.. ఇక్కడే ఉంది అసలు వ్యవహారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి.. అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం కొందరు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు వరంలా మారింది. కంటి వెలుగు సిబ్బందికి అందించే ఆహారంలో కక్కుర్తికి పాల్పడుతూ నిధులు కాజేస్తున్నారు. నాణ్యత లోపించిన సరుకులతో వండిన భోజనం సరఫరా చేస్తూ వారి కడుపుకొట్టడమే కాకుండా.. ఆహారానికి కేటాయించిన నిధులు అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు అధికారుల కక్కుర్తి విధానాల వల్ల కంటి వెలుగు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులను ప్రశ్నించలేక.. వడ్డించిన భోజనాన్ని అతి కష్టంమీద తినాల్సి వస్తోందని పలువురు సిబ్బంది వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కో బృందంలో 10 మంది సిబ్బంది కంటి వెలుగు శిబిరానికి సంబంధించి ఒక్కో బృందంలో 10 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. మెడికల్ ఆఫీసర్, సూపర్వైజర్, ఆప్తాల్మిక్ అసిస్టెంట్, ఇద్దరు డీఈఓలు, ఇద్దరు ఏఎన్ఎంలు, ఇద్దరు ఆశలు శిబిరంలో పాల్గొంటున్నారు. ఒక్కో బృందానికి ప్రతిరోజు రూ.2,500 చొప్పున ప్రభుత్వం అందజేస్తుంది. సిబ్బందికి నాణ్యతతో కూడిన ఆహారం సరఫరా చేయాలని ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంటే.. అది కొందరు అధికారులకు వరంలా మారింది. కొందరు అధికారులు కక్కుర్తిపడి సిబ్బందికి నాసిరకమైన ఆహారం సరఫరా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై బృందం సభ్యులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. అయితే శిబిరాలపై దృష్టి సారించాల్సిన జిల్లా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో కిందిస్థాయి అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వారు ఆడిండే ఆట.. పాడిందే పాట అనే చందంగా పరిస్థితి తయారైంది. 32 బృందాలదీ అదే పరిస్థితి.. జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం కోసం 32 బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 22 పీహెచ్సీలు, మూడు అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 15న రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించగా.. జిల్లాలో కార్యక్రమం నిర్వహించేందుకు 32 బృందాలను తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. అయితే అన్ని పీహెచ్సీల పరిధిలో విధులు నిర్వహిస్తున్న వీరికి ఆహారం సరఫరా చేసే విషయంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కార్యక్రమం ప్రారంభమై నాలుగు నెలలు దాటినా తమకు సదుపాయాలు కల్పించడంలో అధికారులు చిన్నచూపు చూస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తూ.. ప్రతీ ఒక్కరికి కంటి పరీక్షలు చేయడంలో వీరి పాత్రే కీలకం. శిబిరంలో పాల్గొనే ఒక్కో బృందం గ్రామీణ ప్రాంతాల్లో రోజూ 250 మంది, పట్టణ ప్రాంతాల్లో 300 మందికి కంటి పరీక్షలు చేయాలనే నిబంధన ఉంది. నాలుగు నెలల కాలంలో జిల్లావ్యాప్తంగా 4,50,000 మందికి కంటి పరీక్షలు చేశారు. విధి నిర్వహణలో పనిభారం వీరిపైనే ఎక్కువగా ఉంటుంది. నిత్యం కష్టపడుతున్నా వీరిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహారం కోసం నెలకు రూ.20లక్షలు.. కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొనే సిబ్బందికి ప్రతిరోజూ ఉదయం టిఫిన్, టీ, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీ, స్నాక్స్ సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రతి శని, ఆదివారం శిబిరాలకు సెలవు. శిబిరాలు ఉన్నన్ని రోజులు సిబ్బందికి మంచి ఆహారం సరఫరా చేయాల్సి ఉండగా.. ఈ మెనూ ఎక్కడా పాటించడం లేదు. ప్రభుత్వం వీటికోసం నెలకు రూ.20,00,000 నిధులు కేటాయిస్తోంది. ప్రతిరోజూ 32 బృందాలకు కలిపి రూ.80వేలు కేటాయిస్తున్నారు. కానీ.. ఇందులో సిబ్బంది కోసం 30 శాతం నిధులు కూడా ఖర్చు చేయట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణ, నగర పరిధిలో ఉండే సిబ్బంది కోసం మధ్యాహ్నం పూట నాసిరకం ఆహారం సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వహించే కొంతమంది సిబ్బందికి స్థానిక గ్రామస్తులు భోజనం ఏర్పాటు చేస్తుండగా, మరికొందరు ఇంటి నుంచి లంచ్బాక్స్లు తెచ్చుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా.. సిబ్బంది మాత్రం నోరు మెదపలేకపోతున్నారు. ఫిర్యాదు చేస్తే తమపై చర్యలు తీసుకుంటారనే భయంతో వారు మిన్నకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సిబ్బంది ఆహారం కోసం కేటాయిస్తున్న నిధులు పక్కదారి పట్టకుండా.. సక్రమంగా వినియోగించేలా చూడాలని కంటి వెలుగు సిబ్బంది కోరుతున్నారు. ఫిర్యాదులు అందలేదు.. కంటి వెలుగు సిబ్బంది ఆహారం కోసం ప్రభు త్వం రూ.2,500 చెల్లిస్తున్నట్లు జీఓ ఇచ్చినా.. రూ.1,500 చొప్పున మాత్రమే అందజేస్తున్నారు. సిబ్బందికి ఆహారం సక్రమంగానే సరఫరా చేస్తున్నాం. వారి నుంచి ఎటువంటి ఫిర్యాదులు అందలేదు. ఎక్కడైనా సమస్య ఉంటే మా దృష్టికి తెస్తే తగిన చర్యలు తీసుకుంటాం. కార్యక్రమం జిల్లాలో నిరాటంకంగా కొనసాగుతోంది. – డాక్టర్ కోటిరత్నం, కంటి వెలుగు కార్యక్రమం జిల్లా కోఆర్డినేటర్ -
చైనా, ఫ్రాన్స్ల్లో ‘కంటి వెలుగు’ అద్దాల తయారీ
సాక్షి, హైదరాబాద్: ‘కంటి వెలుగు’ లబ్ధిదారులకు ఇచ్చే చత్వారం కళ్లద్దాలను చైనా, ఫ్రాన్స్ సహా 4 దేశాల్లో తయారు చేయిస్తున్నారు. ఇప్పటివరకు దేశంలో బెంగళూరు, హైదరాబాద్ వంటి 9 ప్రాంతాల్లో తయారు చేస్తున్నా అవస రం మేరకు సకాలంలో అందజేయడం కష్టంగా మారింది. దీంతో సంబంధిత కంపెనీ ఆయా దేశాల్లోనూ కళ్లద్దాలను తయారు చేయిస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ప్రభు త్వం కంటి వెలుగును ఈ ఏడాది ఆగస్టు 15న ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 1.13 కోట్ల మందికి కంటి వెలుగు కింద కంటి పరీక్షలు నిర్వహించింది. అందులో 18.36 లక్షల మందికి రీడింగ్ గ్లాసులను అధికారులు అందజేశారు. మరో 14.13 లక్షల మందికి చత్వారం ఉన్నట్లు నిర్ధారించి 3.74 లక్షల మందికి అద్దాలు ఇచ్చారు. మరో లక్షన్నర వరకు జిల్లాలకు సరఫరా చేశారు. అవి జిల్లా వైద్యాధికారుల వద్ద పంచడానికి సిద్ధంగా ఉన్నాయి. జిల్లా వైద్యాధికారుల వద్ద ఉన్న వాటిని లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పంచాలని అనుకున్నారు. కానీ, కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతుండటంతో అవి పంపిణీ చేయడానికి ఆలస్యమవుతోందని అధికారులు అంటున్నారు. ఉన్న వాటిని పంపిణీ చేయడానికి కూడా అధికారులు ప్రణాళిక వేసుకోకపోవడంపైన విమర్శలు వస్తున్నాయి. కళ్లద్దాల తయారీలో తీవ్ర జాప్యం రీడింగ్ గ్లాసులు ముందుగానే తయారు చేసి కంటి వెలుగు శిబిరంలోనే అందజేస్తున్నారు. చత్వారం కళ్లద్దాల కోసం ప్రిస్కిప్షన్ రాసి ఇస్తున్నారు. వాటిని ప్రభుత్వమే తయా రు చేసి ఇస్తోంది. చత్వారం కళ్లద్దాలను ఒక్కొక్కరికి ఒక్కో రీతిన తయారు చేయాల్సి ఉంటుంది. అంటే, లక్షలాది మందికి లక్షలాది పద్ధతిలో ప్రత్యేకంగా తయారు చేయాల్సి ఉంటుంది. దీంతో వాటి తయారీకి అధిక సమయం తీసుకుంటుందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో తొమ్మిది ప్రాంతాల్లో తయారు చేస్తున్నా లక్షలాదిగా సకాలంలో తయారు చేయని పరిస్థితి నెలకొందని అంటున్నారు. కాబట్టి ఇతర దేశాలకు పంపించారు. అయితే, పదిహేను నుంచి నెలరోజుల్లోనే ఇస్తామని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెప్పడంతో లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. సంబంధిత కంపెనీకి ముందే సొమ్ము ఇచ్చినందున సకాలంలో అందజేసేలా ఎందుకు ఒత్తిడి తేవడంలేదన్న ప్రశ్న తలెత్తుతోంది. లక్షలాది మందికి సకాలంలో తయారు చేసి ఇవ్వాల్సి ఉన్నందున ఆ ప్రకారమే ప్రణాళిక రచించి ఉండాల్సింది అని పలువురు అంటున్నారు. తయారు చేసే కంపెనీ ఆలస్యం చేస్తున్నా పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినవస్తున్నాయి. -
కంటి ‘వెలుగు’ ఎప్పుడో?
సాక్షి, హైదరాబాద్: ‘కంటి వెలుగు’ఆపరేషన్లపై నీలినీడలు అలుముకున్నాయి. కంటి శిబిరాలు నిర్వహించాక అవసరమైన వారందరికీ ఆపరేషన్లు చేస్తామని సర్కారు స్పష్టం చేసింది. మొదట్లో అక్కడక్కడ ఆపరేషన్లు చేస్తున్నప్పుడు సమస్యలు తలెత్తడం, వరంగల్లో ఏకంగా 18 మందికి ఒకే ఆస్పత్రిలో ఆపరేషన్లు వికటించి పరిస్థితి విషమించడంతో వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు కంగుతిన్నాయి. ఎన్నికల సమయంలో ఆపరేషన్లు వికటిస్తే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని గుర్తించి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు అప్పట్లో ఆపరేషన్లను తాత్కాలికంగా నిలిపివేశారు. ఎన్నికలు ముగిసి రెండు వారాలవుతున్నా.. మళ్లీ కంటి వెలుగు ఆపరేషన్లు మొదలుపెట్టడంలో వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు నిర్లక్ష్యం చూపుతున్నాయి. ఎప్పటినుంచి కంటి ఆపరేషన్లు చేస్తారో కూడా ఇప్పటికీ అధికారులు వివరాలు వెల్లడించలేదు. దీంతో ఎప్పుడు ఆపరేషన్లు చేస్తారోనన్న ఆందోళన బాధితుల్లో నెలకొంది. 7.32 లక్షల మంది ఎదురుచూపు.. ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ఈ ఏడాది ఆగస్టు 15న ప్రారంభించింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1.12 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 39.53 లక్షల (35.2%) మందికి ఏదో రకమైన కంటి లోపాలున్నట్లు గుర్తించారు. వారిలో 18.19 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు అందజేశారు. మరో 14.01 లక్షల మందికి చత్వారం ఉన్నట్లు నిర్ధారించారు. వారిలో 3.47 లక్షల మందికి ఇప్పటివరకు చత్వారం అద్దాలు ఇచ్చారు. 7.32 లక్షల మంది లబ్ధిదారులకు ఆపరేషన్లు అవసరమని వైద్యులు నిర్ధారించారు. మొదట్లో కొద్దిమందికి ఆపరేషన్లు వికటించినట్లు వార్తలు రావడంతో తాత్కాలికంగా నిలిపివేశారు. ఆపరేషన్లు నాలుగింతలు పెరిగే అవకాశం... కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభానికి ముందు రాష్ట్రంలో కేవలం మూడు లక్షల మందికే ఆపరేషన్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. కానీ, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కంటి వెలుగు పూర్తయ్యే నాటికి 12 లక్షల మందికి కంటి ఆపరేషన్లు చేయాల్సి వస్తుందని తాజా అంచనా. ఏకంగా 4 రెట్లు పెరగింది. దీంతో ఆపరేషన్లు చేసే ఆస్పత్రుల సంఖ్యను కూడా పెంచారు. ఇప్పటివరకు 70 ఆస్పత్రులకు అనుమతివ్వగా.. అదనంగా మరో 41 ఆస్పత్రులను గుర్తించారు. వారందరికీ ఆయా ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేయాలంటే కనీసం ఏడాదిన్నర పడుతుందని వైద్య ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. ప్యాకేజీ పెంచాలంటున్న ప్రైవేటు ఆస్పత్రులు.. కంటి వెలుగు కింద క్యాటరాక్ట్ ఆపరేషన్లకు ప్రభుత్వం ఇచ్చే సొమ్ము సరిపోవడం లేదని ప్రైవేటు కంటి ఆస్పత్రులు గగ్గోలు పెడుతున్నాయి. ఒక్కో క్యాటరాక్ట్ ఆపరేషన్కు రూ. 2 వేలు నిర్దారించారు. కొన్నింటికి గరిష్టంగా రూ.35 వేల వరకు ప్రభుత్వం సంబంధిత ఆస్పత్రులకు చెల్లిస్తుంది. అయితే కంటి వెలుగు కింద గుర్తిస్తున్న వాటిలో అధికం క్యాటరాక్ట్వే ఉన్నాయి. క్యాటరాక్ట్ ఆపరేషన్లకు రూ. 2 వేలు ఇస్తే సరిపోదని, కేంద్రం ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్లో క్యాటరాక్ట్కు రూ.6 వేలు ఇస్తున్నారని ప్రైవేట్ ఆస్పత్రులు అంటున్నాయి. తమకు కనీసం రూ.5 వేలయినా చెల్లించాలని కోరుతున్నాయి. లేదంటే ఆపరేషన్లు చేయబోమని చెబుతున్నాయి. ఈ సమస్యను ఇప్పటికీ వైద్య, ఆరోగ్యశాఖ పరిష్కరించలేదు. -
కోటి కళ్ల చల్లని చూపు
సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో వృద్ధులు దూరం నుంచి ఎవరినైనా చూడాలంటే కను బొమల పైన చెయ్యి పెట్టుకొని, కళ్లు చిన్నవి చేసుకొని చూస్తుండటం సర్వసాధారణం. ఇక మరికొందరి కళ్లు పూర్తిగా కనిపించకపోయినా అలాగే కాలం వెళ్లదీయడమూ మనకు తెలుసు. కళ్లు కనిపిం చడం లేదన్న సంగతి వారికి తెలుసు. కానీ వైద్యం చేయించుకునే స్థోమత లేకపోవడం, ఆరోగ్యశ్రీలోనూ దానికి ఉచిత వైద్య చికిత్స చేయకపోవడంతో లక్షలాది మంది ఇప్పటివరకు అలాగే కనుచూపు కరువై జీవిస్తున్నారు. కానీ ఇప్పుడు గ్రామాల్లో పరిస్థితి మారుతోంది. కంటి వెలుగు కింద ప్రభుత్వం కంటి పరీక్షలు చేసి ఉచితంగా కళ్లద్దాలు ఇస్తుండటంతో గ్రామీణుల్లో ఆనందం వెల్లివిరిసింది. అప్పటివరకు తమ మనవడిని, మనుమరాలిని సంపూర్ణంగా చూడలేని పరిస్థితి నుంచి ఇప్పుడు వారిని నిండుగా కళ్లారా చూస్తుండటంతో కంటి వెలుగుపై గ్రామీణుల్లో స్పందన పెరిగింది. అదికాస్తా ఎన్నికల్లో ఓటు రూపంలో టీఆర్ఎస్కు లాభించింది. ‘కేసీఆరే కంటి పరీక్షలు చేయిస్తున్నాడంట. ఆయన చలువ వల్లే కళ్లద్దాలు వచ్చాయి. ఇప్పుడు తృప్తిగా అందరినీ చూస్తున్నామ’న్న ప్రచారం జరిగింది. కేసీఆర్ కంటి పరీక్షలంటూ ప్రజలు పిలుచుకుంటున్నారు. ఒకవైపు వృద్ధాప్య పింఛన్, మరోవైపు కంటి చూపుతో వృద్ధులు, పెద్దలు టీఆర్ఎస్ను నిలువెల్లా దీవించారు. 90% మంది బడుగు బలహీన వర్గాలే.. ఆగస్టు 15 నుంచి కంటి వెలుగు కార్యక్రమం ప్రారం భమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఎన్నికల ముందు రోజు వరకు ఏకంగా కోటి మందికి కంటి పరీక్షలు చేశారు. కోటి మందిలో 45.15 లక్షల మంది పురుషులు, 54.85 లక్షల మంది మహిళలు ఉన్నారు. కంటి పరీక్షలు చేయించుకున్నవారిలో చాలామంది 18 ఏళ్లకు పైబడిన వారే ఉన్నారు. పైగా పరీక్షలు చేయించుకున్న కోటి మందిలో దాదాపు 90% మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే సగానికి పైగా బీసీలే కావడం గమనార్హం. బీసీలు 56.83 లక్షల (56.82%) మంది పరీక్షలు చేయించుకున్నారు. కోటి మందిలో 36.61 లక్షల మందికి ఏదో ఒక కంటి లోపం ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. అందులో 16.66 లక్షల మందికి అక్కడికక్కడే ఉచితంగా రీడింగ్ గ్లాసులు ఇచ్చారు. ఇక వారు కాకుండా చత్వారంతో బాధప డుతున్నవారు 12.95 లక్షల మంది ఉన్నారు. వారికి ప్రత్యేకంగా కళ్లద్దాలు తయారుచేసి ఇవ్వాలని నిర్ణ యించారు. అందులో ఇప్పటికే 1.96 లక్షల మందికి చత్వారం అద్దాలు అందజేశారు. వీరంతా ప్రభు త్వంపై కృతజ్ఞతాభావంతో ఉన్నారు. ‘ప్రభుత్వం గ్రామంలోకి వచ్చి కంటి పరీక్ష చేసి ఉచితంగా కళ్లద్దాలు ఇవ్వడమనేది సాధారణ విషయం కాదు. గ్రామాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కళ్లద్దాలు పెట్టుకున్నవారే కనిపిస్తున్నారు. కాబట్టి కంటి వెలుగు కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అది టీఆర్ ఎస్కు ఓట్ల వర్షం కురిపించింద’ని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. 4.47 లక్షల మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయాల్సి ఉంది. ఈ కార్యక్రమం మొదలుపెడతామని వివరించారు. ►16.6 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు ఇచ్చిన వైనం ►12.95 లక్షల మందికి చత్వారం అద్దాలు -
‘కోటి’ కాంతులు
సాక్షి, హైదరాబాద్: ‘కంటి వెలుగు’కార్యక్రమం రికార్డు సృష్టించింది. రికార్డుస్థాయిలో కోటిమంది కళ్లల్లో వెలుగు నింపింది. ఒకవైపు ఎన్నికల ప్రచారం ఊపు మీదున్నా ‘కంటి వెలుగు’కార్యక్రమానికి ఏమాత్రం విఘాతం కలగలేదు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన వ్యక్తమైంది. ఆగస్టు 15న ప్రారంభమైన కంటి వెలుగు కింద బుధవారం నాటికి కోటి మందికి కంటి పరీక్షలు చేయడం దేశంలోనే ఒక రికార్డు అని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అభివర్ణిస్తున్నారు. ఈ మేరకు ఆ శాఖ బుధవారం ప్రభుత్వానికి నివేదిక పంపింది. దాని ప్రకారం... కంటి పరీక్షలు చేయించుకున్న కోటి మందిలో 45.15 లక్షల మంది పురుషులు, 54.85 లక్షల మంది మహిళలున్నారు. కంటి పరీక్షలు చేయించుకున్నవారిలో దాదాపు అందరూ 18 ఏళ్లకు పైబడినవారే. అంటే.. ఈ కోటి మంది ఓటర్లే కావడం గమనార్హం. వీరందరిపై అధికార పార్టీ ఆశలు పెట్టుకుంది. కోటి ఓట్లను కంటి వెలుగు ప్రభావితం చేస్తుందా లేదా అనేది చూడాలి. కంటి పరీక్షలు నిర్విఘ్నంగా కొనసాగుతుండటంతో లబ్ధిదారులు తమను గుర్తు పెట్టుకొని మరీ ఓటేస్తారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. సగానికిపైగా బీసీలే... రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించి లోపాలను గుర్తించాలనేది సర్కారు ఆలోచన. తద్వారా అవసరమైన వారికి కళ్లద్దాలు ఇవ్వడం, ఆపరేషన్లు నిర్వహించడం దీని ఉద్దేశం. కంటి పరీక్షలు చేయించుకున్న కోటి మందిలో సగానికిపైగా బీసీలే కావడం గమనార్హం. ఈ వర్గాల వారంతా కూడా పేదలే కావడంతో కంటి సమస్యలను ఇన్నాళ్లు పట్టించుకోలేదు. చూపు కనిపించినా కనిపించకపోయినా అలాగే కాలం వెళ్లదీస్తూ వచ్చారు. అత్యవసర వైద్యానికే దిక్కులేనప్పుడు కంటి గురించి పట్టించుకునేవారే లేకుండా పోయారు. చివరకు ఎలాగోలా ప్రభుత్వం కంటి పరీక్షలు నిర్వహించడంతో వారంతా ఆనందంలో ఉన్నారు. 16.66 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు... కంటి పరీక్షలు చేయించుకున్న కోటి మందిలో 36.61 శాతం మందికి ఏదో ఒక కంటి లోపం ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. అందులో 16.66 లక్షల మందికి అక్కడికక్కడే ఉచితంగా రీడింగ్ గ్లాసులు ఇచ్చారు. వారుకాకుండా చత్వారంతో బాధపడుతున్నవారు 12.95 లక్షల మంది ఉన్నారు. వారికి ప్రత్యేకంగా కళ్లద్దాలు తయారు చేసి ఇవ్వాలని నిర్ణయించారు. అందులో ఇప్పటివరకు 1.96 లక్షల మందికి చత్వారం గ్లాసులు అందజేశారు. వీరుగాక 4.47 లక్షల మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయాల్సి ఉందని నిర్ధారణకు వచ్చారు. మరో 2.49 లక్షల మందికి ఇతరత్రా ఆపరేషన్లు చేయాల్సి ఉంటుందని వైద్యులు తేల్చారు. అందులో కొందరికి ఇప్పటికే ఆపరేషన్లు చేసినా, ప్రస్తుతం ఎన్నికలు కావడంతో మిగతావారికి బ్రేక్ ఇచ్చారు. ఎన్నికల తర్వాత ఆపరేషన్లు చేస్తారని అధికారులు చెబుతున్నారు. -
‘కంటి వెలుగు’...స్ఫూర్తి కనుమరుగు
సాక్షి, హైదరాబాద్: కంటి వెలుగు పథకం స్ఫూర్తిని కొందరు వైద్యులు దెబ్బతీస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అవసరమైన వారికి రీడింగ్ గ్లాసులు, చత్వారం ఉన్న వారికి ప్రత్యేకంగా కళ్లద్దాలు తయారు చేసి ఇవ్వాలన్న సర్కారు ఆశయాన్ని కొందరు తుంగలో తొక్కుతున్నారు. కొన్నిచోట్ల చత్వారం ఉన్నప్పటికీ బాధితులకు కేవలం రీడింగ్ గ్లాసులు ఇచ్చి పంపుతున్నారు.ప్రిస్క్రిప్షన్లో మాత్రం చత్వారం గ్లాసులు రాస్తూ.. రీడింగ్ గ్లాసులు చేతికి ఇవ్వడం గమనార్హం. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలో ఆ మధ్య నిర్వహించిన కంటి వెలుగు శిబిరంలో ఒక మహిళా ఉద్యోగి ప్రసన్నకు చత్వారం ఉందని నిర్దారించారు. ప్రిస్క్రిప్షన్పైనా చత్వారం కళ్లద్దాలు అని రాసి ఉన్నా ఆమెకు రీడింగ్ గ్లాసులు ఇచ్చి పంపడంపై విమర్శలు వచ్చాయి. అత్యంత కీలకమైన హైదరాబాద్ సచివాలయంలోనే ఇలా జరిగితే, ఇక సాధారణ గ్రామీణ ప్రాంతాల్లోనైతే పరిస్థితి ఘోరంగా ఉందంటున్నారు. 11.98 లక్షల మందికి చత్వారం... రాష్ట్రంలో కంటి వెలుగు పథకం ఆగస్టు 15వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఉన్న వారందరికీ కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి రీడింగ్ గ్లాసులు, చత్వారం కళ్లద్దాలు, క్యాటరాక్ట్ వంటి లోపాలుంటే ఆపరేషన్లు చేయాలన్నది సర్కారు లక్ష్యం. పథకం ప్రారంభమైన నాటి నుంచి సోమవారం వరకు 85.83 లక్షల మందికి కంటి పరీక్షలు జరిపారు. అందులో 52.68 లక్షలు (61.38%) మందికి ఎలాంటి కంటి లోపాలు లేవని నిర్ధారించారు. మిగిలిన వారిలో 15.02 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు అందజేశారు.మొత్తం 11.98 లక్షల మందికి చత్వారం ఉందని నిర్ధారించారు. వారికి ప్రత్యేకంగా కళ్లద్దాలు తయారు చేసి ఇస్తామన్నారు. ఇప్పటివరకు కేవలం 78 వేల మందికే చత్వారం కళ్లద్దాలు అందాయి. ఇంకా 11.19 లక్షల మందికి ఆ గ్లాసులను సరఫరా చేయనేలేదు. నెల రోజుల్లోగా అందజేయాలని అనుకున్నా కూడా సరఫరా చేయడంలేదు. సరఫరాలో అనేక లోపాలున్నందున చాలాచోట్ల వైద్యులు, కొందరు అధికారులు చత్వారం ఉన్నా కూడా సాధారణ రీడింగ్ గ్లాసులు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. మరోవైపు 12.29 లక్షల మంది ప్రజలకు వివిధ రకాల కంటి ఆపరేషన్లు అవసరమని నిర్ధారించారు. అక్కడక్కడ ఆపరేషన్లు వికటించడంతో, ఎన్నికల సమయంలో ఆపరేషన్లు చేయకూడదని నిర్ణయించారు.ఇలా ఆపరేషన్లకు బ్రేక్ పడింది. దీంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. -
'దృష్టి'కి దిష్టి తగిలింది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కంటి సమస్యలు అధికంగా నమోదవుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన ‘కంటి వెలుగు’కార్యక్రమంలో లక్షలాది మంది వివిధ రకాల కంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని వెల్లడైంది. కంటి వెలుగుకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ తాజాగా సర్కారుకు పంపిన నివేదికలో అనేక అంశాలను వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం... ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి శనివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 77.58 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో అధికంగా 40 శాతం మంది కంటి సమస్యలతో బాధపడుతుండటంపై వైద్య నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఇంతమందికి కంటి సమస్యలు ఉండటానికి ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు, పేదరికం కారణంగా ఇప్పటివరకు పట్టించుకోకపోవడం వంటివేనని స్పష్టం చేస్తున్నారు. ఆడవారిలో అధిక సమస్యలు... కంటి వెలుగు కార్యక్రమంలో ఇప్పటివరకు 77.58 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, అందులో అత్యధికంగా 42.84 లక్షల (55.23%) మహిళలే ఉన్నారు. 34.72 లక్షల (44.76%) మంది పురుషులున్నారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే ఇప్పటివరకు కంటి పరీక్షలు చేయించుకున్నవారిలో బీసీలు 56.48% ఉన్నారు. ఎస్సీలు 17.15%, ఎస్టీలు 10.51 శాతమున్నారు. ఓసీలు 10.59% మంది ఉన్నారు. మైనారిటీలు 5.27 శాతం ఉన్నారు. 13.92 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు.. కంటి వెలుగులో దీర్ఘ దృష్టి ఉన్న వారికి రీడింగ్ గ్లాసులు అందజేశారు. అందులో 40 ఏళ్లలోపు వారు 2.45 లక్షల మంది ఉంటే, 40 ఏళ్లు పైబడినవారు 11.46 లక్షల మంది ఉన్నారు. ఇక హస్వ దృష్టితో బాధపడుతున్నవారికి ప్రత్యేక అద్దాలు కావాలని వైద్యులు ప్రిస్కిప్షన్ రాసిచ్చారు. వారందరికీ కంపెనీ నుంచి ప్రత్యేకంగా కంటి అద్దాలు సరఫరా చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 39 వేల మందికే అందజేశారు. ఇంకా 11 లక్షల మందికి చత్వారం కంటి అద్దాలు సకాలంలో సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలున్నాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా కంటి పరీక్షలు చేశాక కేవలం 3 లక్షల మందికి మాత్రమే ఆపరేషన్లు అవసరమని వైద్యాధికారులు ముందుగా అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు చేసిన పరీక్షల్లోనే ఏకంగా 5.78 లక్షల మందికి కంటి ఆపరేషన్లు అవసరమని నిర్దారణకు రావడం గమనార్హం. మిగిలిన ప్రజలందరికీ కంటి పరీక్షలు చేసే సరికి ఆ సంఖ్య 12 లక్షలకు పైగానే చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంటే రాష్ట్రంలో కంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఆపరేషన్లు అవసరమైనా చేయించుకోకుండా అలాగే ఉండటం వల్ల ఈ సంఖ్య అధికంగా కనిపిస్తుందని అంటున్నారు. చైతన్యం లేకపోవడంతోనే.. ప్రజల్లో చైతన్యం లేక కంటి సమస్యలు అధికంగా నమోదవుతున్నాయి. ఆహారపు అలవాట్లు సరిగా లేక, షుగర్ వ్యాధి ఉన్నా గుర్తించక త్వరగానే కంటి సమస్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో కంటి సమస్యను పెద్దగా పట్టించుకోవడంలేదు. ముదిరే వరకు చూస్తూనే ఉన్నారు. పేదరికం, చైతన్యం లేకపోవడంతో ఇలా జరుగుతోంది. స్టెరాయిడ్స్ మందులు వాడటం, షుగర్ తదితర కారణాలతో క్యాటరాక్ట్ వస్తుంది. ముదిరే వరకు చూస్తే మున్ముందు కనుచూపు వచ్చే అవకాశం కూడా ఉండదు. కాబట్టి కంటి సమస్యలను గుర్తించి వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ దీప శిల్పిక, సన్షైన్ ఆసుపత్రి -
కలగా మారిన కంటి వెలుగు
ఎల్లారెడ్డిరూరల్: కంటి వెలుగు కార్యక్రమంలో ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఆపరేషన్లు నిర్వహించలేదు. ఎప్పుడు నిర్వహిస్తారన్న విషయమై స్పష్టత కూడా లేదు. దీంతో ఆపరేషన్లు అవసరమైనవారు నిరాశ చెందుతున్నారు. ఆగస్టు 15వ తేదీన కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రభుత్వం జిల్లాలో కంటి వెలుగు అమలు కోసం 22 బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందంలో ఒక సాధారణ వైద్యుడు, ఒక ఆప్తాల్మిక్ వైద్యు డు, ఇద్దరు డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఏఎన్ఎం, ఆశావర్కర్ ఉన్నారు. ఇప్పటి వరకు జిల్లా లో 253 గ్రామాలలో కంటి వెలుగు కార్యక్రమం లో భాగంగా లక్షా 92 వేల 892 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో దగ్గరి చూపు లోపంతో బాధపడుతున్న 34,699 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. దూరపు చూపు లోపంతో ఉన్న 23,798 మందికి కంటి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. 17,370 మంది మోతి బిందుతో బాధపడుతున్నారని గుర్తించిన వైద్యులు.. కంటి ఆపరేషన్ల కోసం సిఫారసు చేశారు. ప్రారంభం కాని ఆపరేషన్లు.. జిల్లాలో కంటి వెలుగు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా కంటి ఆపరేషన్లు నిర్వహించలేదు. జిల్లాలో 17,370 మందికి కంటి ఆపరేషన్లు నిర్వహించాల్సి ఉండగా ఒక్కరికి కూడా నిర్వహించకపోవడంపై కంటి చూపుతో బాదపడుతున్న వారు ఆవేదన చెందుతున్నారు. కంటి పరీక్షలు నిర్వహించి రెండున్నర నెలలు పూర్తవుతున్నప్పటికీ ఇప్పటి వరకు కంటి ఆపరేషన్లు నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్లలో జాప్యం జరుగుతుండడంపై నిరాశ చెందుతున్నారు. వెంటనే శస్త్రచికిత్సల ప్రక్రియ చేపట్టాలని కోరుతున్నారు. ఆపరేషన్లు ప్రారంభం కాలేదు.. జిల్లాలో కంటి వెలుగు కొనసాగుతోంది. ఇప్పటివరకు మోతిబిందు కారణంతో కంటి చూపుతో బాధపడుతున్న వారిని 17,370 మందిని గుర్తించాం. అయితే కంటి వెలుగు పథకం కింద ఇప్పటివరకు ఆపరేషన్లు ప్రారంభించలేదు. నేషనల్ బ్లైండ్నెస్ కంట్రోల్ ప్రోగ్రాం ద్వారా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చిన తరువాత కంటి వెలుగులో ఆపరేషన్లు ప్రారంభిస్తాం. – చంద్రశేఖర్, డీఎంహెచ్వో, కామారెడ్డి -
అద్దాలు ఇయ్యలె.. ఆపరేషన్లు చెయ్యలె!
సాక్షి, మేడ్చల్ జిల్లా: కంటి వెలుగు పథకంలో భాగంగా మేడ్చల్ జిల్లాలో ఇప్పటివరకు 4.38 లక్షల మందికి నేత్ర పరీక్షలు నిర్వహించారు కానీ వీరిలో అవసరమున్నవారికి సకాలంలో కళ్ల జోళ్లు అందడంలేదు. కంటి శస్త్ర చికిత్సలను చేయడంలేదు. దీంతో బాధితులు ఆస్పత్రుల చుట్టూ తిరుతున్నారు. జిల్లాలో 23.62 లక్షల జనాభా ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో 18.12 లక్షలు, మూడు మున్సిపాలిటీల పరిధిలో 3.72 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 1.75 లక్షల మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 52 బృందాలు (అర్బన్ పరిధిలో 43, రూరల్ ప్రాంతాల్లో 9) కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 4.38 లక్షల మందికి కంటి పరీక్షలు చేశారు. వీరిలో 71 వేల మందికి మాత్రమే కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు జిల్లా కంటి వెలుగు కోఆర్డినేటర్ డాక్టరు ఆనంద్కుమార్ తెలిపారు. మరో 58,490 మందికి కంటి అద్దాలు తెప్పించనున్నారు. దీంతో కంటి అద్దాలు పొందాల్సినవారు క్యాంపులు, ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కంటి పరీక్షలు చేసుకున్న వారిలో 31,245 మందికి శస్త్ర చికిత్సలు చేయాల్సి ఉంది. జిల్లాలో గుర్తించిన సంబంధిత ఆస్పత్రులకు సిఫారస్ చేసినప్పటికీ ఇప్పటి వరకు 547 మందికి మాత్రమే కంటి ఆపరేషన్లు చేసినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. కంటి శస్త్ర చికిత్సల నిర్వహణలో వరంగల్ తదితర జిల్లాల్లో తలెత్తిన లోపాలను దృష్టిలో పెట్టుకుని అర్హత కలిగిన ఆస్పత్రులకు తిరిగి సిఫారస్ చేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలో జాప్యం జరుగుతోందని సమాచారం. కంటి శస్త్ర చికిత్సలు చేయించుకోవాల్సిన 30,698 మంది తమకు కేటాయించిన ఆస్పత్రులతో పాటు హైదరాబాద్ నగరంలోని కార్పొరేట్ కంటి దవాఖానాల చుట్టూ తిరుగుతున్నారు. పెద్దాస్పత్రులకు చెందిన వర్గాలు మాత్రం ఎన్నికల కోడ్ కారణంగా శస్త్ర చికిత్సలు నిలిపివేసినట్లు చెబుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
చిన్న‘చూపు’
సత్తుపల్లిటౌన్ (ఖమ్మం): కంటివెలుగు పేరిట నిర్వహిస్తున్న వైద్యశిబిరాలపై పట్టింపు కానరావట్లేదు. దృష్టి లోప నివారణే లక్ష్యంగా ఎంతో ప్రచారం చేసి..ఆర్భాటంగా శిబిరాలు నిర్వహించినప్పటికీ..కంటిచూపు సమస్యలతో బాధ పడేవారికి మాత్రం ఉపశమనం లభించడంలేదు. కావాల్సిన కళ్లజోళ్లు, ఇవ్వాల్సిన మందుల లోపాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఆపరేషన్ల కోసం ఎంపికచేసిన వారికి ఇంతరవకు..శస్త్రచికిత్సలు నిర్వహించకపోవడం ప్రధాన లోపంగా మారింది. అసలు..ఈ కంటివెలుగు ప్రక్రియపై చిన్నచూపు చూస్తున్నారని, ఎవ్వరూ పట్టించుకోవడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూపు మందగించడం, కళ్ల మంటలు, ఇతర నేత్ర సమస్యలతో వచ్చిన వారికి పరీక్షలు సాఫీగా సాగుతున్నా..శస్త్రచికిత్సలు నిర్వహించట్లేదు. ప్రత్యేక కళ్లద్దాలు అందకపోవడం, చుక్కల మందు, డి–విటమిన్ మందుబిల్లల కొరతతో జిల్లాలో కంటి వెలుగు మసకబారుతోంది. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికల హడావిడితో అధికార యంత్రాంగం ఇటువైపు దృష్టి పెట్టకపోవడంతో అవాంతరాలు ఎదురవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆగస్టు 15న ప్రారంభించిన ఈ కార్యక్రమం రెండు నెలలుగా సాగుతోంది. పరీక్షలపై ఉన్న శ్రద్ధ.... శస్త్రచికిత్సలు, కళ్లద్దాలు, మందుల పంపిణీపై కనిపించట్లేదు. క్షేత్ర స్థాయిలో కంటి వెలుగు కేంద్రాల్లో విధులు నిర్వహించే వైద్యులు, సిబ్బందికి సైతం వీటి సరఫరాపై సమాచారం లేకపోవడంతో ఎప్పుడు వస్తాయో.. ఎప్పుడు ఇస్తామో..? అని వైద్యసిబ్బందే సమాధానం చెప్పలేకపోతున్నారు. దీంతో కొన్నిచోట్ల రోగులు కంటి అద్దాల కోసం వైద్య సిబ్బందితో గొడవలకు దిగుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆపరేషన్లు ఎప్పుడు జేస్తరో..? నేత్ర పరీక్షల్లో 17,165 మందికి శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించి రిఫర్ చేశారు. ఇప్పటి వరకు నామమాత్రంగానే చికిత్సలు జరిగాయి. మిగిలిన వారు తమకు కంటి ఆపరేషన్ల కోసం ఎప్పుడు పిలుపు వస్తుందోనని ఎదురు చూస్తున్నారు. వీరిలో క్యాటరాక్ట్ సమస్యతో బాధపడుతున్నావారే ఎక్కువ. దగ్గర చూపులోపం ఉన్నవారికి అద్దాలు అరకొరగానే ఉండటం, దూరదృష్టిలోపం ఉన్నవారికి 60 రోజులు అవుతున్నా, ఇంతవరకు ప్రత్యేక అద్దాలు అందించకపోవడంతో ఆందోళన నెలకొంటోంది. వైద్య శిబిరాల్లో ఎంతో ఆశగా వరుసల్లో నిలబడి వేలాదిమంది కంటి పరీక్షలు చేయించుకుంటున్నా..చివరికి వీరికి లబ్ధిచేకూరట్లేదు. కళ్లజోళ్ల కొరతతోనే ఇబ్బందులు.. కంటి సమస్యలకు అవసరమైన వారికి అందించాల్సిన కళ్లజోళ్ల కొరత రోగులను ఇబ్బంది పెడుతోంది. గత రెండు నెలలుగా జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం ద్వారా 162 గ్రామాలు, మున్సిపాలిటీల్లోని 23 వార్డుల్లో 1.07 లక్షల మందికి వైద్య బృందాలు కంటి పరీక్షలు నిర్వహించాయి. జిల్లాలోని 21 మండలాల్లో 32 వైద్య బృందాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. దగ్గరచూపు కళ్లజోళ్లు మినహా ఇతర ప్రత్యేక అద్దాలు అందించిన దాఖలాలు లేవు. రోగులకు ఇవి ఎప్పుడిస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. వేలాది మంది మధ్యవయస్సు వారు, వృద్ధులు కళ్లజోళ్లు అందక పోవడంతో నిరాశ చెందుతున్నారు. రెండు నెలలుగా చూస్తున్నా.. కంటి వెలుగు శిబిరంలో పరీక్షలు చేశారు. ఆపరేషన్ చేయాలన్నారు. రెండు నెలలైంది. ఇంతవరకు ఏ జాడా లేదు. కళ్లు కనిపించక ఇబ్బంది పడుతున్నా. కంటి సమస్యకు ఆపరేషన్ చేస్తే బాగుంటుందని ఎదురు చూస్తున్నా. – సీహెచ్.సావిత్రి, సత్తుపల్లి -
కళ్లద్దాలు రాలే..
సాక్షి, వరంగల్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు పథకం అభాసుపాలవుతోంది. పరీక్షలు చేసిన వైద్యాధికారులు అద్దాలు అందజేయడం లేదని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు. అద్దాల గురించి కంటి చూపు బాధితులు స్థానిక ఆశ కార్యకర్తలను అడిగితే ఎప్పుడొస్తాయో తమకు తెలియదంటుండగా, వైద్యాధికారులు ఆర్డర్ పెట్టామని, త్వరలో వస్తాయని దాటవేస్తున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి రెండు నెలలు గడుస్తున్నా అద్దాలు అందజేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15న ప్రతిష్టాత్మకంగా కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీలు), ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతోంది. జిల్లాలో నిర్వహించిన కంటివెలుగు పరీక్షల్లో ప్రతీ వంద మందిలో 50 మందికిపైగా కంటి సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. 50 రోజులైనా అందని అద్దాలు.. కంటి చూపులో దూరపు చూపు, దగ్గరి చూపు కనబడని వారు, అసలు కనబడని వారిని పరీక్షల్లో గుర్తిస్తున్నారు. దగ్గరి చూపు కనబడడం లేదని డాక్టర్లు నిర్ధారిస్తే వెంటనే వారికి కంటి అద్దాలను పంపిణీ చేస్తున్నారు. దూరపు చూపు సమస్య ఉన్నవారి వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి అద్దాలకు ఆర్డర్ పెడుతున్నారు. రెండు కళ్లకు ఒకే రకమైన సైట్ ఉంటేనే కంటి అద్దాలు అందిస్తున్నారు. ఆన్లైన్లో నమోదు చేయగా 30 రోజుల తర్వాత కంటి అద్దాలు వస్తాయని సమాచారమిచ్చారు. కంటి పరీక్షలు ప్రారంభమై 50 రోజులు గడుస్తున్నా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా అద్దాలు ఇంత వరకూ రాలేదు. ఆర్డర్ పెట్టిన అద్దాలు వస్తాయా ? రావా ? అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అద్దాలు ఎప్పుడు వస్తాయని కంటి వెలుగు శిబిరాల్లో అడిగినా ఎప్పుడు వస్తాయో చెప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు. అందుబాటులో తొమ్మిది రకాల అద్దాలే.. కంటి వెలుగు పథకంలో కంటి పరీక్షలు చేయించుకున్న వారికి వెంటనే అందించేందుకు ప్రభుత్వం తొమ్మిది రకాల కంటి అద్దాలనే అందుబాటులో ఉంచింది. 1.0 ఆర్ఎంబీఎఫ్ నుంచి 2.5ఆర్ఎంబీఎఫ్, 1.0 నుంచి 2.5 ఆర్ఎంబీ వరకు మాత్రమే కంటి అద్దాలు ఉన్నాయి. 23 వేల మందికి అందిన అద్దాలు.. కంటి వెలుగు కార్యక్రమానికి 1,07,160 మంది హాజరుకాగా 23,352 మందికి కంటి అద్దాలను అందించారు. 22,731 కంటి అద్దాల కోసం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారు. 11,123 మందికి కంటి శస్త్ర చికిత్స కోసం రెఫర్ చేశారు. అద్దాలు లేక తీవ్ర ఇబ్బందులు డాక్టర్లు నెల రోజులకు అద్దాలు వస్తాయని చెప్పినా ఇప్పటి వరకు అద్దాలు రాలేదు. ఎవరిని అడిగినా ఏమి చెప్పడం లేదు. దీంతో కళ్లు కనపడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా. వెంటనే కళ్లద్దాలను అందించాలి. –గోరంట్ల లక్ష్మీ, నర్సక్కపల్లి గ్రామం, పరకాల మండలం త్వరలో వస్తాయి.. ఆర్డర్ పెట్టిన కంటి అద్దాలు త్వరలో వస్తాయి. దూరపు, దగ్గర చూపు అద్దాలు స్టాక్ లేవు కాబట్టి ఆర్డర్ పెట్టాం. కొంత ఆలస్యమైనప్పటికీ అద్దాలన్నీ వస్తాయి. ఒకటి, రెండు పీహెచ్సీలకు ఈ రెండు రోజుల్లో వస్తాయి. వాటిని పంపిణీ చేస్తాం. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆర్డర్ తీసుకున్న వారందరికీ అద్దాలు అందిస్తాం. –మధుసూదన్, డీఎంహెచ్ఓ -
దూర ’దృష్టి’ లోపం
‘కంటివెలుగు’ కార్యక్రమం చీకటి తెరలను తొలగించడం లేదు. అందరికీ చక్కటి చూపు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమం.. దగ్గరి చూపు కళ్ల జోళ్లు అందజేతకే పరిమితమైంది. దూర దృష్టి లోపమున్న వారికి కళ్ల అద్దాల పంపిణీ అటకెక్కింది. కంటి పరీక్షలు చేయించుకుని 50 రోజులు దాటినా అద్దాల ఊసే లేదు. కనీసం ఎప్పుడు వస్తాయన్న విషయంపైన స్పష్టత లేదు. దీంతో పరీక్షలు చేయించుకొని దూరపుచూపు అద్దాలు అవసరమున్న 50 వేల మంది నిరీక్షిస్తున్నారు. అయితే, ఈ కార్యక్రమంలో ఇంకా శస్త్రచికిత్సలు ప్రారంభం కాలేదు. సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా జనాభా 24.46 లక్షలు. ఇందులో 35 నుంచి 40 శాతం మంది వరకు కంటి సంబంధ సమస్యలతో సతమతం అవుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ అధికారుల అంచనా. వీరందిరికీ వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరులోపు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం, అవసరమైతే కళ్ల జోళ్లు, మందులు పంపిణీ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అలాగే దృష్టిలోపం తీవ్రంగా ఉంటే శస్త్ర చికిత్సలు నిర్వహించి చక్కటి చూపు ప్రసాదించాలి. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 55 మెడికల్ టీంలు ప్రతి గ్రామంలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజల నేత్రాలను స్క్రీనింగ్ చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 3 లక్షల మందిని స్క్రీనింగ్ చేయగా.. ఇందులో సుమారు 73 వేల మందికి దగ్గరి చూపు లోపమున్నట్లు గుర్తించి వారికి కళ్ల అద్దాలు అందజేశారు. దూరపు చూపు లోపమున్నట్లు 65 వేల మందికి పైగా గుర్తించారు. వీరందరికీ పరీక్షలు నిర్వహించిన వారం రోజుల్లోగా అద్దాలు అందజేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ, ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు. కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమై 50 రోజులు గడుస్తున్నా కనీసం ఒక్కరికి కూడా అద్దాలు అందించిన దాఖలాలు లేవు. శస్త్ర చికిత్సలకు సెలవు! కంటిశుక్లం, మోతియ బిందువు, నల్లపాప మీద పొర, మెల్లకన్ను తదితర లోపాలున్న వారిని పైఆస్పత్రులకు రిఫర్ చేసి అక్కడ శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంది. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 25 వరకు నోడల్ ఆస్పత్రులను ప్రభుత్వం గుర్తించింది. ఇందులో ఒకటిరెండు మినహా అన్ని ప్రైవేటు ఆస్పత్రులే. శస్త్రచికిత్సలు అవసరమని ఇప్పటి వరకు 33 వేల మందికి పైగా గుర్తించారు. వీరందరినీ ఆయా ఆస్పత్రులకు తీసుకెళ్లి శస్త్రచికిత్సలు చేయించాల్సిన బాధ్యత అధికారులది. అయితే, ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో నోడల్ ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు మొదలు కాలేదు. ఉత్సాహంగా క్యాంపులకు వెళ్లి పరీక్షలు చేయించుకున్న జనం.. శస్త్రచికిత్సలు కోసం వేయికళ్లలో నిరీక్షిస్తున్నారు. అయితే, ఇప్పట్లో శస్త్రచికిత్సలు ఉండవన్న సంకేతాలు సైతం వెలువడుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి లేదా ఫివ్రబరిలో చేయొచ్చని అధికారులు నర్మగర్భంగా చెబుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలా పేరుకే కంటి వెలుగు కార్యక్రమం ఉన్నా.. పెద్దగా ప్రయోజనం లేకుండా పోతోందని బాధితులు మథనపడుతున్న సంఘటనలు ప్రతి పల్లెలో కనిపిస్తున్నాయి. అద్దాలు ఇంకా రాలేదు ప్రస్తుతం దగ్గరి చూపు లోపమున్న వారికి కళ్ల అద్దాలు అందజేస్తున్నాం. దూరపు చూపులోపమున్న వారు అద్దాల కోసం కొన్ని రోజులు ఆగాలి. ప్రభుత్వం నుంచి జిల్లాకు ఇంకా రాలేదు. రాగానే వీలైనంత త్వరలో అందజేస్తాం. అలాగే శస్త్రచికిత్సల కోసం 30 వేలకుపైగా మందిని రిఫర్ చేశాం. ప్రస్తుతానికి శస్త్రచికిత్సలు ఇంకా మొదలు కాలేదు. – డాక్టర్ గణేష్, ‘కంటివెలుగు’ జిల్లా నోడల్ ఆఫీసర్ -
అంధకారమేనా?
హన్మకొండ చౌరస్తా (వరంగల్): కంటి వెలుగు.. వారి జీవితాల్లో చీకట్లను నింపింది. హన్మకొండలోని జయ ఆస్పత్రిలో ఇటీవల జరిగిన ఘటనలో బాధితులకు కంటి చూపు కష్టమే అన్న అనుమానాలు నిజమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం ద్వారా సెప్టెంబర్ 26న హన్మకొండలోని జయ ఆస్పత్రిలో జరిగిన ఆపరేషన్లు వికటించిన విషయం తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 18 మందికి కంటి శస్త్ర చికిత్సలు చేసిన వైద్యులు.. అందులో 11మందికి సెప్టెంబర్ 28న రీఆపరేషన్ చేశారు. అయినప్పటికీ చూపు సరిగా లేదని ఆందోళనకు దిగడంతో 18 మంది బాధితులను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి తరలించా రు. మూడు రోజులపాటు ఆస్పత్రిలో ఉంచుకున్న ఎల్వీ ప్రసాద్ వైద్యులు 8మందికి చికిత్స నిలిపివేసి సోమవారం డిశ్చార్జి చేశారు. మూడు రోజుల తర్వాత మరోసారి ఆస్పత్రికి రావాలని వైద్యులు చెప్పగా.. ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని, హన్మకొండలోని జయ ఆస్పపత్రిలోనే చికిత్స పొందాలని సిబ్బంది చెప్పినట్లు బాధితులు ‘సాక్షి’కి ఫోన్లో తెలిపారు. అస్పష్టమైన సమాధానంతో ఆందోళన చెందుతూనే తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఎనిమిది మంది బాధితులు ఇంటి ముఖం పట్టారు. కంటిలో ఇన్ఫెక్షన్ అలానే ఉందని, చూపు స్పష్టంగా కనపడడం లేదని, కళ్లు మసగ్గానే కనపడుతున్నాయని బాధితులు వాపోయారు. వైద్యులు మాత్రం పది రోజుల్లో అంతా సర్దుకుంటుంద ని.. కంటి చూపు మెరుగుపడుతుందని చెప్పి పం పినట్లు తెలిపారు. ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిశ్చార్జి అయిన బాధితులు బోలే సరోజన, పులిగిల్ల, పరకాల, కె.సరోజన, మచిలీబజార్, హన్మకొండ, గోరంట్ల సుజాత, పాపయ్యపేటచమన్, వరంగల్. ముడిగె రాజయ్య, వేశాలపల్లి, భూపాలపల్లి, బుచ్చమ్మ గోపరాజు,ఎల్లాపూర్, హసన్పర్తి. అజ్మీర మేఘ్య, బాంజీపేట, నర్సంపేట. జి.భగవాన్, ధర్మరావుపేట, ఖానాపూర్. మంద సత్తమ్మ, న్యూశాయంపేట, హన్మకొండ. -
కంటివెలుగులో చీకట్లు.. 17మందికి కళ్లుపోయే పరిస్థితి!
సాక్షి, హైదరాబాద్: కంటి వెలుగు ఆపరేషన్లలో అపశ్రుతి నెలకొంటున్నా ప్రభుత్వం తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు వైద్యులు, ఆసుపత్రుల నిర్లక్ష్యంతోనే సంఘటనలు జరుగుతున్నా జాగ్రత్తలు తీసుకోవడంలేదు. ఆగస్టు 18న రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం దత్తాయిపల్లికి చెందిన గంట్లవెళ్లి చెన్నమ్మ కంటి పరీక్ష చేయించుకొని సమీపంలోని ఆసుపత్రిలో ఆపరేషన్కు వచ్చింది. మత్తు మందు వికటించడంతోనే ఆమె చనిపోయిందన్న విమర్శలొచ్చాయి. ఆ ఘటన మరువకముందే తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 19 మంది కంటి వెలుగు కింద పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు క్యాటరాక్ట్ ఆపరేషన్ అవసరమన్నారు. వారు రిఫర్ చేశాకే వరంగల్లోని జయ నర్సింగ్ హోంకు వచ్చారు. ఆపరేషన్లు చేశాక 17 మందికి ఇన్ఫెక్షన్ వచ్చింది. వాళ్లకి కంటిలోపల మంటతోపాటు వాపు వచ్చింది. ఒకరోజు ఆలస్యమైతే అందరికీ కళ్లుపోయి ఉండేవని ఉన్నతాధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా కంటి వెలుగులో కొందరు వైద్యులు, కొన్ని ఆసుపత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పైగా ఆయా సంఘటనలకు తమకు బాధ్యత లేదన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తుండటం గమనార్హం. ఇంకా ఆపరేషన్లు మొదలు పెట్టలేదట... వరంగల్ జిల్లాలో కంటి ఆపరేషన్లు వికటించడంపై ప్రభుత్వం వింత వాదనలు మొదలు పెట్టింది. 19 మందికి ఆపరేషన్లు ‘కంటి వెలుగు’కింద చేసినవి కాదని వివరణ ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. పైగా జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం కింద వారికి ఆపరేషన్లు చేసినట్లు పేర్కొంటున్నారు. ఇక్కడ రెండు విషయాలు ఒకదానికి ఒకటి సంబంధం లేనివిగా ఉన్నాయి. కంటి వెలుగు కిందే ఆయా బాధితులకు కంటి పరీక్షలు చేశారు. వారిని పరీక్షించిన వైద్యులు క్యాటరాక్ట్ ఉందని నిర్దారించి, ఆపరేషన్కు రిఫర్ చేశారు. కంటి వెలుగు కింద ఆపరేషన్లు చేయడానికి గుర్తించిన ఆసుపత్రికే వారు వెళ్లారు. అక్కడే వారి ఆపరేషన్ వికటించింది. అయినా తమకు సంబంధం లేదని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొనడం హాస్యాస్పదం. ఇక రెండోది... జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం కిందనే ఆపరేషన్లు చేశామని, కంటి వెలుగు కింద ఇంకా ఆపరేషన్లు మొదలు కాలేదని చెబుతున్నారు. వాస్తవంగా ప్రభుత్వం కంటి వెలుగు కింద ఆపరేషన్లు చేయడంలేదు. ఈ ఆపరేషన్లనన్నింటినీ జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం కిందనే చేయాలని నిర్ణయించారు. కాబట్టి కంటి వెలుగుకు ఈ ఘటనకు సంబంధం లేదని ఎలా చెప్పగలరు? సరోజినీ ఆసుపత్రిలో రెండేళ్ల క్రితం పలువురికి ఆపరేషన్ వికటించి కళ్లుపోయిన సంగతి విదితమే. ఇప్పుడూ వరంగల్ లోనూ జరిగిందని అధికారులు చెబుతున్నారు. వరంగల్లో ఇంత పెద్ద ఘటన జరిగి, బాధితులను ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి తీసుకొస్తే ఉన్నతాధికారులెవరూ పట్టించుకోలే దు. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఆపరేషన్ థియేటర్ సీజ్... వరంగల్ జయ నర్సింగ్ హోం ఆపరేషన్ థియేటర్ను సీజ్ చేశామని, ఘటనపై విచారణకు ఆదేశించామని డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జయ నర్సింగ్ హోమ్ ఘటన దురదృష్టకరమన్నారు. అక్కడ ఈ నెల 26న 19 మందికి జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం కింద క్యాటరాక్ట్ ఆపరేషన్లు జరిగాయన్నారు. 28న వారు నర్సింగ్ హోంకి వెళ్లగా, అందులో ఇద్దరి పరిస్థితి బాగుందన్నారు. మిగిలిన 17 మందికి ఎండ్ ఆప్తాలమైటీస్ అనే సమస్య వచ్చినట్లుగా గుర్తించారన్నారు. దీంతో వారికి కంటి లోపల మంటతోపాటు వాపు వచ్చిందన్నారు. విషయం తెలిసిన వెంటనే బాధితులను ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించామన్నారు. అందులో 11 మందికి విట్రెక్టమీ ఆపరేషన్లు కూడా చేశామన్నారు. బాధితులంతా కొద్ది రోజుల్లో కోలుకుంటారని స్పష్టం చేశారు. ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక వైద్య బృందాన్ని వరంగల్కు పంపించామన్నారు. విచారణ నివేదిక మేరకు నర్సింగ్ హోంపై చర్యలు తీసుకుంటామని శ్రీనివాసరావు వెల్లడించారు. -
‘కంటి వెలుగు’లో నిర్లక్ష్యం
హన్మకొండ చౌరస్తా (వరంగల్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకంలో ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాల నిర్లక్ష్యం బయటపడింది. కాటరాక్ట్ సర్జరీలను మమ అనిపించిన వైద్యులు పూర్తిగా చెకప్ చేయకుండానే డిశ్చార్జి చేశారు. ఇంటికి వెళ్లిన రోగులు కంటి చూపు సరిగా లేకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. అయితే.. సర్జరీ సరిగా చేయలేకపోయామని గుర్తించిన వైద్యులు మరుసటి రోజే మరోసారి ఆస్పత్రికి రావాలని ఫోన్ చేయడంతో వారి నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. రోగుల అనుమానమే నిజం కావడంతో ఆస్పత్రికి చేరుకుని షాక్కు గురయ్యారు. హన్మకొండలోని జయ ఆస్పత్రిలో జరిగిన ఘటన వివరాలు రోగులు, వారి బంధువులు తెలిపిన ప్రకారం.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కంటి వెలుగు పథకం కోసం క్యాంపులు ఏర్పాటు చేసి పరీక్షలు చేసిన వైద్యులు, ఆపరేషన్ కోసం ఆయా పథకం అమలవుతున్న ప్రైవేట్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. ప్రాథమిక వైద్య పరీక్షలు చేసుకున్న పలువురు శస్త్రచికిత్స చేసుకోవడానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 18 మంది ఈ నెల 26వ తేదీన హన్మకొండ చౌరస్తాలోని జయ ఆస్పత్రి కి చేరుకున్నారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం డాక్టర్ లక్ష్మిరమాదేవి నేతృత్వంలో కాటరాక్ట్ శస్త్ర చికిత్స చేశారు. ఆపరేషన్ చేసిన మరుసటి రోజు డిశ్చార్జి చేసి ఇంటికి పంపించారు. అయితే.. ఇంటికి వెళ్లిన రోగులు కట్లు విప్పితే చూపు లేకపోవడంతో కంగుతిన్నారు. భయంతోనే ఆ రాత్రి నిద్రపోయిన బాధితులకు ఉదయమే జయ ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చింది. మీరు అత్యవసరంగా మరొకసారి ఆస్పత్రికి రావాలని, చెకప్ చేసి పంపిస్తామని సిబ్బంది సమాచారం అందించారు. అప్పటికే కళ్లు కనిపించకపోవడం.. ఆస్పత్రి నుంచి ఫోన్ రావడంతో ఆందోళన చెందిన బాధితులు శుక్రవారం హాస్పిటల్కు చేరుకున్నారు. అందులో 11 మందికి మరోసారి కాటరాక్ట్ రీఆపరేషన్ చేశారు. మిగతా ఏడుగురిని పరీక్షించి ఫర్వాలేదని చెప్పారు. ఆందోళనకు దిగిన బాధితులు.. రెండు రోజుల వ్యవధిలో రెండు సార్లు ఆపరేషన్ చేయడంపై భయాందోళనకు గురైన బాధిత బందువులు ఈ విషయంపై ఆస్పత్రి సిబ్బందిని ప్రశ్నించారు. సిబ్బంది ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న ప్రజాసేన అవినీతి స్వచ్ఛంద సంస్థ చైర్మన్ పుప్పాల రజనీకాంత్ ఆస్పత్రికి చేరుకుని రోగులు, వారి బంధువులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యాన్ని డీఎంహెచ్ఓ హరీష్రాజ్ దృష్టికి తీసుకెళ్లారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి వైద్యులు, కాసుల కక్కుర్తి కోసం మనుషుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఆస్పత్రులను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న వరంగల్ అర్బన్ జిల్లా డీఎంహెచ్ఓ హరీష్రాజు కంటి ఆపరేసన్ చేసుకున్న రోగులు, వారి బంధువులతో మాట్లాడారు. హాస్పిటల్లోని ఆపరేషన్ థియేటర్, ల్యాబ్ ను పరిశీలించారు. అనంతరం ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేసేందుకు అన్ని వసతులు ఉన్నాయని.. అయితే జరిగిన తప్పిదానికి జయ హాస్పిటల్ యాజమాన్యానికి నోటీసులు అందజేయనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ల్యాబ్ను సీజ్ చేశారు. రెండోసారి ఆపరేషన్ ఎందుకంటే చెప్పలేదు.. 20 రోజుల క్రితం నయీంనగర్ లష్కర్సింగారంలో నిర్వహించిన క్యాంపులో కంటి పరీక్షలు చేసుకున్నాను. అక్కడ వైద్యులు ఆపరేషన్ చేయాలన్నారు. జయ ఆస్పత్రిలో ఉందంటే ఈనెల 26న ఇక్కడికి వచ్చాం. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ లక్ష్మిరమాదేవి ఆపరేషన్ చేసి గురువారం డిశ్చార్జి చేశారు. ఇంటికి వెళ్లి కట్టు విప్పితే ఏమి కనిపించడం లేదు. అంతలోనే ఉదయం ఆస్పత్రి ఉంచి ఫోన్ వచ్చింది. ఇక్కడికి రాగానే మరోసారి ఆపరేషన్ చేశారు. ఎందుకు రెండోసారి చేస్తున్నారని అడిగితే ఎవరూ పట్టించుకోలేదు. – హెచ్.పద్మ, గిర్నిబావి, దుగ్గొండి, వరంగల్ రూరల్ ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి రెఫర్ చేశాం జయ ఆస్పత్రిలో కంటి పరీక్షలకు సంబంధించిన అన్ని పరికరాలు, ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. ఇప్పటివరకు 250 కంటి ఆపరేషన్లు చేశారు. ఈనెల 26న చేసిన 18మందిలో ఆరుగురికి ఈ రోజు ఇన్ఫెక్షన్ అయినట్లు గుర్తించి తిరిగి మెరుగైన చికిత్స అందించారు. ఇంకొందరికి తీవ్రత ఎక్కువ ఉన్నట్లు గుర్తించాం. అయినప్పటికీ 18మందిని హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి ముందు జాగ్రత్త చర్యగా తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశాం. జయ ఆస్పత్రి వైద్యుల నిరక్ష్యంపై విచారణ చేస్తాం. నిర్లక్ష్యమని తేలితే చర్యలు తీసుకుంటాం. – హరీష్రాజ్, డీఎంహెచ్ఓ, వరంగల్ అర్బన్ ఫోన్ చేసి రమ్మంటే వచ్చాను రెండు రోజుల క్రితం జయ ఆస్పత్రికి వస్తే కంటి ఆపరేషన్ చేసి పంపించారు. ఇంటికి పోయిన మరుసటి రోజు ఫోన్ చేసి రమ్మంటే వచ్చాను. కంటికి ఇన్ఫెక్షన్ అయింది.. ఇంజక్షన్ వేయాలని లోపలికి తీసుకెళ్లారు. మత్తు ఇవ్వడంతో ఆపరేషన్ చేశారా.. లేదో తెలియడం లేదు. – కందుల మల్లయ్య, రాంనగర్, హన్మకొండ మళ్ళీ ఆపరేషన్ చేయాలని లోపలికి తీసుకెళ్లారు రెండు రోజుల క్రితం మా అత్తకు జయ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్ చేసి ఇంటికి పంపించారు. మళ్లీ ఈ రోజు ఫోన్ చేసి అర్జెంటుగా ఆస్పత్రికి రావాలని చెప్పారు. చెకప్ చేయాలంటే మా అత్త కొమురమ్మను తీసుకొచ్చాను. రాగానే కంటి పరీక్షలు చేసి.. మళ్లీ ఆపరేషన్ చేయాలని లోపలికి తీసుకెళ్లారు. – అరుణ, బాదితురాలు కొమురమ్మ కోడలు, ములుగు -
కంటి వెలుగు ముమ్మరం
నల్లగొండ టౌన్ : ప్రజలను దృష్టి లోపం నుంచి గట్టెక్కించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటివెలుగు కార్యక్రమం జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. ఆగస్టు 15న లాంఛనంగా ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ నిరంతరాయంగా కొనసాగిస్తోంది. పండుగలు, సెలవు దినాలు మినహా అన్ని రోజుల్లోనూ కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తోంది. ఈ శిబిరాలను జనవరి 26 వరకు కొనసాగించడానికి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ పక్కా ప్రణాళికతోముం దుకు సాగుతోంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒక్కో శిబిరంలో రోజూ 250 నుంచి 300 మంది వరకు కంటి పరీక్షలను నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేశారు. కంటి అద్దాల అందజేత.. కంటి పరీక్షలకు జిల్లా వ్యాస్తంగా 37 వైద్య బృందాలను ఏర్పాటు చేసి అందులో 37 మంది వైద్యాధికారులతో కలిసి ఒక్కో బృందంలో 12 మంది సిబ్బందిని నియమించారు. జిల్లాలోని ఆయా మండలాల్లోని 57 గ్రామాలు, పట్టణాల్లోని 13 వార్డుల్లో ఇప్పటికే కంటి వైద్య పరీక్షలు పూర్తి చేశారు. ఇప్పటి వరకు లక్షా 36 వేల 202 మందికి కంటి పరీక్షలను నిర్వహించారు. అందులో పురుషులు 59,553 మంది కాగా మహిళలు 76,634, థర్డ్జెండర్ 15 మంది ఉన్నారు. పరీక్షలు పూర్తయిన వారిలో ఎస్సీలు 25,941, ఎస్టీలు 11,213, బీసీలు 77,913, ఇతరులు 16,219, మైనార్టీలు 4,916 మంది ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 29,657 మంది రీడింగ్ కంటి అద్దాలను ఉచితంగా అందజేశారు. కంటి అద్దాలను అందించిన వారిలో నలబై సంవత్సరాల్లోపు వారు 5,709 మంది, నలబై సంవత్సరాలు దాటిన వారు 23,948 మంది ఉన్నారు. ఇతర కంటి అద్దాలను పంపిణీ చేయడానికి గాను 33,660 మందిని గుర్తించి వారికి తరువాత అద్దాలను అందజేయనున్నారు. 13,705 మందిని శస్త్ర చికిత్సలకు రెఫర్ చేశారు. అందులో 10,198 మందిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రితో పాటు ఇతర ఏరియా ఆస్పత్రులకు, 3,507 మందిని హైదరాబాద్లోని సరోజిని, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు రెఫర్ చేశారు. ఉదయం నుంచే బారులు.. జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించే తేదీలకు ముందుగానే ఆయా గ్రామాలు, వార్డుల్లో ఆశ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి తెలియజేయడంతోపాటు.. డప్పు చాటింపులను వేయిస్తున్నారు. దీంతో ప్రజలు ఉదయం 9 గంటలకు ముం దే ఆయా శిబిరాల వద్ద బారులుదీరుతున్నారు. స్వచ్ఛం దంగా కంటివెలుగు కార్యక్రమంలో భాగస్వాములు అవుతుండడంతో సిబ్బంది ఉత్సాహంతో సేవలు అంది స్తున్నారు. కంటివెలుగు కార్యక్రమంలో నాణ్యమైన కంటి అద్దాలను ఉచితంగా అందిస్తుండడంతో ప్రజలు వాటిని తీసుకోడానికి ఆసక్తి చూపుతున్నారు. శిబిరానికి వచ్చే ప్రతి ఒక్కరూ విధిగా తమ ఆధార్ కార్డును తప్పక తీసుకురావాలని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రజల నుంచి విశేష స్పందన కంటి వైద్య శిబిరాలకు ప్రజల నుం చి విశేష స్పందన వస్తోంది. ప్రజ లు స్వచ్ఛందంగా ఉదయం నుంచే క్యాంపు వద్ద బారులుదీరుతున్నా రు. నాణ్యమైన అద్దాలను అందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అ మలు చే స్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. జనవరి 26 వరకు నిరంతరం శిబిరాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాం. కె.భానుప్రసాద్నాయక్, డీఎంహెచ్ఓ -
3.77 లక్షల మందికి కంటి ఆపరేషన్లు అవసరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 3.77 లక్షల మందికి కంటి ఆపరేషన్లు అవసరమని వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. కంటి వెలుగు కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గత నెల 15న ప్రారంభమైన ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు 34.08 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో 3.77 లక్షల మందికి కంటి ఆపరేషన్లు చేయాల్సిన అవసరాన్ని వైద్యులు నిర్ధారించారని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. అందులో అత్యధికంగా 2.42 లక్షల మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్లు చేయాల్సిన అవసరముందన్నారు. 16,265 మందికి కరోనా, 68,788 మందికి ఇతరత్రా కంటి శస్త్రచికిత్సలు చేయాలని నిర్ధారించినట్లు ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లోనే అత్యధికంగా 41 వేల మందికి ఆపరేషన్లు చేయాలని గుర్తించారు. అంచనాలను మించి..: కంటి వెలుగుకింద రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల మందికి మాత్రమే ఆపరేషన్లు చేయాల్సి వస్తుందని వైద్యారోగ్యశాఖ మొదట్లో అంచనా వేయగా ఇప్పుడు పరిస్థితి మారింది. అంచనాలకు మించి ఆపరేషన్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజా అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల మందికి కంటి ఆపరేషన్లు చేయాల్సి వస్తుందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. మొదటి అంచనాలు కాస్తా నాలుగు రెట్లు పెరగడం గమనార్హం. ఈ కార్యక్రమం ఆరు నెలలపాటు సుదీర్ఘంగా నిర్వహిస్తారు. ఒక అంచనా ప్రకారం కోటిన్నర మంది ప్రజలు కంటివెలుగు కింద పరీక్షలు చేయించుకుంటారని భావిస్తున్నారు. నాలు గు రెట్లు ఆపరేషన్లు పెరిగే అవకాశమున్నందున ఆ మేరకు ఆపరేషన్లు చేసే ఆసుపత్రుల సంఖ్యను కూడా పెంచారు. ఇప్పటివరకు 70 ఆసుపత్రులకు అనుమతిచ్చారు. అదనంగా మరో 41 ఆసుపత్రులను గుర్తించారు. ఇలా మొత్తం 111 ఆసుపత్రుల్లో కంటి ఆపరేషన్లు చేస్తారు. వారందరికీ ఆయా ఆసుపత్రుల్లో ఆప రేషన్లు చేయాలంటే కనీసం ఏడాదిన్నర సమయం పడుతుందని వైద్య ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. 60 రకాల ఆపరేషన్లు ఉచితంగా.. కంటి వెలుగు కింద 60 రకాల ఆపరేషన్లను ఉచితంగా చేస్తారు. ఆరోగ్యశ్రీలో కేవలం 25 వరకు మాత్రమే కంటి ఆపరేషన్లు నిర్వహిస్తుంటే, ఇప్పుడు ‘కంటి వెలుగు’లో 60 వరకు చేస్తున్నట్లు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. అంటే కంటికి సంబంధించిన అన్ని ఆపరేషన్లు ఇందులోనే కవర్ అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఒక్కో కంటి ఆపరేషన్కు కనిష్టంగా రూ.2 వేలు, గరిష్టంగా రూ.35 వేల వరకు ప్రభుత్వం సంబంధిత ఆసుపత్రికి చెల్లిస్తుంది. కంటి పరీక్షలు, ఆపరేషన్లు ఉచితంగా చేసే పరిస్థితి రావడం తో రాష్ట్రంలో ప్రైవేటు కంటి ఆసుపత్రులు రోగులు లేక వెలవెల పోతున్నాయి. మరోవైపు కంటి అద్దాల దుకాణాలకు కూడా గిరాకీ తగ్గినట్లు చెబుతున్నారు. -
‘వెలుగు’తోంది..!
ఖమ్మం వైద్యవిభాగం: కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో ఊపందుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంపై ముందస్తుగా విస్తృత ప్రచారం చేయడంతో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు శరవేగంగా కొనసాగుతున్నాయి. పల్లె, పట్నం తేడా లేకుండా.. వయసు నిమిత్తం లేకుండా కంటి పరీక్షలు చేయించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 15న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం విదితమే. ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడొద్దనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చింది. కంటి పరీక్షలు చేయడంతోపాటు సమస్య ఉన్న వారికి మందులతోపాటు కళ్లద్దాలు అవసరం ఉన్న వారికి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. శస్త్ర చికిత్సలు అవసరం అనుకుంటే నిర్దేశించిన ఆస్పత్రుల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 32 బృందాల పర్యవేక్షణలో.. జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం కోసం 32 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. మొత్తం 36 బృందాలు అవసరముంటాయని అంచనాకు రాగా.. 32 వైద్య బృందాల ద్వారా వైద్య పరీక్షలు చేస్తున్నారు. మరో నాలుగు బృందాలను అత్యవసరం మేరకు అందుబాటులో ఉంచారు. ఎక్కడైనా సమస్య ఏర్పడినట్లయితే అత్యవసర బృందాలను వినియోగిస్తున్నారు. కార్యక్రమానికి ఎటువంటి ఆటంకం కలగకుండా డీఎంహెచ్ఓ కొండల్రావు పర్యవేక్షణలో వైద్య శిబిరాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొత్తం 14,39,000 జనాభా ఉండగా.. నగరంలో 3,20,000 మంది ఉన్నారు. అయితే ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రణాళిక లు తయారు చేసి.. ఆ దిశగా శిబిరాలు నిర్వహిస్తున్నారు. నెల రోజుల్లో 1,08,692 మందికి పరీక్షలు జిల్లావ్యాప్తంగా కంటి పరీక్షలు శరవేగంగా కొనసాగుతున్నాయి. కార్యక్రమం ప్రారంభించిన నెల రోజుల వ్యవధిలోనే జిల్లాలో 1,08,692 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 47,520 మంది పురుషులు కాగా.. 61,162 మంది మహిళలు ఉన్నారు. 10 మంది ట్రాన్స్జెండర్స్ పరీక్ష చేయించుకున్న వారిలో ఉన్నారు. జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామీణ, అర్బన్ ప్రాంతాలుగా విడదీశారు. 25 బృందాలు గ్రామీణ ప్రాంతంల్లో ప్రతి రోజూ పరీక్షలు చేస్తున్నారు. 7 బృందాలు నగరంలో పరీక్షలు నిర్వహిస్తున్నాయి. జిల్లాలో 447 గ్రామాలు ఉండగా.. ఇప్పటివరకు 108 గ్రామాల్లో పరీక్షలు పూర్తయ్యాయి. అలాగే నగరంలో 50 డివిజన్లు ఉండగా.. ప్రస్తుతం 9 డివిజన్లలో పరీక్షలు పూర్తి చేశారు. వారంలో 5 రోజులపాటు శిబిరాలు నిర్వహిస్తుండగా.. రోజుకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో బృందం 250, పట్టణ ప్రాంతంలో 350 మందికి పరీక్షలు చేయాలని నిర్ణయించారు. పథకం ప్రారంభంలో కొంతమేర మందకొడిగా సాగినా.. ప్రస్తుతం కంటి పరీక్షలు ఊపందుకున్నాయి. 27,580 మందికి కళ్లద్దాల పంపిణీ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 27,580 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. కంటి సమస్యతో బాధపడుతూ.. కళ్లద్దాలు అవసరం ఉన్న వారికి మాత్రమే డాక్టర్లు కళ్లద్దాలు రాస్తున్నారు. మరో 28,223 మందికి కళ్లద్దాలు ఇవ్వాలని డాక్టర్లు రాయగా.. వారికి హైదరాబాద్ నుంచి రావాల్సి ఉంది. జిల్లాకు 1,60,000 కళ్లద్దాలు పంపించారు. అయితే కంటి సమస్య ఎక్కువ ఉన్న వారికి ప్రత్యేకంగా ఇండెంట్ పెట్టి తెప్పిస్తున్నారు. అయితే నెల రోజుల కాలంలో 13,047 మందికి కంటి శస్త్ర చికిత్సలు చేయాలని గుర్తించారు. అందులో 9,626 మందిని ఖమ్మం, 3,421 మందిని హైదరాబాద్ ఆస్పత్రులకు ఆపరేషన్ కోసం పంపించారు. ప్రతి ఒక్కరికీ పరీక్షలు శిబిరానికి వచ్చే ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తాం. శిబిరానికి వచ్చే వారు ఆధార్ కార్డు తీసుకురావాల్సి ఉంటుంది. జిల్లాలో కంటి పరీక్షలు ప్రస్తుతం ఊపందుకున్నాయి. 32 వైద్య బృందాల ద్వారా ప్రతి రోజు 9వేల మందికి పైగా పరీక్షిస్తున్నాం. అత్యవసర బృందాలను కూడా వినియోగిస్తున్నాం. మందులు, కళ్లజోళ్లకు ఎలాంటి కొరత లేదు. నాలుగు నెలలకుపైగా శిబిరాలు నిర్వహిస్తాం. ప్రతి ఒక్కరినీ పరీక్ష చేస్తాం. ప్రజలు శిబిరాలను సద్వినియోగం చేసుకొని కంటి పరీక్షలు చేయించుకోవాలి. – కొండల్రావు, డీఎంహెచ్ఓ -
రెండువేలైతే కుదరదు!
సాక్షి, హైదరాబాద్: కంటి వెలుగు కింద క్యాటరాక్ట్ ఆపరేషన్లకు ప్రభుత్వమిచ్చే సొమ్ము సరిపోవడం లేదని ప్రైవేటు ఆస్పత్రులు గగ్గోలు పెడుతున్నాయి. ఒ క్కో క్యాటరాక్ట్ ఆపరేషన్కు రూ. 2వేలు ఇస్తుండటంతో గిట్టుబాటు కావడంలేద ని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీం తో పలుచోట్ల ఆపరేషన్లు ఆలస్యం అవుతున్నాయని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఏం చేయాలో అర్థంగాక అధికారులు తల పట్టుకుంటున్నారు. 11 శాతం మందికి.. ప్రభుత్వం గత నెల 15న ప్రారంభిం చిన కంటి వెలుగు కార్యక్రమంలో సోమ వారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 22.13 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 9.52 లక్షల మంది పురుషులు, 12.60 లక్షల మంది స్త్రీలున్నారు. ఇప్పటివరకు నిర్వహించిన కంటి పరీక్షల అనంతరం 4.26 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు ఇచ్చారు. మరో 5.13 లక్షల మందికి ఇతర దృష్టిలోపం కారణంగా సంబంధిత అద్దాలివ్వాలని నిర్ణయించారు. కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో దాదాపు 11 శాతం మందికి క్యాటరాక్ట్ అవసరమని నిర్ధారించినట్లు సమాచారం. మరో 4 శాతం మందికి ఆపరేషన్లు అవసరమని నిర్ధారించారు. పెరుగుతున్న ఆపరేషన్లు కంటి వెలుగు ప్రారంభానికి ముందు రాష్ట్రంలో 3 లక్షల మందికే ఆపరేషన్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. కానీ పరిస్థితి చూస్తుంటే 12 లక్షల మందికి ఆపరేషన్లు చేయాల్సి వస్తుందని వైద్యారోగ్య శాఖ అంచనా వేసింది. దీంతో ఆపరేషన్లు చేసే ఆస్పత్రుల సంఖ్యనూ పెంచారు. ఇప్పటివరకు 70 ఆస్పత్రులకు అనుమతివ్వగా.. మరో 41 ఆస్పత్రులను గుర్తించారు. వీరి ఆపరేషన్లకు కనీసం ఏడాదిన్నర పడుతుందని వైద్యారోగ్య వర్గాలు చెబుతున్నాయి. ఆరోగ్యశ్రీలో 25 వరకే కంటి ఆపరేషన్లు నిర్వహిస్తుండగా కంటి వెలుగులో 60 వరకు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కో కంటి ఆపరేషన్కు కనిష్టంగా రూ. 2 వేలు, గరిష్టంగా రూ. 35 వేల వరకు సంబంధిత ఆస్పత్రికి ప్రభుత్వం చెల్లిస్తోంది. ఏదైనా ఆస్పత్రి అంతకు మించి వసూలు చేస్తే జాబితా నుంచి ఆస్పత్రిని తీసేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. క్యాటరాక్ట్వే ఎక్కువ కంటి ఆపరేషన్లలో ఎక్కువగా క్యాటరాక్ట్వే ఉన్నాయి. ఆరోగ్యశ్రీలో క్యాటరాక్ట్ ఆపరేషన్ల ధర లేకపోవడంతో ఆపరేషన్కు రూ. 2,000లను ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇతర ఆపరేషన్లకు ఆరోగ్యశ్రీ ధరల ప్రకారం ఇస్తోంది. అయితే కేంద్రం ప్రారంభించిన ఆయుష్మాన్భవలో క్యాటరాక్ట్కు రూ. 6 వేలు ఇస్తున్నారని.. ఇక్కడ కనీసం రూ. 5,000 అయినా ఇవ్వాలని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు కోరుతున్నాయి. లేదంటే మున్ముందు ఆపరేషన్లను నిలిపేసే ప్రమాదముందని కొన్ని యాజమాన్యాలు హెచ్చరిస్తున్నాయి. -
కంటి వెలుగుకు ఆ‘పరేషాన్’
సాక్షి, సిటీబ్యూరో: కంటిచూపు సమస్యతో బాధపడుతున్న వారికి ఆ‘పరేషాన్’ తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమంలో భాగంగా కాటరాక్ట్ సమస్య ఉన్నట్లు గుర్తించిన రోగులకు సకాలంలో ఆపరేషన్లు జరగడం లేదు. శిబిరాల్లో వైద్యులు బాధితులను గుర్తించి ఎంపిక చేసిన ఆస్పత్రులకు సిఫార్సు చేస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా శుక్లాల ఆపరేషన్ చేయించుకునేందుకు ఎంతో ఆశతో ఆస్పత్రులకు వెళ్లిన రోగులకు నిరాశే మిగులుతోంది. దీనికితోడు ఇప్పటివరకు రీడింగ్ గ్లాసులు మినహా మల్టిపుల్ విజన్, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారిలో ఒక్కరికి కూడా కళ్లజోళ్లు అందించకపోవడం గమనార్హం. సరోజినిదేవి కంటి ఆస్పత్రి సహా ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్సలకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేకపోవడం, ప్రభుత్వం ఇచ్చే ఖర్చులు చాలా తక్కువగా ఉండటంతో ప్రైవేటు ఆస్పత్రులు సర్జరీలు చేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో బాధితులు దిక్కుతోచక ఇబ్బందులు పడుతున్నారు. అందని కళ్లజోళ్లు కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 98 క్యాంపులు ఏర్పాటు చేశారు. తాత్కాలిక ప్రతిపాదికన ఒక్కో క్యాంపులో ఆరుగురు చొప్పున మొత్తం 588 మంది సిబ్బందిని నియమించింది. వీరు ఇప్పటి వరకు 2,04,786 మంది రోగులను పరీక్షించారు. ఇందులో 83171 మంది పురుషులు కాగా, 120598 మంది మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు 42649 మందికి రీడింగ్ గ్లాసులను పంపిణీ చేశారు. మరో 69284 మందికి మల్టిపుల్ విజన్ సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. వీరికి సమస్యను బట్టి ప్రత్యేకంగా కళ్లజోళ్లను ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఒక్కరికి కూడా అద్దాలు అందజేయలేదు. మరో 11,825 మందికి కాటరాక్ట్ సమస్య బాధపడుతున్నట్లు గుర్తించి ఆపరేషన్ నిమిత్తం నగరంలోని ఆనంద్ నేత్రాలయం, హరికృష్ణ నేత్రాలయం, మెడివిజన్, ఎల్వీప్రసాద్, పుష్పగిరి, సరోజినిదేవి కంటి ఆస్పత్రి, ప్రిన్సెన్ఇస్రో, కింగ్కోఠి జిల్లా ఆస్పత్రులకు సిఫార్సు చేశారు. అయితే ఆయా ఆస్పత్రుల్లో ఇప్పటి వరకు 95 కాటరాక్ట్ సర్జరీలు మాత్రమే జరిగాయి. ఇందులో ఎల్వీప్రసాద్, హరికృష్ణ నేత్రాలయా ఆస్పత్రుల్లో ఇప్పటి వరకు ఒక్క సర్జరీ కూడా చేయకపోవడం విశేషం. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స ఖర్చులు ఎక్కువగా ఉండటం, ఆ మేరకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో నిర్వాహకులు చికిత్సలకు వెనుకాడుతున్నట్లు సమాచారం. గుర్తింపుతోనే సరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు వైద్య శిబిరంలో కంటిచార్ట్ సహాయంతో ప్రాథమిక కంటి పరీక్ష(అన్ ఎయిడెడ్ విజువల్ ఆక్యూటీ)తో పాటు సవివరమైన కంటిపరీక్ష(ఆబ్జెక్టివ్ రీఫ్రాక్షన్)లు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన సామాగ్రి కూడా ప్రభుత్వమే సమకూర్చింది. ఇందులో భాగంగా వైద్యులు కంటి సమస్యను గుర్తించి మందులతో పాటు అవసరమైన వారికి కంటి అద్దాలు సిఫార్సు చేస్తున్నారు. రీడింగ్ గ్లాసులు అవసరమైన వారికి అక్కడికక్కడే అందజేస్తున్నప్పటికీ..ప్రిస్కిప్షన్ రాసిన వారికి నాలుగు వారాల గడువు ఇచ్చారు. వీటి తయారీ బెంగుళూరుకు చెందిన ఈఎస్ఎస్ఎల్ఆర్ సంస్థకు కాంట్రాక్టు అప్పగించారు. క్యాటరాక్ట్ సర్జరీలు అవసరమైన వారిని కేవలం గుర్తింపునకే పరిమితమవుతోంది. బాధితులను ప్రభుత్వమే సయంగా ఆస్పత్రులకు తీసుకెళ్లి సర్జరీలు చేయించకపోవడంతో ఆశించిన స్థాయిలో ఆపరేషన్లు జరగడం లేదు. చికిత్స చేయించుకునేందుకు బాధితులే స్వయంగా ఆస్పత్రులకు వస్తున్నా ప్రభుత్వం చెల్లిస్తున్న వైద్య ఖర్చులు చాలా తక్కువగా ఉండటంతో కంటి వెలుగు బాధితులను చేర్చుకునేందుకు ఆస్పత్రులు నిరాకరిస్తుండటంతో రోగుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. -
‘వెలుగు’లో కష్టాలు
నిజామాబాద్అర్బన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో వైద్య సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. వైద్య శిబిరాల నిర్వహణ సమయంలో భోజన వసతి కల్పించాల్సి ఉండగా చాలా చోట్ల పట్టించుకోవడం లేదు. భోజన ఏర్పాట్లకు నిధులు కూడా మంజూరు అయ్యాయి. గతనెల 15న జిల్లా వ్యాప్తంగా 35 ప్రాంతాల్లో కంటి వెలుగు వైద్యశిబిరాలు ప్రారంభమయ్యా యి. 35 వైద్య బృందాలను ఏర్పాటు చేశా రు. ఇందులో జనరల్ వైద్యులతో పాటు కంటి వైద్య నిపుణులు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఇద్దరు, స్థానిక ఏఎన్ఎంలు ఇద్ద రు, ఆశకార్యకర్తలు , ఇద్దరు సూపర్వైజ ర్లు ఉంటారు. వీరికి మధ్యాహ్న వేళలో భోజనం, రెండు పూటల టీ , శిబిరం వద్ద టెంట్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారు. ఒక్కో శిబిరానికి మొదట రూ. 1500 మంజూరు చేయగా సరిపోవడంలేదని రూ. 2,500 పెంచారు. కంటి వెలుగు శిబిరం నిర్వహణకు జిల్లాకు ఒక రూ. కోటి 9 లక్షలు మంజూరు అయ్యాయి. ఇందులో నుంచి ఖర్చుకు కేటాయిస్తున్నారు. అయితే కంటి వెలుగు శిబిరాల్లో వైద్యసిబ్బందికి భోజనాలు అందించకుండా, ఇంటి నుంచే తెచ్చుకోవాలని వైద్యాధికారులు సూచించడం గమనార్హం. కనీసం రెండు పూటల టీ అందించడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని నాలుగు వైద్యశిబిరాల్లో భోజనాన్ని స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేయిస్తున్నారు. కేటాయించిన నిధులను మాత్రం ఖర్చు చేయడం లేదు. మరోవైపు వైద్యశిబిరాలను మహిళ సంఘాలు, కుల సంఘాలు, కమ్యూనిటీ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. టెంట్ ఖర్చు కూడా మిగిలిపోతోంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైద్యశిబిరాలు కొనసాగుతున్నాయి. దీంతో శిబిరంలో పాల్గొనే సిబ్బంది భోజన వసతి కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పీహెచ్సీ వైద్యసిబ్బంది జిల్లా వైద్యాధికారి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 50 రోజుల వరకు శిబిరాల నిర్వహణ సమయంలో భోజన వసతి కోసం నిధులు ముందుగానే ప్రభుత్వం మంజూరు చేసింది. స్థానికంగా మెడికల్ ఆఫీసర్లు డబ్బులు ఖర్చు చేయకపోవడంపై అధికారులు మండిపడుతున్నారు. గ్రామాల్లో గ్రామ అభివృద్ధి కమిటీలు , ప్రజాప్రతినిధుల ద్వారా భోజన వసతి కల్పిస్తున్నారే తప్ప వైద్యాధికారులు నిధులు ఖర్చు చేయడం లేదు. ఇప్పటికే దాదాపు 70 వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వైద్యశిబిరాలకు ప్రజల తాకిడి ఎక్కువగా ఉండడంతో వైద్యసిబ్బందికి కనీస సౌకర్యాలు కల్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. నిధులు మంజూరు అయ్యాయి : జిల్లా ఇన్చార్జి వైద్యాధికారి డా సుదర్శనం కంటి వెలుగు నిర్వహణకు సంబంధించి సంబంధిత సెంటర్లకు నిధులు ముందస్తుగానే విడుదల అయ్యాయి. సిబ్బందికి భోజన, ఇతర ఖర్చులకు ఎలాంటి లోటు లేకుండా నిధులు అందుబాటులో ఉన్నాయి. ఎవరైన భోజన వసతి కల్పించకుంటే చర్యలు తీసుకుంటాం. మంజూరు అయిన నిధుల ప్రకారం తప్పకుండా కనీస సౌకర్యాలు, భోజన వసతి వైద్యాధికారులు కల్పిలంచాలి. -
అద్దాల్లేవ్..
వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లిలో మంగళవారం కంటి వెలుగు క్యాంపునకు 232 మంది హాజరుకాగా పరీక్షలు నిర్వహించి, వారిలో 135 మందికి కంటి అద్దాలు అవసరం అని నిర్ధారించారు. అలాగే 15 మందికి శస్త్ర చికిత్స అవసరమని సిఫార్సు చేశారు. దగ్గరి చూపు సమస్యతో బాధపడుతున్న 61 మందికే కంటి అద్దాలు అందుబాటులో ఉండగా వారికే అందించారు. దూరపు చూపు సమస్యతో బాధపడుతున్న 75 మందికి కంటి అద్దాల కోసం అర్డర్ కోసం ఆన్లైన్లో నమోదు చేశారు. వారికి అక్టోబర్ 5న వస్తాయని, ఇంటికి ఆశ వర్కర్ తీసుకొచ్చి ఇస్తారని చెప్పారు. దీంతో కంటి అద్దాలు అందిస్తారని ఆశతో వచ్చిన ప్రజలు నిరాశతో వెనుదిరిగారు. సాక్షి, వరంగల్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమంలో పరీక్షలు చేయించుకున్న దూరపు చూపు బాధితులకు అద్దాలు అందుబాటులో లేవు. ఆ అద్దాల కోసం వైద్య సిబ్బంది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టగా నెల రోజుల గడువు చూపిస్తోంది. దీంతో కంటి పరీక్షలకు వెళ్లిన దూరపు చూపు బాధితులు క్యాంపు నుంచి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీలు), ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి కేంద్రంలో కంటి పరీక్షలకు ఐదు గదులు ఏర్పాటు చేశారు. వీటిలో రిజిస్ట్రేషన్, తర్వాత కంటి పరీక్ష, వైద్యుడి పరీక్ష, కంప్యూటర్ పరీక్ష, కంటి అద్దాల పంపిణీ గదులు ఉన్నాయి. కాగా గ్రామాల్లో ప్రతి వంద మందిలో సగటున 30 మందికిపైగా కంటి సమస్యతో బాధపడుతున్నట్లు కంటి పరీక్షల నివేదికలు వెల్లడిస్తున్నాయి. దూరపు చూపు అద్దాలు.. నెల రోజులకు.. కంటి చూపులో దూరపు, దగ్గరి చూపు సమస్యతో బాధపడుతున్నవారు, అసలు కనబడని వారిని పరీక్షల్లో గుర్తిస్తున్నారు. దగ్గరి చూపు కనబడడం లేదని డాక్టర్లు నిర్ధారిస్తే వెంటనే వారికి కంటి అద్దాలను పంపిణీ చేస్తున్నారు. దూరపు చూపు కనబడని వారి వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి ఆర్డర్ పెడుతున్నారు. రెండు కళ్లకు ఒకే రకమైన సైట్ ఉంటేనే కంటి అద్దాలు అందిస్తున్నారు. ఆన్లైన్లో నమోదు చేయగా 30 రోజుల తర్వాత కంటి అద్దాలు వస్తాయనే సమాచారం వస్తోంది. దీంతో బాధితులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. అసలు కంటి అద్దాలు వస్తాయో.. రావో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అందుబాటులో తొమ్మిది రకాల అద్దాలే.. కంటి వెలుగు పథకంలో కంటి పరీక్షలు చేయించుకున్న వారికి వెంటనే అందించేందుకు ప్రభుత్వం 9 రకాల కంటి అద్దాలనే అందుబాటులో ఉంచారు. 1.0 ఆర్ఎంబీఎఫ్ నుంచి 2.5 ఆర్ఎంబీఎఫ్, 1.0 నుంచి 2.5 ఆర్ఎంబీ వరకు మాత్రమే కంటి అద్దాలు ఉన్నాయి. అనుకూల ఆస్పత్రులకే శస్త్ర చికిత్సకు రెఫర్.. కంటి వెలుగులో పరీక్షలు చేయించుకున్న వారికి కంటి శస్త్ర చికిత్స చేయాలని నిర్ధారించిన వారిని కొన్ని రెఫరల్ ఆస్పత్రులకు మాత్రమే సిఫార్సు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా యి. ఏ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకుంటా నంటే ఆ వైద్యశాలకు రెఫర్ చేయాల్సి ఉండగా అలా క్యాంప్లో జరగడం లేదు. ఆయా కంటి ఆస్పత్రులతో కొందరు మిలాఖతై వారి ఆస్పత్రికే ఎక్కువగా రెఫర్ చేస్తున్నారని సమాచారం. నిరాశగా పోతున్నా కంటి పరీక్షలు చేస్తున్నారంటే వచ్చి చేయించుకున్నా. –1, –2 సైట్ ఉందని డాక్టర్లు నిర్ధారించారు. కంటి అద్దాలు ఇచ్చే దగ్గరికి వెళ్లి చిట్టీ చూపిస్తే ట్యాబ్లో ఎంటర్ చేశారు. నెల రోజుల తర్వాత కంటి అద్దాలు వస్తాయని చెప్పారు. దీంతో నిరాశతో పోతున్నా. వస్తాయో లేదో మరి.. చూడాలి. – సారయ్య, దుగ్గొండి ఆర్డర్ తీసుకుంటున్నాం జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం బాగా జరుగుతోంది. అందుబాటులో లేని కంటి అద్దాలు ఆర్డర్ తీసుకుంటున్నాం. ఆర్డర్ పెట్టిన కంటి అద్దాలు రాగానే అందిస్తాం. ప్రభుత్వం నుంచి వచ్చిన అద్దాలను వెంటనే అందిస్తున్నాం. –డాక్టర్ వెంకటరమణ, డీఎంఅండ్హెచ్ఓ, వరంగల్ రూరల్ -
కంటి వెలుగుతో ‘ఆయుష్’ ఖాళీ
కామారెడ్డి అర్బన్ : జిల్లా కేంద్రంలోని ఆయుష్ విభాగంలో ఆయుర్వేదం, నాచురోపతి, హోమి యోపతి వైద్యశాలలు ఒకే ప్రదేశంలో నిర్వహి స్తున్నారు. కాగా హోమియోపతి ఆసుపత్రికి కొనేళ్లుగా వైద్యుడు లేడు. ఆయుర్వేద, నేచురోపతికి జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఇద్దరు కాంట్రాక్టు వైద్యులు సేవలు అందిస్తున్నారు. హోమియోపతి వైద్యానికి వచ్చే వారికి కాంపౌండరే తనకు తెలిసిన మందులు అందిస్తున్నారు. ఇక్కడికి వచ్చే రోగులు ఎక్కువ మంది దీర్ఘకాలిక వ్యాధులైన కాళ్లు, మోకాళ్ల నొప్పులు, కిడ్నీ, చర్మసంబంధిత వ్యాధులు, అలర్జీలు, గర్భాశయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు వైద్యం కోసం వస్తున్నారు. వీరికి నాచురోపతి, ఆయుర్వేదంలో మంచి మందులు లభిస్తున్నాయి. దీంతో రోజు దాదాపు 50 మంది వరకు రోగులు వస్తున్నారు. జిల్లాలో కామారెడ్డితోపాటు పిట్లం, మాచారెడ్డి, పెద్దకొడప్గల్, ఎర్రాపహాడ్లలోని ఆయుష్ వెద్యశాలల కాంట్రాక్ట్ వైద్యులందరికీ కంటివెలుగు డ్యూటీలు వేశారు. దీంతో ఆయుష్ వైద్య సేవలు అందకుండాపోయాయి. కంటి వెలుగు డ్యూటీ.. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 వ తేదీ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.. కామారెడ్డి ఆయుష్లో పనిచేస్తున్న వైద్యులను ఆరు నెలల పాటు డిప్యూటేషన్పై కంటి వెలుగు బాధ్యతలు అప్పగించారు. దీంతో సంప్రదాయ వైద్య సేవల కోసం వస్తున్న రోగులకు వైద్యం అందకుండాపోయింది. వైద్య సేవల కోసం ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక ఆవేదన చెందుతున్నారు. కాగా కంటి వెలుగు కార్యక్రమంలో కంటివైద్యానికి ఎలాంటి సంబంధం, అర్హత లేని ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలతో పాటు ఆయుర్వేద, హోమియోపతి వైద్యుల సేవలు వినియోగించుకుంటుండడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కంటి వెలుగు డ్యూటీలను రద్దుచేసి తమకు న్యాయం చేయాలని రోగులు కోరుతున్నారు. సీఎం ఆదేశాలు ఇలా...వైద్య అధికారులు మరోలా... ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగుపై పలు సూచనలు చేశారు. కంటి పరీక్షల కోసం నియమించే సిబ్బంది వల్ల సాధారణ వైద్యసేవలకు అటంకం కలుగకుండా చూడాలన్నారు. కంటి పరీక్షల శిబిరంలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యుల సేవలను తాత్కాలిక పద్ధతిలో వినియోగించుకోవాలని సూచించారు. వివిధ ప్రభుత్వ ఆస్పత్రులలో పనిచేస్తున్న వారిని వినియోగించవద్దని సూచించగా.. అందుకు విరుద్ధంగా జిల్లా వైద్య ఆర్యోగశాఖ అధికారులు ఆయుష్ కాంట్రాక్ట్ వైద్యులకు కంటి వెలుగు డ్యూటీలు వేసి రెగ్యులర్ వైద్యులను మినహాయించడంపై విమర్శలు వస్తున్నాయి. జిల్లా కేంద్రమైనా పరిస్థితి మారలే.. తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని నియామకాలు జరిగి కామారెడ్డి ఆయుష్ ఆస్పత్రి పరిస్థితి మెరుగు పడుతుందని ప్రజలు భావించారు. కానీ అందుకు విరుద్ధంగా జరుగుతోంది. కామారెడ్డి జిల్లా కేంద్రంగా ఆవిర్భవించినప్పటికీ వైద్య సేవలు మెరుగుపడడం లేదు. కనీసం డిప్యూటేషన్పైకూడా హోమియోపతి వైద్యుడిని నియమించడం లేదు. ఈ విషయమై పలుమార్లు ప్రజావాణిలో ప్రజలు వినతులూ ఇచ్చారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది.