level
-
త్వరలో స్మార్ట్ ఫోన్ అంతం!! తర్వాత రాబోయేది ఇదే..
విశ్వవ్యాప్త సాంకేతికతను అంగీకరించడంలో మనిషి ఎప్పుడూ ముందుంటాడు. దానిని అంతే వేగంగా ఒడిసిపట్టుకుని అంగీకరిస్తుంటాడు కూడా. అయితే దశాబ్దాలపాటు మనందరి జీవితంలో భాగమైన మొబైల్ ఫోన్.. త్వరలో అంతం కానుందా?. అన్నింటికీ నెక్స్ట్(అడ్వాన్స్డ్) లెవల్ కోరుకునే మనిషికి వాటి స్థానంలో ఎలాంటి సాంకేతికత అందుబాటులోకి రాబోతోంది?..మనిషి జీవితంలో మొబైల్ ఫోన్లు(Mobile Phones) రాక ఒక క్రమపద్ధతిలో జరిగింది. కమ్యూనికేషన్లో భాగంగా.. రాతి కాలం నుంచి నేటి ఏఐ ఏజ్ దాకా రకరకాల మార్గాలను మనిషి అనుసరిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో పొగతో సిగ్నల్స్ ఇవ్వడం దగ్గరి నుంచి.. పావురాల సందేశం, డ్రమ్ములు వాయించడం, బూరలు ఊదడం లాంటి ద్వారా సమాచారాన్ని ఇచ్చుపుచ్చుకునేవాడు. కొన్ని ఏండ్లకు అది రాతపూర్వకం రూపంలోకి మారిపోయింది. ఆపై.. ఆధునిక యుగానికి వచ్చేసరికి టెలిగ్రఫీ, టెలిఫోనీ, రేడియో కమ్యూనికేషన్, టెలివిజన్, మొబైల్ కమ్యూనికేషన్, ఇంటర్నెట్-ఈమెయిల్, స్మార్ట్ఫోన్, సోషల్ మీడియా.. ఆపై మోడ్రన్ కమ్యూనికేషన్(Modern Communication)లో భాగంగా ఏఐ బేస్డ్ టూల్స్ ఉపయోగం పెరిగిపోవడం చూస్తున్నాం. అయితే.. ఇన్నేసి మార్పులు వచ్చినా దశాబ్దాల తరబడి మొబైల్ ఫోన్ల డామినేషన్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. కాలక్రమంలో మనిషికి ఫోన్ ఒక అవసరంగా మారిపోయిందది. మరి అలాంటిదానికి అసలు ‘అంతం’ ఉంటుందా?అమెరికా వ్యాపారవేత్త, ఫేస్బుక్ సహా వ్యవస్థాపకుడు, ప్రస్తుత మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్(Mark Zuckerberg) సెల్ఫోన్ స్థానంలో తర్వాతి టెక్నాలజీ ఏంటో అంచనా వేస్తున్నారు. సెల్ఫోన్ల అంతం త్వరలోనే ఉండబోతోందని, వాటి స్థానాన్ని స్మార్ట్ గ్లాసెస్ ఆక్రమించబోతున్నాయని అంచనా వేస్తున్నారు.రాబోయే రోజుల్లో వేరబుల్ టెక్నాలజీ(ఒంటికి ధరించే వెసులుబాటు ఉన్న సాంకేతికత) అనేది మనిషి జీవితంలో భాగం కానుంది. సంప్రదాయ ఫోన్ల కంటే స్మార్ట్ గ్లాసెస్ను ఎక్కువగా వినియోగిస్తాడు. వీటిని వాడడం చాలా సులువనే అంచనాకి మనిషి త్వరగానే వస్తాడు. అవుట్డేటెడ్ విషయాలను పక్కన పెట్టడం, ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నప్పుడు మనమూ అంగీకరించడం సర్వసాధారణంగా జరిగేదే. నా దృష్టిలో రాబోయే రోజుల్లో తమ చుట్టుపక్కల వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేందుకు స్మార్ట్ గ్లాసెస్(Smart Glasses)లాంటివి ఎక్కువగా వాడుకలోకి వస్తుంది. ఆ సంఖ్య ఫోన్ల కంటే కచ్చితంగా ఎక్కువగా ఉంటాయి’’ అని జుకర్బర్గ్ అభిప్రాయపడ్డారు.అలాగే 2030 నాటికి సెల్ఫోన్ల వాడకం బాగా తగ్గిపోతుందని.. దానికి బదులు స్మార్ట్గ్లాసెస్ తరహా టెక్నాలజీ వాడుకలో ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. అయితే వేరబుల్ టెక్నాలజీ ఖరీదుతో కూడుకున్న వ్యవహారమని.. అలాగని దానిని అందరికీ అందుబాటులోకి తేవడం అసాధ్యమేమీ కాదని, అంచలంచెలుగా అది జరుగుతుందని ఆయన చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. స్మార్ట్ఫోన్లతోపాటు వాటికి అనువైన స్మార్ట్ యాక్ససరీస్కు మార్కెట్లో ఇప్పుడు డిమాండ్ ఉంటోంది. తాజా సర్వేల ప్రకారం.. గత ఐదేళ్లుగా స్మార్ట్ వేరబుల్స్ వినియోగం పెరుగుతూ వస్తోంది. దీంతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు టెక్ కంపెనీలు సైతం సరికొత్త ఫీచర్స్తో స్మార్ట్ వేరబుల్స్ను విడుదల చేస్తున్నాయి. అందునా స్మార్ట్గ్లాసెస్ వినియోగమూ పెరిగింది కూడా. రేబాన్ మెటా, ఎక్స్ రియల్ ఏ2, వచుర్ ప్రో ఎక్స్ఆర్, సోలోస్ ఎయిర్గో విజన్, అమెజాన్ ఎకో ఫఫ్రేమ్స్, లూసిడ్ తదితర బ్రాండ్లు మార్కెట్లోకి అందుబాటులోకి ఉన్నాయి. యాపిల్ కంపెనీ యాపిల్ విజన్ ప్రో పేరిట మార్కెట్కు తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. మరికొన్ని కంపెనీలు కూడా ఇంకా ఈ లిస్ట్లో ఉన్నాయి.ఇదీ చదవండి: జుకర్బర్గ్ చేతికి అత్యంత అరుదైన వాచ్!! -
ఉత్తరాదిపై పొగమంచు దుప్పటి.. గ్యాస్ ఛాంబర్గా రాజధాని!
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెడుతున్న కారణంగా ఢిల్లీతో పాటు, పలు ఉత్తరాది రాష్ట్రాలను పొగమంచు దట్టంగా కమ్మేసింది. గాలి విషపూరితంగా మారింది. వాయు నాణ్యత కనిష్టానికి చేరింది. దీంతో ఉత్తరాది రాష్ట్రాలలోని జనం ఊపిరి తీసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వాతావరణశాఖ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలలో ఉత్తర భారతదేశం అంతటా దట్టమైన తెల్లటి పొగమంచు కమ్మేసినట్లు కనిపిస్తోంది. మహారాష్టలోనూ ఇదే స్థితి కనిపిస్తోంది. మొన్నటి దీపావళికి స్వల్పంగా కనిపించిన ఈ పొగమంచు దుప్పటి డిసెంబర్ చివరి నాటికి తీవ్రంగా మారుతుందని, ఇది జనవరి వరకూ కొనసాగుతుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది నాటి శాటిలైట్ చిత్రాలను పరిశీలించినప్పుడు ఇదే స్పష్టమవుతోంది. కొరియన్ జియో కాంప్శాట్ 2ఎ ఉపగ్రహం పంపిన రెండు చిత్రాలను పోల్చి చూసినప్పుడు ఇది తేలింది. తాజా చిత్రాలను చూస్తే ఢిల్లీపై పొగమంచు దట్టంగా అలముకున్నట్లు కనిపిస్తోంది. గాలి నాణ్యత ‘తీవ్రమైన’ వర్గానికి చేరింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 మార్కును దాటింది. Today, Delhi’s daily average AQI clocked 418 as per the 4 PM AQI Bulletin by CPCB. The CAQM Sub-Committee on GRAP accordingly took stock of the air quality scenario and the AQI forecast, including for the meteorological conditions as made by IMD/ IITM.Cont. (1/5)— Commission for Air Quality Management (@CAQM_Official) November 13, 2024గ్యాస్ ఛాంబర్గా రాజధానిదేశరాజధాని ఢిల్లీలోని ప్రజలు ఇప్పుడు ఊపిరి తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి కాలుష్యపూరిత గాలి ఆరోగ్యానికి మరింత ప్రమాదకరంగా మారింది. దీంతో తీవ్ర స్థాయి వాయు కాలుష్యం కేటగిరీగా ప్రకటించింది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(కేంద్ర కాలుష్య నియంత్ర మండలి). పంట వ్యర్ధాల దహనం, వాహన కాలుష్యం, గాలి వేగం మందగించడంతో కాలుష్యం పెరగడానికి కారణంగా గుర్తించారు.సీపీసీబీ తాజా డేటా ప్రకారం ఢిల్లీలో సగటు గాలి నాణ్యత సూచిక(ఏక్యూఐ)432కి చేరుకుంది. అంటే ఢిల్లీలో గాలి ‘వెరీ సీరియస్ కేటగిరీ’లో ఉంది. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల వాయు నాణ్యత సూచికను సీపీసీబీ విడుదల చేసింది. దీని ప్రకారం నజఫ్గఢ్లోని గాలి అత్యంత కలుషితంగా మారింది. ఏక్యూఐ 482గా నమోదయ్యింది. ఇదేవిధంగా ఏక్యూఐ 480తో నెహ్రూ నగర్ రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానంలో ఆనంద్ విహార్ ఉంది. ఈ నేపథ్యంలో గ్రాప్ - 3 నియంత్రణల అమలుపై నేడు నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం.ఇది కూడా చదవండి: రిజర్వేషన్ల రద్దుకు ‘యువరాజు’ కుట్రలు: మోదీ -
‘ఆడుదాం ఆంధ్రా’ తొలిదశ అదుర్స్
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో మునుపెన్నడూ తలపెట్టని మెగాక్రీడాటోర్నికి క్రీడాభిమానం వెల్లువెత్తుతోంది. రాష్ట్రంలోని క్రీడాకారుల్లో ప్రతిభకు ‘ఆడుదాం ఆంధ్రా’ అద్దం పడుతోంది. తొలి దశలో భాగంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల (జీఎస్డబ్ల్యూఎస్) పరిధిలో క్రీడా పోటీలు దిగ్విజయంగా ముగిశాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్కు (9వ తేదీ కంటే) ఒక రోజు ముందుగానే సచివాలయాల స్థాయిలో పోటీలు విజయవంతంగా పూర్తి చేశారు. 15 ఏళ్లకు పైబడిన మహిళలు, పురుషులు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ క్రీడల్లో తమ సత్తా చాటారు. ఐదు క్రీడాంశాల్లో మొత్తం 1.68 లక్షల మ్యాచ్లను వంద శాతం సమర్థవంతంగా నిర్వహించారు. రేపటి నుంచి మండల స్థాయి.. జనవరి 10వ తేదీ నుంచి మండలాలు, మున్సిపాల్టిలు కలిపి 753 మండల స్థాయి పోటీలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. జీఎస్డబ్ల్యూఎస్ పరిధిలో ‘పెర్ఫార్మెన్స్ టాలెంట్ హంట్’ ఆధారంగా క్రీడాకారులతో మండల స్థాయి పోటీలకు జట్లు ఎంపిక చేశారు. వీరికి 10వ తేదీ నుంచి సంక్రాంతిలోగా పోటీలు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అనంతరం నియోజవకర్గ స్థాయి పోటీలకు వెళ్లే వారికి ప్రాక్టీస్కు ఎక్కువ సమయం ఇచ్చేలా శాప్ అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. వాస్తవానికి ఈనెల 10 నుంచి 23 వరకు మండల, జనవరి 24 నుంచి 30 వరకు నియోజకవర్గ స్థాయి, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జిల్లా, ఫిబ్రవరి 6 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీలకు షెడ్యూల్ ఇచ్చారు. ప్రతి మండలంలో ఎంపిక చేసిన 2/3 క్రీడామైదానాల్లో సకల వసతుల మధ్య పోటీ నిర్వహించనున్నారు. జీఎస్డబ్ల్యూఎస్ స్థాయిలో విజేతల్లో ఉత్సాహాన్ని నింపేలా స్వాగత తోరణాలు, మస్కట్ లోగోలు, కామెంట్రీ, గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 1.49 లక్షల మంది స్పోర్ట్స్ వలంటీర్లు స్కోరర్లుగా, అంపైర్లుగా సేవలందిస్తున్నారు. విజేతలకు టీషర్టులు.. ఐదు క్రీడాంశాల్లో 9,478 క్రీడా ప్రాంగణాల్లో డిసెంబర్ 26వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు జరిగి న పోటీలు వీక్షించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి క్రీడాకారులకు మద్దతుగా నిలిచారు. జీఎస్డబ్ల్యూఎస్ దశలో మొత్తం 3.30 లక్షల జట్లను ఎంపిక చేశారు. ఇందులో 2.08 లక్షలు పురుషులు, 1.22 లక్షల మహిళల జట్లు ఉన్నాయి. వీరితో సమానంగా 14 రోజుల పాటు ఏకంగా 34.04 లక్షలకుపైగా వీక్షకులు పోటీలను ప్రత్యక్షంగా తిలకించారు. జీఎస్డబ్ల్యూఎస్ పరిధిలో పోటీలు ముగించుకుని మండల స్థాయి వేదికపై ప్రతిభ చాటేందుకు వెళ్లే జట్లకు సంబంధించి 34.20 లక్షల ప్రొఫెషనల్ టీషర్టులు, టోపీలను అందజేస్తున్నారు. ఇప్పటికే 15,004 గాను 9వేలకుపైగా సచివాలయాల్లో ముగింపు వేడుకలను నిర్వహించగా మంగళవారం (నేడు) మిగిలిన వాటిల్లో గెలుపొందిన జట్లకు టీషర్టులను బహూకరించనున్నారు. అనంతరం నియోజకవర్గ స్థాయి పోటీలకు ప్రొఫెషనల్ స్పోర్ట్స్ కిట్లను అందించనున్నారు. ఇప్పటికే వాటి తరలింపు పూర్తి చేశారు. ఆన్లైన్లోనే మ్యాచ్ల డ్రా ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు తొలి దశలో సమర్థవంతంగా నిర్వహించాం. 10వ తేదీ నుంచి మండల స్థాయి పోటీలకు సన్నద్ధమవుతున్నాం. గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో పోటీలు అనంతరం తుది జట్లను ఎంపిక పూర్తి చేస్తున్నాం. మండల స్థాయిలో తలపడే జట్లకు ఆన్లైన్లోనే డ్రా నిర్వహిస్తున్నాం. ఈ దశ పోటీలను సమీపంలోని పెద్ద మైదానాలు, స్టేడియాల్లో నిర్వహించేలా ఆదేశించాం. ఇక్కడ ప్రతి క్రీడాకారుడు ఆడుదాం ఆంధ్రా జెర్సీలు, టోపీలు ధరించి పోటీల్లో పాల్గొంటారు. వీటిని అన్ని సచివాలయాలకు తరలించాం. నేటితో అక్కడ ముగింపు వేడుకలు నిర్వహించి టీషర్టులను అందజేస్తారు. – ధ్యాన్చంద్ర, ఎండీ, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ -
ఢిల్లీని బెంబేలెత్తిస్తున్న కాలుష్య స్థాయిలు
దీపావళి తర్వాత ఢిల్లీ-ఎన్సీఆర్లో వాయు కాలుష్యం మరింతగా పెరిగింది. గాలి నాణ్యత ‘పేలవమైన’ కేటగిరీకి పడిపోయింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం ఢిల్లీ-ఎన్సిఆర్లో గాలి నాణ్యత స్థాయి 450కి చేరుకుంది. ఆనంద్ విహార్లో ఏక్యూఐ 360, ఆర్కె పురంలో 422, పంజాబీ బాగ్లో 415గా ఉంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రాబోయే కొద్ది రోజుల్లో ఢిల్లీ-ఎన్సిఆర్లో కాలుష్యంతో పాటు పొగమంచు కమ్మేయనుంది. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ)దీపావళి సందర్భంగా ఢిల్లీలోని 31 ప్రదేశాలలో శబ్ద కాలుష్యాన్ని అంచనా వేసింది. వీటిలో ఏడు నిశ్శబ్ద మండలాలు, ఎనిమిది నివాస ప్రాంతాలు, 11 వాణిజ్య, ఐదు పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయి. నజాఫ్గఢ్లో అత్యల్ప స్థాయి శబ్ధ కాలుష్యం, కరోల్ బాగ్లో అత్యధిక శబ్ధ కాలుష్యం నమోదైంది. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ విశ్లేషణ ప్రకారం, దేశ రాజధానిలోని దాదాపు అన్ని ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లలో గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం కాలుష్య స్థాయిలు మరింతగా పెరిగాయి. దీపావళి (ఆదివారం) నాడు ఢిల్లీలో 24 గంటల సగటు పార్టికల్ మీటర్(పీఎం)10 గాఢత ఒక క్యూబిక్ మీటరుకు 430 మైక్రోగ్రాములుగా ఉంది. గత సంవత్సరం క్యూబిక్ మీటరుకు 322 మైక్రోగ్రాములు, 2021లో క్యూబిక్ మీటరుకు 748 మైక్రోగ్రాములుగా నమోదయ్యింది. అలీపూర్, పట్పర్గంజ్, నజాఫ్గఢ్, కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్లలో 2022తో పోలిస్తే 2023లో పార్టికల్ మీటర్ 10 సాంద్రతలు పెరిగాయని డీపీసీసీ డేటా వెల్లడించింది. ఇది కూడా చదవండి: గాజాపై హమాస్ పట్టుకోల్పోయింది: ఇజ్రాయెల్ -
5,58,883 కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్కు విశేష స్పందన వచ్చింది. ఒక్క రోజే రికార్డు స్థాయిలో 5,58,883 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో కోర్టులో పెండింగ్ కేసులు 5,45,704 కాగా, ప్రీ లిటిగేషన్ కేసులు 13,179 ఉన్నాయి. మొత్తం రూ.180.10 కోట్ల పరిహారాన్ని అందించినట్లు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి గోవర్ధన్రెడ్డి తెలిపారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి.శ్యామ్ కోషి, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ టి.వినోద్ కుమార్ సూచనలతో ఈ కార్యక్రమం విజయవంతమైందని చెప్పారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో జస్టిస్ శ్యామ్ కోషితో చెక్కులను కూడా అందజేసినట్లు తెలిపారు. హైకోర్టులో 404 కేసులు.. హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ వినోద్ కుమార్ సూచనలతో నిర్వహించిన లోక్ అదాలత్లో హైకోర్టులోని 404 కేసులు పరిష్కారమయ్యాయి. అత్యదికంగా 204 మోటారు వాహనాల కేసులు, 71 కార్మికుల పరిహార వివాదానికి చెందినవి ఉన్నాయి. రూ.15 కోట్ల పరిహారాన్ని ప్రకటించారని, 1,100 మంది లబ్ధి పొందారని హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఎం.శాంతివర్ధని తెలిపారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ జి.వి.సీతాపతి, జస్టిస్ చల్లా కోదండరాం ఈ కేసులను పరిష్కరించారని వెల్లడించారు. -
ఇది పాన్ ఇండియా స్థాయి సినిమా..
-
ఢిల్లీలో తీవ్రస్థాయిలో వాయు కాలుష్యం ..
-
భారత్, పాకిస్తాన్ పర్యటన కోసం లెవల్ వన్ హెల్త్ నోటీసులు
Level One COVID-19 notice for Americans travelling: యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) భారతదేశానికి వెళ్లే అమెరికన్ల కోసం 'లెవల్ వన్' కోవిడ్-19 నోటీసులు జారీ చేసింది. అంతేకాదు ముఖ్యంగా పర్యటించేవాళ్లు వ్యాక్సిన్లు తీసుకున్నట్లయితే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు పాకిస్థాన్ పర్యటనకు కూడా 'లెవల్ వన్' ట్రావెల్ హెల్త్ నోటీసులు జారీ చేసింది. (చదవండి: జిమ్లో అసభ్య ప్రవర్తన... టిక్టాక్ షేర్ చేయడంతో పరార్!!) అంతేకాదు యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ భారత్, పాకిస్తాన్ల పర్యటన నిమిత్తం అమెరికన్లకు కొన్ని సూచనలను కూడా జారీ చేసింది. పైగా పాకిస్తాన్లోని ఉగ్రవాదం, మతపరమైన హింస తదితర వాటిని దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్ పర్యటన ఎంతవరకు సుముఖం అనేదాని గురించి పునరాలోచించవలసిందిగా నొక్కి చెప్పింది. ఈ క్రమంలో భారత్కి పయనమయ్యేవారు కూడా అక్కడ జరిగే నేరాలు, ఉగ్రవాదం కారణంగా మరింత జాగ్రత్తగా ఉండమంటూ సూచించింది. అంతేకాదు తీవ్రవాదం, పౌర అశాంతి కారణంగా జమ్మూ కాశ్మీర్కు వెళ్లవద్దని, అలాగే సాయుధ పోరాటానికి అవకాశం ఉన్నందున భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల పరిధిలో కూడాప్రయాణించవద్దని యూఎస్ విదేశాంగ శాఖ అమెరికా పౌరులను కోరింది. ఈ మేరకు భారత్ అధికారులు భారతదేశంలో అత్యంత వేగంగా పెరుగుతున్న నేరాలలో అత్యాచారం ఒకటిని తెలియజేయడమే కాక లైంగిక వేధింపుల వంటి హింసాత్మక నేరాలు పర్యాటక ప్రదేశాలలో జరుగుతున్నాయని నివేదించినట్లు కూడా యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ పేర్కొంది. (చదవండి: యూకే లివర్పూల్ నగరంలో కారు బ్లాస్ట్... ఒకరు మృతి) -
పసలేని ఎన్నికల పండుగ
అచ్చంపేట: ఎన్నికలంటే ఓ పండగ లెక్క! దాదాపు ఇరవై రోజులపాటు నిత్యం నాయకుల మాటల పోరు.. ర్యాలీలూ.. సమావేశాల హోరుతో రంజుగా సాగుతుంది. మొన్నటి శాసనసభా ఎన్నికల్లోనూ ఇదే ధూంధాం కనిపించింది. అంతెందుకు నిన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అదేజోరు సాగింది. కానీ, ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆ వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు. ప్రచార హోరు కనిపించకపోగా.. మైకులు కూడా అక్కడక్కడే మోగుతున్నాయి. ఇక ర్యాలీల జాడే లేదు. పట్టణాల్లో అంతో ఇంతో ఈ హుషారు కనిపిస్తున్నా.. ఊళ్లో మాత్ర పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చప్పుడే లేకుండాపోయింది. కొన్నిచోట్ల మాత్రం అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు ప్రధాన అనుచరులు మరీ రాలేదనకుండా గ్రాయిల్లో ప్రచారం చేసి వస్తున్నారు. కనిపించని ఉత్సాహం గ్రామాల్లోనే కాదు.. స్థానిక నేతల్లో కూడా పెద్దగా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. ప్రధానంగా పోటీ పడుతున్న టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకుల్లోనూ ఇదే స్తబ్ధత నెలకొంది. ఏ ఎన్నికలు వచ్చినా.. అభ్యర్థులు లేదా ప్రజాప్రతినిధులు మండలాలు, గ్రామాల వారీగా తమ నాయక గణానికి బాధ్యతలు అప్పగిస్తుంటారు. ప్రచార బాధ్యతలు వారే చూసుకోవాల్సి ఉంటుంది. వారిపై మరికొందరు సమన్వయం చేస్తుంటారు. కానీ ఎంపీ ఎన్నికలకు సంబంధించి గ్రామాల్లో ప్రచార బాధ్యతలను ఇప్పటికీ నాయకులకు అప్పగించలేదు. అభ్యర్థులకు వెన్నుదన్నుగా ఉండే అనుచరులతోపాటు ఆయా పార్టీల సర్పంచ్లు కూడా గ్రామాల్లో సందడి చేయడం లేదు. బయటకు వెళ్తే ఎక్కడ ఖర్చుల భారం మీద పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ వెళ్లినా మైకుల హోరు.. ర్యాలీలు నిర్వహించడం లేదు. సాదాసీదాగా వెళ్లి గ్రామస్తులతో సమావేశం మాత్రమే నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ప్రచారం ‘మమ’ అనిపిస్తున్నారన్నమాట. అప్పుడే మస్తుగుండే.. ‘ఎంపీ ఎన్నికలంటున్నరు.. మరీ మందూ లేదు.. విందూ లేదా..’ అని చాలామంది నాయకులకు మందుబాబుల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. పల్లెల్లో నాయకులు ప్రచారం చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఇది కూడా కారణంగా మారుతోంది. శాసనసభ, పంచాయతీ ఎన్నికల్లో మద్యం జోరుగా సరఫరా కావడంతో.. మందుబాబులందరికీ ప్రచారం జరిగినన్ని రోజుల పండగలా సాగింది. స్థానికంగా బాధ్యతలు తీసుకున్న నాయకులు ఇంటికొచ్చి మరీ.. మద్యం సీసాలను మందుబాబులకు అప్పగించి వెళ్లారని సమాచారం.! ఇప్పడేమె అంతా స్తబ్ధుగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులు ఊళ్లలో ప్రచారం చేయాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ ప్రచారం చేసేందుకు వెళ్లకున్నా.. పైనుంచి డబ్బులు వచ్చినా ఖర్చు పెడతలేడు.. అన్న అపవాదూ వస్తోందని వాపోతున్నారు. ఐదు రోజులే మిగిలింది.. పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా ఐదురోజులే మిగిలింది. ఈ నెల 11న జరగనున్న ఎన్నికలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రచారాన్ని ఈ నెల 9 వరకు మాత్రమే చేయాల్సి ఉంది. ఇప్పటి దాకా పల్లెల్లోకి అభ్యర్థులే ప్రచారానికి రాలేదు. కేవలం పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాలు, మేజర్ మండల కేంద్రాల వరకే తమ ప్రచారాన్ని పరిమితం చేస్తున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు మాత్రమే మేజర్ ఓట్లు ఉన్న గ్రామాల్లో కార్యకర్తలు, గ్రామస్తులు నాయకుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నా.. అందాల్సినవి అందకపోవడం వల్లే ప్రచారం మాగబోయిందనే చర్చ గ్రామాల్లో వినిపిస్తోంది. సంఘాల వారీగా.. అభ్యర్థులు శాసనసభా ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలనే లోక్సభ ఎన్నికల్లోనూ అమలు చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రధాన పార్టీల నాయకులు గ్రామాల్లో కుల సంఘాల వారీగా కలుస్తున్నారు. కులం ఓట్లు గంపగుత్తగా తమకే వేసేలా వారిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కుల సంఘాల నాయకులకు వారు కోరిన కోర్కెలకు హామీలు ఇస్తున్నారు. తాము గెలవగానే మీ హామీలను పూర్తి చేస్తామని ఒప్పందాలు చేసుకుంటున్నారు. పార్లమెంట్ స్థానం పరిధి పెద్దగా ఉండటంతో అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులపైనే పూర్తిగా ఆధారపడుతున్నారు. ఇక అభ్యర్థులు, పార్టీలు ఆర్థికంగా తోడ్పాటునందిస్తేనే స్థానిక నాయకులు ప్రచారానికి ముందడుగు వేసే పరిస్థితి కనిపిస్తుంది. -
కేలో..కేలో..కేలోరే...!
ఉత్కంఠంగా రాష్ట్రస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు మెయిన్ డ్రాలో ఆడుతున్న క్రీడాకారులు కంబాలచెరువు(రాజమహేంద్రవరంసిటీ): రాజమహేంద్రవరంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు గురువారం ఉత్కంఠతతో కొనసాగాయి. క్రీడాకారులు మెయిన్డ్రాలో తమ సత్తాను చాటుతున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 600 మంది వరకు క్రీడాకారులు హాజరయ్యారు. అండర్ 13, 15 విభాగాల్లో సింగిల్స్, డబుల్స్తో బాలురు, బాలికల జట్ల మ«ధ్య హోరాహోరీగా సాగుతోంది. నగరంలోని ఆఫీసర్స్ క్లబ్, కాస్మోపాలిటన్ క్లబ్, కేఎస్ఎన్ ఇండోర్ స్టేడియం, భాను ఇండోర్ స్టేడియంలలో ఈ పోటీలు జరుగుతున్నాయి. బాలురు, బాలికల విభాగంలో సింగిల్స్ జరుగుతుండగా, డబుల్స్ శుక్రవారం జరగనున్నాయి. వీటిలో విజేతలుగా నిలిచిన వారు త్వరలో జరగబోయే నేషనల్స్ టోర్నమెంటోలో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. నేషనల్స్కు వెళ్లాలి నాకు చిన్నప్పటినుంచి షటిల్ అంటే తెలీని ఇçష్టం, దాంతో స్కూలులో ఎక్కువగా ఆడుతుండేవాడిని. అదే నాకు మంచి తోడ్పాడునిచ్చింది. ఇప్పటివరకు అండర్ 13లో నాలుగు టోర్నమెంట్లు ఆడాను. నేషనల్స్కు వెళ్లి రాష్ట్రం తరఫున ఆడాలన్నదే నా లక్ష్యం. - అభిరామ్, షటిల్ క్రీడాకారుడు. శ్రీకాకుళం. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో షటిల్ బ్యాడ్మింటన్లో రాణిస్తున్నాను. వారిచ్చే ప్రోద్బలంతో రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతగా నిలుస్తాననే నమ్మకం ఉంది. నేషనల్ ర్యాంకింగ్ కొయంబత్తూర్ ఆడాను. రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించి విజేతగా నిలవాలనే పట్టుదలతో ఉన్నాను. -కె.సాత్విక్ కోర్, షటిల్ క్రీడాకారుడు. ఒంగోలు ఒలింపిక్ సాధనే లక్ష్యం.. ఒలింపిక్ సాధనే లక్ష్యంతో ఆడుతున్నాను. నేషనల్ ర్యాంకింగ్ సెవెన్తో పాటు తెనాలి స్టేట్ విన్నర్గా నిలిచాను. అండర్ 13లో ఆడుతున్నాను. ఇక్కడ సదుపాయాలు బాగున్నాయి. ఆసక్తికరంగా పోటీలు సాగుతున్నాయి. విజేతగా నిలిచేందుకు కృషి చేస్తున్నాను. - బాబారావ్, షటిల్ క్రీడాకారుడు. కడప. నేషనల్స్కు ఆటగాళ్లను పంపుతాం రాష్ట్రస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు 13 జిల్లాల నుంచి 600 మంది క్రీడాకారులు వచ్చారు. వీరందరికీ భోజన, వసతి సదుపాయలు కల్పించాం. క్రీడాకారులు పోటాపోటీగా ఆడుతున్నారు. 19న జరిగే పోటీల్లో విజేతలను ఎంపిక చేసి వారిని నేషనల్స్కు పంపుతాం. ఈ పోటీలు రాజమహేంద్రవరంలో జరగడం చాలా ఆనందంగా ఉంది. - జి.సాయిబాబా, ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ -
నృత్యాంజలి సేవలు ప్రశంసనీయం
కాకినాడ కల్చరల్ : నాట్యరంగానికి నృత్యాంజలి కళానిలయం చేస్తున్న సేవలు ప్రశంసనీయమని జయలక్ష్మి కో- ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ రాయవరపు సీతారామాంజనేయులు అన్నారు. స్థానిక సూర్యకళామందిర్లో నృత్యాంజలి కళానిలయం ఆధ్వర్యంలో ‘పద ఝురి–2017’ నాట్య కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ముందుగా నటరాజ విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయి శాస్త్రీయ, జానపద నాట్య పోటీల్లో విద్యాంజలి నికేతన్ (కాకినాడ), లలిత కళానికేతన్ ( అన్నవరం), మంజీర నృత్యాలయం(కాకినాడ), భగవత్ నృత్యాలయం (విజయనగరం) వారే కాకుండా పలువురు పాల్గొన్నారు. టి. సౌమ్య, బి.వాణిశ్రీ, నటరాజ రామకృష్ణ న్యాయ నిర్ణేతలుగా వ్యహరించారు. తదుపరి నాట్యాచార్యులు డాక్టర్ కృష్ణకుమార్, డాక్టర్ పసుమర్తి శ్రీనివాసశర్మ, డాక్టర్ వేదాంతం వెంకట దుర్గా భవానిలను ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన సభలో నృత్యాంజలి కళానిలయం వ్యవస్థాపకుడు హరి లోకేష్ శర్మ మాట్లాడుతూ నాట్య రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తమవంతు కృషి చేస్తున్నామన్నారు. నర్తకీమణులు వి.మోహన్ సత్య, రమణ కుమారి, మధుస్మిత, శర్వాణి, సౌమ్యలకు ‘నృత్యవతంస’ పురస్కారాలను అందజేశారు. నాట్యాచార్య వీఎన్ వరప్రసాద్, శ్రీరామ్ భగవ్ గురుస్వామి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే కూచిపూడి నృత్యం : సబ్ జూనియర్స్ విభాగం ఎన్.నికిత (ప్రథమ), దీపిక (ద్వితీయ). జూనియర్స్ విభాగం ఆరది (ప్రథమ), వర్షిత (ద్వితీయ). సీనియర్స్ విభాగం జి. మేఘన (ప్రథమ), వి.శ్రీను (ద్వితీయ) స్థానాల్లో నిలిచారు. భరత నాట్యం : సబ్ జూనియర్స్ విభాగంలో డి. దివ్య హాసిని (ప్రథమ), గాయిత్రి ఆశ్రిత (ద్వితీయ), జూనియర్స్ విభాగంలో కె. సంజన (ప్రథమ), నాగశ్రీ (ద్వితీయ), సీనియర్స్ విభాగంలో పి.ప్రసజ్ఞ (ప్రథమ), సిరిజా రెడ్డి (ద్వితీయ) బహుమతులు గెలుచుకున్నారు. జానపద నృత్యం : సబ్ జూనియర్స్ విభాగంలో కె.సంస్కృతి (ప్రథమ), వినీల (ద్వితీయ), జూనియర్స్ విభాగంలో జ్ఞాపిక (ప్రథమ), సీనియర్స్ విభాగంలో భ్రమరాంబిక (ప్రథమ) బహుమతులు పొందారు. శాస్త్రీయ నృత్యం : గ్రూపు విభాగం రోషిని గ్రూపు (ప్రథమ), అన్నవరం గ్రూపు (ద్వితీయ) బహుమతులు గెలుచుకున్నారు. జానపద నృత్యం : గ్రూపు విభాగంలో మౌనిక గ్రూపు ప్రథమ బహుమతి, అక్షయ గ్రూపు ద్వితీయ బహుమతి పొందారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. -
హృదయాలను హత్తుకున్న ‘సరికొత్త మనుషులు’
అలరించిన బాలల నృత్య ప్రదర్శన కాకినాడ కల్చరల్ : స్థానిక సూర్యకళామందిర్లో అల్లూరి సీతారామరాజు నాటక పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి నాటిక పోటీలను గురువారం శుభోదయ ఫౌండేషన్ చైర్మన్ వాసా సత్యనారాయణమూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పరిషత్ అధ్యక్షులు గ్రంధి బాబ్జి మాట్లాడుతూ నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పరిషత్ ఎంతగానో కృషి చేస్తోందన్నారు. ముందుగా ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సేవకులు బుద్దరాజు సత్యనారాయణకు సేవారత్న అవార్డును ప్రదానం చేసి సన్మానించారు. బుద్ధరాజు చేస్తున్న సేవలను పరిషత్ కార్యదర్శి పంపన దయానందబాబు కొనియాడారు. తదుపరి అభినయ ఆర్ట్స్(గుంటూరు) సారథ్యంలో శిష్టా చంద్రశేఖర్ రచించిన ‘సరికొత్త మనుషులు’ నాటికను ఎన్.రవీంద్రారెడ్డి దర్శకత్వంలో ప్రదర్శించారు. భారత దేశంలో అనాథశరణాలయాల ఆవశ్యతను చక్కగా చిత్రీకరించారు. మగవాడి పశువాంఛకు బలై గర్భం దాల్చిన కన్యలు పడుతున్న మనోబాధలను చక్కగా చిత్రీకరించారు. చేసిన తప్పుకు ఫలితంగా జన్మించిన పిల్లలను సమాజంలో గౌరవంగా సాకలేక, అలా అని వదిలిపెట్టలేక మనస్సు చంపుకొని అనాథ శరణాలయాలకు దొంగచాటుగా అప్పగిస్తున్న యధార్థ సంఘటనలను ఈ నాటికలో చిత్రీకరించారు. అనంతరం శ్రీనటరాజ కళామందిర్ కూచిపూడి, ఆంధ్రనాట్య పాఠశాల నాట్యాచార్య ఆనెం ప్రసాద్ శిష్యులు ప్రదర్శించిన వినాయక శబ్ధం, శివ పంచాక్షరి నృత్యాలు అకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరావు, శిరీష, బాజిబోయిన వెంకటేష్ నాయుడు, తురగా సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రదర్శనగా ‘చాలు ఇక చాలు’ స్ధానిక సూర్యకళామందిర్లో అల్లూరి సీతారామరాజు నాటక పరిషత్ ఆధ్వర్యంలో రెండు రోజల నుంచి నిర్వహిస్తున్న నాటిక పోటీలు గురువారంతో ముగిసాయి. ఉత్తమ ప్రదర్శనగా చాలు ఇక చాలు నాటికను ఎంపిక చేసారు. ద్వితీయ ప్రదర్శనగా గోవు మాలచ్చిమి, తృతీయ ప్రదర్శనగా తేనేటీగలూ పగబడతాయి నాటికలు ఎంపిక చేసారు.అలాగే ఉత్తమ దర్శకులుగా చాలు ఇక చాలు నాటికకు దర్శకత్వ చేసిన గోపారాజు విజయ్, ఉత్తమ నటుడుగా చాలు ఇక చాలు కథానాయకుడు రమణ ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ నటిగా గోవు మాలచ్చిమి నాటికలో వెంకట లక్ష్మి పాత్రదారిణి అమృతవర్షిణి, ద్వితీయ ఉత్తమ నటిగా సరికొత్త మనుషులు లో నటించిన టి.లక్ష్మి ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ రచనకు గాను గోవుమాచ్చిమి నాటిక రచించిన చెరుకూరి సాంబశివరావు ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ విలన్ గా తేనేటీగలూ పగబడతాయి నాటికలో దొర పాత్రదారి అమరేంద్ర ఎంపికయ్యారు. ఉత్తమ సహాయ నటులుగా తేటేటీగలూ పగబడతాయి నాటికలో పాముల ఆదియ్య పాత్ర దారి బి.మోహాన్ ఎంపికయ్యారు. వీరికి అల్లూరి సీతారామరాజు నాటక కళాపరిషత్ అవార్డులను ప్రధానం చేసి ఘనంగా సత్కరించింది. ఈకార్యక్రమంలో పరిషత్ అధ్యక్షులు గ్రంధి బాబ్జి, కార్యదర్శి పంపన దయానందబాబు, సభ్యులు తదితరలు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న ‘అంతిమ తీర్పు’
రెండోరోజు ఉత్సాహంగా నాటికల పోటీలు కాకినాడ కల్చరల్: స్థానిక సూర్యకళామందిర్లో అల్లూరి సీతారామరాజు నాటక పరిషత్ ఆధ్వర్యంలో రెండు రోజుల నుంచి రాష్ట్రస్థాయి నాటిక పోటీలను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం ప్రదర్శించిన నాటికల పోటీలను కరప సర్పంచ్ పోలిశెట్టి నారయ్య(తాతీలు) జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంబించారు. ఈ సందర్భంగా పరిషత్ వ్యవస్థాపక కార్యదర్శి పంపన దయానందబాబు మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహించేందకు తమ సంస్థ కృషి చేస్తోందన్నారు. ముందుగా శ్రీమూర్తి అసోసియేషన్(కాకినాడ) సారధ్యంలో పీవీ భవానీ ప్రసాద్ రచించిన ‘అంతిమతీర్పు’ నాటికను డా.సి.ఎస్.ప్రసాద్ దర్శకత్వంలో ప్రదర్శించారు. ఒక దురదృష్ట సంఘటనకు లోనై తనలో తాను కుమిలిపోతు.. కసి, కోపం,ద్వేషం పెంచుకొని చివరకు కట్టుకున్న భర్తని, కన్న కొడుకును దరికి చేర్చుకోలేక , మనశ్శాంతికి దూరమైన ఒక జనని కథ అంతిమ తీర్పు నాటిక. తర్వాత గ్రామీణ కళాకారుల ఐక్యవేదిక (శ్రీకాకుళం) సారధ్యంలో కేకేఎల్ ప్రసాద్ దర్శకత్వం, రచన చేసిన ‘తేనేటీగలు పగపడతాయి’నాటిక ప్రదర్శించారు. భూస్వాముల దోపిడికి బడుగు, బీద వర్గం బలైపోయే సన్నివేశాలను చాలా అద్భుతంగా చిత్రికరించారు. తదుపరి ఉషోదయా కళానికేతన్(కట్రపాడు) సారధ్యంలో చెరుకూరి సాంబశివరావు రచన, దర్శకత్వం వహించిన ‘గోవు మాలచ్చిమి’ నాటిక ప్రేక్షకులను ఆలోచింపజేసింది. ప్రస్తుతం సమాజంలో అద్దె గర్భాలతో మన సంస్కృతిక, సాంప్రదాయలను మంట గలుపుతున్నారనే భావంతో ఈ నాటికను రూపొందించారు. పేద మహిళలు మనస్సు చంపుకొని ఏవిధంగా ఇటువంటి అద్దె గర్భాలకు అంగీకరిస్తోన్నారు కళ్ళకు కట్టినట్టు నాటిక ప్రదర్శించారు. తదుపరి శ్రీసాయి ఆర్ట్స్ (కొలుకులూరు) సారధ్యంలో పి.వి.భవానీ ప్రసాద్ రచించిన ‘చాలు–ఇకచాలు’ నాటిక గోపరాజు విజయ్ దర్శకత్వంలో ప్రదర్శించారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా బొర్రా పద్మనాభం, కొల్లి వెంకట్రావు, ఎం.జానకీరామ్లు వ్యవహరించారు. కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరావు, శిరిష, తురగా సూర్యారవు తదితరులు పాల్గొన్నారు. నేడు సరికొత్త మనుషులు నాటిక స్థానిక సూర్యకళామందిర్లో గురువారం సాయంత్రం ఎన్.రవీంద్రా రెడ్డి దర్శకత్వంలో ‘సరికొత్త మనుషులు’ నాటిక ప్రదర్శించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సేవకులు బుద్దరాజు సత్యనారాయణకు సేవారత్న అవార్డు ప్రధానం చేస్తారు. 05కెకెడి197–270025: తేనేటీగలు పగబడతాయి నాటికలో ఒక సన్నివేశం 05కెకెడి198–270025: గోవు మాలచ్చిమి నాటికలో ఒక సన్నివేశం -
తాడో పేడో తేల్చుకుంటాం
కాపులకు బీసీ రిజర్వేషన్లపై ఉద్యమిస్తాం 7న కాకినాడలో రాష్ట్రస్థాయి జేఏసీ సమావేశం జిల్లా కాపు జేఏసీ కన్వీనర్ కాకినాడ రూరల్ కాపులకు రిజర్వేషన్ కల్పించే విషయంపై ప్రభుత్వంతో తాడో డో తేల్చుకుంటామని జిల్లా కాపు జేఏసీ నేతలు స్పష్టం చేశారు. గురువారం కాకినాడ రూరల్ రమణయ్యపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా జేఏసీ కన్వీనర్ వీవై దాసు మాటట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాపులకు రిజర్వేషన్లు అడుగుతున్న తమ నేత ముద్రగడ పద్మనాభంపై ప్రజాప్రతినిధులు, మంత్రులతో సీఎం చంద్రబాబు దాడి చేయిస్తున్నారన్నారు. మంత్రి పదవులను కాపాడుకోవడం కోసం కాపుల ఆత్మ గౌరవాన్ని సీఎం చంద్రబాబు వద్ద తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. జాతి ప్రయోజనాల కోసం పోరాటం చేస్తున్న ఉద్యమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం ప్రోద్బలంతో ఉద్యమంపై అవాకులు, చెవాకులు పేలుతున్నారని విమర్శించారు. ఏడాదికి కాపులకు రూ.1,000 కోట్లు రుణాలు ఇస్తామని చెప్పి, మూడేళ్ల పదవీ కాలంలో కేవలం రూ. 320 కోట్లు కూడా ఇవ్వలేదన్నారు. జిల్లాలో 3.30 లక్షల మంది కాపు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. కాపులు సామాజిక, సాంఘిక, ఆర్థిక, విద్య, ఉద్యోగపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను 1.10 లక్షల మంది సంతకాలు, ఆధార్ కార్డుల జిరాక్స్తో మంజునాథ కమిటీకి అందజేశామన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతుంటే పోలీసులతో ఉద్యమాన్ని అణచివేసే ధోరణిలో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 50 శాతానికి పైగా రిజర్వేషన్లు దాటకూడదని ప్రభుత్వం చెబుతోందని, ఇది ఎంతమాత్రం నిజం కాదని జేఏసీ కన్వీనర్ ఆకుల రామకృష్ణ తెలిపారు. దేశంలోని కేరళ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో 65 నుంచి 70 శాతానికి పైగా రిజర్వేషన్లు అమల్లో ఉన్నట్టు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో సుమారు 80 శాతానికి పైగా రిజర్వేషన్లు అమలు చేశారన్నారు. జిల్లాకు చెందిన దేశంలో ఎన్నడు లేని రీతిలో జిల్లాలో హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అత్యవసర పరిస్థితిని పోలీసులతో విధించారని ఆరోపించారు. గత ఏడాది నవంబర్ నుంచి నేటి దాకా సెక్షన్ 30 అమలు చేసిన ఘనత హోం మంత్రికే దక్కిందని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదని, ప్రజా సమస్యలు పరిష్కారం ముఖ్యమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చని సీఎంకు రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ది చెబుతారన్నారు. గ్రామాల్లోకి ఏముఖం పెట్టుకుని ఓట్లడగడానికి వస్తారో అప్పుడే కాపుజాతి ప్రజా ప్రతినిధులను నిలదీస్తారన్నారు. కాపు ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు ఈ నెల 7న భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు రాష్ట్రస్థాయి జేఏసీ సర్వసభ్యుల సమావేశాన్ని కాకినాడ పద్మనాభ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సమావేశానికి కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తులు తప్పకుండా హాజరు కావాలని కోరారు. సమావేశంలో జేఏసీ నాయకులు నల్లా విష్ణుమూర్తి, కె.తాతాజీ, బి.ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి కబడ్డీలో రన్నరప్ ‘తూర్పు’
-విజేత ప్రకాశం జిల్లాజట్టు సఖినేటిపల్లి : స్థానిక కుసుమ చిన సుందరరావు క్రీడా ప్రాంగణంలో 17వ వార్షిక కాంతారావు మెమోరియల్ రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్లో భాగంగా బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో ప్రకాశం జిల్లా జట్టు విజేతగా, తూర్పుగోదావరి జట్టు రన్నరప్గా నిలిచాయి. ఈ నెల ఒకటిన మొదలయిన టోర్నీలో ప్రకాశం, తూర్పుగోదావరి జట్లు ఫైనల్స్కు చేరుకున్నాయి. విజేత ప్రకాశం జట్టుకు ప్రథమ బహుమతి కింద రూ.35 వేల నగదు, షీల్డ్ను, రన్నరప్ తూర్పు గోదావరి జట్టుకు ద్వితీయ బహుమతి కింద రూ.25 వేల నగదు, షీల్డ్ను అందజేశారు. తృతీయ బహుమతి కింద గుంటూరు జట్టుకు రూ.20 వేల నగదు, షీల్డ్ను, చతుర్థ బహుమతి కింద విశాఖపట్నం జట్టుకు రూ.10 వేల నగదు, షీల్డ్ను అందజేశారు. అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్, రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, రిటైర్డ్ ఎస్పీ వి.ప్రేమ్కుమార్, స్పాన్సర్స్ గొల్లమందల శరత్బాబు, ఇందుకూరి సుబ్బరాజు, నల్లి నాగేశ్వరరావు, ఇంజేటి సుధాకర్, రాష్ట్ర ఫెన్సింగ్ అసొసియేషన్ అధ్యక్షుడు ఎం.అక్కిరాజు విజేతలకు బహుమతులను అందజేశారు. సఖినేటిపల్లి మాజీ సర్పంచ్ జంపన రామకృష్ణంరాజు, టీచర్ నల్లి విశ్వనాథం షీల్డ్లను అందజేశారు. నాయకులు గెడ్డం తులసీభాస్కర్, గెడ్డం పేర్రాజు, అల్లూరు మధురాజు, చింతా రాజబాబు, టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ తోటె ప్రతాప్కుమార్, అధ్యక్షుడు గొల్లమందల చిట్టిబాబు, కార్యదర్శి నల్లి బన్ను పాల్గొన్నారు. -
ఉత్తమ నాటిక ‘చాలు ఇక చాలు’
తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు గొల్లప్రోలు : శ్రీమార్కండేయ నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో తాటిపర్తి గ్రామంలో నిర్వహిస్తున్న 12వ తెలుగు రాష్ట్రాల స్థాయి నాటిక పోటీలు మంగళవారం రాత్రితో ముగిశాయి. స్థానిక అపర్ణా కళాతోరణం, బత్తుల మురళీకృష్ణ కళావేదికపై మూడు రోజులుగా నాటిక పోటీలు ఘనంగా నిర్వహించారు. చివరి రోజున ‘చాలు ఇక చాలు’, ఖాళీలు పూరించండి నాటికలను ప్రదర్శించారు. నాటిక పోటీలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున కళాకారులు, కళాభిమానుల తరలివచ్చారు. ఉత్తమ ప్రదర్శన చాలు ఇక చాలు పోటీల్లో ఉత్తమ నాటికగా కొలకలూరుకు చెందిన శ్రీసాయిఆర్ట్స్ వారు ప్రదర్శించిన ‘చాలు ఇక చాలు’ నాటిక ఎంపికైంది. ద్వితీయ ఉత్తమ నాటికగా తాడేపల్లి వారి అరవింద ఆర్ట్స్ ‘ఆగ్రహం’, తృతీయ ఉత్తమనాటికగా సికింద్రాబాద్ వారి కేజేఆర్ కల్చరల్ అసోసియేషన్ వారి ‘ఖాళీలు పూరించండి’ ఎంపికైంది. ఉత్తమ నటుడు– కరణం సరేష్(అనంతం), ఉత్తమ నటి–సాదినేని శ్రీజ(ఖాళీలు పూరించండి) , ఉత్తమ రచన– పి.మృత్యుంజయరావు(అనగనగా..), ఉత్తమదర్శకుడు ఆర్ వాసు (అనగనగా..) ఉత్తమ క్యారెక్టర్ నటుడు బీవీ లక్ష్మయ్య(ఆగ్రహం), ప్రతినాయకుడు –పి.భద్రేశ్వరరావు(చేతిరాత ), రంగాలంకరణ యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్(అనగనగా..) ఆహార్యం– పి.మోహనేశ్వరరావు(అనగనగా), ఉత్తమ సంగీతం– కేఎస్ఎన్ రావు(పితృదేవోభవ) ఎంపికయ్యాయి. అనగనగా నాటిక ప్రత్యేక జ్యూరీ అవార్డును కైవసం చేసుకుంది. నాటికలకు న్యాయనిర్ణేతలుగా రాజాతాతయ్య, కట్టా కృష్ణారావు వ్యవహరించారు. విజేతలకు శ్రీమార్కండేయ నాటక కళాపరిషత్ అధ్యక్షులు పడాల రవి, ప్రధానకార్యదర్శి జక్కా సాంబశివరావు, రాజాతాతయ్య, బత్తుల వెంకటశివరామారావు తదితరులు బహుమతులు, మెమెంటోలు అందజేశారు. కుటుంబభావోద్వేగాలను చాటిన ‘చాలు ఇక చాలు ’: కొలకలూరుకు చెందిన శ్రీసాయిఆర్ట్స్ వారు ప్రదర్శించిన ‘చాలు ఇక చాలు’ నాటిక కుటుంబభావోద్వేగాలను చాటింది. ఈ లోకంలో ప్రతి దానికి మితం ఉందని.. కానీ పిల్లలు ఏదడిగినా తల్లిదండ్రులు కాదు.. లేదు..కుదరదు అని చెప్పలేరని... అదే పిల్లలు ఎదిగి పెద్దవారయ్యాక తల్లిదండ్రులు ఏది అడిగినా ‘కాదు.. లేదు..కుదరదు’ అని ఎంతో సులువుగా తప్పించుకుంటున్నారనే ఇతి వృత్తంతో నాటిక సాగింది. ఈ నాటికకు గోపరాజు విజయ్ దర్శకత్వం వహించగా, పీవీ భవానీ ప్రసాద్ రచించారు. ఆలోచింపజేసిన ‘ఖాళీలు పూరించండి’.. సికింద్రాబాద్కు చెందిన కేజేఆర్ కల్చరల్ అసోసియేషన్ వారు ప్రదర్శించిన ‘ఖాళీలు పూరించండి’ నాటిక ఆద్యంతం ఆలోచింపజేసింది. సమాజంలో జరుగుతున్న నేరాలు..వాటి పరిణామాలను ఇతి వృత్తంగా చేసుకుని నాటిక సాగింది. రచయిత భాగవతుల ఉదయ్ నాటిక ద్వారా చక్కని సందేశమిచ్చారు. హాస్యాస్పదంగా సాగిన‘ అంతా మన సంచికే ’.. గుంటూరుకు చెందిన గణేష్ ఆర్ట్స్వారు ‘అంతా మన సంచికే ’ నాటిక ప్రత్యేక ప్రదర్శనగా ప్రదర్శించారు. నాటిక ఆద్యంతం హాస్యాస్పదంగా.. సందేశాత్మకంగా సాగింది. డబ్బు కంటే మమతానురాగాలు ముఖ్యమని నాటిక తెలియచెప్పింది. -
రికార్డ్ స్థాయిల వద్ద ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా నిఫ్టీ రికార్డు గరిష్టాన్ని నమోదు చేయగా, సెన్సెక్స్ కూడా అదేబాటలో పయనించింది. అతేకంఆదు అల్ టైం రికార్డ్ 30,000వైపు దూసుకుపోతోంది. సెన్సెక్స్ 290 పాయింట్ల లాభంతో 29,910వద్ద ముగియగా, నిఫ్టీ 64 పాయింట్ల లాభంతో 9237వద్ద స్థిరపడింది. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ రికార్డ్ స్థాయిలవద్ద, ప్రధానంగా నిఫ్టీ తొలిసారి 92వందల స్థాయిని తాకడం విశేషం. ఒక్కఐటీ మినహా దాదాపు అన్ని రంగాలు లాభపడగా, రియల్టీ, ఫార్మా, బ్యాంక్ నిఫ్టీ 1.4-0.5 శాతం మధ్య ఎగశాయి. రిలయన్స్, ఎల్ అండ్ టీ లాభాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి. భారతి ఎయిర్ టెల్, విప్రో, బీపీసీఎల్ టాప్ లూజర్స్గా నిలిచాయి.ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ వంటి దిగ్గజాలతోపాటు డాక్టర్ రెడ్డీస్, యాక్సిస్, ఏసీసీ లాభపడగా, ఐవోసీ, హెచ్సీఎల్ టెక్, ఇండస్ఇండ్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ నష్టపోయాయి. మరోవైపు శ్రీరామ నవమి సందర్భంగా మంగళవారం(4న) స్టాక్ ఎక్స్ఛేంజీలకు సెలవు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ లో ట్రేడింగ్ మళ్లీ బుధవారం(5న) యధావిధిగా మొదలుకానుంది. -
సీఆర్సీ కళాసేవ అభినందనీయం
-ఎమ్మెల్యే చిర్ల, నటుడు ఎల్బీ శ్రీరామ్ -రాష్ట్రస్థాయి ఉగాది నాటిక పోటీలు ప్రారంభం రావులపాలెం : అంతరించి పోతున్న కళలను, కళాకారులను ప్రోత్సహించేందుకు సీఆర్సీ కాటన్ కళాపరిషత్ చేస్తున్న కృషి అభినందనీయం అని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ప్రముఖ సినీనటుడు ఎల్బీ శ్రీ రామ్ ప్రశంసించారు. బుధవారం రాత్రి రావులపాలెంలోని కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్(సీఆర్సీ) కాటన్ కళాపరిషత్ ఆధ్వర్యంలో 19వ ఉగాది ఆహ్వాన రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు ప్రారంభమయ్యాయి. సీఆర్సీ ఏసీ ఆడిటోరియంలో జగ్గిరెడ్డి, శ్రీరామ్ జ్యోతి ప్రజ్వలన చేసి, పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాపరిషత్ కన్వీనర్ డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు 19 వసంతాలుగా నాటికలను పరిచయం చేస్తు వారిలో ఆలోచన రేకెత్తిస్తున్న సీఆర్సీ సేవలు ప్రశంసనీయం అన్నారు. శ్రీరామ్ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమం కాలంలో నాటక రంగం కీలక పాత్ర వహించిందన్నారు. అనంతరం బ్రహ్మశ్రీ చిర్రావూరి శ్రీరామ శర్మను ఎమ్మెల్యే జగ్గిరెడ్డి, ఎల్బీ శ్రీరామ్, సీఆర్సీ కార్యవర్గ సభ్యులు శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. సినీ నటుడు జెన్నీ, రామచంద్రపురం డీఎస్సీ ఎన్బీ మురళీకృష్ణ, ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీటీసీ సాకా ప్రసన్నకుమార్, సీఆర్సీ అధ్యక్షుడు మల్లిడి కనికిరెడ్డి, కార్యదర్శి కర్రి ఆశోక్రెడ్డి, సేవా విభాగం డైరెక్టర్ కర్రి సుబ్బారెడ్డి, కళాపరిషత్ డైరెక్టర్ కుడుపూడి శ్రీనివాస్, సత్తి రామకృష్ణారెడ్డి(మారుతి), మల్లిడి వీర్రెడ్డి, నల్లమిల్లి వీరాఘవరెడ్డి, కొవ్వూరి నరేష్కుమార్రెడ్డి, మంతెన రవిరాజు, పలివెల త్రిమూర్తులు, మన్యం సుబ్రహ్మణ్శేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. అలరించిన నాటికలు మొదటిరోజు ప్రదర్శించిన రెండు నాటికలు ప్రేక్షకులను అలరించాయి. గుంటూరు జిల్లా కట్రపాడు ఉషోదయ కళానికేతన్ ‘గోవు మాలచ్చిమి’ నాటికను చెరుకూరి సాంబశివరావు రచించి దర్శకత్వం వహించారు. ఒకప్పుడు సైకిల్ అద్దెకు తీసుకుని అద్దె చెల్లించేవాళ్ళమని ఇప్పుడు ఆడదాన్ని గర్భాన్ని అద్దెకు తీసుకుని వ్యాపారంగా మార్చి అమ్మతనాన్ని మంటకలుపుతున్నామని ఈ నాటిక ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అద్దె గర్భ వ్యాపారానికి సంకెళ్ళు వేసి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని తెలియజేప్పారు. అనంతరం హైదరాబాద్ శ్రీ మురళీ కళానిలయం వారు ప్రదర్శించిన ‘అం అః కం కః’ నాటిక హాస్యభరితంగా సాగింది. కష్టపడకుండా కోట్లు సంపాదించాలని దురాశతో అబద్ధాలు చెప్పి మోసాలు చేసి చివరకు బాకీదారులను తట్టుకోలేక చనిపోయినట్టు నాటకం ఆడిన విశ్వపతికి అప్పుల వాళ్ళు ఎలా బుద్ధి చెప్పారో చూపారు. ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రదర్శనలను తిలకించారు. వారికి సీఆర్సీ సభ్యులు ఆల్పాహారం ఏర్పాటు చేశారు. పోటీలకు అదృష్టదీపక్, పోల్నాటి గోవిందరావు, బొడ్డు రాజబాబు నాయ్యనిర్ణేతలుగా వ్యవహరించారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి నాటిక పోటీలు
ద్రాక్షారామ (రామచంద్రపురం రూరల్) : ద్రాక్షారామ నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు సోమవారం రాత్రి ముగిశాయి. ఉత్తమ ప్రదర్శనగా సికింద్రాబాద్ కేజేఆర్ కల్చరల్ అసోసియేషన్ ‘ఎవరిని ఎవరు క్షమించాలి,’ ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా గుంటూరు అభినయ ఆర్ట్స్ ‘కేవలం మనుషులం,’ ఉత్తమ తృతీయ ప్రదర్శనగా గుంటూరు ఉషోదయా కళానికేతన్ కట్రపాడు ‘గోవు మాలచ్చిమి,’ ఎంపికయ్యాయి. ఉత్తమ నటిగా ‘గోవు మాలచ్చిమి’ నాటికలో వెంకటలక్ష్మి పాత్రధారి ఎస్.అమృతవర్షిణి. ఉత్తమ నటుడిగా ‘ఎవరిని ఎవరు క్షమించాలి’ నాటికలో పుణ్యదాసు పాత్రధారి జోగారావు, ఉత్తమ దర్శకుడిగా ‘ఎవరిని ఎవరు క్షమించాలి’ నాటిక దర్శకుడు ఉదయ్ భాగవతులు, ఉత్తమ రచనకు ‘కేవలం మనుషులం’ నాటిక రచయిత శిష్టా చంద్రశేఖర్, ఉత్తమ సంగీతం బహుమతి ‘గోవు మాలచ్చిమి’ నాటికకు పి.లీలామోహన్. ఉత్తమ విలన్గా ఒంగోలు జనచైతన్య ‘చేతిరాత’ నాటికలో గోవిందరాజు పాత్రధారి పి. భద్రేశ్వరరావు, ఉత్తమ కారెక్టర్ నటుడు ‘కేవలం మనుషులు’ నాటికలో మీర్జా ఆలీఖాన్ పాత్రధారి వీసీహెచ్కే ప్రసాద్, ఉత్తమ ద్వితీయ నటి ‘చేతిరాత నాటిక’లో దుర్గ పాత్రధారి ఎల్.పద్మావతి. ఉత్తమ ద్వితీయ నటుడు ‘గోవు మాలచ్చిమి’ నాటికలో నారాయణ పాత్రధారి చిరుకూటి సాంబశివరావుకు లభించాయి. ‘సప్తపది’ నాటికలో ముకుందం పాత్రధారి ఎ.హరిబాబు, ‘చేతిరాత’ నాటికలో కృష్ణమూర్తి పాత్రధారి సీహెచ్ సుబ్బారావు, ‘కేవలం మనుషులం’ నాటికలో అమల్రాయ్ పాత్రధారి ఎ.లక్ష్మణశాస్త్రికి జ్యూరీ బహుమతులు లభించాయి. నాగిరెడ్డికి ‘రంగస్థల సేవారత్న’ బిరుదు ప్రదానం ముగింపు సమావేశంలో ద్రాక్షారామ నాటక కళాపరిషత్ అధ్యక్షడు నాగిరెడ్డి సత్యనారాయణకు ‘రంగస్థల సేవారత్న’ బిరుదు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ నాగిరెడ్డి ఈ పరిషత్ స్థాపించి 80 ఏళ్ల వయసులో కూడా చేస్తున్న సేవలను కొనియాడారు. పరిషత్ ఉపా«ధ్యక్షుడు వైఎన్వీవీ సత్యనారాయణ (కొండ), కార్యదర్శి, సినీనటి వై.సరోజ, పరిషత్ కోశాధికారి అయినవిల్లి సతీష్, సంయుక్త కార్యదర్శి వేమవరపు రాంబాబు, పరిషత్ ఆర్గనైజర్ నాగిరెడ్డి సతీష్రావు, పరిషత్ సభ్యులు మాకినీడి రామారావు, ఉంగరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆయనను చిక్కాల సత్కరించారు. పెద్దిరెడ్డి సూరిబాబు గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యుడు స్టాలిన్, చింతపల్లి వీరభద్రరావు, చింతపల్లి ఈశ్వరరావు కాజులూరు ఎంపీపీ యాళ్ల కృష్ణారావు, ఆళ్ల రాంబాబు, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు మీర్జాఖాసిం హుస్సేన్, కోటిపల్లి అబ్బు తదితరులు పాల్గొన్నారు. -
పరుగో.. పరుగు
ఉత్కంఠభరితంగా రాష్ట్రస్థాయి ఎడ్లపరుగు పోటీలు సీనియర్స్ విజేత విశాఖ జూనియర్స్ విజేత తూర్పుగోదావరి గొల్లప్రోలు : గొల్లప్రోలులోని మాదేపల్లి రంగబాబు మెమోరియల్ రాష్ట్రస్థాయి ఎడ్ల పరుగు ప్రదర్శన పోటీలు ఆదివారం ఉత్కంఠభరితంగా సాగాయి. స్థానిక గోదావరికాలువ గట్టుపై నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లాతో పాటు పశ్చిమగోదావరి, ప్రకాశం, కృష్ణ, విశాఖ, విజయనగరం జిల్లాలకు చెందిన 47 జతల ఎడ్లు పాల్గొన్నాయి. రైతులు మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా చెట్లు, వరిచేలగట్లపై నిల్చొని పోటీలను ఆసక్తిగా తిలకించారు. * సీనియర్స్ విభాగంలో ఏడు జతల ఎడ్లు పోటీల్లో పాల్గొన్నాయి. విజేతగా విశాఖజిల్లా చుక్కపల్లికి చెందిన అద్దేపల్లి పాలవల్లికి చెందిన ఎడ్లు(5నిమిషాలు–54సెకన్లు–37పాయింట్లు), ద్వితీయస్థానంలో విశాఖజిల్లా చుక్కపల్లికి చెందిన మజ్జి రాజేష్ ఎడ్లుజత(5–54–44), అల్లవరం మండలం బెండమూర్లంకకు చెందిన గుర్రం రాణిశ్రీయుక్తకు చెందిన ఎడ్లు(6–05–87) తృతీయస్థానంలో నిలిచాయి. * జూనియర్స్ విభాగంలో 30జతల ఎడ్లు పాల్గొనగా, విజేతగా గండేపల్లి మండలం నాయకంపల్లికి చెందిన చెరుకూరి రామసూర్యవర్షిత్ ఎడ్లుజత(4 నిమిషాలు, 39సెంకడ్లు––28పాయింట్లు) , ద్వితీయస్థానంలో పిఠాపురం మండలం బి ప్రత్తిపాడుకు చెందిన బొజ్జా లక్ష్మీఅపర్ణకు చెందిన ఎడ్లు జత(4–49–25) , తృతీయస్థానంలో ప్రకాశంజిల్లా పంగులూరుకు చెందిన పెండ్యాల రాంబాబు ఎడ్లుజత(4–49–37) నిలిచాయి. విజేతలకు బహుమతులు సీనియర్స్లో విజేతకు లింగం రాజు రూ.15వేలు నగదు, ద్వితీయవిజేతకు నాగలక్ష్మిసీడ్స్ అధినేత గట్టెం విష్ణు రూ.12వేలు, తృతీమబహుమతిని పీఎంఆర్ విద్యామందిర్ అధినేత మాదేపల్లి వినీల్ రూ10వేలు, జూనియర్స్ విజేతకు మాధురివిద్యాలయ అధినేత కడారి తమ్మయ్యనాయుడు రూ.12వేలు, ద్వితీయబహుమతిని శివసాయి ఏజన్సీస్ అధినేత తెడ్లపు చిన్నారావు రూ.10వేలు, తృతీయ బహుమతిని అధమాకంపెనీ రూ.8వేలు ఆర్థికసహాయం అందజేశారు. విజేతలకు ఎమ్మెల్యే వర్మ బహుమతులు, మెమెంటోలు, శివసాయి ఏజన్సీస్ అధినేత చిన్నారావు ప్రత్యేక మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మాదేపల్లి వినీల్, నగరపంచాయతీ చైర్మన్ శీరం మాణిక్యం, నీటి సంఘం అధ్యక్షులు కడారి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. పోటీలకు న్యాయనిర్ణేతలగా సిద్ధా నానాజీ వ్యవహరించారు. ఏర్పాట్లను రంగబాబు మెమోరియల్ కమిటీ పర్యవేక్షించింది. శ్రీశ్రీనివాసా ఏజన్సీస్ అధినేత కేదారిశెట్టినానాజీ మజ్జిగ పంపిణీ చేశారు. -
కళలకు పుట్టినిల్లు.. పాలకొల్లు
పాలకొల్లు టౌన్ : కళలకు పుట్టినిల్లైన పాలకొల్లు నుంచి ఎందరో కళాకారులు సినీ రంగంలో ప్రవేశించి తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటారని కేంద్ర మంత్రి వై.సుజనాచౌదరి, శాసనమండలి చైర్మన్ ఎ. చక్రపాణి, రాష్ట్ర మంత్రి పీతల సుజాత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురదేశ్వరి, ఎంపీ గోకరాజు గంగరాజు అన్నారు. శనివారం రాత్రి పాలకొల్లులో డాక్టర్ గజల్ శ్రీనివాస్ పాలకొల్లు కళాపరిషత్ 10వ జాతీయ నాటకోత్సవాల ప్రారంభోత్సవ సభలో వారు పాల్గొని మాట్లాడారు. సభకు పరిషత్ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాస చౌదరి అధ్యక్షత వహించారు. నేటి హైటెక్ యుగంలో కూడా ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటూ కళాపరిషత్లు నాటకాలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, బి.గోపాల్, మాటల రచయిత చింతపల్లి రమణ, నిర్మాత అడ్డాల చంటిలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, అంగర రామమోహన్, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఏఎంసీ చైర్మన్ గొట్టుముక్కల గాంధీభగవాన్రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, డాక్టర్ కేఎస్పీఎన్ వర్మ, విన్నకోట వేంకటేశ్వరరావు, మానాపురం సత్యనారాయణ, మునిసిపల్ చైర్మన్ వల్లభు నారాయణమూర్తి, వైస్చైర్మన్ కర్నేన రోజారమణి, ఎంపీపీ పెన్మెత్స శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. సందేశాత్మకంగా సాగిన నాటికలు సమాజంలోని పలు అంశాలను లేవనెత్తుతూ కళాకారులు నాటకాలు ప్రదర్శించారు. విలువైన మానవ దేహాలను మట్టికో...కట్టెకో బలి చేయకుండా వైద్య పరిశోధనలకు ఇస్తే భావితరాల భవిష్యత్తుకు ఉపయోగకరమని ‘స్వర్గానికి వంతెన’ నాటిక సందేశాన్నిచ్చింది. దీనికి రచన వల్లూరి శివప్రసాద్, దర్శకత్వం గంగోత్రి సాయి. ద్రాక్షారామ కళాపరిషత్ కళాకారులు ప్రదర్శించిన ‘అతనికి అటు..ఇటు’ నాటిక సంసారంలో రేగిన కలతలను సరిదిద్దుకోవాల్సిన ఆవశ్యకతను కళ్లకు కట్టింది. మూడో ప్రదర్శనగా ‘సందడే సందడి’ నాటిక ప్రదర్శించారు. జయశ్రీ శ్రీజ సాధినేని రచన, దర్శకత్వంతోపాటు సుశీల పాత్రను పోషించారు. హాస్యభరితంగా సాగిన ఈ నాటిక ద్వారా దురాశ వల్ల కలిగే నష్టాలను వివరించారు. -
ఉత్తమ ప్రదర్శన ఇంటింటి కధ
తాటిపర్తిలో ముగిసిన రాష్ట్రస్థాయి నాటకపోటీలు గొల్లప్రోలు (పిఠాపురం) : తాటిపర్తిలోని అపర్ణ నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో వారం రోజులుగా జరుగుతున్న 6వ రాష్ట్రస్థాయి నాటకపోటీలు ముగిసాయి. ఉత్తమ ప్రదర్శనగా హైదరాబాద్కు చెందిన విజయాదిత్య ఆర్ట్స్ బృందం ప్రదర్శించిన ‘ఇంటింటి కధ’ ఎంపికకాగా ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా హైదరాబాద్కు చెందిన కళాంజలి బృందం ప్రదర్శించిన ‘జారుడుమెట్లు ’ ఎంపికైంది. ఉత్తమనటుడుగా ఇంటింటి కధ పాత్రధారి గోపరాజు విజయ్, ఉత్తమనటిగా జారుడుమెట్లు పాత్రధారి నవీన, ఉత్తమ రచనకు ఎస్ఎస్ఆర్కే గురుప్రసాద్ (ఇంటింటి కధ), ఉత్తమ దర్శకత్వానికి కొల్లా రాధాకృష్ణ (జారుడుమెట్లు), ఉత్తమ సంగీతం –సాంబశివరావు (ఇంటింటి కధ), రంగాలంకరణ–పిఠాపురం బాబూరావు (మళ్లీ మరోజన్మంటూ ఉంటే), ఉత్తమ ప్రతినాయకి– రజనీ శ్రీకళ (జారుడుమెట్లు), ఉత్తమ హాస్యనటుడు– పీఎస్ సత్యనారాయణ (ఇంటింటి కధ), సహాయ నటి–రమాదేవి æ(ఇంటింటి కధ), సహాయనటుడు–వరప్రసాద్ (జారుడుమెట్లు), ఆహార్యం– పరమేశ్వరరావు(మళ్లీ మరోజన్మంటూ ఉంటే), ఎంపికయ్యారు. విజేతలకు ప్రముఖసినీ రచయిత, నటుడు ఎంవీఎస్ హరనాథరావు, నాటకపరిషత్ కార్యదర్శి బత్తుల వీరభద్రం, ఆకొండి వెంకటేశ్వరశర్మ, దాసం కామరాజు, బాబూరావు, ఆకొండి వెంకటేశ్వరరావు, అమరాది గోపాలకృష్ణ, ప్రభాకరశాస్త్రి, సిద్దా నానాజీ, న్యాయనిర్ణేతలు రాజా తాతయ్య, సీఎ¯ŒS మూర్తి, కె పుల్లారావు తదితరులు బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. హరనాథరావు మాట్లాడుతూ అపర్ణ నాటకకళాపరిషత్ ఆరో వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన నాటకపోటీలు రసవత్తరంగా సాగాయన్నారు. ప్రతీ సంవత్సరం నాటకాలను ఎంతగానో ఆదరిస్తున్న ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎక్కడ నాటకరంగం రక్షించబడుతుందో అక్కడ కళారంగం అభివృద్ధి చెందుతుందన్నారు. కళాపరిషత్లు నాటక రంగానికి జీవం పోస్తున్నాయని తెలిపారు. -
అంగన్వాడీ రాష్ట్ర కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు విజయం
కొత్తపేట : అంగన్వాడీ కార్యకర్తల రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు విజయం సాధించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి ఎనిమిదో తేదీ) పురస్కరించుకుని స్త్రీ శిశుసంక్షేమ శాఖ ఆదేశాల మేరకు గత నెల 18న ఐసీడీఎస్ ప్రాజెక్టు స్థాయిలో, 21న జిల్లా స్థాయిలో కాకినాడలో కబడ్డీ పోటీలు నిర్వహించగా కొత్తపేట ప్రాజెక్టు జట్టు జిల్లా స్థాయిలో ప్రథమస్థానం సాధించింది. జిల్లా పోటీల్లో బాగా ఆడిన ఆర్ రత్నకుమారి, బీఎస్ఎన్ కుమారి(కొత్తపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు), శాంతి, ప్రసన్న, సుజాత, వీరమణి, తులసి, త్రివేణి(తుని ప్రాజెక్టు), గంగాదేవి (పెద్దాపుర ప్రాజెక్టు)లను రాష్ట్ర పోటీలకు జిల్లా జట్టుగా కూర్చారు. ఈ జట్టు మంగళవారం రాష్ట్రస్థాయిలో విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన పోటీల్లో క్వార్టర్స్లో పశ్చిమ గోదావరి జట్టుపై, సెమీ ఫైనల్స్లో చిత్తూరు జట్లపై గెలిచి, ఫైనల్స్లో కృష్ణా జిల్లా జట్టుపై ఘన విజయం సాధించినట్టు కొత్తపేట ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎ రాజ్యలక్ష్మి తెలిపారు. ఈ జట్టును స్త్రీ శిశుసంక్షేమ శాఖ ఆర్జేడీ విద్యావతి, తుని, కొత్తపేట సీడీపీఓలు వి మాధవి, బి అనంతలక్ష్మి తదితరులు అభినందించారు. ఆ టీమ్ సభ్యులకు వచ్చే నెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా బహుమతులు అందచేస్తారని రాజ్యలక్ష్మి తెలిపారు. -
నేటితో క్రీడాసంబరం పరిసమాప్తం
పాయింట్ల ఆధారంగా విజేతల నిర్ణయం అంతర్జాతీయ క్రీడాకారుడు సాత్విక్కు సత్కారం అమలాపురం / ఉప్పలగుప్తం (అమలాపురం) : నిమ్మకాయల వెంకట రంగయ్య మెమోరియల్ నేషనల్ ఇన్విటేషన్ మెన్ అండ్ ఉమెన్ వాలీబాల్ పోటీలు ముగింపు దశకు చేరాయి. ఐదు సెట్లలో నిర్వహించిన ఈ పోటీల్లో మూడు సెట్లు గెలిచినవారు విజయం సాధిస్తారు. కాని మూడొంతుల మ్యాచ్లు ఐదు సెట్లు, నాలుగు సెట్లలోకాని ఫలితం తేలలేదు. దీంతో అర్ధరాత్రి రెండు గంటల వరకు పోటీలు నిర్వహించాల్సి వచ్చింది. ఇప్పటి వరకు జరిగిన పోటీలను పరిశీలిస్తే పురుషుల విభాగంలో సీఆర్పీఎఫ్ (ఢిల్లీ), వెస్ట్రన్ రైల్వే (ముంబై), పోస్టల్ (కర్ణాటక), మహిళా విభాగంలో ఎస్సీ రైల్వే (సికింద్రాబాద్), పోస్టల్ (కర్ణాటక) జట్లు విజేతగా నిలిచే అవకాశముంది. సోమవారం సాయంత్రం జరిగిన మ్యాచ్లో సాయి (గుజరాత్)పై ఇన్కంట్యాక్స్ (చెన్నై) జట్టు 25–18, 27–17, 25–18 తేడాతో ఏకపక్షంగా సాగిన పోరులో విజేతగా నిలిచింది. రెండో మ్యాచ్ మహిళా విభాగంలో ఎస్సీ రైల్వే (సికింద్రాబాద్), సాయి (గుజరాత్) జట్ల మధ్య జరగగా, ఎస్సీ రైల్వే 23–25, 25–16, 25–22, 25–22 తేడాతో విజయం సాధించింది. పోస్టల్ (కర్ణాటక) జట్టుపై వెస్ట్రన్ రైల్వే (ముంబై) జట్టు 25–16, 23–25, 27–25, 28–18 తేడాతో గెలిచింది. ఆదివారం అర్ధరాత్రి పురుషుల విభాగంలో జరిగిన పోరులో సీఆర్పీఎఫ్(ఢిల్లీ) జట్టు సాయి (గుజరాత్)పై 23–25, 25–1, 25–22, 25–22 తేడాతో గెలుపొందాయి. నేటితో ముగింపు ఐదు రోజుల పాటు జరగనున్న ఎన్వీఆర్ వాలీబాల్ పోటీలు మంగళవారం రాత్రితో ముగియనున్నాయి. పాయింట్ల ఆధారంగా విజేతలను నిర్ణయించనున్నారు. మొదటి స్థానాల్లో నిలిచినవారితోపాటు అన్ని జట్లకు కలిపి రూ.ఐదు లక్షల నగదు బహుమతితోపాటు ట్రోఫీని అందించనున్నారు. సాత్విక్కు ఘన సత్కారం అంతర్జాతీయ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, అమలాపురానికి చెందిన రంకిరెడ్డి సాయిరాజ్ సాత్విక్కు ఎన్వీఆర్ వాలీబాల్ అసోసియేషన్ సోమవారం రాత్రి ఘనంగా సత్కరించింది. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి, టోర్నమెంట్ అధ్యక్షుడు నిమ్మకాయల జగ్గయ్యనాయుడులు సాత్విక్ను సత్కరించారు. అమలాపురం జోన్ వ్యాయామోపాధ్యాయ సంఘం అధ్యక్షుడు ఉండ్రు ముసలయ్య, టోర్నీ కార్యదర్శి మద్దింశెట్టి సురేష్, కోశాధికారి అరిగెల నానాజీ, సాంకేతిక కమిటీ సభ్యుడు ఉండ్రు రాజబాబులు ఉన్నారు. -
హోరాహోరీగా వాలీబాల్ పోటీలు
అమలాపురం / ఉప్పలగుప్తం (అమలాపురం) :గొల్లవిల్లిలో జరుగుతున్న నిమ్మకాయల వెంకట రంగయ్య మెమోరియల్ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. రెండోరోజు శనివారం సాయంత్రం ప్రారంభమైన తొలి మ్యాచ్లో పోస్టల్ కర్నాటక జట్టుపై సీఆర్పీఎఫ్ ఢిల్లీ జట్టు 25–22, 22–25, 19–25, 25–19, 15–8 పాయింట్లతో గెలుపొందింది. మొత్తం ఐదు సెట్లలో జరిగిన ఈ పోరు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసింది. మహిళా విభాగంలో కర్ణాటక జట్టు సౌత్ సెంట్రల్ రైల్వేపై 27–25, 25–20, 17–25, 25–19 తేడాతో విజయం సాధించింది. ముందు రోజు శుక్రవారం రాత్రి రెండు గంటల వరకూ పోటీలు జరిగిన పోటీల్లో ఆంధ్రా స్పైకర్స్ (ఏపీటీం) జట్టు సాయి గుజరాత్పై 25–22, 25–16, 25–21 స్కోర్తో గెలుపొందింది. మహిళా విభాగంలో జరిగిన పోరులో పోస్టల్ కర్నాటక జట్టు సీఆర్పీఎఫ్ ఢిల్లీ జట్టుపై 25–19, 25–23, 21–25, 25–18 స్కోర్తో గెలుపొందింది. ఒక్కో మ్యాచ్ ఫలితం కోసం నాలుగు, ఐదు సెట్లు ఆడాల్సి రావడంతో పోటీలు ఆలస్యమవుతున్నాయి. సుమారు ఐదువేల మంది సామర్థ్యం ఉన్న గ్యాలరీ నిండిపోవడంతో చాలా మంది బయటే ఉండిపోతున్నారు. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్యేలు గొల్లపల్లి సూర్యారావు, అయితాబత్తుల ఆనందరావులు రెండో రోజు పోటీలను తిలకించారు. వారికి టోర్నమెంట్ అధ్యక్ష, కార్యదర్శులు నిమ్మకాయల జగ్గయ్యనాయుడు, మద్దింశెట్టి సురేష్ స్వాగతం పలికారు. -
క్రీడలు జీవితంలో భాగం కావాలి
-క్రీడాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు -గొల్లవిల్లిలో జాతీయస్థాయి వాలీబాల్ టోర్నీ ప్రారంభం అమలాపురం/ ఉప్పలగుప్తం : క్రీడలు జీవితంలో భాగం కావాలని, అప్పుడే మనిషి పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా ఉంటాడ రాష్ట్ర కార్మిక, క్రీడాశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో నిమ్మకాయల వెంకటరంగయ్య మెమోరియల్ జాతీయ వాలీబాల్ ఇన్విటేషన్ మెన్, ఉమెన్ పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. క్రికెట్కే కాక ఇటీవల కబడ్డీ, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్ వంటి క్రీడలకు ఆదరణ పెరుగుతోందన్నారు. విశాఖలో ఏటా బీచ్ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తామన్నారు. పి.వి.సింధు సాధించిన విజయంతో ఒలింపిక్ క్రీడలకు ఆదరణ పెరిగిందన్నారు. రాష్ట్రంలో మైదానాల అభివృద్ధి, క్రీడా పరికరాల పంపిణీకి ఎమ్మెల్యే, మంత్రులు కోరిన వెంటనే నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. గొల్లవిల్లిలో రూ.కోటితో స్టేడియం గొల్లవిల్లిలో రూ.కోటితో స్టేడియం నిర్మిస్తామని అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ జిల్లాలో మరిన్ని గ్రామీణ క్రీడలను నిర్వహిస్తామని, రాష్ట్రంలో తూర్పుగోదావరిని క్రీడల్లో అగ్రస్థానంలో నిలుపుతామని చెప్పారు. కోనసీమస్థాయిలో ఆరంభమైన టోర్నమెంట్ను ఇప్పుడు జాతీయస్థాయిలో నిర్వహిస్తున్నామంటే అందుకు గొల్లవిల్లి వాసులే కారణమన్నారు. స్టేడియంల నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, దాట్ల బుచ్చిబాబు, మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, చెల్లి వివేకానంద, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, అమలాపురం మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, ఎంపీపీ శిరంగు సత్తిరాజు, జెడ్పీటీసీ సభ్యుడు దేశంశెట్టి లక్ష్మీనారాయణ, టోర్నమెంట్ అధ్యక్ష, కార్యదర్శులు నిమ్మకాయల జగ్గయ్యనాయుడు, మద్దింశెట్టి సురేష్, ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ మెట్ల రమణబాబు, వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.నారాయణరావు, జిల్లా అసోసియేషన్ సెక్రటరీ వై.బంగార్రాజు, ఆర్ఐపీఈ టి.వి.ఎస్.రంగారావు, పాల్గొన్నారు. ఆకట్టుకున్న క్రీడాజ్యోతి ప్రజ్వలన పోటీల ప్రారంభం సందర్భంగా క్రీడాజ్యోతిని వెలిగించిన తీరు సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఓ జ్యోతిని రిమోట్ కారులో ఉంచి మైదానమంతా తిప్పారు. ఆ జ్యోతిని క్రీడలమంత్రి అచ్చెన్నాయుడు వెలిగించి దానితోపాటు నడుచుకుంటూ ప్రధాన క్రీడాజ్యోతి వద్దకు వెళ్లి, వందలాది మంది క్రీడాభిమానుల కరతాళధ్వనుల మధ్య దాన్ని వెలిగించారు. క్రీడాప్రాంగణాన్ని ప్రారంభించిన మంత్రులు రాజప్ప, అచ్చెన్నాయుడు కొద్దిసేపు వాలీబాల్ ఆడారు. వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (వీఎఫ్ఐ) నిబంధనలకు అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన కోర్టును చూసి క్రీడాకారులు సైతం మంత్రముగ్ధులయ్యారు. -
చేతులే ట్రిగర్లు..బంతులే బుల్లెట్లు
-నేటి నుంచి గొల్లవిల్లిలో జాతీయస్థాయి వాలీబాల్ టోర్నీ -ఫ్లడ్ లైట్ల కాంతిలో అయిదురోజుల పాటు నిర్వహణ -అధునాతన ప్రమాణాలతో సిద్ధమైన కోర్టు అమలాపురం / ఉప్పలగుప్తం : ఆటగాళ్లే తుపాకులవుతారు. గురినెరిగిన వాళ్ల చేతులే ట్రిగ్గర్లవుతాయి. తిన్నగా, వాలుగా, మూలగా దూసుకుపోయే బంతులే బుల్లెట్లవుతాయి. అయిదురోజుల పాటు చూసేవారికి కనువిందు చేసే క్రీడా సమరానికి సాధారణ గ్రామమైన గొల్లవిల్లిలోని జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడాప్రాంగణం వేదిక కానుంది. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా నిమ్మకాయల వెంకటరంగయ్య మెమోరియల్ వాలీబాల్ అసోసియేషన్ నిర్వహిస్తున్న జాతీయస్థాయి, వాలీబాల్ శుక్రవారం ప్రారంభం కానున్నాయి. జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులు పాల్గొనే ఈ పోటీలను ఫ్లడ్ లైట్ల కాంతిలో రేయింబవళ్లు ప్రతిష్టాత్మకంగా జరిపేందుకు నిర్వాహక కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణం, వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా అధునాతన కోర్టు, 15 వేల మంది వరకూ పోటీలు వీక్షించేలా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. పురుషుల, మహిళల విభాగాల్లో జరిగే పోటీలకు తిలకించేందుకు మíßహిళల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పురుషుల, మహిళ జట్లు తలపడనున్నాయి. లీగ్ పద్ధతిలో పోటీలు నిర్వహించి మెరుగైన పాయింట్లు సాధించిన రెండు జట్ల మధ్య ఫైనల్ పోటీలను ఈనెల 28న నిర్వహిస్తారు. పోటీలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచే కాక పొరుగు జిల్లాల నుంచి క్రీడాభిమానులు తరలివస్తారు. రోజుకు 20 వేల నుంచి 30 వేలమంది తరలి రావచ్చని అంచనా. పోటీలు జరిగే ప్రాంగణంతో బయట కూడా క్రీడాభిమానులు పోటీలు వీక్షించేలా నిర్వాహక కమిటీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాట్లు చేస్తోంది. క్రీడాభిమానులతో ఈ ఐదురోజులూ గొల్లవిల్లిలో రేయింబవళ్లు పండుగ వాతావరణం నెలకొననుంది. పది జట్లు.. పాటవం గల ఆటగాళ్లు పోటీల్లో పురుషులు, మహిళల విభాగంలో మొత్తం పది జట్లు తలపడనున్నాయి. పురుషుల విభాగంలో వెస్ట్రన్ రైల్వేస్ (ముంబాయి), ఆంధ్రా స్పైకర్స్ (ఏపీ) సాయి అకాడమీ (గుజరాత్), ఇన్కమ్ ట్యాక్స్ (చెన్నై), పోస్టల్ (కర్ణాటక), సీఆర్పీఎఫ్ (ఢిల్లీ) జట్లు, మహిళా విభాగంలో జేపీఆర్ యూనివర్సిటీ (చెన్నై), ఎస్సీ రైల్వేస్ (సికింద్రాబాద్), సాయి అకాడమీ(గుజరాత్), కర్నాటక స్టేట్ జట్లు తలపడనున్నాయి. ఇంటర్ నేషనల్స్లో 10 సార్లు పాల్గొన్న ప్రదీప్ చెన్నై ఇన్కంట్యాక్స్ నుంచి టోర్నీలో పాల్గొంటున్నారు. ఇండియా జట్టులో ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ రాష్ట్రాల జాతీయ క్రీడాకారులు నరేష్, కృష్ణంరాజు, సుబ్బారావు, ప్రభు, కార్తీక్, ఇండియా మహిళా జట్టు క్రీడాకారిణి హేమ పోటీల్లో తమ ప్రతిభ చూపనున్నారు. 1988లో కోనసీమస్థాయితో శ్రీకారం.. గొల్లవిల్లిలో తొలిసారిగా ఉండ్రు సాంబశివరావు మెమోరియల్ పేరిట 1988లో కోనసీమస్థాయి వాలీబాల్ పోటీలు జరిగాయి. రెండేళ్లు కోనసీమస్థాయిలో జరిగిన పోటీలు 1990లో జిల్లా స్థాయికి, 1994 నాటికి రాష్ట్రస్థాయికి చేరాయి. 2002 వరకూ రాష్ట్రస్థాయిలో జరిగాయి. తరువాత కొంత విరామం ఏర్పడ్డా 2013, 2014లలో దక్షిణభారతస్థాయిలో సలాది పల్లంరాజు మెమోరియల్ పోటీలు నిర్వహించారు. 2015 నుంచి నిమ్మకాయల వెంకట రంగయ్య మెమోరియల్ పేరిట జాతీయస్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ జరిగిన పోటీల్లో పాల్గొన్న ఎందరో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో రాణిస్తున్నారు.వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (వీఎఫ్ఐ) నిబంధనలకు అనుగుణంగా పోటీల నిర్వహణ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే అయినా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. క్రీడాకారులకు మెరుగైన వసతి, భోజనాలకు నిర్వాహక కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ పోటీలతో మాకు స్ఫూర్తి గొల్లవిల్లిలో మూడు దశాబ్దాలుగా పోటీలు జరుగుతున్నాయి. ఇక్కడి పోటీలు క్రీడాస్ఫూర్తిని పెంపొందించి, ఎంతో మందిని చక్కటి ఆటగాళ్లుగా తీర్చిదిద్దాయంటే అతిశయోక్తి కాదు. జాతీయ క్రీడాకారుల ఆటతీరును అవగతం చేసుకుని మెళకువలు తెలుసుకుంటాం. ఇదే కోర్టులో మేం రోజూ ప్రాక్టీసు చేస్తాం. -అరిగెల నరసింహారావు, యువ వాలీబాల్ క్రీడాకారుడు, గొల్లవిల్లి గ్రామానికి గర్వకారణం జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలతో గ్రామం కీర్తి దేశం నలుమూలలకూ విస్తరించడం గర్వంగా ఉంది. శివరాత్రితో పాటు జరిగే క్రీడాపోటీలకు బంధువులు రావడం ఆనవాయితీ అయింది. మా గ్రామంలో ఇదో పెద్ద పండుగ. వాలీబాల్ పోటీల్లో జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులు పోటీపడటం మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. - చీకట్ల ఏసుబాబు, వ్యాపారి, గొల్లవిల్లి -
చేతులే ట్రిగర్లు..బంతులే బుల్లెట్లు
-నేటి నుంచి గొల్లవిల్లిలో జాతీయస్థాయి వాలీబాల్ టోర్నీ -ఫ్లడ్ లైట్ల కాంతిలో అయిదురోజుల పాటు నిర్వహణ -అధునాతన ప్రమాణాలతో సిద్ధమైన కోర్టు అమలాపురం / ఉప్పలగుప్తం : ఆటగాళ్లే తుపాకులవుతారు. గురినెరిగిన వాళ్ల చేతులే ట్రిగ్గర్లవుతాయి. తిన్నగా, వాలుగా, మూలగా దూసుకుపోయే బంతులే బుల్లెట్లవుతాయి. అయిదురోజుల పాటు చూసేవారికి కనువిందు చేసే క్రీడా సమరానికి సాధారణ గ్రామమైన గొల్లవిల్లిలోని జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడాప్రాంగణం వేదిక కానుంది. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా నిమ్మకాయల వెంకటరంగయ్య మెమోరియల్ వాలీబాల్ అసోసియేషన్ నిర్వహిస్తున్న జాతీయస్థాయి, వాలీబాల్ శుక్రవారం ప్రారంభం కానున్నాయి. జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులు పాల్గొనే ఈ పోటీలను ఫ్లడ్ లైట్ల కాంతిలో రేయింబవళ్లు ప్రతిష్టాత్మకంగా జరిపేందుకు నిర్వాహక కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణం, వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా అధునాతన కోర్టు, 15 వేల మంది వరకూ పోటీలు వీక్షించేలా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. పురుషుల, మహిళల విభాగాల్లో జరిగే పోటీలకు తిలకించేందుకు మíßహిళల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పురుషుల, మహిళ జట్లు తలపడనున్నాయి. లీగ్ పద్ధతిలో పోటీలు నిర్వహించి మెరుగైన పాయింట్లు సాధించిన రెండు జట్ల మధ్య ఫైనల్ పోటీలను ఈనెల 28న నిర్వహిస్తారు. పోటీలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచే కాక పొరుగు జిల్లాల నుంచి క్రీడాభిమానులు తరలివస్తారు. రోజుకు 20 వేల నుంచి 30 వేలమంది తరలి రావచ్చని అంచనా. పోటీలు జరిగే ప్రాంగణంతో బయట కూడా క్రీడాభిమానులు పోటీలు వీక్షించేలా నిర్వాహక కమిటీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాట్లు చేస్తోంది. క్రీడాభిమానులతో ఈ ఐదురోజులూ గొల్లవిల్లిలో రేయింబవళ్లు పండుగ వాతావరణం నెలకొననుంది. పది జట్లు.. పాటవం గల ఆటగాళ్లు పోటీల్లో పురుషులు, మహిళల విభాగంలో మొత్తం పది జట్లు తలపడనున్నాయి. పురుషుల విభాగంలో వెస్ట్రన్ రైల్వేస్ (ముంబాయి), ఆంధ్రా స్పైకర్స్ (ఏపీ) సాయి అకాడమీ (గుజరాత్), ఇన్కమ్ ట్యాక్స్ (చెన్నై), పోస్టల్ (కర్ణాటక), సీఆర్పీఎఫ్ (ఢిల్లీ) జట్లు, మహిళా విభాగంలో జేపీఆర్ యూనివర్సిటీ (చెన్నై), ఎస్సీ రైల్వేస్ (సికింద్రాబాద్), సాయి అకాడమీ(గుజరాత్), కర్నాటక స్టేట్ జట్లు తలపడనున్నాయి. ఇంటర్ నేషనల్స్లో 10 సార్లు పాల్గొన్న ప్రదీప్ చెన్నై ఇన్కంట్యాక్స్ నుంచి టోర్నీలో పాల్గొంటున్నారు. ఇండియా జట్టులో ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ రాష్ట్రాల జాతీయ క్రీడాకారులు నరేష్, కృష్ణంరాజు, సుబ్బారావు, ప్రభు, కార్తీక్, ఇండియా మహిళా జట్టు క్రీడాకారిణి హేమ పోటీల్లో తమ ప్రతిభ చూపనున్నారు. 1988లో కోనసీమస్థాయితో శ్రీకారం.. గొల్లవిల్లిలో తొలిసారిగా ఉండ్రు సాంబశివరావు మెమోరియల్ పేరిట 1988లో కోనసీమస్థాయి వాలీబాల్ పోటీలు జరిగాయి. రెండేళ్లు కోనసీమస్థాయిలో జరిగిన పోటీలు 1990లో జిల్లా స్థాయికి, 1994 నాటికి రాష్ట్రస్థాయికి చేరాయి. 2002 వరకూ రాష్ట్రస్థాయిలో జరిగాయి. తరువాత కొంత విరామం ఏర్పడ్డా 2013, 2014లలో దక్షిణభారతస్థాయిలో సలాది పల్లంరాజు మెమోరియల్ పోటీలు నిర్వహించారు. 2015 నుంచి నిమ్మకాయల వెంకట రంగయ్య మెమోరియల్ పేరిట జాతీయస్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ జరిగిన పోటీల్లో పాల్గొన్న ఎందరో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో రాణిస్తున్నారు.వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (వీఎఫ్ఐ) నిబంధనలకు అనుగుణంగా పోటీల నిర్వహణ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే అయినా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. క్రీడాకారులకు మెరుగైన వసతి, భోజనాలకు నిర్వాహక కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ పోటీలతో మాకు స్ఫూర్తి గొల్లవిల్లిలో మూడు దశాబ్దాలుగా పోటీలు జరుగుతున్నాయి. ఇక్కడి పోటీలు క్రీడాస్ఫూర్తిని పెంపొందించి, ఎంతో మందిని చక్కటి ఆటగాళ్లుగా తీర్చిదిద్దాయంటే అతిశయోక్తి కాదు. జాతీయ క్రీడాకారుల ఆటతీరును అవగతం చేసుకుని మెళకువలు తెలుసుకుంటాం. ఇదే కోర్టులో మేం రోజూ ప్రాక్టీసు చేస్తాం. -అరిగెల నరసింహారావు, యువ వాలీబాల్ క్రీడాకారుడు, గొల్లవిల్లి గ్రామానికి గర్వకారణం జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలతో గ్రామం కీర్తి దేశం నలుమూలలకూ విస్తరించడం గర్వంగా ఉంది. శివరాత్రితో పాటు జరిగే క్రీడాపోటీలకు బంధువులు రావడం ఆనవాయితీ అయింది. మా గ్రామంలో ఇదో పెద్ద పండుగ. వాలీబాల్ పోటీల్లో జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులు పోటీపడటం మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. - చీకట్ల ఏసుబాబు, వ్యాపారి, గొల్లవిల్లి -
24 నుంచి జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు
ఉప్పలగుప్తం : మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 24 నుంచి 28 వరకూ నిమ్మకాయల వెంకటరంగయ్య జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెంకటరంగయ్య వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు జగ్గయ్యనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రూపొందించిన వార్షిక క్యాలెండర్ను జగ్గయ్యనాయుడు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శనివారం ఆవిష్కరించారు. గొల్లవిల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించే ఈ పోటీలలో... పురుష విభాగంలో ఆంధ్రా స్పైకర్స్ (ఏపీ టీం), వెస్ట్రన్రైల్వేస్–ముంబాయి, నార్త్ ఈస్ట్రన్రైల్వేస్– గోరఖ్పూర్, ఇన్కమ్ టాక్స్–చెన్నై, సాయి అకాడమి–గుజరాత్, ఐసీఎఫ్ క్లబ్–చెన్నై జట్లు, మహిళా విభాగంలో జెపీఆర్ యూనివర్సీటీ–చెన్నై, ఎస్సీ రైల్వేస్– సికింద్రాబాద్, సాయి అకాడమి–గుజరాత్, కేరళ జట్లు పాల్గొంటున్నాయి.అంతర్జాతీయ ప్రమాణాలతో వాలీబాల్ కోర్టు సిద్ధం చేశామని, క్రీడలను వీక్షించేందుకు గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. టోర్నీ వివరాలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్వీఆర్ గొలవిల్లి.కామ్ వెబ్సైట్లో పొందుపరుస్తామన్నారు. టోర్నీ కార్యదర్శి మద్దింశెట్టి సుబ్బరాజు, కార్యనిర్వాహక కార్యదర్శి గొలకోటి ఫణీంద్ర కుమార్, కోశాధికారి అధ్యక్షులు అరిగెల వెంకటముసలయ్య, ఉపాధ్యక్షులు గొలకోటి సత్తిరాజు, ఉండ్రు సుబ్బారావు(రాజబాబు), గుర్రాల ప్రసాద్, సలాది సత్తిబాబు, ఉండ్రు ముసలయ్య, ఎంఎస్ఆర్ స్వామి, గుత్తాల సుభాష్ చంద్రబోస్, జన్నూరి వెంకటేశ్వరరావు, గనిశెట్టి తాతాజీ, సుందరనీడి సత్యమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి జర్నలిస్టుల క్రీడా పోటీలు
భానుగుడి (కాకినాడ) : కాకినాడ ప్రెస్ ఫోరమ్ ఆధ్వర్యంలో మూడు రోజులగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అక్రిడిటేడ్ జర్నలిస్టుల క్రీడా పోటీలు శనివారంతో ముగిశాయి. రంగరాయ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో క్రీడాకారులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతి«థిగా జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్షి్మసత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ రాంబాబు మాట్లాడుతూ నిరంతరం మెదడుతో పనిచేసే జర్నలిస్టులకు మానసిక ప్రశాంతత చేకూర్చే క్రీడలను నిర్వహించడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు. కబడ్డీలో కృష్ణా జిల్లా విజేతగా నిలవగా, తూర్పుగోదావరి రన్నర్గా నిలిచింది. క్రికెట్లో పశ్చిమ గోదావరి విజేతగా నిలవగా, గుంటూరు రన్నర్గా నిలిచింది. ఈ క్రీడల్లో 300 మందికిపైగా క్రీడాకారులు పాల్గొన్నారు. నాకౌట్ పద్దతిలో నిర్వహించిన ఈ క్రీడల్లో జర్నలిస్టులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ప్రెస్ఫోరమ్ అధ్యక్షుడు వీసీ వెంకటపతి రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా జర్నలిస్టుల క్రీడాపోటీలు
భానుగుడి(కాకినాడ) : రాష్ట్రస్థాయి జర్నలిస్టుల క్రీడాపోటీలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి. రెండోరోజు షటిల్పోటీలు జేఎన్టీయూకే ఇండోర్ స్టేడియంలో, క్రికెట్ పోటీలు రంగరాయ మెడికల్ కళాశాల ఆవరణలో, కబడ్డీ జేఎన్టీయూ క్రీడా మైదానంలో జరిగాయి. రెండో రోజు క్రీడల్లో 13 జిల్లాల నుంచి వచ్చిన 300కిపైగా క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని వివిధ క్రీడల్లో చాటారు. ప్రొఫెషనల్ ప్లేయర్స్లా మైదానంలో మెరిశారు. క్రికెట్లో తూర్పుగోదావరి జిల్లా జట్టు నెల్లూరు జట్టుపై ఓటమి పాలైంది. శ్రీకాకుళం- నెల్లూరు జట్ల మధ్య సాగిన క్రికెట్ పోటీలో శ్రీకాకుళం విజయం సాధించింది. పశ్చిమ గోదావరి-అనంతపురం జట్లమధ్య సాగిన పోరులో అనంతపురం అత్యధిక పరుగుల తేడాతో గెలిచింది. కబడ్డీలో శ్రీకాకుళం జట్టుపై తూర్పుగోదావరి అత్యుత్తమ ప్రతిభతో ఘన విజయాన్ని సాధించింది. పశ్చిమగోదావరి-కృష్ణాజట్ల మధ్య కబడ్డీ పోరులో కష్ణాజట్టు విజయాన్ని అందుకుంది. కబడ్డీ క్రీడాకారులను జిల్లా కబడ్డీజట్టు గౌరవా«ధ్యక్షుడు ఎంపీ తోటనరసింహాం ముఖ్యఅతిథిగా పాల్గొని ఉత్సాహపరిచారు. -
ఆటంబరంగా
ఘనంగా ప్రారంభమైన క్రీడా సంబరాలు ముఖ్యఅతి«థులుగా హాజరైన ఆర్థికమంత్రి యనమల, రాజప్ప భానుగుడి(కాకినాడ) : రాష్ట్రస్థాయి జర్నలిస్టుల క్రీడా పోటీలు గురువారం కాకినాడ జర్నలిస్టుల క్రీడోత్సవ్–2017 పేరుతో ఘనంగా ప్రారంభమయ్యాయి. 13 జిల్లాల నుంచి క్రికెట్, కబడ్డీ, షటిల్ పోటీలకు సంబంధించి 300కు పైగా క్రీడాకారులు పాల్గొంటున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. కార్యక్రమానికి ముఖ్యఅతి«థిగా రాష్ట్ర ఆర్థికశాఖా మంత్రి యనమల రామకృష్ణుడు హాజరై మాట్లాడుతూ.. మానసిక ఒత్తిడిని దూరం చేసే క్రీడా పోటీల్లో జర్నలిస్టులు పాల్గొనడం శుభపరిణామమన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను, క్రీడా జెండాను ఆవిష్కరించి పోటీలను ప్రారంభించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ ఏటా ఉప్పలగుప్తంలో వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ పోటీలకు దేశ, విదేశాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారన్నారు. జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఒక టోర్నీని నిర్వహించడం ఆహ్వానించదగ్గదని, నాయకులు ఎంత బిజీగా ఉంటారో జర్నలిస్టులు సైతం అంతే బిజీగా ఉంటారన్నారు. కార్యక్రమానికి కాకినాడ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు వి.సి.వెంకటపతిరాజు మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి జర్నలిస్టులు ఈ పోటీల్లో పాల్గొంటారన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా ఈ క్రీడాపోటీలు నిర్వహించి జర్నలిస్టులకు ప్రశంసాపత్రం, నగదు బహుమతి అందివ్వాలని, ఈ పోటీల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ నామనరాంబాబు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు, జేఎన్టీయూకే వీసీ కుమార్, శాప్ ఎండీ నల్లపురాజు బంగార్రాజు, జిల్లాగ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎన్.వీర్రెడ్డి, డీఎస్డీఓ మురళీధర్, డీఈవో పి.అబ్రహం తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాస్థాయి చదరంగం విజేతలు వీరే
రాజమహేంద్రవరం సిటీ : జిల్లా స్థాయి చదరంగం పోటీల ఓపెన్, అండర్–15, 10 విభాగాల్లో 12 మంది విజేతలుగా నిలిచారని జిల్లా చదరంగం సంఘం కార్యదర్శి జి.వి.కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం కాకినాడ గాంధీ భవన్ లో జరిగిన పోటీల్లో 140 మంది క్రీడాకారులు పోటీ పడ్డారన్నారు. ఓపెన్ విభాగంలో ఎం.చైతన్య, ఆర్.నరసింహ రవీంద్ర, ఎస్.సాయి గృహికేష్, ఎస్.బాలాజీరెడ్డి, అండర్ -15 బాలుర విభాగంలో సాయిసుహాస్, గౌతమ్, బాలికల విభాగంలో మాధుర్య, అమూల్య, అండర్ -10 బాలుర విభాగంలో జ్ఞానసాయి సంతోష్, మృత్యుంజయ, బాలికల విభాగంలో శ్రీవిద్యశాంభవి, వేదలత విజయం సాధించారని తెలిపారు. విజేతలకు రాష్ట్ర చదరంగం సంఘం అధ్యక్షుడు వై.డి.రామారావు బహుమతులు అందజేశారన్నారు. అండర్ –9 విభాగంలో పోటీలను ఏప్రిల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. -
సత్కారాలు రాజకీయాలు కాకూడదు
సినీ గేయ రచయిత అదృష్టదీపక్ రాష్ట్రస్థాయి నాటికల పోటీలు ప్రారంభం రామచంద్రపురం : కళాకారులను సత్కరించటంలో రాజకీయాలకు తావులేకుండా ఉండాలని ప్రముఖ సినీగేయ రచయిత, విమర్శకులు అదృష్టదీపక్ సూచించారు. కృత్తివెంటి పేర్రాజు పంతులు జాతీయోన్నత పాఠశాలలోని బుద్దవరపు మహాదేవుడు కళావేదికలో మూడు రోజులు పాటు మయూర కళాపరిషత్ ఆధ్వర్వంలో నిర్వహించే 14వ రాష్ట్ర స్థాయి నాటికల పోటీలు శనివారం రాత్రి ప్రారంభమయ్యాయి. పరిషత్ అధ్యక్షుడు సత్తి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రముఖ రంగస్థల నటుడు, వై.ఎస్.కృష్ణేశ్వరరావును కళాపరిషత్ ఆధ్వర్యంలో సత్కరించడం అభినందనీయమన్నారు. నాటికల రచన, దర్శకత్వం, నటనలో కృష్ణేశ్వరరావు తనదైన శైలిలో ప్రేక్షకులను రంజిపజేస్తారని కొనియాడారు. నాటిక పోటీల ద్వారా ప్రజలకు సందేశాలను అందించటమే కళాకారుల విధి అని, అటువంటి నాటిక పోటీలను నిర్వహిచండంలో మయూర కళా పరిషత్ ముందున్నదన్నారు. పరిషత్ వ్యవస్థాపక కార్యదర్శి శృంగారం అప్పలాచార్యర్ పరిషత్ ముందుమాటను వివరించారు. అధ్యక్షుడు సత్తి వెంకటరెడ్డి నాటిక పోటీల విశిష్టతను వివరించారు. సినీ రంగస్థల నటుడు కృష్ణేశ్వరరావును ఘనంగా సత్కరించారు. అనంతరం నాటిక పోటీలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ‘చాలు... ఇక చాలు’, ‘మాకంటూ ఓ రోజు’ నాటికలను ప్రదర్శించారు. మున్సిపల్ చైర్మన్ మేడిశెట్టి సూర్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ జి.సూర్యనారాయణ, కమిషనర్ సిహెచ్.శ్రీరామశర్మ, పట్టణ టీడీపీ అధ్యక్షుడు నందుల రాజు, మోడరన్ విద్యా సంస్థల అధినేత జీవీ రావు, చిలుకూరి సేవా సమితి అధ్యక్షుడు చిలుకూరి వీరవెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేత అదృష్టదీపక్ వ్యవహరిస్తున్నారు. -
24 నుంచి జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు
బ్రోచర్, ఆహ్వాన పత్రిక విడుదల ఉప్పలగుప్తం (అమలాపురం) : మహాశివరాత్రి, కోనసీమ ఉత్సవ శోభ ఉత్సవాలను పురస్కరించుకుని గొల్లవిల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఈ నెల 24 నుంచి ఐదు రోజుల పాటు నిమ్మకాయల వెంకటరంగయ్య జాతీయస్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీల బ్రోచర్, ఆహ్వాన పత్రికలను బుధవారం ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప విడుదల చేశారు. గొల్లవిల్లిలోని చినరాజప్ప కల్యాణ మంటపంలో టోర్నీ అధ్యక్షుడు నిమ్మకాయల జగ్గయ్యనాయుడు అధ్యక్షతన టోర్నీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ ఈ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కొన్నేళ్లుగా అందరి సహకారంతో పోటీలు నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. ఎన్వీఆర్ వాలీబాల్ అసోసియేషన్ ద్వారా ఈ పోటీలకు పలు రాష్ట్రాల నుంచి జాతీయ క్రీడాకారులు హజరవుతారని టోర్నీ నిర్వాహకులు తెలిపారు. టోర్నీ కోశాధికారి, సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడు అరిగెల వెంకటముసలయ్య. కార్యదర్శి మద్ధింశెట్టి సుబ్బరాజు (సురేష్) మాట్లాడుతూ అంతర్జాతీయ క్రీడా ప్రమాణాలతో వాలీబాల్ కోర్టు, గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్వీఆర్ వాలీబాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గొలకోటి సత్తిరాజు, సాంకేతిక పర్యవేక్షకులు ఉండ్రు రాజబాబు, సభ్యులు షేక్ చినవలీ, సలాది సత్తిబాబు, గుర్రాల దుర్గాప్రసాద్, నిర్వాహక కార్యదర్శి గొలకోటి ఫణీంద్రకుమార్, టీడీపీ మండల అధ్యక్షుడు నిమ్మకాయల సూర్యనారాయణమూర్తి, అమలాపురం జోన్ పీఈటీల సంఘ అధ్యక్షుడు ఉండ్రు ముసలయ్య, ఎస్సై డి.రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి డీఎడ్ క్రీడాపోటీల ఓవరాల్ ఛాంప్గా ‘తూర్పు’
రాజమహేంద్రవరం రూరల్ : గుంటూరు జిల్లాలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి డీఎడ్ కళాశాలల క్రీడా, సాంస్కృతిక పోటీల్లో 55 పాయింట్లతో తూర్పు గోదావరి జిల్లా ఓవరాల్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకుందని జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) ప్రిన్సిపాల్ ఎ.జయప్రకాశరావు తెలిపారు. డైట్ కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజేతలను ఆయన అభినందించారు. బొమ్మూరు డైట్ కళాశాల విద్యార్థులు 400 మీటర్ల పరుగు రిలేలో ప్రథమ, బాలికల విభాగంలో ద్వితీయ స్థానాలు సాధించారని తెలిపారు. విజేతలను రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.నరసింహారావు, ఎస్ఎస్ఏ పీవో ఎం.శేషగిరి, డివైఈవో ఎస్.అబ్రహం, పీఈటీ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు జీవన్దాస్, ప్రైవేటు డీఎడ్ కళాశాలల ప్రతినిధులు డీవీ సుబ్బరాజు, ఆర్.విశ్వనాథరావు, ప్రభుత్వ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఐహెచ్జీఎన్ ప్రసాద్, ఐఏఎస్ఈ కళాశాల ప్రాంగణ ఉన్నత పాఠశాల హెచ్ఎం ఆర్.నాగేశ్వరరావు, డైట్ అధ్యాపకులు జె.సుబ్రహ్మణ్యం, డి.నాగేశ్వరరావు, ఆర్జేడీ రాజు, ఎ.రామకృష్ణ, కేవీ సూర్యనారాయణ, సాల్మన్రాజు, బావాజీరెడ్డి, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు. రాష్ట్రస్థాయి విజేతలు వీరే.. బాలుర వాలీబాల్ పోటీలో రత్న సలోమన్ డీఎడ్ కళాశాల (గోకవరం), కబడ్డీలో డైట్ కళాశాల (ఐటీడీఏ, రంపచోడవరం), హైజంప్లో వీవీఎస్ డీఎడ్ కళాశాల (యు.కొత్తపల్లి), 100 + 4 మీటర్ల పరుగు రిలేలో బొమ్మూరు డైట్ కళాశాల, బాలికల విభాగం 400 మీటర్ల పరుగులో సాయిరామ్ డీఎడ్ కళాశాల (పిడింగొయ్యి) ప్రథమ స్థానాలు సాధించాయని జయప్రకాశరావు తెలిపారు. చెస్లో వైవీఎస్ అండ్ బీఆర్ఎం డీఎడ్ కళాశాల (ముక్తేశ్వరం) ద్వితీయ, బాలికలు 200 మీటర్ల రన్నింగ్, పాటల పోటీల్లో డైట్ కళాశాల (ఐటీడీఏ, రంపచోడవరం), లాంగ్జంప్లో నారాయణ డీఎడ్ కళాశాల (మలికిపురం), వక్తృత్వ పోటీల్లో జీబీఽఆర్ డీఎడ్ కళాశాల (అనపర్తి), 100 + 4 మీటర్ల పరుగు రిలేలో బొమ్మూరు డైట్ కళాశాల ద్వితీయ స్థానాలు సాధించాయని వివరించారు. -
శ్రీప్రకాష్లో రాష్ట్రస్థాయి నాటిక పోటీలు ప్రారంభం
తుని : సినిమారంగంలో మహానటులుగా ప్రజల అభిమానాన్ని పొందిన ఎందరికో నాటకరంగం మాతృమూర్తి వంటిదని జూనియర్ సివిల్ జడ్జి ప్రమీలారాణి అన్నారు. పాయకరావుపేట శ్రీప్రకాష్ విద్యాసౌధంలో గురువారం రాత్రి ‘అజో- విభో కందాళం ఫౌండేషన్, శ్రీ ప్రకాష్ ఎడ్యుకేషన్, కల్చరల్ అసోసియేషన్’ సంయుక్తంగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి నాటిక పోటీలను ఆమె జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల కార్యదర్శి సీహెచ్ విజయ్ప్రకాష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తెలుగు నాటకరంగంలో ఒక విశిష్ట వ్యక్తికి చిరు సత్కారం పేరిట శ్రీ ప్రకాష్ పూర్వ విద్యార్థి, రాజస్థాన్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ తూము శివ ప్రసాద్ను సత్కరించారు. విదేశాల్లో ఉంటూ అజో విభో కందాళం ఫౌండేషన్ స్థాపించి తెలుగు నాటికలను ప్రజలకు అందించిన ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అప్పాజోస్యుల సత్యనారాయణకు అభినందనలు తెలిపారు. ఫౌండేషన్ రూపొందించిన వైజయంతి సమ్మోనోత్సవ విశేష సంచికను విజయ్ప్రకాష్, కథానాటికలు–2017 పుస్తకాన్ని దంటు సూర్యారావు ఆవిష్కరించారు. దంటు సూర్యారావు, కేఆర్జే శర్మ, ఎన్.తారకరామారావు, డి.రామకోటేశ్వరరావు, డాక్టర్ కె.వీర్రాజు, ఆహ్వానసంఘం కన్వీనర్ డీఎస్ఎన్ మూర్తి, ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్.మూర్తి పాల్గొన్నారు. తొలిరోజు ‘నాన్నా! నువ్వు సున్నావా?’, ‘గోవు మాలచ్చిమి’, ‘దగ్ధగీతం’ నాటికలను ప్రదర్శించారు. -
చిరుతల్లా.. శరాల్లా..
సత్తా చాటుతున్న డీఎడ్ విద్యార్థులు హోరాహోరీగా జిల్లాస్థాయి క్రీడాపోటీలు రాజమహేంద్రవరం రూరల్ :వారు వేట వేళ చిరుతల్లా లంఘిస్తున్నారు. సంధించిన శరాల్లా దూసుకుపోతున్నారు. వివిధ క్రీడల్లో తమ సత్తాను, వడీ, వడుపులను చాటుతూ సంభ్రమానందాలు కలిగిస్తున్నారు. బొమ్మూరులోని జిల్లా విద్యాశిక్షణాసంస్థ (డైట్)లో జిల్లాస్థాయి డీఎడ్ కళాశాలల క్రీడా, సాంస్కృతిక, సాహిత్య పోటీలు రెండవరోజు గురువారం హోరాహోరీగా సాగాయి. డైట్ ప్రాంగణంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, టెన్నికాయిట్, చెస్ పోటీలు, జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. రన్నింగ్, లాంగ్జంప్, హైజంప్, షాట్పుట్లలో విద్యార్థులు తలపడ్డారు. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. కాగా సాంస్కృతిక విభాగంలో పాటలు, ఏకపాత్రాభినయం, నృత్యపోటీలు నిర్వహించారు. పోటీలను డైట్ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.జయప్రకాశరావు, లెక్చరర్ రాయుడు, ఇతర లెక్చరర్లు, పీఈటీల అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు జీవన్దాస్, పీడీ ప్రసాద్, పీఈటీలు పర్యవేక్షించగా, ప్రైవేటు డీఎడ్ కళాశాలల కరస్పాండెంట్స్, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ఎంపిక
రాష్ట్ర టీమ్లో జిల్లా నుంచి 'ఫణీంద్ర' ప్రాతినిధ్యం వచ్చె నెల చత్తీస్ఘడ్లో పోటీలు కొత్తపేట : జాతీయ స్థాయి బాస్కెట్బాల్ అండర్ –17 పోటీలకు కొత్తపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి పాటి ఫణీంద్రసాయి ఎంపికయ్యాడు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 13,14,15 తేదీల్లో చిత్తూరులో జరిగిన రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో జిల్లా జట్టులో పాల్గొన్న ఫణీంద్రసాయి అత్యుత్తమ ప్రతిభ కనపరచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్టు పాఠశాల హెచ్ఎం జి.సూర్యప్రకాశరావు సోమవారం తెలిపారు. చత్తీస్ఘడ్ రాష్ట్రం రాజనందిగామ్లో జనవరిలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఏపీ స్టేట్ టీమ్ 12 మందిలో (6వ) స్థానానికి ఎంపికైనట్టు తెలిపారు. జాతీయ స్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో ప్రతిభ చూపుతానని ఫణీంద్రసాయి ఈ సందర్భంగా తెలిపారు. పాఠశాల పీడీ, పీఈటీ పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నాని వివరించారు. ఫణీంద్రసాయిని హెచ్ఎం జి.సూర్యప్రకాశరావు, ఎన్సీసీ ఆఫీసర్ ఉప్పలపాటి మాచిరాజు, పీడీ భమిడిపాటి అప్పాజీ, పీఈటీ పి.జ్యోతి అభినందించారు. -
జాతీయస్థాయి ప్రదర్శనకు మధుప్రియ ప్రాజెక్టు
రైతుకు ఎంతో ఉపకరించే ధాన్యం ఆరబోత యంత్రం రాష్ట్ర, దక్షిణభారతస్థాయిలలో మన్ననలందుకున్న సృజన పామర్రు(కె.గంగవరం) : పామర్రు ఉన్నత పాఠశాల విద్యార్థి అనుసూరి మధుప్రియ రూపొందించిన ధాన్యం ఆరబోసే యంత్రం ప్రాజెక్టు జాతీయస్థాయికి ఎంపికైనట్లు హెచ్ఎం ఆర్. దయామణి తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు ప్రక్కి వీర బ్రహ్మానందం మార్గదర్శకత్వంలో మధుప్రియ రూపొందించిన ప్రాజెక్టు గత ఏడాది రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రశంసలందుకుందని, అక్కడి నుంచి బెంగళూరులో నిర్వహించిన దక్షిణభారత స్థాయి ప్రదర్శనకు ఎంపికైందని తెలిపారు. ఈ నెల 13 నుంచి 19 వరకూ బెంగళూరులో నిర్వహించే 43వ జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సైన్స్, మేథమేటిక్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎగ్జిబిషన్కు ఈ ప్రాజెక్టు జిల్లా నుంచి ఒక్కటే ఎంపికైందన్నారు. ఈ సందర్భంగా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు బ్రహ్మానందం మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షాలకు తడిసిపోవడంతో ఆరుదల శాతం తక్కువగా ఉండిపోవడంతో గిట్టుబాటు ధర లేక ఆవేదన చెందడం చూసి ఈ ప్రాజెక్టును రూపొందించినట్టు తెలిపారు. విద్యుత్ మోటార్ ఆధారంగా నడిచే ఈ యంత్రం ద్వారా ధాన్యం త్వరగా ఆరిపోతుందని, కూలీల అవసరం లేకుండా ధాన్యాన్ని సులువుగా ఆరబెట్టొచ్చని అన్నారు. -
క్షీర సమరం
మండపేటలో రాష్ట్రస్థాయి పాలపోటీలు డిసెంబరు 15వ తేదీ నుంచి 17 వరకు నిర్వహణ పలు విభాగాల్లో పశువుల అందాల పోటీలు క్షీర సమరానికి మరోమారు ఆంధ్రా హర్యానా వేదికవుతోంది. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మూడు రోజులు పాటు మండపేటలో జరిగే పోటీల కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. ఐదు విభాగాల్లో పాల పోటీలు, మూడు విభాగాల్లో పశు ప్రదర్శన పోటీలు జరుగనున్నాయి. జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పాడిరైతులు తమ పాడిపశువులను పోటీలకు తీసుకువస్తారని అధికారులు భావిస్తున్నారు. - మండపేట మేలుజాతి పశు పోషణ ద్వారా ఇప్పటికే మండపేట ప్రాంతం (మండపేట, ఆలమూరు, కపిలేశ్వరపురం మండలాలు) ఆంధ్రా హర్యానాగా పేరుగాంచింది. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో జరిగిన పలు పాలపోటీల్లో ఇక్కడి రైతులు ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. మేలుజాతి పశుపోషణపై వీరికున్న మక్కువ, అవగాహన ఈ ప్రాంతానికి ఆ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. 2007 నుంచి ఇప్పటి వరకు మండపేటలో ఐదు పర్యాయాలు రాష్ట్ర స్థాయి పాల పోటీలు నిర్వహించగా ప్రస్తుతం ఆరో సారి పోటీలు జరుగుతున్నాయి. ఇందుకు మండపేటలోని మారేడుబాక రోడ్డులో గల సూర్యచంద్ర పేపర్మిల్స్ సమీపం స్థలం వేదిక కానుంది. పాల పోటీల నిర్వహణ ఇలా.. ముర్రా, జాఫర్బాది జాతి గేదెలు, ఒంగోలు, గిర్, పుంగనూరు ఆవుల విభాగాల్లో పాలపోటీలు నిర్వహిస్తున్నారు. రోజుకు 15 లీటర్లకు పైబడి పాలిచ్చే ముర్రా, జాఫర్బాది జాతి గేదెలు, 8 లీటర్లకు పైబడి పాలిచ్చే ఒంగోలు, గిర్, ఐదు లీటర్లకు పైబడి పాలిచ్చే పుంగనూరు ఆవులు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. తొలిరోజు సాయంత్రం తీసిన పాలను నమూనాగా పరిగణిస్తారు. రెండో రోజు ఉదయం, సాయంత్రం, మూడో రోజు ఉదయం పాలు తీసి ఏప్పటికప్పుడు ఎలక్ట్రానిక్ కాటాపై తూకం వేస్తారు. 20 నిముషాల వ్యవధిలోనే పాలు తీయాల్సి ఉంటుంది. తొలి రోజు నమూనా పాలదిగుబడికి తదుపరి పాలదిగుబడికి రెండు కేజీలకు పైబడి వ్యత్యాసం ఉంటే ఆ పశువును పోటీ నుంచి తొలగించనున్నట్టు పశువైద్యాధికారులు తెలిపారు. ప్రోత్సాహక బహుమతులు పాలపోటీలకు సంబంధించి ఒంగోలు ఆవులు, ముర్రా, జాఫర్ జాతుల గేదెల విభాగాల్లో ప్రధమ బహుమతి రూ.50 వేలు చొప్పున కాగా, ద్వితీయ రూ. 40 వేలు తృతీయ బహుమతిగా రూ.30 వేలు చొప్పున అందించనున్నారు. గిర్, పుంగనూరు జాతుల ఆవుల విభాగాల్లో ప్రధమ రూ. 40 వేలు చొప్పున, ద్వితీయ రూ. 30 వేలు చొప్పున, తృతీయ రూ. 20 వేల చొప్పున పాడిరైతులకు బహుమతులుగా అందజేయనున్నారు. పశు ప్రదర్శన ఒంగోలు, పుంగనూరు, గిర్ జాతుల ఆడ, మగ విభాగాల్లో ముర్రా జాతికి చెందిన ఆడ, మగ విభాగాల్లో పశుప్రదర్శన పోటీలు జరుగుతాయి. పాలపళ్లు, రెండు నుంచి నాలుగు పళ్లు వరకు, ఆరు పళ్లు, ఆపైన విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తారు. మూడు విభాగాల్లో మొదటి బహుమతిగా రూ. 10 వేలు చొప్పున, ద్వితీయ రూ. 7,500లు చొప్పున, తృతీయ రూ. 5 వేలు చొప్పున పాడిరైతులకు నగదు బహుమతులు అందజేస్తారు. -
క్రీడల్లోనూ దేశఖ్యాతిని చాటాలి
కాకినాడ రూరల్: విద్యతో పాటు క్రీడల్లో నైపుణ్యం ఉంటే దేశవ్యాప్తంగా ఖ్యాతిని పొందవచ్చని కలెక్టర్ హెచ్ అరుణ్కుమార్ స్పష్టం చేశారు. సోమవారం జిల్లా క్రీడామైదానంలో రెండు రోజులపాటు జరిగే జిల్లా స్థాయి ఖేలో ఇండియా ఆటల పోటీలను ఆయన రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మితో కలసి ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. క్రీడల్లో సచిన్ టెండూల్కర్, సైనా నెహ్వాల్, పీవీ సింధు లాంటి క్రీడాకారులు ఎంతో మంది తమ క్రీడల్లో తమ ప్రతిభను దేశ, విదేశాల్లో చాటారన్నారు. జిల్లాలో ప్రతి మండలంలోను క్రీడలను అభివృద్ధి చేసేందుకు వీలుగా రూ. 20 లక్షలు కేటాయించామన్నారు. ప్రతీ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక క్రీడా స్టేడియంలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. దీనిలో భాగంగా తుని, సామర్లకోట, కొత్తపేట, రామచంద్రపురంలో క్రీడా స్టేడియంలు నిర్మించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనంతలక్ష్మి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలు అభివృద్ధి చేసేందుకు వీలుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని అంశాలకు సంబంధించి ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నట్లు వివరించారు. అనంతరం కలెక్టర్ అరుణ్కుమార్, ఎమ్మెల్యే అనంతలక్ష్మిలు ఆర్చీరీ పోటీలను ప్రారంభించడంతో క్రీడలు ప్రారంభమయ్యాయి. వాలీబాల్, ఫుట్బాల్, హాకీ, ఖోఖో, కబడ్డీలతో పాటు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి మురళీధరన్, ఎంపీపీ పుల్ల సుధాచందు, జెడ్పీటీసీ సభ్యురాలు కాకరపల్లి సత్యవతి, జిల్లా జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మట్టా ప్రకాష్గౌడ్, వ్యాయామోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు లంక జార్జి, కోచ్లు రంగారావు, రవిరాజు, శ్రీరామమూర్తి, వ్యాయామోపాధ్యాయులు నూకరాజు, హరిబాబు, సునీత తదితరులు పాల్గొన్నారు. -
అద్భుతాల ఆవిష్కర్తలు
భవిష్యత్ టెక్నాలజీకి వారసులు విశేషంగా ఆట్టుకుంటున్న ఇన్స్పైర్ కాకినాడ రూరల్ : కాకినాడ రూరల్ మండలం వాకలపూడి హంసవాహిని విద్యాలయ వేదికగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన ఇన్ స్పైర్–2016 అలరిస్తోంది. వివిధ జిల్లాల నుంచి ఎంపిక చేసిన ప్రదర్శలు అందర్నీ ఆలోచింపజేస్తున్నాయి. శుక్రవారం ప్రారంభమైన ఈ ప్రదర్శన ఆదివారంతో ముగియనుంది. రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, యనమల రామకష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమామహేశ్వరరావు ముగింపు కార్యక్రమానికి హాజరుకానున్నారు. కలెక్టర్ హెచ్.అరుణ్కుమార్ పర్యవేక్షణలో జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.నరసింహారావు ఈ ప్రదర్శన విజయవంతం చేసేందుకు అక్కడే ఉండి సిబ్బందికి, విద్యార్థులకు వసతి తదితర ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. . జిల్లాలోని 122 పాఠశాలల నుంచి 13,500 మంది విద్యార్థులు శనివారం ప్రదర్శనను తిలకించారు. ప్రదర్శనలో ఉంచి నమూనాలను ఎన్సీఈఆర్టీ సంచాలకులు ఎం.వి.రాజ్యలక్ష్మి, డీఈవో ఆర్.నరసింహారావు తిలకించారు. విద్యార్థుల్లో సజనాత్మకత వెలికి తీసే విధంగా వినూత్నంగా అనేక పోటీలను నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ విశేషంగా అరించాయి. ఉప విద్యాశాఖాధికారులు ఆర్ఎస్ గంగాభవాని, దడాల వాడపల్లి, డి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నవర జెడ్పీ పాఠశాల ఎన్సీసీ విద్యార్థులు బందోబస్తు నిర్వహించారు. -
‘పక్షిబొమ్మల’ నాగరాజుకు రాష్ట్రస్థాయి పురస్కారం
దేవీచౌక్ : తెల్లకరత్రో పక్షి బొమ్మలను తయారు చేసే మల్లేడ నాగరాజు రాష్ట్రస్థాయి పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నెల నాలుగో తేదీన లేపాక్షి ఆధ్వర్యంలో విజయవాడలో జరగనున్న ఒక కార్యక్రమంలో నాగరాజు ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ సందర్భంగా బుధవారం నాగరాజు ‘సాక్షి’తో తన వృత్తి అనుభవాలు ఇలా పంచుకున్నారు. ‘‘రాజమహేంద్రవరం మల్లికార్జుననగర్లో మా నివాసం. మా తండ్రి కొయ్యతో అందమైన పక్షి బొమ్మలను తయారు చేసేవారు. ఆయనే నాకు ఈ వృత్తిలో గురువు. మూడు దశాబ్దాలుగా నేను దారుకొయ్యతో పక్షుల బొమ్మలను తయారు చేస్తున్నా. ఈ బొమ్మలకు మార్కెట్లో ఆదరణ ఉంది. ఇటీవల నగరంలో లేపాక్షి నగర శాఖ నిర్వహించిన ప్రత్యక్ష తయారీ, ప్రదర్శన, అమ్మకాలలో నా బొమ్మలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. నగరశాఖ మేనేజర్ షేక్సిరాజుద్దీన్ నా కళను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారు. నా కుటుంబసభ్యులు కూడా వృత్తిలో సహకరిస్తున్నారు. లేపాక్షి హస్తకళల సంస్థ ఆధ్వర్యంలో ఈనెల నాలుగో తేదీన విజయవాడలో రాష్ట్రస్థాయి పురస్కారానికి ఎంపిక కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.’ -
3 నుంచి జిల్లా స్థాయి ఇన్స్పైర్ ఎగ్జిబిషన్
భానుగుడి (కాకినాడ) : జిల్లాస్థాయి ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ ఈ నెల మూడు నుంచి ప్రారంభిస్తున్నట్లు డీఈఓ ఆర్.నరసింహారావు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఇన్స్పైర్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా శాలిపేట బాలికోన్నత పాఠశాలలో మంగళవారం సమావేశం నిర్వహించారు. డీవైఈఓ డి.వాడపల్లి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డీఈఓ మాట్లాడుతూ కాకినాడ ఏఎంజీ పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహణకు ఏర్పా ట్లు చేశామని, జిల్లా స్థాయిలో కాకినాడ, రాజమండ్రి ప్రాంతాలలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. రాజమండ్రిలో రేపటి నుంచి కాకినాడలో 3 నుంచి నిర్వహించబోయే కార్యక్రమంలో 25 మండలాల నుంచి 560 ప్రాజెక్టులు రానున్నాయని, రాజమండ్రిలో 500 ప్రాజెక్టులలో మొత్తం 1,060 ప్రాజెక్టులు ప్రదర్శితమవుతాయన్నారు. ప్రతి ప్రాజెక్టును మండల స్థాయిలో ప్రత్యేక స్క్రూట్నీ నిర్వహించి ఎంపిక చేస్తామన్నారు. డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్ ఎగ్జిబిషన్ న్యూఢిల్లీ, ఎస్సీఆర్టీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయిలో ప్రాజెక్టు తయారీకి రూ.5 వేలు విద్యార్థులకు ఇస్తారన్నారు. విజేతలుగా ఎంపికైన వారు రాష్ట్రస్థాయిలో నిర్వహించే పోటీలకు ఎంపికవుతారని, రాష్ట్రస్థాయి విజేతలు జాతీయ స్థాయిలో తమ ప్రాజెక్టులను ప్రదర్శిస్తారన్నారు. జాతీయ స్థాయిలో బెస్ట్ ప్రాజెక్టుగా నిలిస్తే వారికి ఐదేళ్లపాటు ఉన్నతవిద్యతో పాటు, ప్రత్యేక ఉపకార వేతనాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. చెవ్వూరి రవి, పుల్లయ్య, టి.రంగరావు, కేసరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. నేడు బీవీఎం స్కూల్లో ప్రారంభం కంబాలచెరువు : రాజమహేంద్రవరంలోని బీవీఎం స్కూల్లో ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తామని ఉపవిద్యాశాఖాధికారి ఎస్.అబ్రహాం తెలిపారు. స్థానిక బీవీఎం స్కూల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 26 మండలాల నుంచి సుమారు 524 పైగా ప్రదర్శనలు వస్తాయని, వీటిని మూడు రోజలు పాటు వీక్షించేలా రోజువారీ టైంటేబుల్ ఆయా స్కూళ్లకు ఇస్తామన్నారు. డీఐ అయ్యంకి తులసీదాస్, పరస జగన్నాథరావు, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
భూగర్భానికి ఊపిరి
► గత నెలలో సాధారణ వర్షపాతం కన్నా ► 32 శాతం అధికం సాక్షి, హైదరాబాద్: గత రెండేళ్లుగా ప్రతినెలా సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షాలు కురవగా ఈ సెప్టెంబర్లో మాత్రం అనూహ్యంగా అదనపు వర్షపాతం కురిసింది. సెప్టెంబర్లో సాధారణ వర్షపాతం 715 మిల్లీమీటర్లు కాగా ఏకంగా 943 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 32 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు భూగర్భ జలవిభాగం గురువారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు కాగా, మిగిలిన జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. అధికంగా హైదరాబాద్లో 60 శాతం, రంగారెడ్డిలో 48, మెదక్లో 43, నిజామాబాద్లో 42, నల్లగొండలో 37, వరంగల్లో 33, మహబూబ్నగర్లో 24, కరీంనగర్లో 21 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. ఈ వర్షాల కారణంగా రాష్ట్రంలో గణనీయంగా భూగర్భ జలాలు పెరిగాయి. ఈ ఏడాది మే నెలతో పోలిస్తే సగటున 6.64 మీటర్ల మేర వృద్ధి ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఆగస్టుతో పోలిస్తే 3.49 మీటర్లు, గతేడాదితో పోలిస్తే 2.76 మీటర్ల మేర భూగర్భ మట్టాలు పెరిగాయి. మెదక్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి ,నల్లగొండ, హైదరాబాద్లో ఆశాజనకంగా భూగర్భజలాలు పెరిగాయి. మెదక్ జిల్లాలో 8.92 మీటర్లు, హైదరాబాద్లో 4.19 మీటర్లు, నల్లగొండ జిల్లాలో 5.57 మీటర్ల చొప్పున భూగర్భ జల మట్టాలు పెరిగాయి. ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రం 0.91 మీటర్ల జలమట్టం తగ్గిపోయింది. రాష్ట్రంలో 65 మండలాల్లో 2 మీటర్లలోనే భూగర్భ జలాలుండగా, 70 మండలాల్లో 2 నుంచి 5 మీటర్లలో నీటి లభ్యత ఉంది. 95 మండలాల్లో 5 నుంచి 10 మీటర్లలోపు, 113 మండలాల్లో 10 నుంచి 20 మీటర్లలోపు, 56 మండలాల్లో 20 మీటర్ల కింద జలాలున్నాయి. ఇందులో మెదక్లో 15, మహబూబ్నగర్లో 14, నల్లగొండలో 11, నిజామాబాద్లో 7 మండలాలు ఉన్నాయి. -
జాతీయ స్థాయి విలువిద్య పోటీలకు హర్షి్వత
చింతూరు : మండలానికి చెందిన ఓ గిరిపుత్రిక అండర్ – 7 విభాగంలో జాతీయస్థాయి విలువిద్య పోటీలకు ఎంపికైంది. చింతూరులోని శాంతి స్కూల్లో రెండో తరగతి చదువుతున్న సున్నం హర్షి్వత నవంబరులో జరుగనున్న జాతీయస్థాయి విలువిద్య పోటీలకు అర్హత సాధించింది. 8, 9 తేదీల్లో కృష్ణాజిల్లా నూజివీడులో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో మూడో స్థానం సాధించడం ద్వారా హర్షి్వత జాతీయస్థాయికి ఎంపికైనట్టు తండ్రి సున్నం వెంకటరమణ తెలిపారు. హర్షి్వత, ఆమె సోదరి జోషిత కాకినాడలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవగా రాష్ట్రస్థాయి పోటీల్లో అండర్ – 7 విభాగంలో హర్షి్వత మూడోస్థానం, అండర్ – 14 విభాగంలో జోషిత ఆరో స్థానంలో నిలిచారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి కరాటే పోటీలు
పెనుబల్లి : స్థానిక సప్తపది ఫంక్షన్హాల్లో జరిగిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల కరాటే పోటీలు ఆదివారం ముగిశాయి. విజేతలకు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరాటేను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. పెనుబల్లి లాంటి మారుమూల ప్రాంతాల్లో కరాటేను ప్రజల్లోకి తీసుకెళ్లిన కరాటే మాస్టర్ శ్రీకాంత్ను ఆభినందించారు. మహిళల ఆత్మరక్షణకు కరాటే ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. అనంతరం తుదిపోరును తిలకించారు. అంతకుముందు ఈ పోటీలను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు. కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కరాటే మాస్టర్లు, స్థానిక నాయకులు మట్టా దయానంద్ విజయ్కుమార్, చెక్కిలాల లక్ష్మణ్రావు, చీకటి రామారావు, చెక్కిలాల మోహన్రావు, ముక్కర భూపాల్రెడ్డి, కీసర శ్రీనివాస రెడ్డి, పిల్లి నవజీవన్, అలుగోజు చినస్వామి పాల్గొన్నారు. -
‘లెవల్’ తగ్గింది..!
ఖమ్మం బీఎస్ఎన్ఎల్ స్థాయి కుదింపు ‘పీజీఎం’ నుంచి ‘టీడీఏం’కు మార్పు ఇక వరంగల్లోనే కీలక అధికారి బీఎస్ఎన్ఎల్..మారుమూల ఊరికి పోయినా సిగ్నల్ ఉంటుందనే నమ్మకం..ప్రభుత్వానిదనే భరోసా..ఒకప్పుడు ఎంత గొప్పగా చెప్పుకున్నా..క్రమేణా ఆ ఖ్యాతి మసకబారుతోంది. జిల్లాలో వందల టవర్లున్నా..కొత్తగా మంజూరవుతున్నా..నిధులు కేటాయిస్తున్నా..సెల్ఫోన్ వినియోగదారులు మాత్రం పెరగడం లేదు. ఆశించినంత ఆదాయం రావడం లేదు. దీంతో..ఈ శాఖలో జిల్లా ఉన్నతస్థాయి హోదా అధికారి పోస్టుకు వరంగల్కు తరలిపోతోంది. ఇకపై పర్యవేక్షణంగా ఓరుగల్లు నుంచే సాగనుంది. ఖమ్మం గాంధీచౌక్: భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) ఖమ్మం శాఖలో ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ (పీజీఎం) స్థాయి పడిపోతోంది. ఇంత వరకు ఇక్కడున్న ఈ విభాన్ని ఇకపై వరంగల్కు తరలించనున్నట్లు తెలిసింది. రాష్ట్ర విడిపోయాక..రెండు సర్కిళ్లుగా విభజిస్తున్నారు. అక్టోబర్ నుంచి ప్రత్యేక సర్కిల్ ఆవిర్భవించనుంది. ఈ క్రమంలో జిల్లాలో ఆశించినంత ఆదాయం రావడం లేదని ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ స్థాయిలో ఉన్న ఖమ్మం బీఎస్ఎన్ఎల్ను ఆ స్థాయిని తగ్గించి వరంగల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పరిధిలోకి చేర్చాలని కేంద్ర టెలికం కార్పొరేట్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. పాలనా, ప్రణాళిక విభాగం మొత్తం అక్కడి పరిధిలోకి వెళ్లనున్నాయి. ఖమ్మంలో టెలికం డిస్ట్రిక్ట్ మేనేజర్ (టీడీఎం) కార్యాలయం మాత్రమే ఉండనుంది. తగ్గిన ఫాయిదా..పోతున్న హోదా – జిల్లాలో ల్యాండ్లైన్లు 22 వేలు మాత్రమే ఉన్నాయి. – మొబైల్ కనెక్షన్లు 2.50 లక్షలు. – మొత్తం 200 టవర్లు ఉన్నాయి. – జిల్లా విస్తీర్ణాన్ని బట్టి మరో 100 టవర్లను మంజూరయ్యాయి. – నిధులు వెచ్చిస్తున్నా ఆదాయం మాత్రం పెరగడం లేదు. – గతంలో నెలకు రూ.2 కోట్ల ఆదాయం వచ్చేది. – ప్రస్తుతం రూ.1.40 కోట్లకు పడిపోయింది. అధికారులుండే..ఫలితం రాకుండే.. ప్రైవేట్ నెట్వర్క్ సంస్థలతో పోల్చితే జిల్లా బీఎస్ఎన్ఎల్ మార్కెటింగ్లో బాగా వెనకబడి ఉంది. బీఎస్ఎన్ఎల్లో 140 మంది అధికారులకు గాను ప్రస్తుతం 120 మంది పని చేస్తున్నారు. ఇక గ్రూప్ సీ, డీ విభాగాల్లో 700 మందికి గాను 450 మందితోనే నెట్టుకొస్తున్నారు. కోట్లాది రూపాయల విలువైన సాంకేతిక పరిఙ్ఞానం, కార్యాలయాలు ఉన్నా..ఖమ్మం బీఎస్ఎన్ఎల్కు అన్ని హంగులున్నా స్థాయిని తగ్గించటంపై అధికారులు అసంతృప్తి చెందుతున్నారు. రెవెన్యూ లోటు స్వయంకృతాపరాదమేననే విమర్శలొస్తున్నాయి. -
రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలకు నేమాం విద్యార్థులు
నేమాం (కాకినాడ రూరల్) : జిల్లా క్రీడామైదానంలో మంగళవారం జరిగిన స్కూల్ గేమ్స్ అండర్ 17, అండర్–14 విభాగాల్లో జరిగిన స్విమ్మింగ్ ఎంపిక పోటీల్లో నేమాం జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్ –17 విభాగంలో ఎం.శంకరనారాయణ, పి.రాజు, అండర్–14 విభాగంలో ఎస్.దుర్గా ప్రసాద్ ఎంపికయ్యారు. వీరు విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వ్యాయామోపాధ్యాయుడు వి.మాచర్రావు తెలిపారు. పోటీలకు ఎంపికైన విద్యార్థులను గ్రామసర్పంచ్ కాటూరి కొండబాబు, టీడీపీ మండల అధ్యక్షులు రామదేవు సీతయ్యదొర, హైస్కూలు హెచ్ఎం వీవీ రమణ, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు. నాగులాపల్లి జెడ్పీ హైస్కూలు విద్యార్థులు.. కొత్తపల్లి : కొత్తపల్లి మండలం నాగులాపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలకు ఎంపికైనట్లు బుధవారం ప్రధానోపాధ్యాయుడు బీఆర్వీ ప్రసాద్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఎస్.మహేష్, ఎస్.మైకేల్, ఎస్.ఉమామహేశ్వరరావు, జి.ఉమేంద్రలను మండల ఉపాధ్యక్షుడు అనిÔð ట్టి సత్యానందరెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా సత్యానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో కూడా Vð లుపొంది గ్రామానికి మంచి పేరు తేవాలన్నారు. ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ స్విమ్మింగ్ వలన మంచి ఆరోగ్యం కూడా లభిస్తుందన్నారు. అదే విధంగా వ్యాయామోపాధ్యాయురాలు పి.హరిమాలిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సీసీఆర్టీ ప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి స్కూల్గేమ్స్కు 16 మంది ఎంపిక
మామిడికుదురు: రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలకు మామిడికుదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 16 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. కాకినాడలో మంగళవారం జరిగిన అర్హత పోటీల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా వీరిని ఎంపిక చేశారని ప్రధానోపాధ్యాయుడు జేఎన్ఎస్ గోపాలకృష్ణ బుధవారం విలేకర్లకు తెలిపారు. అండర్–14 ఆర్చరీ పోటీలకు గుత్తుల నాగకృష్ణశ్రీరామ్, బడుగు గోపీచంద్, పుల్లేటికుర్తి యశ్వంత్, చీకురుమిల్లి ఉమ, చీకురుమిల్లి జ్యోతి, పమ్మి రేఖ, కడలి నాగదుర్గ, అండర్–17 ఆర్చరీ పోటీలకు పితాని ఉదయ్కిరణ్, చీకురుమిల్లి కేశవ, మద్దాల లోకేష్నాగబాబు, మట్టపర్తి వెంకటసత్యప్రభు, బొక్కా బేబీసుమ, అండర్–17 తైక్వాండో పోటీలకు సీహెచ్ స్వర్ణరేఖ, హెచ్కే సౌలత్, పి.తేజ, అండర్–17 రెజ్లింగ్ పోటీలకు మద్దాల లక్ష్మీగణేష్ ఎంపికయ్యారని చెప్పారు. రెజ్లింగ్ పోటీలు కృష్ణా జిల్లాలో త్వరలో జరుగుతాయని, మిగిలిన పోటీలు చిత్తూరు జిల్లాలో జరుగుతాయని తెలిపారు. ఎంపికైన విద్యార్థులను ఆయన, పీడీ వి.శ్రీనివాస్, పీఈటీ పి.విజయ్ప్రకాశ్, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు. -
11న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికలు
బోట్క్లబ్(కాకినాడ): జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11న స్థానిక రంగరాయ మెడికల్ కళాశాల క్రీడామైదానంలో బాలబాలికలకు అథ్లెటిక్ క్రీడాంశాల్లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక జరుగుతుందని కార్యదర్శి సీహెచ్వీవీ రమణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–14, 16, 18, 20 బాలబాలికలు ఈ ఎంపిక పోటీలలో పాల్గొనవచ్చునన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 15 నుంచి 17 వరకూ విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఎంపికకు హాజరయ్యే క్రీడాకారులు అసోసియేషన్ నిర్వాహక కార్యదర్శి స్పర్జన్రాజును సంప్రదించాలన్నారు. 14న బ్యాడ్మింటన్, చెస్, ఆర్చరీ, బాక్సింగ్ పోటీలకు ఎంపిక స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–19 బాల్ బ్యాడ్మింటన్, చెస్, ఆర్చరీ, బాక్సింగ్ టీమ్ ఎంపిక ఈ నెల 14న రామచంద్రపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతుందని ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి వై.తాతబ్బాయి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1997 జనవరి ఒకటి తరువాత జన్మించిన వారు ఈ ఎంపికలకు అర్హులన్నారు. హాజరయ్యేవారు సంబంధిత ధృవపత్రాలు తీసుకురావాలని సూచించారు. -
రెజ్లింగ్లో రాష్ట్రస్థాయిలో ప్రథమం
పిఠాపురం టౌన్ : స్థానిక హనుమంతరాయ జూనియర్ కళాశాల విద్యార్థి మేడిశెట్టి కళ్యాణరావు రెజ్లింగ్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించాడు. గత నెల 28, 29 తేదీల్లో కాకినాడలో జరిగిన ఏపీ మూడో సబ్ జూనియర్స్ అంతర్ జిల్లాల రెజ్లింగ్ పోటీలు 58 కేజీల విభాగంలో అతడు రాష్ట్రస్థాయి ప్రథమ స్థానం సాధించి, స్వర్ణ పతకం అందుకున్నాడు. తద్వారా వచ్చే ఏడాది జనవరిలో జరిగే జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు అర్హత సాధిచాడు. కళ్యాణరావును కళాశాల ప్రిన్సిపాల్ డి.గంగామహేష్, వైస్ ప్రిన్సిపాల్ ఎ.ఆనంద్, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు. -
అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకురావాలి
సూర్యాపేట సూర్యాపేట మున్సిపాలిటీకి అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతులు తీసుకురావాలని మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక అన్నారు. గురువారం సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై సుమారు 200 మంది పారిశుద్ధ్య కార్మికులకు రాఖీ కట్టిన అనంతరం ప్రసంగించారు. కార్మికుల్లో సోదరభావం పెంపొందించడంతో పాటు ప్రజల్లో పారిశుద్ధ్య కార్మికుల పట్ల గౌరవం పెరిగే విధంగా కృషి చేస్తున్నామన్నారు. కార్మికులు నిత్యం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషిచేస్తున్నారని వారిని సోదరసోదరీమణులుగా భావించి తెలంగాణ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా సూర్యాపేట మున్సిపాలిటీ తరపున రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఇదే స్ఫూర్తితో కార్మికులు పారదర్శకంగా పనిచేసి తమ విధులను నిర్వహించి మున్సిపాలిటీకి అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు తమ వంతు బాధ్యత నెరవేర్చాలని తెలిపారు. సీఎం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారన్నారు. ఇచ్చిన మాట తప్పే వ్యక్తి సీఎం కేసీఆర్ కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ సిబ్బందికి జీఓ 14 ప్రకారం పెంచిన వేతనాన్ని బకాయిలతో సహా చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ చైర్పర్సన్ గండూరి ప్రవళికకు టీఆర్ఎస్కేవీ నాయకులు సయ్యద్ సమ్మి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు గండూరి ప్రకాష్, వైస్ చైర్పర్సన్ నేరెళ్ల లక్ష్మి, ఆకుల లవకుశ, బైరు దుర్గయ్యగౌడ్, షేక్ తాహేర్పాషా, రంగినేని ఉమ, వల్దాసు దేవేందర్, రాంబాయమ్మ, రాధిక, నర్సింహ, స్వరూపరాణి, మున్సిపల్ అధికారులు రాంచందర్, విద్యాసాగర్, విజయేందర్రెడ్డి, వెంకటేశ్వరరావు, సారగండ్ల శ్రీనివాస్, సూర్గి శంకర్గౌడ్, గౌస్, సయ్యద్సమ్మి తదితరులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకురావాలి
సూర్యాపేట సూర్యాపేట మున్సిపాలిటీకి అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతులు తీసుకురావాలని మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక అన్నారు. గురువారం సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై సుమారు 200 మంది పారిశుద్ధ్య కార్మికులకు రాఖీ కట్టిన అనంతరం ప్రసంగించారు. కార్మికుల్లో సోదరభావం పెంపొందించడంతో పాటు ప్రజల్లో పారిశుద్ధ్య కార్మికుల పట్ల గౌరవం పెరిగే విధంగా కృషి చేస్తున్నామన్నారు. కార్మికులు నిత్యం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషిచేస్తున్నారని వారిని సోదరసోదరీమణులుగా భావించి తెలంగాణ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా సూర్యాపేట మున్సిపాలిటీ తరపున రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఇదే స్ఫూర్తితో కార్మికులు పారదర్శకంగా పనిచేసి తమ విధులను నిర్వహించి మున్సిపాలిటీకి అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు తమ వంతు బాధ్యత నెరవేర్చాలని తెలిపారు. సీఎం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారన్నారు. ఇచ్చిన మాట తప్పే వ్యక్తి సీఎం కేసీఆర్ కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ సిబ్బందికి జీఓ 14 ప్రకారం పెంచిన వేతనాన్ని బకాయిలతో సహా చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ చైర్పర్సన్ గండూరి ప్రవళికకు టీఆర్ఎస్కేవీ నాయకులు సయ్యద్ సమ్మి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు గండూరి ప్రకాష్, వైస్ చైర్పర్సన్ నేరెళ్ల లక్ష్మి, ఆకుల లవకుశ, బైరు దుర్గయ్యగౌడ్, షేక్ తాహేర్పాషా, రంగినేని ఉమ, వల్దాసు దేవేందర్, రాంబాయమ్మ, రాధిక, నర్సింహ, స్వరూపరాణి, మున్సిపల్ అధికారులు రాంచందర్, విద్యాసాగర్, విజయేందర్రెడ్డి, వెంకటేశ్వరరావు, సారగండ్ల శ్రీనివాస్, సూర్గి శంకర్గౌడ్, గౌస్, సయ్యద్సమ్మి తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీకి వరద ముప్పు!?
న్యూఢిల్లీః యమునా నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. హర్యానాలోని హతిన్ కుంద్ బ్యారేజీ వద్ద భారీ మొత్తంలో నీటిని ఒక్కసారిగా కిందికి వదలడంతో ఢిల్లీ ప్రాంతంలో యమునా నది ప్రమాదస్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో రాజధాని ఢిల్లీకి వరద ముప్పు ఏర్పడటంతో నిర్వాసితులను ఖాళీ చేయించేందుకు ఢిల్లీ ప్రభుత్వం అనేక మోటార్ బోట్లను రంగంలోకి దింపింది. ఉత్తర భారతంలో కురిసిన వర్షాల కారణంగా యమునానది పొంగి ప్రవహిస్తోంది. సాధారణ నీటిమట్టం 204.22 మీటర్లను దాటి ప్రమాదస్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో దేశరాజధాని ఢిల్లీకి వరద ముప్పు ఏర్పడింది. ముప్పును ఎదుర్కొనేందుకు అంతా అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యమునా నది నీటిమట్టం సాధారణ స్థాయి 204 మీటర్లు. 204.83 మీటర్లు ప్రమాద స్థాయిగా గుర్తిస్తారు. 1978 సంవత్సరంలో రికార్డు స్థాయిలో యమునానది నీటిమట్టం 207.49 మీటర్లకు చేరింది. ప్రస్తుతం నీటిమట్టం మొదట్లో భారీగా పెరిగినప్పటికీ వర్షాలు అంతగా లేకపోవడంతో క్రమంగా తగ్గుతూ వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆదివారం హతిన్ కుంద్ బ్యారేజీనుంచి 1,60,000 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేసినట్లు వారు వెల్లడించారు. నదీ ప్రవాహంతో హస్తినలో వదర ముప్పు ఉండటంతో గతవారం నగర ఇరిగేషన్ మరియు వరద నియంత్రణ విభాగం బాదర్ పూర్, బురారీ, సోనియా విహార్, జగత్ పూర్, సుర్ ఘర్ వజీర్పుర్, బోట్ క్లబ్, గీతా కాలనీ, షంషాన్ ఘాట్, హైతీ ఘాట్, చిల్లా విలేజ్, మయూర్ విహార్, బట్లా హౌస్, కలింది కుంజ్, బవానా నెహర్ ప్రాంతాల్లో 18 మోటార్ పడవలను మొహరించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ బోట్లను అక్కడినుంచీ తరలించవద్దని హెచ్చరించింది. -
రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు ప్రారంభం
-
కాలుష్యాన్ని దూరంచేసే 'హెల్ప్ ఛాట్'
ప్రస్తుత వాతావరణంలో ఏర్పాడుతున్నపొల్యూషన్ నిరోధించేందుకు ప్రభుత్వం ప్రజలతో కలిసి తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్పుడు కొత్తగా మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన 'హెల్ప్ ఛాట్' యాప్ భారతీయ పౌరులకు వాయు కాలుష్యం నాణ్యత, స్థాయిలను తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. పొల్యూషన్ నుంచి విముక్తిని పొందేందుకు హెల్ప్ ఛాట్ ఉపయోగ పడుతుంది. తమ పరిసరాల్లోని వాతావరణంలో గాలి నాణ్యతను పరిశీలించే సామర్థ్యాన్నిఈ యాప్ కలిగి ఉంది. వినియోగదారులు ఒకవేళ విషపూరితమైన శ్వాసను పీలుస్తుంటే... ఈ యాప్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివిధ మార్గాల్లో సూచిస్తుంటుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ద్వారా 0 (జీరో) నుంచి 500 దాకా వాయు నాణ్యతను గుర్తిస్తుంది. అంటే కాలుష్యం పూర్తిగా లేనప్పుడు జీరో నుంచి అత్యంత కాలుష్య పూరిత మైన గాలి ఉన్నపుడు 500 వరకూ నాణ్యతను ఈ యాప్ తెలుపుతుంది. అంతేకాదు గాలి నాణ్యతను బట్టి వినియోగదారుల స్మార్ట్ ఫోన్ కు ముందు జాగ్రత్త హెచ్చరికను కూడా పంపుతుంది. నగరాల్లో పొల్యూషన్ ఉన్న ప్రాంతాలను, నష్టాన్ని కలిగించే ప్రాంతాలను ఈ యాప్ సూచిస్తుంది. ఊపిరితిత్తులకు నష్టం కలిగించే, అనారోగ్యాన్ని తెచ్చిపెట్టే కొన్ని కెమికల్స్ ను కూడా ఇందులోని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) సూచిక గుర్తిస్తుంది. స్థానిక వాతావరణ పరిస్థితులను ట్రాక్ చేసి, సరైన సమయంలో వినియోగదారులకు అందిస్తుంది. ఎయిర్ పొల్యూషన్ తో బాధపడుతున్నప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు సహాయపడే ఈ అనువర్తనాన్నిఅభివృద్ధిపరచాలని అనుకున్నామని, మేమిచ్చే ముందు జాగ్రత్త హెచ్చరికలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నామని హెల్స్ ఛాట్ రూపకర్త, సీఈవో అంకుర్ సింగ్లా చెప్తున్నారు. గాలిలోని కార్బన్ మోనాక్సైడ్, వోలాటైల్ వంటివి పీల్చుకోవడం వల్ల గొంతు, ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధులు రావడమే కాక గుండె నొప్పి, లివర్, బ్రెయిన్ డ్యామేజ్ కూడ జరిగే ప్రమాదం ఉంది. క్యాన్సర్ కు కూడా ఈ కెమికల్స్ కారణమౌతాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ హెల్ప్ ఛాట్ ముఖ్యంగా పొల్యూషన్ అధికంగా ఉండే ఢిల్లీ వంటి నగరాల్లో ఉపయోగపడుతుంది. ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్య సమస్య తీర్చడానికి, మా ప్రయత్నంలో హెల్స్ ఛాట్ ఒక భాగమని అంకుర్ చెప్తున్నారు. త్వరలో దేశంలోని అన్ని నగరాలకు సంబంధించిన పొల్యూషన్ రికార్డును సేకరించి హెల్స్ ఛాట్ ను అభివృద్ధి పరుస్తామని అంటున్నారు. ఈ హెల్ప్ ఛాట్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. -
కలగా హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం
ఝరాసంగం, న్యూస్లైన్ : మండలంలోని ఏడాకులపల్లి గ్రామ సమీపంలో నిర్మిస్తున్న ైెహ లెవల్ బ్రిడ్జి నిర్మాణం కలగానే మిగిలిపోయేలా ఉంది. ఏడాది కింద ప్రభుత్వం ప్రత్యేక ప్రాజెక్టు కింద రూ. 2 కోట్ల 45 లక్షలను విడుదల చేసింది. ఈ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపారు. బ్రిడ్జి నిర్మాణం కోసం మొదట జేసీబీలతో గుంతలు తీశారు. పనులు చురుగ్గా సాగుతున్న సమయంలో వర్షాలు కురిసి నీరంతా గుంతల్లోకి చేరడంతో పనులు ముందుకు సాగ లేదు. తరువాత ఎండకాలంలో కూడా కాంట్రాక్టర్లు పనులు చేపట్టలేదు. ప్రస్తుతం మళ్లీ వర్షాకాలం మొదలైంది. దీంతో పనులు చేపట్టే అవకాశం లేదు. పనులు ఎప్పుడు ప్రారంభిస్తారా? బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు పూర్తి అవుతుందా? అని గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు కూడా శిథిలావస్థకు చేరుకోవడంతో అందులో గ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్నారు. మండల పరిధిలోని జీర్లపల్లి గ్రామ సమీపంలో సైతం హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి అయినా అప్రోచ్ రోడ్డు పనులు అసంపూర్తిగా ఉండడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే నోటీసులిచ్చాం బ్రిడ్జి నిర్మాణంలో జాప్యానికి గల కారణాలపై ఇప్పటికే సంబంధిత కాంట్రాక్టర్కు నోటీసులి చ్చాం. ఏడాది క్రితం పనులు ప్రారంభించినా అ ప్పుడే వర్షాలు పడడం, దీనిని తోడు గోతుల్లో వ ర్షపు నీరు నిల్వ ఉండడంతో పనులు చేయలేకపోయారు. ప్రస్తుతం నీటిని మోటార్ల ద్వారా తోడి పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్ను ఆదేశించాం. - గంగాధర్, డీఈ