Manushi Chhillar
-
కవ్వించే అందాలతో మానుషి చిల్లర్ ఫొటోస్..రోజు రోజుకు పెంచేస్తుందిగా!
-
హెచ్టీ ఇండియాస్ మోస్ట్ స్టైలిష్ అవార్డుల వేడుకలో తారల సందడి (ఫొటోలు)
-
ప్రముఖ డిజైనర్ దుస్తుల్లో రాయల్లుక్లో మెరిసిన తారలు
ముంబైలో ఫ్యాషన్ టూర్–2025 సందర్భంగా టైగర్ ష్రాఫ్ . మానుషి చిల్లర్ అద్భుతంగా కనిపించారుముంబైలో జరిగిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ లో బాలీవుడ్ తారలు టైగర్ ష్రాఫ్ ,మానుషి చిల్లర్ అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలియాని డిజైన్ చేసిన డిజైనర్ దుస్తుల్లో ర్యాంప్ వ్యాక్ చేశారు.శనివారం రాత్రి బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ ముంబైలో అద్భుతంగా జరిగింది. తరుణ్ తహిలియాని కోచర్ మాస్టర్ క్లాస్ లో టైగర్ ష్రాఫ్ మానుషి చిల్లర్ అద్భుతంగా కనిపించారు టైగర్ ఎంబ్రాయిడరీ సూట్లో, మనుషి పాస్టెల్ లెహంగాలో ఆకట్టుకున్నారు. ట్రెడిషనల్ హ్యాండ్మేడ్, సమకాలీన ఫ్యాషన్ ట్రెండ్ పరిపూర్ణ సమ్మేళనంతో రూపొందించిన దుస్తుల్లో మోడల్స్ హైలైట్గా నిలిచారు. ముఖ్యంగా టైగర్, మానుషి ఇద్దరూ ఆత్మవిశ్వాసం, అధునాతనతకు ప్రతి రూపాలుగా ఫ్యాషన్ ఔత్సాహికులను ఆశ్చర్యపరిచారు. ఈ ఫ్యాషన్టూర్కి సంబంధించిన వీడియోను తరుణ్ తహిలియానీ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Tarun Tahiliani (@taruntahiliani)ఇదీ చదవండి: సిక్స్ ప్యాక్ పెళ్లికూతురు, ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది! టైగర్ ష్రాఫ్ డీప్ ప్లంజింగ్ సిల్క్ షర్ట్, ఫిట్టెడ్ బ్లాక్ ప్యాంటుతో కూడిన బ్లాక్ ఎంబ్రాయిడరీ సూట్లో మెరిశాడు. ముఖ్యంగా అతని పొడవైన, నల్ల జాకెట్, సంక్లిష్టమైన అలంకరణలు,బోల్డ్ కళ్ళజోడు ,లేయర్డ్ బంగారు ఆభరణాలతో మెరిసిపోతూ రాజ వైభవాన్ని తెచ్చిపెట్టింది.మరోవైపు, మనుషి చిల్లార్ మృదువైన పాస్టెల్-రంగు లెహంగాలో ఆధునిక మహారాణిలా కనిపించింది. విలాసవంతంగా ఎంబ్రాయిడరీ చేయబడిన స్కర్ట్ అద్భుతంగా కనిపించింది. హెరిటేజ్ పోల్కి, పచ్చ ఆభరణాలతో విశేషంగా నిలిచాయి. చోకర్ ,మాంగ్ టిక్కాతో సహా, సొగసైన బన్ ఆమె రూపానికి రాయల్ లుక్ తీసుకొచ్చింది. -
పచ్చని పొలాల్లో బిగ్బాస్ దివి.. బీచ్లో మానుషి చిల్లర్ చిల్!
శిల్పా శిరోద్కర్తో నమ్రతా స్పెషల్ పిక్స్..ఆరెంజ్ డ్రెస్లో సోనియా ఆకుల అదిరిపోయే లుక్స్..బీచ్లో చిల్ అవుతోన్న అందాల భామ మానుషి చిల్లర్..లైగర్ భామ అనన్య పాండే బ్యూటీ..పచ్చని పొలాల్లో ఎదురుచూస్తోన్న బిగ్బాస్ దివి.. View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Soniya Akula (@soniya_akula_official) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
Christmas 2024: సెలబ్రిటీలు, క్రిస్మస్ ట్రీ , ఇంటి ముస్తాబు
-
మానుషి చిల్లర్ బెడ్రూం పోజులు.. డైమండ్ లాంటి నవ్వు (ఫొటోలు)
-
ఇంతందం తెలుగు తెరకు మళ్లిందా...
ఒకరు కాదు... ఇద్దరు కాదు... ముగ్గురు కాదు... నలుగురు కాదు... ఏకంగా పదిహేను మందికి పైగా కొత్త కథానాయికలు ఈ ఏడాది తెలుగు తెరపై మెరిశారు. ‘ఇంతందం తెలుగు తెరకు మళ్లిందా..’ అన్నట్లు గత ఏడాదితో పోల్చితే 2024లో ఎక్కువమంది తారలు పరిచయం అయ్యారు. ఇక ఈ ఏడాది తెలుగు తెరపై కనిపించిన ఆ నూతన తారల గురించి తెలుసుకుందాం.ఒకే సినిమాతో దీపిక... అన్నా బెన్ బాలీవుడ్లో అగ్ర కథానాయికల్లో ఒకరైన దీపికా పదుకోన్ ఈ ఏడాది తెలుగు తెరకు పరిచయం అయ్యారు. నటిగా కెరీర్ మొదలుపెట్టిన పదిహేడేళ్లకు ‘కల్కి 2898 ఏడీ’ మూవీతో దీపికా పదుకోన్ తెలుగు తెరపై కనిపించారు. హీరో ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ మైథలాజికల్ మూవీలోని సుమతి పాత్రలో అద్భుతంగా నటించారు దీపికా పదుకోన్. గర్భవతిగా ఓ డిఫరెంట్ రోల్తో తెలుగు ఎంట్రీ ఇచ్చారామె. సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదలై, బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇక ఇదే సినిమాతో మలయాళ నటి అన్నా బెన్ కూడా పరిచయమయ్యారు. ఈ సినిమాలో కైరాగా కనిపించింది కాసేపే అయినా ఆకట్టుకున్నారు అన్నా బెన్. డాటర్ ఆఫ్ శ్రీదేవి దివంగత ప్రముఖ తార శ్రీదేవి తెలుగు వెండితెర, ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ 2018లో ‘ధడక్’ సినిమాతో హిందీలో నటిగా కెరీర్ను ప్రారంభించారు. అప్పట్నుంచి జాన్వీ తెలుగులో సినిమా చేస్తే బాగుంటుందని తెలుగు ప్రేక్షకులు అభిలషించారు. వీరి నీరిక్షణ ‘దేవర’ సినిమాతో ఫలించింది. హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన ‘దేవర’లో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో తంగమ్ పాత్రలో నటించారామె. కల్యాణ్రామ్ సమర్పణలో కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 27న విడుదలైంది. అలాగే ఇదే సినిమాతో నటి శ్రుతీ మరాఠే కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ‘దేవర’ సినిమాలో దేవర పాత్రకు జోడీగా శ్రుతి, వర పాత్రకు జోడీగా జాన్వీ కపూర్ నటించారు. భాగ్యశ్రీ బిజీ బిజీ పరభాష హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పుడు, తొలి సినిమాకే వారి పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవడం చాలా అరుదు. కానీ తన తొలి తెలుగు సినిమా ‘మిస్టర్ బచ్చన్’లోని తన పాత్ర జిక్కీకి భాగ్యశ్రీ బోర్సే డబ్బింగ్ చెప్పారు. హీరో రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాను టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఆగస్టులో విడుదలైన ఈ సినిమాలో ఓ కమర్షియల్ హీరోయిన్ రోల్ భాగ్యశ్రీకి దక్కింది. తెరపై మంచి గ్లామరస్గా కనిపించారు. భాగ్యశ్రీ నటన, అందానికి మంచి మార్కులే పడ్డాయి. అందుకే ఆమె దుల్కర్ సల్మాన్, రామ్ చిత్రాల్లో హీరోయిన్గా నటించే అవకాశాలను అందుకున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలతో భాగ్యశ్రీ బిజీ. తెలుగు తెరపై మిస్ వరల్డ్ మిస్ వరల్డ్ (2017) మానుషీ చిల్లర్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయం అయ్యారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటించగా, శక్తి ప్రతాప్సింగ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో ఓ కమాండర్ రోల్లో నటించారు మానుషి. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా హీరో వరుణ్ తేజ్కు హిందీలో తొలి సినిమా కాగా, మానుషీకి తెలుగులో తొలి సినిమా. సోనీ పిక్చర్స్, సిద్ధు ముద్దా నిర్మించిన ఈ చిత్రం మార్చి 1న విడుదలైంది. ఎప్పుడో కాదు... ఇప్పుడే! గత ఏడాది తెలుగులో అనువాదమైన కన్నడ చిత్రాలు ‘సప్తసాగరాలు దాటి’ ఫ్రాంచైజీలో మంచి నటన కనబరిచి తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు కన్నడ హీరోయిన్ రుక్మిణీ వసంత్. అప్పట్నుంచి రుక్ష్మిణి వసంత్ ఫలానా తెలుగు సినిమా సైన్ చేశారంటూ రకరకాల వార్తలు వచ్చాయి. అగ్ర హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ సడన్గా నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాతో రుక్మిణీ వసంత్ టాలీవుడ్ ఎంట్రీ ఈ ఏడాదే జరిగిపోయింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 8న విడుదలైంది. కాగా హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాలోని హీరోయిన్ పాత్ర రుక్మిణీ వసంత్కు దక్కిందని తెలిసింది. ఒకేసారి మూడు సినిమాలు ఓ హీరోయిన్ కెరీర్లోని తొలి మూడు సినిమాలు ఒకే ఏడాది విడుదల్వడం అనేది చిన్న విషయం కాదు. హీరోయిన్ నయన్ సారికకు ఇది సాధ్యమైంది. అనంద్ దేవరకొండ నటించిన ‘గంగం గణేషా’, నార్నే నితిన్ ‘ఆయ్’, కిరణ్ అబ్బవరం ‘క’ సినిమాల్లో నయన్ సారిక హీరోయిన్గా నటించగా, ఈ మూడు సినిమాలు 2024లోనే విడుదలయ్యాయి. ఇందులో ‘ఆయ్, ‘క’ సినిమాలు సూపర్హిట్స్గా నిలవగా, ‘గం గం గణేషా’ ఫర్వాలేదనిపించుకుంది. ఇక కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ సినిమాలో నటించారు కన్నడ బ్యూటీ తన్వీ రామ్. తన్వీ ఓ లీడ్ రోల్లో నటించిన తొలి తెలుగు సినిమా ‘క’. ఈ చిత్రం అక్టోబరులో విడుదలైంది. ఇటు తెలుగు... అటు తమిళం తెలుగు, తమిళ భాషల్లో ఈ ఏడాదే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు ప్రీతీ ముకుందన్. శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘ఓం భీమ్ బుష్’ చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయ్యారు ప్రీతీ ముకుందన్. హర్ష దర్శకత్వంలో సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం మార్చిలో విడుదలై, ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇక కెవిన్ హీరోగా చేసిన ‘స్టార్’తో ఇదే ఏడాది తమిళ పరిశ్రమకు పరిచయం అయ్యారు ప్రీతీ ముకుందన్. అలాగే మంచు విష్ణు ‘కన్నప్ప’లోనూ ఆమె హీరోయిన్గా చేస్తున్నారు. ఇంకా నారా రోహిత్ ‘ప్రతినిధి 2’తో సిరీ లెల్లా, సత్యదేవ్ ‘కృష్ణమ్మ’ చిత్రంతో అతిరా రాజీ, నవదీప్ ‘లవ్ మౌళి’తో పంఖురి గిద్వానీ, ‘వెన్నెల’ కిశోర్ ‘చారి 111’తో సంయుక్తా విశ్వనాథన్, సాయిరామ్ శంకర్ ‘వెయ్ దరువెయ్’తో యషా శివకుమార్, చైతన్యా రావు ‘షరతులు వర్తిస్తాయి’తో భూమి శెట్టి, అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటి అడక్కు’తో ప్రముఖ నటుడు జానీ లివర్ వారసురాలు జేమీ లివర్ (ఓ కీలక పాత్రతో..) తదితరులు పరిచయం అయ్యారు. – ముసిమి శివాంజనేయులు -
మాజీ ముఖ్యమంత్రి మనవడితో టాలీవుడ్ హీరోయిన్ డేటింగ్ (ఫోటోలు)
-
Manushi Chhillar: మాజీ సీఎం మనవడితో వరుణ్ తేజ్ హీరోయిన్ డేటింగ్?
వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది మానుషి చిల్లర్. ఈ సినిమాలో రాడార్ ఆఫీసర్ పాత్ర పోషించి..తనదైన నటనతో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో టాలీవుడ్లో ఈ మాజీ విశ్వసుందరి ఆఫర్లు లభించలేదు. దీంతో మళ్లీ తన మకాంను బాలీవుడ్కి మార్చింది. అక్కడ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఇలా సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటుంది మానుషి. ప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది. అయితే ఇన్నాళ్లు ఆమె ఫోటోలు మాత్రమే వైరల్ అయ్యేవి. కానీ ఇప్పుడు మానుషి పర్సనల్ లైఫ్కి సంబంధించిన ఓ గాసిప్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మాజీ విశ్వసుందరీ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్కుమార్ షిండే మనవడు, నటుడు వీర్ పహారియాతో మానుషి డేటింగ్ ఉందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దానికి ఓ కారణం ఉంది. ఇటీవల జాన్వీ కపూర్, ఆమె ప్రియుడు శిఖర్ పహారియా, స్నేహితులతో కలిసి టూర్కి వెళ్లింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో మానుషి, శిఖర్ సోదరుడు వీర్ పహారియా భుజంపై సేదతీరుతూ కనిపించింది. దీంతో మానుషి, వీర్లు ప్రేమలో ఉన్నారని, అందుకే కలిసి టూర్కి వెళ్లారనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.అయితే దీనిపై అటు మానుషి కానీ, ఇటు వీర్ కానీ స్పందించలేదు.(చదవండి: ఈ వారం థియేటర్స్లో 11 సినిమాలు..కానీ ఒక్కటి కూడా!)ఇక మానుషీ విషయానికొస్తే.. హరియాణాకు చెందిన ఈ బ్యూటీ 2017లో విశ్వ సుందరిగా నిలిచింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమానే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన నటించే అవకాశం కొట్టేసింది. బాలీవుడ్ మూవీ సామ్రాట్ పృథ్వీరాజ్లో అక్షయ్కు జోడీగా నటించింది మానుషీ. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. రెండో మూవీ ‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’ కూడా ఫ్లాప్ అయింది. బాలీవుడ్ అచ్చిరాకపోవడంతో టాలీవుడ్ మూవీతోనైనా హిట్ కొడదామని ‘ఆపరేషన్ వాలెంటైన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది కూడా ప్లాప్గా నిలిచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కుతోన్న ‘టెహ్రాన్’లో నటిస్తోంది. View this post on Instagram A post shared by Filmymantra Media (@filmymantramedia) -
Manushi Chhillar: బ్యూటీ క్వీన్, ఆపరేషన్ వాలెంటైన్ భామ బర్త్డే స్పెషల్ రేర్ ఫోటోలు
-
సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
ఫారెన్ వీధుల్లో చిల్ అవుతున్న కేతిక శర్మమరింతగా బక్కచిక్కిపోయిన 'పంజా' బ్యూటీ సారా జేన్సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్ ట్రీట్రెడ్ డ్రస్సులో పిచ్చెక్కిస్తున్న కృతి సనన్జిగేలుమనే ఔట్ ఫిట్లో మెరిసిపోతున్న మానుషిముత్యాల హారంతో కేక పుట్టిస్తున్న మీనాక్షి చౌదరి View this post on Instagram A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Shobhashetty (@shobhashettyofficial) View this post on Instagram A post shared by Priyaa Lal (@impriyaalal) View this post on Instagram A post shared by Shivaji Storm Sen (@stormshivajisen) View this post on Instagram A post shared by DRISHYA (@drishya__raghunath) View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) View this post on Instagram A post shared by Aaditi S Pohankar (@aaditipohankar) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Sarah Jane Dias (@sarahjanedias) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Pujiithaa Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) -
రూ. 350 కోట్ల సినిమా.. 1+1 ఆఫర్ ఇచ్చినా చూసేవాళ్లు లేరు
బాలీవుడ్లో అక్షయ్కుమార్, టైగర్ ష్రాఫ్ ఇద్దరు కలిసి నటించిన చిత్రం 'బడేమియా ఛోటేమియా'. అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈద్ సందర్భంగా ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదలైంది. హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ రిలీజ్ అయింది. హైవోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైనా.. బాక్సాఫీస్ వద్ద నిరాశపరుస్తోంది. సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీకి నాలుగు రోజులకు గాను రూ.96 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుంది. దీంతో ఫస్ట్ వీకెండ్లో రూ.100 కోట్ల మార్క్ కూడా దాటలేకపోయింది. ఈ చిత్రాన్ని పూజ ఎంటర్టైన్మెంట్స్, ఏఏజెడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై జాకీ భగ్నానీ, వశు భగ్నానీ, దీప్షికా దేశ్ముఖ్, అలీ అబ్బాస్ జాఫర్, హిమాన్షు కిషన్ సంయుక్తంగా నిర్మించారు. సుమారు రూ.400 కోట్లు అందుకుంటుందని అంచనా వేసి సినిమా విడుదల చేస్తే.. భారీ డిజాస్టర్ దిశగా కొనసాగుతుంది. ఓ మై గాడ్ 2 తర్వాత అక్షయ్ కుమార్ నుంచి వస్తున్న సినిమా కావడం.. ఆపై ఈ చిత్రంలో జాన్వీ కపూర్, మానుషి చిల్లర్, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రలు నటించడంతో మొదటిరోజు కలెక్షన్స్ కాస్త మెరుగ్గానే వచ్చాయి. ఆ తర్వాత సినిమా బాగాలేదని టాక్ రావడంతో రెండో రోజే కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. దీంతో ఆదివారం నాడు బుక్ మై షోలో వన్ ప్లస్ వన్ ఆఫర్ను ప్రకటించేశారు. ఈ నిర్ణయంతో ఆదివారం బుకింగ్స్ కాస్త పెరిగాయని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఆఫర్లు ప్రకటించినా కూడా రూ. 350 కోట్లు పెట్టిన సినిమాకు నాలుగురోజుల్లో రూ. 100 కోట్ల మార్క్ దాటకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. -
డేంజర్ జోన్లో ప్రపంచం మెచ్చిన అందగత్తె!
-
నెల రోజుల్లోపే ఓటీటీకి మెగా హీరో యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన బిగ్గెస్ట్ ఏరియల్ వార్ డ్రామా ఆపరేషన్ వాలెంటైన్ . శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మానుషి చిల్లర్ హీరోయిన్గా నటించగా.. నవదీప్ కీలక పాత్ర పోపించాడు. మార్చి 1న తెలుగు,హిందీ భాషల్లో విడుదలై మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. దేశంలోని వైమానిక దళ వీరుల అలుపెరుగని పోరాటం.. దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో ‘ఆపరేషన్ వాలెంటైన్ రూపొందించారు. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో హీరో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ పైలట్గా కనిపించారు. హీరోయిన్ మానుషీ చిల్లర్ రాడార్ ఆఫీసర్ పాత్రలో మెప్పించారు. పుల్వామా ఎటాక్ జరిగిన తర్వాత ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ఫోర్స్ అతిపెద్ద వైమానిక దాడిని ఈ చిత్రంలో చూపించారు.ఈ సినిమా తెలుగు, హిందీ రెండు భాషల్లోనూ థియేటర్లలో విడుదలైంది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ మూవీ హక్కులన అమెజాన్ ప్రైమ్ దక్కించకున్న సంగతి తెలిసిందే. ఈ ఫర్ఫెక్ట్ యాక్షన్ థ్రిల్లర్ మార్చి 29 నుంచి స్ట్రీమింగ్ కానన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే తేదీ ఫిక్స్ అయితే ఈ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలో చూసేయొచ్చు. కాగా.. ఈ చిత్రంలో నవదీప్, పరేష్ పహుజా, రుహానీ శర్మ, అలీ రెజా ప్రధాన పాత్రల్లో కనిపించారు. #OperationValentine OTT RELEASE MARCH 29 @PrimeVideoIN pic.twitter.com/2RQAdlDuEq — OTTGURU (@OTTGURU1) March 9, 2024 -
జోర్డాన్లో అందాల భామ మానుషి చిల్లర్.. శారీలో సంయుక్త మీనన్ పోజులు!
జోర్డాన్లో ఆపరేషన్ వాలైంటైన్ భామ మానుషి చిల్లర్.. శారీలో సంయుక్త మీనన్ హోయలు.. వైట్ డ్రెస్లో దిశా పటానీ స్టన్నింగ్ పోజులు.. బ్లాక్ డ్రెస్లో మంచు లక్ష్మి లుక్స్ View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) -
'ఆపరేషన్ వాలెంటైన్' ఓటీటీలో ఎంట్రీ అప్పుడేనా..?
వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కించిన చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్' మార్చి 1న విడుదలైన ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. మానుషి చిల్లర్ ఇందులో కథానాయిక. ఈ మధ్య కాలంలో వరుణ్కు మంచి విజయాన్ని అందించిన ఈ చిత్రం త్వరలో ఓటీటీలోకి రానుంది. పుల్వామా ఎటాక్ వంటి నిజమైన సంఘటనల నుంచి ప్రేరణ పొంది ఈ దేశభక్తి చిత్రాన్ని మేకర్స్ రూపొందించారు. మన వైమానిక దళ వీరుల అసమానమైన ధైర్య సాహసాల్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను దీంట్లో చక్కగా చూపించాడు దర్శకుడు. ఇందులో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ పైలట్గా కనిపించగా.. మానుషి రాడార్ ఆఫీసర్గా మెప్పించింది. ఆపరేషన్ వాలంటైన్ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ మంచి ధరకే దక్కించుకుంది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం సినిమా రిలీజైన 30 రోజుల తర్వాత ఓటీటీలోకి రానుంది. అంటే మార్చి 29 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఒక వేళ ఆ తేదీలో కుదరకపోతే ఏప్రిల్ మొదటి వారంలో గ్యారెంటీగా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తెలుగుతో పాటు దక్షిణాది భాషలకు సంబంధించి నెలలోపు స్ట్రీమింగ్ అవ్వొచ్చు. హిందీ వెర్షన్ మాత్రం ఎనిమిది వారాల తర్వాత ఉండనుందని సమాచారం. -
‘ఆపరేషన్ వాలెంటైన్’ రివ్యూ
టైటిల్: ఆపరేషన్ వాలెంటైన్ నటీనటులు: వరుణ్ తేజ్, మానుషి చిల్లర్, నవదీప్, మిర్ సర్వర్, రుహానీ శర్మ తదితరులు నిర్మాతలు: సోనీ పిక్చర్స్, సందీప్ ముద్ద దర్శకత్వం: శక్తి ప్రతాప్ సింగ్ హడా సంగీతం: మిక్కీ జే మేయర్ సినిమాటోగ్రఫీ:హరి కె. వేదాంతం ఎడిటర్: నవీన్ నూలి విడుదల తేది: మార్చి 1, 2024 కథేంటంటే.. అర్జున్ రుద్ర దేవ్ అలియాస్ రుద్ర(వరుణ్ తేజ్) భారతీయ వైమానిక దళంలో వింగ్ కమాండర్గా పని చేస్తుంటాడు. అక్కడే పని చేసే రాడార్ ఆఫీసర్ అహనా గిల్(మానుషి చిల్లర్)తో ప్రేమలో ఉంటాడు. అహనా చెప్పినా వినకుండా.. గగనవీధిలో అనేక ప్రయోగాలు చేస్తుంటాడు అర్జున్. అలా ఓ సారి ప్రాజెక్ట్ వజ్ర చేపట్టి.. తొలి ప్రయత్నంలోనే విఫలం అవుతాడు. ఈ ప్రయోగంలో తన ప్రాణ స్నేహితుడు వింగ్ కమాండర్ కబీర్(నవదీప్) ప్రాణాలు కోల్పోతాడు. దీంతో ఎయిర్ ఫోర్స్ అధికారులు ప్రాజెక్ట్ వజ్రను బ్యాన్ చేస్తారు. గాయాలను నుంచి కోలుకున్న రుద్ర.. 2019లో ఆపరేషన్ వాలెంటైన్ కోసం రంగంలోకి దిగుతాడు. అసలు ఆపరేషన్ వాలైంటైన్ లక్ష్యమేంటి? ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? అర్జున్ రుద్ర తన టీమ్తో కలిసి పాకిస్తాన్ కళ్లు గప్పి ఆ దేశ బార్డర్ని క్రాస్ చేసి ఉగ్రవాదుల స్థావరాలను ఎలా ధ్వంసం చేశాడు? ప్రాజెక్ట్ వజ్ర లక్ష్యమేంటి? చివరకు అది సక్సెస్ అయిందా లేదా? అనేది తెలియాలంటే థియేటర్స్లో ‘ఆపరేషన్ వాలెంటైన్’ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడిని దేశం ఇప్పటికి మర్చిపోలేదు. ఈ దాడిలో 40 మందికిపైగా భారతీయ జవాన్లు వీర మరణం పొందారు. దీనికి ప్రతీకారంగా భారత్ బాల్కోట్ స్ట్రైక్ నిర్వహించి సక్సెస్ అయింది. ఈ ఘటనల ఆధారంగానే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ తెరకెక్కించాడు. ఇందులో దేశ రక్షణ కోసం వైమానిక దళం ఎలా పని చేస్తుంది అనేది కళ్లకు కట్టినట్లు చూపించారు. వాస్తవానికి వేరే దేశంతో యుద్ధం అనగానే అందరికి సైనిక దళమే గుర్తొస్తుంది. కానీ వారితో పాటు నావిక, వైమానిక దళం కూడా దేశ రక్షణ కోసం పని చేస్తుందనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. నావిక, వైమానిక దళాలపై సినిమాలు కూడా పెద్దగా రాలేదు. కానీ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత మన వైమానిక దళం గొప్పదనం ప్రపంచానికి మొత్తం తెలిసింది. గనతలంలో వాళ్లు చేసే పోరాటల గురించి అంతా చర్చించుకున్నారు. బాలీవుడ్లో ఆ నేపథ్యంతో సినిమాలు వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యే ‘ఫైటర్’ అనే సినిమా కూడా ఇదే కాన్సెప్ట్తో వచ్చి..బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ఆపరేషన్ వాలెంటైన్ కాన్సెప్ట్ కూడా అలాంటిదే. అయితే ఇలాంటి నేపథ్యంతో తెలుగులో వచ్చిన మొట్టమొదటి సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్ ’ అనే చెప్పొచ్చు. తక్కువ బడ్జెట్(రూ.42 కోట్లు అని సమాచారం) ఇంత రిచ్గా సినిమాను తెరకెక్కించిన దర్శకుడుని అభినందించాల్సిందే. అయితే ఇలాంటి సినిమాల్లో ఎమోషన్స్ చాలా ముఖ్యం. ఆపరేషన్ వాలెంటైన్లో అది మిస్ అయింది. దేశం మొత్తాన్ని కుదిపేసిన పుల్వామా దాడిని మరింత ఎమోషనల్గా, ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చూపిస్తే బాగుండేదేమో. అలా అని ఎమోషన్ పూర్తిగా పండలేదని చెప్పలేం. దాడిలో ఓ సైనికుడు తన ప్రాణాన్ని అడ్డు పెట్టి చిన్నారిని కాపాడిన సీన్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఆ తరహా ఎమోషనల్ సీన్స్ కొచ్చి చోట్ల ఉంటే సినిమా మరింత కనెక్ట్ అయ్యేది. దర్శకుడు వైమానిక దళ సైనికుల ఆపరేషన్స్, సాహసాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. చాలా సహజంగా వాటిని తెరపై చూపించాడు కానీ కథలోని డ్రామాని మాత్రం తెరపై సరిగా పండించలేకపోయాడు.ప్రాజెక్ట్ వజ్రతో కథను ప్రారంభించాడు. ఆ ఒక్క సీన్తోనే హీరో పాత్ర ఎలాంటిదో తెలియజేశాడు. ఫస్టాప్ అంతా పైలెట్ల టెస్ట్, హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ చుట్టునే తిరుగుతుంది. అయితే ప్రేమ కథలో గాఢత తగ్గినట్లు అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. అసలు కథంతా సెకండాఫ్లోనే ఉంటుంది. పాకిస్తాన్పై మన సైనికులు దాడి చేసే సన్నివేశాలను అద్భుతంగా తీర్చిదిద్దాడు. పాకిస్తాన్ చేపట్టిన ఆపరేషన్ నెహ్రుని తిప్పికొట్టేందుకు హీరో చేసే సాహసం.. చివరల్లో ఆపరేషన్ వజ్రని ప్రయోగించడం ప్రతీది.. ఆకట్టుకుంటుంది. మన సైనికుల ధైర్యసాహసాలను గుర్తు చేసుకుంటూ థియేటర్స్ని నుంచి బయటకు వస్తారు. ఎవరెలా చేశారంటే.. అర్జున్ రుద్ర దేవ్ పాత్రలో వరుణ్ తేజ్ ఒదిగిపోయాడు. తెరపై నిజమైన వింగ్ కమాండర్గానే కనిపించాడు. ఆయన బాడీ లాంగ్వెజ్, మాటలు ప్రతీది నిజమైన సైనికుడినే గుర్తు చేస్తుంది. సినిమా కోసం ఆయన పడిన కష్టమంతా తెరపై కనిపించింది. ఇక రాడార్ ఆఫీసర్ అహనా గిల్గా మానుషిచిల్లర్ అద్భుతంగా నటించింది. సినిమాలో తన పాత్రను మంచి ప్రాధాన్యత ఉంటుంది. అయితే హీరోహీరోయిన్ల మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రం అంతగా వర్కౌట్ కాలేదు. కబీర్గా నవదీప్ ఒకటి రెండు సన్నివేశాల్లోనే కనిపించాడు. ఆయన పాత్రకు డైలాగ్స్ కూడా లేవు. మిర్ సర్వర్, రుహానీ శర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు. సాంకేతిక పరంగా సినిమా ఉన్నతంగా ఉంది. మిక్కి జే మేయర్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. వందేమాతరం సాంగ్ ఆకట్టుకుంటుంది. హరి కె. వేదాంతం సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి సీన్ చాలా రిచ్గా చిత్రీకరించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
ఏం జరిగినా సరే.. చూసుకుందాం అంటూ సవాల్ విసిరిన వరుణ్ తేజ్
వరుణ్తేజ్ హీరోగా ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన ఈ సినిమా మార్చి 1న విడుదల కానుంది. శక్తిప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ ముద్ద నిర్మాత. ఇందులో వరుణ్కి జోడీగా అందాల భామ, ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో ఈ మధ్యే ఫైటర్తో హృతిక్ రోషన్ హిట్ కొట్టాడు.. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే వరుణ్ హిట్ కొట్టడం ఖాయం అని చెప్పవచ్చు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో భారత జవాన్లపై ఉగ్రవాదుల దాడి జరిగింది. ఆ సమయంలో సుమారు 40కి పైగా మన సైనికులు మరణించారు. ఆ సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్థాన్, అక్కడి ఉగ్రవాదులపై ఎలాంటి ఎటాక్ చేసింది అనేదే వాలెంటైన్ చిత్రం. ఈ సినిమాతో వరుణ్ బాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు. అందుకు ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. ఇందులో రుహానీ శర్మ కీలక పాత్రలో కనిపించింది.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్గా ఆమె అదరగొట్టేసిందని చెప్పవచ్చు. గాల్లో వారిద్దరూ చేసే విన్యాసాలు అద్భుతంగా ఉన్నాయి. ట్రైలర్లో మాస్ ఆడియన్స్తో పాటు దేశభక్తిని రగిలించే డైలాగ్స్ ఉన్నాయి. సుమారు 3 నిమిషాల పాటు ఉన్న ట్రైలర్ ప్రేక్షకులను ఎక్కడా కూడా నిరాశ పరచదు. ట్రైలర్ను చూస్తే.. మార్చి 1న రిలీజ్ కానున్న ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. -
పెళ్లి తర్వాత ఆ ప్రశ్నలే ఎక్కువగా వస్తున్నాయి: వరుణ్ తేజ్
మెగా హీరో వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా నటిస్తోన్న చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ సినిమా మార్చిన 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు వరుణ్. అందులో భాగంగానే మల్లారెడ్డి ఇంజినీరింగ్ ఉమెన్స్ కాలేజీలో సందడి చేశారు. ఈవెంట్లో పాల్గొన్న యాంకర్ సుమ అడిగిన పలు ప్రశ్నలకు వరుణ్ ఆసక్తికర సమాధానాలిచ్చారు. అవేంటో తెలుసుకుందాం. పెళ్లి తర్వాత మీ లైఫ్లో వచ్చిన మార్పులేంటని యాంకర్ సుమ ప్రశ్నించింది. దీనికి వరుణ్ తేజ్ బదులిస్తూ.. 'పెళ్లి తర్వాత ఫోన్కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని.. ఎక్కడికి వెళ్తున్నారంటూ ప్రశ్నలు ఎదురవుతున్నాయని.. కానీ అవన్నీ ప్రేమతోనేనని నవ్వుతూ సమాధానమిచ్చారు. అంతే కాకుండా ఈ ఏడాది వాలెంటైన్ డే రోజు లావణ్య ఎలాంటి బహుమతి ఇవ్వలేదన్నారు. ఆ తర్వాత పలువురు విద్యార్థినిలు వరుణ్తేజ్కు ప్రశ్నలు వేశారు. నా సినిమా స్క్రిప్టు ఎంపికలో పెద్దనాన్న చిరంజీవినే ఆదర్శంగా తీసుకుంటానని ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు ఆన్సరిచ్చారు. అంతే కాకుండా వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అనంతరం ఆపరేషన్ వాలెంటైన్ గురించి మాట్లాడుతూ.. 'దేశాన్ని రక్షించే మన సైనికుల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. వాస్తవ పరిస్థితులను చూపించే అవకాశం అరుదుగా వస్తుంది. ఈ సినిమా కంటే ముందు పుల్వామా ఎటాక్ గురించి నాకు కొంత అవగాహన ఉంది. ముఖ్యంగా యువతకు ఇలాంటి చిత్రాలు చాలా అవసరం. ఇలాంటి సినిమాలో భాగమవడం నా అదృష్టం. సీరియస్ మాత్రమే కాదు.. ఈ చిత్రాన్ని కామెడీ కోణంలోనూ తెరకెక్కించాం. ఇలాంటి తరహాలో చాలా సినిమాలు వచ్చాయి కదా అని అడిగారు. ప్రేమకథా చిత్రాలు, కమర్షియల్ సినిమాలు ఎన్నైనా తీస్తున్నప్పుడు రియల్ హీరోపై ఎందుకు తీయకూడదని అడిగా. ఈ సినిమా నాకెన్నో జ్ఞాపకాలు ఇచ్చింది. ఈ సినిమా పాటను వాఘా బోర్డర్లో విడుదల చేయడం ఆనందాన్నిచ్చింది. ప్రతి ఒక్కరు వాఘా బోర్డర్ను సందర్శించండి. ఎందుకంటే యువతకు దేశభక్తి చాలా ముఖ్యం. బీఎస్ఎఫ్ జవాన్లను కలుసుకోవడం నాకు మంచి అనుభూతినిచ్చింది' అని అన్నారు. -
గ్రీన్ డ్రెస్లో ఆపరేషన్ వాలెంటైన్ భామ.. బీచ్లో చిల్ అవుతోన్న ప్రగ్యా జైశ్వాల్!
గ్రీన్ డ్రెస్లో ఆపరేషన్ వాలెంటైన్ భామ హోయలు బీచ్లో ఎంజాయ్ చేస్తోన్న ప్రగ్యా జైస్వాల్.. ట్రెండీ లుక్లో ది కేరళ స్టోరీ భామ ఆదా శర్మ.. అలాంటి లుక్తో మతి పోగోడుతున్న నిధి అగర్వాల్ View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) -
అందం కోసం ఫిల్లింగ్స్, ప్లాస్టిక్ సర్జరీలు.. హీరోయిన్ ఏమందంటే?
అందంగా కనిపించాలని ఏ అమ్మాయి కోరుకోదు! సెలబ్రిటీలైతే మరీనూ.. అందంగా ఉండేందుకు, అందాన్ని నిలబెట్టుకునేందుకు నానా కష్టాలు పడుతుంటారు. అవసరమైతే సర్జరీలకు కూడా వెనుకాడరు. కానీ చాలామంది జనాలు.. సర్జరీలు చేయించుకునే సెలబ్రిటీలను తెగ విమర్శిస్తుంటారు. ఈ విషయంలో తారలకే సపోర్ట్ చేస్తానంటోంది మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్. ఈమె ఆపరేషన్ వాలంటైన్ అనే మూవీలో హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుంది. ప్లాస్టిక్ సర్జరీలకు సపోర్ట్ చేస్తారా? ఇకపోతే శనివారం (ఫిబ్రవరి 10న) ఢిల్లీలో జరిగిన మిస్ వరల్డ్ 2024 ప్రీ లాంచ్ ఈవెంట్కు ఈ హీరోయిన్ హాజరైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మానుషికి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. అందాన్ని రెట్టింపు చేసుకునేందుకు ఫిల్లర్స్, కాస్మొటిక్ సర్జరీలను ఎంచుకోవడాన్ని మీరు సపోర్ట్ చేస్తారా? అని ఒకరు అడిగారు. దీనికి మానుషి స్పందిస్తూ.. 'ఇక్కడ రెండు విషయాలు మాట్లాడాలి. కొత్తగా ఉంది కాదు, వేల ఏళ్ల క్రితం నుంచే.. మొదటిది.. మన దేశ చరిత్రను చూసినట్లయితే వేల సంవత్సరాల క్రితం కూడా సౌందర్య నిపుణులు ఉన్నట్లు అర్థమవుతుంది. అంటే బ్యూటీని పెంపొందించుకోవాలన్న ఆలోచన ఇప్పటిది కాదు. రెండోది.. అందం విషయంలో ఎవరి ఇష్టం వారిది. వారికి ఎలా కనిపించాలనుకుంటే అలా రెడీ అవుతారు. అందుకోసం ఏం చేసినా తప్పు లేదు. అది వారి వ్యక్తిగత విషయం. సర్జరీనో, మరింకేదో చేయించుకున్నారని వారిని తప్పుపట్టడం సరికాదు. అయినా దాని గురించి అందరూ చర్చించాల్సిన అవసరమే లేదు' అని చెప్పుకొచ్చింది మానుషి చిల్లర్. చదవండి: కళ్యాణ వైభోగమే నటి ఇంట బారసాల ఫంక్షన్ -
రియల్ సూపర్ హీరోస్ కథ చూసి ప్రేక్షకులు గర్వపడతారు: వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ హీరోగా నటించిన ద్విభాషా(తెలుగు-హిందీ)చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్. మానుషీ చిల్లర్ హీరోయిన్. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మిస్తున ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ‘గగనాల తేలాను నీ ప్రేమలోన..’పాట లిరికల్ వీడియోను యూనిట్ రిలీజ్ చేసింది. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ స్వరకల్పనలో రామ జోగయ్య శాస్త్రీ సాహిత్యం అందించిన ఈ పాటను అర్మాన్ మాలిక్ పాడారు. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమంలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ..‘దేశాన్ని కాపాడే సైనికుడు 130 కోట్ల మందిని తన కుటుంబంలా భావించి, తన కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు. అలాంటి సైనికుల కోసం, వాళ్లు చేసిన త్యాగాల కోసం, వాళ్ల కథని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే గొప్ప ఉద్దేశ్యంతో ఈ సినిమా చేశాం.. థియేటర్స్ లో మన దేశానికి రియల్ సూపర్ హీరోస్ అయిన వారి కథని చూసి ప్రేక్షకులంతా చాలా గర్వంగా ఫీలౌతారు’ అన్నారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఐఏఎఫ్ ఆఫీసర్గా నటిస్తుండగా, మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్గా కనిపించనుంది. ‘'ఆపరేషన్ వాలెంటైన్' దేశంలోని వైమానిక దళ వీరుల అలుపెరగని పోరాటాని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్ల అద్భుతంగా చూపించబోతుంది’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు?.. వరుణ్ తేజ్ ఆసక్తికర కామెంట్స్!
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. ఈ చిత్రాన్ని శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రోడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ సంయుక్తంగా తెలుగు, హిందీ భాషల్లో ద్విభాషా చిత్రంగా రానుంది. ఈ మూవీని మార్చి 1 రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దేశంలోని వైమానిక దళ వీరుల అలుపెరుగని పోరాటం, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో ‘ఆపరేషన్ వాలెంటైన్ రూపొందించారు. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో హీరో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ పైలట్గా కనిపించనుండగా.. హీరోయిన్ మానుషీ చిల్లర్ రాడార్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆడియన్స్లో భారీ అంచనాలు పెంచేశాయి. జనవరి 26న రిపబ్లిక్ డేకు ముందు దేశభక్తి జ్వాలని రగిలించే ఫస్ట్ సింగిల్ ‘వందేమాతరం’ రిలీజ్ చేశారు. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ను మేకర్స్ విడుదల చేశారు. 'గగనాల తేలేను నీ ప్రేమలోన' అనే పాటను అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ చిత్రబృందం ప్రమోషన్లతో బిజీగా ఉంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మల్లారెడ్డి కాలేజ్ విద్యార్థులతో చిత్ర బృందం ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించింది. ఈ సెషన్లో వరుణ్తేజ్ ఆసక్తిక ప్రశ్న ఎదురైంది. మీ ఫేవరేట్ హీరోయిన్ ఎవరు? అంటూ విద్యార్థులు వరుణ్తేజ్ను అడిగారు. దీనికి సమాధానం ఇస్తూ..'నేను నా ఫేవరేట్ హీరోయిన్నే పెళ్లి చేసుకున్నా. ఏదైనా మంచి కథ వస్తే ఇద్దరం కలిసి చేస్తాం. మా ఇద్దరిలో మొదట ప్రపోజ్ చేసింది నేనే' అని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా లావణ్య కాకుండా తనకు సాయిపల్లవి అంటే అభిమానం అని తెలిపారు. అనంతరం సినిమా గురించి మాట్లాడుతూ.. 'ఎయిర్ఫోర్స్ నేపథ్యంలో తెలుగులో వస్తున్న మొదటి సినిమా ఇదే అనుకుంటా. దేశం కోసం ఏది చేసినా గొప్పగానే ఉంటుంది. ఈ సినిమా మీ అందర్నీ అలరిస్తుందని ఆశిస్తున్నాం. నేను చేయబోయే తర్వాతి మాస్ మూవీ మట్కా. గద్దల కొండ గణేష్ తరహాలో నా పాత్ర ఉండనుంది.' అని అన్నారు. Love takes flight and so do we!#OperationValentine second song out now❤️ - https://t.co/FeQNC1gjrd#Gaganaala #RabHainGawah#OPVonMarch1st@ShaktipsHada89 @ManushiChhillar @MickeyJMeyer @ArmaanMalik22 @singer_shaan @sonypicsfilmsin @RenaissancePicz @saregamaglobal pic.twitter.com/0OC575Ndot — Varun Tej Konidela (@IAmVarunTej) February 6, 2024 -
మరో నెలలో ఆపరేషన్
దేశంలోని వైమానిక దళ వీరుల అలుపెరుగని పోరాటం, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో హీరో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ పైలట్గా, హీరోయిన్ మానుషీ చిల్లర్ రాడార్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రోడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించిన ఈ తెలుగు, హిందీ ద్విభాషా చిత్రం ఈ నెలలోనే విడుదల కావాల్సింది. అయితే మార్చి 1న రిలీజ్ చేయనున్నట్లు శనివారం యూనిట్ ప్రకటించింది. ‘‘ఈ చిత్రం టీజర్,పోస్టర్లు, రిపబ్లిక్ డేకి ముందు విడుదల చేసిన దేశభక్తి జ్వాలని రగిలించిన ఫస్ట్ సింగిల్ ‘వందేమాతరం...’ వంటివి సినిమాపై అంచనాలు పెంచాయి. ఆ అంచనాలు చేరుకునేలా ఈ చిత్రం ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
చావునే చెండాడు ధీరుడు...
వరుణ్ తేజ్ హీరోగా నటించిన తొలి హిందీ చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మానుషీ చిల్లర్ హీరోయిన్గా నటించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రోడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్పై సందీప్ ముద్దా నిర్మించిన ఈ మూవీ తెలుగు, హిందీలో ఫిబ్రవరి 16న విడుదల కానుంది. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘వందేమాతరం..’ అంటూ సాగే తొలి పాటని అమృతసర్లోని వాఘా సరిహద్దులో విడుదల చేశారు. ‘చూడరా సంగ్రామ శూరుడు.. మండె రా మధ్యాహ్న సూర్యుడు.. చావునే చెడాడు ధీరుడు.. నిప్పులు కురిశాడు.. వందేమాతరం..’ అంటూ ఈ పాట సాగుతుంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటని తెలుగులో అనురాగ్ కులకర్ణి, హిందీలో సుఖ్వీందర్ సింగ్ ఆలపించారు. ‘‘ఎయిర్ ఫోర్స్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా ‘ఆపరేషన్ వాలెంటైన్’ రూపొందింది. దేశ స్ఫూర్తిని చాటే దేశభక్తి గీతమైన ‘వందేమాతరం..’ని వాఘా సరిహద్దులో విడుదల చేశాం. ఇక్కడ రిలీజ్ చేసిన తొలి పాటగా ‘వందేమాతరం..’ చరిత్ర సృష్టించింది’’ అని మేకర్స్ తెలిపారు. ఈ పాట ఆవిష్కరణలో వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్తో సహా టీమ్ పాల్గొన్నారు. -
Operation Valentine: గుర్తుచేయాల్సిన సమయం వచ్చింది
వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్ జంటగా నటించిన దేశభక్తి చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అర్జున్దేవ్ పాత్రలో వరుణ్ తేజ్ కనిపిస్తారు. రాడార్ ఆఫీసర్గా మానుషి చిల్లర్ నటించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రోడక్షన్స్, సందీప్ ముద్దా నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 16న విడుదల కానుంది. సోమవారం ‘ఫస్ట్ స్ట్రైక్’ పేరుతో ఈ సినిమా టీజర్ను తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేశారు. ‘శత్రువులకు ఓ విషయం గుర్తుచేయాల్సిన సమయం వచ్చింది. మన దేశం గాంధీజీతో పాటు సుభాష్ చంద్రబోస్ది కూడా..’, ‘ఏం జరిగినా సరే చూసుకుందాం’ (వరుణ్ తేజ్) వంటి డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. ‘‘దేశ వైమానిక దళ హీరోల ధైర్యసాహసాలు, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొనే సవాళ్ల నేపథ్యంలో ఈ మూవీ కథనం ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
సొగసైన మోడ్రన్ లుక్లో మానుషి చిల్లర్ అందాల ఫోటోలు
-
ఆపరేషన్ డేట్ ఫిక్స్
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తొలి హిందీ చిత్రానికి ‘ఆపరేషన్ వాలెంటైన్’ టైటిల్ ఖరారు చేశారు. అంతేకాదు.. ఈ మూవీని డిసెంబర్ 8 రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్గా, రాడార్ ఆఫీసర్ పాత్రలో మానుషి చిల్లర్ నటిస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్పై ఈ చిత్రం రూపొందుతోంది. ‘‘వాస్తవ ఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలను చూపే యాక్షన్ మూవీ ఇది. శక్తి ప్రతాప్ సింగ్, అమిర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ ఈ చిత్రకథ రాశారు. హిందీ, తెలుగులో రూపొందిస్తున్నాం’’ అని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సహనిర్మాత: నందకుమార్ అబ్బినేని. -
వరుణ్ తేజ్తో మాజీ మిస్ యూనివర్స్
వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న 13వ చిత్రం ‘వీటీ 13’ (వర్కింగ్ టైటిల్). శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో తెలుగు, హిందీ భాషల్లో సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్పై సందీప్ ముద్ద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా హైదరాబాద్లోని ఓ స్టూడియోలో ఈ సినిమాలోని ఓ యాక్షన్ సీక్వెన్స్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఐఏఎఫ్ అధికారిగా యుద్ధ విమానం ముందు నిలబడి ఉన్న వరుణ్ ఫొటోని చిత్రబృందం విడుదల చేసింది. ‘‘యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న చిత్రం ‘వీటీ 13’. త్వరలో టైటిల్ అనౌన్స్ చేస్తాం. డిసెంబర్లో సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రంలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ రాడార్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నారు. -
త్వరలో టైటిల్
వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘వీటీ 13’ (వర్కింగ్ టైటిల్). సందీప్ ముద్ద నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ని త్వరలో ప్రకటించనున్నారు. ‘‘వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఇండియన్ బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ చిత్రంగా రూపొందుతున్న మూవీ ఇది. ఇందులో వరుణ్ తేజ్ ఐఏఎఫ్ అధికారిగా కనిపిస్తారు. ఈ చిత్రం లోని భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించడానికి భారీ సెట్ రూపొందించాం. ఈ సీక్వెన్స్ కోసం వరుణ్ షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఈ చిత్రం టైటిల్ను త్వరలో ప్రకటిస్తాం ’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రంలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ రాడార్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. -
అట్టహాసంగా ఆరంభమైన కాన్స్ చిత్రోత్సవాలు
76వ కాన్స్ చిత్రోత్సవాలు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. ఫ్రాన్స్లో ఈ నెల16న మొదలైన ఈ చిత్రోత్సవాలు 27 వరకు కొనసాగుతాయి. ఎనిమిది మంది జ్యూరీ సభ్యులకు స్వీడన్కు చెందిన రూబెన్ ఓస్ట్లాండ్ సారథ్యం వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సమా చార, ప్రసార శాఖ డిప్యూటీ మినిస్టర్ ఎల్. మురుగన్ ఈ చిత్రోత్సవాల్లో ఇండియన్ టీమ్ను లీడ్ చేస్తున్నారు. 12 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో పలువురు దేశ, విదేశీ తారలు రెడ్ కార్పెట్పై మెరవనున్నారు. ఇక తొలి రోజు వేడుక విశేషాల్లోకి వెళదాం. ఏడు నిమిషాల స్టాండింగ్ ఒవేషన్ తొలి రోజు బయోగ్రఫికల్ డ్రామా ‘జాన్ డ్యు బెర్రీ’ ప్రదర్శనతో ప్రారంభమై, చివరి రోజు ఉత్సవాలు ‘ఎలిమెంటల్’ సినిమా ప్రదర్శనతో ముగుస్తాయి. ‘జాన్ డ్యు బెర్రీ’ సినిమాలో ఓ లీడ్ రోల్ చేసిన జానీ డెప్ ఈ చిత్రోత్సవాలకు హాజరయ్యారు. ఈ చిత్రప్రదర్శన ముగిసిన తర్వాత వీక్షకులు ఏడు నిమిషాల పాటు స్టాండింగ్ ఒవేషన్ఇవ్వడం విశేషం. తమ చిత్రానికి ఇంత అద్భుత స్పందన లభించిన నేపథ్యంలో జానీ డెప్ కళ్లు చెమర్చాయి. ఈ వీడియో వైరల్ అవుతోంది. మైవెన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. కాన్స్లో భారతీయం ప్రతి ఏడాదీ కాన్స్ చిత్రోత్సవాల్లో భారతీయ తారలు మెరుస్తుంటారు. ఈ ఏడాది తొలి రోజు హిందీ తారలు సారా అలీఖాన్, ఈషా గుప్తా, మానుషీ చిల్లర్, ఊర్వశీ రౌతేలా రెడ్ కార్పెట్పై మెరిశారు. కాగా సారా, ఈషా, మానుషీ లు తొలిసారి కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొంటున్నారు. ఈ ముగ్గురితో పాటు ఊర్వశి కూడా రెడ్ కార్పెట్ పై సందడి చేశారు. దేశీ లుక్లో అగుపించిన సారాకి ప్రశంసలు లభించాయి. వీరు మాత్రమే కాదు.. ఇంకా హీరోయిన్లు అనుష్కా శర్మ, మృణాల్ ఠాకూర్, సన్నీ లియోన్, నాగాల్యాండ్ యాక్ట్రస్ ఆండ్రియా కెవిచుసాలు తొలిసారిగా ఈ కాన్స్ చలన చిత్రోత్సవాల్లో పాల్గొంటారు. ఇంకా ఆస్కార్ అవార్డు విన్నింగ్ ప్రొడ్యూసర్ గునీత్ మోంగా, దర్శకుడు మధుర్ భండార్కర్, హీరోయిన్ అదితీరావ్ హైదరీ, నటుడు విజయ్వర్మ, దర్శకుడు విఘ్నేష్ శివన్ వంటి వారు పాల్గొననున్నట్లు సమాచారం. అలాగే దర్శకుడు అనురాగ్ కశ్వప్ తెరకెక్కించిన ‘కెన్నెడీ’, దర్శకుడు కను బెహ్లీ తీసిన ‘ఆగ్రా’, మణిపూర్ దర్శకుడు అరిబామ్ శ్యామ్ శర్మ తెరకెక్కించిన ‘ఇషానౌ’, యుధాజిత్ బసు ‘నెహెమిచ్’ వంటి భారత చిత్రాలు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితం కానున్నాయి. ‘కెన్నెడీ’ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో ఒకరిగా నటించిన సన్నీ లియోన్ ఈ చిత్రం ప్రదర్శనలో భాగంగానే ఉత్సవాలకు హాజరవుతున్నారు. రెండు దశాబ్దాలుగా... కాన్స్ చిత్రోత్సవాలంటే చాలామంది ఐశ్వర్యా రాయ్ కోసం ఎదురు చూస్తారు. ఎందుకంటే దాదాపు రెండు దశాబ్దాలుగా కాన్స్ రెడ్ కార్పెట్పై ఐష్ మెరుస్తున్నారు. షారుక్ ఖాన్, ఐశ్వర్యా రాయ్, మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రల్లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ‘దేవదాస్’ (2002) చిత్రం 55వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. అప్పట్నుంచి ఐశ్వర్యా రాయ్ క్రమం తప్పకుండా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు హాజరవుతున్నారు. ఈ ఏడాది చిత్రోత్సవాల్లో సందడి చేసేందుకు తన కూతురు ఆరాధ్యతో కలిసి ఐశ్వర్యా రాయ్ బుధవారం ముంబై నుంచి బయలుదేరారు. -
గగన పోరాటంలో వరుణ్ తేజ్
దేశంలో జరిగిన వైమానిక దాడుల్లో మన సైనికులు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? ఎంతటి వీరోచితంగా పోరాడతారో వరుణ్ తేజ్ చూపించనున్నారు. దేశంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా భారతీయ వైమానిక దళ పైలెట్గా వరుణ్ తేజ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్గా నటిస్తున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సందీప్ ముద్దా నిర్మిస్తున్నారు. ‘‘ఇప్పటివరకు చూడని భీకర వైమానిక దాడుల్లో మన వీరుల పోరాటాన్ని ఈ చిత్రంలో చూపించనున్నాం. తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం గ్వాలియర్లో షూటింగ్ చేశాం. అక్కడి షెడ్యూల్ పూర్తయింది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ఈ గ్లామర్ ముంబై ఫ్లేవర్
తెలుగు తెరపై ముంబై హీరోయిన్లు మెరవడం అనేది కొత్తేం కాదు. ఈ ముంబై గ్లామర్ ఫ్లేవర్ ఈ ఏడాది బాగానే కనిపిస్తోంది. మరి.. బాలీవుడ్లో సినిమాలు చేస్తూటాలీవుడ్ స్క్రీ న్ పై మెరవనున్న ఆ కథానాయికలు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. ప్రాజెక్ట్ కె పిలిచింది బాలీవుడ్ టాప్ హీరోయి న్స్ లో ఒకరైన దీపికా పదుకో న్ ఇండస్ట్రీకి వచ్చిన పదిహేనేళ్ల తర్వాత తొలి తెలుగు సినిమాకు గ్రీ న్ సిగ్నల్ ఇచ్చారు. ఆమెను టాలీవుడ్కు పిలిచిన కథ ‘ప్రాజెక్ట్ కె’. ఈ సినిమాలో దీపికా పాత్రకు యాక్ష న్ సీ న్స్ కూడా ఉంటాయన్నది ఫిల్మ్నగర్ సమాచారం. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సై న్స్ ఫిక్ష న్ మూవీకి నాగ్ అశ్వి న్ దర్శకత్వం వహిస్తున్నారు. యాభై శాతానికి పైగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాను ముందు ఈ ఏడాది దసరాకు రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ నెల 12న లాస్ ఏంజిల్స్లో జరగనున్న ఆస్కార్ అవార్డుల వేడుకలో దీపికా పదుకో న్ ఓ ప్రెజెంటర్గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో పాల్గొనడానికి శుక్రవారం దీపికా ముంబై నుంచి లాస్ ఏంజిల్స్ ప్రయాణమయ్యారు. జాన్వీ ఎంట్రీ షురూ తెలుగు ప్రేక్షకులకు దివంగత ప్రముఖ నటి శ్రీదేవితో ప్రత్యేకమైన ఎమోషనల్ బాండింగ్ ఉంటుందనడంలో సందేహం లేదు. తెలుగు ప్రేక్షకుల నుంచి అంత గొప్ప ప్రేమను పొందారామె. మరి.. అలాంటి శ్రీదేవి కుమార్తె అయిన జాన్వీ కపూర్ (ఇద్దరు కమార్తెలు జాన్వీ కపూర్, చిన్న కుమార్తె ఖుషీ కపూర్) హీరోయి న్ గా కెరీర్ను ఆరంభించినప్పుడు తెలుగు ప్రేక్షకులు ఆమె రాక కోసం ఎదురు చూడకుండా ఉంటారా? ఆ ఎదురు చూపుల నిరీక్షణ ఐదేళ్లకు ఫలించింది. 2018లో వచ్చిన హిందీ చిత్రం ‘ధడక్’తో హీరోయి న్ గా పరిచయమైన జాన్వీ కపూర్ ఐదేళ్ల తర్వాత తొలి తెలుగు సినిమాకు సై న్ చేశారు. ‘జనతా గ్యారేజ్’ చిత్రం తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేష న్ లో రూపొందనున్న సినిమాలో జాన్వీ కపూర్ హీరోయి న్ గా నటించనున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం ఈ నెల 18న జరుగుతుందని, నెలాఖర్లో షూటింగ్ను ఆరంభించాలనుకుంటున్నారని సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఆల్రెడీ ప్రకటించింది. ఢిల్లీ టు హైదరాబాద్ ఒకే సినిమాతో ఇద్దరు ఢిల్లీ బ్యూటీలు తెలుగుకు వస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రవితేజ టైటిల్ రోల్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయి న్ గా నటిస్తున్నారు నూపుర్ సన న్ . అలాగే మరో ఢిల్లీ బ్యూటీ గాయత్రీ భరద్వాజ్ కూడా ఇదే సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. తెలుగులో మహేశ్బాబు ‘వ న్ : నేనొక్కడినే’, నాగచైతన్య ‘దోచేయ్’ చిత్రాల్లో నటించిన కృతీ సన న్ తాజాగా ప్రభాస్ సరసన ‘ఆదిపురుష్’లో హీరోయి న్ గా నటించారు. కృతీ చెల్లెలే నూపుర్. ప్రపంచ సుందరికి స్వాగతం ఐదేళ్ల క్రితం.. అంటే 2017లో మిస్ వరల్డ్గా నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించారు మానుషీ చిల్లర్. గతంలో మిస్ వరల్డ్గా నిలిచి, సినిమాల్లోకి వచ్చిన లారా దత్తా, ఐశ్వర్యా రాయ్, సుస్మితా సేన్, ప్రియాంకా చోప్రా తదితరుల మాదిరిగానే మానుషీ చిల్లర్ కూడా నటనను ఓ వృత్తిగా తీసుకున్నారు. హిందీలో అక్షయ్ కుమార్ నటించిన ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ హీరోయి న్ గా మానుషీ చిల్లర్కు తొలి సినిమా. ఇక ఈ బ్యూటీ రీసెంట్గా తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఓ సినిమాకు గ్రీ న్ సిగ్నల్ ఇచ్చారు. వరుణ్ తేజ్ హీరోగా హిందీకి పరిచయం అవుతున్న ఈ సినిమాతో శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడిగా తొలిసారి మెగాఫో న్ పట్టారు. దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ చిత్రంలో ఇండియ న్ ఎయిర్ఫోర్స్ ఆఫీసర్గా వరుణ్ తేజ్, రాడార్ కమ్యూనికేష న్స్ ఆఫీసర్గా మానుషీ చిల్లర్ నటిస్తున్నారు. మోడల్ టు యాక్టర్ మోడల్గా కెరీర్ ఆరంభించి, ఆ తర్వాత హీరోయి న్ గా సెటిలైన బాలీవుడ్ అమ్మాయిల జాబితా చాలానే ఉంది. ఈ లిస్ట్లో తాజాగా సాక్షీ వైద్య చేరారు. అఖిల్ హీరోగా నటిస్తున్న ‘ఏజెంట్’ సినిమాతో సాక్షీ వైద్య హీరోయి న్ గా తెలుగుకు పరిచయం అవుతున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్నట్లుగా తెలిసింది. అఖిల్, సాక్షీలపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారట. ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కానుంది. వీరితోపాటు మరికొంతమంది హిందీ తారలు తెలుగు తెరకు పరిచయం కానున్నారు. -
తెలుగు తెరకు ప్రపంచ సుందరి
మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ తెలుగు తెరకు పరిచయం కానున్నారు. 2017లో ‘ప్రపంచ సుందరి’కిరీటం దక్కించుకున్న ఈ నార్త్ బ్యూటీ హిందీలో ‘సామ్రాట్ పృథ్వీరాజ్’చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయ్యారు. ఇప్పుడు వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ద్వారా టాలీవుడ్లోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ చిత్రంలో మానుషీని కథానాయికగా ఎంపిక చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. తెలుగు,హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా యాడ్ ఫిల్మ్మేకర్, సినిమాటోగ్రాఫర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘యథార్థ ఘటనల ప్రేరణతో రూపొందిస్తున్న యాక్షన్ డ్రామా ఇది. ఇందులో వరుణ్ తేజ్ భారతీయ వైమానిక దళ పైలట్గా, రాడార్ ఆఫీసర్గా మానుషి చేస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో వైమానిక దళం ఎదుర్కొనే సవాళ్లను చూపిస్తున్నాం. శుక్రవారం షూటింగ్ ఆరంభించాం’అని చిత్రబృందం పేర్కొంది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినై సన్స్ పిక్చర్స్ సంస్థలపై సందీప్ ముద్ద నిర్మిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత : నందకుమార్ అబ్బినేని -
మాజీ విశ్వసుందరితో మెగా హీరో రొమాన్స్..
వైవిధ్యమైన సినిమాలతో దూసుకుపోతున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా కొత్త కథలను ఎంచుకునే వరుణ్ ప్రస్తుతం ఓ పాన్ ఇండియా చిత్రలో నటిస్తున్నాడు. VT13 అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ అనే డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ ఫైటర్ పైలట్గా నటిస్తున్నాడు. ప్రస్తుతం వార్ డ్రామా నేపథ్యంలో చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ బ్యూటీ మానుషి చిల్లర్ నటించనున్నట్లు ప్రకటిస్తే మేకర్స్ గ్లింప్స్ని విడుదల చేశారు. We are on a journey to celebrate the Pride & Glory of the IAF 🇮🇳 Team #VT13 Welcomes Aboard @ManushiChhillar to join the force💥 Shoot Begins❤️🔥 🌟ing @IAmVarunTej@ShaktipsHada89 @dophari @sidhu_mudda @nandu_abbineni @RenaissancePicz @khanwacky @sonypicsfilmsin @SonyPicsIndia pic.twitter.com/jl6dsgwRfT — Sony Pictures Films India (@sonypicsfilmsin) March 3, 2023 -
పెళ్లయిన వ్యక్తితో మాజీ ప్రపంచసుందరి డేటింగ్..ఇంతకీ ఎవరో తెలుసా..!
మాజీ మిస్ వరల్డ్, నటి, మోడల్ మానుషి చిల్లర్పై రూమర్స్ తెగ వైరలవుతున్నాయి. హర్యానాకు చెందిన నటి ఓ వ్యాపారవేత్తతో డేటింగ్లో ఉన్నట్లు బీటౌన్లో టాక్ నడుస్తోంది. 2021 నుంచి ఈ జంట తరచూ విహారయాత్రలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. జీరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు సమాచారం. వీరిద్దరి ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు కూడా తెలుసని బాలీవుడ్లో టాక్. (చదవండి: 'అలా ఆలోచించే వాళ్లయితే ఓకే'.. పెళ్లిపై నిత్యామీనన్ ఆసక్తికర కామెంట్స్..!) అయితే వ్యాపారవేత్త నిఖిల్ కామత్కు ఇదివరకే పెళ్లయింది. 2019లో పెళ్లి చేసుకున్న కామత్ గతేడాదే మొదటి భార్యతో విడాకులు తీసుకున్నారు. అతను ప్రస్తుతం మాజీ విశ్వసుందరి మానుషి చిల్లర్తో డేటింగ్లో ఉన్నారని నెట్టింట్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మానుషి ప్రస్తుతం సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన ఆమె నటించింది. అయితే డేటింగ్ వార్తలపై ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. -
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మాజీ ప్రపంచ సుందరి! ఆ మెగా హీరోకి జోడిగా..
మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. మెగా హీరోతో ఆమె జోడికట్టబోతున్నట్లు తెలుస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్తేజ్ హీరోగా ఇండియన్ ఎయిర్ఫోర్స్ బ్యాక్డ్రాప్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇందులో జెట్ పైలెట్గా వరుణ్తేజ్ కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో వరుణ్తేజ్కు జోడీగా మిస్ ఇండియా మానుషి చిల్లార్ హీరోయిన్గా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2017లో మిస్ ఇండియాతో పాటు మిస్ వరల్ట్ టైటిల్స్ను మానుషి చిల్లార్ సొంతం చేసుకున్నది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన చారిత్రక చిత్రం సామ్రాట్ పృథ్వీరాజ్తో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో రాణి సంయోగిత పాత్రలో మానుషి చిల్లర్ నటనకు ప్రశంసలు దక్కాయి. -
స్వతంత్ర భారతి: మిస్ వరల్డ్ మానుషి
హర్యానాకు చెందిన ఇరవై ఏళ్ల యువతి మానుషి చిల్లర్ ‘మిస్ వరల్డ్’ టైటిల్ గెలుచుకున్నారు. 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా మిస్ట్ వరల్డ్ విజేతగా ఎన్నికైన పదిహేడేళ్లకు మళ్లీ భారత్కు ఈ ఘనతను మానుషి సాధించిపెట్టారు. చైనాలోని శాన్యా సిటీలో నవంబర్ 18న జరిగిన ప్రపంచ సుందరి అందాల పోటీల ఫైనల్స్లో 117 మందితో మానుషి పోటీ పడి టైటిల్ గెలిచారు. మానుషి ఢిల్లీలోని సెయింట్ థామస్ స్కూల్లో చదువుకున్నారు. సి.బి.ఎస్.ఇ.లో ఇంగ్లిష్ సబ్జెక్టులో ఆలిం డియా టాపర్గా నిలిచారు. తొలి ప్రయత్నంలోనే ‘నీట్’లో సీటు సాధించి సోనిపట్ (హర్యానా) లోని భగత్ ఫూల్ సింగ్ మెడికల్ కాలేజీలో ఎం.బి.బి.ఎస్.లో చేరారు. ఆమె కూచిపూడి డ్యాన్సర్ కూడా. రాజా రాధారెడ్డి దంపతుల దగ్గర నాట్యం నేర్చుకున్నారు. ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు జూన్ 30 అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చిన జి.ఎస్.టి. 92 ఏళ్లుగా ప్రభుత్వం విడిగా ప్రవేశపెడుతున్న రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్లో విలీనం. కొచ్చి, హైద్రాబాద్ల మెట్రో రైళ్లు ప్రారంభం. భారత 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్. బెంగళూరులో సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ను తుపాకీతో కాల్చి చంపిన దుండగులు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ. (చదవండి: భయంకర వెంకటాచారి: గాంధీమార్గం వీడి బాంబులతో జోడీ) -
ప్రేక్షకుల్లేక స్టార్ హీరో మూవీ రద్దు!
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ ప్రధాన పాత్రల్లో నటించిన చారిత్రాత్మక చిత్రం ‘పృథ్వీరాజ్’. ఢిల్లీని పరిపాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడదలైన ఈ మూవీ వారానికే బాక్సాఫీసు వద్ద బోల్తా పడిందిన వార్తలు వినిపిస్తున్నాయి. థియేటర్లో ప్రేక్షకులు లేకపోవడంతో మూవీ ప్రదర్శనను నిలిపివేసినట్లు బి-టౌన్ పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిలిం నిర్మించాయి. భారీ వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఈ సినిమాను రూ. 300 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. చదవండి: పాన్ ఇండియా చిత్రాలకు ఎందుకన్ని వందల కోట్లు?: తమ్మారెడ్డి భరద్వాజ్ పలు వాయిదాల అనంతరం రిలీజ్ అయిన ఈ మూవీపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. అయితే విడుదల అనంతరం ఈ చిత్రం ఆశించిన స్థాయితో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఈ మూవీకి ఇప్పటి వరకు రూ. 55 కోట్లు మాత్రమే వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. ఇక మూవీపై పెద్దగా టాక్ లేని నేపథ్యంలో నేటి షో చూసేందుకు ఒక్కరు కూడా రాకపోవడంతో ఓ థియేటర్లో షోని రద్దు చేశారట. ఇక మరికొన్ని చోట్ల థియేటర్లో ఎక్కువ భాగం సీట్లు ఖాళీగా ఉండటంతో ఇక ‘పృథ్వీరాజ్’ సినిమా ప్రదర్శనను నిలిపివేశారంటూ వార్తలు వస్తున్నాయి. కాగా జూన్ 3న ఈ మూవీ హిందీ, తమిళంతో పాటు తెలుగులో విడుదలైన సంగతి తెలిసిందే. చదవండి: Vignesh Shivan-Nayanthara: ‘ఆ కంగారులో చూసుకోలేదు క్షమించండి’ -
రామ్ చరణ్ అంటే క్రష్, అతడితో డేట్కి వెళ్తా: మాజీ ప్రపంచ సుందరి
మాజీ ప్రపంచ సుందరి, నటి మానుషి చిల్లర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు రామ్ చరణ్ అంటే క్రష్ అని అతడితో డేట్కు వెళ్లానంటూ తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆమె చేసిన కామెంట్స్ హాట్టాపిక్గా నిలిచాయి. మానుషి బాలీవుడ్లో తొలిసారిగా నటించిన చిత్రం ‘పృథ్విరాజ్’. ఈ మూవీలో అక్షయ్ కుమార్ సరసన ఆమె నటించింది. ఈ సినిమా రేపు(జూన్ 3న) థియేటర్లలోకి రానుంది. చదవండి: OTT: 3 వారాలకే అమెజాన్లో సర్కారు వారి పాట స్ట్రీమింగ్, కానీ.. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఆమె వరుస ఇంటర్య్వూలతో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఆమెకు.. ఫేవరెట్ హీరో ఎవరు? నెక్స్ట్ మూవీ ఏ హీరోతో చేయాలనుకుంటున్నారు? వంటి ప్రశ్నలు ఎదురయ్యాయి. వీటిపై ఆమె స్పందిస్తూ.. రామ్ చరణ్తో వర్క్ చేయాలని ఉందని, ఆర్ఆర్ఆర్ చూశాక చరణ్కు ఫ్యాన్ అయిపోయానని చెప్పింది. ఇక మరో ఇంటర్య్వూలో ఇండస్ట్రీలో మీరు ఏ హీరోతో డేటింగ్కు వేళ్లాలనుకుంటున్నారు? అని అడగ్గా.. రామ్ చరణ్ అని సమాధానం ఇచ్చింది. చదవండి: ఎఫ్ 3 ఓటీటీకి వచ్చేది అప్పుడేనట, మూవీ టీం క్లారిటీ ఇక అతడికి పెళ్లి అయిపోయింది కదా అని చెప్పడంతో.. పెళ్లి కాకపోయి ఉంటే డేట్కి వెళ్దామా అని చరణ్ను తానే స్వయంగా అడిగేదాన్ని అని చెప్పింది. డేటింగ్లో ఏం చేస్తారని అడగ్గా.. కలిసి సినిమాలు చూస్తాం, ఇష్టమైన ఫుడ్ తింటాం, ఇంకా ఎన్నెన్నో వియాలను మాట్లాడుకుంటామని మానుషి చెప్పుకొచ్చింది. కాగా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన పృథ్వీరాజ్ సినిమాలో అక్షయ్ కుమార్ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. మానుషి అతడి భార్యగా కనిపించనుంది. చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, అశుతోష్ రాణా, సోనూ సూద్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
మొదటిసారి విన్నప్పుడే ప్రేమలో పడ్డాను: అక్షయ్ కుమార్
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం "పృథ్వీరాజ్". ఢిల్లీని పరిపాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్నారు. ఢిల్లీ సామ్రాజ్యంపై క్రూరమైన దండయాత్ర చేసిన మహమ్మద్ ఘోరీ నుంచి భారతదేశాన్ని రక్షించడానికి ధైర్యంగా పోరాడిన పురాణ యోధుని పాత్రలో అక్షయ్ నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో నుంచి "హరి హర్" అనే మొదటి సాంగ్ను అక్షయ్ కుమార్ రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "హరి హర్ పాట ఈ సినిమాకి ఒక ఆత్మ లాంటిది. మహమ్మద్ ఘోరీతో చేసిన యుద్ధంలో సర్వస్వాన్ని త్యాగం చేసిన పృధ్వీరాజ్ చౌహాన్కి నా వందనం. దేశాన్ని రక్షించాలనే పృధ్వీరాజ్ బలమైన పట్టుదల ఈ పాటలో ప్రతిబింబిస్తుంది. అందుకే ఈ పాట నా మనుసుకి లోతుగా హత్తుకుంది. మొదట సారి విన్నపుడే ఈ పాటతో ప్రేమలో పడ్డాను" అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ సీరియల్ "చాణక్య"ని తెరకెక్కించిన డా. చంద్రప్రకాష్ ద్వివేది "పృథ్వీరాజ్" సినిమాకి దర్శకత్వం వహించారు. పృథ్వీరాజ్ భార్య సంయోగిత పాత్రలో మానుషి చిల్లర్ కనిపించనుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 3వ తేదీన హిందీ, తమిళంతో పాటు తెలుగులో విడుదల కానుంది. చదవండి: సాక్షి ఆడియన్స్ పోల్, సర్కారువారి పాటపై ప్రేక్షకుల రివ్యూ -
ఆసక్తిగా అక్షయ్ కుమార్ 'పృథ్వీరాజ్' ట్రైలర్..
Akshay Kumar Prithviraj Movie Trailer Released: ఈ ఏడాది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హిందీ సినిమాలలో పృథ్వీరాజ్ ఒకటి. బాలీవుడ్ యాక్షన్ హీరో టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం ఇది. ఈ మూవీకి చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించగా సంజయ్ దత్, అశుతోష్ రాణా, సోనూ సూద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా మిస్ వరల్డ్ 2017 మానుషి చిల్లర్ ఈ సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేయనుంది. ఇటీవల విడుదలై ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను మే 9న రిలీజ్ చేశారు మేకర్స్. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం నిర్భయ, శక్తివంతమైన యోధుడు సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ జీవితం ఆధారంగా రూపొందించారు. 2 నిమిషాల 50 సెకన్ల ఈ ట్రైలర్లో విజువల్స్, యాక్షన్ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. శ్ రాజ్ ఫిల్మ్స్ ‘పృథ్వీరాజ్’తో మొదటిసారిగా చారిత్రక నేపథ్యమున్న సినిమాను రూపొందించడం విశేషం. చదవండి: అక్షయ్ కుమార్ను ఆడేసుకుంటున్న నెటిజన్స్.. కారణమేంటంటే ? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అక్షయ్ కుమార్ను ఆడేసుకుంటున్న నెటిజన్స్.. కారణమేంటంటే ?
Akshay Kumar Trolling On Romancing With Younger Actress: బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ట్రోలింగ్కు గురయ్యారు. తనకన్న తక్కువ వయసున్న హీరోయిన్తో రొమాన్స్ ఏంటని ప్రశ్నిస్త్నున్నారు. అక్కీ నటించిన 'సూర్యవంశీ' బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ఈ జోష్తో అక్షయ్ కుమార్ తాజా చిత్రం 'పృథ్వీరాజ్' టీజర్ విడుదలైంది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ చౌహన్ జీవితం, ఆయన పరాక్రమం ఆధారంగా తెరకెక్కించారు. కత్తి యుద్ధాలు, నినాదాలు, పోరటాలతో పాటు 2017 మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ అందులో కనిపించారు. అంతా బానే ఉంది. కానీ ఈ చిత్రంలో అక్షయ్ కుమార్కు మానుషి ప్రియురాలిగా నటించనుంది. ఇదే ఇప్పుడు వివాదస్పదమవుతోంది. దీనికి కారణం అక్కీ, మానుషి మధ్య వయసు తేడా. దీన్ని'ఇదేందయ్యా ఇది' అంటూ ట్రోలింగ్ తో షేక్ చేస్తున్నారు నెటిజన్స్. అంటూ ట్రోలింగ్తో షేక్ చేస్తున్నారు నెటిజన్స్. The Hero is 54 The Heroine is 24 And that's bollywood lovestory for you. — Ritushree 🌈 (@QueerNaari) November 16, 2021 'అక్కీకి 54, మానిషికి 24.. ఇదా మీ బాలీవుడ్ లవ్ స్టోరీ' అంటూ ఓ యూజర్ స్పందిచగా, '54 ఏళ్ల అక్షయ్ కుమార్, 24 ఏళ్ల మానుషితో రొమాన్స్ చేస్తున్నాడు. గుర్తుంచుకోండి, మనం కొంచెం జాగ్రత్తగా హీరోలను ఎంచుకోవాలి' అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఇంకొకరు 'వాట్ ద హెల్ మ్యాన్, ఇది కొంచైమైనా భావ్యంగా ఉందా' అని రాసుకొచ్చాడు. ఇలా రకరకాలుగా అక్షయ్ కుమార్, మానుషి చిల్లర్ వయసు తేడాపై ట్రోలింగ్కి దిగారు. ఇది కాక అక్కీ అప్కమింగ్ మూవీ ఆత్రంగిలో కూడా తన కన్న 28 సంవత్సరాలు చిన్నదైన సారా అలీ ఖాన్తో నటించనున్నారు. Just a reminder that @akshaykumar is 54-year-old man with a Canadian passport romancing an actress who is 24 years old. We need to pick our heroes more carefully. https://t.co/sj6F58QANi — Saahil Dama (@saahil_dama) November 15, 2021 Akshay Kumar's age - 54 yrs. Manushi Chhillar's age - 24 yrs. What the hell man...how is this even normalised? 🤯🙄 https://t.co/5886PbGL7O — Coby (@superfunkie) November 15, 2021 అయితే సినీ ఇండస్ట్రీలో ఇదేం కొత్త విషయం కాదు. ఇంతకుముందు ఎంతోమంది కథనాయకులు తమకంటే చాలా ఏజ్ గ్యాప్ ఉన్న హీరోయిన్స్తో యాక్ట్ చేశారు. భారత్ చిత్రంలోని 'స్లో మోషన్' సాంగ్లో 29 ఏళ్ల దిశా పటానీతో 55 సంవత్సరాల సల్మాన్ ఖాన్ రొమాన్స్ చేశాడు. అలాగే 'దేదే ప్యార్ దే'లో అజయ్ దేవగన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఆ మాటకొస్తే సౌత్ ఇండియాలో కూడా ఇలా ఏజ్ తక్కువ ఉన్న హీరోయిన్స్తో రొమాన్స్ చేసిన హీరోలు ఉన్నారు. చదవండి: అక్షయ్ కుమార్ 'పృథ్వీరాజ్' టీజర్ రిలీజ్.. -
లవర్బాయ్గా ఆది పినిశెట్టి, అది భ్రమ అంటున్న అనుపమ
► నన్ను ఎప్పుడైన దగ్గరగా చూడాలనుకుంటున్నారా? అంటూ క్లోజ్ ఫొటో షేర్ చేసిన అషురెడ్డి ► కర్తవ్యాన్ని పూర్తి చేసింది అంటూ సెల్ఫీ ఫొటో షేర్ చేసిన పూనమ్ కౌర్ ► శర్వానంద్, ఆదిత్య రాయ్లతో కలిసి ఫొటో దిగిన సిద్ధార్థ్, మహా సముంద్రం టీం కలిసినప్పుడు అంతే అంటున్నా హీరో ► లవర్ బాయ్గా సర్టిఫై అయ్యానంటున్న ఆది పినిశెట్టి ► పెర్ఫెక్ట్గా ఉండమంటే ఒక భ్రమే అంటున్నా అనుపమా పరమేశ్వరన్ ► చీరకట్టులో మైమరిపిస్తున్న శ్రద్ధదాస్ View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Aadhi (@aadhiofficial) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Nikki Galrani ✨ (@nikkigalrani) View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth) View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by mon (@imouniroy) -
అక్షయ్ కుమార్ ‘పృథ్వీరాజ్’ మూవీపై కర్ణిసేన ఆగ్రహం
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, మాజీ విశ్వసుందరి మానుషి చిల్లర్ ప్రధాన పాత్రల్లో రాబోతున్న చిత్రం ‘పృథ్వీరాజ్’. తాజాగా ఈ మూవీ టైటిల్ వివాదంలో చిక్కుకుంది. చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా తన నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న మూవీ టైటిల్పై కర్ణి సేన సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మూవీ టైటిల్ పేరు వెంటనే మర్చాలని కర్ణి సేన యూత్ వింగ్ ప్రెసిడెంట్, చిత్ర నిర్మాత సుర్జీత్ సింగ్ రాథోర్ డిమాండ్ చేశారు. ఆయన ఇన్స్టాగ్రామ్లో న్యూస్ ఆర్టికల్ షేర్ చేస్తూ మూడు షరతులు విధించారు. మేకర్స్ వెంటనే ఈ మూవీ టైటిల్ను పృథ్వీరాజ్ నుంచి చక్రవర్తి పూర్తి పేరు పృథ్వీరాజ్ చౌహాన్గా మార్చాలని, అలా కాకుండా ‘పృథ్వీరాజ్’ అని మాత్రమే పేరు పెట్టడం తగదన్నారు. అది హిందూ చక్రవర్తి ప్రతిష్ఠకు భంగం కలిగించడమే అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ తమ డిమాండ్లను తిరస్కరిస్తే గతంలో సంజయ్ లీలా భన్సాలీ ‘పద్మావత్’ సినిమా ఎదుర్కొన్న పరిణామాలనే మీరు కూడా చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ పోస్టులో ఆయన ‘ఈ మూవీలో లీడ్ రోల్ పోషిస్తున్న అక్షయ్ కుమార్ను తాము గౌరవిస్తున్నాం. అయితే ఈ చిత్ర నిర్మాత ఆదిత్య ప్రజల మనోభావాలను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. చివరి హిందూ సామ్రాట్ యోధుడైన పృథ్వీరాజ్ చౌహాన్ పూర్తి పేరు మీ మూవీకి పెట్టాలి. అంతేగాక ఇందులో ఆయన గొప్పతనం ప్రతిబింబించాలి. ఒకవేళ అలా లేకుంటే పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి ఆందోళన చేపడతాం’ అంటూ డిమాండ్ చేశారు. కాగా గతంలో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన పద్మావత్ సినిమాకు విడుదల సమయంలో వివాదం చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Surjeet Singh Rajput (@realsurjeetsinghrajput) -
ఆ పంచ్ నా భర్తపై ప్రయోగిస్తా: దీపికా పల్లికల్
ముంబై: ''మీరు చెప్పే హుక్ పంచ్ను నా భర్త దినేశ్ కార్తిక్పై ప్రయోగిస్తానంటూ'' ఇండియన్ స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాక్సర్ నిఖత్ జరీన్ అడిగిన ప్రశ్నకు దీపిక ఈ విధంగా సమాధానమిచ్చింది. అసలు విషయంలోకి వెళితే.. ప్రముఖ అడ్వర్టైజింగ్ సంస్థ అడిడాస్ నిర్వహించిన ఒక ఈవెంట్కు దీపికా పల్లికల్తో పాటు 2017 మిస్ వరల్డ్ మానుషి చిల్లర్, ఇండియన్ బాక్సర్ నిఖత్ జరీన్లు హాజరయ్యారు. అడిడాస్ నిర్వహించిన వాచ్ అస్ మూవ్ క్యాంపెయిన్ కార్యక్రమంలో పాల్గొన్న వీరి మధ్య సరదా సంభాషణ జరిగింది. బాక్సర్ నిఖత్ జరీన్ తన ఫేవరెట్ షాట్ అయిన హుక్ పంచ్ను ప్రస్తావించిది. తాను ఆ పంచ్ను ఎలా ఉపయోగిస్తాననేది దీపికా, మానుషి చిల్లర్కు వివరించింది. ఈ నేపథ్యంలో ''దీపికా.. మీరు హుక్ పంచ్ను ఎవరిపై ప్రయోగిస్తారు'' అని నిఖత్ జరీన్ ప్రశ్నించింది. నిఖత్ ప్రశ్నకు దీపిక వెంటనే స్పందిస్తూ '' వేరే వాళ్లపై ప్రయోగిస్తే ఊరుకోరు.. అందుకే నేను ఈరోజే నా భర్త కార్తిక్పై ప్రయోగిస్తా..'' అంటూ చెప్పడం అక్కడున్న వారందరికి నవ్వు తెప్పించింది. ఇంటికి వెళ్లగానే కార్తిక్కు హుక్ పంచ్ గురించి వివరించి దానిని అమలు పరిచేలా చూస్తానని దీపికా తెలిపింది. ఇండియన్ స్క్వాష్ ప్లేయర్గా గుర్తింపు పొందిన దీపికా పల్లికల్ 2013లో క్రికెటర్ దినేశ్ కార్తిక్ను పెళ్లాడింది. ఇప్పటివరకు ఎన్నో మెడల్స్ సాధించిన ఆమె మూడు మెడల్స్ను కామన్వెల్త్ గేమ్స్లో.. మరో నాలుగు పతకాలు ఏషియన్ గేమ్స్లో గెలుచుకుంది. ఇక టీమిండియా జట్టుకు చాలాకాలంగా దూరమైన దినేశ్ కార్తిక్ ఐపీఎల్ 14వ సీజన్కు సిద్ధమవుతున్నాడు. గతేడాది కేకేఆర్కు కెప్టెన్గ వ్యవహరించిన కార్తిక్ లీగ్ మధ్యలో కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో కేకేఆర్ యాజమాన్యం ఇంగ్లండ్ ఆటగాడు ఇయాన్ మోర్గాన్కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. 2019లో చివరిసారిగా వన్డే ఆడిన కార్తిక్ టీమిండియా తరపున 94 వన్డేల్లో 1752 పరుగులు, 32 టీ20ల్లో 399 పరుగులు, 26 టెస్టుల్లో 1025 పరుగులు సాధించాడు. చదవండి: శుభ్మన్ గిల్కు వీవీఎస్ లక్ష్మణ్ వార్నింగ్! రూల్స్ పక్కన పెట్టండి, నచ్చింది చేయండి: జడేజా -
నాన్స్టాప్ కుమార్
లాక్డౌన్లో సినిమాల చిత్రీకరణను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని చేయాలా? అని చాలామంది ఆలోచిస్తుంటే ‘బెల్ బాటమ్’ సినిమాను ప్రారంభించారు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. ప్రారంభించడమే కాదు లాక్డౌన్లో పూర్తి చేసేశారు కూడా. తాజాగా ‘పృథ్వీరాజ్’ సినిమా సెట్లో జాయిన్ అయ్యారు. అక్షయ్ కుమార్, సోనూ సూద్, మనూషీ చిల్లర్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటిస్తున్న పీరియాడికల్ చిత్రం ఇది. యశ్ రాజ్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ తాజాగా ప్రారంభం అయింది. సోనూ సూద్, అక్షయ్ కుమార్లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కొన్ని రోజుల్లో మనూషీ కూడా సెట్లో జాయిన్ అవ్వనున్నారు. సినిమా పూర్తయ్యే వరకూ నాన్స్టాప్గా చిత్రీకరణ కొనసాగనుంది. ఇలా ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా షూటింగ్లో పాల్గొంటూ బిజీగా ఉంటున్న అక్షయ్ కుమార్ని కొందరు ‘నాన్స్టాప్ కుమార్’ అంటున్నారు. -
‘తీవ్ర మనస్తాపానికి గురి చేస్తోంది’
కేంద్రప్రభుత్వం ఇచ్చిన లాక్డౌన్ సడలింపులతో సినీ సెలబ్రిటీలు నెమ్మదిగా షూటింగ్స్లో పాల్గొంటున్నారు. అయితే మరి కొంతమంది సినీ ప్రముఖులు ఇంటికే పరిమితమై సోషల్ మీడియా వేదికగా అభిమానులకు చేరువవుతున్నారు. తమ వృత్తిగత, వ్యక్తిగత విషయాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రపంచ మాజీ సుందరి మానుషి చిల్లర్ తాజాగా తాను చిన్నతనంలో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఓ ఫొటోలో మానుషి తన తల్లితో బర్త్డే కేక్ను కట్ చేస్తూ కనిపిస్తోంది. ‘యూనిసెఫ్ ఇండియా చైల్డ్హుడ్ చాలెంజ్’ లో భాగంగా తన చిన్ననాటి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు మానుషి పేర్కొన్నారు. (మరోసారి ఫేక్న్యూస్ బారిన రకుల్) ‘సురక్షితమైన, సంతోషకరమైన బాల్యాన్ని పొందాను. నేను చాలా అదృష్టవంతురాలిని. ప్రస్తుతం చాలా మంది పిల్లలకు అలాంటి హక్కు లేకుండా పోయింది. ఇది నన్ను తీవ్ర మనస్తాపానికి గురి చేస్తోంది’ అని మానుషి చెప్పారు. యూనిసెఫ్ బలహీనమైన పిల్లలకు అత్యవసర, ప్రాణ రక్షణ సాయాన్ని అందిస్తోందని ఆమె తెలిపారు. యూనిసెఫ్ ఇండియా చైల్డ్హుడ్ చాలెంజ్కు మద్దతు తెలుపుతూ.. మీరు(పిల్లలు) మీ వయస్సుకు సమానంగా యూనిసెఫ్ ఇండియాకు విరాళం ఇవ్వాలని కోరారు. ఇక ప్రపంచాన్ని పిల్లలందరికీ మెరుగైన ప్రదేశంగా మారుస్తామని, సంక్షోభంలో ఉన్నవారిని రక్షించాలని ప్రతిజ్ఞ చేద్దామని మానుషి పేర్కొన్నారు. మానుషి చిల్లర్ 2017లో ప్రపంచ సుందరిగా కిరీటం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక మానుషి తన తొలి హిందీ సినిమా ‘పృథ్వీరాజ్’లో హీరో అక్షయ్ కుమార్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. (మరోసారి తెరపైకి కంగనా!) View this post on Instagram I have been blessed and fortunate enough to have had a safe, healthy and happy childhood. Today I realise the importance of my upbringing that has impacted and shaped my value system, my perspective towards the world and people, and has also made me the person that I am today. Thus, it’s deeply disturbing to know how many children in my country don’t get the childhood that they deserve. The current pandemic is only increasing the threat for them when they are at such an impressionable age. But we can together make a difference. UNICEF is providing urgent and life saving support to vulnerable children. I’m supporting them and you can too. Support the Childhood Challenge initiative by sharing your happiest childhood memory and donate to UNICEF India the amount equal to the year you were born in. Let’s pledge to make the world a better place for all children and particularly save those in crisis situations. @unicefindia #ChildhoodChallenge A post shared by Manushi Chhillar (@manushi_chhillar) on Jun 26, 2020 at 11:29pm PDT -
‘ఆ రెండు ఒకే రోజు జరగటం యాదృచ్ఛికం’
ప్రపంచ మాజీ సుందరి మానుషి చిల్లర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మానుషి తొలి చిత్రంతోనే ఖిలాడీ అక్షయ్ కుమార్కు జోడిగా నటించే అవకాశం దక్కించుకున్నారు. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న ‘పృథ్వీరాజ్’ సినిమాలో చక్రవర్తి ప్రేమికురాలు రాణి సంయోగితగా ఆమె కనిపించనున్నారు. అయితే చిత్ర షూటింగ్లో భాగంగా మానుషి తన తొలి హింది సినిమా ‘పృథ్వీరాజ్’ మొదటి షాట్ తీయటంలో సోమవారం పాల్గొంది. దీంతో మానుషి తాను మొదటిసారి సినిమాల్లో నటించటం కోసం కెమెరా ముందుకు వచ్చిన ఈ రోజు (నవంబర్ 18). అలాగే రెండేళ్ల కిందట 2017లో ప్రపంచ సుందరిగా కిరీటం దక్కించుకున్నది ఇదే రోజు అవడాన్ని చాలా యాదృచ్ఛికంగా భావిస్తున్నానని మానుషి సోషల్ మీడియాలో పంచుకుంది. రెండు ముఖ్యమైన వియయాలు ఒకే రోజు జరగటం తనకు సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. నవంబర్ 18 తనకు చాలా ప్రత్యేకమైన రోజని తెలిపారు. తన జీవితంలో మైలురాయిగా నిలిచిపోయే రెండు అద్భుతమైన సంఘటనలు ఒకేరోజు ( నవంబర్18) చోటుచేసుకోవటం పట్ల థ్రిల్గా ఫీల్ అవుతున్నాని మానుషి తెలిపారు. View this post on Instagram Feeling blessed 🙏🏻💫 #Prithviraj puja #Diwali2020 @akshaykumar #DrChandraprakashDwivedi @yrf @prithvirajmovie A post shared by Manushi Chhillar (@manushi_chhillar) on Nov 15, 2019 at 12:39am PST తాను చాలా మందికి కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పారు. నటీగా తనను తాను నిరుపించుకోవడానికి ఎంతో కష్టపడ్డానని తెలిపారు. అదేవిధంగా హార్డ్ వర్క్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పుకొచ్చారు. తనకు, తాను నటించిన చిత్రం ‘పృథ్వీరాజ్’కు ఈ విశ్వం టన్నుల కొద్ది అదృష్టాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్టు మానుషి తెలిపారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యశ్రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు శుక్రవారం ముంబైలో జరిగిన విషయం తెలిసిందే. ఐశ్వర్యారాయ్, ప్రియాంక చోప్రా మాదిరి మానుషి కూడా సినిమాల్లో తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. దర్శకుడు చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వంలో తెరకెక్కె ‘పృథ్వీరాజ్’ 2020 దీపావళీకి ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మానుషి చిల్లర్ బాలీవుడ్ ఎంట్రీ
ముంబై : ప్రపంచ మాజీ సుందరి మానుషి చిల్లర్ బాలీవుడ్ ఎంట్రీ ఎట్టకేలకు ఖరారైంది. ఐశ్వర్యారాయ్, ప్రియాంక చోప్రా మాదిరి మానుషి కూడా సినిమాల్లో తన అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. 2017లో భారత్కు ప్రపంచ సుందరి కిరీటం సాధించి పెట్టిన ఈ అందాల రాశి చారిత్రక చిత్రంతో బీ-టౌన్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తొలి చిత్రంతోనే ఖిలాడీ అక్షయ్ కుమార్కు జోడిగా నటించే అవకాశం దక్కించుకున్నారు. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న ‘పృథ్వీరాజ్’ సినిమాలో చక్రవర్తి ప్రేమికురాలు రాణి సంయోగితగా ఆమె కనిపించనున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యశ్రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు శుక్రవారం ముంబైలో జరిగాయి. ఈ క్రమంలో సినీ రంగప్రవేశం గురించి మానుషి(22) మాట్లాడుతూ... చారిత్రక చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. యశ్రాజ్ ఫిలిమ్స్ సినిమాలో భాగస్వామ్యం కావడం గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. ‘ నా జీవితం అంతా ఓ అందమైన ఓ కథలాంటిది. మిస్ ఇండియా నుంచి మిస్ వరల్్డ దాకా సాగిన ప్రయాణంలో ఎన్నెన్నో విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు సినిమాల్లోకి రావడం ద్వారా కొత్త అధ్యాయాన్ని మొదలుపెడుతున్నాను. రాణి సంయోగితగా నటించడం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. భారత దేశ చరిత్రలో తనకంటూ కొన్ని పుటలు లిఖించుకున్న ఆమె పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాను. మీ ఆశీర్వాదాలు కావాలి’ అని పేర్కొన్నారు. ఇక సినిమా దర్శకుడు చంద్రప్రకాశ్ ద్వివేది మాట్లాడుతూ.. సంయోగిత పాత్ర కోసం అందమైన, విశ్వాసం కలిగిన అమ్మాయి కోసం వెదికాం. ఆ లక్షణాలు మాకు మానుషిలో కనబడ్డాయి. అందుకే ఆమెను ఎంపిక చేశాం అని చెప్పుకొచ్చారు. ఈ సినిమాను వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. Here's to auspicious beginnings 🙏 Stepping into the world of #Prithviraj. In theatres #Diwali2020! Need your love and best wishes as always. @ManushiChhillar #DrChandraprakashDwivedi @yrf pic.twitter.com/w3KQh4NhPe — Akshay Kumar (@akshaykumar) November 15, 2019 -
ప్రపంచ సుందరిగా ‘మిస్ మెక్సికో’
-
ప్రపంచ సుందరిగా ‘మిస్ మెక్సికో’
బీజింగ్: 2018 సంవత్సరానికి గానూ ప్రపంచసుందరి కిరీటాన్ని మెక్సికోకు చెందిన వెనెస్సా పోన్స్ డి లియోన్(26) గెలుచుకున్నారు. చైనాలోని సన్యా పట్టణంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ప్రపంచసుందరి, భారత్కు చెందిన మానుషీ ఛిల్లర్.. వెనెస్సాకు ప్రపంచసుందరి కిరీటాన్ని అలంకరించారు. ఈ పోటీలో థాయ్లాండ్కు చెందిన నికోలేనే పిచప లిమ్స్నుకన్ మొదటి రన్నరప్గా నిలిచారు. మారియా వసిల్విచ్(బెలారస్), కదీజా రాబిన్సన్(జమైకా), క్విన్ అబేనక్యో(ఉగాండా)లు తొలి ఐదు స్థానాల్లో నిలిచారు. కాగా, భారత్ నుంచి ఈసారి పోటీపడ్డ అనుకృతి వాస్(19) టాప్–30లో చోటు దక్కించుకున్నారు. ప్రపంచసుందరి టైటిల్ను గెలుచుకున్న అనంతరం వెనెస్సా మాట్లాడుతూ..‘దీన్ని నమ్మలేకపోతున్నా. నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి , మెక్సికో ప్రజలందరికీ ఈ గెలుపు అంకితం. నేను వాళ్లను గర్వపడేలా చేశాననే భావిస్తున్నా’ అని తెలిపారు. ఈ పోటీల్లో 118 దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొన్నారు. -
మిస్ వరల్డ్గా మెక్సికన్ యువతి
బీజింగ్ : ఈ ఏడాది ప్రపంచ సుందరిగా మెక్సికోకు చెందిన వెనెస్సా పోన్స్ డీ లియోన్(26) ఎంపికైంది. శనివారం సాయంత్రం చైనాలోని సన్యా సిటీలో జరిగిన 68వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీల్లో న్యాయ నిర్ణేతల బృందం ఆమెను విజేతగా ప్రకటించింది. రన్నరప్గా థాయ్లాండ్కు చెందిన నికోలిన్ లిమ్స్నుకన్ నిలిచింది. మొత్తం 118 మంది పాల్గొన్న ఈ అందాల పోటీల్లో భారత్కు చెందిన అనుకృతి వ్యాస్(మిస్ ఇండియా 2018) టాప్ 30(19వ స్థానం)లో చోటు సంపాదించుకుంది. ఇక మిస్ వరల్డ్ 2017 మానుషి చిల్లర్ తన వారసురాలు వెనెస్సాకు కిరీటం తొడిగింది. కాగా మెక్సికోకు చెందిన వెనెస్సా ఇంటర్నేషనల్ బిజినెస్లో డిగ్రీ పూర్తి చేసి.. ప్రస్తుతం మోడల్గా రాణిస్తోంది. పలు సామాజిక కార్యక్రమాల్లో భాగమవుతూ మానవతావాదిగా గుర్తింపు తెచ్చుకుంది. View this post on Instagram Miss World | 2018 WE HAVE A NEW MISS WORLD !! THE 68TH MISS WORLD TITLE GOES TO: Mexico Vanessa Ponce de Leon Miss World | 2018 | FIRST RUNNER UP Thailand . . CONGRATULATIONS !! . #missworld #mw2018 #mwo #mw2018sanya #mw2018china #missmundo . A post shared by Miss World (@missworld) on Dec 8, 2018 at 6:02am PST -
మలబార్ గోల్డ్ బ్రాండ్ అంబాసిడర్గా మానుషి చిల్లర్
ప్రముఖ జువెలరీ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తాజాగా మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది. కాగా మానుషి చిల్లర్ ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహమ్మద్ చేతుల మీదుగా బ్రాండ్ అంబాసిడర్ ఒప్పంద పత్రాలను స్వీకరించారు. -
హృతిక్రోషన్తో నటిస్తా..
‘సినిమాల్లో అవకాశం వస్తే నా ఫేవరేట్ హీరో హృతిక్రోషన్తో నటిస్తా’ అని నిట్ క్యాంపస్ ప్రిన్సెస్ విజేత నీలాక్షిశర్మ పేర్కొన్నారు. నిట్ స్ప్రింగ్ స్ప్రీలో భాగంగా శుక్రవారం నిర్వహించిన క్యాంపస్ ప్రిన్సెస్ ఫ్యాషన్ షోలో విజేతగా నిలిచిన నీలాక్షిశర్మ శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఇవీ.. నమ్మలేకపోతున్నా.. వరంగల్ నిట్లో క్యాంపస్ ప్రిన్సెస్గా ఎంపికవడం నమ్మలేకపోతున్నా. ఇక్కడ చదువుకోవడం నా అదృష్టం. నిట్ను నా సొంత ఇంటిలా భావిస్తాను. ఈ ఏడాది ముంబాయిలో నిర్వహించే మిస్ ఇండియా–2018 పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచేందుకు ప్రయత్నిస్తా. నిట్ డైరెక్టర్, నా తల్లిదండ్రులు, అధ్యాపకులు, స్నేహితులు ప్రవళిక, స్వాతి ప్రోత్సాహంతో క్యాంపస్ ప్రిన్సెస్గా విజయం సాధించా. చదువు, మోడలింగ్ ప్రాధాన్యం.. వరంగల్ నిట్లో బీటెక్ తర్వాత ఎంఎస్ కోర్సు చేస్తూనే మోడలింగ్పై దృష్టిసారిస్తా.. మాది జార్ఖండ్. తండ్రి అనిల్కుమార్, తల్లి సీమాశర్మ, సోదరి జీలాక్షిశర్మ.. ప్రతి విషయంలో నన్ను ప్రోత్సహిస్తుంటారు. నాన్న మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫెర్స్లో సెక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. మిస్ ఇండియా–2018 కాంటెస్ట్లో గెలుపొంది మహిళా సాధికారత కోసం కృషి చేస్తా. మానుషీచిల్లర్ స్ఫూర్తితో.. మిస్ ఇండియా– 2017 విజేత మానుషీచిల్లర్ను స్ఫూర్తిగా తీసుకుని క్యాంపస్ ప్రిన్సెస్ పోటీల్లో పాల్గొన్నా. కేవలం వారం రోజులు మాత్రమే సాధన చేశా. గతేడాది స్ప్రింగ్ స్ప్రీలో నిర్వహించిన అల్యూర్ ఫ్యాషన్ షోలో ఐదుగురితో కలిసి ర్యాంపుపై క్యాట్ వాక్ చేశాను. మా టీం విజేతగా నిలిచింది. ఆ విజయంతో కేవలం వారంరోజుల పాటు మాత్రమే ప్రాక్టీస్ చేశాను. -
అందమైన భామలు..లేత మెరుపుతీగలు
-
గుండె కోసే మిస్ వరల్డ్
బాలీవుడ్ జీవులు ఎప్పుడూ పెద్ద వలను పట్టుకొని ఉంటారు... ఎవరు దొరుకుతారా పట్టేద్దామా అని. మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ పోటీల మీద వాళ్లు రెండు, నాలుగు, లేదంటే ఎన్ని వీలైతే అన్ని కళ్లు వేసి ఉంటారు. అక్కడ ఎవరైనా మన ఇండియన్స్ మెరిస్తే సిల్వర్ స్క్రీన్ మీద గోల్డెన్ కెరీర్ ఆఫర్ చేస్తుంటారు. గతంలో ఐశ్వర్యారాయ్, సుస్మితా సేన్, ప్రియాంకా చోప్రాలను అలాగే వాళ్లు వలేసి పట్టారు. ఇప్పుడు తాజాగా మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ కోసం నెట్ రెడీ చేస్తుంటే ఆమె మాత్రం ‘ఆ..ఆ... ఆగండాగండి’ అని చేయి అడ్డం చూపుతోంది. అద్భుతమైన అందం మానుషి సొంతం. ఆ చిర్నవ్వుకే కొన్ని కోట్ల మంది అలా పడి ఉండే అవకాశం ఉంది. బాలీవుడ్లో లెగ్ పెడితే ఇండస్ట్రీ షేక్ అవడం ఖాయం. కాని ఆమె మాత్రం ‘ముందు నా మెడిసిన్ పూర్తి చేయనివ్వండి’ అంటోంది. మానుషి కుటుంబం ఉండటం ఢిల్లీలోనే అయినా తను మాత్రం హర్యానాలోని సోనెపట్లో మెడిసిన్ చేస్తోంది. కార్డియాలజిస్ట్ కావడం అనేది తన కల. అంటే ఆమెను చూసి ఎంత మంది తమ గుండెను లయ తప్పించుకుంటారో అంతమంది ఆమె చేయి తగిలి గుండెను సెట్రైట్ చేయించుకుంటారన్న మాట. మిస్ వరల్డ్ అయితే నా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మేలు చేస్తాను. డాక్టర్గా ఉండి నా వైద్యంతో మేలు చేస్తాను అంటోంది మానుషి చిల్లర్. ఈ మాటలు ఎన్నిరోజులో చూడాలి. ఏ కరణ్ జోహారో, ఏ రణ్వీర్ సింగో పెద్ద ఆఫర్, మంచి రోల్ ఆఫర్ చేసి ఆమెను లాగకుండా ఉంటారా అనేది మిలియన్ డాలర్ల క్వశ్చన్. ఏమో... మన సురేశ్బాబు భారీ అడ్వాన్స్ ఇచ్చి వెంకటేశ్ పక్కన బుక్ చేయవచ్చు కూడా. కత్రీనా కైఫ్ను బుక్ చేయలేదూ? -
నాటకాలొద్దు
సి.ఎన్.ఎన్.–ఐ.బి.ఎన్. ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ఫంక్షన్లో విరాట్ కోహ్లీని.. 17 ఏళ్ల తర్వాత ఇండియాకు ‘మిస్ వరల్డ్’ టైటిల్ తెచ్చిన మానుషీ చిల్లర్ ఒక ప్రశ్న అడిగింది. ‘‘మీరు ఇవాళ ప్రపంచంలో ఒక గొప్ప బ్యాట్స్మన్ మాత్రమే కాదు, ఒక ఇన్స్పిరేషన్ కూడా కదా. మరి సమాజానికి మీరు తిరిగి ఏమిద్దామనుకుంటున్నారు? క్రికెట్ ప్రపంచంలోని పిల్లలకు మీరంటే గురి. వాళ్లకు మీరు ఏం చెబుదామనుకుంటున్నారు’? అని. దీనికి కోహ్లీ.. ‘‘జీవితంలో ఏది చేసినా జన్యూన్గా చేయాలి. చేసే దాన్ని హృదయమే శాసించాలి. లేకుంటే అందరికీ అర్థమైపోతుంది.. మనం నటిస్తున్నామని. పిల్లలు నాలాగా ఉండాలనుకుంటే అది నటనే అవుతుంది కదా. వాళ్లు వాళ్లలాగే ఉండాలి. నన్ను మారమని, నేను మారితే బాగుంటుందని కోరుకున్న వాళ్లూ ఉన్నారు. కానీ నాకు మారాలని ఎప్పుడూ లేదు. అయితే ఎవరైనా మారకుండా ఉండటానికి బలమైన ప్రయత్నం చేయాలి. వాళ్లని వాళ్లు నమ్ముకోవాలి. మనం అనుకున్నదాని కంటే ఒక గొప్ప శక్తి మనతో గొప్ప పనులు చేయిస్తుంది. ఆ గొప్పశక్తిని ఆహ్వానించాలి. మనలో ఒకటిగా చేసుకోవాలి. అప్పుడే మనకో ఐడెంటిటీ ఉంటుంది’ అని చెప్పాడు. వెల్ సెడ్ విరాట్. సమర్పణ: నూరు దడవై -
‘మిస్ వరల్డ్ చేతికి ముద్దు పెట్టి.. ఆల్ ది బెస్ట్..’
హరియణాకు చెందిన 20 ఏళ్ల ‘మిస్ ఇండియా’ మానుషి ఛిల్లర్.. మిస్ వరల్డ్ 2017 టైటిల్ను సాధించి భారతదేశ ఖ్యాతిని చాటి చెప్పింది. మిస్ వరల్డ్ మానుషి.. మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ను విమానంలో కలిశారు. ఆమె మిస్ వరల్డ్ పోటీలకు రెడీ అవుతున్న సమయంలో వీరి కలయిక జరిగింది. ఈ బామలు ఇద్దరు కలిసి మాట్లాడుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వారిద్దరూ మాట్లాడుకున్న తీరు అందరినీ ఆకర్షించింది. మానుషి.. ‘సుస్మితాను చూసి షాక్కు గురయ్యాను. ఆమె నన్ను అభిమానంతో’ పలకరించారు. అంతేకాక మానుషికి సుస్మితా సేన్ ఐడియాలిస్తూ.. ‘ మన వంతు ప్రయత్నాం మనం చేయాలి.. మిగతాది దేవుడి మీద భారం వేయాలని.. ఆల్ ది బెస్ట్’ అని చెబుతూ మానుషి చేతికి ముద్దు పెట్టిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. సుస్మితా సేన్ 1994 సంవత్సరంలోనే ఫెమినా మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ టైటిల్లను కైవసం చేసుకున్నారు. ప్రపంచ అందగత్తెలంతా సొంతం చేసుకునేందుకు ఎంతగానే పరితపించే ప్రపంచ సుందరి కిరీటం 17 ఏళ్ల అనంతరం భారత్ వశమైంది. -
‘మిస్ వరల్డ్ చేతికి ముద్దు పెట్టి.. ఆల్ ది బెస్ట్..’
-
మానుషి చిల్లర్ ప్రశ్నకు కోహ్లి సమాధానం
-
మానుషి చిల్లర్ ప్రశ్నకు కోహ్లి సమాధానం
ముంబై:టీమిండియా క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి ఇటీవల మిస్ వరల్డ్గా ఎంపికైన మానుషి చిల్లర్ ఓ ప్రశ్న వేశారు. సీఎన్ఎన్-న్యూస్ 18-2017 అవార్డుల ఫంక్షన్లో కోహ్లితో చిల్లర్ ముచ్చటించింది. ఈ క్రమంలోనే కోహ్లికి ఒక ప్రశ్నను చిల్లర్ సంధించింది. 'ముందుగా నీకు శుభాకాంక్షలు. ప్రపంచంలోనే బ్యాట్స్మెన్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నావు. ఎందరో యువ క్రికెటర్లు నిన్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా నిన్ను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. వీరికి నువ్వు ఇచ్చే సలహాలు ఏమిటి. ముఖ్యంగా చిన్నారులకు మీరిచ్చే సందేశం ఏమిటి' అని కోహ్లిని చిల్లర్ అడిగారు. దీనికి కోహ్లి బదులిస్తూ.. 'ఫీల్డ్లో ఎప్పుడు, ఏం చేయాలి అనేది చాలా ముఖ్యం. అది చాలా కచ్చితత్వంతో ఉండాలి. మన ఆలోచన గుండెల్లోంచి రావాలి. అది మనల్ని చూస్తున్న ప్రజలకు నమ్మశక్యంగా అనిపించాలి. ఏదో నటిస్తున్నట్లు వారికి అనిపించకూడదు. ఒకవేళ అలా జరిగితే వారు ఎప్పుడూ మనల్ని నమ్మరు. మనం చేసే పనిలో నిజాయితీ ఉండాలి. నా గురించి ఎవరు ఏమీ అన్నా పట్టించుకోను. నా పని సక్రమంగా చేయడమే నాకు తెలిసింది. దాన్నే నమ్ముతా. అదే యువతకు నేనిచ్చే సందేశం'అని కోహ్లి సమాధానమిచ్చాడు. -
పద్మావతి వివాదంపై స్పందించిన మిస్ వరల్డ్
సాక్షి, న్యూఢిల్లీ : పద్మావతి చిత్ర వివాదంపై మిస్ వరల్డ్-2017 మానుషి ఛిల్లర్ స్పందించారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె చిత్ర యూనిట్కు తన మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. అభ్యంతరాలు లేవనెత్తుతూ కొందరు చిత్ర విడుదలను అడ్డుకుంటున్నారు. దీపిక పదుకొనే కేవలం యాక్టరేనన్న విషయం నిరసనకారులు గుర్తుంచుకోవాలి. నజరానాలు ప్రకటించటం సరికాదు. ఆమెకు నా మద్దతు ప్రకటిస్తున్నా అని ఆమె చెప్పారు. కాగా, ప్రధానిని కలిసిన మరుసటి రోజే మానుషి తన అభిప్రాయం చెప్పటం గమనించదగ్గ విషయం. -
మగాళ్ల నుంచే మార్పు రావాలి
సాక్షి, హైదరాబాద్: మోముపై చిరునవ్వు.. మాటల్లో చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. ఎలాంటి ప్రశ్నకైనా ఠక్కున సమాధానం చెప్పే నేర్పరితనం.. అందర్నీ కట్టిపడేసే అందం.. ఆమెవరో కాదు.. 20 ఏళ్లకే ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్న మానుషీ ఛిల్లర్! 17 ఏళ్ల తర్వాత మన దేశానికి ప్రపంచ సుందరి కిరీటాన్ని తెచ్చిపెట్టిన ఈ హరియాణా అందాల సుందరి బుధవారం ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో ‘సెంటర్ ఆఫ్ అట్రాక్షన్’గా నిలిచింది. బంగారు వన్నె దుస్తులతో హెచ్ఐసీసీ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన ఛిల్లర్.. మహిళా సాధికారతపై జరిగిన చర్చాగోష్టిలో పాల్గొంది. ఎలాంటి ప్రశ్న అడిగినా ఫటాఫట్ సమాధానమిస్తూ అందర్నీ ఆకట్టుకుంది! ‘మీరు మిస్ వరల్డ్ టైటిల్ గెలిచారు కదా.. గెలవడమే అంతిమమా...’ అని కార్యక్రమ నిర్వాహకుడు ప్రశ్నించగా.. ‘మార్పు అంతిమం (చేంజ్ ఈజ్ ఎవ్రీథింగ్)’ అని సమాధానమిచ్చింది. ‘ముందు డాక్టర్, ఆ తర్వాత మిస్వరల్డ్ కదా. మీ జీవితంలో దేన్ని ప్రాధాన్యంగా ఎంచుకుంటారని అడగ్గా.. ‘నా జీవితంలో అవి రెండూ ఒకటే. ముందు డాక్టర్ని. తర్వాత అందాల సుందరిని. భవిష్యత్లోనూ డాక్టర్నే..’ అని పేర్కొంది. వివిధ అంశాలపై ఆమె అంతరంగం ఇదీ.. ఈ కిరీటం.. సేవకు అవకాశం మిస్వరల్డ్ అనేది సమాజానికి నేను కొంత తిరిగి ఇచ్చేందుకు సేవ చేసే అవకాశంగా భావిస్తా. అది నాకు గౌరవం కూడా. నాలాంటి యువతులకు ఈ హోదా చాలా నేర్పుతుంది. ఎన్నో చోట్ల తిరగాల్సి వస్తుంది. సెలబ్రిటీల నుంచి చిన్నపిల్లల వరకు అందరితో మమేకం అవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఎన్నో నేర్చుకుంటాం. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వడం నా బాధ్యత. చిరునవ్వుతోనూ మార్పు ఏ పనయినా నాతో కాదు అన్న భావన రాకూడదు. ప్రతి ఒక్కరూ మార్పు తీసుకురాగలరు. ఓ చిరు నవ్వు కూడా పరిస్థితిలో మార్పు తెస్తుంది. గుడ్ మార్నింగ్ అంటూ పలకరించడం కూడా ఎదుటి వారిలో మనపై అభిప్రాయాన్ని మారుస్తుంది. ఎదుటివారిని సంతోషపరిస్తే మనల్ని కూడా వారు సంతోషపరిచేందుకు ప్రయత్నిస్తారు. ప్రతి ఒక్కరికీ సమాజంలో మార్పు తెచ్చే అవకాశం ఉంది. మార్పు తెచ్చేందుకు మిస్ వరల్డే కానక్కర్లేదు. ఉన్నదంతా మీ తలలోనే.. ప్రతి ఒక్కరికీ జీవితంలో సవాళ్లు ఎదురవుతుం టాయి. అయితే వాటిని ఎలా ఎదుర్కొంటారనేదే సమస్య. ఓ మహిళ వ్యాపారవేత్తగా ఎదగాలంటే అంతా మీ మైండ్సెట్ మీద, అందులోని ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. డాక్టర్.. యాక్టర్ కూడా.. నాపై కుటుంబ ప్రభావం ఉంది. మాది డాక్టర్ల ఫ్యామిలీ కావడంతో ఆ ప్రభావం నాపై పడటం వల్లే నేను కూడా డాక్టర్ని అయ్యాననుకుంటా. ఆదివారం పూట నా తల్లి వ్యవహరించే తీరును నిశితంగా గమనించేదాన్ని. డాక్టర్ డాక్టరే కాదు.. యాక్టర్ కూడా అని నాన్న చెప్పేవారు. ఎందుకంటే.. ఏమీ కాదంటూ రోగి ముందు నటించినా ఆ రోగి చాలా వరకు కోలుకుంటాడు. పనిని ప్రేమిస్తా.. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటైన భారత్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడం నిజంగా పెద్ద బాధ్యతే. కానీ నేను చేస్తున్న పనిని ప్రేమిస్తాను. చేసే పనిని మీరు ప్రేమించినప్పుడు ఒత్తిడి అనిపించదు. అందుకే ఆ హోదా నాకు బాధ్యతే కానీ.. ఒత్తిడి ఏ మాత్రం కాదు. మహిళకు మహిళ తోడుండాలి ఒక మహిళ ఎదిగేందుకు మరో మహిళ తోడ్పాటు నివ్వాలి. మహిళల్లో అవగాహన లేమితో పాటు అను కూలతలు లేకపోవడం వల్ల కూడా రాణించలే కపోతున్నారు. అందుకే కొన్ని అవకాశాలను వారికి కల్పించాలి. ఆ కోణంలోనే రుతుక్రమంలో పాటిం చాల్సిన శుభ్రత గురించి ఆలోచించి ఓ కంపెనీ ఏర్పాటు చేశా. స్థానిక వ్యాపారులతోపాటు వాల్మా ర్ట్ లాంటి సంస్థతో కూడా అనుసంధానమయ్యాం. దాదాపు ఉత్తర భారతదేశమంతా శానిటరీ నాప్కిన్స్ ను మా కంపెనీ అందిస్తుంది. దీంతో 20 గ్రామా ల్లోని మహిళలు ఉపాధి పొందుతున్నారు. వారు కూడా పారిశ్రామికవేత్తలవుతున్నారు. చాలా దేశాల్లో 50 శాతానికిపైగా పౌరులు పేదరికంలో బతుకుతు న్నారు. వారికి ఆరోగ్య సదుపాయాలు అందడం లేదు. అందరికీ ఆరోగ్య సదుపాయాలు కల్పించ డమే ధ్యేయంగా పనిచేయాలని నిర్ణయించుకున్నా. ఏమో...అవుతానేమో..? నేను మిస్వరల్డ్ అయిన తర్వాత చాలా ప్రాంతాల్లో పర్యటిస్తున్నా. దేనిపైనా దృష్టి పెట్టలేదు. సినిమా అవకాశమనేది చాలా ఆసక్తి కలిగిస్తుంది. సినీ జీవితం నా జీవితంలో కూడా ఉండొచ్చేమో. ఇప్పటికైతే అది నా ప్రాధాన్యతల్లో లేదు. ‘అమ్మ’ భావనే అద్భుతం అమ్మతనం చాలా అందమైంది. ఆ అనుభవం అమ్మ అయిన ప్రతి మహిళకూ సంతోషమే. ఓ జీవితానికి రూపం ఇవ్వడం.. ఓ స్నేహితుడిని సంపాదించుకునే అవకాశం గొప్ప ది. తల్లీబిడ్డల మధ్య సంబంధం ఇవ్వడం, తీసు కోవడమే కాదు. అదో మ్యాజిక్. అద్భుతం. అమ్మ ఎప్పుడూ నన్ను ప్రేమిస్తుంది. నేను స్టేజీ మీద ఉండి ఆమె ప్రేక్షకుల్లో ఉన్నప్పుడు ఆమె కళ్లలో గర్వం నాకు కనిపించింది. అదో అద్భుత అనుభూతి. అమ్మకు రుణపడి ఉంటా. భారతీయురాలిని కాబట్టే.. భావ వ్యక్తీకరణ నైపుణ్యం చాలా ముఖ్యం. నేను డాక్టర్ని కాబట్టి పేషెంట్లతో కమ్యూనికేషన్ బాగుండాలి. అప్పుడే విషయం సులువవుతుంది. మనం ఏం మాట్లాడుతున్నామనే దాన్ని మనం నమ్మాలి. ఫీలవ్వాలి. అందుకే భాషా అడ్డంకులను అధిగమించి ప్రపంచ పోటీల్లో 118 మంది అందాల యువతులను ఓడించగలిగాను. భావోద్వేగం అనేది భావవ్యక్తీకరణకు ముఖ్యం. నేను భారతీయ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి ఆ వేదికపై భావోద్వేగంతో నా భావాలను వ్యక్తపర్చగలిగా. మగాళ్లతోనే ప్రారంభం కావాలి ఇది సమాన ప్రపంచం. ఇక్కడ పురుషులు, స్త్రీలు అందరూ సమానమే. వేతనాల్లోనూ, అవకాశాల్లోనూ ఇద్దరికీ తగిన అవకాశాలుండాలి. పురుషాధిక్య సమాజంలో మార్పు రావాలంటే ముందు పురుషుడి ఆలోచనలో మార్పు రావాలి. స్త్రీలు తమకంటే ఎందులోనూ తక్కువ కాదని పురుషులు ఆలోచిస్తే అప్పుడు తాము తక్కువ కాదని స్త్రీలు ఆలోచించడం మొదలు పెడతారు. నాకెప్పుడూ అసమానత ఎదురుకాలేదు. క్రీడలకు స్టార్టప్లు సాహసోపేతమే క్రీడలు, ఐటీ పరిశ్రమలకు హైదరాబాద్ మారు పేరు. నగరంలో అందుబాటులో ఉన్న వ్యవస్థ, సదుపాయాలు, ప్రభుత్వ ప్రోత్సాహంతో క్రికెట్, టెన్నిస్, బ్యాట్మింటన్లాంటి క్రీడల్లో హైదరాబాదీలు అంతర్జాతీయ స్థాయికి ఆడుతున్నారు. నగరంలో ఈ మెగా ఈవెంట్ జరగడం మనందరికీ గర్వకారణం. క్రీడలను ప్రోత్సహించడంలో మీడియా పాత్ర, యువ క్రీడాకారులు కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొనే సమస్యలు, స్పాన్సర్షిప్లపై చర్చాగోష్టిలో మాట్లాడాం. క్రీడా రంగానికి సంబంధించిన స్టార్టప్ల ఏర్పాటు అత్యంత సాహసోపేతమైన చర్య. కచ్చితత్వం ఉండదు. క్రీడారంగంలో వ్యాపారం ఓ జూదం లాంటిది. – మిథాలీరాజ్, భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ -
ఫాలో... ఫాలో.. ఫాలో...
‘మిస్ వరల్డ్’ కాంపిటీషన్లో ఉన్న అందగత్తెలందరూ మానుషీ చిల్లర్ని బాలీవుడ్ హీరోయిన్ అనుకున్నారు. అందమైన అమ్మాయిలకే మానుషీ అంత అందంగా అనిపించిందన్నమాట! మరి అంత అందగత్తెని మీడియా మూవ్ చెయ్యకుండా ఉంటుందా? ‘బాలీవుడ్కి వస్తారా?’ అని అడిగింది. ‘ఇప్పటికైతే నా మిస్ వరల్డ్ అక్కచెల్లెళ్లతో (రుతుక్రమ శుభ్రత) పై అవగాహన పెంచడానికి ప్రపంచమంతా తిరుగుతున్నాం’ అని చెప్పింది చిల్లర్. అంతటితో ఆగుతుందా మీడియా? మళ్లీ మూవ్ చేసింది. ‘ఆ తర్వాతైనా వస్తారండీ బాలీవుడ్కి?’ అని అడిగింది. ‘ఓ ఎస్. ఆమిర్ఖాన్ పిలిస్తే వస్తా. ప్రియాంకా చోప్రా తలిస్తే వస్తా’ అంది చిల్లర్. ‘వీళ్లిద్దరేనా, ఇంకెవరు పిలిచినా, తలచినా రారా?’ అంది మీడియా. ‘ఆమిర్ ఖాన్ చేసే సినిమాల్లో, పాత్రల్లో ఒక చాలెంజ్ ఉంటుంది. సమాజంలో ఉన్న చాలెంజ్ ఉంటుంది. కొత్త దనం తేవాలన్న చాలెంజ్ ఉంటుంది. ఇక ప్రియాంకా చోప్రా అంటారా.. నా ఫేవరేట్. 2000లో తనూ ‘మిస్ వరల్డ్’గా దేశానికి వన్నె తెచ్చింది. 17 ఏళ్ల తర్వాతిప్పుడు నేనూ ఆమెను... ఫాలో ఫాలో ఫాలో ఫాలో..’ అంది మానుషీ. -
త్రిపుల్ తలాక్పై మానుషి చిల్లర్..
వైద్యవిద్యను అభ్యసిస్తూ.. ప్రపంచం మెచ్చిన అందగత్తె అయిన మానుషి చిల్లర్, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన త్రిపుల్ తలాక్పై స్పందించారు. త్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్దమైన పద్ధతి అని చాలా క్లారిటీగా ఉందన్నారు. వివాహంపై ఒక్క వ్యక్తికే ఎక్కువ యాజమాన్యం ఉండకూడదని పేర్కొన్నారు. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య చిగురించే ఎంతో ప్రత్యేకమైన స్నేహ భావమని, ఆ బంధంలో ఏ ఒక్కరికే ఎక్కువ యాజమాన్యం ఇవ్వలేమని తెలిపారు. త్రిపుల్ తలాక్ నుంచి లైంగిక వేధింపుల వరకు పలు సామాజిక అంశాలపై మానుషి మాట్లాడారు. దేశవ్యాప్తంగా మైనర్ బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కూడా మానుషి చిల్లర్ స్పందించారు. పిల్లలను రక్షించే బాధ్యత అందరికీ ఉందని, వారికి సాధారణమైన జీవితం ఇవ్వాలన్నారు. ''మైనర్ బాలికలపై లైంగిక వేధింపుల గురించి మాట్లాడుకుంటే, పిల్లలను రక్షించే బాధ్యత ఎంతో ముఖ్యమైనదని నేను భావిస్తున్నా. మనం పిల్లలకు శక్తినిస్తే, అదే దేశానికి శక్తినిచ్చినట్టవుతుందిపిల్లలకు భద్రత కల్పిస్తే, వారి జీవితాల్లో అద్భుతాలు చేసి చూపిస్తారు. ప్రతి చిన్నారికి పెరిగే హక్కు ఉంటుంది'' అని అన్నారు. మూలాల నుంచి మార్పు రావాల్సి ఉందని, మహిళలకు గౌరవించే లక్షణం ఇంటి వద్ద నుంచే వచ్చేలా పిల్లలకు పాఠాలకు చెప్పాలని పేర్కొన్నారు. విద్య ఎంతో ముఖ్యమైనదని, కేవలం పాఠశాలల్లోనే కాక, ఇంటి వద్ద కూడా దీన్ని నేర్పించాలని వివరించారు. ఇంటి వద్దే మహిళలను గౌరవించడం నేర్పిస్తే, సమాజంలో కూడా మహిళలను గౌరవించే లక్షణం నేర్చుకుంటారని చెప్పారు. ప్రస్తుతం బాలీవుడ్లోకి ఎంట్రీ అయ్యే యోచన లేదని, అయితే భవిష్యత్తులో వచ్చే అవకాశాలున్నాయా అనే దానిపై పూర్తిగా కొట్టిపారేయలేదు. కాగ, 17 ఏళ్ల తర్వాత మిస్ వరల్డ్ కిరీటాన్ని భారత్ నుంచి మానుషి చిల్లర్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. -
ఆ హీరోతో నటించాలని ఉంది: మిస్ వరల్డ్
ముంబై : అందమంటే శారీరక సౌందర్యం కాదు.. మానసిక సౌందర్యమని ప్రపంచ సుందరి-2017 మానుషి ఛిల్లర్ అన్నారు. ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర అంశాలను షేర్ చేసుకున్నారు. భారత్లో మహిళలందరూ ఒకే రకమైన సమస్య ఎదుర్కొంటున్నారని, స్నేహపూర్వక సమాజాన్ని వారు కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. 'పద్మావతి' మూవీతో వివాదంలో చిక్కుకున్నా.. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటున్న నటి దీపికా పదుకొనేను చూసి ఎందరో మహిళలు ప్రేరణ పొందే అవకాశం ఉందన్నారు ఛిల్లర్. ఓ ప్రశ్నకు బదులిస్తూ.. ఇప్పటికైతే సినిమా రంగంలోకి వచ్చే ఆలోచన తనకు లేదని, అయితే బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్తో కలిసి నటించాలని ఉందని ప్రపంచ సుందరి తెలిపారు. ఆమీర్ చాలెంజింగ్ పాత్రలు ఎంచుకుని సమాజానికి ఏదో రూపంలో మంచి సందేహాన్ని ఇస్తారని కొనియాడారు. హీరోయిన్లలో మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రాను అభిమానిస్తానని చెప్పారు. రుతుస్రావ సమయంలో ఆరోగ్యంపై మహిళలకు అవగాహన కల్పించడంపై చేపట్టిన ప్రాజెక్టులో కొంతమేరకు విజయం సాధించాను. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 20 గ్రామాల్లో పర్యటించిన ఆమె 5 వేల మంది మహిళలకు చికిత్స అందించారు. 'బేటీ బచావో బేటీ పడావో' కార్యక్రమంతో పాటు మహిళలకు సంబంధించిన మరికొన్ని అంశాల్లో నా శాయశక్తులా కృషి చేసేందుకు సహకరించిన హర్యానా ప్రభుత్వానికి ఈ సందర్భంగా మానుషి ఛిల్లర్ ధన్యవాదాలు తెలిపారు. హరియాణాకు చెందిన 20 ఏళ్ల ‘మిస్ ఇండియా’ మానుషి ఛిల్లర్ ఇటీవల జరిగిన పోటీల్లో మిస్ వరల్డ్ 2017 టైటిల్ను సాధించి భారతదేశ ఖ్యాతిని చాటిచెప్పింది. చైనాలోని సాన్యా నగరంలో నిర్వహించిన 67వ మిస్ వర్డల్పోటీలో 118 దేశాల నుంచి వచ్చిన సుందరాంగుల్ని తోసిరాజని ఛిల్లర్ ప్రపంచ సుందరి మకుటాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
మానుషి ఛిల్లర్.. సానియా.. మిథాలీ
సాక్షి, హైదరాబాద్: జీఈఎస్ సదస్సులో ప్రసంగించే ప్రముఖుల పేర్లు ఖరారయ్యాయి. మిస్వరల్డ్ మానుషి ఛిల్లర్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీరాజ్, బాలీవుడ్ నటులు సోనమ్కపూర్, అదితీరావు హైదరీ, నటుడు రామ్చరణ్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఈ జాబితాలో ఉన్నారు. ఈ సదస్సులో మొత్తం 50కుపైగా చర్చా కార్యక్రమాలు జరగనున్నాయి. ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ అండ్ లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్ టెక్ అండ్ డిజిటల్ ఎకానమీ, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రంగాల్లో ఈ చర్చలను నిర్వహిస్తున్నారు. 28న సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య జరిగే సదస్సు ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్, ఇవాంకా, మోదీ ప్రసంగాలు ఉండనున్నాయి. క్రీడా వ్యాపారంలో విజయం అంశంపై సానియా మీర్జా, మిథాలీరాజ్, గోపీచంద్లతోపాటు వన్ చాంపియన్షిప్ ఉపాధ్యక్షులు చాత్రి సిత్యోంద్టాంగ్లు మాట్లాడనున్నారు. ఫ్యూచర్ ఆఫ్ సినిమా అంశంపై రాంచరణ్ తేజ, అదితీరావ్హైదరీ, నెక్ట్స్ స్టేజ్ ప్రొడక్షన్స్ సంస్థ సీఈవో ఒనెకాచి స్టిఫానీ లినస్ ఇడాహొసాలు మాట్లాడనున్నారు. మీడియాలో మహిళలకు అవకాశాలపై మానుషి ఛిల్లర్, సోనమ్ కపూర్, కల్లీ పూరి తదితరులు ప్రసంగిస్తారు. ఫలక్నుమాకు ‘లాడ్బజార్ ’ ఇవాంకా చార్మినార్ సందర్శిస్తారని, లాడ్ బజార్లో షాపింగ్ చేసి గాజులు కొంటారని తొలుత భావించినా.. పలు కారణాల రీత్యా భద్రతా సిబ్బంది అందుకు అంగీకరించలేదు. దీంతో లాడ్బజార్ నుంచి కొన్ని ఎంపిక చేసిన గాజుల దుకాణాలను ఫలక్నుమా ప్యాలెస్కే పంపించి.. తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మూడు దుకాణాలకు ఆర్డర్ కూడా ఇచ్చారు. ఎంపిక చేసిన గాజులు, ఆయా దుకాణాల నిర్వాహకులను ఫలక్నుమా ప్యాలెస్కు తీసుకెళతారు. అక్కడికి విందుకు వచ్చిన సందర్భంలో.. ఇవాంకాతోపాటు, ఇతర డెలిగేట్స్ కూడా గాజులు కొనుగోలు చేస్తారని అధికారులు చెబుతున్నారు. – సాక్షి, హైదరాబాద్ హైటెక్స్కు మినీ శిల్పారామం తెలంగాణ సంప్రదాయ హస్తకళలను ఇవాంకాతో పాటు ఇతర ప్రముఖులకు ప్రదర్శించనున్నారు. సదస్సు జరిగే హెచ్ఐసీసీకి సమీపంలోనే శిల్పారామం ఉన్నప్పటికీ.. ఇవాంకా అక్కడికి రావటం సాధ్యం కాదని ఆమె భద్రతా విభాగం స్పష్టం చేసింది. దీంతో ముఖ్యమైన హస్తకళాకృతులను హెచ్ఐసీసీకే తరలించి.. చిన్న ప్రదర్శన ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. అయితే దీనికి కూడా ఇప్పటివరకు అమెరికా భద్రతా సిబ్బంది నుంచి అంగీకారం రాలేదు. మరోవైపు 29న గోల్కొండ కోటలో విందు కార్యక్రమం ఉన్నందున.. శిల్పారామం నుంచి కొన్ని హస్త కళాకృతులను గోల్కొండకు తరలించి ప్రదర్శన ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. – సాక్షి, హైదరాబాద్ -
బాలీవుడ్కు మరో కిరీటం?!
ప్రపంచసుందరి పాదాల ముందు రెడ్ కార్పెట్ చుట్టను పడేసి... దాన్ని చుట్లు విప్పుతూ... విప్పుకుంటూ పోతే... దాని రెండో అంచు బాలీవుడ్ పరిశ్రమ దగ్గర పూర్తవుతుందని ఓ లెక్క. ఇటీవలే ప్రపంచసుందరిగా ఎంపికైన మానుషీ ఛిల్లర్కూ ఇదే విధంగా బాలీవుడ్లోకి ఎంట్రీ లభించవచ్చనే మాట వినిపిస్తోంది. గతంలోనూ మిస్ ఇండియా, మిస్ వరల్డ్లకు ఎంపికైన చాలామంది సుందరీమణుల్లాగే ఇటీవల మిస్ వరల్డ్గా ఎంపికైన మానుషీ ఛిల్లర్ కూడా త్వరలో బాలీవుడ్ గడప తొక్కడానికి వడివడిగా అడుగులేస్తోందట. ‘మిస్ వరల్డ్’ పోటీల సందర్భంగా నిర్వహించిన టాలెంట్ రౌండులో ఆమె ‘గోలీయోం కీ రాస్లీలా – రామ్లీలా’ సినిమాలోని ‘నగాడా నగాడా’ అనే పాటను ప్రదర్శించింది. చదువుతున్న కోర్సు పరంగా చూస్తే కత్తులూ కటార్లూ పట్టుకొని సర్జరీలూ– చికిత్సలు చేయాల్సిన ఎంబీబీఎస్ విద్యార్థిని మానుషి... ఎప్పుడు నటిగా మారి థిం తడాక్... థిం తడాక్... అంటూ ఆ పాటలోలా డాన్స్ చేస్తూ తన తడాఖా చూపిస్తుందా? అని సమస్త సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. -
మిస్ ఫిట్ వరల్డ్
మానుషి ఛిల్లార్. ప్రపంచ సుందరి. అంతర్జాతీయ స్థాయిలో అందగత్తెగా ఈ కిరీటాన్ని అందుకోవాలంటే శరీరాన్ని అద్భుతంగా, ఆరోగ్యంగా తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది. వైద్య కుటుంబానికి చెందిన ఈమె తన స్లిమ్ ఫిజిక్ కోసం ఏం చేశారు?ఈ మెగా ఈవెంట్కు సిద్ధమయ్యే సమయంలో మరింత ఎక్కువగా ఫుడ్/వర్కవుట్స్కు సమయాన్ని కేటాయించారు. సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ మామీ అగర్వాల్ ఆమె తిండి, నిద్ర వంటి విషయాల్ని పర్యవేక్షించారు. అత్యధిక ప్రొటీన్ల బ్యాలెన్స్డ్ డైట్ను ఫాలో అయ్యారు. బ్రేక్ఫాస్ట్ టు డిన్నర్... ఇదీ డైట్ బ్రేక్ఫాస్ట్గా ఓట్మీల్, ఎటువంటి ఫ్లేవర్లూ కలపని పెరుగు లేదా వీట్ ఫ్లేక్స్, తాజా పండ్లు, ధాన్యాలు, అవకాడో, కేరట్, బీట్స్, స్వీట్ పొటాటో కలిపిన 2/3 ఎగ్ వైట్స్ వంటివి అల్పాహారం. ఫుడ్లో పెరుగు, తాజా పండ్లు తప్పనిసరి. మిడ్ మీల్గా కొబ్బరి నీళ్లు, పండ్లు. లంచ్లోకి క్వినోవా రైస్, చపాతీ, వెజిటబుల్స్, చికెన్, ్జకాయధాన్యాలు మెనూ. సాయంత్రం పూట కీరదోసకాయ, కేరట్ ముక్కలు స్నాక్స్. అత్యధిక ప్రొటీన్ల ఫుడ్ డిన్నర్ స్పెషల్. చికెన్/ఫిష్ (గ్రిల్డ్/రోస్టెడ్),ఉడకబెట్టిన కూరగాయలు. క్వినోవా పులావ్, సలాడ్, సూప్లు ఉంటాయి. రోజుకి కనీసం 3 లీటర్ల నీళ్లు తాగుతూ ఎప్పుడూ డీహైడ్రేట్ అనే సమస్యే రాకుండా చూసుకుంటారామె. ‘‘బ్రేక్ఫాస్ట్ మిస్ కావద్దు. ఇది రాత్రి వేళలో ఆకలి సమస్యను తీవ్రతరం చేస్తుంది. రెగ్యులర్గా మీల్స్ తీసుకోండి. అయితే చిన్నప్లేట్స్ ఉపయోగించండి. ఇది ఫ్యాట్, సుగర్స్ ఎక్కువ ఉండే స్నాక్స్ తీసుకోవాలనే టెంప్టేషన్స్ను తగ్గిస్తుంది. పంచదార తగ్గించండి. ముఖ్యంగా రిఫైన్డ్ సుగర్స్కి నో చెప్పండి ’’ అంటూ డైట్ టిప్స్ చెబుతారు మానుషి. యోగా మస్ట్... డ్యాన్స్తో రెస్ట్... ‘‘యోగా రోజూ చేస్తాను. అయితే వర్కవుట్ మాత్రం వారానికి 4 నుంచి 5 సార్లు చేస్తాను. స్క్వాట్స్, ఫ్రీ రన్నింగ్ కూడా వర్కవుట్ రొటీన్లో తప్పనిసరి భాగం’’ అంటున్నారు మానుషి. యోగా అనేది శరీరపు భంగిమను కరెక్ట్గా ఉంచుతుంది. కండరాలు టోన్డ్గా ఉండేలా చేస్తుంది. ఫ్లెక్సిబులిటీ, కోర్ స్ట్రెంగ్త్కు ఉపకరిస్తుంది. కాబట్టి తప్పకుండా యోగా చేయాలనేది ఆమె సూచన. మొత్తంగా శరీరాన్ని వార్మప్ చేసే ప్రక్రియలో కోర్ ట్విస్టింగ్ అనేది చాలా ప్రధానం. అది శరీరాన్ని డిటాక్స్ చేసి, టోన్డ్గా మార్చడంలో ఉపకరిస్తుంది. నొప్పుల్ని నిరోధిస్తుంది. వయసుకు అతీతంగా ప్రతి ఒక్కరి వర్కవుట్ రొటీన్లో స్క్వాట్స్ తప్పనిసరిగా భాగం కావాలని ఆమె ట్రైనర్ అంటారు. అవి తొడ కండరాలు, దిగువ కండరాలను టోన్ చేయడం మాత్రమే కాకుండా మొత్తం శరీర. కండర సామర్థ్యాన్ని పెంచుతాయని, ఒత్తిడి అనిపిస్తే పరుగు తీయడం లేదా నచ్చిన ట్యూన్లకు నృత్యం చేయడం ఎంచుకోవాలనీ సూచిస్తున్నారు. తప్పకుండా 8గంటల రాత్రి నిద్ర ఉండాలి. అలాగే నిద్రపోవడానికి 2గంటల ముందుగా మొబైల్ స్విచాఫ్ చేయాలి వంటివి కూడ ఈ సుందరి ఫాలో అయిన బ్యూటీ టిప్స్లో ఉన్నాయి. -
ఇదీ మోదీ చలవేనా..?
సాక్షి,ముంబయి: మోదీ సర్కార్పై విమర్శల దాడితో విరుచుకుపడేందుకు భాగస్వామ్య పక్షం శివసేన ఏ అంశాన్నీ విడిచిపెట్టడం లేదు. తాజాగా మానుషి చిల్లార్ మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకోవడాన్ని శివసేన మోదీని టార్గెట్ చేసేందుకు వినియోగించుకుంది. మోదీ వల్లే మానుషి మిస్ వరల్డ్ టైటిల్ను భారత్కు తీసుకువచ్చిందని బీజేపీ నేతలెవరూ ప్రకటించకపోవడం పట్ల శివసేన విస్మయం వ్యక్తం చేసింది. హర్యానా సుందరి మానుషి చిల్లార్ 17 సంవత్సరాల విరామం తర్వాత భారత్కు మిస్ వరల్డ్ కిరీటం తీసుకువచ్చిందని, ఇది మోదీ సర్కార్ ఘనతకు అద్దం పడుతుందని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో శివసేన వ్యంగ్యాస్ర్తాలు సంధించింది. ప్రపంచ అందాల సుందరి కిరీటం భారత్కు దక్కడం మోదీ చలవేనంటూ ఇంతవరకూ బీజేపీ నేతలెవరూ ముందుకు రాకపోవడం విడ్డూరమేనని వ్యాఖ్యానించింది. -
శశిథరూర్పై మానుషి 'చిల్' కామెంట్
న్యూఢిల్లీ : తనపై కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ చేసిన కామెంట్లపై ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ స్పందించారు. ఇందుకు ట్విటర్ను వేదికగా చేసుకున్న ఆమె మిస్ వరల్డ్ను ఓ బ్యాడ్ టంగ్ ఏమీ చేయలేదని అన్నారు. తన పేరు చిల్లర్ అని అందులో చిల్ అనే మాట ఉందని, దాన్ని మర్చిపోవద్దని చెప్పారు. అంతకుముందు శశిథరూర్ చేసిన కామెంట్లపై ఈ తరం అమ్మాయైనా కూడా మానుషి ఇంకా స్పందిచకపోవడంపై టైమ్స్ ఆఫ్ ఇండియా బాసెస్లో ఒకరైన వినీత్ జైన్ ట్వీట్ చేశారు. 'మానుషి నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది' అని అన్నారు. I saw @ShashiTharoor tweet regarding @ManushiChhillar . I wasn’t offended even though she is a times girl. We need to learn to be more TOLERANT towards light hearted HUMOUR. #MissWorld2017 #MissIndia — Vineet jain (@vineetjaintimes) 20 November 2017 Exactly @vineetjaintimes agree with you on this. A girl who has just won the World isn’t going to be upset over a tongue-in-cheek remark. ‘Chillar’ talk is just small change - let’s not forget the ‘chill’ within Chhillar 🙂 @ShashiTharoor https://t.co/L5gqMf8hfi — Manushi Chhillar (@ManushiChhillar) 20 November 2017 -
చిల్లర కామెంట్లు.. ఆగ్రహజ్వాలలు
ఛండీగఢ్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ మిస్ వరల్డ్-2017 మానుషి చిల్లర్పై చేసిన ఓ ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. బీజేపీపై విమర్శలు చేసే క్రమంలో మానుషి పేరిట ఆయన ఓ అసంబద్ధ పోస్టును చేశారు. ‘‘నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని బీజేపీ ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది. మన డబ్బులకు అంతర్జాతీయ స్థాయిలో ఎంత గుర్తింపు ఉందో వారికి అర్థం కావట్లేదు. కావాలంటే చూడండి మన చిల్లర(మానుషి చిల్లర్) మిస్ వరల్డ్ అయ్యింది’’ అంటూ ట్వీట్ చేశారు. అంతే ఆయన ట్వీట్పై హర్యానా మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి కవిత జైన్ తీవ్రంగా స్పందించారు. మానుషి హర్యానాకే కాదు.. యావత్ దేశానికి వన్నె తెచ్చారు. అలాంటి వ్యక్తిని ఉద్దేశించి ఇలాంటి ప్రేలాపనలు చేయటం థరూర్కి తగదు. మన ఆడబిడ్డలను ఆత్మగౌరవాన్ని ఆయన దెబ్బతీశారు. అంతేకాదు చిల్లర్ తెగను అవమానించేలా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి ఆలోచనలు ఉన్న నేతలు ఉన్నారు అంటూ కవిత, శశిథరూర్పై మండిపడ్డారు. ఇక ఆర్థిక మంత్రి కెప్టెన్ అభిమన్యు కూడా థరూర్ సిగ్గుచేటు వ్యాఖ్యలు చేశారని.. తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. వివాదం ముదరక ముందే శశిథరూర్ మానుషిని పొగుడుతూ మరో సందేశం ఉంచటం విశేషం. What a mistake to demonetise our currency! BJP should have realised that Indian cash dominates the globe: look, even our Chhillar has become Miss World! — Shashi Tharoor (@ShashiTharoor) November 19, 2017 What a terrific answer by this bright young woman -- a real credit to Indian values! #missworldmanushi https://t.co/0gCQxlqD5L — Shashi Tharoor (@ShashiTharoor) November 19, 2017 -
భారత్కు 'మిస్ వరల్డ్'
సాన్యా(చైనా): ప్రపంచ అందగత్తెలంతా సొంతం చేసుకునేందుకు ఎంతగానే పరితపించే ప్రపంచ సుందరి(మిస్ వర్డల్) కిరీటం 17 ఏళ్ల అనంతరం భారత్ వశమైంది. హరియాణాకు చెందిన 20 ఏళ్ల ‘మిస్ ఇండియా’ మానుషి ఛిల్లర్.. మిస్ వరల్డ్ 2017 టైటిల్ను సాధించి భారతదేశ ఖ్యాతిని చాటిచెప్పింది. చైనాలోని సాన్యా నగరంలో శనివారం రాత్రి ఎంతో అట్టహాసంగా నిర్వహించిన 67వ మిస్ వర్డల్పోటీలో 118 దేశాల నుంచి వచ్చిన సుందరాంగుల్ని తోసిరాజని ఛిల్లర్ ప్రపంచ సుందరి మకుటాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచంలో ఏ వృత్తికి అధిక వేతనం ఇవ్వడం సముచితం అన్న ప్రశ్నకు ‘తల్లి ఉద్యోగం’ అని చెప్పి ఆమె న్యాయ నిర్ణేతల మనసుల్ని గెలుచుకుంది. 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ టైటిల్ గెల్చుకున్నాక మరో భారతీయురాలు ఈ ఘనత సాధించడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఛిల్లర్ హరియాణాలోని సోనెపట్లో వైద్య విద్య రెండో సంవత్సరం చదువుతోంది. హృద్రోగ శస్త్ర చికిత్స నిపుణురాలు కావాలనుకుంటున్న ఆమె.. గ్రామీణ ప్రాంతాల్లో సేవా దృక్పథంతో పనిచేసే ఆస్పత్రుల్ని నిర్వహించడం జీవిత లక్ష్యమని మిస్ వరల్డ్ వెబ్సైట్లో పేర్కొంది. మా అమ్మే అతి పెద్ద ఆదర్శం 2016 మిస్ వరల్డ్ విజేత ప్యూర్టోరికోకు చెందిన స్టెఫానీ డెల్ కిరీటాన్ని అలంకరించగానే ఛిల్లర్ ఆనందం తట్టుకోలేక ఉబ్బితబ్బిబైంది. ఈ పోటీల్లో మొదటి రన్నరప్గా మిస్ ఇంగ్లాండ్ స్టెఫానీ హిల్, రెండో రన్నరప్గా మిస్ మెక్సికో ఆండ్రియా మెజాలు నిలిచారు. పోటీలో మొదటి నుంచి ఛిల్లర్‡ తన అందచందాలు, తెలివి తేటలతో న్యాయ నిర్ణేతల్ని ఆకట్టుకుంది. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, కెన్యా, మెక్సికో అందగత్తెలతో పాటు తుది ఐదుగురి జాబితాలో చోటు దక్కించుకుంది. ఇక న్యాయ నిర్ణేతలు వేసిన ప్రశ్నకు ఛిల్లర్ ఎంతో తెలివిగా, సమయస్ఫూర్తితో సమాధానం చెప్పింది. ప్రపంచంలో ఏ వృత్తికి అత్యధిక వేతనం ఇవ్వాలి? ఎందుకు? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘ప్రపంచంలో తల్లికే ఎక్కువ గౌరవం దక్కాలని నేను భావిస్తున్నా. ఇక వేతనం గురించి మాట్లాడినప్పుడు.. అది డబ్బు గురించే కానక్కర్లేదు. ఒకరిపై చూపే ప్రేమ, వారికిచ్చే గౌరవం కూడా కావచ్చు. నా జీవితంలో నా తల్లే అతి పెద్ద ఆదర్శం. పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతో త్యాగం చేస్తారు. అందుకే తల్లి ఉద్యోగానికే ఎక్కువ వేతనం దక్కాలని నేను భావిస్తున్నా’ అని ఛిల్లర్ చెప్పగానే మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న ప్రాంగణం చప్పట్లతో మార్మోగిపోయింది. పోటీ అనంతరం 2017 కిరీటాన్ని మానుషి ఛిల్లర్ గెలుచుకుందని మిస్ వరల్డ్ పోటీల కమిటీ అధికారిక ఫేస్బుక్, ట్వీటర్ పేజీల్లో వెల్లడించింది. ‘2017 మిస్ వరల్డ్ విజేత ఛిల్లర్’ అంటూ ట్వీటర్లో పోస్టుచేసింది. బ్యూటీ విత్ పర్పస్ విభాగంలోనూ మిస్ వర్డల్ – 2017 పోటీల్లో టాప్ మోడల్, పీపుల్స్ చాయిస్, మల్టీమీడియా విభాగాల్లో ఛిల్లర్‡ సెమిఫైనల్కు చేరారు. అలాగే ‘బ్యూటీ విత్ పర్పస్’ విభాగంలో మరొకరితో కలిసి సంయుక్త విజేతగా నిలిచారు. బ్యూటీ విత్ పర్పస్ కోసం ఛిల్లర్ ఎంచుకున్న ప్రాజెక్టు ‘శక్తి’. రుతుస్రావ సమయంలో ఆరోగ్యంపై మహిళలకు అవగాహన కల్పించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 20 గ్రామాల్లో పర్యటించిన ఆమె 5 వేల మంది మహిళలకు చికిత్స అందించారు. రీటా ఫారియా నుంచి ఛిల్లర్ వరకూ మానుషి ఛిల్లర్ సాధించిన కిరీటంతో భారత్ ఖాతాలో ఆరు మిస్ వరల్డ్ టైటిల్స్ చేరాయి. మొదటిసారి 1966లో రీటా ఫారియా మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుని భారత్లోని అందగత్తెల సొగసును ప్రపంచానికి చాటిచెప్పారు. 1994లో ఐశ్వర్య రాయ్, 1997లో డయానా హేడన్, 1999లో యుక్తా ముఖీ, 2000లో ప్రియాంకా చోప్రాలు ప్రపంచ సుందరులుగా నిలిచారు. మిస్ వరల్డ్ గెలుచుకున్నాక రీటా ఫారియా వైద్య వృత్తిని ఎంచుకున్నారు. ఇక ఐశ్వర్య బాలీవుడ్ నటిగా కొనసాగారు. డయానా, యుక్తా ముఖీలు బాలీవుడ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నా విజయాలు దక్కలేదు. ప్రియాంకా చోప్రాకు మొదట్లో సినిమా విజయాలు వెక్కిరించినా.. ప్రస్తుతం బాలీవుడ్తో పాటు హాలీవుడ్లోను ఆమె రాణిస్తున్నారు. భారత్కు రెండు సార్లు ‘మిస్ యూనివర్స్’ కిరీటం దక్కింది. 1994లో సుస్మితా సేన్, 2000లో లారాదత్తాలు మిస్ యూనివర్స్లుగా నిలిచారు. ప్రపంచంలో భారత్, వెనెజులాలు మాత్రమే ఆరేసి మిస్ వరల్డ్ టైటిల్స్ గెలుచుకున్నాయి. రాజారెడ్డి, రాధారెడ్డిల వద్ద కూచిపూడి శిక్షణ చిన్నప్పటి నుంచి మానుషి ఛిల్లర్కు చదువుతో పాటు నాట్యం, చిత్రలేఖనం, ఆటల్లో కూడా అభిరుచి ఉంది. 1997, మే 14న హరియాణాలో జన్మించిన ఆమె పాఠశాల విద్యాభ్యాసం ఢిల్లీలోని సెయింట్ థామస్ స్కూలులో సాగగా, ప్రస్తుతం సోనేపట్లోని భగత్ ఫూల్ సింగ్ ప్రభుత్వ మహిళా వైద్య కళాశాలలో వైద్య విద్య అభ్యసిస్తోంది. ఛిల్లర్ తండ్రి డాక్టర్ మిత్రా బసు ఛిల్లర్ డీఆర్డీఓలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. తల్లి డాక్టర్ నీలమ్ ఛిల్లర్‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్, అండ్ అల్లైడ్ సెన్సెన్స్’లో న్యూరో కెమిస్ట్రీ విభాగం హెడ్గా ఉన్నారు. ప్రముఖ నాట్యాచార్యులు రాజారెడ్డి, రాధారెడ్డి, కౌసల్యా రెడ్డిల వద్ద మానుషి కూచిపూడి నృత్యం అభ్యసించారు. పారాగ్లైడింగ్, బంగీ జంపింగ్, స్నోర్కెల్లింగ్, స్కూబా డైవింగ్ల్లో చురుగ్గా పాల్గొనడమంటే ఛిల్లర్కు ఎంతో ఇష్టం. స్కెచింగ్, చిత్రలేఖనంలో కూడా ప్రవేశముంది. అలాగే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి నటనలో మెలకువలు నేర్చుకున్నారు. ముంబైలో జరిగిన 54వ 2017 –మిస్ ఇండియా పోటీల్లో హరియాణా తరఫున ఆమె ప్రాతినిధ్యం వహించారు. ఈ పోటీలో మిస్ ఇండియాగానే కాకుండా మిస్ ఫొటోజెనిక్గా కూడా నిలిచారు. -
మనూషి చిల్లర్కు మిస్ వరల్డ్ కిరీటం
-
భారత్కు మిస్ వరల్డ్ కిరీటం
బీజింగ్: భారత్కు మిస్ వరల్డ్ కిరీటం దక్కింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత మిస్ ఇండియా మనూషి చిల్లర్ మిస్ వరల్డ్ కిరీటం అందుకున్నారు. చైనాలో జరిగిన 2017 మిస్ వరల్డ్ పోటీల్లో మొత్తం 118 మంది సుందరీమణులు పోటీపడ్డారు. ప్రేక్షకులు, న్యాయనిర్ణేతల ఓట్లను కలుపుకొని తొలుత టాప్-40 మందిని ఎంపిక చేశారు. అనంతరం టాప్-25, టాప్-8, చివరకు టాప్-3 రౌండ్లు నిర్వహించారు. టాప్-3లో మిస్ ఇండియా, మిస్ మెక్సికో, మిస్ ఇంగ్లండ్లు పోటీపడ్డారు. చివరి రౌండ్లో ప్రపంచంలో ఏ వృత్తితో ఎక్కువగా సంపాదించవచ్చన్న న్యాయనిర్ణేతల ప్రశ్నకు.. మిస్ ఇండియా మనూషి చిల్లర్ ప్రపంచంలో అన్నిటికన్నా అమ్మదనమే గొప్పదని తెలిపారు. ఇది డబ్బుల వ్యవహారం కాదు. ప్రేమకు, గౌరవానికి ప్రతిరూపం అని పేర్కొన్నారు. అనంతరం విజేతగా మనూషి చిల్లర్ను ప్రకటించడంతో 2016 మిస్ వరల్డ్ నుంచి కిరీటం అందుకున్నారు. రెండోస్థానంలో మిస్ మెక్సికో, మూడో స్థానంలో మిస్ ఇంగ్లండ్లు నిలిచారు. 17 ఏళ్ల క్రితం బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా 2000 మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్నారు. -
మిస్ ఇండియా–2017గా మానుషి చిల్లర్
ముంబై: ఫెమినా మిస్ ఇండియా–2017 కిరీటాన్ని హరియాణాకు చెందిన మానుషి చిల్లర్ కైవసం చేసుకుంది. ముంబైలోని యశ్రాజ్ ఫిల్మ్ స్టూడియోలో ఆదివారం రాత్రి జరిగిన పోటీలో విజేతగా నిలిచి మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్నారు. మొత్తం 30 మంది పోటీ పడగా.. టాప్ 6లో మానుషి చిల్లర్, షెఫాలీ సూద్, సనా దువా, ప్రియాంక కుమారి, ఐశ్వర్య దేవన్, అనుక్రితి గుసైన్లు నిలిచారు. మిస్ ఇండియాగా మానుషి, మొదటి రన్నరప్గా సనా దువా(జమ్మూ కశ్మీర్), రెండో రన్నరప్గా ప్రియాంకా కుమారి(బిహార్) ఎంపికయ్యారు. బాలీవుడ్ నటులు అర్జున్ రాంపాల్, ఇలియానా, బిపాసా బసు, అభిషేక్ కపూర్, విద్యుత్ జమాల్, ఫ్యాషన్ డిజైనర్ మనీశ్ మల్హోత్రలు న్యాయమూర్తులుగా వ్యవహరించారు. ఢిల్లీలోని సెయింట్ థామస్ స్కూల్, సోనెపట్లోని ఉమెన్స్ మెడికల్ కాలేజీలో మానుషి విద్యాభ్యాసం కొనసాగింది. ఆమె తల్లిదండ్రులిద్దరూ వైద్యులే.