Millers
-
రూ. 3,300 కోట్లు రికవరీ చేస్తారా..లేదా ?
సాక్షి, హైదరాబాద్: మిల్లర్ల నుంచి బకాయిల వసూలులో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే..పౌరసరఫరాలశాఖ రూ.3,300 కోట్లపైన ఆశలు వదులుకున్నట్టే కనిపిస్తోంది. 2022–23 యాసంగిలో 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థ ద్వారా సేకరించింది. ఇందులో సెంట్రల్ పూల్కు ఇచ్చే పారాబాయిల్డ్ బియ్యం, రాష్ట్ర అవసరాలకు బియ్యం కోసం దాదాపు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్లు మరాడించారు. మిగతా 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్ల వద్దే ఉండిపోయింది. ఈ ధాన్యం విలువ రూ.7వేల కోట్లు. అయితే అప్పటికే కొంతమంది మిల్లర్లు తా ము ధాన్యాన్ని మిల్లింగ్ చేయలేమని చేతులెత్తేసి..తమ వద్ద ఉన్న ధాన్యాన్ని అక్రమంగా విక్రయించడం, మిల్లింగ్ చేసి బియ్యాన్ని సరిహద్దులు దాటించేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మిల్లర్ల వద్ద ఉన్న వేల కోట్ల రూపాయల విలువైన ధాన్యంపై దృష్టి పెట్టారు. రికవరీ చేయాల్సిందేనని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ధాన్యం రికవరీకి జాతీయస్థా యిలో వేలానికి టెండర్లు ఆహ్వానించగా, నాలుగు సంస్థలు ముందుకొచ్చాయి. రికవరీ చేయాల్సిన ధాన్యానికి బదులు అప్పటి ధాన్యం విలువకు అదనంగా రూ. 200కు పైగా చేర్చి వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇలా మొత్తానికి 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విలువను ప్రభుత్వం రాబట్టింది. మరో 15 లక్షల మెట్రిక్ టన్నుల వరకు మిల్లర్ల వద్దే ఉండిపోయింది. దీన్ని ‘వేలం ధాన్యం’గా పేర్కొంటున్న మిల్లర్లు..ధాన్యం బకాయి పడడాన్ని అత్యంత సాధారణ విషయంగా చెబుతున్నారు. మిల్లర్ల సంఘం ముఖ్య నాయకుడిగా చెప్పుకుంటున్న ఓ మిల్లరే దాదాపు రూ.400 కోట్ల విలువైన టెండర్ ధాన్యం బకాయి పడ్డట్టు సమాచారం. నాయకులుగా చెప్పుకునేవారు రూ.వందల కోట్ల బకాయిలు ఉన్నా, వ్యాపారం కొనసాగిస్తుండడం పలు సందేహాలకు తావిస్తోంది. తూతూమంత్రంగా రెవెన్యూ రికవరీ యాక్ట్, క్రిమినల్ కేసులు ధాన్యం బకాయిలు చెల్లించని మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, భవిష్యత్లో ధాన్యం మిల్లింగ్కు ఇవ్వబోమని, రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద యజమాని పేరిట ఉన్న భూములను వేలం వేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో మిల్లర్లు తాము విక్రయించిన ధాన్యం నుంచి కొంతమేర రికవరీ చూపించి తాత్కాలికంగా తప్పించుకున్నారు. 314 మంది మిల్లర్లు పూర్తిగా చేతులెత్తేశారు. తమ దగ్గర ధాన్యం లేదు.. దానికి సమానమైన సొమ్ము కూడా లేదన్నారు. వీరి నుంచి రావాల్సిన సుమారు రూ. 1,000 కోట్లు.. రాని బకాయిల కింద ప్రభుత్వం జమకట్టింది. దీంతో వారిపై చర్యలకు ఉపక్రమించింది. నర్సాపూర్లోని ఓ మిల్లర్కు చెందిన 1.31 ఎకరాల భూమిని రూ. 2.12 కోట్లకు వేలం వేసింది. ప్రతి జిల్లాలో కొందరిపై కేసులు కూడా నమోదు చేశారు. అయితే ఏమైందో ఏమో గానీ మిల్లర్లపై చర్యలు నిలిచిపోవడంతోపాటు ధాన్యం కేటాయింపులో కూడా షరతులతో కూడిన సడలింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మిల్లర్ల వద్ద నుంచి రావాల్సిన రూ.3,300 కోట్ల బకాయిలు ఇప్పట్లో రికవరీ అయ్యే అవకాశం కనిపించడం లేదు. తాజాగా మరో మూడు నెలల గడువు మిల్లర్ల నుంచి బకాయి ధాన్యం వసూలుకు మరో మూడు నెలల గడువు ఇస్తూ ఈ నెల 11న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల క్రితం ధాన్యం ఎలాగూ ఉండదు కాబట్టి..దానికి సమానమైన నగదు వసూలు చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే 314 మంది మిల్లర్లు ఇప్పటికే మొండికేయగా, మూడు నెలల కాలంలో ఎంత మంది చెల్లిస్తారో తెలియని పరిస్థితి. కఠిన చట్టాలను ప్రయోగిస్తే మిల్లర్లు తిన్న సొమ్ము కక్కేందుకు అవకాశం ఉన్నా, ఆ దిశగా ప్రభుత్వం కదలడం లేదు. -
రైతుకు దక్కాల్సిన సొమ్ములో 30% తినేస్తున్నారు
సాక్షి, అమరావతి: ధాన్యం సేకరణలో రైతుకు తీరని అన్యాయం జరుగుతోంది. అలా అనడం కంటే ప్రభుత్వమే రైతుకు అన్యాయం చేస్తోందని చెప్పడం కరెక్ట్. రైతుకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం.. కల్లాల్లో ధాన్యం పెట్టుకొని ధాన్యం విక్రయించడానికి ఎదురుచూసు్తన్న రైతు బలహీనతను ఆసరాగా చేసుకొని దళారులు దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం అడ్డుకోకపోగా ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం మిల్లర్లు, దళారులతో కలిసి ధాన్యం రైతులకు దక్కాల్సిన సొమ్ములో నేరుగా 30% తినేస్తోంది. మిల్లర్లు–దళారుల దోపిడీని నిలువరించాల్సిన ప్రభుత్వ పెద్దలు.. ప్రచార ఆర్భాటానికి ధాన్యం సేకరణ అంశాన్ని ఉపయోగించుకుని జబ్బలు చరుచుకుంటున్నారు. దోపిడీ సాగుతున్న తీరు ఇలా..మద్దతు ధరలోనూ 30–40 శాతానికి పైగా లూటీరైతులకు చెల్లించాల్సిన కనీస మద్దతు ధరలో 30–40 శాతానికి పైగా లూటీ అవుతోంది. ఖరీఫ్ సీజన్లో 32.75 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించగా.. దాన్ని ఇటీవలే 37 లక్షల టన్నులకు పెంచారు. ఇప్పటివరకు 22 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. మరో 15 లక్షల టన్నులు సేకరించాల్సి ఉంది. అత్యధికంగా ఉత్తరాంధ్రలోనే 5.20 లక్షల టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంది. ఆ తర్వాత కృష్ణా జిల్లాలో 2.50 లక్షల టన్నులు, ఎన్టీఆర్ జిల్లాలో లక్ష టన్నులు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 1.50 లక్షల టన్నులు సేకరించాల్సి ఉంది. ఇప్పటివరకు సేకరించిన ధాన్యంలో 90 శాతానికి పైగా రైతుల పేరిట దళారులే సేకరించారు. ఇప్పటివరకు తాము సేకరించామని చెబుతున్న ధాన్యానికి కనీస మద్దతు ధర ప్రకారం రైతులకు రూ.5,397 కోట్లు చెల్లించినట్టుగా చెబుతున్నారు. కానీ.. ఇందులో వివిధ రూపాల్లో రూ.1,618 కోట్లకు పైగా.. అంటే 30 శాతానికి పైగా స్వాహా అయినట్టు తెలుస్తోంది.మిల్లర్లతో కుమ్మక్కుమిల్లర్లతో కొనుగోలు కేంద్రాల సిబ్బంది కుమ్మక్కయ్యారు. ఆర్ఎస్కేలలో నిర్ధారించిన తేమ శాతానికి అమ్మించేలా మిల్లర్లను ఒప్పించాల్సింది పోయి, మిల్లర్లు నిర్ధారించిన తేమ శాతానికి అమ్ముకోవాలంటూ రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. ఆర్ఎస్కేల్లో 17 శాతం ఉందని నిర్ధారించిన ధాన్యాన్ని మిల్లు దగ్గరకు తీసుకెళితే ధాన్యంలో ధూళి, దుమ్ము ఉందనే సాకుతో 18–20 శాతంగా నమోదు చేస్తున్నారు. దోపిడీ కోసమే ఇలా పొంతనలేని లెక్కలు చెబుతున్నారు. పొరుగు జిల్లాల నుంచి వచ్చే మిల్లర్లు సైతం 16–17 తేమ శాతం ఉన్న ధాన్యాన్ని 18–21 శాతం వరకు నిర్ధారించి మీకు నచ్చితే లోడింగ్ చేస్తాం, లేకుంటే పట్టుకెళ్లిపోండని తెగేసి చెబుతున్నారు.దళారులు పంపిస్తే గంటలోనే అన్లోడింగ్దళారులు ప్రారంభంలో రైతులకు మద్దతు ధర 75 కేజీల బస్తాకు రూ.1,350 నుంచి రూ.1,500 మధ్య చెల్లించేవారు. ప్రస్తుతం కాస్త పెంచి రూ.1,500 నుంచి రూ.1,600 మధ్య చెల్లిస్తున్నారు. అదే ఎంటీయూ 1262, 1318 రకం ధాన్యానికైతే నేటికీ రూ.1,100 నుంచి రూ.1,300 మధ్యే చెల్లిస్తున్నారు. ఫలితంగా 75 కేజీల బస్తా దగ్గరే 125 నుంచి రూ.400 వరకు నష్టపోతున్నారు. ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీలు, మిల్లర్ల వేధింపులు తట్టుకోలేక చివరకు దళారులకే ధాన్యాన్ని ఇచ్చి మిల్లులకు పంపిస్తున్నారు. కాగా.. దళారులు తెచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు గంటలోనే అన్లోడ్ చేసుకుంటున్నారు. అదే రైతు నేరుగా తీసుకెళ్తే అన్లోడింగ్కు 24 నుంచి 48 గంటల సమయం పడుతోంది. మొహం చాటేస్తున్న మిల్లర్లువర్షాలతో ధాన్యంలో తేమ శాతం పెరిగిపోతోంది. ఎంత ఆరబెట్టినా మిల్లు వద్ద 25 శాతం కన్నా తక్కువ తేమ చూపడం లేదు. తేమ శాతం వంకతో మిల్లర్లు కొనేందుకు కూడా మొహం చాటేస్తున్నారు. ధాన్యం వ్యాపారులు 75 కేజీల బస్తాకు రూ.1,100.. మహా అయితే రూ.1,200కు మించి ఇవ్వలేమని తెగేసి చెబుతున్నారు. ఏం చేయాలో పాలుపోక రైతులు దిక్కులు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ధాన్యం సొమ్ములు గంటలోనే జమ చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నప్పటికీ సాంకేతిక కారణాల సాకుతో 15 నుంచి నెల రోజుల వరకు వేచి చూడాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు.పక్కదారి పడుతోందిలా..సాధారణంగా రైతులు కోసిన ధాన్యాన్ని 40 కేజీల చొప్పున బస్తాలలో కాటా వేస్తారు. గోనె సంచి బరువు మరో 500 గ్రాములు కలిపి 40.50 కేజీల చొప్పున కాటా వేయాలి. కానీ.. 41.50 కేజీల వరకు కాటా తూస్తున్నారు. అంటే కేవలం 40 కేజీల కిట్టీ దగ్గరే ఏకంగా కిలో చొప్పున టన్నుకు 25 కేజీలకుపైగా నష్టపోతున్నారు. అంటే కిలోకు రూ.23 చొప్పున 25 కిలోలకు రూ.575 చొప్పున ప్రతి టన్నుకూ రైతులకు నష్టం వాటిల్లుతోంది. ఇక తేమ శాతం విషయానికి వస్తే 17 శాతం వరకు తేమ ఉంటే పూర్తిస్థాయి మద్దతు ధర (క్వింటాకు రూ.2,300) చొప్పున చెల్లించాలి. కానీ.. బూతద్దం పెట్టి వెతికినా పూర్తిస్థాయి మద్దతు ధర రైతులకు దక్కడం లేదు. నిబంధనల ప్రకారం తేమ 17 శాతం ఉన్నా 75 కేజీల బస్తాకు కేజీన్నర నుంచి రెండున్నర కేజీల చొప్పున తరుగు మినహాయిస్తున్నారు. అంటే ఇక్కడ టన్నుకు 35–40 కేజీలు చొప్పున రూ.920 నష్టపోతున్నాడు. తేమ శాతం 17 దాటితే ఒక్కో శాతానికి రెండున్నర కేజీల వరకు తరుగు మినహాయిస్తున్నారు. 25 శాతం తేమ ఉంటే బస్తాకు 8–12 కేజీల చొప్పున కోత పడుతోంది. ఈ విధంగా టన్నుకు 140 కేజీల చొప్పున రూ.3,864 మేర రైతులకు నష్టం వాటిల్లుతోంది. నిబంధనల మేరకు తేమ శాతం ఉన్నా సరే టన్నుకు రూ.1,495 నష్టపోతుంటే.. తేమ శాతం గనుక 17–25 మధ్య ఉంటే టన్నుకు రూ.5,355 వరకు నష్టపోతున్నారు. అంటే టన్నుకు రూ.23 వేలు దక్కాల్సిన రైతులకు కేవలం సుమారు రూ.17 వేలు మాత్రమే దక్కుతోంది. మిగిలిన మొత్తం దళారులు, మిల్లర్లు స్వాహా చేస్తున్నారు. వారినుంచి మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులకు వాటాలు ముడుతున్నాయి.తేమ శాతంలో పొంతన లేని లెక్కలుధాన్యం కొనుగోలులో దోపిడీకి కూటమి ప్రభుత్వమే దగ్గరుండి ద్వారాలు తెరిచింది. దళారులు, మిల్లర్ల ప్రమేయం లేకుండా గడచిన ఐదేళ్లుగా అత్యంత పారదర్శకంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరిగితే.. ప్రస్తుతం మిల్లర్ల కనుసన్నల్లోనే «కొనుగోళ్లు జరిగే పరిస్థితి నెలకొంది. తొలుత 25 శాతం వరకు తరుగు లేకుండానే తీసుకుంటామని తొలుత చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత మాటమార్చి 17 శాతం దాటితే ఐదు కేజీలు తరుగుతో తీసుకుంటామని ప్రకటించింది. చివరకు నిబంధనల మేరకు 17 శాతం తేమ ఉన్నా సరే పూర్తి మద్దతు ధర చెల్లించే పరిస్థితి కన్పించడం లేదు. గతంలో రైతు భరోసా కేంద్రాల్లో నిర్ధారించిన తేమ శాతమే ఫైనల్. అదే తేమ శాతానికి మద్దతు ధర లెక్కగట్టి రైతులకు జమ చేసేవారు. కానీ.. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రస్తుతం రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే)తో పాటు మిల్లుల వద్ద కూడా తేమ శాతాన్ని నిర్ధారిస్తున్నారు. ఈ రెండుచోట్ల నిర్ధారిస్తున్న తేమ శాతానికి పొంతన లేకుండా పోతోంది.కాళ్లా వేళ్లా పడినా కొనడం లేదు ఈ రైతు పేరు గుడవర్తి వెంకట సుబ్బరాజు. బాపట్ల జిల్లా మంతెనవారిపాలేనికి చెందిన సుబ్బరాజు పదెకరాల్లో ఎంటీయూ–1262 రకం సాగు చేశారు. ఈ నెల 16న కోయగా.. ఎకరాకు 35 బస్తాల చొప్పున 350 బస్తాల దిగుబడి వచ్చింది. 8 రోజులు ఆరబెట్టి.. 24వ తేదీన రైతు సేవా కేంద్రంలో తేమ పరిశీలిస్తే 23 శాతం వచ్చింది. బాపట్ల ఉప్పరపాలెం రైసుమిల్లుకు అదే రోజున 100 బస్తాలను తోలితే 23 శాతం తేమ ఉందని 5 కేజీల తరుగుతో తీసుకున్నారు. బుధవారం మరో 200 బస్తాలు తీసుకెళ్తే 27 శాతం తేమ ఉంది. మీ ధాన్యం మాకొద్దని తెగేసి చెప్పారు. ‘తరుగు ఎంతైనా తీసుకోండి. మీకు నచ్చిన ధర ఇచ్చి ధాన్యం దింపుకోండ’ని కాళ్లావేళ్లా పడినా మిల్లు యాజమాన్యం పట్టించుకోలేదు. అధికారుల దృష్టికి తీసుకెళ్తే.. మిల్లర్ ఏం చెబితే అదే ఫైనల్ అన్నారు. వాతావరణం చూస్తే గంటకోలా మారుతోంది. చేసేది లేక టార్పాలిన్లు అద్దెకు తెచ్చి మిల్లు ఎదుటే ట్రాక్టర్లో ఉన్న ధాన్యం బస్తాలపై కప్పి అక్కడే పడిగాపులు పడుతున్నాను. ఉదయం నుంచి తిండీ తిప్పల్లేవు. ఏంచేయాలో పాలుపోవడం లేద’ని సుబ్బరాజు కన్నీరుమున్నీరయ్యారు.బస్తాకు రూ.1,470కు మించి ఇవ్వడం లేదు ఈ రైతు పేరు కొండవీటి వెంకటసుబ్బారావు. కృష్ణా జిల్లా మంతెనకు చెందిన ఈయన నాలుగు ఎకరాల్లో ఎంటీయూ–2077 వరి సాగు చేసారు. బుడమేరు ముంపు వల్ల ఎకరాకు 30 బస్తాలకు మించి రాలేదు. రైతు సేవా కేంద్రానికి శాంపిల్ తీసుకెళ్లి తేమ శాతం చూడమంటే.. ‘అవసరం లేదు నేరుగా మిల్లుకు తీసుకుపొండి..అక్కడ వాళ్లు చెప్పిన తేమ శాతమే ఫైనల్’ అని కొనుగోలు కేంద్రం సిబ్బంది బదులిచ్చారు. దీంతో దాములూరులోని బాలాజీ రైస్మిల్లుకు 213 (ఒక్కొక్కటీ 40 కేజీల) బస్తాలు తీసుకెళితే 24 శాతం తేమ వచ్చింది. రెండో రోజు మరో 105 బస్తాలు తీసుకెళితే 26 శాతం వచ్చిందని చెప్పారు. దాదాపు 8 కేజీలు తరుగు తీసేశారు. 75 కేజీల బస్తాకు రూ.1,470 చొప్పున ఇస్తామన్నారు. అడ్డగోలుగా దోచుకుంటున్నారు. కనీసం పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదు’ అని సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు.పొంతన లేని తేమ లెక్కలు ఈ రైతు పేరు గుడిపూడి అవినాశ్. ఏలూరు జిల్లా దెందులూరుకు చెందిన ఈయన ఐదెకరాల్లో ఎంటీయూ–1318 రకం సాగు చేశారు. ఎకరాకు 33 బస్తాల దిగుబడివచ్చింది. 18న కోత కోయగా.. 23న రైతు సేవా కేంద్రంలో 17 శాతం తేమ వచ్చింది. అదే రోజున మారుతి మిల్లుకు 154 బస్తాలు తరలిస్తే.. అక్కడ తేమ శాతం 19గా చూపించారు. 75 కేజీల బస్తాకు రూ.1,725 ఇవ్వాల్సి ఉండగా.. రూ.1,650 చొప్పున ఇచ్చారు. రైతు సేవాకేంద్రంలో చెబుతున్న తేమ శాతానికి మిల్లులో చెబుతున్న తేమ శాతానికి పొంతన ఉండడం లేదు. ఇదేమిటని అడిగితే మీకు నచ్చకపోతే తీసుకెళ్లిపోవచ్చని మిల్లర్ చెబుతున్నారు. -
ధాన్యం దళారీగా సర్కారు
సాక్షి, అమరావతి: ‘ప్రభుత్వం ధాన్యం దళారీగా మారింది. రైతులకు, మిల్లర్లకు మధ్య మధ్యవర్తిత్వం నడుపుతోంది. మిల్లర్లు చెప్పిన ధరకు ధాన్యం ఇచ్చేయాలంటూ రైతులపై ఒత్తిడి తీసుకొస్తోంది. రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకూ పూర్తిస్థాయిలో కనీస మద్దతు ధర దక్కడంలేదు. చరిత్రలో ఎప్పుడూ ఇంత దారుణమైన పరిస్థితులు చూడలేదు’.. అంటూ అన్నదాతలు మండిపడుతున్నారు. తేమశాతంతో సంబంధం లేకుండా కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. గడిచిన రెండ్రోజులుగా మండల తహసీల్దార్ కార్యాలయాలు, ఆర్బీకేలు, రైతుక్షేత్రాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం రాశుల ఎదుట నిరసనలు వ్యక్తంచేసిన రైతులు బుధవారం విజయవాడలోని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన వివిధ మండలాల రైతులు, కౌలు రైతులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం పౌరసరఫరాల సంస్థ ఉన్నతాధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బాధిత రైతులు, వివిధ రైతు సంఘాల నేతలు మాట్లాడారు. వారు ఏమన్నారంటే..మంత్రి చిటికలేసినా ధాన్యం కదల్లేదు..కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించి, రోడ్లపై ఉన్న ధాన్యాన్ని సాయంత్రానికి కల్లా కాటావేసి మిల్లులకు తరలించాలని నాలుగు రోజుల క్రితం అధికారులకు చిటకలేసి మరీ చెప్పారు. రోజులు గడుస్తున్నా గింజ ధాన్యం కూడా కాటా వేయలేదు. మంత్రులు, ఉన్నతాధికారుల ఆదేశాలు క్షేత్రస్థాయిలో పట్టించుకోవడంలేదు. వాళ్లు పర్యటించిన చోట కూడా ధాన్యం కాటా వేయడం కానీ, మిల్లులకు తోలడంగానీ జరగడంలేదు. మారుమూల గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు ‘మద్దతు’ దక్కడంలేదు..తేమ శాతం ఎంతున్నా కొంటామంటున్నారు. ఆ తర్వాత 17 శాతం దాటితే ఐదు కేజీల కోత వేసి మిగిలిన ధాన్యాన్ని కొంటామన్నారు. పూర్తిస్థాయి మద్దతు ధర కల్పించాల్సిన ప్రభుత్వమే తరుగు మినహాయించి కొంటామని చెప్పడం దారుణం. తుపాను, వర్షాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తేమ శాతం 20 నుంచి 24 శాతం వస్తోంది. రెండు శాతమో, ఐదు శాతమో కట్ చేసి మిగిలిన ధాన్యానికి మద్దతు ధర ప్రకారం లెక్కిస్తే 75 కేజీల బస్తాకు రూ.1,670 చొప్పున ఇవ్వాలి. కానీ, రూ.1,470–1,500కు మించి ఇవ్వడంలేదు. పైగా.. ధాన్యం బాగోలేదంటూ మిల్లర్లు పేచీ పెడుతున్నారు. కొనేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. ఎంటీయూ 1,262, 1,318 వంటి ఫైన్ వెరైటీ ధాన్యానికి కూడా మద్దతు లభించని దుస్థితి ఏర్పడింది.రైతులకు–మిల్లర్లకు మధ్య బ్రోకర్లుగా మారారు..నిజానికి.. రైతుసేవా కేంద్రాల్లో తేమ శాతాన్ని పరీక్షించాలి. అక్కడ నిర్ధారించే దానినే ప్రామాణికంగా తీసుకుని ధరను నిర్ణయించి అదే ధరకు కొనుగోలు చేయాలి. కానీ, ఎక్కడా ఆ పరిస్థితిలేదు. ఆర్ఎస్కేలకు వెళ్తుంటే తేమ శాతం కూడా చూడడంలేదు. ఏ మిల్లుకు వెళ్తారని అడిగి అక్కడకు పంపించేస్తున్నారు. మిల్లు వాళ్లు ఏ ధర నిర్ణయిస్తారో ఆ ధరకు అమ్ముకోండంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇది చాలా దారుణం. ఇది రైతాంగాన్ని మిల్లర్లు దోచుకునేందుకు ఉపయోగపడే పద్ధతే తప్ప రైతులకు మేలుచేసే విధానం కాదు. ఇక వాట్సప్లో ‘హాయ్’ అని మెసేజ్ పెడితే చాలు క్షణాల్లో మీ ధాన్యం కొనేస్తామంటున్నారు. కానీ, ఆచరణలో ఇదెక్కడా అమలుకు నోచుకోవడంలేదు.ఒక్క ప్రైవేటు వ్యాపారిపైనైనా కేసు పెట్టారా?ఇక ప్రైవేటు వ్యాపారులు కొనే ధాన్యాన్ని ప్రభుత్వం ఎందుకు కొనడంలేదో అర్థం కావడంలేదు. తక్కువ ధరకు కొనే వ్యాపారస్తులపై కేసులు పెడతామని చెప్పారుగానీ.. రాష్ట్రంలో ఒక్క ధాన్యం వ్యాపారిపైనైనా కేసు పెట్టారా? ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు తక్కువ రేటుకు ధాన్యం కొంటుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. పోనీ ప్రభుత్వమైనా కొంటుందా అంటే అదీలేదు. గతేడాది కోసిన ధాన్యాన్ని కోసినట్లుగానే తీసుకెళ్లారు.. ప్రతీ రైతుకూ మద్దతు ధర లభించింది. కానీ, ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితిలేదు. ధర్నాలో ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం. హరిబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు టీవీ లక్ష్మణస్వామి, కృష్ణాజిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కే. శివనాగేంద్ర, పంచకర్ల రంగారావు, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పీవీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.ఇలా అయితే ఎండ్రిన్ తాగి చావాలి..ఏడెకరాల్లో వరి వేశాం. పంట కోసి 15 రోజులైంది. తేమ 17 శాతం ఉంది. 20 శాతమైనా తీసుకుంటామన్నారు. కానీ తీసుకోలేదు. బేరగాళ్లు వచ్చి 75 కేజీల బస్తాకు రూ.1,450 ఇస్తామన్నారు. మా రైతు రూ.1,740 చొప్పున లెక్కగట్టి కౌలు ఇవ్వాలంటున్నారు. ఇలా అయితే మా చేతి డబ్బులు పెట్టుకోవాలి. పైగా పంటను కాపాడుకునేందుకు పరదాలకు రోజుకు రూ.2వేలు ఖర్చవుతోంది. డబ్బులు కట్టలేక చచ్చిపోతున్నాం. ఇలా అయితే ఎండ్రిన్ తాగి చావడం తప్ప వేరే దారిలేదు.– పొద్దుటూరు ప్రసాద్, గొడవర్రు. కంకిపాడు మండలం, కృష్ణాజిల్లాఇలా అయితే కౌలు రైతులు బతికేదెలా?నేను మూడెకరాల్లో వరి వేశాను. గతేడాదితో పోలిస్తే ఎకరాకు ఐదు బస్తాలు తగ్గింది. తేమ శాతం తక్కువగానే ఉన్నప్పటికీ ఈ రకం ధాన్యాన్ని కొనడంలేదు. ఆర్బీకేల్లోనే 20–25 శాతం ఉంటే 1,450 ఇస్తామంటున్నారు.బయట వాళ్లు కొనడం లేదు. పంటను కాపాడుకునేందుకు పరదాల కోసం రోజుకు ఎకరాకు రూ.300–500 చొప్పున చెల్లిస్తున్నాం. ఇలా అయితే కౌలురైతులు బతికేదెలా? కోసూరి శివనాగేంద్ర, గడ్డిపాడు, పమిడిముక్కల మండలం, కృష్ణాజిల్లాగతేడాది మద్దతు ధర వచ్చింది..ఎనిమిది ఎకరాల్లో వరికోసి 10 రోజులైంది. తేమ 15.5 శాతం ఉంది. మిల్లుకు పంపిస్తామన్నారు. కానీ ఎవరూ రాలేదు. మళ్లీ వెళ్లి అడిగితే మిల్లు దగ్గరకు వెళ్లండి అంటున్నారు. బేరగాళ్లు రూ.1,400 ఇస్తామంటున్నారు. అధికారులు పట్టించుకోవడంలేదు. గతేడాది కోసిన వెంటనే 75 కేజీల బస్తాకు రూ.1,630కు కొన్నారు. ఈ ఏడాది కొనేవాడులేడు. 10 రోజులుగా రోడ్డుపైనే ధాన్యం ఉంది. ఏం చేయాలో పాలుపోవడం లేదు. – గెద్దా నరేంద్ర, గొడవర్రు, కంకిపాడు మండలం, కృష్ణాజిల్లానష్టానికి తోలాల్సి వస్తోంది..ఐదెకరాల్లో వరివేసా. ఎకరాకు 30 బస్తాలొచ్చింది. గొడవర్రు ఆర్ఎస్కు తీసుకెళ్తే 15.4% తేమ వచ్చింది. రేటు చెప్పలేదు. 90 బస్తాలు మిల్లుకు తోలారు. అక్కడ 75 కేజీల బస్తాకు రూ.1,600 కు మించి ఇవ్వమని తెగేసి చెప్పారు. ఆర్ఎస్కే సిబ్బందికి చెబితే పట్టించుకోలేదు. చేసేది లేక బస్తాకు రూ.130 చొప్పున నష్టానికి మిల్లుకు తోలాల్సి వచ్చింది.– గెడ్డం రాజా, గొడవర్రు, కృష్ణాజిల్లా -
సన్న ధాన్యంపై వ్యాపారుల కన్ను
నిజామాబాద్ జిల్లాలోని వర్ని, బోధన్, మోస్రా, చందూర్ తదితర కొన్ని మండలాల్లో వరి కోతలు 100 శాతం పూర్తయ్యాయి. ఈ మండలాల్లో రైతులు పండించే హెచ్ఎంటీ, జై శ్రీరాం, బీపీటీ లాంటి మంచి రకం (ఫైన్ వెరైటీ) సన్న ధాన్యాన్ని ఇప్పటికే దళారులు, వ్యాపారులు పొలాల నుంచే కొనుగోలు చేశారు. తరుగు, తాలు, తేమ శాతంతో సంబంధం లేకుండా పచ్చి వడ్లను కొన్నారు. నెలరోజుల క్రితం ఇక్కడ కోతలు షురూ కాగా, మొదట్లో క్వింటాలుకు మద్దతు ధర రూ.2,320కి మించి రూ.2,600 వరకు చెల్లించిన వ్యాపారులు, ప్రస్తుతం రూ.2,100 నుంచి రూ.2,300 వరకు చెల్లిస్తున్నారు. పైగా తాలు, తరుగు, తేమ శాతాన్ని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ధాన్యం కొని, డబ్బులు చెల్లిస్తుండడంతో.. రైతులు కూడా వారికే విక్రయిస్తున్నారు. ఫైన్ వెరైటీ సన్న ధాన్యం అధికంగా పండించే నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.సాక్షి, హైదరాబాద్: బహిరంగ మార్కెట్లో సన్న బియ్యానికి ఉన్న డిమాండ్ను సొమ్ము చేసుకునేందుకు రాష్ట్రంలో వ్యాపారులు, మిల్లర్లు పల్లెలపై దృష్టి పెట్టారు. ప్రభుత్వం సన్నాలకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించడంతో రాష్ట్రంలో పెరిగిన సన్నాల సాగును తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. తెల్ల బియ్యం ఎగుమతులపై ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసిన నేపథ్యంలో సన్న ధాన్యాన్ని పెద్ద ఎత్తున సేకరిస్తున్నారు. కోతలు ప్రారంభమైన వెంటనే కల్లాల నుంచే ధాన్యాన్ని ఏకమొత్తంగా కొనుగోలు చేసి మిల్లులకు తరలిస్తున్నారు. నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో సెపె్టంబర్ చివరి వారం నుంచే వరికోతలు మొదలై అక్టోబర్లో పెద్ద ఎత్తున సాగుతాయి. మిగతా జిల్లాల్లో అక్టోబర్ చివరి వారం, నవంబర్ మొదటి వారం నుంచి మొదలై జనవరి దాకా సాగుతాయి. సన్న ధాన్యానికి డిమాండ్ రాష్ట్రంలో కురిసిన అధిక వర్షాల నేపథ్యంలో ఈసారి ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉంది. దీంతో ధాన్యాన్ని 17 శాతం తేమ వచ్చేంత వరకు ఆరబెట్టి, తరుగు, తాలు లేకుండా తూర్పారబట్టి కొనుగోలు కేంద్రానికి తెస్తేనే సేకరిస్తామని మిల్లర్లు చెబుతుండటం.. ఆ బాధలేవీ లేకుండా వ్యాపారులు పచ్చి వడ్లనే కొంటుండడం, డబ్బులు వెంటనే చేతికి వస్తుండడంతో రైతులు కొనుగోలు కేంద్రాల వరకు వెళ్లడం లేదు. తమ వద్దకే వచ్చే వ్యాపారులకు ధాన్యం అమ్మేసుకుంటున్నారు.ప్రస్తుతం కోతలు సాగుతున్న కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల్లో సన్న ధాన్యాన్ని వ్యాపారులు కొంటున్నారు. ఫైన్ రకాలైన జైశ్రీరాం, సాంబ మసూరి (బీపీటీ 5204), తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్ 15048), హెచ్ఎంటీ సోనా రకాలకు బహిరంగ మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉండడంతో ఈ రకాలకు క్వింటాలుకు రూ.2,600 వరకు చెల్లిస్తున్నారు. మిగిలిన సన్న రకాలకు రూ.2,000 వరకు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యంలో కిలో సన్న ధాన్యం కూడా లేకపోవడం గమనార్హం. కాగా రాష్ట్రంలో సన్న ధాన్యం కోసం కేటాయించిన కొనుగోలు కేంద్రాలు ధాన్యం రాకపోవడంతో వెలవెలబోతున్నాయి. రాష్ట్రంలో 33 వరి రకాలను వ్యవసాయ శాఖ సన్నాలుగా గుర్తించింది. వీటికే రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 బోనస్గా చెల్లిస్తుంది. సర్కారు అంచనా సాధ్యమయ్యేనా? రాష్ట్ర ప్రభుత్వం వచ్చే సంక్రాంతి నుంచి రేషన్ కార్డుదారుల కు సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని సుమారు 90 లక్షల కార్డుదారులకే కాకుండా ఇప్పటికే సన్నబియ్యం ఇస్తున్న స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకానికి, అంగన్వాడీలు, గురుకుల పాఠశాలలకు కలిపి ఏటా 24 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) సన్న బియ్యం అవసరం. 24 ఎల్ఎంటీల సన్న బియ్యం కావాలంటే 36 ఎల్ఎంటీల సన్నవడ్లు కావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్లో 50 ఎల్ఎంటీల సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు లేవని పౌరసరఫరాల శాఖ అధికారులే చెపుతున్నారు.వ్యవసాయ శాఖ గుర్తించిన సన్న ధాన్యం రకాలు ఇవే.. సిద్ది (వరంగల్ 44), కంపాసాగర్ వరి–1 (కేపీఎస్ 2874), సాంబ మసూరి (బీపీటీ 5204), జగిత్యాల వరి–3 (జేజీఎల్ 27356), జగిత్యాల వరి–2 (జేజీఎల్ 28545), వరంగల్ సాంబ (డబ్ల్యూజీఎల్ 14), వరంగల్ సన్నాలు (డబ్ల్యూజీఎల్ 32100), జగిత్యాల్ మసూరి (జేజీఎల్ 11470), పొలాస ప్రభ (జేజీఎల్ 384), కృష్ణ (ఆర్ఎన్ఆర్ 2458), మానేరు సోనా (జేజీఎల్ 3828), తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్ 15048), వరంగల్ వరి–1119, కునారం వరి–2 (కేఎన్ఎం 1638), వరంగల్ వరి–2 (డబ్ల్యూజీఎల్ 962), రాజేంద్రనగర్ వరి–4 (ఆర్ఎన్ఆర్ 21278), కునారం వరి–1 (కేఎన్ఎం 733), జగిత్యాల సన్నాలు (జేజీఎల్ 1798), జగిత్యాల సాంబ (జేజీఎల్ 3844), కరీంనగర్ సాంబ (జేజీఎల్ 3855), అంజన (జేజీఎల్ 11118), నెల్లూరు మసూరి (ఎన్ఎల్ఆర్ 34 449), ప్రద్యుమ్న (జేజీఎల్ 17004), సుగంధ సాంబ (ఆర్ఎన్ఆర్ 2465), శోభిని (ఆర్ఎన్ఆర్ 2354), సోమనాథ్ (డబ్ల్యూజీఎల్ 34 7), ఆర్ఎన్ఆర్ 31479 (పీఆర్సీ), కేపీఎస్ 6251 (పీఆర్సీ), జేజీఎల్ 33124 (పీఆర్సీ), హెచ్ఎంటీ సోనా, మారుటేరు సాంబ (ఎంటీయూ 1224), మారుటేరు మసూరి (ఎంటీయూ 1262), ఎంటీయూ 1271. -
రైతులను మోసగిస్తే లైసెన్సులు రద్దు..
సాక్షి, హైదరాబాద్: రైతులను మోసం చేసే మిల్లర్లు, వ్యాపారుల లైసెన్సులు రద్దు చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మార్కెట్లో రైతుల నుంచి ధాన్యం తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారి నైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. రైతు లను గోల్మాల్ చేసే మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్లిస్ట్లో పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర, తాగు నీటి సరఫరాపై.. శుక్రవారం సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, సమాచార, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటితో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు. ధాన్యాన్ని ఆరబెట్టి మంచి ధర పొందాలి కొన్ని ప్రాంతాల్లో తేమ ఎక్కువగా ఉందని చెప్పి వ్యాపారులు, మిల్లర్లు ధరలో కోత పెడుతున్న ట్టుగా తమ దృష్టికి వచ్చిందని, అందువల్ల రైతు లు ధాన్యాన్ని మార్కెట్లకు తెచ్చే ముందు ఆర బెట్టాలని సీఎం విజ్ఞప్తి చేశారు. నేరుగా కళ్లాల నుంచి ధాన్యాన్ని మార్కెట్లకు తరలిస్తే తేమ శాతం ఎక్కువగా ఉంటుందని, ఒకట్రెండు రోజులు ధాన్యాన్ని ఆరబెట్టి మంచి ధరపొందా లన్నారు. ధాన్యం ఆరబెట్టేందుకు యార్డుల్లోనే ఏర్పాట్లు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ధాన్యం దొంగతనం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోళ్లను అధికారులు పర్యవేక్షించాలి ‘అన్ని జిల్లాల కలెక్టర్లు తమ పరిధిలోని మార్కె ట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలి. కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలి. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రి యను రాష్ట్ర స్థాయిలో సీఎస్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఏరోజు కారోజు పర్యవేక్షించాలి. తాగునీటి సరఫరాపై ఉమ్మడి జిల్లాల వారీగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారులు, ధాన్యం కొనుగోళ్లను కూడా పర్యవేక్షించాలి. అన్ని మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలి. ఎన్నికల సమయం కావటంతో కొన్నిచోట్ల రాజకీయ లబ్ధి కోసం, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు తప్పుడు ఫిర్యాదులు, ఉద్దేశ పూర్వక కథనాలు వస్తున్నాయి. అటువంటి వాటిపై వెంటనే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలి..’ అని సీఎం సూచించారు. వచ్చే రెండు నెలలు కీలకం ‘రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో తాగు నీటికి ఇబ్బంది తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. గత ఏడాదితో పోలిస్తే ఎక్కువ నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ ప్రజల అవసరాలకు సరిపోవటం లేదు. భూగర్భ జల మట్టం పడి పోవటంతో ప్రజలు కేవలం నల్లా నీటిపైనే ఆధారపడటంతో ఈ పరిస్థితి తలెత్తింది. అయినప్పటికీ తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే రెండు నెలలు కీలకం. ఫిర్యాదు వచ్చిన వెంటనే తాగునీటి సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి. ఏ రోజుకారోజు సీఎస్ సారథ్యంలో మిషన్ భగీరథ, మున్సిపల్, ఇరిగేషన్, విద్యుత్తు శాఖ అధికారులు తాగునీటి సరఫరాపై సమీక్ష జరపాలి. జిల్లాలకు ఇన్చార్జిలుగా నియమితులైన సీనియర్ ఐఏఎస్లు తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలకు వెళ్లి పరిశీలించాలి. జీహెచ్ఎంసీ పరిధిలో తాగునీటి సరఫరాకు ఢోకా లేకుండా, డిమాండ్ మరింత పెరిగినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి. అవసరమైతే నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నీటిని హైదరాబాద్కు తెచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. సింగూరు నుంచి నీటి సరఫరా చేసేందుకు సన్నద్ధంగా ఉండాలి. కృష్ణా బేసిన్లో నీటి లభ్యత లేనందున ఎగువన నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి తాగునీటిని తెచ్చుకునేలా కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి..’ అని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేవారిపై చర్యలు హైదరాబాద్లో ఇటీవల సిబ్బంది అత్యుత్సాహంతో ఒకచోట తాగునీటి సరఫరా నిలిచిపోయిన అంశం దృష్టికి రాగా సీఎం వెంటనే స్పందించారు. విచారణ జరిపించి ఉద్దేశ పూర్వకంగా తాగునీటి సరఫరాకు ఆటంకం కల్పించిన వారిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. అటువంటి ఉద్యోగులపై ఉదాసీనంగా వ్యవహరిస్తే అధికారులపై కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
ధాన్యం లేదంటే డబ్బులు ఇవ్వాల్సిందే!
ఇటీవల కరీంనగర్ జిల్లాలోని ఓ మిల్లు నుంచి గత సంవత్సరానికి సంబంధించి యాసంగి సీజన్లో ప్రభుత్వం ఇచ్చిన 10 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలను రికవరీ చేసుకునేందుకు ధాన్యం కాంట్రాక్టు పొందిన ఓ సంస్థ ప్రతినిధులు వెళ్లారు. తీరా అక్కడికి వెళితే మిల్లులో ధాన్యం నిల్వలు లేవు. మిల్లులో ఉన్న ధాన్యం చెడిపోతుందని అమ్మివేసినట్లు మిల్లర్ ఒప్పుకున్నాడు. దీంతో క్వింటాల్కు రూ. 2,259 లెక్కన 10 మెట్రిక్ టన్నులకు రూ. 2,25,900 చెల్లించాలని లెక్క చెప్పి వెళ్లారు. సాక్షి, హైదరాబాద్: కొన్నేళ్లుగా సాఫీగా సాగిన ధాన్యం కొనుగోళ్లు, సీఎంఆర్ ప్రక్రియ ఇప్పుడు మిల్లర్లకు దడపుట్టిస్తోంది. గత సంవత్సరం యాసంగి సీజన్లో వచ్చిన ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేయలేమని రాష్ట్రంలోని మిల్లర్లంతా చేతులెత్తేయడంతో ఆగిపోయిన సీఎంఆర్ ప్రక్రియ ఇప్పుడు వారి మెడకే చుట్టుకుంది. కస్టమ్ మిల్లింగ్ చేయకుండా మిల్లుల్లోనే నిల్వ చేసిన ధాన్యం నుంచి 35 లక్షల మెట్రిక్ టన్నులను ప్రభుత్వం వేలం వేసి, బిడ్డింగ్లో పాల్గొన్న సంస్థలకు ధాన్యం కొనుగోలు కాంట్రాక్టులను అప్పగించింది. గన్నీ బ్యాగులతో కలిపి క్వింటాలుకు సగటున రూ. 2,007 లెక్కన ధాన్యం కాంట్రాక్టు పొందిన సంస్థలు తమకు కేటాయించిన జిల్లాల నుంచి ధాన్యం సేకరణకు శ్రీకారం చుట్టాయి. తీరా ప్రభుత్వం నుంచి రిలీజింగ్ ఆర్డర్ తీసుకొని మిల్లులకు వెళితే అక్కడ ధాన్యం కనిపించడం లేదు. దీంతో మిల్లర్ల నుంచి క్వింటాలు ధాన్యానికి బదులుగా రూ. 2,259 లెక్కన డబ్బులు వసూలు చేయాలని కాంట్రాక్టు సంస్థలు నిర్ణయించాయి. ఈ మేరకు కార్యాచరణ ప్రారంభించడంతో మిల్లర్లు బెంబే లెత్తుతున్నారు. వేలంలో 6 సంస్థలకు ధాన్యం అప్పగింత 2022–23 సంవత్సరం యాసంగిలో రాష్ట్రంలో 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో 20 ఎల్ఎంటీ ధాన్యాన్ని ఎఫ్సీఐ ఆదేశాల మేరకు మిల్లర్లు సీఎంఆర్ కింద బాయిల్డ్ బియ్యంగా మిల్లింగ్ చేసి అప్పగించారు. మిగతా ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ముడి బియ్యం (రా రైస్)గా సీఎంఆర్ అప్పగించాల్సి ఉండగా, మిల్లింగ్ చేయలేదు. దీంతో నిల్వ ఉన్న ధాన్యాన్ని గత ప్రభుత్వం వేలం వేయాలని ప్రయత్నించినా వీలుకాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 12 లాట్ల కింద వేలం వేశారు. రూ. 300 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలకే వేలంలో పాల్గొనే అవకాశం ఇవ్వడంతో కేవలం ఏడు సంస్థలే బిడ్డింగ్లో పాల్గొన్నాయి. అందులో ఓ సంస్థ తిరస్కరణకు గురికాగా మిగతా ఆరు సంస్థలు ఈ బిడ్లను దక్కించుకున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేంద్రీయ భండార్, నాకాఫ్ కూడా ఉన్నాయి. వేలంలో క్వింటాలు ధాన్యానికి సగటున రూ. 2,007 లెక్కన (గన్నీ బ్యాగులతో కలిపి) ప్రభుత్వానికి చెల్లించేలా బిడ్లు ఆమోదం పొందాయి. ఈ బిడ్డింగ్ ప్రక్రియకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆమోదం తెలపడంతో సదరు సంస్థలు ధాన్యాన్ని మిల్లర్ల నుంచి రికవరీ చేసే ప్రక్రియను ప్రారంభించాయి. ధాన్యం అమ్మేసుకున్న మిల్లర్లు.. గత యాసంగి సీజన్లో సీఎంఆర్ చేయ కుండా నిల్వ చేసినట్లు మిల్లర్లు చెప్పినప్పటికీ, ఏ మిల్లర్ దగ్గరా సరిపడా ధాన్యం నిల్వలు లేవు. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో సమావేశం సందర్భంగా మిల్లర్లే ఒప్పుకున్నారు. తడిసి న, నిల్వ ఉంచిన ధాన్యం పాడైపోతుందనే కార ణంగా చాలా వరకు విక్రయించినట్లు చెప్పారు. ఈ విషయాన్ని మంత్రి మీడియాకు కూడా చెప్పారు. అయి తే మిల్లర్ల నుంచి ధాన్యాన్ని రికవరీ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం వేలం ప్రక్రియ చేపట్టింది. ఈ మేరకు క్వింటాలుకు బిడ్డింగ్లో రూ.1,852 నుంచి 2,260 వరకు ధర పలికింది. సగటున క్వింటాలుకు రూ.1879 కాగా, రూ.125 గన్నీ బ్యాగుల కింద .. మొత్తంగా క్వింటాలుకు రూ. 2,007 చొప్పున లెక్క చూపారు. ఆయా సంస్థలు ఎంతకు ధాన్యం కొనుగోలు టెండర్లు దక్కించుకున్నా య నే విషయాన్ని పక్కనబెట్టి క్వింటాలు ధాన్యం ఇవ్వకపోతే, దాని బదులు రూ. 2,259 చెల్లించాలని అల్టిమేటం ఇస్తున్నట్లు పలువురు మిల్లర్లు తెలిపారు. సన్న ధాన్యం టెండరును క్వింటాలుకు రూ. 2,260కి దక్కించుకున్న హైదరాబాద్కు చెందిన ఓ సంస్థ నిజామాబాద్, నల్లగొండ జిల్లాల నుంచి ధాన్యాన్ని రికవరీ చేసుకోవాల్సి ఉంది. మిల్లర్లు సన్న ధాన్యం ఇవ్వని పక్షంలో క్వింటాలుకు రూ.2,500కు పైగా వసూలు చేసే ఆలోచనలో ఆ సంస్థ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఒక్కో జిల్లాలో 50 నుంచి 100 మెట్రిక్ టన్నుల ధాన్యం రికవరీకి కాంట్రాక్టు సంస్థలు ప్రభుత్వం నుంచి రిలీజింగ్ ఆర్డర్ పొందినట్లు చెపుతున్నారు. -
నేటితో ముగియనున్న సీఎంఆర్ గడువు
సాక్షి, హైదరాబాద్: గతేడాది ఖరీఫ్నకు సంబంధించిన సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) డెలివరీ బుధవారంతో ముగియనుంది. ఆ సీజన్లో మిల్లర్లు ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన బియ్యం బకాయిలు ఇంకా పూర్తి కాలేదు. అయితే ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించిన నేపథ్యంలో కేంద్రాన్ని గడువు కోరవద్దని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మిల్లర్లు, అధికారులపై ఒత్తిడి తెచ్చి 50 రోజుల్లో 20 ఎల్ఎంటీ మేర బియ్యం సేకరించింది. ఇంకా 2022–23 సీజన్కు సంబంధించి మరో 4.80 ఎల్ఎంటీ ఎఫ్సీఐకి రావాల్సి ఉన్నా, రైస్మిల్లర్లు డెలివరీ చేయడంలో విఫలమయ్యారు. కాగా సీఎంఆర్ డెలివరీ గాడిన పడుతున్న నేపథ్యంలో మరో నెలరోజుల గడువు పొడిగించాలని మిల్లర్లు కోరుతున్నారు. నెల రోజుల్లో పూర్తిస్థాయిలో బియ్యం ఎఫ్సీఐకి ఇస్తామని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజులుగా అక్కడే ఉన్న సీఎంఆర్ గడువు పొడిగింపునకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. కనీసం నెల రోజుల టైమ్ ఇస్తే.. గతేడాది ఖరీఫ్ సీఎంఆర్ బకాయిలు పూర్తిచేసే అవకాశం ఉంటుంది. లేకపోతే 4.80 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్ల వద్దనే ఉండిపోతుంది. దీని విలువ కనీసం రూ.1,872 కోట్లు ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత రికవరీ చేయటం కూడా కష్టంగా ఉంటుంది. ఎఫ్సీఐకి బదులుగా సివిల్ సప్లయీస్ కోటా కింద తీసుకోవాల్సి వస్తుంది. కానీ సివిల్ సప్లయ్ తీసుకునేది లేదని చెప్పిన నేపథ్యంలో నెల రోజుల గడువు పెంచాలని భావిస్తున్నట్టు తెలిసింది. అందుకే ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. గత ఏడాది రబీ ధాన్యం వేలానికి... కాగా నిరుడు యాసంగి సీజన్కు సంబంధించిన బియ్యం బకాయిలు 32.74 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయి. అంటే 50 ఎల్ఎంటీ ధాన్యం గోడౌన్లలో ఉంది. ఇందులో 35 ఎల్ఎంటీ ధాన్యాన్ని వేలం వేయాలని ప్రభు త్వం నియమించిన కమిటీ నిర్ణయించింది టెండర్లు కూడా ఆహ్వానించింది. కాగా ధాన్యం టెండర్లకు సంబంధించిన ప్రీ బిడ్డింగ్ సమావేశం బుధవారం పౌరసరఫరాలభవన్లో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కమిషనర్ డీఎస్.చౌహాన్ హాజరయ్యే అవకాశాలున్నాయి. -
సన్నాలు పైపైకి
సాక్షి, హైదరాబాద్: సన్న బియ్యం సామాన్యులు కొనలేని పరిస్థితి దాపురించింది. దిగుబడి తగ్గడం ఒక కారణమైతే... మిల్లర్లే ఎక్కువగా కొనుగోలు చేయడం మరో కారణం. రిటైల్ మార్కెట్లో నాణ్యతను బట్టి పాత సన్న బియ్యం ధర క్వింటాల్కు రూ.6 వేల నుంచి 8వేల వరకు ఉండడం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా వచ్చిన వానాకాలం బియ్యాన్ని కూడా రూ.6వేలకు క్వింటాల్ చొప్పున విక్రయిస్తున్నారు. హైపర్ మార్కెట్లు, సూపర్ బజార్లలో సైతం బియ్యం ధరలు సామాన్య, మధ్య తరగతి వర్గాలను బెంబేలెత్తిస్తున్నాయి. జై శ్రీరామ్ క్వింటాల్కు రూ.7,800 వరకు సన్నబియ్యంలో అగ్రగామిగా చెప్పుకునే జైశ్రీరాం రకం పాత బియ్యం ధర నాలుగు రోజుల క్రితం క్వింటాల్కు రూ. 7,800 వరకు రిటైల్ మార్కెట్లో పలికింది. తర్వాత రూ. 200 వరకు తగ్గినా, మళ్లీ ధర పెరిగింది. మంగళవారం రూ. 7,500 నుంచి రూ. 7,800 వరకు రిటైల్ మార్కెట్లో అమ్మినట్టు సమాచారం. హెచ్ఎంటీ రకం బియ్యం(పాతవి) రూ.7,200 వరకు, కొత్తవి రూ.6,500 నుంచి 7,000 వరకు రిటైల్ మార్కెట్లో అమ్ముతున్నారు. బీపీటీ, ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనాలను రూ. 5,500 నుంచి 6,500 వరకు అమ్ముతున్నారు. దొడ్డు బియ్యం అంతంతే దొడ్డు బియ్యం ధర క్వింటాల్ రూ.4,500 నుంచి ఉన్నా, వాటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో పెరగని సన్నాల దిగుబడి రాష్ట్రంలో యాసంగి సీజన్లో 80 శాతానికి పైగా దొడ్డు రకాలైన 1010, 1001, 1061, ఐఆర్ 64, తెల్లహంస వంటి వరి రకాలనే ఎక్కువగా పండిస్తారు. ఉత్తర తెలంగాణలో యాసంగిలో సన్న రకాలు పండే పరిస్థితి ఏమాత్రం లేదు. దక్షిణ తెలంగాణలోని మహబూబ్నగర్, ఖమ్మంలలో అదే పరిస్థితి. మిర్యాలగూడ, సూర్యాపేట వంటి ప్రాంతాల్లో కొన్నిచోట్ల సన్నాలు పండించినా, సొంత అవసరాలకే వినియోగిస్తారు. ఇక వానాకాలం సీజన్లో నిజామాబాద్ మినహా ఉత్తర తెలంగాణలో రైతులు తమ పొలాల్లో సంవత్సరకాలం తిండి అవసరాలు, స్థానిక అవసరాలకు మాత్రమే సన్న రకాలను పండించి, దొడ్డు వరి వైపే మొగ్గు చూపుతారు. నిజామాబాద్, నల్లగొండ ఉమ్మడి జిల్లాలతో పాటు మెదక్, మహబూబ్నగర్ జిల్లాల్లో మాత్రమే ఖరీఫ్ సీజన్లో సన్నాలు ఎక్కువగా పండిస్తారు. సన్నాలను బియ్యంగా మార్చి విక్రయించే రైతులు కొందరైతే , సన్న ధాన్యాన్ని మిల్లర్లకు విక్రయించే వారు ఎక్కువ మంది. అయితే ఈసారి వానాకాలం సీజన్లో నాగార్జునసాగర్ కింద పంట తక్కువగా రావడంతో సన్నాలకు డిమాండ్ పెరిగింది. దీనికి తోడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద కూడా వాతావరణ ప్రతికూల పరిస్థితులతో సన్న ధాన్యాన్ని తెగులు సోకినట్టు రైతులు చెబుతున్నారు. దీంతో ఇక్కడ కూడా కొంత పంట దెబ్బతింది. కేవలం బోర్లు, కరెంటు మోటార్ల కింద పండిన పంట మాత్రమే ఎక్కువ దిగుబడి వచ్చింది. మార్కెట్కు వచ్చిన ధాన్యం 43 ఎల్ఎంటీ మాత్రమే రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్లో 99 మెట్రక్ టన్నుల ధాన్యం మార్కెట్కు వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసినా, ఇప్పటివరకు వచ్చిన ధాన్యం 43 ఎల్ఎంటీ మాత్రమే మరో 2 ఎల్ఎంటీ ధాన్యం కూడా కొనుగోలు కేంద్రాలకు వచ్చే పరిస్థితి లేదు. గత యాసంగిలో 67 ఎల్ఎంటీ మేర దొడ్డు ధాన్యం వచ్చినా, అదంతా మిల్లుల్లోనే నిల్వ ఉంది. -
ఆ వడ్లకు పైసలిచ్చేస్తాం!
సాక్షి, హైదరాబాద్: రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసి మిల్లులకు పంపిన 83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఏమైందో లెక్క తెలియడం లేదని సాక్షాత్తూ పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మిల్లర్లు బెంబేలెత్తుతున్నారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే మంత్రి ఉత్తమ్ పౌరసరఫరాల సంస్థ పనితీరుపై సమీక్ష నిర్వహించి రూ.56 వేల కోట్ల అప్పులు, రూ.11 వేల కోట్ల నష్టాల్లో ఉన్నట్లు తేల్చారు. ధాన్యం కొనుగోళ్లు, మిల్లింగ్లలో చోటు చేసుకున్న అవకతవకలే అందుకు కారణమని, మిల్లర్లు ఇప్పటికే ధాన్యాన్ని విక్రయించడంతో మిల్లుల్లో ధాన్యం నిల్వలు కూడా లేవని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మిల్లర్లలో ఆందోళన మొదలైంది. సర్కార్ ధాన్యం విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోకముందే రాజీ చేసుకోవాలని భావిస్తున్నారు. తమ వద్ద ఉన్న ధాన్యం నిల్వ విలువను ఖర్చులతో కలిపి ప్రభుత్వానికి చెల్లించాలని ప్రతిపాదనలు పంపించినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయమేదీ తీసుకోలేదు. మిల్లర్ల వద్ద 83 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం గత సంవత్సరం రబీ(యాసంగి)లో సేకరించిన 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ముడిబియ్యంగా మిల్లింగ్ చేసేందుకు పనికిరాదని, బాయిల్డ్ రైస్గా మాత్రమే మిల్లింగ్ చేయడానికి వీలవుతుందని మిల్లర్లు తేల్చి చెప్పారు. ఈ మేరకు 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లుల్లోనే నిల్వ చేసినట్లు లెక్కలు చూపించారు. ఇదే కాకుండా గత సంవత్సరం వానకాలానికి సంబంధించిన మరో 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా మిల్లింగ్ చేసి, ఎఫ్సీఐకి సీఎంఆర్ అప్పగించడంలో మిల్లర్లు విఫలమయ్యారు. ఈ మొత్తం 83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విలువ సుమారు రూ. 18 వేల కోట్లుగా ప్రభుత్వం నిర్ధారించింది. సంస్థకున్న రూ.56 వేల కోట్ల అప్పుల్లో ఈ రూ.18 వేల కోట్లు చెల్లిస్తే తప్ప మళ్లీ అప్పు పుట్టని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మిల్లర్ల వద్ద ఉన్నట్లు చెపుతున్న 83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంపై కీలక నిర్ణయం తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనిపై పౌరసరఫరాల సంస్థ సీఎండీ అనిల్ కుమార్, ఇతర అధికారులు ప్రణాళిక రూపొందించారని తెలిసింది. మిల్లర్లు స్వయంగా ధాన్యం విలువ చెల్లించేందుకు ముందుకు వస్తున్న నేపథ్యంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన కనీస మద్ధతు ధరకు తోడు, రవాణా, నిర్వహణ ఖర్చులన్నీ మిల్లర్ల నుంచి వసూలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. వేలం ప్రయత్నాలు విఫలం.. మిల్లర్లు సీఎంఆర్కు తిరస్కరించిన యాసంగి ధాన్యాన్ని విక్రయించాలని గత ప్రభుత్వం ఆగస్టు నెలలో నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలుత 25 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యాన్ని అమ్మేందుకు బిడ్డర్ల నుంచి టెండర్లను ఆహ్వానించారు. ఈ టెండర్లకు 10 సంస్థలే అర్హత సాధించడంతో పాటు ధాన్యం క్వింటాలుకు సగటు ధరను రూ.1865 గా కోట్ చేయడంతో ఈ ప్రక్రియను ప్రభుత్వం రద్దు చేసింది. దాంతో ప్రభుత్వం అక్టోబర్లో రెండో దఫా టెండర్లను ఆహ్వానించింది. నిబంధనలను సడలించి సాధారణ మిల్లర్లు కూడా బిడ్డింగ్లో పాల్గొనేలా టెండర్లను ఆహ్వానించింది. అయితే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఆ టెండర్లకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం కొలువు దీరినప్పటికీ, పాత టెండర్లను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మిల్లర్ల వద్ద 83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నట్లు లెక్కల్లో కనిపిస్తున్నప్పటికీ, అందులో సగానికి పైగా విక్రయించినట్లు పౌరసరఫరాల సంస్థ ఇప్పటికే గుర్తించింది. కర్ణాటక, తమిళనాడుకు భారీ ఎత్తున ధాన్యాన్ని, బియ్యాన్ని విక్రయించినట్లు ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. ఈ పరిస్థితుల్లో మిల్లర్ల నుంచి ధాన్యం విలువకు సమానమైన మొత్తాన్ని ( క్వింటాలుకు రూ. 2,350) చొప్పున ముక్కు పిండి వసూలు చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో మిల్లుల్లో ఉన్న ధాన్యంపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. -
బియ్యం అమ్మకం..రూ.4 వేల కోట్ల స్కామ్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల నిధుల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం బియ్యం అమ్మకానికి పెట్టి.. కస్టమ్మిల్లర్ల నోట్లో మట్టికొట్టే పనిచేస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలకు కిలో నాలుగైదు రూపాయల తక్కువకు అమ్మాలని సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం.. ఒక్క ఆక్షన్కి రూ.1000 కోట్ల స్కామ్.. కోటిటన్నులు అమ్ముకునే ప్రణాళిక బీఆర్ఎస్ సర్కారుదని ఆరోపించారు. ఈ విధంగా వచ్చే రూ.4 వేల కోట్ల అవినీతి సొమ్ము 100 నియోజకవర్గాల్లో..ఒక్కో సెగ్మెంట్లో రూ.40 కోట్లు ఖర్చు చేసి వచ్చే ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపణలు సంధించారు. శనివారం అర్వింద్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సర్కార్ బియ్యం అమ్ముకుంటామని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని, దీనికి వెనుక అసలు ఉద్దేశం అదేనని ఆరోపించారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని వేలం వేసేందుకు వెయ్యికోట్ల టర్నోవర్, రూ.100 కోట్ల ప్రాఫిట్ ఉండాలనే నిబంధనలు పెట్టారని మండిపడ్డారు. మొదటిదశలో రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వేలం వేయాలని నిర్ణయించారని, టెండర్లో పాల్గొనేందుకు పౌరసరఫరాలశాఖ నిర్ణయించిన విధివిధానాలతో రైస్ మిల్లర్లకు అన్యాయం జరుగుతుందన్నారు. ఎంఎస్పీకి బియ్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్రంలో మిల్లర్లు సిద్ధంగా ఉన్నా, టెండర్ల ద్వారా తమ మిల్లు సామర్థ్యం మేరకు ధాన్యం దక్కించుకుందామనుకున్న మధ్యతరగతి మిల్లర్లకు అసలు అందులో పాల్గొనే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలతో రైస్మిల్లర్లు బియ్యం ఆక్షన్లో కొనలేరన్నారు. రైస్మిల్లర్ల వ్యాపారం బంద్ అయితే రైతులు రోడ్డుమీదకు వచ్చే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్ నుంచి ఎంపీగా కల్వకుంట్ల కవిత పోటీచేస్తే మూడో స్థానానికి పరిమితం అవుతుందని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. తాను ఎంపీగా పోటీలో ఉండడం ఖాయమని ప్రకటించారు. -
ఎఫ్సీఐ వల్లే సీఎంఆర్ ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: ఎఫ్సీఐ వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రంలో మిల్లింగ్ ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటోందని రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. సీఎంఆర్ విషయంలో మిల్లర్లను వేధించడ మే లక్ష్యంగా ఎఫ్సీఐ అధికారులు నిబంధన లకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మిల్లర్ల సంఘం అధ్యక్షుడు గంప నాగేందర్ గుప్తా ఆరోపించారు. మంగళవారం నగరంలోని టూరిస్ట్ ప్లాజాలో మిల్లర్ల సంఘం సమావే శం జరిగింది. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. మిల్లర్లు మిల్లింగ్ చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోడౌన్ల నుంచి తరలించాల్సిన ఎఫ్సీఐ నాలుగైదు నెలలైనా రైల్వే వ్యాగన్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు పంపడం లేదని, తద్వారా గోడౌన్లు నిండి పోయి మిల్లింగ్ జరగని పరిస్థితి నెలకొందని వివరించారు. ఒక్కో ఎఫ్సీఐ గోడౌన్కు వందలాది మిల్లుల నుంచి వచ్చిన బియ్యాన్ని కేటాయిస్తుండడంతో వారం రోజులైనా బియ్యం లారీలు అన్లోడింగ్ కావడం లేదన్నారు. దీంతో సమయానికి సీఎంఆర్ ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇలాగైతే మిల్లింగ్ ఎలా? ప్రస్తుతం రాష్ట్రంలోని మిల్లర్ల వద్ద కోటి మె ట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నాయని, ఎఫ్సీఐ ఇలాగే వ్యవహరిస్తే ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేయడం అసాధ్యమని గుప్త స్పష్టం చేశారు. ఎఫ్సీఐ కారణంగా 70 లక్షల మెట్రి క్ టన్నుల ధాన్యం మిల్లింగ్ చేయడానికి 24 నెలల కాలం పడుతుందన్నారు. మిల్లర్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.700 కోట్లు, ఎఫ్సీఐ నుంచి రవాణా చార్జీలు రూ.700 కోట్లు రావలసి ఉందని, వాటిని వెంటనే చె ల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం పంపించే బలవర్ధక బియ్యం కెర్నల్స్ (ఎఫ్ ఆర్కే)లో నాణ్యత లేదని మిల్లులను ఎఫ్సీఐ డిఫాల్టర్లుగా ప్రకటించడం శోచనీయమన్నారు. సమావేశంలో సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రభాకర్ రావు పాల్గొన్నారు. -
ఎఫ్సీఐ ఇలా చేస్తే కష్టం
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు పంపిణీ చేసే ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్ధక బియ్యం) విషయంలో ఎఫ్సీఐ వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్రంలోని మిల్లర్లు మండిపడుతున్నారు. ఇటీవల 290 మిల్లుల నుంచి ఎఫ్సీఐకి పంపిన సుమారు 40 వేల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ బియ్యాన్ని (సీఎంఆర్) నాణ్యత సరిగా లేదంటూ ఎఫ్సీఐ తిరస్కరించడంంతో పాటు మిల్లుల నుంచి 2022–23కు సంబంధించిన సీఎంఆర్ను తీసుకునేందుకు కూడా నిరాకరించింది. దీంతో మిల్లింగ్ అయిన బియ్యం మిల్లుల్లోనే ఉండిపోతోంది. గత సంవత్సరం వానకాలం, యాసంగి ధాన్యం ఇప్పటికే కోటి టన్నులకు పైగా మిల్లుల్లో నిల్వ ఉండగా, మర పట్టించిన మేరకు బియ్యాన్ని కూడా ఎఫ్సీఐ తీసుకోవడం లేదని మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం మిల్లర్ల సంఘం నాయకులు సచివాలయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్కుమార్తో భేటీ అయ్యారు. ఎఫ్సీఐ ఘర్షణాత్మక వైఖరి: రాష్ట్రంలోని సుమారు 3 వేల మిల్లులు ధాన్యం, బియ్యంతో నిండిపోయి ఉన్నాయని, ధాన్యం నిల్వకు గోదాములు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మంత్రికి మిల్లర్లు తెలిపారు. ఈ పరిస్థితుల్లో మిల్లర్లు పంపించిన బియ్యాన్ని నిరాకరిస్తూ, దాదాపు 290 మిల్లుల్ని బ్లాక్ లిస్టులో పెట్టి ఎఫ్సీఐ ఘర్షణాత్మక వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ నాఫెడ్ సరఫరా చేసిన ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ (ఎఫ్ఆర్కే) నాణ్యత సరిగా లేదంటూ ఎఫ్సీఐ బియ్యాన్ని తీసుకోవడానికి నిరాకరించడంతో రైస్ మిల్లింగ్ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని చెప్పారు. ఎఫ్సీఐ ఇలాగే వ్యవహరిస్తే సీఎంఆర్ నుంచి పూర్తిగా తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఎఫ్సీఐ గోదాములు సమకూర్చకపోవడం వల్ల సకాలంలో సీఎంఆర్ చేయలేకపోతున్నట్లు తెలిపారు. కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లుల్లో.. గత వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించిన కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు రైస్ మిల్లుల వద్ద పేరుకుపోయాయని మిల్లర్లు మంత్రి దృష్టికి తెచ్చారు. కోటీ పదమూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లింగ్ చేయాల్సి ఉండగా, అందులో గత వానాకాలంలో తడిసిన ధాన్యం కూడా ఉందని తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ధాన్యం పాడయ్యే ప్రమాదం ఉందని, అప్పుడు సీఎంఆర్ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. వానాకాలం ధాన్యం తడిసిపోయిన నేపథ్యంలో ఈ సీజన్కు సంబంధించిన 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బాయిల్డ్ చేసేందుకు ఆదేశాలివ్వాలని కోరారు. లేని పక్షంలో తమ దగ్గర ఉన్న ధాన్యాన్ని వెనక్కితీసుకోవాలని అన్నారు. ఎఫ్సీఐ కఠిన వైఖరి నేపథ్యంలో డిఫాల్ట్ పెట్టబోమని హామీ ఇస్తే ప్రభుత్వ ధాన్యానికి కస్టోడియన్గా ఉంటామని స్పష్టం చేశారు. సీఎం దృష్టికి తీసుకెళ్తా: మంత్రి గంగుల మిల్లర్ల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి గంగుల హామీ ఇచ్చారు. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో మద్దతు ధరతో ధాన్యం కొను గోలుకు సీఎం ఆదేశాలిచ్చారని, కేంద్రం కూడా దేశంలో రైతులు పండించిన పంటను కొనుగోలు చేయాల్సిన బాధ్యత నుంచి తప్పుకోకూడదని సూచించారు. తక్షణ మే ఎఫ్సీఐ స్టోరేజీ సౌకర్యం కల్పిస్తే నెలకు పదిలక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కాగా అప్పటికప్పుడు ఎఫ్సీఐ ఉన్నతాధికారులతో చర్చించిన మంత్రి.. వీలైనంత త్వరగా స్టోరేజీని పెంచి బియ్యం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులతో పాటు మిల్లర్ల సంఘం అధ్యక్షుడు గంపా నాగేందర్, జనరల్ సెక్రటరీలు వి.మోహన్ రెడ్డి, ఎ.సుధాకర్ రావ్, ట్రెజరర్ చంద్రపాల్, 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, మిల్లర్లు పాల్గొన్నారు. -
ధాన్యం నమోదులో దగా!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్కు చెందిన శ్రీనివాస్ వేసంగిలో 104 బస్తాల ధాన్యం తూకం వేశాడు. మిల్లు వద్ద ట్రక్షీట్లో 104 బస్తాలుగానే నమోదు చేశారని భావించాడు. కింద 104 మైనస్ 4 అని రాసినట్టుగా గమనించలేదు. తీరా 100 బస్తాలకు మాత్రమే నగదు జమ కావడంతో అవాక్కయ్యాడు. ఇది ఒక్క కరీంనగర్లోనే కాదని, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో మిల్లర్లు రైతుల కష్టాన్ని యథేచ్ఛగా దోచేశారని తెలుస్తోంది. మొన్నటిదాకా తాలు పేరిట కొనుగోలు కేంద్రాల్లో, నాణ్యత లేదని రైస్మిల్లులో క్వింటాలుకు 9 నుంచి 11 కిలోల వరకు కోతపెట్టారు. వీటికి తోడు తాజాగా మరో కొత్త తరహా దోపిడీకి మిల్లర్లు తెరతీసినట్లు.. శ్రీనివాస్ తరహా ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. రూ.వందల కోట్ల విలువైన ధాన్యానికి ఎసరు గతేడాది 50.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. అయితే ఈసారి అకాల వర్షాలు ఇబ్బంది పెట్టినా దిగుబడి పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 7,037 కొనుగోలు కేంద్రాల్లో 11,39,597 మంది రైతుల నుంచి ఇప్పటివరకూ 66.49 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. ఈ మొత్తం ధాన్యం విలువ రూ.12,011 కోట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఇందులో దాదాపు రూ.1,500 కోట్లు మినహా మొత్తం ధాన్యం డబ్బులు ప్రభుత్వం చెప్పిన విధంగా రైతుల ఖాతాల్లో జమ చేసింది. వాస్తవానికి ప్రతి క్వింటాలుకు సగటున 10 కిలోల చొప్పున లెక్కలు వేసుకుంటే.. వేలాది క్వింటాళ్ల వరకు ధాన్యం కోతకు గురైంది. సాధారణ తరుగుతోనే రూ.కోట్లు వెనకేసుకున్న మిల్లర్లు ట్రక్ïÙట్ల మాయాజాలం కుంభకోణంతో రూ.వందల కోట్ల విలువైన ధాన్యాన్ని పోగు చేసుకున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. మొత్తం 21 బస్తాలకు కోత..! పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న»ొంకురుకి చెందిన రైతులు 10 మంది స్థానిక పీఏసీఎస్లో ధాన్యం అమ్ముకున్నారు. ధాన్యం కాంట వేస్తున్నప్పుడే తరుగు పేరుతో 2 కిలోలు కోత విధించారు. 10 మంది రైతులకు చెందిన 625 బస్తాల ధాన్యం లారీలో లోడ్ చేసి మిల్లుకు తరలించారు. అయితే రైతులకు తెలియకుండానే మిల్లుల్లో సైతం మరోసారి కటింగ్ పెట్టారు. తర్వాత ట్రక్ షీట్ మాయాజాలంతో కేవలం 604 బస్తాలకే లెక్కగట్టారు. ఆ మేరకే డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. దీంతో తమకు ధాన్యం డబ్బులు తక్కువపడ్డాయని రైతులు వాపోతున్నారు. ఎంతలేదన్నా వీరి వద్దనుంచి 9 క్వింటాళ్ల వరకు ధాన్యం దోపిడీకి గురైంది. 11 బస్తాలు కొట్టేశారు వేసంగి ధాన్యాన్ని మహమ్మదాబాద్లోని కొను గోలు కేంద్రం ద్వారా విక్రయించాం. నాతో పాటు మరో ఇద్దరు రైతుల బస్తాలు కలిపి మొ త్తం 383 బ్యాగులు తూకం వేశారు. తొలుత కొనుగోలు కేంద్రంలోనే తరుగు పెట్టారు. మళ్లీ మిల్లు వద్దకు వెళ్లాక మొత్తం మీద 372 బస్తాలుగా ట్రక్ïÙటులో నమోదు చేశారు. – ఎండీ ఆలీ, కంచన్పల్లి, మహబూబ్నగర్ తేమ, తాలు పేరుతో కట్ చేశారు.. యాసంగి సీజన్లో పండించిన ధాన్యాన్ని ఇప్పగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్కు తీసుకెళ్లా. కాంటా పూర్తయిన తర్వాత, 439 బస్తాలు ఉన్నట్లు లెక్కవేసి రైస్ మిల్లుకు పంపించారు. ధాన్యం బస్తాలు మిల్లుకు వెళ్లిన తర్వాత తేమ, తాలు పేరిట కొన్ని బస్తాలు కట్ చేశారు. మొత్తం మీద 428 బస్తాలనే బిల్లులో చూపించారు. –జి.వెంకటయ్య, ఇప్పగూడెం, స్టేషన్ఘన్పూర్ రైతుల ఇష్టం మేరకే తరుగు ఎడతెరిపిలేని వర్షాల వల్ల ధాన్యం డామేజ్ వచి్చంది. దానివల్ల రైతుల ఇష్టం మేరకే మిల్లర్లు తరుగు తీశారు. ధాన్యం ఆరబెట్టడం, మళ్ళీ వర్షం పడటం పక్షం రోజులు అదే పరిస్థితి. కానీ ఒకసారి తరుగు తీశాక మళ్ళీ తీయడం ఉండదు. – అన్నమనేని సుధాకర్రావు, రైస్ మిల్లర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి మొత్తం డబ్బులు పడలేదు మా ఊరిలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మిన. అప్పుడు తరుగుతో 142 బస్తాలు లెక్క గట్టారు. తీరా ఇప్పుడు 138 బస్తాలకే డబ్బులు పడ్డాయి. సెంటర్ వాళ్ళను అడిగితే.. మాకేమీ తెలియదు మిల్లు వాళ్ళను అడగమంటున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు. –ప్రశాంత్, కౌలు రైతు, చిన్న బొంకూర్, సుల్తానాబాద్ 4.4 క్వింటాళ్ల కోత.. రూ.9,800 నష్టం కొనుగోలు కేంద్రం నుంచి మొత్తం 303 బస్తాలు తూకం వేశారు. ఒకలారీలో 199 బస్తాలు పోగా.. ఆరు బ్యాగులు కట్ చేశారు. మరో దాంట్లో 104 బ్యాగులు పోయినయి.. ఐదు బ్యాగులు కట్ చేశారు. మొత్తంగా 4.4 క్వింటాళ్లు కోతతో మొత్తం రూ.9,800 నష్టం జరిగింది. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. – విష్ణువర్ధన్, కరీంనగర్ -
వాంగ్మూలపత్రం రాసిస్తేనే ధాన్యం కాంటా..!
నల్లబెల్లి: ఇన్నాళ్లూ గుట్టుచప్పుడు కాకుండా రైతుల ధాన్యానికి కోతలు పెట్టడం సాగుతుంటే.. ఇప్పుడు ఏకంగా సంతకాలు తీసుకుని మరీ కోతలు పెడుతున్న పరిస్థితి మొదలైంది. ‘‘నేను నా ధాన్యాన్ని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. జల్లెడ పట్టి ఇతరత్రా చెత్త, మట్టిని క్లీన్ చేయకుండా పీపీసీ సెంటర్కు అమ్ముతున్నాను. నిబంధనల ప్రకారం నా ధాన్యం లేనందున మిల్లర్ తెలిపిన తరుగుదలకు నా ఇష్టపూర్తిగా అంగీకరిస్తున్నాను’’అని రైతుల నుంచి వాంగ్మూలపత్రంపై సంతకం చేయించుకుంటున్నారు. సంతకం చేయని వారి ధాన్యం కాంటా వేయట్లేదు. వరంగల్ జిల్లా నల్లబెల్లి, అర్శనపల్లి కొనుగోలు కేంద్రాల్లో శుక్రవారం ఈ వ్యవహారం వెలుగు చూసింది. నల్లబెల్లి మండలంలో పీఏసీఎస్, ఐకేపీల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. 17శాతం తేమ ఉన్న ధాన్యాన్ని ఒక్కోబస్తా 40 కిలోలు చొప్పున తూకం వేయాల్సి ఉంది. వానలు పడితే ధాన్యం తడుస్తుందని రైతుల్లో ఉన్న భయాన్ని అదునుగా తీసుకుని నిర్వాహకులు ఒక్కో బస్తాను 43 కిలోల వరకు తూకం వేస్తున్నారు. దీనికి అదనంగా తాలు, తేమ పేరుతో మిల్లర్లు అభ్యంతరం తెలిపితే.. మరింత కోత ఉంటుందంటూ రైతుల నుంచి బలవంతంగా వాంగ్మూలపత్రం తీసుకుంటున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ధాన్యాన్ని కాంటా వేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. దీనిపై కొందరు రైతులు నిర్వాహకులను నిలదీశారు. తాను వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరిస్తే కాంటా పెట్టలేదని నల్లబెల్లికి చెందిన రైతు ఉడుత వీరన్న పేర్కొన్నాడు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి ఈ దోపిడీని అరికట్టాలని విజ్ఞప్తి చేశాడు. -
గింజ కోత పెట్టినా ఉపేక్షించం
సాక్షి, హైదరాబాద్: రైతుల నుంచి సేకరించే ధాన్యంలో ఒక్క గింజ కోత పెట్టినా ఉపేక్షించేది లేదని, మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే అన్లోడింగ్ చేపట్టాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రైతులకు ఇబ్బంది కలగకుండా మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాల్సిందేనన్నారు. యాసంగి ధాన్యం సేకరణ, సీఎంఆర్ బియ్యం, నూక శాతం తదితర అంశాలపై సచివాలయంలో ఆయన మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కమలాకర్ మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పనిచేసే ప్రభుత్వం తమదని, విపరీత పరిస్థితుల్లోనూ దేశంలో ఎక్కడా లేనివిధంగా కనీస మద్దతు ధరతో ధాన్యాన్ని సేకరించడమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. యాసంగి ధాన్యంలో నూక శాతంపై నిపుణుల కమిటీ గతంలో ఇచ్చిన మధ్యంతర నివేదికను ప్రస్తుత పరిస్థితులకు ఎలా అన్వయించాలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వంతోపాటు మిల్లర్లు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పిన మంత్రి... నిర్ణీత గడువులోగా సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి మిల్లర్లు అందజేయాలని సూచించారు. నూక శాతాన్ని త్వరగా తేల్చాలి... తమ సమస్యలను మిల్లర్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నూక శాతం విషయాన్ని ప్రభుత్వం త్వరగా తేల్చాలని విజ్ఞప్తి చేశారు. తమను రైతులకు శత్రువులుగా ప్రచారం చేయడం బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల కమిషనర్ అనిల్కుమార్, జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గంపా నాగేందర్, ప్రధాన కార్యదర్శి సుధాకర్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ బి. ప్రభాకర్రావు, కోశాధికారి చంద్రపాల్తోపాటు అన్ని జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
గుండె తరుక్కుపోతోంది
జగిత్యాలలోని ఓ కొనుగోలు కేంద్రంలో మల్లయ్య అనే రైతుకు సంబంధించిన ధాన్యం కాంటా పెట్టారు. మరునాడు అందులో తాలు, గడ్డి ఉన్నాయని, తాము చెప్పినంత తరుగుకు ఒప్పుకుంటేనే ధాన్యం దించుకుంటామని మిల్లు యజమాని నిర్వాహకులకు ఫోన్ చేశాడు. ఇదే విషయం నిర్వాహకులు మల్లయ్యకు ఫోన్ చేసి చెప్పడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అంగీకరించాడు. కాంటాలు పెడతలేరు మాది ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామం. పది రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చా. నాలుగు రోజులు అవుతోంది బస్తాలు నింపి. ఇప్పటివరకు కాంటాలు పెడతలేరు. కొనుగోళ్లు అయితలెవ్వు. మబ్బులు పడుతుండడంతో తడుస్తయేమోనని భయంగా ఉంది. – బొమ్మగాని ఉప్పలయ్య, వరంగల్ జిల్లా సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోలేక కష్టాలు పడుతున్నారు. మరోవైపు తరుగు పేరిట మిల్లర్లు వారిని వేధిస్తున్నారు. ఏటా కోట్లాది రూపాయల రైతుల కష్టాన్ని తరుగు పేరిట దోచుకుంటున్నా.. ఈ యాసంగిలో ఇది శ్రుతి మించింది. మిల్లర్లు ఏకంగా రైతుకే ఫోన్లు చేసి ధాన్యం వెనక్కి తీసుకెళ్లాలని చెబుతున్నారు. ఈ బెదిరింపులతో ఆందోళనకు గురవుతున్న రైతులు వారు చెప్పినట్లు తరుగుకు తలూపుతున్నారు. గతనెల 22న కొనుగోళ్లు ప్రారంభమైనపుడే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు మొత్తం మిలాఖత్ అయి క్వింటాల్కు ఏకంగా తొమ్మిది నుంచి పది కిలోల వరకు తరుగుతో దోపిడీకి తెరతీశారు. వాస్తవానికి కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్కు నాలుగు కిలోల చొప్పున తరుగు తీశాక.. ఆ ధాన్యాన్ని మిల్లులో ఆన్లైన్లో నమోదు చేయాలి. ఇక్కడే మిల్లు యజమానులు చక్రం తిప్పుతున్నారు. లారీలో వచ్చిన ధాన్యాన్ని మిల్లుల్లో దించడం లేదు. ధాన్యంలో తాలు, గడ్డి, మట్టి ఉన్నాయని, తమకు అవసరం లేదంటూ వేధిస్తున్నారు. ధాన్యం తీసుకెళ్లాలంటూ రైతులకు ఫోన్లు చేసి చెబుతున్నారు. దీంతో రైతులు మిల్లులకు పరుగులు పెడుతున్నారు. అలా వచ్చిన వారిని మరింత వేధిస్తూ మరింత తరుగు తీసైనా సరే తమ ధాన్యం కొనాలంటూ బతిమాలేలా మిల్లర్లు చేస్తున్నారు. మరోవైపు గన్నీ బ్యాగులు, లారీలు, టార్పాలిన్ల కొరత, ట్రాన్స్పోర్టు ఇబ్బందులు కూడా రైతులు తమ ధాన్యం అమ్ముకోవడానికి వీల్లేకుండా చేస్తున్నాయి. ఆసిఫాబాద్లో గింజ కూడా కొనలేదు.. ఈ యాసంగిలో రాష్ట్రవ్యాప్తంగా 80.46 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 32 జిల్లాల్లో 7,183 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకుంది. ఇప్పటివరకు ఇందులో 6,889 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరపగా.. అందులో 186 కేంద్రాలను ఇప్పటికే మూసివేశారు. మొత్తం 32 జిల్లాల్లో దాదాపు 5.23 లక్షల మంది రైతుల నుంచి ఇప్పటి వరకూ దాదాపు 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. దీని విలువ దాదాపు రూ.6,934 కోట్ల వరకు ఉంటుందని అధికారుల అంచనా. నల్లగొండలో అత్యధికంగా రూ.1,100 కోట్ల ధాన్యం, నిజామాబాద్లో రూ.1,030 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసిన అధికారులు.. ఆసిఫాబాద్లో శనివారం (20వ తేదీ) సాయంత్రం వరకు రూపాయి విలువైన ధాన్యం కూడా కొనుగోలు చేయకపోవడం గమనార్హం. ఓవైపు నైరుతి రుతుపవనాలు సమీపిస్తుండటం, మృగశిర కార్తెకు మరెన్నో రోజులు లేకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. కొనుగోలు ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తికాకపోతే.. ఇప్పటికే వడగండ్లు, అకాల వర్షాలకు దారుణంగా దెబ్బతిన్న తాము.. ఈ జాప్యంతో మరింత దారుణంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 రోజులుగా పడిగాపులు మాది మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మల్లేపల్లి. 13 ఎకరాల్లో వరి సాగు చేస్తే సుమారు 260 కింటాళ్ల దిగుబడి వచ్చింది. ధాన్యాన్ని ఈ నెల 7న స్థానిక కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చా. గత 15 రోజులుగా ఇక్కడికి ఒక్క లారీ కూడా రాలేదు. శనివారం కురిసిన వర్షానికి తడిసింది. మళ్ళీ కూలీలను పెట్టి ఆరబెట్టాల్సి వచ్చింది. – సూరినేని కమలాకర్, మంచిర్యాల రాత్రింబవళ్లు కుప్పల వద్దే వెంటవెంటనే కొనుగోళ్లు చేయకపోవడంతో రాత్రి, పగలు తేడా లేకుండా కుప్పల వద్దే పడిగాపులు కాస్తున్నాం. ధాన్యాన్ని కుప్పలుగా పోసి ఇప్పటికి 20 రోజులు అవుతోంది. తూకం వేసేందుకు హమాలీలు దొరకడం లేదు. లారీలు కూడా సకాలంలో రావడం లేదు. ఈసారి అసలే ధాన్యం దిగుబడి తగ్గింది. మరోవైపు రోజురోజుకు ధాన్యం బరువు దిగిపోతోంది. పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెబితే కానీ లారీ డ్రైవర్లు ఇటువైపు రావడం లేదు. – ప్రభాకర్, రైతు, తుక్కాపూర్, మెదక్ వెంటనే ధాన్యం కొనాలి 170 బస్తాలు కొనుగోలు కేంద్రంలోనే ఉన్నాయి. వర్షాలు, దొంగల భయానికి రోజూ కావలి కాస్తున్నాం. ఇంకా కాంటా పెట్టడం లేదు. వెంటనే కాంటా పెట్టి ధాన్యం కొనాలి. – చిన్నయ్య, నికల్పూరు, డొంకేశ్వర్, నిజామాబాద్ -
డిఫాల్ట్ మిల్లర్లకు.. ధాన్యం బంద్
సాక్షి, హైదరాబాద్: రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యాన్ని (కస్టమ్ మిల్లింగ్ రైస్ –సీఎంఆర్) ఎఫ్సీఐకి అప్పగించకుండా సతాయించే మిల్లులపై కొరడా ఝలిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు నెలల్లోగా ధాన్యం మిల్లింగ్ చేసి బియ్యాన్ని పౌరసరఫరాల సంస్థ ద్వారా ఎఫ్సీఐకి అప్పగించాల్సి ఉన్నా.. కొందరు మిల్లర్లు ఏడాదిన్నర దాకా జాప్యం చేస్తున్నారు. అప్పటికీ కొన్ని మిల్లుల నుంచి సీఎంఆర్ బియ్యం పెండింగ్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో సకాలంలో బియ్యం ఇవ్వకుండా పౌరసరఫరాల సంస్థకు నష్టం కలిగిస్తున్న మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల మూడో వారం నుంచి మొదలయ్యే యాసంగి సీజన్ నుంచే దీనిని అమలు చేయనుంది. సీఎంఆర్లో జాప్యం చేస్తున్న 300కుపైగా మిల్లులను డిఫాల్ట్ మిల్లులుగా అధికారులు ఇప్పటికే గుర్తించి, జాబితా సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈ మిల్లులకు ధాన్యం కేటాయింపులను పూర్తిగా నిలిపేసి.. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ అధికారులు మంత్రి గంగుల ద్వారా సీఎంకు ప్రతిపాదనలు అందజేసినట్టు సమాచారం. ఆరునెలల్లోగా ఇవ్వాల్సి ఉన్నా.. వచ్చేనెల నుంచి యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు చేర్చాక రైతుల ఖాతాలో డబ్బులు జమవుతాయి. మిల్లర్లు ఆ ధాన్యాన్ని తీసుకున్నాక ఆరు నెలల్లోగా మరాడించి బియ్యాన్ని పౌర సరఫరాల సంస్థ ద్వారా ఎఫ్సీఐకి అప్పగించాలి. కానీ మిల్లర్ల నుంచి తగిన సమయంలో సీఎంఆర్ రాకపోవడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సీఐను గడువు పెంచాలని కోరడం ఏటా జరిగే తంతుగా మారింది. 2019–20 యాసంగి సీజన్కు సంబంధించి 118 మిల్లులు ఇప్పటివరకు సీఎంఆర్ ఇవ్వలేదు. మూడేళ్లుగా పెనాల్టీతో గడువు పెంచుతున్నా ఇప్పటికీ సీఎంఆర్ పెండింగ్లోనే ఉండటం గమనార్హం. గడువు ముగిసిన తరువాత ఎఫ్సీఐ బియ్యం తీసుకోకపోతే వాటిని రాష్ట్ర అవసరాలకు మళ్లించాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేగాకుండా సీఎంఆర్ ఆలస్యంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతోంది. దీనితో ఇకపై మిల్లర్ల ఆగడాలను ఉపేక్షించొద్దని, ధాన్యం కేటాయింపుల్లో కోత విధించాలని.. 6 నెలల్లో సీఎంఆర్ పూర్తి చేసే కెపాసిటీలోనే కేటాయింపులు జరపాలని నిర్ణయించినట్టు తెలిసింది. మిల్లర్లకు కేటాయించగా మిగిలే ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ ద్వారానే మిడిల్ పాయింట్ స్టోరేజీ గోడౌన్లకు తరలించి.. ప్రైవేటు వ్యక్తులకు విక్రయించాలని కూడా యోచిస్తోంది. కొనుగోళ్ల బాధ్యతలు కలెక్టర్లకు.. రాష్ట్రంలో కొన్ని సీజన్లుగా ధాన్యం కొనుగోలు, సీఎంఆర్ ప్రక్రియ అదనపు కలెక్టర్ల నేతృత్వంలో జరుగుతోంది. కొన్ని జిల్లాల్లో అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల సంస్థ అధికారులు, మిల్లర్లు కుమ్మక్కై ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నట్టు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో వచ్చే యాసంగి సీజన్లో కొనుగోలు ప్రక్రియ పూర్తిగా కలెక్టర్ల నేతృత్వంలో జరపాలని నిర్ణయించారు. దీనిపై ఏప్రిల్ 10న మంత్రుల సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు. సీఎంఆర్లో లేని మిల్లులకు ధాన్యం ఇప్పటివరకు సీఎంఆర్తో సంబంధం లేకుండా ప్రైవేటుగా ధాన్యం కొనుగోలు చేసి, బియ్యంగా మార్చి అమ్ముకునే మిల్లులను ఈసారి సీఎంఆర్ పరిధిలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. మిర్యాలగూడ, నిజామాబాద్, నల్లగొండ వంటి కొన్ని ప్రాంతాల్లో 100కుపైగా మిల్లులు పౌరసరఫరాల శాఖ, సీఎంఆర్తో సంబంధం లేకుండా పనిచేస్తున్నాయి. వాటిని గుర్తించి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. -
మిల్లర్ల నిర్లక్ష్యం..సర్కార్పై రూ.1,257 కోట్ల భారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెరిగిన ధాన్యం దిగుబడితో రైతుల కన్నా అధికంగా లాభాలు ఆర్జిస్తున్న మిల్లర్లు సీఎంఆర్ లక్ష్యాన్ని మాత్రం చేరుకోవడం లేదు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావలసిన రూ.వేల కోట్ల బియ్యం సొమ్ము రాకుండాపోతోంది. ఇదే క్రమంలో 2021–22 వానాకాలం సీజన్కు సంబంధించి 3.93 లక్షల మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ బియ్యం ఫిబ్రవరి నెలాఖరులోగా ఎఫ్సీఐకి అప్పగించలేదు. రాష్ట్ర ప్రభుత్వం మరోనెల గడువు కోరినా కేంద్రం ససేమిరా అనడంతో ఈ బియ్యం భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడినట్లయింది. 47.04 ఎల్ఎంటీ బియ్యంలో ఇచ్చింది 43 ఎల్ఎంటీ.. 2021–22 వానకాలం సీజన్కు సంబంధించి 70.21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి మిల్లర్లకు అప్పగించింది. ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి 47.04 ఎల్ఎంటీ బియ్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్గా ఎఫ్సీఐకి డెలివరీ చేయాలని నిర్దేశించింది. అయితే ఏడాది గడిచినా కేవలం 43 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీఎంఆర్ కింద ఎఫ్సీఐకి అప్పగించారు. ఇంకా 3.93 లక్షల మెట్రిక్ టన్నులు పెండింగ్లో ఉన్నాయి. దీని విలువ రూ.1,257 కోట్లు. మిల్లర్ల నుంచి 3.93 మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్సీఐ తీసుకోకపోతే, ఆ బియ్యాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ తీసుకొని రాష్ట్ర అవసరాల కోసం స్టేట్ పూల్ కింద వినియోగించుకోవలసి ఉంటుంది. అయితే మిల్లర్లు రీసైక్లింగ్, ఇతర అక్రమ పద్ధతుల ద్వారా ఇచ్చే నాణ్యత లేని బియ్యాన్ని కార్పొరేషన్ అధికారులు ఎలాంటి తనిఖీలు లేకుండా తీసుకొని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా తిరిగి రేషన్ దుకాణాలకు పంపించే అవకాశం ఉంది. 2021–22 యాసంగి సీఎంఆర్కు ఈనెలాఖరు వరకు గడువు గత 2021–22 యాసంగి సీజన్కు సంబంధించి ఈ నెల 31లోగా సీఎంఆర్ ప్రక్రియ పూర్తిచేయాలని కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. భారత ప్రభుత్వ డిప్యూటీ కార్యదర్శి జై ప్రకాశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్కు రాసిన లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు యాసంగి సీఎంఆర్ గడువును మార్చి 31 వరకు పొడిగిస్తున్నామని, తరువాత గడువు పొడిగించబోమని స్పష్టం చేశారు. గత యాసంగికి సంబంధించి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. 34.06 ఎల్ఎంటీ బియ్యం ఎఫ్సీఐకి సీఎంఆర్ కింద ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు 21.45 ఎల్ఎంటీ బియ్యం మాత్రమే ఇచ్చారు. ఇంకా 12.61 ఎల్ఎంటీ బియ్యం పెండింగ్లో ఉన్నాయి. కేంద్రం ఈ నెలాఖరు వరకు గడువు ఇచి్చనప్పటికీ, రోజుకు 50 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లింగ్ చేస్తే తప్ప నెలాఖరుకు లక్ష్యం చేరుకోలేమని, అందుకు అనుగుణంగా మిల్లింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ శనివారం అధికారులను ఆదేశించారు. గత యాసంగికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు మొత్తం సీఎంఆర్లో 14 ఎల్ఎంటీ మేర బాయిల్డ్ రైస్ తీసుకునేందుకు కూడా కేంద్రం అనుమతి ఇచి్చనప్పటికీ, మిల్లర్లు ఇంకా 6.64 ఎల్ఎంటీ బాయిల్డ్ రైస్ పెండింగ్లో ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. సూర్యాపేట, వనపర్తి, మహబూబ్నగర్, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల్లో సీఎంఆర్ పెండింగ్ అధికంగా ఉండటంపట్ల రవీందర్ సింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ముంచుకొస్తున్న సీఎంఆర్ గడువు
సాక్షి, హైదరాబాద్: అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా రాష్ట్రంలో మిల్లర్ల తీరు మారడం లేదని తెలుస్తోంది. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను ఎఫ్సీఐకి సకాలంలో అప్పగించాల్సిన మిల్లర్లు ఎన్నిసార్లు గడువు పెంచినా లక్ష్యాన్ని అందుకోవడం లేదు. 2020–21 యాసంగికి సంబంధించి 1.36 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ అప్పగింత గడువు ముగియడంతో ఆ మొత్తాన్ని స్టేట్ పూల్ కింద రాష్ట్ర అవసరాలకు మళ్లించారు. 2021–22 వానాకాలం సీఎంఆర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈనెలాఖరు వరకు గడువు ఇచ్చినప్పటికీ అప్పగింత ఇంకా పూర్తికాలేదు. వానాకాలం సీఎంఆర్ కింద 47.04 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు పౌరసరఫరాల సంస్థకు అప్పగించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 36 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే లెవీ రూపంలో ఎఫ్సీఐకి చేరింది. అంటే ఇంకా 11 లక్షల మెట్రిక్ టన్నులు రావలసి ఉంది. నెల రోజులలో 9 ఎల్ఎంటీ సీఎంఆర్ అప్పగింత విషయంలో జాప్యంపై గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గత నెల 24వ తేదీ నాటికి 27 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ అప్పగించారు. లక్ష్యాన్ని పూర్తి చేయాలని అప్పట్లో మంత్రి గంగుల అధికారులతో సమావేశం అయి గట్టిగా చెప్పడంతో, కష్టంమీద నెలరోజుల్లో 9 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ను అప్పగించారు. ఇక మిగిలింది 11 లక్షల మెట్రిక్ టన్నులు అయినా.. ఇంత బియ్యం మిల్లింగ్ చేసి అప్పగించడం అసాధ్యమేనని అర్థమవుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరో నెల గడువు కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేయడమో.. లేక స్టేట్ పూల్ కింద సొంతానికి వాడుకోవడమో చేయాల్సి ఉంటుందని చెపుతున్నారు. ముందుకు కదలని గత యాసంగి సీఎంఆర్ 2021–22 యాసంగికి సంబంధించిన సీఎంఆర్ కూడా ముందుకు సాగడం లేదని అధికారవర్గాలు చెపుతున్నాయి. యాసంగిలో 50.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి మిల్లులకు పంపగా, సీఎంఆర్ కింద 33.93 లక్షల మెట్రిక్ టన్నులను ఎఫ్సీఐకి ఇవ్వాల్సి ఉంది. అయితే గతనెల 24వ తేదీ నాటికి కేవలం 9.18 లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే సీఎంఆర్ కింద ఇచ్చారు. అప్పటి నుంచి ఈ నెలరోజుల్లో కేవలం 4 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అదనంగా మిల్లింగ్ చేసి పౌరసరఫరాల సంస్థ ద్వారా ఎఫ్సీఐకి అప్పగించారు. ఇంకా 20.06 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉంది. దీనికోసం మరో మూడు నెలల వరకు గడువు తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. 4,183 కొనుగోలు కేంద్రాలు మూసివేత 2022–23 వానాకాలం సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 7,007 కొనుగోలు కేంద్రాలను తెరిచి రూ. 11,542 కోట్ల విలువైన 56.06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తయిన 4,183 కేంద్రాలను మూసివేశారు. రాష్ట్రంలో 9.95 లక్షల మంది రైతులకు సంబంధించిన ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు పౌరసరఫరాల సంస్థ అధికారులు తెలిపారు. -
మిల్లులపై కొరడా! సీఎంఆర్ అక్రమాలపై సర్కారు నజర్
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో అక్రమాలకు పాల్పడే రైస్మిల్లుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు రోజుల క్రితం సూర్యాపేట జిల్లాలోని 8 మిల్లుల్లో ‘కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)’ కోసం కేటాయించిన ధాన్యం మాయమైన విషయాన్ని సీరియస్గా తీసుకుంది. కొందరు మిల్లర్ల తీరు వల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం తప్పుబట్టే పరిస్థితి తలెత్తుతున్న క్రమంలో కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది. సదరు మిల్లులను బ్లాక్లిస్టులో పెట్టి, వాటి నుంచి మాయమైన రూ.138.50 కోట్ల విలువైన ధాన్యానికి సమానమైన బియ్యాన్ని వెంటనే రికవరీ చేయాలని ఆదేశించింది. ఇదే సమయంలో గత సీజన్లలో రాష్ట్రవ్యాప్తంగా మిల్లులకు సీఎంఆర్ కోసం కేటాయించిన ధాన్యం, మిల్లింగ్ చేశాక తిరిగి ఇచ్చిన బియ్యం, ఇంకా మిగిలిన ధాన్యం లెక్కలు తీయాలని అధికారులను పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. దీనిపై అప్రమత్తమైన అన్ని జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారులు.. మిల్లుల్లో ధాన్యం లెక్కలు తీసే పనిలో పడ్డారు. భారీగా బియ్యం పెండింగ్.. రాష్ట్రంలో రైతుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా పౌరసరఫరాల శాఖ సేకరిస్తుంది. దాన్ని రైస్మిల్లులకు పంపుతుంది. మిల్లర్లు ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి వచి్చన బియ్యాన్ని ఎఫ్సీఐకి అప్పగించాల్సి ఉంటుంది. ప్రతి క్వింటాల్ ధాన్యానికి సుమారు 67 కిలోల బియ్యం వస్తుంది. ఇలా ఇచ్చే బియ్యాన్నే ‘కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)’ అంటారు. మిల్లింగ్ చేసి ఇచి్చనందుకు రైస్మిల్లర్లకు నిరీ్ణత మొత్తం చార్జీలను చెల్లిస్తారు. ప్రతి సీజన్లో పౌరసరఫరాల శాఖ మిల్లుల సామర్థ్యం, గతంలో సకాలంలో సీఎంఆర్ ఇచి్చన తీరు వంటి అంశాలను బేరీజు వేసుకుని.. ఆయా మిల్లులకు ధాన్యాన్ని కేటాయిస్తుంది. కానీ గత రెండేళ్లుగా కొందరు మిల్లర్లు తమకు కేటాయించిన ధాన్యాన్ని సకాలంలో మిల్లింగ్ చేసి ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు ప్రస్తుతం వానకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లు జరుగుతుండగా.. గత సంవత్సరం (2021–22) వానకాలం సీజన్లో మిల్లులకు పంపిన ధాన్యాన్నే ఇంకా పూర్తిగా కస్టమ్ మిల్లింగ్ చేసి ఇవ్వలేదు. ఆ సీజన్కు సంబంధించి ఇంకా 14 లక్షల టన్నులకుపైగా బియ్యం ఎఫ్సీఐకి అందాల్సి ఉంది. అంటే లెక్కప్రకారం మిల్లుల్లో 20 లక్షల టన్నులకుపైగా ధాన్యం మిల్లుల్లోనే ఉన్నట్టు. కొన్ని జిల్లాల్లో సగమే సీఎంఆర్.. కామారెడ్డి, పెద్దపల్లి, మెదక్, కరీంనగర్, జగిత్యాల, వనపర్తి, సూర్యాపేట, సిరిసిల్ల, యాదాద్రి, నాగర్కర్నూల్, మంచిర్యాల జిల్లాల్లో మిల్లర్లు గతేడాది వానాకాలం సీఎంఆర్లో 50శాతం కూడా అప్పగించలేదు. వరిసాగు తక్కువగా ఉండే ఆదిలాబాద్, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, కొత్తగూడెం జిల్లాల్లో మాత్రమే 100 శాతం, మిగతా జిల్లాల్లో 80శాతం వరకు సీఎంఆర్ పూర్తయింది. ఇక గత యాసంగికి సంబంధించి మిల్లులకు కేటాయించిన 50లక్షల టన్నుల ధాన్యం కస్టమ్ మిల్లింగ్ చాలా జిల్లాల్లో మొదలేకాలేదు. ఈ ధాన్యం నుంచి 17 లక్షల టన్నులమేర పారాబాయిల్డ్ (ఉప్పుడు) పోషక బియ్యంగా మార్చేందుకు అనుమతి లభించినా అంతంత మాత్రంగానే మిల్లింగ్ జరుగుతోంది. మరోవైపు ఈ ఏడాది వానకాలం ధాన్యం కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే 20 లక్షల టన్నులకుపైగా ధాన్యం మిల్లులకు చేరింది. మరో 80 లక్షల టన్నులు వచ్చే అవకాశముంది. నాణ్యమైనది అమ్ముకుని..! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉప్పుడు బియ్యం, రారైస్ విషయంలో తలెత్తిన వివాదాలను మిల్లర్లు తమకు అనుకూలంగా మలుచుకొని అక్రమాలకు పాల్పడుతున్నట్టు విమర్శలు ఉన్నాయి. కొందరు మిల్లర్లు సీఎంఆర్ కోసం వచి్చన ధాన్యంలో మేలురకం ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యాన్ని అమ్ముకుంటున్నారని ఆరోపణలు చాలాకాలం నుంచి ఉన్నాయి. ఇదే సమయంలో రేషన్ బియ్యాన్ని, పాత ముతక బియ్యాన్ని కొని రిసైక్లింగ్ చేసి ఎఫ్సీఐకి అప్పగించడం పెద్దపల్లి, కరీంనగర్, సూర్యాపేట, సిద్దిపేట వంటి పలుజిల్లాల్లో సాధారణమేనని పౌరసరఫరాల శాఖ అధికారులే చెప్తున్నారు. ఈ ఆరోపణలపై గతంలో పెద్దపల్లి, మంచిర్యాల, నల్లగొండ, కరీంనగర్, నాగర్కర్నూల్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో పలుమిల్లులపై ఆంక్షలు విధించినా.. రాష్ట్రస్థాయిలో పైరవీలతో తమ వ్యాపారాన్ని సాగిస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. ఎఫ్సీఐ ఆగ్రహించి సీఎంఆర్ ఆపినా.. మిల్లర్లు ఎఫ్సీఐకి అప్పగించే సీఎంఆర్ విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ కేంద్రం కొన్ని నెలల కింద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎఫ్సీఐ విధించిన నిబంధనలను తుంగలో తొక్కి రీసైక్లింగ్ బియ్యం, పాత బియ్యాన్ని సెంట్రల్పూల్ కింద ఎఫ్సీఐకి ఇవ్వడాన్ని తప్పుబట్టింది. దీనితోపాటు సకాలంలో సీఎంఆర్ ఇవ్వకపోవడంపై ఆగ్రహిస్తూ.. జూలైలో సీఎంఆర్ బియ్యాన్ని తీసుకోబోమని తేలి్చచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కమలాకర్, అధికారులు పలుమార్లు కేంద్రంతో సంప్రదింపులు జరిపాక.. 45 రోజుల తర్వాత తిరిగి సీఎంఆర్కు అనుమతిచ్చింది. అయినా మిల్లర్లు సీఎంఆర్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అధికార వర్గాలు చెప్తున్నాయి. కాగా సూర్యాపేట జిల్లాలో రూ.67 కోట్ల విలువైన ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్ ఇవ్వాల్సిన రెండు మిల్లులపై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. మేలురకం అమ్మేసుకోవడంతోనే! రాష్ట్రంలో పెరిగిన ధాన్యం ఉత్పత్తిని కొందరు మిల్లర్లు తమకు అనుకూలంగా మలుచుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నట్టు పౌరసరఫరాల శాఖ గతంలోనే గుర్తించింది. మిల్లులు సీఎంఆర్ కోసం అందిన ధాన్యంలో మేలురకం ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, నాణ్యమైన బియ్యాన్ని అధిక ధరకు అమ్ముకుంటున్నాయని తేల్చింది. తర్వాత నాసిరకం ధాన్యాన్ని రైతుల నుంచి తక్కువ ధరకు కొని ఆ బియ్యాన్ని ఎఫ్సీఐకి ఇస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. ఇందువల్లే సీఎంఆర్ అప్పగించడంలో జాప్యం జరుగుతోందని అంటున్నాయి. ఈ క్రమంలోనే తనిఖీలు, చర్యలకు ప్రభుత్వం నిర్ణయించిందని వివరిస్తున్నాయి. నాలుగు సార్లు గడువు పెంచినా.. వాస్తవానికి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం మిల్లుకు చేరిన 45 రోజుల్లోనే బియ్యంగా మార్చి ఎఫ్సీఐకి అప్పగించాలి. గత ఏడాది వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లు డిసెంబర్లోనే ముగిశాయి. అంటే ఈఏడాది ఫిబ్రవరి 15లోగా బియ్యాన్ని అప్పగించాలి. కానీ మిల్లులు ఇవ్వలేదు. దీంతో ఎఫ్సీఐ మార్చి నెలాఖరు వరకు గడువు ఇచి్చంది. అయినా మిల్లర్లు బియ్యాన్ని సకాలంలో ఇవ్వలేకపోవడంతో తర్వాత జూన్ వరకు, మళ్లీ సెపె్టంబర్ వరకు, చివరికి నవంబర్ 30వ తేదీ వరకు గడువు ఇచి్చంది. అయినా ఇంకా 14 లక్షల టన్నులకుపైగా బియ్యం పెండింగ్లోనే ఉండిపోయింది. ఇదీ చదవండి: పసుపురంగు దేవతావస్త్రం! -
వానాకాలం సీఎంఆర్పై నీలినీడలు
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్ కస్టమ్ మిల్లింగ్ (సీఎంఆర్)పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సీఎంఆర్ గడువు ముగిసి మూడు రోజులైనా పొడిగింపుపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. యాసంగి సీఎంఆర్కు సెప్టెంబర్ 30 వరకు ఉన్న గడువును నెలరోజులపాటు పొడిగించిన కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ.. వానకాలం సీఎంఆర్ గురించి ఊసెత్తలేదు. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులు, మిల్లర్లు అయోమయంలో పడిపోయారు. 60 శాతమే పూర్తయిన వానాకాలం సీఎంఆర్ వానాకాలం సీజన్కు సంబంధించిన సీఎంఆర్ ఇప్పటివరకు 60 శాతమే పూర్తయింది. వానాకాలం సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం 70.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఈ ధాన్యాన్ని మిల్లర్లు సీఎంఆర్ కింద 47 ఎల్ఎంటీ మేర ఎఫ్సీఐకి అప్పగించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు సుమారు 30 ఎల్ఎంటీ బియ్యాన్ని మాత్రమే ఎఫ్సీఐకి ఇచ్చినట్లు సమాచారం. అంటే 60 శాతం సీఎంఆర్ మాత్రమే పూర్తయింది. మిగతా సీఎంఆర్తో పాటు యాసంగి సీఎంఆర్ పూర్తి చేసేందుకు మరో నెల గడువు పెంచాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. అయితే కేంద్రం మాత్రం కేవలం యాసంగి సీఎంఆర్కు సంబంధించిన గడువును మాత్రం అక్టోబర్ 31 వరకు పెంచుతూ గతనెల 27న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. ఈ లేఖలో ముగిసిన వానకాలం సీజన్కు సంబంధించిన సీఎంఆర్ గురించి ప్రస్తావించలేదు. గత కొంతకాలంగా సీఎంఆర్ ఆలస్యం ధాన్యం దిగుబడి పెరిగిన నేపథ్యంలో గత కొన్ని నెలలుగా సీఎంఆర్ అప్పగించడంలో ఆలస్యమవుతోంది. ఈ విషయంపై ఏడాదిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. మిల్లింగ్లో అవకతకవలు, పీడీఎస్ బియ్యం పంపిణీ చేయకపోవడంపై ఆగ్రహించిన ఎఫ్సీఐ.. జూన్ 7వ తేదీ నుంచి 40 రోజుల పాటు సీఎంఆర్ తీసుకోలేదు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. జూలై నెలాఖరు నుంచి మిల్లింగ్కు అవకాశం ఇచ్చినప్పటికీ వర్షాల కారణంగా మిల్లుల్లో ధాన్యం తడిసిపోవడం, మిల్లులు నిలిచిపోయినప్పుడు కూలీలు, హమాలీలు సొంతూర్లకు వెళ్లిపోవడం వంటి కారణాలతో ఆశించిన స్థాయిలో మిల్లింగ్ జరగలేదు. దీంతో సెప్టెంబర్ నెలాఖరు వరకు 60 శాతమే సీఎంఆర్ పూర్తయింది. ఈ విషయమై మంత్రి కమలాకర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్కుమార్ గత నెల చివరివారంలో సమావేశమై సీఎంఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే తీరు కొనసాగితే ధాన్యాన్ని మిల్లింగ్ కోసం ఇతర రాష్ట్రాలకు పంపాలని కూడా నిర్ణయించి, ఎఫ్సీఐ అనుమతి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మిల్లింగ్ వేగం పెరిగింది. కానీ సెపె్టంబర్ 30 తరువాత గడువు పొడిగించకపోవడంతో వానకాలం సీఎంఆర్పై నీలినీడలు కమ్ముకున్నట్లయింది. చదవండి: మునుగోడు దంగల్: కమలదళ కదనోత్సాహం.. ఫుల్జోష్తో బీజేపీ రెడీ -
మిల్లర్లకు ధాన్యం బంద్..!
సాక్షి, హైదరాబాద్: రైస్ మిల్లర్లపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. గత రెండు మూడు సీజన్లలో సకాలంలో సీఎంఆర్ ఇవ్వడంలో విఫలమైన 80% డిఫాల్టర్ మిల్లులకు భవిష్యత్తులో మిల్లింగ్ కోసం ధాన్యాన్ని ఇవ్వకూడదని నిర్ణయించింది. మిల్లర్లకు శ్రమ లేకుండా ఏటా లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వమే సేకరించి పంపుతున్నా, దాన్ని సకాలంలో కస్టమ్ మిల్లింగ్ (సీఎంఆర్) చేసి ఎఫ్సీఐకి అప్పగించడంలో వారు నిర్లక్ష్యంగా ఉంటున్నారని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే వానాకాలం సీజన్ ధాన్యాన్ని రాష్ట్రంలోని మిల్లులకు బదులు పొరుగు రాష్ట్రాల్లోని మిల్లులకు పంపాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఆదివారం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, కమిషనర్ అనిల్కుమార్, ఇతర అధికారులు సమావేశమై ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. మిల్లుల్లో 75 ఎల్ఎంటీల నిల్వలు ప్రస్తుతం రాష్ట్రంలోని సుమారు 3 వేల రైస్మిల్లుల్లో 75 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యం నిల్వ ఉంది. గత వానాకాలం సీఎంఆర్ ఇప్పటివరకు 60 శాతం కూడా పూర్తి కాలేదు. 47 ఎల్ఎంటీ సీఎంఆర్కు గాను ఇప్పటివరకు 30 ఎల్ఎంటీ కూడా ఇవ్వలేదు. ఇంకా 25 ఎల్ఎంటీలకు పైగా ధాన్యం నిల్వలు మిల్లుల్లో ఉన్నాయి. అలాగే మొన్నటి యాసంగిలో సేకరించిన 50 ఎల్ఎంటీల ధాన్యం కూడా మిల్లుల్లోనే ఉంది. మరో రెండు నెలల్లో ఈ వానాకాలం ధాన్యం రాబోతోంది. ఈ సీజన్లో 65 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా సుమారు 1.30 కోట్ల టన్నులకు పైగా ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా, ఇందులో కొనుగోలు కేంద్రాలకు సుమారు కోటి టన్నుల వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వచ్చే వానాకాలం ధాన్యాన్ని ప్రైవేట్ గోడౌన్లు వంటి మిడిల్ పాయింట్లలో నిల్వ ఉంచాలని నిర్ణయించింది. ఈ మిల్లుల నుంచి డిఫాల్టర్ మిల్లులకు ధాన్యం పంపకుండా నేరుగా ఇతర రాష్ట్రాలకు తరలించాలని నిర్ణయించింది. మిల్లర్ల తీరుకు తోడు కేంద్రం వైఖరితో.. రైతులకు మద్దతు ధర చెల్లిస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆ ధాన్యాన్ని మిల్లులకు అప్పగిస్తోంది. సెంట్రల్ పూల్ కింద ఎఫ్సీఐ నేరుగా మిల్లుల నుంచి బియ్యాన్ని (సీఎంఆర్) తీసుకుంటోంది. ఎఫ్సీఐకి బియ్యం వెళ్లిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి చెల్లించిన మద్దతు ధరను కేంద్రం రీయింబర్స్మెంట్ పద్ధతిలో తిరిగి చెల్లిస్తోంది. అయితే గత రెండేళ్లుగా పెరిగిన ధాన్యం దిగుబడి నేపథ్యంలో మిల్లర్లు సీఎంఆర్ విషయంలో మరింత ఆలస్యం చేస్తున్నారు. మరోవైపు గడువు ముగిసిన తర్వాత సీఎంఆర్ను తీసుకునేందుకు కేంద్రం అంగీకరించడం లేదు. గత వర్షాకాలం సీజన్ సీఎంఆర్కు ఈ నెలాఖరు వరకు గడువు కాగా, ఇప్పటివరకు ఎఫ్సీఐ గడువు పెంచలేదు. మిల్లర్ల ఆలస్యం కారణంగా 2019–20, 2020–21 యాసంగి సీజన్కు సంబంధించి సుమారు రూ. 700 కోట్ల భారం పౌరసరఫరాల శాఖపై పడింది. ఇలావుండగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ మొదలు బీజేపీ నేతలంతా రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ సకాలంలో ఇవ్వడం లేదని, మిల్లర్ల ఆగడాలకు సహకరిస్తోందని విమర్శిస్తూ జాతీయ స్థాయిలో అప్రదిష్టపాలు చేస్తున్నారు. ఇలా వివిధ కారణాలతో సీఎమ్మార్ అందించడంలో మిల్లర్లు ఆలస్యం చేయడం, కేంద్రం సీఎంఆర్ గడువు పెంచే విషయంలో కఠినంగా వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మంత్రి సీరియస్ రాష్ట్రంలోని మిల్లర్లు వ్యవహరిస్తున్న తీరు, తద్వారా ప్రభుత్వం అప్రదిష్ట మూటగట్టుకుంటున్న అంశంపై మంత్రి సీరియస్ అయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లోని మిల్లులకు ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని పంపించి, మిల్లింగ్ చేయించి ఎఫ్సీఐకి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ మేరకు ఎఫ్సీఐ నుంచి అనుమతి పొందినట్లు సమాచారం. సోమవారం జరిగే పౌరసరఫరాల శాఖ ఉన్నతస్థాయి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
తేలని మిల్లర్ల నూకల పరిహారం
సాక్షి, హైదరాబాద్: ‘యాసంగిలో పండే ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేస్తే నూకల శాతం పెరుగుతుంది. తద్వారా మిల్లర్లకు నష్టం జరుగకుండా పరిహారం చెల్లిస్తాం. సీఎస్ కమిటీ టెస్ట్ మిల్లింగ్, నష్టపరిహారంపై తుది నిర్ణయం తీసుకుంటుంది.’ – రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటన ఇది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో కొన్నేళ్లుగా ఉప్పుడు బియ్యంగా మిల్లింగ్ చేస్తున్న యాసంగి ధాన్యాన్ని ఈసారి ముడిబియ్యంగా ఎఫ్సీఐకి అప్పగించాల్సిన పరిస్థితి. గతనెల 12న సీఎం కేసీఆర్ యాసంగి పంటను సర్కారే కొనుగోలు చేస్తుందని ప్రకటించి, ముడిబియ్యం మిల్లింగ్తో జరిగే నష్టాన్ని సైతం భరిస్తామని ప్రకటించారు. నూకల నష్టం అంచనాకు సీఎస్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. సీఎం ప్రకటన తరువాత మంత్రి గంగుల.. మిల్లర్లతో సమావేశమై కొనుగోలు కేం ద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని దించుకోవాలని చెప్పారు. కానీ, ఇప్పటివరకు సీఎస్ కమిటీ మిల్లర్లకు పరిహారంపై నిర్ణయం తీసుకోలేదు. సీఎస్ కమిటీ వారం క్రితం సమావేశమైనా.. నూకలకు నష్టపరిహారం ఎంతివ్వాలనేది స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే 5 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లర్లు సేకరించారు. ఈ సీజన్లో 60 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం మిల్లింగ్కు వస్తుందని అంచనా. ప్రస్తుతం మిల్లుల్లో వానాకాలం ధాన్యం మిల్లింగ్ జరుగుతుండగా, కొద్దిరోజుల్లో యాసంగి ధాన్యాన్ని మరపట్టించాల్సి ఉంది. ఇప్పటికీ మిల్లింగ్ చార్జీలు, పరిహారం గురించి కమిటీ నిర్ణయం తీసుకోకపోవడం పట్ల మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం మిల్లులకు చేరాక సర్కార్ చేతులెత్తేస్తే తమ పరిస్థితి ఏంటని కరీంనగర్కు చెందిన ఓ మిల్లర్ వ్యాఖ్యానించాడు. సీఎస్ కమిటీ పరిహారం ప్రకటించాలని, లేనిపక్షంలో తమ కార్యాచరణ ప్రకటిస్తామని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకుడు పేర్కొన్నారు. సర్కార్ ఆఫర్ రూ.150.. మిల్లర్ల డిమాండ్ రూ.300: రాష్ట్రంలో వేసవి ఉష్ణోగ్రతలు అధికం. ఈ క్రమంలో యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే బియ్యం విరిగి నూకలుగా మారతాయి. ఎఫ్సీఐ నిబంధనల ప్రకారం.. ‘కస్టమ్ మిల్లింగ్ ’విధానంలో క్వింటాలు ధాన్యాన్ని మరపట్టిస్తే 67 కిలోల బియ్యం రావాలి. సెంట్రల్ పూల్ కింద క్వింటాలు ధాన్యానికి 67 కిలోల బియ్యాన్ని సేకరించి, తదనుగుణంగా కనీస మద్దతు ధర రూ.1,960 రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తుంది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి, బియ్యాన్ని ఎఫ్సీఐకి ఇచ్చిన తరువాత రీయింబర్స్మెంట్ రూపంలో కేంద్రం నుంచి తీసుకుంటుంది. ఈ పరిస్థితుల్లో యాసంగి ధాన్యం ముడిబియ్యంగా మారిస్తే వచ్చే నూకల నష్టాన్ని రాష్ట్రమే భరించాలి. ఈ నూకల నష్టం అంచనాకు సీఎస్ కమిటీ జిల్లాల వారీగా టెస్ట్ మిల్లింగ్ చేయాలని నిర్ణయించింది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్లో నూకల శాతం అత్యధికంగా ఉండగా, ఇతర జిల్లాల్లో కొంత తక్కువగా ఉంటుంది. క్వింటాలు ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే వచ్చే నూకల శాతాన్ని లెక్కించి సగటున రూ.300 ఇవ్వాలని మిల్లర్లు కోరుతున్నారు. ప్రభుత్వం మాత్రం రూ.150 ఇచ్చేందుకు సుముఖంగా ఉంది. ఒకవైపు ఎఫ్సీఐ అధికారులు ప్రత్యక్ష తనిఖీల పేరుతో భయబ్రాంతులను చేస్తుండగా, మరోవైపు యాసంగి ధాన్యం షరతులు లేకుండా కొనుగోలు చేయాలని మంత్రి అల్టిమేటం ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో పరిహారం ఎంతో తేల్చకుంటే నష్టపోతామని మిల్లర్లు చెబుతున్నారు. కాగా సీఎస్ గురువారం పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమావేశమై కొనుగోలు విధానంపై సమీక్షించారే తప్ప మిల్లర్లకు పరిహారంపై ప్రకటన చేయలేదు. ఇలాగైతే యాసంగి కొనుగోళ్లకు మిల్లర్లు కొర్రీలు పెట్టే అవకాశం ఉందని జిల్లాల్లో అధికారులు ఆందోళన చెందుతున్నారు. రైతుల చెల్లింపుల కోసం రూ. 5 వేల కోట్లు సాక్షి, హైదరాబాద్: ధాన్యం సేకరణకు నిధుల సమస్య లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ స్పష్టంచేశారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన సొమ్మును రైతుల ఖాతాలో వేసేందుకు రూ.5 వేల కోట్లను ప్రభు త్వం కేటాయించిందన్నారు. యాసంగి ధాన్యం సేకరణ, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై బీఆర్కేఆర్ భవన్లో ఆయన గురువారం పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు సాగేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 61,300 మంది రైతుల నుంచి 4.61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 3,679 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సీఎస్ చెప్పారు., అందుబాటులో 7.80 కోట్ల గన్నీబ్యాగులు రాష్ట్రంలో 7.80కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటు లో ఉన్నాయని సోమేశ్ తెలిపారు. మరో 8 కోట్ల గన్నీబ్యాగుల కొనుగోలు కోసం టెండర్ల ప్రక్రియ పూర్తి కావచ్చిందన్నారు. మరో రెండున్నర కోట్ల గన్నీ బ్యాగులు జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా నుంచి రానున్నాయని చెప్పారు. కోనుగోలు కేంద్రాలకు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా ధాన్యం రాకుండా 17 జిల్లాల సరిహద్దుల్లో 51 చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లోకి... రైతుల నుంచి సేకరించిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆదేశాలిచ్చినట్లు సీఎస్ తెలిపారు. తద్వారా రైతులకు చెల్లింపులు త్వరితగతిన అవుతాయన్నారు. ఇప్పటివరకు 4.3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు చేరిందని తెలిపారు. వరంగల్, గద్వాల్, వనపర్తి, భూపాలపల్లి, నాగర్కర్నూల్ జిల్లాల్లో వరి కోతలు ఆలస్యమవుతాయని, కోతలు ప్రారంభం కాగానే ఆయా జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటవుతాయని చెప్పారు. -
Telangana: పొలం నుంచి మిల్లుకు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వానాకాలపు వరి కోతలు ఊపందుకున్నాయి. చాలా జిల్లాల్లో 40శాతం వరకు కోతలు, నూర్పిడి పూర్తయి ధాన్యం రాశులు పోగుపడ్డాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో తెరుచుకోకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. అవసరాలకు, అప్పులు తీర్చడానికి డబ్బులు లేక.. ఇంకా వేచి చూడలేక.. దళారులు, మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు. రైతుల అవసరాన్ని ఆసరాగా తీసుకుంటున్న దళారులు, మిల్లర్లు అగ్గువ ధరకే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. రకాన్ని బట్టి మద్దతు ధరకన్నా మూడు వందల నుంచి ఆరు వందలదాకా తక్కువ రేటు చెల్లిస్తున్నారు. దీనికితోడు తేమశాతం, తాలు పేరుతో తరుగుతీస్తూ రైతులను దోచుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా త్వరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో పౌరసరఫరాల అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నవిమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూడో వంతు కేంద్రాలే.. ప్రస్తుత వానాకాలంలో పెరిగిన వరి సాగుకు అనుగుణంగా 6,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని.. కోటీ రెండు లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. వానాకాలం కోతలు మొదలై 15 రోజులు దాటినా.. ఇప్పటివరకు తెరిచిన కొనుగోలు కేంద్రాలు 2,142 మాత్రమే. ముఖ్యంగా నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో వరికోతలు వేగంగా సాగుతున్నాయి. కానీ కొనుగోలు కేంద్రాలు తెరిచే విషయంలో పౌరసరఫరాల శాఖ తాత్సారం చేస్తోంది. తెరిచిన కొనుగోలు కేంద్రాల వద్ద వేచి ఉన్న రైతులకు టోకెన్లు ఇచ్చి రోజులు గడుస్తున్నా.. వడ్లు కొనే పరిస్థితి లేదు. నల్లగొండ నుంచి పెద్దపల్లి దాకా పెద్ద సంఖ్యలో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రాశులు పోసి కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. తమ టోకెన్ నంబర్ ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూడటంతోనే గడిచిపోతోందని నల్లగొండకు చెందిన రమేశ్ అనే రైతు వాపోయారు. రాష్ట్రంలో కోటి టన్నులకుపైగా ధాన్యం సేకరణ లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటివరకు 2.36 లక్షల టన్నులు మాత్రమే సేకరించారు. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పేరుకుపోయి ఉన్నాయి. వానలు పడితే తడిసి నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధరకన్నా తక్కువతో.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవడం, ఏర్పాటైన చోట కొనుగోళ్లకు రోజుల తరబడి వేచి చూసే పరిస్థితి కారణంగా రైతులు నేరుగా మిల్లర్లను, దళారులకు అమ్ముకుంటున్నారు. మిల్లర్లు వెంటనే కొనుగోలు చేస్తుండటం, డబ్బులు చెల్లిస్తుండటంతో.. అగ్గువ సగ్గువకైనా ధాన్యాన్ని అప్పగిస్తున్నారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకొంటున్న దళారులు, మిల్లర్లు.. రకం, తేమశాతం, ఇతర అంశాలను బట్టి క్వింటాల్కు రూ.1,360 నుంచి రూ.1,650 వరకే చెల్లిస్తున్నారు. వరి ఏ గ్రేడ్కు రూ.1,960.. బీ గ్రేడ్కు రూ.1,940గా కేంద్రం ప్రకటించిన మద్దతు ధరల కంటే ఇవి ఐదారు వందలదాకా తక్కువ కావడం గమనార్హం. సన్న వడ్లకే కాస్త ధర.. వచ్చే యాసంగి నుంచి దొడ్డు బియ్యం, ఉప్పుడు (పారాబాయిల్డ్ రైస్)ను కొనుగోలు చేయబోమని భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) ఇప్పటికే ప్రకటించింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు పలు సూచనలు చేసింది. దీంతో వానాకాలం పంట విషయంలో కూడా మిల్లర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే దొడ్డు వడ్లను మాత్రమే తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. సన్న వడ్లను మాత్రం నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సన్నరకాలకు క్వింటాల్ రూ.1,600 వరకు ఇచ్చి కొనుగోలు చేస్తుండగా.. రైతులెవరైనా దొడ్డు వడ్లను తెస్తే మరో రెండు, మూడు వందలు తక్కువగా ఇస్తున్నారు. దీనికితోడు తేమ, తాలు అంటూ మరింత కోత పెడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో ఇప్పటికే వరి దిగుబడి దశకు చేరింది. కోతలు వేగంగా సాగుతున్నాయి. కానీ ఇప్పటికీ భువనగిరి, సూర్యాపేటల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. కరీంనగర్ జిల్లాలో శుక్రవారం పలు కొనుగోలు కేంద్రాలను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లాలో శనివారం మొదలు కానున్నాయి. కానీ ఇప్పటికే ఆలస్యం కావడంతో చాలా మంది రైతులు ధాన్యాన్ని మిల్లులకు విక్రయిస్తున్నారు. కస్టమ్ మిల్లింగ్ పూర్తికాకున్నా.. గత యాసంగికి సంబంధించిన లక్షల టన్నుల ధాన్యం ఇప్పటికీ మిల్లుల్లో ఉంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ఆ ధాన్యాన్ని మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ చేసి ఎఫ్సీఐకి పంపించాల్సి ఉంది. కానీ ఆ పని ఆపేసి.. రైతుల నుంచి వానాకాలం పంటను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతుల నుంచి తక్కువ ధరకే సన్నరకాల ధాన్యం కొనవచ్చని.. డిమాండ్ వచ్చినప్పుడు రెట్టింపు రేటుకు అమ్ముకోవచ్చన్నది మిల్లర్లు ఆలోచన అని మార్కెటింగ్ వర్గాలు చెప్తున్నాయి. రూ.1,650కే అమ్ముకోవాల్సి వచ్చింది నాకున్న ఒకటిన్నర ఎకరం భూమిలో సన్నరకం వరి వేశాను. పదిహేను రోజుల కింద పంటకోసి నూర్పిడి పూర్తయింది. ప్రభుత్వ కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు కాలేదు. వానలు పడతాయన్న భయంతో వడ్లను వ్యాపారులకు అమ్ముకున్నా. 28 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాల్కు రూ.1,650 రేటుకే అమ్ముకోవాల్సి వచ్చింది. – షేక్ నిస్సార్, బర్ధీపూర్ గ్రామరైతు, బోథ్ మండలం -
లక్ష టన్నుల బియ్యం స్వాహా.. బయటపడ్డ భారీ అక్రమాలు!
ఆయన వనపర్తి జిల్లా పానగల్ మండల కేంద్రానికి చెందిన ఓ రైస్ మిల్లర్.. మరికొందరు మిల్లర్లను జతచేసుకుని ఎఫ్సీఐతో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఒప్పందాలు చేసుకుంటున్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా సీఎంఆర్ కింద రీసైక్లింగ్ చేస్తు న్నారు. ఆయనకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే బియ్యం డాన్గా పేరున్నట్టు ప్రచా రంలో ఉంది. ఆయనకు చెం దిన వాహనాలు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తర లిస్తూ.. గతేడాది జూన్ 26 నుంచి నెల రోజుల వ్యవధిలోనే మూడు సార్లు పట్టుబడ్డాయి. అధికారిక దాడుల్లో 1,013 క్వింటాళ్ల బియ్యం దొరికింది. 2018లో అప్పటి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి పానగల్లోని సంబంధిత మిల్లులో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. లెక్కలకు మించిన ధాన్యం ఉన్నట్టు గుర్తించి సీఎంఆర్ ఒప్పందాలను రద్దు చేశారు. భవిష్యత్తులోనూ అనుమతులు ఇవ్వొద్దని ఆదేశించారు. కానీ సదరు ‘బియ్యం డాన్’.. తన కుమారుడి పేరుమీద జిల్లా కేంద్రంలో, కొత్తకోట మండలంలో కొన్ని రైస్ మిల్లులను లీజ్కు తీసుకుని సీఎంఆర్ ఒప్పం దాలు చేసుకున్నారు. ఎప్పట్లాగే తన సొంత గ్రామంలో నిర్మాణం లోని మిల్లు వద్ద, పానగల్లో సీజ్ చేసిన మిల్లు వద్ద రేషన్ బియ్యాన్ని పెద్ద మొత్తంలో రీసైకిల్ చేస్తూ పట్టుబడ్డారు. అయినా అధికారులు 6ఏ కేసులు మాత్రమే నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. ఇంత జరిగినా కొందరు అ«ధికారుల సహకారంతో బినామీ పేర్లతో సీఎంఆర్ ఒప్పందాలు చేసుకుని దందా కొనసాగిస్తున్నారు. హైదరాబాద్: రాష్ట్రంలో కస్టమ్ మిల్లింగ్ బియ్యం విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. రైతుల నుంచి కొన్న ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇవ్వాలంటూ ప్రభుత్వం మిల్లర్లకు అప్పగిస్తే.. మిల్లర్లు బియ్యం తిరిగివ్వకుండా, బయట అమ్ముకుని వ్యాపారం చేసుకుంటున్నారు. 2019–20 ఏడాది యాసంగికి సంబంధించి రూ.400 కోట్ల విలువైన 1.25 లక్షల టన్నుల బియ్యాన్ని ఇప్పటికీ తిరిగి అప్పగించకుండా దందా చేస్తున్నారు. గట్టిగా ఒత్తిడి తెస్తే.. పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమ మార్గాల్లో సేకరించి, దాన్నే రీసైక్లింగ్ చేసి ప్రభుత్వానికి అంటగడుతున్నారు. ఇంత జరుగుతున్నా.. మిల్లర్లను బ్లాక్లిస్టులో పెట్టడంగానీ, రెవెన్యూ రికవరీ యాక్టు ప్రయోగించి వసూలు చేయడంగానీ చేయడం లేదు. కొందరు అధికారులు, మిల్లర్ల అసోసియేషన్ నేతల అండతోనే ఈ వ్యవహారం సాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. గడువు పొడిగించినా చలనమేదీ? సర్కారు రైతుల నుంచి కొన్న ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపి, బియ్యంగా మార్పించి తిరిగి తీసుకుంటుంది. దీనిని కస్టమ్ మిల్లింగ్ అంటారు. మిల్లర్లు ఒక్కో క్వింటాల్ ధాన్యానికి.. ముడి బియ్యం అయితే 67 కిలోలు, బాయిల్డ్ రైస్ అయితే 68 కిలోలు ఇవ్వాల్సి ఉంటుంది. మిల్లింగ్ చేసినం దుకు ప్రభుత్వం క్వింటాల్కు ఇంత అని చార్జీలు చెల్లిస్తుంది. అయితే ప్రభుత్వం పంపిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి అప్పగించడంతో రైస్ మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కోసారి ధాన్యం తీసుకుని ఏడాది దాటుతున్నా బియ్యాన్ని తిరిగి పంపడం లేదు. ► 2019–20 యాసంగి సీజన్లో ప్రభుత్వం రైతుల నుంచి కొన్న 64.17 లక్షల టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ కోసం రైస్ మిల్లర్లకు పంపింది. ఈ మేరకు మిల్లర్లు 43.59 లక్షల టన్నుల బియ్యాన్ని అప్పగించాలి. కానీ 42.34 లక్షల టన్నులే తిరిగి చ్చారు. ఇంకా 1.25 లక్షల టన్నులు రాలేదు. ప్రధానంగా పెద్దపల్లిలో 28,168 టన్నులు, వరంగల్ ఆర్బన్ 19,122, వరంగల్ రూరల్ 12,165, సూర్యాపేట 16,679, మంచిర్యాల 3,386, నిర్మల్ 3,534, నిజామాబాద్ 2,549, మెదక్ 6,853, కరీంనగర్ 4,479, జగిత్యాల 8,184, మహబూబాబాద్ 4,655, జనగాం 2,975, ములుగు 5,969, యాదాద్రి 7,884, వనపర్తి 4,510 గద్వాల జిల్లా నుంచి 2,492 టన్నులు సీఎంఆర్ బియ్యం రావాల్సి ఉంది. ►నిజానికి ఈ బియ్యాన్ని గత ఏడాది అక్టోబర్ నాటికే అప్పగించాల్సి ఉన్నా మిల్లర్ల నుంచి స్పందన లేదు. ఈ విషయంగా గత ఏడాది నవంబర్లోనే సమీక్షించిన సీఎస్ సోమేశ్ కుమార్.. డిసెంబర్ నాటికే సీఎంఆర్ ఇవ్వాలని ఆదేశించారు. అయినా ఫలితం రాలేదు. ఇలా నాలుగు మార్లు గడువు పొడిగించినా 1.25 లక్షల టన్నుల బియ్యం పెండింగ్లోనే ఉంది. ఆ బియ్యం విలువ రూ.400 కోట్ల వరకు ఉంటుంది. ఉమ్మడి నల్లగొండ, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోనే సీఎంఆర్ ఇవ్వని మిల్లులు ఎక్కువగా ఉన్నాయి. ప్రైవేటు బిజినెస్.. పీడీఎస్కు పాలిష్.. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం.. సీఎంఆర్ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి 45 రోజుల్లోగా బియ్యాన్ని తిరిగి అప్పగించాలి. కానీ రాష్ట్రంలో ఎన్నడూ ఈ గడువులోగా బియ్యం ఇచ్చిన దాఖలాలు లేవు. కనీసం పెంచిన గడువు వరకూ కూడా అంద జేయడం లేదు. దీనికి కారణం సీఎంఆర్ కింద ఇవ్వాల్సిన బియ్యంతో మిల్లర్లు ప్రైవేటు వ్యాపారం చేయడమే. కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ధాన్యం సాగు ఎక్కువగా లేకపోవడం, రెండేళ్లుగా దిగుబడి తగ్గడంతో వారంతా తెలంగాణపైనే ఆధారపడ్డారు. మరోవైపు మలేసియా, ఇండోనేషియా, నైజీరియా, శ్రీలంక దేశాలకు మన రాష్ట్రం నుంచే బియ్యం ఎగుమతి అవుతోంది. ఇలా డిమాండ్ ఉండటంతో.. మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించాల్సిన ధాన్యాన్ని బయట మార్కెట్లలో అమ్మేసుకుంటున్నారు. ప్రధానంగా బీపీటీ, హెచ్ఎంటీ, జైశ్రీరామ్, తెలంగాణ సోనా రకాలను ఎక్కువగా సాగు చేసే చోట ఈ దందా నడుస్తోంది. బియ్యం అప్పగించాలని ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిన సందర్భాల్లో.. మిల్లర్లు పీడీఎస్ బియ్యాన్నే సేకరించి సీఎంఆర్ కింద అప్పగిస్తున్నారు. ముఖ్యంగా భూపాలపల్లి, పెద్దపల్లి, ఖమ్మం, ఆదిలాబాద్, నిర్మల్, మహబూబాబాద్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో దళారుల ద్వారా రేషన్ బియ్యాన్ని రూ.8 నుంచి రూ.10 చొప్పున కొంటున్నారు. ఆ బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. గత ఏడాది విజిలె¯న్స్ దాడుల్లో చాలా చోట్ల ఈ అక్రమాలను గుర్తించారు. వనపర్తి జిల్లాలో రాజకీయ ఆశీస్సులున్న ఓ రైస్ మిల్లర్కు చెందిన మిల్లులో ఏటా రేషన్ బియ్యం పట్టుబడుతోంది. ఇటీవలే అదే రైస్మిల్లులో ఏకంగా 500 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. సదరు మిల్లర్ ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని మరీ.. వనపర్తితోపాటు పక్క జిల్లాల నుంచీ రేషన్ బియ్యం సేకరిస్తున్నట్టు గుర్తించారు. అయినా సదరు రైస్మిల్లుకు మళ్లీ సీఎంఆర్ కింద ధాన్యం కేటాయించడం గమనార్హం. ఇలాంటి మిల్లులు రాష్ట్రంలో 70 నుంచి 80 వరకు ఉన్నట్టు అంచనా. బ్లాక్ లిస్టులో పెట్టినా.. నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని వరలక్ష్మి రైస్ మిల్లు గడువులోగా సీఎంఆర్ బియ్యం ఇవ్వలేదన్న కారణంగా పౌర సరఫరాల శాఖ దాన్ని బ్లాక్ లిస్టులో పెట్టింది. అయితే నల్లగొండకు చెందిన ఓ వ్యాపారి.. రాజకీయ పలుకుబడితో, పౌర సరఫరాల అధికారుల సాయంతో మిల్లు ఓనర్పై ఒత్తిడి తెచ్చి, దానిని కొనేశారు. సదరు మిల్లు ద్వారా అప్పగించాల్సిన సీఎంఆర్ బియ్యాన్ని ఆయనే ప్రభుత్వానికి అప్పగించారు. ఏదైనా మిల్లును బ్లాక్ లిస్టులో పెడితే.. తర్వాతి సీజన్లోనే, యాజమాన్యం మారితేనే సీఎంఆర్ ఇవ్వాలి. కానీ అధికారుల తోడ్పాటుతో.. బ్లాక్ లిస్టులో పెట్టిన సీజన్లోనే వరలక్ష్మి మిల్లు ద్వారా సీఎంఆర్ బియ్యం అప్పగించినట్టు లెక్కల్లో చూపారు. అంటే సీఎంఆర్ విషయంలో మిల్లర్లు, అధికారులు ఎలా కలిసిపోయారో అర్థం చేసుకోవచ్చు. అసోసియేషన్ నాయకుడి అండతోనే.. జగిత్యాల జిల్లాలో గతనెలలో దాదాపు 10 మిల్లులు సీఎంఆర్ ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలించినట్టు ఎఫ్సీఐ తనిఖీల్లో తేలింది. అయినా వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మిల్లర్ల అసోసియేషన్ నాయకుడొకరు అధికార యంత్రాంగాన్ని శాసిస్తున్నాడని, మిల్లులపై చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నారని బహిరంగంగానే చర్చ జరుగుతున్నా అడిగే నాథుడు లేడు. సీఎంఆర్కు సంబంధించి ఇటీవల ఎఫ్సీఐ అధికారులు రంగంలోకి దిగి తనిఖీలు చేస్తున్నారు. దీంతో మిల్లర్లు ఏకంగా ఎఫ్సీఐ అధికారులు వేధిస్తున్నారంటూ రివర్సులో ఆరోపణలు చేస్తుండడం గమనార్హం. నాణ్యత లేని బియ్యాన్ని ఎఫ్సీఐకి తరలించినా ఎవరూ అడ్డుచెప్పకుండా, మిల్లర్ల వద్దకు అధికారులెవరూ రాకుండా ముందు జాగ్రత్తగా మిల్లర్లు ఇలా మైండ్గేమ్ ఆడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. నో రికవరీ.. నో బ్లాక్లిస్ట్.. సీఎంఆర్ బియ్యం తిరిగివ్వడంలో జాప్యం చేస్తున్న మిల్లర్లపై చర్యలే లేకుండా పోయాయి. 2014 నుంచి 2016 వరకు 137 మంది మిల్లర్ల నుంచి 1.20 లక్షల టన్నుల బియ్యం రావాల్సి ఉన్నా.. ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఆ బియ్యం విలువ సుమారు రూ.165 కోట్లు. అయితే అప్పటి పౌర సరఫరాల శాఖ కమిషనర్లు సీవీ ఆనంద్, అకున్ సబర్వాల్ గట్టిగా ఒత్తిడి తెచ్చి.. 30 మంది మిల్లర్ల నుంచి రూ.80 కోట్ల విలువైన బియ్యాన్ని రికవరీ చేశారు. ఇంకా రూ.85 కోట్ల బియ్యాన్ని రికవరీ చేయాల్సి ఉన్నా పట్టించుకున్నవారు లేరు. కేవలం 80 రైస్ మిల్లులను బ్లాక్లిస్టులో పెట్టి వదిలేశారు. 2016 తర్వాత సీఎంఆర్ బియ్యం తిరిగివ్వడంతో ఎంత జాప్యం చేస్తున్నా సదరు మిల్లర్ల నుంచి రెవెన్యూ రికవరీ గానీ, బ్లాక్లిస్టులో పెట్టడం గానీ జరగడం లేదు. మిల్లర్లు ఎప్పుడిస్తే అప్పుడే అన్నట్టు వ్యవహారం నడుస్తోంది. 2019–20కి సంబంధించి 1.25 లక్షల టన్నుల బియ్యం ఇవ్వని 70 వరకు మిల్లులను బ్లాక్లిస్టులో పెట్టే అవకాశమున్నా.. పౌర సరఫరాల శాఖ చర్యలు చేపట్టడం లేదు. ఎఫ్సీఐ వద్దు..రాష్ట్రమే ముద్దు మిల్లర్లు సీఎంఆర్ ధాన్యాన్ని మర పట్టించాక.. బియ్యాన్ని ఎఫ్సీఐకి డెలివరీ చేస్తారు. ఆ బియ్యానికి సంబంధించిన డబ్బును ఎఫ్సీఐ రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు జమచేస్తుంది. తర్వాత ఎఫ్సీఐ రాష్ట్రంలో రేషన్ పంపిణీకోసం అవసరమైన బియ్యాన్ని సబ్సిడీ ధరపై పౌర సరఫరాల సంస్థకు ఇస్తుంది. అంటే ప్రభుత్వం కొన్న ధాన్యానికి సంబంధించిన బియ్యం ఎఫ్సీఐకి వెళ్లి.. తిరిగి సబ్సిడీ ధరతో పౌరసరఫరాల సంస్థకు వస్తుంది. అయితే ఎఫ్సీఐ సీఎంఆర్ బియ్యం నాణ్యత విషయంలో నిబంధనలను ఇటీవల కఠినంగా అమలు చేస్తోంది. నూకలు, రంగు మారడం వంటివి నిర్ణీత మొత్తానికి ఏమాత్రం ఎక్కువ ఉన్నా.. ఆ బియ్యాన్ని తీసుకోవడం లేదు. నూకలు 25 శాతానికి మించొద్దన్న నిబంధనను ఎఫ్సీఐ పక్కాగా అమలు చేస్తుంది. అదే పౌరసరఫరాల సంస్థకు ఇచ్చే బియ్యంలో నూకలు 40– 50 శాతం ఉంటున్నా.. రాళ్లు, మట్టిగడ్డలు, రంగు మారడం వంటివి ఉన్నా అధికారులు పట్టించుకోరు. ఎఫ్సీఐకి నాణ్యమైన బియ్యం ఇవ్వడంకంటే.. పౌర సరఫరాల శాఖకు నాణ్యత లేనివి అంటగడితే మిల్లర్లకు రూ.కోట్లలో కలిసొస్తుంది. ►నిజానికి రాష్ట్రంలో రేషన్, మధ్యాహ్న భోజనం అవసరాలకు ఏటా 20 లక్షల టన్నుల బియ్యం అవసరం. కానీ మిల్లర్ల ఒత్తిళ్లకు తలొగ్గి పౌర సరఫరాల సంస్థ అంతకుమించి సేకరిస్తోంది. 2018–19లో ఇలా అదనంగా ఏడెనిమిది లక్షల టన్నులు తీసుకున్నది. అవసరం లేకున్నా తీసుకున్న ఆ బియ్యాన్ని గోదాముల్లో నిల్వ చేయడం, బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాల చెల్లింపుల్లో జాప్యంతో సర్కారుకు రూ.75 కోట్ల అదనపు భారం పడింది. ►ఇప్పుడు కూడా సీఎంఆర్ బియ్యాన్ని ఎఫ్సీఐ గోదాములకు కాకుండా..నేరుగా పౌర సరఫరాల సంస్థ గోదాములకు పంపి, లెక్కల్లో సర్దుబాటు చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు పౌర సరఫరాల సంస్థ నుంచే లేఖ రాయించేందుకు మిల్లర్లు ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. -
కడ్తా తీస్తే కాల్ చేయండి
సాక్షి, ఇందూరు : కడ్తా పేరిట రైతులను దోచుకుంటున్న వారిపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. కడ్తా తీసే మిల్లర్లపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు కాల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. నాణ్యమైన ధాన్యానికి కూడా రైస్ మిల్లర్లు కడ్తా తీస్తే రైతులు కాల్ సెంటర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. కడ్తా తీసిన వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ ఆదివారం క్యాంప్ కార్యాలయం నుంచి వ్యవసాయ, సహకార, రెవెన్యూ, సివిల్ సప్లయి, ఐకేపీ అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో సేకరిస్తున్న నాణ్యమైన ధాన్యాన్ని కడ్తా లేకుండా తీసుకునేలా అన్ని చర్యలు జిల్లా యంత్రాంగం తీసుకుంటోందని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. అయితే, నాణ్యంగా ఉన్న ధాన్యానికి రైస్ మిల్లర్లు కడ్తా తీసుకున్నా, కొనుగోలు కేంద్రాల్లో ఇతర ఏ సమస్యలున్నా పరిష్కరించడానికి రైతుల కోసం కాల్ సెంటర్ (18004256644, 73826 09775)ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆయా నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. రైతులు పంట కోసే ముందు హార్వెస్టర్ యంత్రాల్లో సరైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. యంత్రం వేగం ఏ–2, ఏ–3లలో, బ్లోయర్ వేగం 19–26 మధ్యలో ఉంచి కోతకు వెళ్లాలని, తద్వారా నాణ్యమైన ధాన్యం వస్తుందని కలెక్టర్ వివరించారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు వచ్చిన తరువాత వ్యవసాయ అధికారులు పరిశీలించి నాణ్యతను ధ్రువీకరిస్తారని, నాణ్యత సరిగా లేకుంటే కడ్తా ఎంత తీయాలో సూచిస్తారన్నారు. వర్షాలు, తదితర కారణాల వలన నాణ్యత తక్కువగా ఉంటే అందులో ఐదు నుంచి పది శాతానికి మించి నాణ్యత తగ్గదన్నారు. రైస్ మిల్లర్లు కూడా వ్యవసాయ అధికారుల ధ్రువీకరణ ఆధారంగా ధాన్యాన్ని తీసుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించి కడ్తా తీసుకుంటే మిల్లర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో కొనుగోలు కేంద్రం బాధ్యులు, ఇతరులపై కూడా చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. సంబంధిత శాఖల అధికారులపై కూడా చర్యలుంటాయన్నారు. రైతులు కూడా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలని, చెన్నీ తప్పనిసరిగా పట్టాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాబ్లో ఓపీఎంఎస్ ఎంట్రీ ఎప్పటికప్పుడు చేసి రైతులకు చెల్లింపులు జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు సమీక్షించుకుంటూ రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. -
ఆ ధాన్యం సంగతేంటి!
విజయనగరం గంటస్తంభం: ధాన్యం కొనుగోలు పారదర్శకంగా జరగాలి... ప్రతి గింజకు సకాలంలో బిల్లుల చెల్లింపు జరపాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే, మిల్లర్లు, అధికారుల వైఫల్యం వల్ల రబీ ధాన్యం బిల్లులు సకాలంలో అందక రైతులు ఆందో ళన చెందుతున్నారు. దీనిపై మంత్రి స్వయంగా జోక్యం చేసుకుని బిల్లులు చెల్లింపునకు సత్వరం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో అధికారులు చర్యలు ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నారు. మిల్లుల్లో ధాన్యం ఉన్నా... రబీలో కొనుగోలు చేసినట్లు అధికారులు చూపుతు న్న ధాన్యం, సీఎంఆర్ విషయం పక్కన పెడితే మిల్లుల్లో ఉన్న రైతుల ధాన్యంపై సమస్య తలెత్తింది. జిల్లాలో అనేక మంది రైతులకు చెందిన 5,400 మెట్రిక్ టన్నులు ధాన్యం మిల్లుల్లో ఉన్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రంలో వీటిని నమోదు చేసి మిల్లులకు పంపించారు. మిల్లర్లు మాత్రం వాటిని తీసుకున్నట్లు చూపడం లేదు. దీంతో ఆయా రైతులకు చెల్లించాల్సిన సుమారు రూ.8.81 కోట్లు బిల్లులు చెల్లించలేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. నిబంధనలు ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం అక్కడ సిబ్బంది నమోదు చేసి మిల్లుల కు పంపించాలి. మిల్లర్లు వాటిని తీసుకున్నట్టు ఆన్లైన్లో ఓకే చేస్తే రైతులకు బిల్లులు రెండు రోజుల్లో పడిపోతాయి. 25 మిల్లుల్లో సమస్య రబీలో కొనుగోలు చేసిన ధాన్యం జిల్లాలోని 77 మిల్లులకు తరలించారు. ఇందులో 52 మిల్లులకు తరలించిన ధాన్యం మిల్లర్లు తీసుకున్నట్టు చూపడంతో బిల్లులు కూడా రైతుల ఖాతాల్లో పడిపోయాయి. కానీ 25 మిల్లులకు తరలించిన 5,400 మెట్రిక్ టన్నుల ధాన్యం పెండింగ్లోనే ఉన్నాయి. మిల్లర్లు వాటిని తీసుకున్న చూపడంలేదు. ఆ మిల్లర్లు ఇచ్చిన బ్యాంకు గ్యారంటీ మేరకు ఇప్పటికే వారికి ధాన్యం ఇచ్చారు. వాటిని మరపట్టి ఇస్తే మిగతా ధాన్యం తీసుకునే పరిస్థితి ఉంది. అయితే, ఇప్పటికే ఆయా మిల్లర్లు 5వేల మెట్రిక్ టన్నులు ధాన్యానికి సంబంధించి బియ్యం ఇవ్వాల్సి ఉంది. కొత్తగా ఈధాన్యం తీసుకోలేని పరిస్థితి. అయితే, అదనంగా బ్యాంకు గ్యారంటీ ఇస్తే ఆమేరకు 1:4 నిష్పత్తిలో ధాన్యం తీసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఆపని కూడా మిల్లర్లు చేయడం లేదు. దీంతో ఆ మిల్లులకు చేరినా మిల్లర్లు ఓకే చేయకపోవడంతో బిల్లుల చెల్లింపు జరగని పరిస్థితి తలెత్తింది. మంత్రి దృష్టికి సమస్య ధాన్యం బిల్లుల చెల్లింపు విషయంలో అధికారులు వైఫల్యం కూడా ఉంది. బ్యాంకు గ్యారంటీ పరిశీలించకుండా మిల్లులకు అంతకుమించి ధాన్యం పంపించారు. వాస్తవానికి కొనుగోలు పక్రియ లోటుపాట్లపై జాగ్రత్త వహించాల్సిన అధికారులు.. రైతులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై భారం పడేసి చోద్యం చూశారు. దీంతో మిల్లులకు ధాన్యం చేరి అక్కడ మూడు నాలుగు నెలలుగా మూలుగుతున్నా రైతులకు మాత్రం బిల్లులు అందలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈవిషయం చివరకు జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన అధికారులను పిలిపించి మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఈ విషయంపై జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు సూచించినట్లు సమాచారం. దీంతో ఇటీవల విజెలెన్స్ ఎస్పీ జిల్లాకు వచ్చి మిల్లర్లు, అధికారులతో సమావేశం పెట్టి వెళ్లారు. మిల్లుల్లో ఉన్న 5వేల మెట్రిక్ టన్నుల ధాన్యానికి బిల్లులు చెల్లించాలంటే వాటిని స్వీకరించాలని, ఇందుకు గతంలో ఇచ్చిన ధాన్యానికి పెండింగ్లో సీఎంఆర్ ఇవ్వాలని, లేకుంటే అదనపు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని ఆదేశించారు. ఇందుకు స్పందించిన మిల్లర్లు పెండింగ్ సీఎంఆర్ వెంటనే ఇచ్చి మిల్లుల్లో ఉన్న ధాన్యం ఆన్లైన్లో ఓకే చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో సమస్య ఒక కొలిక్కి వచ్చినట్లయింది. సమస్య పరిష్కరిస్తాం.. మిల్లర్లు వద్ద ఇంకా 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నాయి. బ్యాంకు గ్యారంటీ లేక వారు ఓకే చేయలే దు. మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాల మేరకు సమన్వయ సమావేశం ఇటీవల జరిగింది. పాత కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) వేగంగా ఇచ్చి ఈ ధాన్యం తీసుకుంటామని మిల్లర్లు హామీ ఇచ్చారు. సమస్య తొందరలోనే పరిష్కారమవుతుంది. రైతుల కు ఇబ్బందులు లేకుండా చేస్తాం. – వరకుమార్, జిల్లా మేనేజరు, పౌరసరఫరాల సంస్థ -
‘తాలు’ తీస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్ : అకాల వర్షాలు.. అనుకోని రోగాలు.. ఈ విపత్కర పరిస్థితులను తట్టుకుని పంట కోతకు నానా అగచాట్లుపడి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెస్తే సవాలక్ష ఇక్కట్లు.. రైతులు తెచ్చిన ధాన్యంలో తాలు ఎక్కువుందంటూ మిల్లర్లు అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వెళ్లిన ధాన్యానికి మిల్లింగ్ కేంద్రాల వద్ద క్వింటాల్కు 5 నుంచి 6 కిలోల మేర కోతపెడుతూ రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. ఎకరంలో 25 క్వింటాళ్లు పండించే రైతు 1.50 క్వింటాళ్ల ధాన్యాన్ని కోల్పోతున్నాడు. ఇంకా, చాలాచోట్ల రంగు మారిందన్న సాకుతో గ్రేడ్–1 ధాన్యానికి సాధారణ రకం ధాన్యం ధరకడుతూ రైతులను నట్టేట ముంచుతున్నారు. మిల్లర్ల మాయాజాలం రాష్ట్రంలో ఈ ఏడాది 40 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరగ్గా, 91లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా శనివారం మధ్యాహ్నానికి 2 లక్షల మంది రైతుల నుంచి 5,400 కొనుగోలు కేంద్రాల ద్వారా 13.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. మిగతా ధాన్యం సేకరణ వేగంగా జరుగుతోంది. అయితే ధాన్యం దిగుబడి అధికంగా గల కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఈ జిల్లాల్లో యాసంగిలో మెడవిరుపు, దోమపోటు, కత్తెరరోగం వంటి తెగుళ్లు సోకి పంట దెబ్బతింది. అదీగాక 1010 మినహా 1152, 1156 వంటి విత్తన రకాలు అనుకున్నట్టుగా ఎదగలేదు. దీనికి అకాల వర్షాలు తోడయ్యాయి. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించేప్పుడే ఎండబెట్టి, తాలుతీసి తెస్తున్నారు. ఇక కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చాక తూకం సమయంలో తాలు, 17% తేమ నిబంధనలు అడ్డుపెట్టి కొనుగోలు చేస్తున్నారు. అనంతరం ధాన్యాన్ని కేంద్రం నుంచి మిల్లింగ్కు తరలించే సమయంలో అసలు దోపిడీ మొదలవుతోంది. ఇక్కడ ప్రతి 40 కిలోల బస్తాకు 2 నుంచి 3 కిలోలు అంటే క్వింటాల్కు సుమారు 5 నుంచి 6 కిలోలు మిల్లర్లు కోత పెడుతున్నారు. దీనిని ప్రశ్నిస్తే లారీలను వెనక్కి పంపుతామని హెచ్చరిస్తున్నారు. దీంతో వంద క్వింటాళ్లు తీసుకొచ్చే రైతు ఏకంగా 6 క్వింటాళ్లు నష్టపోతున్నాడు. క్వింటాలుకు కామన్ రకం ధర రూ.1,815 చెల్లించినా కనీసంగా రైతు రూ.10,890 మేర నష్టపోతున్నాడు. అన్నింటికీ కామన్ ధరే.. ప్రస్తుతం గ్రేడ్–1 ధాన్యానికి క్వింటాల్కు రూ.1,835, కామన్ రకానికి రూ.1,815 చెల్లించాలి. కానీ ఇటీవల కురిసిన వర్షాలతో గ్రేడ్–1 రకం ధాన్యం కొంత రంగుమారింది. చాలాచోట్ల టార్ఫాలిన్లు లేక ధాన్యం నల్లరంగుకు మారింది. దీన్ని సాకుగా చూపి మిల్లర్లు గ్రేడ్–1 రకాన్ని కామన్ రకం కింద చూపుతున్నారు. దీంతో ప్రతి క్వింటాల్కు రూ.20 మేర రైతు నష్టపోతున్నాడు. దీనికి తోడు లాక్డౌన్ పరిస్థితుల దృష్ట్యా హమాలీల కొరత తీవ్రంగా ఉంది. దీంతో గ్రామాల్లో అందుబాటులో ఉన్న వారు, ప్రభుత్వ గిడ్డంగుల్లో పనిచేస్తున్న వారితో హమాలీ పనిచేయిస్తున్నారు. వీరు గతంలో క్వింటాల్కు రూ.32 తీసుకోగా ఇప్పుడు రూ.3 అదనంగా కలిపి రూ.35 వసూలు చేస్తున్నారు. ఇది రైతుకు అదనపు భారమవుతోంది. ఇక కొన్నిచోట్ల గన్నీ సంచుల కొరత.. రైతులకు పరీక్ష పెడుతోంది. చదవండి: ఎత్తివేయాలా.. వద్దా..! మిల్లులను సీజ్ చేయడానికి వెనకాడం ధాన్యం కొనుగోళ్లలో తేమ, తాలు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని, ఇష్టానుసారం కోత విధించవద్దని రైస్మిల్లర్లకు స్పష్టంగా ఆదేశాలిచ్చాం. దీన్ని ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ఆ మిల్లులను సీజ్ చేయడానికైనా వెనుకాడం. మా ప్రభుత్వానికి రైతు ప్రయోజనాలే ముఖ్యం. కేంద్ర ప్రభుత్వం సకాలంలో సబ్సిడీలు ఇవ్వకపోవడం, భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) నుంచి బిల్లులు సరైన సమయంలో రాకపోవడం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతోంది. ఈ సీజన్లోనే ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వంపై దాదాపు రూ.1,000 కోట్ల వడ్డీ భారం పడుతోంది. – పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి పొల్లు ఉందని ఇబ్బంది పెడుతుండ్రు నేను ఎకరం పొలంలో వరి వేసిన. పొలమంతా రోగంబడి ఖరాబైంది. ఉన్నకాడికి వడ్లు కొనుగోలు కేంద్రానికి తెస్తే అందులో పొల్లు ఉందని ఇబ్బంది పెడుతుండ్రు. కనీసం పెట్టుబడి కూడా ఎల్లలే. వర్షం వస్తే టార్పాలిన్లు కూడా లేవు. ప్రభుత్వమే ఆదుకోవాలి. – శ్యాగ ఎల్లయ్య, బీబీపేట, కామారెడ్డి జిల్లా గన్ని సంచులు లేవని కొంటలేరు కొనుగోలు కేంద్రంలో వడ్లుపోసి పది రోజులవుతోంది. తేమ పోయిందాక ఆరబెట్టినా, గన్ని సంచులు లేవని కాంట పెట్టడం లేదు. వడ్లు పోసేందుకు పరదాలు కిరాయికి తెచ్చినం. కిరాయిలు పెరుగుతున్నయి. ధాన్యం త్వరగా కొనుగోలు చేయాలి. – ఎలవేణి సుజాత, సుల్తానాబాద్, కరీంనగర్ ఏ–గ్రేడ్ వడ్లు బీ–గ్రేడ్గా తీసుకుంటున్నరు తాలు, సంచి, మట్టి పేరుతో క్వింటాల్కు రెండు కిలోల చొప్పున తీస్తున్నరు. ఏ–గ్రేడ్ వడ్లను బీ–గ్రేడ్గా లెక్కగడుతున్నారు. దీంతో చాలా నష్టపోతున్నం. అధికారులే చొరవ తీసుకొని న్యాయం చేయాలి. – పిడుగు విమల, సుల్తానాబాద్, కరీంనగర్ -
మిల్లర్ల మాయాజాలం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ప్రభుత్వం ధాన్యం మద్దతు ధర పెంచింది. కళ్లాల్లోనే కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చింది. అందుకు తగ్గట్టుగా రవాణా చార్జీలను సైతం భరిస్తామని ప్రకటించింది. నిధులు కూడా అందుబాటులో ఉంచింది. ఇన్ని సదుపాయాలు కలి్పంచినా కొనుగోళ్లు మాత్రం అనుకున్నంత వేగంగా జరగడం లేదు. దీని వెనుక కారణాలు గమనిస్తే మిల్లర్ల మాయాజాలం కనిపిస్తోంది. ఒడిశా నుంచి ధాన్యం తీసుకొచ్చి ఇక్కడ ధాన్యంగా కొనుగోలు కేంద్రాల వద్ద నమోదు చేయిస్తున్నారు. తమ సొంత మీటర్లతో తేమ శాతం ఎక్కువ ఉందని చూపించి రైతుల నుంచి ధాన్యం తీసుకోవడం లేదు. తాము చెప్పిన ధరకు ఇస్తే కొనుగోలు చేస్తామంటూ మెలిక పెడుతున్నారు. నూకలు ఎక్కువ వస్తున్నాయని 1075 రకం ధాన్యం కొనుగోలు చేయడం లేదు. అదే ధాన్యాన్ని తక్కువ ధరకు, అదనంగా బరువుతో అదే మిల్లర్లు ప్రైవేటుగా కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం రెండు అడుగు లు ముందుకు వేస్తే.. మిల్లర్లు మూడు అడుగులు వెనక్కి లాగుతున్నారు. వాతావరణ పరిస్థితులు కూడా కాసింత భయపెట్టేలా ఉండడంతో అన్నదాతలు భయపడుతున్నారు. రైతులు పండగను సంతోషంగా జరుపుకోవాలంటే ధాన్యం కొనుగోళ్లు సత్వరం జరగాలి. మద్దతు ధర పెంచినా.. గతంలో సాధారణ వరి రకం క్వింటా రూ. 1750 ఉన్న ధరను రూ. 1815కు పెంచారు. గ్రేడ్ ఎ రకం గతంలో క్వింటా రూ. 1770ఉండగా ఇప్పుడది రూ. 1835కి పెంచారు. గతంలో కొనుగోలు కేంద్రం నుంచి మిల్లు వరకు మాత్ర మే రవాణా చార్జీలు చెల్లించేవారు. అది కూడా పూర్తిగా చెల్లించలేదు. ఐదేళ్లకు సంబంధించి రూ. 84కోట్లు చెల్లించకుండా గత ప్రభుత్వం చేతులేత్తేసింది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. పాత రవాణా బకాయిలను చెల్లించేందుకు వైఎ స్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ముందుకొచ్చింది. రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల వరకు, కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లుల వరకు రవాణా చార్జీలను కూడా ప్రభుత్వం చెల్లిస్తుందని ప్రకటించింది. రైతుల వద్దనే నేరుగా ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చింది. కొనుగోలు చేసిన ధాన్యానికి ఎప్పటికప్పుడు చెల్లింపులు చేసేందుకు నిధులు కూడా అందుబాటులో ఉంచింది. ఆశించిన స్థాయిలో కొనుగోలు జరగడం లేదు. మిల్లర్లు పాత అలవాట్లు మార్చుకోకపోవడంతో ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదు. నూక శాతం విషయంలో ప్రభుత్వం ఆంక్షలేవీ పెట్టకపోయినా మిల్లర్లు రైతులను ట్రాప్ చేసి ప్రభుత్వం ప్రక టించిన మద్దతు ధర కన్నా తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. రూ. 1100కు, 1200కు సాధారణ రకాలను ఇలా కొనుగోలు చేస్తున్నారు. మిల్లర్ల దందా.. ఓ వైపు ఇక్కడి రైతులను మోసగిస్తున్న కొందరు మిల్లర్లు మరో వైపు ఒడిశా నుంచి ధాన్యం తీసుకువచ్చి వాటినే కొనుగోలు చేసినట్టు మాయ చేస్తున్నారు. సోమవారం పోలాకి మండలంలో విజిలెన్స్ అధికారులు జరిపిన దాడుల్లో ఒడిశా నుంచి తీసుకొచ్చి నిల్వచేసిన ధాన్యం గుట్టు రట్టు అయింది. రైతుల నుం కొనుగోలు చేసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న తేమ శాతం మీటర్లతోనే కొలవాలి. కానీ కొందరు మిల్లర్లు తమకు అనుకూలమైన మీటర్లను ఏర్పాటు చేసుకుని తేమ శాతం ఎక్కువ ఉందని చూపించి అభ్యంతరాలు పెడుతున్నారు. జిల్లాలో రైస్ మిల్లుల వద్ద అధిక సంఖ్యలో ధాన్యం లోడులు కనిపిస్తున్నాయి. పిరమిడ్ల మాదిరిగా కుప్పలేసి ఉన్నాయి. ఒకవైపు రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు జరగకుండా, మరోవైపు మిల్లుల వద్ద అధిక సంఖ్యలో ధాన్యం ఉన్నాయంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. వాటిలో చాలా వరకు ఒడిశా నుంచి తీసుకొచ్చినవేనని తేటతెల్లమవుతుంది. మరోవైపు ధా న్యం కొనుగోలులో వెనుకబాటుకు సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్)బియ్యంను సివిల్ సప్లయిస్ అధికారులు తీసుకోవడం లేదని, తమ వద్ద ఉన్న ధాన్యం ఆడించడం ద్వారా బియ్యాన్ని తీసుకుంటేనే కొత్తగా పీపీసీ కేంద్రాల నుంచి ధాన్యం తీసుకోగలమంటూ సాకు చూపిస్తున్నారు. వాస్తవంగా అటు ఎఫ్సీఐ, ఇటు సివిల్ సప్లయిస్ అధికారులు ఎప్పటికప్పుడు సీఎంఆర్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకు తగ్గ గోదాములు అందుబాటులో ఉన్నాయి. కలెక్టర్ హెచ్చరిక గత కొన్ని రోజులగా జిల్లాలో మందకొడిగా జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ జె.నివాస్ ఆరా తీశారు. క్షేత్రస్థాయి నుంచి వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నారు. మిల్లర్ల సమస్యను తెలుసుకుంటూనే వారి అక్రమ బాగోతాన్ని కూడా ఆధారాలతో సేకరించారు. కొనుగోలు కేంద్రాల వద్ద తేమ శాతం మీటర్లను కాదని తమ సొంత మీటర్లతో తేమ శాతం కొలుస్తున్నారని, అందులో ఎక్కువ చూపించి రైతుల నుంచి తక్కువ ధరకు, అదనపు బరువుతో కొనుగోలు చేస్తున్నారని గుర్తించారు. అంతేకాకుండా 1075 రకంలో నూకలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి పీపీసీల వద్ద తీసుకోకుండా నేరుగా రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని గమనించారు. ఒడిశా ధాన్యాన్ని తీసుకొచ్చి పీపీసీల వద్ద మా యాజాలం చేస్తున్న విషయాన్ని ఆరా తీశారు. వీటిన్నింటిని దృష్టిలో ఉంచుకుని సోమవారం మిల్లర్లతో జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ జె.నివాస్ బహిర్గతం చేశారు. జిల్లాలో ఏం జరుగుతుందో తెలుసునని, రైతులకు అన్యాయం చేయవద్దని సీరియస్గా హెచ్చరించారు. -
రేషన్ అక్రమాలకు సర్కార్ చెక్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రేషన్ బియ్యంలో అక్రమాలు జరగకుండా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే వలంటీర్ల వ్యవస్థ ద్వారా రేషన్ డిపోల్లో జరుగుతున్న అక్రమాలను చాలావరకు నియంత్రించింది. చనిపోయిన, కార్డుల నుంచి విడిపోయిన వారి బియ్యం దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట వేసింది. ఇప్పుడేకంగా రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటోంది. రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరగకుండా, మిల్లర్ల ద్వారా మళ్లీ ప్రభుత్వం రాకుండా నడుం బిగించింది. గతంలో అటు రేషన్ డిపో డీలర్లు, ఇటు మిల్లర్ల ద్వారా పెద్ద ఎత్తున రేషన్ బియ్యం పక్కదారి పట్టేది. దీనికంతటికీ గతంలో సరైన పర్యవేక్షణ లేకపోవడం, అధికారులు, డీలర్లు, మిల్లర్లు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కవడమే ప్రధాన కారణం. అవినీతికి తావు లేకుండా ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పించారు. గత సెప్టెంబర్లో వలంటీర్ల ద్వారా సరుకులు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకా రం చుట్టారు. దీంతో గతంలో జరిగిన అక్రమాలన్నీ వరుసుగా వెలుగు చూస్తున్నాయి. గతంలో జరిగిన అక్రమాలివీ.. జిల్లాలో 18 ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా రేషన్ దుకాణాలకు 13,243 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేసేవారు. పచ్చి బియ్యం, దొడ్డు బియ్యం, నూకల శాతం ఎక్కువగా ఉండటం, నాణ్యతలేమి కారణంగా అధిక శాతం మంది లబి్ధదారులు వీటిని తినేందుకు ఇష్టపడలేదు. ఇదే అదునుగా రేషన్ మాఫియా కార్డుదారుల నుంచి ఈ బియ్యాన్ని కొనుగోలు చేసి రైస్మిల్లుల్లో పాలిష్ పట్టించి అధిక ధరకు అమ్ముకుంటూ కోట్లు దండుకునేవారు. కొందరు డీలర్లు దళారుల అవతారమెత్తి కార్డుదారుల నుంచి బియ్యాన్ని కొని రైస్మిల్లులకు అమ్ముకునేవారు. వాస్తవానికి ప్రభుత్వం ఈ బియ్యాన్ని కిలో రూ.30కిపైగా కొని, కార్డుదారులకు ఒక్క రూపాయికి అందజేసేది. ఈ బియ్యాన్నే తిరిగి రేషన్ డిపో డీలర్లు రూ.9 నుంచి రూ.10లకు కొనుగోలు చేసేవారు. ఇలా కొనుగోలు చేసిన బియ్యం మిలర్ల వద్దకు కిలో రూ.15 నుంచి రూ.20 ధరతో చేరేవి. పాలిష్ అనంతరం ఇదే బియ్యాన్ని మాఫియా కిలో రూ.50 వరకు అమ్మి సొమ్ము చేసుకునేది. ఇక మిల్లర్లయితే ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యానికి బదులు సీఎంఆర్గా ఈ రేషన్ బియ్యాన్నే తిరిగి అప్పగించే సంస్కృతి కొనసాగేది. దీనివల్ల ప్రభుత్వ నిధుల దురి్వనియోగం, డీలర్లు, మిల్లర్లకు సొమ్ము తెచ్చి పెట్టడం తప్ప ప్రయోజనం ఉండేది కాదు. వలంటీర్లతో కొంతమేర కట్టడి.. ఎప్పుడైతే ప్రస్తుత ప్రభుత్వం ఒక్కొక్క క్లస్టర్కి 50 నుంచి 60 వరకు కుటుంబాలను కేటాయించి, వాటికొక వలంటీర్ను నియమించి, వారి ద్వారా పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందో అప్పటి నుంచి గత అక్రమాలు బయట పడుతూనే ఉన్నాయి. తొలుత బోగస్ కార్డుల బాగోతం గుట్టు రట్టయింది గతంలో 8,32,636 రేషన్కార్డులుంటే ఇప్పుడవి 8,16,412కు చేరాయి. అలాగే గతంలో 13,243 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తుండగా, ఇప్పుడది 12,335మెట్రిక్ టన్నులకు చేరింది. ఈ లెక్కన 16,224 కార్డులు తగ్గి 908 మెట్రిక్ టన్నుల బియ్యం ఆదా అయింది. దాదాపు 40 వేల యూనిట్లు కూడా తగ్గాయి. ఇవి కాక నవశకం సర్వేలో వేలాది బోగస్ కార్డులను గుర్తించినట్టు సమాచారం. ఫోర్టి ఫైడ్ రైస్తో మరింత అడ్డుకట్ట రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మర ఆడేందుకు ప్రభుత్వం మిల్లర్లకు పంపిస్తోంది. ఇలా ఇచ్చిన ధాన్యంలో 67 శాతం సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) కింద ప్రభుత్వానికి మిల్లర్లు అందించాల్సి ఉంది. ఇక్కడే తేడా జరుగుతున్నది. ప్రభుత్వానికి ఇవ్వవల్సిన సీఎంఆర్లో ప్రజల నుంచి కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని మిక్స్ చేసి కొంతమంది మిల్లర్లు తిరిగి ఇచ్చేవారు. రైతుల నుంచి వచ్చిన ధాన్యాన్ని మర ఆడించి బహిరంగ మార్కెట్కు విక్రయించేవారు. ఇప్పుడా పరిస్థితికి చెక్ పెట్టేందుకు.. మిల్లర్లకు ఏ ధాన్యమైతే ఇస్తున్నారో అదే రకమైన బియ్యాన్ని మళ్లీ సీఎంఆర్ కింద ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం షరతు పెట్టింది. దానికి తోడు ఇకపై పేదలకు ఇచ్చే రేషన్ బియ్యంలో ‘బలవర్థకమైన బియ్యంతో పోలి ఉండే గింజలను కలిపిన బియ్యాన్ని’ కలపనుంది. ఇలా చేసి ఫోరి్టఫైడ్ రైస్ను ఇకపై వలంటీర్ల ద్వారా ప్రజలకు పంపిణీ చేయనుండటంతో అవే బియ్యాన్ని ఒకవేళ ప్రజల నుంచి సేకరించి, సీఎంఆర్ కింద మిల్లర్లు ఇస్తే దొరికిపోతారు. ఫోరి్టఫైడ్ రైస్ వలన మిక్సింగ్ చేశారా.. లేదా అన్నది తేలిపోనుంది. నాణ్యమైన బియ్యం ప్యాకింగ్కు నరసన్నపేట, పొందూరులలో యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడే రేషన్ బియ్యంలో ఫోరి్టఫైడ్ రైస్ మిక్సింగ్ చేయనున్నారు. అక్రమాలకు చెక్ పెట్టేందుకు అనేక చర్యలు రేషన్ బియ్యం ద్వారా జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టేందుకు అనేక రకాలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే వలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తుండగా, సీఎంఆర్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఏ రకం ధాన్యం ఇస్తే ఆ రకం పోలిన బియ్యం మిల్లర్లు ఇవ్వవలసి ఉంటుంది. అలాగే ప్యాకింగ్ యూనిట్లలో రేషన్ బియ్యంలో బలవర్థకమైన బియ్యంతో పోలి ఉండే గింజలను కలిపిన బియ్యాన్ని మిక్సింగ్ చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేసింది. – కృష్ణారావు, డీఎం, పౌరసరఫరాల సంస్థ -
తెరపైకి రికవరీ వివాదం
విజయనగరం గంటస్తంభం: ప్రభుత్వం సేకరించే ధాన్యం మరపట్టే విషయంలో మరో చిక్కు వచ్చి పడింది. భారత ఆహార సంస్థ గతంలో అధికంగా చెల్లించిన బిల్లులు రికవరీ చేయాలని ఇప్పుడు అధికారులు చూస్తున్నారు. ఈ మేరకు కొందరు మిల్లర్లకు నోటీసులు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆయా మిల్లర్లు ఈ ఏడాది ధాన్యం మరపట్టేందుకు దూరంగా ఉండాలని యోస్తున్నారు. ఖరీ ఫ్ సీజన్కు సంబంధించి సేకరించిన ధాన్యం మరపట్టే విషయంలో మిల్లర్లు ఆది నుంచి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సార్టెక్స్ మిల్లులు పెట్టలేమని, ధాన్యం కొనుగోలు జీవో ఇవ్వలేదని, మర ఛార్జీలు నిర్ణయించలేదని, రవాణా టెండర్లు ఇంకా ఫైనల్ కాలేదని... ఇలా అనేక సమస్యలు తెరపైకి తెచ్చి బ్యాంకు గ్యారంటీలు చెల్లించడంలో జాప్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి గట్టి వాదన వినిపించింది. బ్యాంకు గ్యారంటీలు ఇస్తేనే ధాన్యం ఇస్తామని, లేకుంటే వేరే జిల్లాలకు పంపించి మర పట్టించుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. మెట్టు దిగిన మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ చెల్లిస్తున్న తరుణంలో ఎఫ్సీఐ నోటీసులు కలకలం సృష్టిస్తున్నాయి. తొమ్మిదేళ్లనాటి మొత్తాల రికవరీ 2010లో మిల్లర్లు బియ్యం ఎఫ్సీఐకి ఇచ్చినపుడు మండీ(నెట్) చార్జీలు చెల్లించారు. ఆ సందర్భంలో రూ. ఐదుకోట్లు ఎఫ్సీఐ అదనంగా చెల్లించేసింది. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలంటూ జిల్లాలోని 80మంది మిల్లర్లకు ఇప్పుడు నోటీసులు జారీ చేసింది. పౌరసరఫరాల సంస్థ ఉన్నతాధికారుల ద్వారా జిల్లా అధికారులకు ఆ నోటీసులు పంపించి మిల్లర్లకు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అందుకు సివిల్సప్లయ్స్ అధికారులు అంగీకరించలేదు. అధిక చెల్లింపులు చేసింది ఎఫ్సీఐ కాబట్టి నేరుగా నోటీసులు జారీ చేసుకోవాలని చెప్పేశారు. మిల్లర్లలో రికవరీ భయం మిల్లర్లలో ఇప్పుడు రికవరీ భయం పట్టుకుంది. రాష్ట్రంలో నాణ్యమైన బియ్యం సరఫరాలో భాగంగా సార్టెక్స్ మిల్లుల్లో ఆడిన బియ్యం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మిగతా మిల్లర్లు మరాడించిన బియ్యాన్ని ఎఫ్సీఐకు ఇవ్వాలి. జిల్లాలో 192మందికి 32మంది మాత్రమే సార్టెక్సుకు మారుతుండడంతో మిగతా మిల్లర్లంతా ఎఫ్సీఐకే బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఎలాగైనా తిరిగి చెల్లించాల్సిందేనని మిల్లర్లు అనుమాన పడుతున్నారు. ఒక్కో మిల్లరు రూ.10 నుంచి రూ.80లక్షల వరకు చెల్లించాల్సి ఉండడంతో వారిలో ఆందోళన నెలకొంది. ఇప్పుడు కొత్త ధాన్యం కోసం బ్యాంకు గ్యారంటీలు చెల్లించాల్సిన తరుణవంలో రికవరీ సొమ్ము ఎల్లా చెల్లించగలమని వారు ప్రశి్నస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మిల్లింగ్కు దూరంగా ఉండాలని వారంతా యోచస్తున్నట్టు తెలుస్తోంది. దృష్టిసారించిన అధికారులు, మంత్రి.. ఈ సమస్యపై అధికారులు దృష్టిసారించారు. మిల్లర్ల నుంచి రికవరీ వ్యవహారం ఎఫ్సీఐ, మిల్లర్ల మధ్య ఉన్న సమస్య. దీనివల్ల ప్రభుత్వానికి, రైతులకు వచ్చిన నష్టం లేదు. మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ ఇవ్వకపోయినా ఇతర జిల్లాలకు ధాన్యం పంపాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఇలా చేయడం వల్ల జిల్లా మిల్లర్లు నష్టపోయే ప్రమాదం ఉంది. పైగా ఇతర జిల్లాలకు రవాణా చేయడం వల్ల ప్రభుత్వంపై ఆరి్ధకభారం పడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికప్పుడు రికవరీ చేయకున్నా ధాన్యం కొనుగోలు సీజన్ పూర్తయిన తర్వాత రికవరీ గురించి ఆలోచన చేస్తే బాగుంటుందన్న అభిప్రాయంలో అధికారులు ఉన్నారు. అంత వరకూ తాత్కాలికంగా వాయిదా వేయాలని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లారు. ఇన్నేళ్లుగా మిన్నకున్న ఉన్నతాధికారులు ఇప్పుడు రికవరీ చేయాలనుకోవడం కేవలం మిల్లర్లను ఇబ్బంది పెట్టడానికేనన్న వాదన వినిపిస్తోంది. ఉన్నతాధికారులతో మాట్లాడాం రూ.5కోట్ల రికవరీకి 80మంది అధికారులకు నోటీసులు ఇవ్వడం వాస్తవం. దీనిపై మిల్లర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు గ్యారంటీలు ఇచ్చేందుకు సంశయిస్తున్నారు. వారితో మాట్లాడాం. ఉన్నతాధికారులతో కూడా మాట్లాడాం. ధాన్యం కొనుగోలు ముఖ్యం కాబట్టి రికవరీ గురించి తర్వాత దృష్టిసారించాలని చెప్పాం. మంత్రి బొత్స సత్యనారాయణ కూడా దీనిపై మాట్లాడారు. ఎటువంటి సమస్య ఉండదు. – కె.వెంకటరమణారెడ్డి, సంయుక్త కలెక్టర్ -
సీసీఐకి మిల్లర్ల షాక్!
సాక్షి, జమ్మికుంట(హుజూరాబాద్): కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు తెలంగాణ పత్తి మిల్లర్లు షాకిచ్చారు. 2019–20 సీజన్కు సంబంధించి జిన్నింగ్, బేళ్ల తయారీకి సీసీఐ ఇటీవల టెండర్లు ఆహ్వానించగా.. రాష్ట్రం నుంచి ఎవరూ దాఖలు చేయలేదు. సీసీఐ అమలు పరుస్తున్న నిబంధనలను నిరసిస్తూ వ్యాపారులు మూకుమ్మడిగా ఈ నిర్ణయం తీసుకున్నారు. టెండర్లకు గడువు ముగియడంతో ఆ సంస్థ ఇప్పుడు పునరాలోచనలో పడింది. సీజన్ సమీపిస్తుండడంతో వ్యవహారం రాష్ట్ర మార్కెటింగ్శాఖ చెంతకు చేరినట్లు తెలుస్తోంది. మద్దతు ధరల కోసం.. తెలంగాణలో పత్తి క్రయవిక్రయాల సీజన్ అక్టోబర్లో మొదలవుతుంది. నవంబర్ నుంచి కొనుగోళ్లు ఊంపదుకుని మార్చి వరకు నడుస్తాయి. ప్రధాన మార్కెట్లలో ఏడాది పొడవునా అమ్మకాలు సాగుతాయి. యార్డులో తొలుత ప్రైవేటు వ్యాపారులే పత్తి కొంటారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో నూలు, దూది డిమాండ్ను బట్టి స్థానికంగా పత్తి ధరలు నిర్ణయిస్తారు. రైతులు తెచ్చే సరకుల్లో తేమ, పింజ పొడవుకు అనుగుణంగా తేడాలు వేస్తారు. మార్కెట్లో ధరలు పతనమైతే మద్దతు ధరల కల్పనకు సీసీఐ రంగంలోకి దిగుతుంది. సరకుల నాణ్యత పరీక్షించి నాలుగు గ్రేడ్లుగా విభజిస్తుంది. తేమశాతం 8 నుంచి 12 లోపు ఉన్న విడిపత్తినే కొంటుంది. నిబంధనల మేరకు ధరలు నిర్ణయించి రొక్కాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. మార్కెట్లో పత్తికి డిమాండ్ పెరిగితే వాణిజ్య కొనుగోళ్లూ చేపడుతుంది. ఇలా వివిధ కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన సరకులను సమీపంలోని జిన్నింగు మిల్లులకు తరలించి దూదిగా మారుస్తుంది. బేళ్ల రూపంలో దూదిని నిల్వ చేసి, సమయానుకూలంగా వ్యాపారం నిర్వహిస్తుంది. బేళ్ల ఎగుమతిలోనూ సీసీఐ పాత్ర కీలకం. టెండర్లకు దూరంగా మిల్లర్లు.. సీజన్కు ముందే సీసీఐ అధికారులు రాష్ట్రంలో పత్తి కొనుగోలు కేంద్రాలను ఎంపిక చేస్తారు. సేకరించే పత్తిని జిన్నింగు, ప్రెస్సింగు చేసి బేళ్లుగా మార్చేందుకు సమీపంలోని పత్తి మిల్లుల నుంచి ఆన్లైన్ టెండర్లు ఆహ్వానిస్తారు. నిబంధనల ప్రకారం కోట్చేసిన వ్యాపారులకు పనులు అప్పగిస్తారు. ఈ తంతు ఏటా నిర్వహిస్తారు. కాగా.. గతంలో పత్తి జిన్నింగు, ప్రెస్సింగు కలుపుకొని బేలు తయారీకి రూ.1050 చొప్పున మిల్లర్లకు చార్జీ ఇచ్చేవారు. 2013–14 సంవత్సరం నుంచి 2017–18 వరకు ఈ ధరనే వర్తింపజేశారు. 2018–19 నుంచి సీసీఐ అధికారులు కొత్త నిబంధనలను తీసుకొచ్చారు. బేలు తయారీ చార్జీని రూ.1104 దాకా పెంచారు. దీనికితోడు మిల్లర్లకు లింట్, ట్రాష్, షార్టేజీ లింకు పెట్టారు. క్వింటాలు పత్తి నుంచి తీసే లింట్ (దూది) శాతాన్ని ఒకే సీజన్లో 30.9 నుంచి 33 కిలోలకు పెంచుతూ(నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు) పోయారు. క్వింటాలు పత్తిలో షార్టేజీని 3.25 నుంచి 2.25 శాతం వరకు, దూదిలో ట్రాష్(దుమ్ము)ను 3.5 నుంచి 2.5 శాతం వరకు తగ్గిస్తూ వచ్చారు. వ్యతాస్యం ఏర్పడితే మిల్లర్లకు ఇచ్చే చార్జీల్లో కోత విధించారు. దీన్ని వ్యాపారులు వ్యతిరేకించినా రాష్ట్ర మార్కెటింగ్శాఖ జోక్యంతో అమలుపర్చారు. ఈ విధానం నష్టాలు కలిగించడంతో బేళ్ల తయారీకి మిల్లర్లు వెనకడుగు వేశారు. సీజన్లో రైతులకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని చివరికి తలొగ్గారు. ఈ క్రమంలో 2019–20 సీజన్ కోసం జూలై 26న సీసీఐ టెండర్లు పిలిచింది. దాఖలుకు ఆగస్టు 14 వరకు గడువు విధించింది. ఈ నెల 15న టెండర్లు తెరిచిన సీసీఐ అధికారులు విస్తుపోయారు. రాష్ట్రంలో 350 పత్తిమిల్లులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 45 పత్తి మిల్లులు ఉండగా.. ఒక్క టెండరు కూడా దాఖలు కాలేదు. సీసీఐ షరతులపై విముఖంగా ఉన్న వ్యాపారులు సమష్టిగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బేళ్ల తయారీకి ఇస్తున్న చార్జీని మరింత పెంచాలని, లింట్, ట్రాష్, షార్జేజీ శాతాన్ని సడలించాలనే పట్టుతో ఉన్నారు. దీనిపై పునరాలోచనలో పడిన భారత పత్తి సంస్థ ఎలా స్పందిస్తుందనేది చూడాలి. సర్కారు దరికి సమస్య.. సీసీఐకి వ్యాపారులకు మధ్య తలెత్తే వివాదాలపై రాష్ట్ర సర్కారే చొరవ చూపుతోంది. నిరుడు సమస్య ఉత్పన్నమైనప్పుడు కూడా మార్కెటింగ్శాఖ జోక్యం చేసుకుని సమస్యకు తెరదింపింది. ఈయేడు మిల్లర్లు టెండర్లకు దూరంగా ఉండడంతో ప్రభుత్వం మళ్లీ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 14 లక్షల హెక్టార్లలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2.50లక్షల హెక్టార్లలో పత్తి సాగవుతోంది. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి 18 లక్షల టన్నుల దిగుబడి రావొచ్చని అంచనా. మరో నెలన్నరలో పత్తి క్రయవిక్రయాల సీజన్ మొదలు కానుండగా.. రైతులకు సీసీఐ కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండాల్సిన అవసరం నెలకొంది. మద్దతు ధరల కల్పనకూ ఇది అనివార్యం. రాష్ట్రంలో సీసీఐ ఏటా సుమారు 150 కేంద్రాలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 కేంద్రాలను నెలకొల్పుతోంది. జిన్నింగు మిల్లుల సమస్య తీర్చకుంటే పత్తి కొనుగోళ్లకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అదే జరిగితే రైతులకు ఇబ్బందులు తప్పవు. ఇదే అదునుగా దళారులు రెచ్చిపోతారు. రైతుల శ్రమఫలాన్ని గద్దల్లా తన్నుకుపోతారు. మార్కెట్లోనూ ధరలు పతనం అవుతాయి. సీసీఐ, మిల్లర్లకు మద్య నడుస్తున్న కోల్డ్వార్ ఇప్పటికే మార్కెటింగ్శాఖ దరికి చేరింది. రేపోమాపో ఇరువర్గాలతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. -
మా డబ్బులు.. మాకివ్వండి!
సాక్షి, నల్లగొండ: రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర దక్కేలా చూసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వల్ల ప్రయోజనం లేకుండా పోతోంది. ఈ కేంద్రాల్లో తమ ధాన్యం అమ్ముకున్న అన్నదాత అరిగోస పడుతున్నాడు. అమ్ముకున్న ధాన్యం డబ్బుల కోసం నెలల తరబడి కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూడాల్సి వస్తోంది. వివిధ కారణాలతో ఏప్రిల్ నుంచి ఇప్పటి దాకా పేమెంట్లు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా ఇంకా 33,624 మంది రైతులకు డబ్బులు అందనే లేదు. దీంతో మా డబ్బులు మాకు చెల్లించండి అంటూ చివరకు రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యానికి ఈ సంస్థ నుంచే సొమ్ములు అందాల్సి ఉంది. ప్రధాన కార్యాలయం నుంచే డబ్బుల చెల్లింపులు నిలిచిపోవడంతో జిల్లా అధికారులు సైతం ఏం చేయలేక చేతులు ఎత్తేశారు. దీంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే రోడ్లపైకి వచ్చి రైతులు రాస్తారోకోలకు దిగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 235 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, వీటి ద్వారా ఇప్పటి వరకు రూ.813.43కోట్ల విలువైన 4,59,565 టన్నులు ధాన్యం కొనుగోలు చేశారు. ఆయా కేంద్రాల్లో అసౌకర్యాలను ఎదుర్కొంటూ.. అకాల వర్షాలకు ధాన్యాన్ని కాపాడుకుంటూ.. ఇలా, అన్ని గండాలు దాటుకుని అమ్ముకున్న ధాన్యానికి వెంటనే డబ్బులు అందక అన్నదాత అరిగోస పెడుతుండు. బుక్ కీపర్లు రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ట్యాబ్లో అప్లోడ్ చేసిన 48గంటల లోగా రైతు ఖాతాలో నగదు జమ కావాల్సి ఉంటుంది. కానీ, నెలలు గడుస్తున్నా.. డబ్బులు అందక రైతులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఇంకా చెల్లించాల్సిన బకాయి రూ.344 కోట్లు ఐకేపీ, పీఏసీఎస్లు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మిన రైతులకు ఇంకా రూ.344.04 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 73,582 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయగా, ఇప్పటి వరకు కేవలం 39,958 మంది రైతులకు మాత్రమే రూ.469.39 కోట్లు చెల్లించారు. ఇంకా 33,624 మంది రైతులకు డబ్బులు అందనే లేదు. దీంతో వీరంతా ఇపుడు ఇంకెప్పుడు చెల్లింపులు జరుపుతారన్న ఆందోళనలో ఉన్నారు. కనీస మద్దతు ధర లభిస్తుందని ఆశించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకున్నామని, ప్రైవేటు వ్యాపారులకు, నేరుగా మిల్లర్లకు అమ్ముకున్న రైతుల చేతిలో ఎప్పుడో డబ్బులు పడ్డాయని, తాము మాత్రం నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే... సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం నుంచే డబ్బులు రాలేదని, తమ అకౌంట్లో జమ అయిన వరకు రైతులకు బదిలీ చేశామని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. ప్రధాన కార్యాలయం నుంచి నిధులు విడుదల కానిదే తామేమీ చేయలేమని వారు అశక్తత వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు ప్రధాన కార్యాలయం నుంచి అందిన సొమ్ము కేవలం రూ.469.41 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. అంచనాలకు మించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావడంతో ఈసారి ఎక్కువగానే కొనుగోలు చేశారు. జిల్లాలోని మిల్లులకు 4,43,697 టన్నుల ధాన్యం తరలించి మిగిలిన 15,867 టన్నుల ధాన్యాన్ని సిద్ధిపేటలోని మిల్లుకు కూడా తరలించారు. రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన కార్పొరేషన్ ..డబ్బులు చెల్లించడంలో మాత్రం తాత్సారం చేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇవీ ... గణాంకాలు మొత్తం ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొనుగోలు చేసిన ధాన్యం రైతులకు చెల్లించిన మొత్తం ఇంకా చెల్లించాల్సిన డబ్బు ధాన్యం అమ్మిన రైతులు డబ్బులు అందిన రైతులు ఎదురు చూస్తున్నవారు 235 4,59,565 టన్నులు రూ.469.39 కోట్లు రూ.344.04 కోట్లు 73,582 39,958 33,62 ధాన్యం డబ్బులు రాలేదు చిట్యాల : మా కుటుంబసభ్యులకు ఉన్న పొలంలో పండించిన 262 క్వింటాళ్ల ధాన్యాన్ని గుండ్రాంపల్లి గ్రామంలోని సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఏప్రిల్ 29వ తేదీన అమ్మాను. నాకు సుమారుగా ఐదు లక్షలకు పైగా డబ్బులు రావాలి. నేటికీ రాలేదు. అధికారులు మాత్రం ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే డబ్బులు అందజేస్తామని చెప్పారు. ఇప్పుడు నెలల తరబడి రాకపోవడంతో పెట్టుబడులకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అధికారులు స్పందించి ధాన్యం డబ్బులు వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలి. – ఆకుల శంకరయ్య, రైతు. గుండ్రాంపల్లి. చిట్యాల మండలం. -
బియ్యం.. భయ్యం!
సన్నబియ్యం ధర భగ్గుమంటోంది. వర్షాభావంతో సాగు తగ్గడం.. ఉన్న కొద్దిపాటి బియ్యాన్ని మిల్లర్లు కర్ణాటకకు ఎగుమతి చేయడం.. కృత్రిమ కొరత సృష్టించడం.. వెరసి ధరపై ప్రభావం చూపుతోంది. డిమాండ్ను ఆసరాగా చేసుకుని మిల్లర్లు రేషన్ బియ్యాన్ని సన్నబియ్యంలో కల్తీ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: సన్నబియ్యం(సోనా మసూరి) ధర మళ్లీ ఆకాశాన్నంటుతోంది. నాలుగు నెలలతో పోలిస్తే ధర పెరుగుదలలో భారీ వ్యత్యాసం ఉంది. క్వింటాపై ఏకంగా రూ.400 నుంచి రూ.600 పెరిగింది. సాధారణ రకం బియ్యం క్వింటా ధర మార్కెట్లో రూ.3,900 నుంచి రూ.4,100 ఉండగా.. ప్రస్తుతం రూ.4,500లకు విక్రయిస్తున్నారు. కొత్త బియ్యం(ఈ ఖరీఫ్లో వచ్చిన దిగుబడి) క్వింటా రూ.3,600 పలుకుతోంది. అయితే కొత్త బియ్యం వంట వండితే గంజికడుతుంది. కాస్త పాతబడే వరకు తినేందుకు ఇబ్బందే. అందుకే పాతబియ్యం కొనుగోలుకే జనం మొగ్గు చూపుతారు. దీంతో గ్రేడ్–1 రకం బియ్యమైతే క్వింటా ధర రూ.4,800 వరకూ(బ్రాండ్ను బట్టి) ఉంటోంది. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకకు భారీగా బియ్యాన్ని ఎగుమతి చేస్తుండటం, మిల్లర్లు కృత్రిమ కొరత సృష్టించడం కూడా బియ్యం పెరుగుదలకు కారణాలుగా తెలుస్తోంది. రేషన్ బియ్యం కల్తీ కర్ణాటకలోని హోస్పేట్, బళ్లారి, రాయచూరు, బెంగళూరు, శివమొగ్గ ప్రాంతాలకు ‘అనంత’ నుంచి భారీగా సన్న బియ్యాన్ని ఎగుమతి అవుతోంది. మన జిల్లాలో బియ్యం ధర పెరుగుదలకు ఇదే ప్రధాన కారణం. సన్న బియ్యానికి డిమాండ్ పెరగడంతో ఇదే ఆసరాగా చేసుకుని కొందరు మిల్లర్లు రేషన్ బియ్యాన్ని రైస్ మిల్లుల్లో పాలిష్ చేసి సన్నబియ్యంలో కల్తీ చేసి కర్ణాటకకు తరలిస్తున్నారు. బియ్యం ధరను పెంచేయడం, కిలో రూపాయికి లభించే రేషన్ బియ్యాన్ని మిల్లుల్లో సన్నబియ్యంగా మార్చి అధిక ధరకు విక్రయించడం ద్వారా మిల్లర్లు భారీగా లబ్ధి పొందుతున్నారు. ఖరీఫ్లో వచ్చిన దిగుబడితో పాటు ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం మిల్లుల్లో భారీగా నిల్వ ఉంది. అయినప్పటికీ మిల్లర్లు కృత్రిమ కొరత సృష్టించి ధరల పెంచేశారని తెలుస్తోంది. విజిలెన్స్ అధికారులు గోదాములు, రైస్ మిల్లులపై దాడులు నిర్వహిస్తే అక్రమ నిల్వల బాగోతం బట్టబయలయ్యే అవకాశం ఉంది. జిల్లాలో 10.97లక్షల రేషన్కార్డులు ఉన్నాయి. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో ఉన్న కుటుంబాల సంఖ్య 9.68లక్షలు. అంటే జిల్లాలోని కుటుంబాల కంటే రేషన్కార్డుల సంఖ్యే అధికం. దీన్నిబట్టి చూస్తే బోగస్ కార్డులు రేషన్డీలర్ల చేతిలో ఏ మేరకు ఉన్నాయో తెలుస్తుంది. ఈ కార్డుల ద్వారా మిగిలే బియ్యంతో పాటు కార్డులుదారులు కొనుగోలు చేయకుండా మిగిలిన బియ్యాన్ని బ్యాక్లాగ్ చూపించకుండా మిల్లర్లకు విక్రయిస్తున్నారు. ఈ బియ్యం కల్తీకి ఉపయోగపడుతున్నాయని స్పష్టమవుతోంది. జిల్లా వ్యాప్తంగా 10 లక్షల కుటుంబాలపై ప్రభావం జిల్లాలో 9.68 లక్షల కుటుంబాలు ఉండగా.. వీరిలో అధికభాగం సన్న బియ్యం కొనుగోలు చేస్తారు. పెరిగిన ధరలు సామాన్య, మధ్య తరగతి కుటుంబాల ప్రజలపై ప్రభావం చూపనున్నాయి. అరకొరగా వచ్చే జీతాలతో పిల్లల ఫీజులు, నిత్యావసర ధరలు, ఇంటి అద్దెలు, పాలబిల్లులు లెక్కిస్తే భారీగా ఖర్చవుతుంది. ఈ క్రమంలో క్వింటాపై ఏకంగా రూ.400 నుంచి రూ.600 పెరగడమనేది కచ్చితంగా ఈ వర్గాలపై ప్రభావం చూపుతుంది. తగ్గిన వరి దిగుబడి కారణమే: గతేడాది ఖరీఫ్లో 22వేలు, రబీలో 16వేల హెక్టార్లలో వరి సాగయ్యేది. అయితే గతేడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో వరి సాగు తగ్గింది. ఖరీఫ్లో 13వేలు, రబీలో 8వేల హెక్టార్లలో మాత్రమే పంట సాగు చేశారు. హెచ్చెల్సీ ఆయకట్టు రైతులు మాత్రమే వరి సాగు చేశారు. దీంతో దిగుబడి గణనీయంగా తగ్గింది. ఖరీఫ్లో 80వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావల్సి ఉంటే, కేవలం 30వేల మెట్రిక్టన్నులు మాత్రమే వచ్చింది. రబీ పంట ఇంకా కోతకు రాలేదు. దాదాపు 50వేల మెట్రిక్ టన్నుల దిగుబడి తగ్గింది. ఇది కూడా ధర పెరుగుదలపై ప్రభావం చూపింది. -
జాగేది ?
ధాన్యం కొనుగోళ్లకు స్థలం సమస్య స్టాక్ను దించుకోకుండా చేతులెత్తేస్తున్న మిల్లర్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులు ఉచితంగా మార్కెట్ గోదాముల కేటాయింపు సాక్షి, నిజామాబాద్ : ధాన్యం కొనుగోళ్లకు కొత్త సమస్య వచ్చి పడింది. వర్షాలు కురవడం ప్రారంభం కావడంతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కడ దాచాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. కేంద్రాల నుంచి ధాన్యాన్ని వెంట వెంటనే రైస్మిల్లులకు తరలిస్తుంటే మిల్లర్లు తమ మిల్లుల్లో స్థలం లేదని ధాన్యం లారీల నుంచి స్టాక్ను దించుకోవడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం, ఈదురు గాలుల నుంచి ధాన్యాన్ని రక్షించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతుండటంతో జిల్లా అధికారయంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. జిల్లాలో అందుబాటులో ఉన్న గోదాముల కోసం అన్వేషిస్తున్నారు. ఆరు వేల మెట్రిక్ టన్నులు.. జిల్లాలో ఇప్పటి వరకు 3.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ప్రస్తుతం రోజుకు ఏడు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వస్తోంది. సీజను ప్రారంభంలో రోజుకు 13 వేల మెట్రిక్ టన్నులు వచ్చేది. కాంటాలైన ధాన్యాన్ని వెంట వెంటనే దించుకోకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లోనే నిల్వలు పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం సుమారు ఆరు నుంచి ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయాయి. వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో మిల్లులో ఆరు బయట నిల్వ చేయడానికి మిల్లర్లు జంకుతున్నారు. శని, ఆది, సోమ, మంగళవారాల్లో సాయంత్రం, రాత్రి వేళల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో మిల్లర్లు ధాన్యం దించుకోవడంలో జాప్యం చేస్తున్నారు. ఉచితంగా మార్కెట్ గోదాములు.. ఒక్కసారిగా స్థలం సమస్య ఏర్పడటంతో జిల్లా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. ధాన్యం నిల్వలను ఉంచేందుకు అవసరమైన గోదాముల కోసం అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా బోధన్లో సుమారు 1,800 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన మార్కెట్ కమిటీ గోదాముల్లో ధాన్యాన్ని నిల్వ ఉంచాలని నిర్ణయించారు. అలాగే నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఖాళీగా ఉన్న గోదాముల్లో కూడా ధాన్యం నిల్వ చేయాలని భావిస్తున్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ గోదాములను రెండు నెలల పాటు ఉచితంగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. సీడబ్ల్యూసీ అధికారులతో మాట్లాడుతున్నాం వర్షాలు ప్రారంభం కావడంతో ఏర్పడిన స్థలం సమస్య పరిష్కారం కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాము. నిజామాబాద్ దుబ్బలో ఉన్న సీడబ్ల్యూసీ గోదాములను వినియోగించుకోవాలని రైస్మిల్లులకు సూచిస్తున్నాము. ఇక్కడ 18 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములున్నాయి. అలాగే సారంగపూర్లోని సీడబ్ల్యూసీ, ఎస్డబ్ల్యూసీ గోదాముల్లో కూడా ఐదు వేల మెట్రిక్ టన్నుల చొప్పున నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉంది. వీటిని వినియోగించుకోవాలని భావిస్తున్నాము. - హరికృష్ణ, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పది రోజులు దాటుతోంది.. ధాన్యం తెచ్చి పది రోజులు దాటింది. తూకం వేసి కూడా మూడు రోజులవుతోంది. కానీ ధాన్యం తరలించడం లేదు. దీంతో 600 బస్తాలను తడవకుండా కాపాడటం కష్టంగా ఉంది. అధికారులు స్పందించి వెంటవెంటనే ధాన్యం తరలించేలా చూడాలి. - బైరి చిన్న గంగాధర్, ఇందల్వాయి -
మిల్లర్ల మాయాజాలం!
⇒ సన్న బియ్యం సరఫరాపై పౌరసరఫరాల శాఖ,కార్పొరేషన్ మధ్య కొరవడిన సమన్వయం ⇒ ఒకే జిల్లా నుంచి ఆరు జిల్లాలకు సరఫరా ⇒ ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు బియ్యం దిగుమతి ⇒ రైతులకు ఉపయోగపడని ప్రభుత్వ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: అక్రమాలను అరికట్టేందుకు పౌరసరఫరాల శాఖ ఎన్ని సంస్కరణలు తీసుకొస్తున్నా కొందరు మిల్లర్లు తమ తీరును మార్చుకోవడం లేదు. హాస్టళ్లు, మధ్యాహ్న భోజనం కోసం స్కూళ్లకు సరఫరా చేస్తున్న సన్న బియ్యం విషయంలో కొందరు మిల్లర్లు మాయాజాలం చేస్తున్నారు. మిల్లర్ల నుంచి సన్న బియ్యం సేకరించే విషయంలో పౌరసరఫరాల శాఖ, కార్పొరేషన్ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం మిల్లర్లకు వరంగా మారింది. ప్రజా పంపిణీ (పీడీఎస్) వ్యవస్థ కోసం రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పజెబుతున్న ప్రభుత్వం, ‘కస్టమ్ మిల్లింగ్ ’ద్వారా సన్నబియ్యం సమకూర్చుకుంటోంది. స్కూళ్లకు, హాస్టళ్లకు అవసరమైన సన్నబియ్యం కూడా మిల్లర్ల నుంచే కొనుగోలు చేయడానికి ఈ ఏడాది కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. రైతులకు క్వింటాలుకు కనీసం రూ.1,800 చెల్లించి ధాన్యం కొనుగోలు చేసిన మిల్లర్ల నుంచి సన్నబియ్యం కొనుగోలు చేస్తామని ప్రకటించింది. దీని వల్ల సన్నరకం ధాన్యం పండించిన రైతులకు కనీస మద్ధతు ధర (రూ.1,510) కంటే కూడా ఎక్కువగా గిట్టుబాటు అయ్యేలా చూడాలని భావించింది. కాగా, మిల్లర్లు రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయకుండానే ప్రభుత్వాన్ని మాయపుచ్చే పనిలో పడ్డారు. సన్నరకం ధాన్యం దిగుబడి ఏమాత్రం లేని సిద్దిపేట, వనపర్తి, నాగర్కర్నూలు, గద్వాల, మహబూబ్నగర్, యాదాద్రి జిల్లాలకు నల్లగొండ జిల్లా నుంచే కనీసం 5 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ ఆరు జిల్లాలకు తోడు నల్లగొండ జిల్లాలోని స్కూళ్లు, హాస్టళ్లకు కూడా ఈ జిల్లా మిల్లర్లే సరఫరా చేయాల్సి ఉంది. అయితే, గడచిన రెండేళ్ళుగా నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో సన్నరకం ధాన్యం సాగు గణనీయంగా పడిపోయింది. ఫలితంగా ఆశించిన మేర దిగుబడి కూడా లేదు. అయినా, సన్నబియ్యం సరఫరా కోసం ఈప్రాంత మిల్లర్లకు అవకాశం కలిపించడం విశేషం. నిబంధనలు గాలికి నిబంధనల ప్రకారం రైతులవద్ద ధాన్యం కొనాల్సి ఉండగా, బయటి రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న సన్న బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి అంటగడుతున్నారు. రైతుల దగ్గర ఎలాంటి ధాన్యం కొనుగోలు చేయకుండానే కొన్నట్లు చూపిస్తున్నారని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. దీనికి కొందరు కార్పొరేషన్ అధికారులు సహకరిస్తున్నారని చెబుతున్నారు. వాస్తవానికి ఆయా స్కూళ్లకు, హాస్టళ్లకు ఎంత మొత్తంలో ఏ మిల్లు బియ్యం సరఫరా చేయాలో జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్, మిల్లుల వారీగా కేటాయింపు చేసి ఆ వివరాలను పౌరసరఫరాల శాఖకు ఇవ్వాలి. వీటిని జాయింట్ కలెక్టర్, డీఎస్ఓ ఓకే చేయాలి. రైతుల వద్ద ఎంఎస్పీకి ధాన్యం కొనుగోలు చేసినట్లు రుజువులు చూపాలి. అప్పుడే క్వింటాల్కు రూ.3వేలు చెల్లించి ప్రభుత్వం మిల్లర్లవద్ద బియ్యం కొనుగోలు చేయాలన్నది నిబంధన, కాగా, ఇవేవీ అమలు కావడం లేదు. అసలు మిల్లర్ల దగ్గర మద్దతు ధర రికార్డులు కూడా సరిగా లేవని సమాచారం. మరో వైపు కొందరు మిల్లర్లు బిహార్ నుంచి సన్నబియ్యం కొనుగోలు చేసి తీసుకువస్తున్నారు. ఆ బియ్యాన్నే ప్రభుత్వానికి అంటగడుతున్నారు. బిహార్ నుంచి రైల్వే వ్యాగన్లలో మిర్యాలగూడెం చేరుకున్న సుమారు రూ.5కోట్ల విలువైన సన్న బియ్యాన్ని ఇటీవల విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. ఇక్కడి మిల్లర్లు ఏజెంట్లను సమకూర్చుకుని వారి ద్వారా కొనుగోలు చేయించి తమ మిల్లుల పేర పౌరసరఫరాల శాఖకు అధిక ధరకు విక్రయిస్తున్నారు. రెండేళ్లుగా సరైన సాగులేక సన్నరకం ధాన్యం దిగుబడే లేకున్నా, నల్లగొండ సహా మరో ఆరు జిల్లాలకు సరఫరా చేసేంత స్థాయిలో మిల్లర్లకు ఎక్కడి నుంచి సన్నబియ్యం సమకూరాయన్న ప్రశ్నకు కార్పొరేషన్ అధికారుల వద్ద సమాధానం లేదు. కాగా, బిహార్లో క్వింటాల్ బియ్యం సుమారు రూ.2వేలకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి రూ.3వేలకు విక్రయిస్తున్నారని తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్లే వీరు ఏడు జిల్లాలకు సరఫరా చేయగలుగుతున్నారని ఓ అధికారి తెలిపారు. -
కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని త్వరగా అందించండి
మిల్లర్లను కోరిన మంత్రి ఈటల సాక్షి, హైదరాబాద్: కస్టమ్ మిల్లింగ్ రైస్ను సాధ్యమైనంత త్వరగా అందించాలని మిల్లర్లను రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. 2016–17 సంవత్సరానికి 18.27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అంచనా వేయగా 15.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు, దీనిలో 15.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్కు ఇచ్చినట్లు తెలిపారు. సోమవారం రైస్ మిల్లర్స్ అసోసియేషన్తో మంత్రి ఈటల సమావేశమై చర్చించారు. హాస్టళ్లకి సరఫరా చేసే సన్నబియ్యంను రైతుల నుంచి 1.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్ల ద్వారా కొనుగోలు చేయించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో మిల్లర్లు త్వరగా కొనుగోలు చేసి బియ్యం అందించాలని కోరారు. 10 జిల్లాలు యూనిట్గా అన్ని మిల్లులకు ధాన్యం కేటాయించాలని మిల్లర్లు మంత్రిని కోరగా, ఈ సారి ముందే సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు రాకుండా చూస్తామని మంత్రి హామీనిచ్చారు. అయితే కొంతమంది దళారులు ఈ బియ్యాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, దానిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ బృందాలను మరింత బలోపేతం చేయాలని కమిషనర్ను మంత్రి ఆదేశించారు. ఏడాదికి బియ్యంపై రూ.2,395 కోట్ల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని కనుక ఈ బియ్యాన్ని అమ్ముకోవద్దని ప్రజలకు సూచించారు. ఒకవేళ ఎవరికైనా రేషన్ బియ్యం అవసరం లేకపోతే కార్డులు వెనక్కు ఇచ్చివేయాలని కోరారు. -
సన్న బియ్యం టెండర్లు ఖరారు
- శనివారం అర్ధరాత్రి వరకు జరిగిన ప్రక్రియ - స్వయంగా పరిశీలించిన కమిషనర్ సీవీ ఆనంద్ సాక్షి, హైదరాబాద్: సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి అవసరమైన సన్న బియ్యం కొనుగోలుకు టెండర్లు ఖరారయ్యాయి. ఈనెల 2వ తేదీన 15 వేల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలు కోసం టెండర్లు పిలిచారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఆ టెండర్లను మిల్లర్లు, అధికారులు, మీడియా సమక్షంలో తెరిచారు. టెండర్లలో మొత్తం 25 మంది మిల్లర్లు పాల్గొనగా, 18 మంది అర్హత సాధించారు. జాతీయ స్థాయి టెండర్లు కావటంతో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా మిల్లర్లు టెండర్లలో పాల్గొన్నారు. రూ.38.52కు ఎల్1 టెండర్ దక్కించుకోగా, ఆ మిల్లర్తో పౌరసరఫరాల శాఖ కమిషనర్ సి.వి.ఆనంద్ సంప్రదింపులు జరిపారు. అనంతరం కిలో సన్న బియ్యం సరఫరా చేయడానికి రూ.38.50 చొప్పున కొనుగోలుకు టెండర్ ఖరారు చేశారు. తప్పిన భారం.. వాస్తవానికి సన్న బియ్యం కొనుగోలుకు ఆగస్టు 6నే టెండర్లు పిలిచారు.19 మంది మిల్లర్లు ఇందులో పాల్గొనగా 14 మంది అర్హత సాధించారు. గత నెల 23న తెరిచిన టెండర్లలో రూ.42.11 ధరకు ఎల్1 వేసిన టెండర్పై సంప్రదింపుల తర్వాత రూ.39.96కు అంగీకారం కుదిరింది. కానీ ధర ఎక్కువగా ఉండటంతో అధికారులు ఆ టెండర్ను రద్దు చేశారు. దాంతో ఈ నెల 2న తిరిగి టెండర్లు ఆహ్వానించి 17వ తేదీ రాత్రి తెరిచారు. ఈ సందర్భంగా మిల్లర్లతో సంప్రదింపులు జరిపిన కమిషనర్ సి.వి.ఆనంద్ వారి వ్యాపార పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. టెండర్ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
అమ్మకానికే ప్రా‘ధాన్యం’!
ఇతర జిల్లాలకు ధాన్యం తరలించేస్తున్న మిల్లర్లు సేకరించిన ధాన్యానికి సరిపడా బియ్యం ఇవ్వని వైనం ఈ ఏడాది ఇంకా ఇవ్వాల్సిన బియ్యం 7,200 మెట్రిక్ టన్నులు పీడీఎస్ బియ్యాన్నే రీసైక్లింగ్ చేసి పౌర సరఫరాలకు అప్పగింత మిల్లుల్లో కానరాని 10,500 మెట్రిక్ టన్నుల ధాన్యం విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో మిల్లర్లు అటు రైతులకు... ఇటు అధికారులకు నిలువునా దగా చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతన్ననుంచి కొనుగోలు చేసి... ఎంచక్కా కొన్నాళ్లు నిల్వ చేసుకుని ఆనక అధిక ధరకు ఇతర ప్రాంతాలకు తరలించేసి అమ్ముకుంటున్నారు. సర్కారుకు నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన బియ్యాన్ని పీడీఎస్ నుంచే దొంగచాటుగా కొని రీసైక్లింగ్ చేసి అప్పగిస్తున్నారు. తక్కువ ధరకు డీలర్ల నుంచి కొనుగోలు చేసి వాటిని రెండు రెట్ల ధరకు తిరిగి సర్కారుకే అంటగడుతున్నారు. ఇవన్నీ తెలిసినా అధికారులు చర్యలు తీసుకునేందుకు ఎందుకో వెనుకాడుతున్నారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం మిల్లర్లకు రాజమార్గం ద్వారా తరలిపోతోంది. ఇది జిల్లాలోని ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. దాదాపు అన్ని చోట్లా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ బియ్యం రీసైక్లింగ్ చేసి మళ్లీ ప్రజాపంపిణీకే మిల్లర్లు అంటగడుతున్నారు. పల్లెల్లో కొందరు వ్యాపారులు దీనినే ఉపాధి మార్గంగా ఎంచుకున్నారు. అక్కడక్కడా వస్తున్న ఫిర్యాదుల మేరకు అధికారులు వాటిని పట్టుకుంటున్నా... కొద్ది మొత్తంలో జేసీ కోర్టులో అపరాధ రుసుం చెల్లించి మళ్లీ తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. రైతులనుంచి సేకరించిన ధాన్యాన్ని మర ఆడించి సర్కారుకు ఇవ్వాల్సిన 67శాతం బియ్యం స్థానంలో రీసైక్లింగ్ చేసిన పీడీఎస్ సరకునే అందిస్తూ లాభాలార్జిస్తున్నారు. సేకరించిన ధాన్యాన్ని మాత్రం ఇతర ప్రాంతాలకు తరలించేసి సొమ్ము చేసుకుంటున్నారు. పర్యవేక్షణకు అధికారులున్నా... ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం పౌరసరఫరాల సంస్థ అధికారులు కొనుగోలు చేసిన ధాన్యానికి సరిపడా బియ్యం ఇవ్వడంలో మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. దీనిపై జిల్లా అధికారులు 126 మంది మిల్లర్లకు నోటీసులు ఇచ్చారు. పర్యవేక్షించమని అధికారుల బందాలను పంపించారు. అయినా మిల్లర్ల తీరులో మార్పు రావట్లేదు. జిల్లాలో గతేడాది 127 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రికార్డు స్థాయిలో 3,75,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఆ ధాన్యాన్ని జిల్లాలోని 126 మిల్లులకు అందజేశారు. మిల్లర్లు అందులో 67 శాతం బియ్యంగా మరాడించి పౌరసరఫరాల సంస్థకు ఇవ్వాల్సి ఉంది. మొదట్లో రోజుకు వందలకొద్దీ టన్నుల బియ్యం అందించిన మిల్లర్లు అటు తరువాత కొంతకాలం గోడౌన్లు ఖాళీలేవన్న సాకుతో బియ్యం అందించలేదు. ఇప్పుడు అధికారులు ఒత్తిడిచేస్తే దొంగచాటుగా కొనుగోలు చేసిన పీడీఎస్ బియ్యాన్నే రిసైక్లింగ్ చేసి అప్పగించేస్తున్నారు. ఇంకా ఇవ్వాల్సిన బియ్యం 7,200 మెట్రిక్ టన్నులు పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేసి ఇచ్చిన ధాన్యానికి ఇంకా 7,200 మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లులు చెల్లించాల్సి ఉంది. అంటే 10,500 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లుల్లో ఉండాలి. కానీ చాలా మిల్లుల్లో ఒక్క ధాన్యం గింజ కూడా లేదని తెలుస్తోంది. ఆ ధాన్యం కాస్తా ఇతర ప్రాంతాలకు అధిక ధరలకు అమ్ముకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ నెల ద్వితీయార్ధానికి పదివేల మెట్రిక్ టన్నుల బియ్యం బాకీ ఉన్నారు. నోటీసులు ఇచ్చాక అన్ని మిల్లులూ కలిపి ఓ 2,500 మెట్రిక్ టన్నుల బియ్యం ఇచ్చారు. మళ్లీ కథ మామూలే. వారం రోజులే గడువు! మిల్లర్లు ప్రభుత్వానికి మరో వారం రోజుల్లో నిర్దేశించిన బియ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ వారినుంచి ఎలాంటి స్పందన కనిపించడంలేదు. జిల్లాలో 2014–45 సంవత్సరానికి సంబంధించిన సీఎంఆర్ బియ్యాన్ని(కస్టమ్ మిల్లింగ్ రైస్) కూడా ఇంకా ఇవ్వలేదని సిబ్బంది చెబుతున్నారు. జిల్లాలోని ఆరు మిల్లులు గత బియ్యం ఇవ్వకపోయినా వారికి 2015–16 సంవత్సరానికి సంబంధించిన ధాన్యం అప్పగించారు. ఇప్పుడు రెండేళ్లకు సంబంధించిన బియ్యం బాకీ ఉన్నా అధికారులు చూసీ చూడనట్టే వ్యవహరిస్తున్నారు. నిత్యం పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతోందని ఎవరినడిగినా చెబుతారు. ప్రతి మిల్లరూ ఇవ్వాలి: జె.శాంతి కుమారి, జిల్లా పౌరసరఫరాల అధికారి, విజయనగరం జిల్లాలోని 126 రైస్మిల్లులకు పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ధాన్యం ఇచ్చారు. దానికి సంబంధించి ఇంకా 7,200 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. ఈ నెలాఖరుకు బియ్యం ఇవ్వాలని ఆదేశించాం. మొత్తం అన్ని మిల్లులూ ఎంతో కొంత బాకీ ఉన్నాయి. అందరికీ నోటీసులు ఇచ్చాం. అధికారుల బందాలను నియమించాం. ఈ నెలాఖరుకు బియ్యం ఇచ్చేస్తారనే అనుకుంటున్నాం. -
ధాన్యం రాష్ట్రాంలో కోన్నట్టు నకిలి రికార్డుల స్రుష్టి
-
బొక్కేసి.. నొక్కేసి
సాక్షి ప్రతినిధి, గుంటూరు : సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) విధానం అమలులో మిల్లర్లు, పౌరసరఫరాల సంస్థ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ సొమ్మును దోచుకుంటున్నారు. ధాన్యం తీసుకున్న మిల్లర్లు మర ఆడించి 15 రోజుల్లో పౌరసరఫరాల సంస్థకు బియ్యం ఇవ్వాల్సి ఉంటే, నెలల తరబడి జాప్యం చేస్తూ ఆ బియ్యాన్ని మార్కెట్లో అమ్ముకుంటూ లాభాలు గడిస్తున్నారు. పౌరసరఫరాల సంస్థ ఇచ్చిన ధాన్యానికి 91,216 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంటే ఇంకా రూ. 42 కోట్ల విలువైన 7038 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వకుండా మిల్లర్లు ఆ సొమ్ముతో వ్యాపారం చేసుకుంటున్నారు. 8 నెలలుగా జాప్యం.. రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం కొత్తగా సీఎంఆర్ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఐకెపి కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ఆన్లైన్లో నగదు చెల్లించే ఏర్పాటు చేసింది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లు తీసుకుని తమ మిల్లులో మర ఆడించి క్వింటా ధాన్యానికి 67 శాతం బియాన్ని పౌరసరఫరాల సంస్థకు ఇవ్వాలి. మర అడించినందుకు బస్తాకు రూ.15 లను మిల్లింగ్ ఛార్జీలు ఇవ్వడానికి నిర్ణయించారు. వీటితోపాటు మిల్లరుకు తవుడు, నూక లు మిగులుతాయి. అయితే లోబరుచుకుని తీసుకున్న ధాన్యానికి అనువుగా బియ్యం ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. ఆ బియ్యంతో బయట వ్యాపారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో 450 మిల్లర్ల మర ఆడించేందుకు ప్రభుత్వం నుంచి 1,35,909 మెట్రిక్ టన్నులు ధాన్యం తీసుకున్నారు. వీరిలో కొం దరు మిల్లర్లు ఎనిమిది నెలల నుంచి బియ్యం ఇవ్వడం లేదు. 91,216 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంటే ఇప్పటి వరకు 84,178 మెట్రిక్ టన్నుల భియ్యం ఇచ్చారు. రూ.42 కోట్ల విలువైన 7,038 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. బాపట్ల, పొన్నూరు, వినుకొండ, పిడుగురాళ్లకు చెందిన మిల్లర్లు ఈ బియ్యం ఇవ్వాల్సి ఉంది. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీధర్ దృష్టికి ఈ వ్యవహారం వెళ్లడంతో బియ్యం ఇవ్వాల్సిన మిల్లర్లను హెచ్చరించారు. బాపట్లకు చెందిన ఒక మిల్లరు ఒక్కరే రూ.5 కోట్ల విలువైన బియ్యం ఇవ్వాల్సి ఉంది. ఈ మిల్లరుకు తెలుగుదేశం నేతల ఆశీస్సులు ఉండటంతో ఎటువంటి చర్యలు తీసుకోకుండా త్వరగా బియ్యం ఇవ్వాలని అడుగుతున్నారు. ఈ విషయమై పౌరసరఫరాల సంస్థ మేనేజరు రంగకుమారిని ‘సాక్షి’ ప్రతినిధి వివరణ కోరగా, ఈ నెల 25 లోపు బియ్యం ఇవ్వడానికి గడువు ఇచ్చామని, ఆ తేదీకి ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మిల్లర్లపై పెరుగుతున్న వత్తిడి.. కొందరు మిల్లర్లు చేసిన అక్రమ వ్యవహారం తమపై ప్రభావం చూపుతుందనే భయాన్ని మిగిలిన మిల్లర్లు వ్యక్తం చేస్తున్నారు. బియ్యాన్ని ఇవ్వాల్సిన మిల్లర్లు తక్షణమే వాటిని ఇవ్వకపోతే మిల్లర్లకు చెల్లించాల్సిన బకాయిలు నిలుపుదల చేస్తామంటూ అధికారులు హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడిన మిల్లర్లతో తమకు ఎలాంటి సంబంధం లేదని,ఎటువంటి చర్యలు తీసుకున్నా ఆసోసియేషన్ పట్టించుకోదని మిగిలిన మిల్లర్లు చెబుతున్నారు. -
ధాన్యం అమ్మకాలకు ‘పాసుపుస్తకం’ కొర్రీ
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పాసుపుస్తకం కొర్రీతో కనీస మద్దతు ధర కూడా రైతులు పొందలేకపోతున్నారు. మద్దతు ధర కంటే రూ.2వేలు నష్టానికే అమ్ముకుంటున్నారు. అతి తక్కువ ధరకే మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేస్తూ రైతన్నను దోపిడీ చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులు మిల్లర్లతో కుమ్మక్కవడంతోనే ఈ పరిస్థితి నెలకొందన్న ఆరోపణలున్నాయి. కొడవలూరు : రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధర కంటే ఎక్కువకే అమ్ముకునేలా చేస్తామని చెప్పి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు రైతులను కేంద్రాల దరిచేరకుండా చేస్తున్నారు. అనవసరపు కొర్రీలు పెట్టి ధాన్యం అతి తక్కువ ధరకే మిల్లర్లకు అమ్ముకునేలా చేస్తున్నారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మాలంటే పట్టాదారు పాసుపుస్తకం తప్పనిసరి చేశారు. జిల్లాలో యాభై శాతం మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు లేవు. వీరంతా కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. గత్యంతరం లేక పుట్టికి రూ.రెండు వేల నష్టానికి మిల్లర్లకే అమ్ముకుంటున్నారు. గతంలో కొనుగోలు కేంద్రంలో అమ్మాలంటే పాసుపుస్తకం లేకపోయినా అడంగల్, శిస్తు రసీదు, వీఆర్వో ధ్రువీకరణ ఉంటే సరిపోయేది. ఈసారి మాత్రం పాసుపుస్తకంతో వస్తేనే కొనుగోలు చేస్తామని కేంద్రాల్లో తేల్చి చెబుతున్నారు. అదేమని ప్రశ్నిస్తే ఉన్నతాధికారుల ఆదేశాలని చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఏ గ్రేడ్ ధాన్యం పుట్టి రూ.11,900 ఉండగా, మిల్లర్లు అదే రకాన్ని కేవలం రూ.9,800కు కొనుగోలు చేస్తున్నారు. మిల్లర్ల ధర బాగా తక్కువగా ఉండటంతో కేంద్రాల్లో అమ్ముకునేందుకే రైతులు మొగ్గుచూపుతున్నారు. అయితే పాస్బుక్ తప్పనిసరైన కారణంగా విధిలేని పరిస్థితుల్లో మిల్లర్లనే ఆశ్రయిస్తున్నారు. 90 శాతం ధాన్యం మిల్లర్ల పర జిల్లాలో తొలి పంట సమయంలో 15 లక్షల మెట్రిక్ టన్నుల దాకా ధాన్యం దిగుబడి వస్తుంది. ఈ ధాన్యమంతా కూడా నెల్లూరు జిలకర, 1010 రకాలే అయినందున ఏ గ్రేడ్ కిందే లెక్క. జిల్లాలో 53 కేంద్రాల్లో మాత్రమే ధాన్యం కొనుగోలు చేశారు. ఇప్పటికే 80 శాతం వరి కోతలు పూర్తవగా కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి దాకా కేవలం 15 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. మిగిలిన ధాన్యమంతా మిల్లర్ల పరమైంది. దీనికి ప్రధాన కారణం అనవసరపు కొర్రీలతో రైతులను కేంద్రాల దరి చేరకుండా చేయడమే. గొతాల కొరత మరోపక్క గోతాల కొరత రైతులను వెంటాడుతోంది. పాసుపుస్తకం ఉన్న రైతులు కేంద్రాలకు వచ్చినా గోతాలు లేని కారణంగా రోజుల తరబడి తిప్పుతున్నారు. అన్ని రోజులు ధాన్యాన్ని భద్రపరచుకోలేక రైతులు మిల్లర్లనే ఆశ్రయించాల్సి వస్తోంది. అధికారులు, మిల్లర్లు కుమ్మక్కు వల్లే: చాలా మంది రైతులకు పాసుపుస్తకాలు లేవు. వీరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో కొనడం లేదు. పాసుపుస్తకం తెమ్మంటున్నారు. ప్రత్యామ్నాయం ఏమీ లేదంటున్నారు. దీనికి సంబంధించి అధికారులను ప్రశ్నించగా పాస్బుక్ ఉండాల్సిందేనంటున్నారు. ఎప్పుడూలేని విధంగా ఈ సారి కొత్త నిబంధన తెర మీదకు తెచ్చారంటే మిల్లర్లతో అధికారులు కుమ్మక్కై ఉంటారు. -పెనాక నాగశ్రీనివాసులురెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి అడంగల్ తెచ్చినా తిరస్కరించారు.. పాసుపుస్తకం కోసం ధరఖాస్తు చేసిఉంటే ఇంకా రాలేదు. అడంగల్, శిస్తు రసీదులు తెచ్చి ధాన్యం కొనమని కేంద్రానికి వస్తే కుదరదని తిప్పి పంపేశారు. కేంద్రాలు కేవలం పేరుకే పెట్టారు తప్ప రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదు. -దేవరపల్లి సంతోషమ్మ, సంఘబంధం అధ్యక్షురాలు రాష్ట్రవ్యాప్తంగా ఆ నిబంధనే అమలు.. పౌరసరఫరాలశాఖ ఉన్నతాధికారులు పాసుపుస్తకం ఉంటేనే కొనుగోలు చేయాలని చెప్పారు. ఇతరత్రా ఏమి ఉన్నా తిప్పి పంపమని స్పష్టంగా తెలిపారు. రైతుల ఇబ్బందులను కూడా వారి దృష్టికి తీసుకుపోయాం. వారు రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్లో పొందుపరచిన నిబంధనల్లో పాసుపుస్తకం అనివార్యమైనందున పాస్బుక్ ఉంటేనే కొనుగోలు చేయాలని పదేపదే చెప్పారు. అందువల్ల అలాగే చేస్తున్నాం. - రుక్మిణి, డీఆర్డీఏ ఏపీఎం -
రాష్ట్రానికి ‘లెవీ’ గండం..!
⇒ 25 శాతం కొనసాగింపునకు కేంద్రం విముఖం ⇒ ఇప్పటికే పచ్చి బియ్యం సేకరణ నుంచి తప్పుకున్న ఎఫ్సీఐ ⇒ క్రమంగా ఉప్పుడు బియ్యం సేకరణ నుంచీ తప్పుకునే యోచన ⇒ ఇక ధాన్యం సేకరణ భారమంతా రాష్ట్రాలపైనే ⇒ పౌర సరఫరాలశాఖపై ఏటా అదనంగా రూ.100 కోట్ల భారం సాక్షి, హైదరాబాద్: మిల్లర్ల నుంచి బియ్యం సేకరించే లెవీ విధానాన్ని పూర్తిగా ఎత్తేస్తూ తీసుకున్న నిర్ణయంపై కేంద్రం వెనక్కితగ్గేలా లేదు. దీనిపై పునరాలోచించాలని రాష్ట్రాలు విజ్ఞప్తి చేస్తున్నా కేంద్రం స్పందించట్లేదు. వ్యవసాయ రంగంపైనే ఆధారపడి పెద్ద ఎత్తున ధాన్యాన్ని ఉత్పత్తి చేసే తెలంగాణ రాష్ట్రంపై లెవీ భారం ఎక్కువగా ఉంటుందని, ఈ దృష్ట్యా ప్రస్తుతం అమలు చేస్తున్న 25 శాతం లేవీ విధానాన్ని కొనసాగించాలంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రధాని మోదీకి స్వయంగా లేఖ రాసినా ఇంతవరకు ఏ స్పందన లేదు. దీంతో రైతులకు మద్దతు ధర లభించినా గిట్టుబాటు ధరలు దక్కే అవకాశాలు లేకుండా పోనున్నాయి. గత ఏడాది ఖరీఫ్కు ముందు వరకు 75 శాతంగా ఉన్న లెవీని 25 శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాలు కోరినా కేంద్రం వెనక్కి తగ్గలేదు. బియ్యం లెవీని 25 శాతానికి తగ్గించడం వల్ల మిల్లర్లు తమకు ఉన్న నిల్వ సామర్థ్యం మేరకు బియ్యాన్ని కొనుగోలు చేసి మిగతా మొత్తాన్ని కొనేందుకు ముందుకు రాలేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం భారీగా రావడంతో కేంద్రాల సంఖ్యను ప్రభుత్వం 1,500 వరకు పెంచడంతోపాటు మౌలిక వసతుల కల్పనకు అదనంగా రూ.100 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. 25 శాతం లెవీ ఎత్తేస్తే మరింత భారం: ప్రస్తుతమున్న 25 శాతం లెవీనీ కేంద్రం ఎత్తేస్తే రాష్ట్రంపై మరింత భారం పడే అవకాశం ఉంది. ఉత్పత్తి అయ్యే మొత్తం ధాన్యాన్ని రాష్ట్రమే సేకరించాల్సి ఉంటుంది. పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తులో ధాన్యాన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రంలో ధాన్యం సేకరణలో రైస్ మిల్లర్లకు పూర్తి స్వేచ్ఛనిస్తే చిన్నకారు రైతులు, నిల్వ సామర్థ్యం లేని వారికి మద్దతు ధర లభించినా గిట్టుబాటు ధర దక్కే అవకాశాలుండవు. లెవీ ఎత్తివేతపై కేంద్రం వెనక్కి తగ్గేది లేదని భావిస్తున్న పౌరసరఫరాలశాఖ పూర్తి బియ్యం సేకరణ లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకుంటోంది. మొత్తంగా రబీలో 15 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతుందన్న అంచనాపై ఖరీఫ్లో ఏర్పాటు చేసిన 1,581 కొనుగోలు కేంద్రాలకు మరో 500 కేంద్రాలు పెంచాలని నిర్ణయించింది. పెరిగిన కేంద్రాలకు అనుగుణంగా గోనె సంచులు, టార్పాలిన్లు, జల్లెడపట్టే యంత్రాలు, మార్కెట్ యార్డుల్లో మరిన్ని వసతులకు కలిపి ప్రభుత్వంపై అదనంగా మరో రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్ల మేర భారం పడే అవకాశం ఉంది. పూర్తిగా తప్పుకోనున్న ఎఫ్సీఐ రాష్ట్రంలో గత ఏడాది మార్చి వరకు కేవలం కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలకే పరిమితమైన ధాన్యం సేకరణ వికేంద్రీకరణను ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అన్ని జిల్లాలకు వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం గత అక్టోబర్లో నిర్ణయించింది. దీంతో పచ్చి బియ్యం సేకరణ నుంచి భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) పూర్తిగా తప్పుకున్నట్లైంది. 2012-13లో 7 లక్షల మెట్రిక్ టన్నుల మేర పచ్చి బియ్యం సేకరణ జరిపిన ఎఫ్సీఐ, 2013-14లో కేవలం 3 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించింది. 2014-15లో పచ్చి బియ్యం సేకరణ నుంచి పూర్తిగా తప్పుకొని కేవలం ఉప్పుడు బియ్యం సేకరణకే పరిమితమైంది. దీంతో రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం పచ్చి బియ్యాన్ని పౌరసరఫరాలశాఖ సేకరిస్తోంది. ఏ జిల్లాలో సేకరించిన ధాన్యాన్ని అక్కడే బియ్యంగా మార్చి ఆ జిల్లా ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సరఫరా చేస్తున్నారు. దీంతో రాష్ట్రంపై ధాన్యం సేకరణ భారం భారీగా పడింది. ఈ పరిస్థితుల్లో లెవీ పూర్తిగా ఎత్తేస్తే ఉప్పుడు బియ్యం సేకరణ నుంచి కూడా ఎఫ్సీఐ వైదొలిగే అవకాశాలున్నాయి. ఇది రాష్ట్రాలపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉత్పత్తిఅయ్యే ఉప్పుడు బియ్యాన్ని ఎవరు సేకరించాలన్నది ప్రభుత్వం ముందున్న ప్రశ్న. -
ఎవరి జేబుల్లోకి రవాణా!
వీరఘట్టం : ధాన్యం కొనుగోలు కేంద్రాల పేరుతో మాయ చేస్తున్నారు. కేంద్రాల సిబ్బందితో ట్రాన్స్పోర్టు ఆపరేటర్లు కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు కన్నం పెడుతున్నారు. మిల్లర్లు నేరుగా రైతుల వద్దకు వెళ్లి కొనుగోలు చేసిన ప్రభుత్వ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేసి లోడింగ్, రవాణా చార్జీల భారం నుంచి తప్పించుకుంటున్నారు. దాంతో ఆ భారం ప్రభుత్వంపై పడుతోంది. ధాన్యం కొనుగోలుకు కేంద్రాల్లోని సిబ్బంది సవాలక్ష నిబంధనలు అమలు చేస్తుండటంతో ధాన్యం అమ్ముడు కాక రైతుల వద్దే నిల్వ ఉండిపోతున్నాయి. ఈ పరిస్థితి అవకాశంగా తీసుకున్న మిల్లర్లు నేరుగా రైతుల కళ్లాలకు వెళ్లి నచ్చిన ధరకు కొనుగోలు చేస్తున్నారు. దీని వల్ల రైతులు సరైన ధర లభించక నష్టపోతున్నారు. ఈ ధాన్యాన్నే ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోలు చేసినట్లు అక్కడి ట్రాన్స్పోర్టు ఆపరేటర్లు సిబ్బందితో కుమ్మక్కై రికార్డుల్లో నమోదు చేయిస్తున్నారు. అక్కడ నుంచి మిల్లర్లు కొనుగోలు చేసినట్లు రికార్డులు సృష్టిస్తున్నారు. దీని వల్ల ప్రభుత్వానికి అదనపు చమురు వదులుతోంది. జిల్లాలో ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం 121 కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలో ఇప్పటి వరకు 70 కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభమైనట్లు అధికారులు చెబుతున్నారు. రైతులు తీసుకొచ్చే ధాన్యం గ్రేడింగ్ చేసి తక్కువ ధర చెల్లిస్తుండడంతో రైతులు కొనుగోలు కేంద్రానికి రావడం మానే శారు. తమ వద్దకు వస్తున్న మిల్లర్లకే నేరుగా అమ్ముకుంటున్నారు. రికార్డుల్లో మాయ నిబంధనల ప్రకారం రైతుల నుంచి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలా జరిగిన లావాదేవీలకే ప్రభుత్వం నిర్ణీత లోడింగ్, రవాణా చార్జీలు చెల్లిస్తుంది. మిల్లర్లు, వ్యాపారులు నేరుగా రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి ఇది వర్తించదు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు వీలుగా పౌరసరఫరాల శాఖ ముందుగానే ట్రాన్స్పోర్టు ఆపరేటర్లను నియమించింది. వీరు కొనుగోలు కేంద్రం నుంచి మిల్లులకు ధాన్యం రవాణా చేయాలి. కొనుగోలు కేంద్రం నుంచి 16 కి.మీ లోపు దూరానికి టన్నుకు రూ.300 ఆపరేటర్లకు చెల్లిస్తారు. 16 కి.మీ దాటి రవాణా చేస్తే కి.మీ.కు రూ3.40 చొప్పున చెల్లిస్తారు. అయితే మిల్లర్లు నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేసి ఆపరేటర్లకు రవాణా చార్జీలు చెల్లించేస్తున్నారు. హమాలీ చార్జీల పేరుతో.. అలాగే రైతులు కేంద్రానికి తెచ్చే ధాన్యాన్ని దించి తూకం వేసి తిరిగి లారీలకు లోడ్ చేసేందుకు హమాలీలకు క్వింటాకు రూ. 4.72 చొప్పు ప్రభుత్వం ఇస్తుంది. ధాన్యం కేంద్రానికి రాకపోయినా వచ్చినట్లు నమోదు చేస్తుండటం వల్ల లోడింగ్ చార్జీలు కూడా చెల్లించినట్లు నమోదు చేయాల్సి వస్తోంది. కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 2,13,088 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. దీని ప్రకారం హమాలీలకు రూ.10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ వాస్తవంగా రూ.5 లక్షలకు మించి చెల్లించాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. రైతు కళ్లాల నుంచి ధాన్యం నేరుగా మిల్లులకు వెళుతున్నందున లోడింగ్, అన్లోడింగ్ చార్జీలను కూడా మిల్లర్లు, రైతులే భరిస్తున్నారు. కేంద్రాల్లో మాత్రం హమాలీలకు చెల్లిస్తున్నట్లు నమోదు చేస్తున్నారు. ఆ సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళుతోందన్నది కేంద్రాల సిబ్బందికే తెలియాలి. మౌలిక వసతులు లేక.. మౌలిక సౌకర్యాలు లేక ఇప్పటికీ చాలా చోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. ప్రారంభమైన కేంద్రాల్లో ధాన్యాన్ని ఒక్క జైనా నిల్వ చేసేందుకు సదుపాయం కూడా లేదు. మార్కెట్ యార్డుల్లో తప్ప వేరే ప్రాంతాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని రక్షించడం పెద్ద సమస్యగా మారింది. దీంతో రికార్డుల్లో కొనుగోలు చేసినట్లు రాసుకొని మిల్లుకు నేరుగా తరలిస్తే రవాణా చార్జీలు మిగులుతుండటంతో పాటు తమకు రిస్కు ఉండదనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. -
ధాన్యం రైతు దైన్యం
⇒80 కేజీలకు రూ.900 దక్కడమే గగనం ⇒మిల్లర్లకే వంతపాడుతున్న కొనుగోలు కేంద్రాలు ⇒ఛీఛీ.. ఇవేం ధాన్యం మాకొద్దంటున్న మిల్లర్లు ⇒బతిమాలించుకొని తక్కువ ధరకు కొనుగోలు ⇒ మనస్తాపానికి గురవుతున్న అన్నదాత ⇒భయపెడుతున్న అప్పులు, పండుగ ఖర్చులు ⇒ధర వచ్చే వరకు నిరీక్షించలేని దుస్థితి పాలకొండ: భూమినే నమ్ముకొని బతుకుతున్న భూమిపుత్రుడు పండిన ఫలాన్ని అమ్ముకుందామన్నా వీలుకావడం లేదు. ఇటు కొనుగోలు కేంద్రాలు, అటు వ్యాపారులు నానారకాల సాకులు, సవాలక్ష నిబంధనలతో ధర విషయంలో రైతన్నను దోపిడీ గురిచేస్తూనే.. ఛీత్కారాలు, చీదరింపులతో మనస్తాపానికి గురి చేస్తున్నారు. ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని చేతికొచ్చిన కొద్దిపాటి ధాన్యాన్నే అమ్ముకోలేక అన్నదాత అవస్థల పాలవుతున్నాడు. చివరికి ఎంతో కొంత ధరకు ధాన్యాన్ని అమ్ముకోక తప్పని దైన్యాన్ని ఎదర్కొంటున్నాడు. జిల్లాలో ఈ ఏడాది తుపాను కారణంగా ధాన్యంలో కొంతమేర పటుత్వం తగ్గిన మాట వాస్తవమే. ఇదే అవకాశాన్ని ఇటు మిల్లర్లు, దళారులు వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నిబంధనలు వీరికి అనుకూలంగా మారాయి. అప్పులు, పండుగ ఖర్చుల కారణంగా నూర్పు చేసిన పంటను దాచుకునే పరిస్థితుల్లో లేని అన్నదాతల యథేచ్ఛగా దోచుకుంటున్నారు. మిల్లర్లందరూ సిండికేట్గా మారి 80 కేజీల ధాన్యానికి రూ. 850 నుంచి రూ.900 లోపే ధర నిర్ణయించారు. నాణ్యత సాకుతో అంతకుమించి ధర ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ధాన్యం పట్టుకొని మిల్లు వద్దకు వెళ్లిన రైతులకు ‘ఛీఛీ.. ఈ పంట మాకొద్దు...పూర్తిగా విరిగిపోతున్నాయి.. మేము కొనలేం’ అని ఛీత్కరిస్తున్నారు. దీంతో దిక్కుతోచని రైతులు మిల్లర్లు చెప్పిన ధరకే అమ్మాల్సి వస్తోంది. మిల్లర్ల మాటకే సై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు రైతులకు విచిత్ర పరిస్థితిని కల్పిస్తున్నాయి. పరీక్షలకు శ్యాంపిల్గా ధాన్యం తీసుకెళితే నాణ్యత లేవని సమాధానం చెబుతున్నారు. కేంద్రాల్లో ఉన్న సిబ్బందికి దీనిపై అవగాహన లేకపోవడంతో తప్పించుకొనే ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు. మిల్లర్లు చెప్పిన నిబంధనలనే అమలు చేస్తున్నారు. మిల్లర్లు సరే అంటేనే ధాన్యం తీసుకొనే పరిస్థితిలో కొనుగోలు కేంద్రాలు కొనసాగుతున్నాయి. తగ్గిన డిమాండ్ ఈ ఏడాది ధాన్యానికి డిమాండ్ పూర్తిగా తగ్గింది. గతంలో ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేయడంతో మిల్లర్లు కొంతమేర భయపడే వారు. లెవీకి కూడా ధాన్యం సేకరించలేమన్న ఉద్దేశంతో ధర పెంచేవారు. అయితే ఇటీవల అక్రమంగా ధాన్యం తరలిపోతున్నాయంటూ అధికారులు హడావుడి చేయడంతో ఇతర ప్రాంతాల వ్యాపారులు జిల్లాకు రావడం రాలేదు. పొరపాటున అక్కడక్కడ కొనుగోలు చేసినా అధికారులు వాహనాలను అడ్డుకొని తనిఖీల పేరుతో రెండు మూడు రోజుల పాటు పోలీస్ స్టేషన్ల వద్దే నిలిపివేస్తుండటంతో ఎందుకీ తలనొప్పి అన్న ఉద్దేశంతో బయటి వ్యాపారులు రావడం మానుకున్నారు. స్థానిక వ్యాపారులు దీన్ని తమకు అనుకూలంగా మార్చుకొని రైతులను నిలువునా దోచుకుంటున్నారు. రవాణా చార్జీల్లో మతలబు రైతులకు రవాణా చార్జీల్లోనూ ప్రభుత్వం కోత విధించింది. గత ఏడాది వరకు ఒక క్వింటాకు రూ.28 చొప్పున రైతుకు నేరుగా రవాణా చార్జీలు ఇచ్చేవారు. ఈ ఏడాది రైతుకు చెల్లించడం నిలిపివేశారు. ఇందుకోసం జిల్లాలో మూడు డివిజన్లను ముగ్గురు కాంట్రాక్టర్లకు అప్పగించారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తే అక్కడి నుంచి మిల్లుకు తరలించే బాధ్యత వీరికి అప్పగించారు. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాలనే మరిచిపోయే పరిస్థితి కల్పించారు. ఈ విధానంపై రైతు సంఘాలు, వ్యవసాయ సంఘాలు ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి. -
లెవీ కష్టాలు
ప్రొద్దుటూరు: మిల్లర్ల నుంచి లెవీ బియ్యం సేకరణ విధానంలో కేం ద్ర ప్రభుత్వం చేసిన మార్పులు మిల్లర్లకు కష్టాలు తెచ్చారుు. దీంతో గత కొంత కాలంగా చాలావరకు రైస్ మిల్లులు నెలకు నాలుగైదు రోజులు కూడా నడవడం కష్టంగా మారిం ది. ఇలాగే కొనసాగితే జిల్లాలోని రైస్మిల్లులు చాలా వరకు మూతపడతాయని యజమానులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాకు సంబంధించి సుమారుగా 70 రైస్మిల్లులు ఉండగా ఇందులో ఒక్క ప్రొద్దుటూరులోనే 30 వరకు ఉన్నారుు. మిల్లర్లు ఆడించిన బియ్యంలో 75 శాతం లెవీ, 25 శాతం మిల్లర్లు మార్కెట్లో అమ్ముకునేటట్లుగా నిబంధనలు విధించారు. చాలా కాలంగా ఇదే విధానం నడుస్తోంది. అయితే ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా నిబంధనలను మార్పు చేసింది. కేవలం 25 శాతం మాత్రమే లెవీకి బియ్యం సరఫరా చేయాలని, మిగతా 75 శాతం మార్కెట్లో అమ్ముకోవాలని నిబంధనలు విధించింది. రైతులకు కనీసం మద్దతు ధరను కల్పించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఇందుకు సంబంధించిన విధివిధానాల్లో స్పష్టత లేదని మిల్లర్లు చెబుతున్నారు. వాస్తవానికి మార్కెట్ యార్డులకు వచ్చి రైతులు ధాన్యం అమ్మే పరిస్థితి జిల్లాలో లేదనేది వారి వాదన. ఇందుకు సంబంధించిన సదుపాయాలు కూడా మార్కెట్యార్డులో లేవు. మిల్లర్లు లెవీ ఇచ్చిన తర్వాత 2:1 నిష్పత్తిలో రెండు శాతం బియ్యాన్ని రాష్ట్రంలో, ఒక శాతం బియ్యాన్ని బయటి రాష్ట్రాల్లో అమ్ముకోవాలని నిబంధనలు విధించారు. అయితే లెవీకి బియ్యం పూర్తిగా ఇచ్చిన తర్వాతనా లేక ముందా అనే విషయంపై స్పష్టత లేదని మిల్లర్లు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల కారణంగా చాలా రోజులుగా మిల్లులు మూతపడ్డాయి. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్కు సంబంధించి వరిధాన్యం ఉత్పత్తి అయినా మిల్లర్లు కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. ఏది ఏమైనా ప్రభుత్వ విధానం వల్ల నష్టపోతున్నామని యజమానులు చెబుతున్నారు. తద్వారా కూలీలకు కూడా ఉపాధి కరవు అయింది. ఈ నిబంధనలలో మార్పు చేయాలని గతంలోనే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నేడు లెవీపై జేసీ సమావేశం పౌరసరఫరాల శాఖ అధికారుల లెవీ సేకరణకు సంబంధించి 2014-15 ఖరీఫ్ సీజన్కు గాను మార్గదర్శకాలు జారీ చేశారు. మన జిల్లాకు సంబంధించి గత ఏడాది 21,645 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించగా ప్రస్తుతం నిబంధనలలో మార్పు వలన కేవలం 10,560 మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు పౌరసరఫరాల కమిషనర్ బీ.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. లెవీ సేకరణకు సంబంధించి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కడప సభాభవనంలో జిల్లాలోని రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహిస్తున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ రామారావు అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. మిల్లర్లకు అవస్థలు తప్పడం లేదు నూతన విధానం వల్ల మిల్లర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. గత ఆరు నెలలుగా మిల్లులు సక్రమంగా నడవడం లేదు. కూలీలకు కూడా ఉపాధి కరువైంది. ఈ విధానం వలన రైతులు కూడా నష్టపోతారు. ఎప్పుడు ఈ పరిస్థితి లేదు గత 25 ఏళ్లుగా మిల్లులో పనిచేస్తున్నాను. అయితే చాలా రోజులుగా మిల్లు నడవక ఉపాధి కరవవుతోంది. మిల్లులోనే పగలు ఉండి అన్నం తింటూ అవసరాలకు మిల్లర్తో డబ్బులు తీసుకుని వెళుతున్నా. -
రైతుకు శాపం
తోటపల్లిగూడూరు : అధికారులు, మిల్లర్లకు మధ్య తలెత్తిన వివాదం రైతుల పాలిట శాపంగా మారింది. లెవీకి పోనూ మిగిలిన బియ్యానికి సంబంధించి పర్మిట్లు ఇవ్వడం లేదని మిల్లర్లు కొన్నిరోజులుగా అధికారుల మీద ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాక మిల్లర్లకు చెందిన బియ్యం లారీలను భారీగా అధికారులు ఇటీవల వెంకటాచలం సమీపంలో పట్టుకుని సీజ్ చేశారు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన మిల్లర్లు ధాన్యం కొనుగోలును అర్ధంతరంగా నిలిపివేశారు. గిట్టుబాటుకాని ధర ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో వరి సాగవుతోంది. అందులో ఇప్పటికే 20 శాతం వరికోతలు పూర్తయి, నూర్పులు అనంతరం ధాన్యం మిల్లర్లకు కూడా చేరింది. ఓ వైపు 1010 రకానికి సంబంధించి పుట్టికి రూ.12వేలకు తగ్గకుండా రైతులకు చెల్లించాలని అధికారులు మిల్లర్లను ఆదేశిస్తూ వస్తున్నారు. కానీ మిల్లర్లు మాత్రం రూ.10,500లకు మించి రైతులకు ఇవ్వడం లేదు. ఈ క్రమంలో ఆరుగాలాలు కష్టించి పండించిన రైతన్నలు గిట్టుబాటు ధర లభించక లబోదిబోమంటున్నారు. ఇది ఇలా ఉంటే నాలుగు రోజులుగా అధికారులు, మిల్లర్లకు మధ్య తలెత్తిన వివాదంతో మిల్లర్లు ధాన్యం కొనుగోలును నిలిపివేశారు. దీంతో కోతలు పూర్తయి విక్రయాలకు సిద్ధంగా ఉంచిన ధాన్యం కల్లాల్లో దిక్కుమొక్కులేకుండా పడి ఉన్నాయి. అసలే వర్షాకాలం.. వానలు పడితే కల్లాల్లో ఉన్న ధాన్యపు రాసుల్లో గింజ కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. మిల్లర్లపై ఆధారపడకుండా నేరుగా రైతుల నుంచి ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి కన్పించడం లేదు. దీంతో రైతన్నలు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతం మండలంలోని పలు ప్రాంతాల్లో దాదాపు ఐదు వేల పుట్లు వరకు ధాన్యం కల్లాల్లోనే ఉన్నట్లు తెలిస్తోంది. ధాన్యం కొనుగోలు విషయంలో పాలకులు వెంటనే ఓ నిర్ణయానికి రాకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. -
మిల్లర్లకు తీపి కబురు
తాడేపల్లిగూడెం : లెవీ రూపంలో మిల్లర్ల నుంచి బియ్యం సేకరించే విషయంలో నెలకొన్న మీమాంస తొలగిపోయింది. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కేఎంఎస్) కుదింపు ఉండబోదని ఎఫ్సీఐ స్పష్టం చేసింది. సెప్టెంబర్ 30వ తేదీ వరకూ లెవీ సేకరణను యథాతథంగా జరపాలని నిర్ణయించింది. రాష్ట్ర విభజన ప్రభావం లెవీపై ఉంటుందని, కేఎం ఎస్ను కుదిస్తారని ఎఫ్సీఐ అధికారులు తొలుత భావించారు. జూన్ 30వ తేదీతో సేకరణను అర్ధాంతరంగా నిలిపివేస్తారని మిల్లర్లు భయపడ్డారు. గడువు కుదింపు లేదని ఎఫ్సీఐ ఉన్నతాధికారులు స్పష్టం చేయడంతో వారంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ విషయంపై ఎఫ్సీఐ ఏరియా మేనేజర్ కేవీ రాజును సంప్రదించగా.. గడువు కుదింపు లేద ని, గడువు పూర్తయ్యేవరకు మిల్లర్ల నుంచి బియ్యం సేకరిస్తామని చెప్పారు. రాష్ట్ర విభజన ప్రభావం ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్పై ఉండదన్నారు. జాగా బాగుంది లెవీ కింద జిల్లాలోని అన్ని డిపోల నుంచి ఎఫ్సీఐకి బియ్యం వెళుతున్నారుు. ఎఫ్సీఐ నుంచి పౌర పంపిణీ నిమిత్తం ఇతర ప్రాంతాలకు సైతం తరలిస్తున్నారు. జిల్లాలోని గోదాముల్లో జాగా కూడా బాగా ఉండటంతో పూర్తిస్థారుులో బియ్యం సేకరణకు అవకాశం ఉంది. నెలకు 6 చొప్పున స్పెషల్స్ ర్యాక్స్ను రైల్వే శాఖ కేటాయిస్తుండటంతో రవాణా సమస్య కూడా తీరింది. ఫలితంగా బియ్యం సేకరణ వేగం పుంజుకుంది. జిల్లాలో లెవీ సేకరణ లక్ష్యం 11 లక్షల 75 వేల మెట్రిక్ టన్నులు కాగా, ఇప్పటివరకు 8 లక్షల 14 వేల మెట్రిక్ టన్నులుసేకరించారు. వీటిలో 7 లక్షల 85 వేల మెట్రిక్ టన్నుల పచ్చి బియ్యం, 28 వేల 500 మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం ఉన్నాయి. -
కదిలిన యంత్రాంగం
సాక్షి, నల్లగొండ: ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు, మద్దతు ధర దక్కకపోవడం, మిల్లుల వద్ద అన్లోడ్ చేయకపోవడం వంటి సమస్యలను పరిష్కరించడానికి అధికార యంత్రాంగం కదిలింది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనివిధంగా రెవెన్యూ, రవాణా శాఖ అధికారులను రంగంలోకి దించింది. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోతున్న తీరు, మిల్లులకు త రలించినా మిల్లర్లు లారీల నుంచి దించుకోకపోవడంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనాలు చదివి చలించిన జిల్లా ఉన్నతాధికారులు సమస్యల పరిష్కారానికి రంగంలోకి దిగారు. రైతులకు, ఐకేపీ నిర్వాహకులకు న్యాయం జరిగేలా చర్యలకు ఉపక్రమించారు. జిల్లా సరఫరాల శాఖ, మార్కెటింగ్, డీఆర్డీఏ, రెవెన్యూ అధికారులతో జాయింట్ కలెక్టర్ హరిజవహర్లాల్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయకుండా ధాన్యానికి మద్దతు ధర కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జేసీ ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎటువంటి సౌకర్యాలు లేకున్నా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ధాన్యాన్ని దించుకోవడంలో ఆలస్యం, అలసత్వం పాటిస్తే మిల్లర్లపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇదీ పరిస్థితి.... జిల్లాలో రబీ సీజన్లో దాదాపు రెండు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రైతులు వరి సాగు చే శారు. ఫలితంగా 10లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖాధికారులు అంచనాలు వేశారు. ఇప్పటివరకు దాదాపు ఐదు లక్షల టన్నుల ధాన్యం మార్కెట్లోకి వచ్చిందని అధికారులు భావిస్తున్నారు. ఐకేపీ కేంద్రాలు, మార్కెట్ యార్డులు, పీఏసీఎస్ కేంద్రాలతోపాటు మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఐకేపీ కేంద్రాల నుంచి మిల్లులకు తరలించే ధాన్యాన్ని మిల్లర్లు సకాలంలో అన్లోడ్ చేసుకోవడం లేదు. దీంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పెద్ద ఎత్తున పేరుకుపోయింది. ఈ క్రమంలో మిల్లుల వద్ద సకాలంలో ధాన్యాన్ని అన్లోడ్ చేయడం, తూకం సక్రమంగా వేయడం, ట్రక్ షీట్లు వెంటనే అధికారులకు అందజేయడం, రైతులకు ఆలస్యం కాకుండా నిర్దేశిత కాలంలో డబ్బులు చెల్లించడం వంటి పనులు పకడ్బందీగా చేయడానికి జిల్లా స్థాయిలో పర్యవేక్షణ బృందాన్ని నియమించారు. రోజువారీ కొనుగోళ్లు, బిల్లుల చెల్లింపులు ఈ బృందంలోని అధికారులు పర్యవేక్షిస్తారు. చర్యలు ఇలా.... ప్రతి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఒక వీఆర్ఓను అనుసంధానం చేశారు. వీరు పైస్థాయిలో ఒక మండలానికి ఇద్దరు ఆర్ఐలను నియమించారు. మండల స్థాయిలో తహసీల్దార్లు, డివిజన్ స్థాయిలో ఆర్డీఓలు ఉంటారు. కేంద్రాల్లో రోజువారీ ధాన్యం కొనుగోలు సక్రమంగా జరిగేలా, తూకాల్లో అవకతవకలకు అవకాశం లేకుండా చేయడం, ఎప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లులకు తరలించడం వంటి బాధ్యతలు వీరు నిర్వహిస్తారు. రోజువారీగా నివేదికలు తప్పకుండా జిల్లా అధికారులకు చేరవేయాల్సి ఉంటుంది. తద్వారా రైతుకు ఎటువంటి ఇబ్బందులూ కలగవని, మద్దతు ధర కూడా లభిస్తుందని అధికార యంత్రాంగం భావిస్తోంది. అకాల వర్షాలకు పెద్దఎత్తున ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం నిల్వ ఉన్నా నీటి పాలయ్యే అవకాశం ఉంది. ఇదే జరిగితే ైరె తులు, అటు ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. దీన్ని నివారించేందుకు ధాన్యాన్ని తాత్కాలికంగా నిల్వ చేయడానికి నకిరేకల్, సూర్యాపేటలో రెండు గోదాంలను అందుబాటులోకి తె చ్చారు. నిల్వలు అధికంగా ఉన్న కేంద్రాల నుంచి ధాన్యాన్ని తీసుకెళ్లి ఈ గోదాంలలో భద్రపరుస్తారు. కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యాన్ని తరలించడానికి అవసరమయ్యే లారీల కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీన్ని అధిగమించేందుకు రవాణా శాఖాధికారులను రంగంలోకి దింపనున్నారు. మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ల సహకారంతో ప్రైవేటు వాహనాలు స్వాధీనం చేసుకుని ధాన్యం తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీన్ని అమలు చేయాలని తహసీల్దార్లకు జేసీ సూచించారు. -
తూకం మాయ
మిల్లర్ల ఎత్తులకు ఐకేపీ (ఇందిరా క్రాంతి పథం) ధాన్యం కొనుగోలు నిర్వాహకులు, రైతులు చిత్తవుతున్నారు. తూకాల్లో మిల్లర్లు పెద్దఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. ఒక్కో లోడ్ లారీలో పెద్దఎత్తున తూకంలో కోత పెట్టి అక్రమంగా జేబులు నింపుకుంటున్నారు. ఫలితంగా ఐకేపీ కేంద్రాల నిర్వాహకులకు కమీషన్ మాట దేవుడెరుగు మరింత నష్టం వాటిల్లుతోంది. సాక్షి, నల్లగొండ: ధాన్యానికి మద్దతు ధర కల్పించడం, గ్రామ సంఘాలు ఆర్థికంగా పరిపుష్టం కావడానికి ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు మొదలుపెట్టారు. ఈ క్రమంలో రైతులు రబీలో వరిని అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. అందుకు తగ్గట్లుగా ధాన్యం దిగుబడి పెద్ద ఎత్తున వస్తోంది. ధాన్యాన్ని రైతులు తమకు అందుబాటులో ఉన్న ఐకేపీ కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. ఇలా పోగైన ధాన్యాన్ని ఐకేపీ నిర్వాహకులు ఎప్పటికప్పుడు లారీల్లో మిల్లులకు తరలిస్తుంటారు. అయితే ఇలా తీసుకెళ్లిన ధాన్యాన్ని మిల్లర్లు తూకం వేసుకుని ధాన్యాన్ని దింపుకుంటారు. ఇక్కడే కిటుకు.... ఐకేపీ కేంద్రం నుంచి లారీలో వెళ్లిన ధాన్యం బరువుకు.. మిల్లుల వద్ద చేసే తూకానికి పొంతన కుదర డం లేదు. తీసుకెళ్లిన ధాన్యం కంటే.. మిల్లులకు చేరుకున్న ధాన్యంలో తరుగుదల కనిపిస్తోంది. ఒక్కో లారీ లోడ్కు దాదాపు 3 క్వింటాళ్ల ధాన్యాన్ని తక్కువగా తూకం వేస్తూ మిల్లర్లు ఐకేపీ కేంద్రాలను నిలువునా మోసం చేస్తున్నారు. ఇప్పటికే తాలు, తరుగు పేరిట మాత్రమే కోత విధిస్తున్నారని అనుకున్నాం. కానీ తూకాల్లోనూ అవకతవకలు పాల్పడుతూ అక్రమంగా జేబులు నింపుకుంటున్నారు. ఒక్కో లారీ లోడ్కు దాదాపు 3 క్వింటాళ్ల వరకు తక్కువగా తూకం వేస్తున్నారు. ఒక్కో క్వింటా ధాన్యం ధర రూ. 1345. ఈ లెక్కన మూడు క్వింటాళ్లకు కలుపుకుంటే రూ.4035లు నిర్వాహకులు నష్టపోతున్నారు. గోనె సంచులపైనా కోత... ఒక్కో గోనెసంచి బరువు ఇంచుమించు 650 గ్రాములు ఉంటుంది. ఇదే పరిమాణాన్ని మిల్లర్లు పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఒక్కో గోనెసంచి బరువు 800 గ్రాములుగా లెక్కించి తరుగు తీస్తున్నారు. ఒక్కో లారీలో 500 వరకు ధాన్యం బస్తాలు లోడ్ చేస్తారు. ఇలా ప్రతి సంచికి 150 గ్రాములు అదనంగా కోత విధించడం వల్ల కూడా ఐకేపీ నిర్వాహకులు నష్టపోతున్నారు. రోజుకు వేల బస్తా లు మిల్లుల వ ద్దకు వెళ్తుంటాయి. వీటన్నిం టినీ లెక్కిస్తే నష్టం కూడా పెద్దఎత్తునే ఉం టుంది. ఇలా అన్ని రకాలుగా ఐకేపీ నిర్వాహకులను మిల్లర్లు మోసం చేస్తున్నారు. వీటికి అడ్డుకట్ట వేయాలంటే అధికారులు దాడులు నిర్వహించాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటేనే కొనుగోళ్లు న్యాయబద్ధంగా జరుగుతాయని ఐకేపీ నిర్వాహకులు కోరుతున్నారు. -
బీపీటీ @ రూ.4200
మిర్యాలగూడ, న్యూస్లైన్ : పంటలు పుష్కలంగా పండినా బియ్యం ధరలు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయి. నెల రోజుల క్రితం సాంబమసూరి (బీపీటీ) బియ్యం ధర క్వింటాకు రూ.3800 ఉండగా ప్రస్తుతం అమాంతం రూ.4200లకు పెరిగింది. సామాన్యులు సన్నబియ్యం కొనుగోలు చేయలేని పరిస్థితులు వచ్చాయి. కృత్రిమ కొరత సృష్టించి పాత బియ్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇటీవల కురిసిన తుపాన్ వల్ల ఆంధ్రా ప్రాంతంలో పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. ఈ సాకుతో బియ్యం ధరలు పెంచి మిల్లర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఖరీఫ్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని స్టాక్ పెడుతున్న మిల్లర్లు పాత బియ్యాన్ని మాత్రమే విక్రయిస్తున్నారు. భారీగా నిల్వ.. ప్రస్తుతం ఖరీఫ్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లు భారీగా నిల్వ చేసుకుంటున్నారు. కోత మిషన్తో కోస్తున్న వరి పంట కావడం వల్ల మిల్లులో స్టీమ్ చేసి ఆరబెట్టి నిల్వ చేసుకుంటున్నారు. కానీ బియ్యం పట్టడం లేదు. దాంతో కేవలం గత ఏడాది నిల్వ చేసి బీపీటీ ధాన్యాన్ని బియ్యంగా మార్చి విక్రయిస్తున్నారు. కొత్త బియ్యం మార్కెట్లోకి వస్తే పాత బియ్యం ధరలు పూర్తిగా తగ్గిపోతాయనే ఆలోచనలో ఉన్న మిల్లర్లు సిండికేట్గా ఏర్పడి కొత్త ధాన్యాన్ని కేవలం స్టాక్ పెడుతున్నట్టు సమాచారం. ప్రస్తుత ఖరీఫ్లో జ్లిలా వ్యాప్తంగా 1.43 లక్షల హెక్టార్లలో రైతులు వరి పంటలు సాగు చేశారు. సాగులో సుమారు 90 శాతం సన్నధాన్యాన్ని (బీపీటీ) పండించారు. మిల్లర్లు ప్రస్తుతం ధాన్యాన్ని క్వింటాకు రూ.1800 చెల్లించి కొనుగోలు చేసి స్టాక్ పెడుతున్నారు. ఫిబ్రవరిలోనే కొత్త బియ్యం.. ఖరీఫ్ సీజన్ ముగిసింది. ధాన్యం రైతుల చేతికి రావడంతోపాటు మార్కెట్లకు వచ్చింది. మిల్ల ర్లు ఇప్పటికే భారీగా సాంబమసూరి ధాన్యం కొనుగోలు చేశారు. ఫిబ్రవరి వరకు కొత్త బి య్యాన్ని మార్కెట్లోకి తీసుకురాకుండా జాగ్రత్త వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. -
లెవీ ఖరారు
మిర్యాలగూడ, న్యూస్లైన్: ప్రజల అవసరాల కోసం ఎఫ్సీఐ (భారత ఆహార సంస్థ) ప్రతి ఏటా మిల్లర్ల నుంచి సేకరించే లెవీ బియ్యం లక్ష్యాన్ని ఎట్టకేలకు అధికారులు ఖరారు చేశారు. జిల్లాలో లెవీ బియ్యం సేకరణ లక్ష్యం నిర్ధారణ కాగానే మిల్లర్ల నుంచి బియ్యం సేకరణ ప్రారంభించారు. లక్ష్యం నిర్ధారణ కొంత ఆలస్యమైనా ఈ ఏడాది ఖరీఫ్లో వరి సాగు విస్తీర్ణం 1.43 లక్షల హెక్టార్లలో ఉండడం వల్ల లక్ష్యం పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. 2012-13వ సంవత్సరంలో 1.50లక్షల టన్నుల పచ్చి బియ్యం, 8.09లక్షల టన్నుల బాయిల్ట్ బియ్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ధేశించారు. పచ్చిబియ్యం నూరుశాతం లక్ష్యం పూర్తి చేసినా, బాయిల్డ్ బియ్యం మాత్రం కేవలం 5.86 లక్షల టన్నులు మాత్రమే సేకరించి లక్ష్యాన్ని పూర్తి చేయలేకపోయారు. 2013-14లో జిల్లాలో 1.94లక్షల టన్నుల పచ్చిబియ్యం, 7.94 లక్షల బాయిల్డ్ బియ్యాన్ని లెవీగా సేకరించాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. అందులో ఇప్పటివరకు 27వేల టన్నుల పచ్చిబియ్యం సేకరించారు. ప్రతి మిల్లు నుంచి 75 శాతం లెవీ జిల్లాలోని ప్రతి రైస్మిల్లు నుంచి లెవీ బియ్యాన్ని అధికారులు సేకరిస్తారు. రైతుల నుంచి మిల్లర్లు కోనుగోలు చేసిన ధాన్యంలో 75 శాతం బియ్యాన్ని ఎఫ్సీఐకి లెవీగా ఇవ్వాలి. మిల్లర్లు 75 శాతం బియ్యాన్ని ఎఫ్సీఐకి లెవీగా ఇస్తేనే మిగతా 25శాతం ఎక్కడైనా ఇతర మార్కెట్లో విక్రయించుకోవడానికి సివిల్ సప్లయిస్ అధికారులు అనుమతినిస్తారు. ఈ సీజన్లో పచ్చిబియ్యం లెవీ సేకరణను ఇప్పటికే ప్రారంభించారు. ఫైన్ ధాన్యం కొనుగోళ్లు నిల్ బీపీటీలో సూపర్ ఫైన్ ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి సివిల్ సప్లయిస్ ఆధ్వర్యంలో జిల్లాలో ఏడు కేంద్రాలు ప్రారంభించారు. సూపర్ ఫైన్ బీపీటీకి క్వింటాకు రూ.1500 చెల్లించాలని నిర్ణయించారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకెళ్లకపోవడంతో ఇప్పటివరకు ఒక క్వింటా ధాన్యం కూడా కొనుగోలు చేయలేదు. లెవీ సేకరణ ప్రారంభించాం : హరిజవహర్లాల్, జాయింట్ కలెక్టర్ లెవీ బియ్యం సేకరణను ప్రారంభించాం. ఇప్పటివరకు 27వేల టన్నుల పచ్చిబియ్యం సేకరించాం. ఈ ఏడాది జిల్లాకు నిర్ణయించిన లక్ష్యం కంటే కాస్త ఎక్కువగానే సేకరించాలని నిర్ణయించుకున్నాం. పచ్చిబియ్యం 2లక్షల టన్నులు, బాయిల్డ్ బియ్యం 8 లక్షల టన్నులు సేకరించాలని నిర్ణయించాం. -
రూటు మార్చిన కేటుగాళ్లు
చీరాల, న్యూస్లైన్: పేదలకందాల్సిన రేషన్బియ్యం డీలర్లు, మిల్లర్లు, అక్రమ వ్యాపారులకు కాసులు కురిపిస్తున్నాయి. పేదల బియ్యాన్ని వారు గద్దల్లా తన్నుకుపోతున్నారు. జిల్లాలో చీరాల కేంద్రంగా పెద్ద ఎత్తున రేషన్బియ్యం ఇతర జిల్లాలకు తరలిపోతోంది. మూడు నెలల క్రితం వరుసగా రెవెన్యూ, పోలీసు శాఖాధికారులు దాడులు చేసి అక్రమ రవాణాను అరికట్టి పలువురు వ్యాపారులు, డీలర్లపై కేసులు పెట్టారు. దీంతో మూడు నెలలుగా రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం కొంత మేర తగ్గింది. ఏమైందో ఏమో కానీ రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం రేషన్ బియ్యం అక్రమ రవాణా జోలికి వెళ్లకపోవడంతో మళ్లీ పాత వ్యాపారులంతా రంగంలోకి దిగారు. ప్రాంతాల వారీగా రేషన్ డిపోలను పంచుకొని పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నారు.చీరాల, వేటపాలెం, చినగంజాం, పర్చూరు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం తరలిపోతోంది. మోటుపల్లి గ్రామానికి చెందిన ఒక అక్రమ వ్యాపారి అధికార పార్టీ అండదండలతో వేటపాలెం, చినగంజాం మండలాల్లో డీలర్ల నుంచి బియ్యం కొనుగోలు చేసి గుంటూరు జిల్లా బాపట్లకు తరలిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఇతనికి సంబంధించిన ఒక లారీని పట్టుకొనేందుకు ఫుడ్ఇన్స్పెక్టర్ ప్రయత్నించగా అతనిపై దాడికి ప్రయత్నించి లారీని తీసుకెళ్లాడు. అధికారులను సైతం బెదిరించే స్థాయికి వెళ్లాడు. అతనిపై పలు 6ఏ కేసులు నమోదు చేసినప్పటికీ అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు ఏ అధికారీ ధైర్యం చేయడం లేదు. చీరాల రూరల్ గ్రామాల్లో మళ్లీ పాత వ్యాపారస్తులే రంగంలోకి దిగి రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. వీరిపై డజన్ల సంఖ్యలో కేసులున్నాయి. ఇప్పటికీ వీరికి చెందిన పలు వాహనాలు పోలీస్స్టేషన్లలోనే ఉన్నాయి. అయినప్పటికీ అక్రమ వ్యాపారం ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం రావడంతో పీడీ యాక్ట్ పెట్టినా వీరు వ్యాపారం మానుకోవడం లేదు. పేరాలకు చెందిన ఓ వ్యక్తి కొద్ది నెలల క్రితం ఈ అక్రమ వ్యాపారంలోకి అడుగు పెట్టి కర్లపాలెంలో ఒక భవనాన్ని కట్టాడు. అలానే మరికొందరు కొత్తగా ఈ అక్రమ వ్యాపారంలోకి అడుగు పెట్టారు. పార్శిల్ వాహనాల ద్వారా.... గతంలో లారీలు, ఆటోల ద్వారా తెల్లవారుజామున రేషన్ బియ్యాన్ని తరలించేవారు. అయితే వరుసగా రెవెన్యూ, పోలీస్ అధికారులు దాడులు చేయడంతో కొద్ది రోజుల పాటు మౌనంగా ఉన్న వ్యాపారులు ప్రస్తుతం పార్శిల్ సర్వీస్కు సంబంధించిన వాహనాల్లో వేరే బస్తాల్లోకి రేషన్ బియ్యాన్ని మార్చి తరలిస్తున్నారు. చీరాలలో పలు పార్శిల్ వాహనాల్లో రేషన్ బియ్యం గుంటూరుతో పాటు ఇతర జిల్లాలకు తరలి వెళ్తున్నాయి. అలానే స్వర్ణ, కారంచేడు, పర్చూరు మీదుగా రూటు మార్చి కొందరు బాపట్లకు చేరుస్తున్నారు. డీలర్లు కేటాయింపులు తక్కువగా వచ్చాయని కార్డుదారులకు మాయమాటలు చెప్పి వారికి బియ్యం బదులు కేజికి * 4 చొప్పున డబ్బులు ఇస్తున్నారు. వారు అక్రమ వ్యాపారులు, మిల్లర్లకు * 9 చొప్పున విక్రయిస్తున్నారు. అక్రమ వ్యాపారులు ఇతర జిల్లాలకు బియ్యాన్ని తరలించి అక్కడి మిల్లర్లకు * 12 నుంచి * 15 వరకు అమ్ముకుంటున్నారు. దాడులు నిలిపేసిన అధికారులు... మూడు నెలల క్రితం వరుసగా దాడులు చేసి అక్రమ రేషన్ వ్యాపారాన్ని కొంత మేర అరికట్టిన అధికారులు ప్రస్తుతం పెద్ద ఎత్తున రేషన్ బియ్యం తరలిపోతున్నా పట్టించుకోవడం లేదు. ఇటీవల రేషన్ షాపులపై పర్యవేక్షణ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఓ అధికారి పూర్తి స్థాయిలో రేషన్ డీలర్లు, అక్రమ వ్యాపారులకు సహకరిస్తూ దాడులు చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.