Miss Universe
-
అవమానాల నుండి అంతర్జాతీయ వేదికపై..
చిన్నతనం నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా.. కనీసం పక్కన కూర్చోడానికి కూడా ఒప్పుకోని పరిస్థితిని దాటుకుని మిస్ యూనివర్స్ ట్రాన్స్ 2024 ఐదో స్థానంలో నిలిచానని హర్షిని మేకల అన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఓ కార్యక్రమానికి మంగళవారం వచ్చిన హర్షిని మాట్లాడుతూ మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 2024 డిసెంబర్లో ఢిల్లీలో జరిగిన పోటీల్లో 24 దేశాల నుండి మోడల్స్ పాల్గొనగా మిస్ యూనివర్స్ ట్రాన్స్లో ఐదో స్థానం, మిస్ ట్రాన్స్ ఆసియా 2024, అలైట్ క్వీన్ యూనివర్స్తో మొత్తం మూడు టైటిల్స్ గెలుచుకున్నానని ఆమె పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయికి అంతర్జాతీయ వేదికపై ఇండియా తరపున తాను పోటీలో ఉండడం, వేదికపై హర్షిని మేకల అని అనౌన్స్ చేసినప్పుడు ప్రేక్షకుల నుండి కేరింతలు రావడం, ఆ కేరింతల మధ్య తనకు మిస్ యూనివర్స్ ఆసియా కిరీటం పెట్టడం ఎప్పటికీ మర్చిపోలేనని హర్షిని అన్నారు. మిస్ ట్రాన్స్ ఆసియా గెలుపొందిన తరువాత ఇప్పటివరకూ కృష్ణలంక, బైరాజులపల్లి, బాలామణి అనే మూడు సినిమాల్లో నటించానని, ఓ వెబ్సిరీస్, రెండు సీరియల్స్లోనూ నటిస్తున్నట్లు తెలిపారు. మార్చిలో మిస్ ట్రాన్స్ తెలంగాణ తెలంగాణలో మొదటిసారిగా సంచారీ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో ఐకానిక్ స్టార్స్ మిస్ ట్రాన్స్ తెలంగాణ ఫ్యాషన్ షో 2025 నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమ పోస్టర్ను మిస్ ట్రాన్స్ ఆసియా హర్షిని, మొదటి ట్రాన్స్ డాక్టర్ ప్రాచీ రాథోడ్, హైదరాబాద్ మోడల్ సీఈవో వంశీ పల్లె, నిర్వాహకుడు శ్రీనాథ్, నటుడు కామేష్ గౌడ్, నిర్మాత నవీన్ గౌడ్ మంగళవారం ఆవిష్కరించారు. విజేతలకు సర్టిఫికెట్, కిరీటం, నగదు బహుమతి, యాడ్, యూట్యూబ్లో సాంగ్ అవకాశం కల్పిస్తామన్నారు. మార్చి 1 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలకు 9010691111లో సంప్రదించొచ్చు. ఇవీ చదవండి: ఐఐఎం గ్రాడ్యుయేట్ : లైఫ్లో రిస్క్ తీసుకుంది, నెలకు రూ.4.5 కోట్లఅమ్మ కోరిక తీర్చాలనే పట్టుదలతో టాప్లో నిలిచాడు : సక్సెస్ స్టోరీ -
పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలకు ‘తల్లి’..మాజీ విశ్వ సుందరి (ఫోటోలు)
-
అందం అర్థం మారుతోంది..!
‘మిస్ యూనివర్స్’ పోటీలు ఎప్పుడూ ఆసక్తికరమే. అయితే తాజాగా మెక్సికోలో జరిగిన ‘మిస్ యూనివర్స్–2024’కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ పోటీ నేపథ్యంలో కేవలం విజేత గురించి మాత్రమే కాదు ఈ పోటీలోపాల్గొన్న ఎంతోమంది గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అందానికి సంబం«ధించిన సంప్రదాయ కొలమానాలను సవాలు చేసి వేదిక మీద నిలిచిన వారి మొదలు గృహహింస, లైంగిక హింస బాధితులుగా చీకట్లో మగ్గి ఆ చీకటి నుంచి బయటికి వచ్చి ప్రపంచ వేదికపై వెలిగిపోయిన వారు ఉన్నారు.నలభైలలో...40 ఏళ్ల వయసులో మిస్ యూనివర్స్ పోటీలోపాల్గొన్న మహిళగా బియాట్రిస్ నజోయా తన ప్రత్యేకతను చాటుకుంది. ఎన్నో అడ్డంకులను అధిగమించిన ‘మిస్ యూనివర్స్ మాల్టా’ నజోయా ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తోంది. నజోయా ముగ్గురు పిల్లలకు తల్లి. సింగిల్ మదర్.‘శారీరకంగా, మానసికంగా ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నాను. హీనమైన పరిస్థితులను చూశాను. మనకు తప్ప మన సంతోషానికి తెర వేసే శక్తి ఎవరికీ లేదని నిరూపించాలనుకున్నాను. ఆత్మగౌరవంతో ముందుకు వెళ్లాను. మనం బయటికి ఎలా కనిపించినా లోపల అందంగా ఉంటాం. ఆ అందాన్ని చూడగలగాలి’ అంటుంది నజోయా. ‘నిజానికి ఆమె ఎప్పటికీ విజేత. కంటికి కనిపించని కిరీటం ఆమె తలపై కనిపిస్తుంది’ అంటారు నజోయా అభిమానులు. ఎత్తు ఎంతైనా... అంతెత్తున!ష్యానే మెకింతోష్ అందాల పోటీలో పోటీపడిన వారిలో ఎత్తు తక్కువగా ఉన్న కంటెస్టెంట్గా చరిత్ర సృష్టించింది. ఆమె ఎత్తు 5 అడుగుల 1 అంగుళం. ‘మిస్ యూనివర్స్ జిబ్రాల్టర్’ ఫైనల్లో మెకింతోష్ ఇచ్చిన సమాధానం న్యాయ నిర్ణేతల హృదయాలను గెలుచుకుంది. ‘నేను చిన్నగా కనిపించవచ్చు... కానీ ఆత్మవిశ్వాసంతో అంతెత్తున కనిపిస్తాను’ ‘మిస్ యూనివర్స్ జిబ్రాల్టర్ 2024’ అందాల కిరీటాన్ని గెల్చుకున్న విజేతగా అందరి దృష్టిని ఆకర్షించింది ష్యానే మెకింతోష్. 34 ఏళ్ల తరువాత ‘మిస్ యూనివర్స్’ పోటీలో జిబ్రాల్టర్కుప్రాతినిధ్యం వహించిన తొలి మహిళగా రికార్డ్ సృష్టించింది. హిజాబ్తో...‘మిస్ యూనివర్స్’ పోటీలోపాల్గొన్న తొలి హిజాబీ (ముస్లిం సంప్రదాయ వస్త్రం హిజాబ్తో) మహిళగా ఖదీజా ఒమర్ చరిత్ర సృష్టించింది. 23 సంవత్సరాల ఖదీజా సోమాలియ నుంచి ‘మిస్ యూనివర్స్’ పోటీలోపాల్గొన్న తొలి మహిళ.కెన్యాలోని శరణార్థి శిబిరంలో జన్మించింది. యార్క్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేట్ అయిన ఖదీజా కమ్యూనిటీ బిల్డింగ్, బ్రాండ్ డెవలప్మెంట్లోప్రావీణ్యం సాధించింది. బ్యూటీ ఇన్ఫ్లూయెన్సర్, మోడల్, ఫొటోగ్రాఫర్గా రాణిస్తోంది. స్ఫూర్తిదాయకమైన కథలను చెప్పడంలో నేర్పరి. ‘మిస్ వరల్డ్ 2021’ కిరీటాన్ని గెలుచుకున్న మొదటి హిజాబీగా చరిత్ర సృష్టించింది. బార్బీ బొమ్మకు అందాల కిరీటం!‘ఈసారి విశ్వసుందరి కిరీటాన్ని బార్బీ బొమ్మ గెలుచుకుంది’ అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ‘బార్బీ బొమ్మకు అందాల కిరీటం ఏమిటీ?!’ అనే ఆశ్చర్యంలో ఉండగానే అసలు విషయం తెలిసిపోయింది. ‘మిస్ యూనివర్స్–2024’ అందాల కిరీటాన్ని గెలుచుకున్న 21 సంవత్సరాల విక్టోరియా కెజార్ ముద్దు పేరు... బార్బీ డాల్. కెజార్ అచ్చం ‘బార్బీ’లా ఉంటుందని ఆలా పిలుస్తారు. బ్యూటీ స్పాట్...ఈసారి విశ్వసుందరి పోటీ విజేత కంటే ఎక్కువమంది దృష్టిని ఆకర్షించింది ఈజిప్ట్కు చెందిన లోగినా సలాహ్. చర్మంపై తెల్లటి మచ్చలు (బొల్లి) వల్ల ఎనిమిది సంవత్సరాల వయసు నుంచే ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కొంది. సలాహ్ మిస్ యూనివర్స్ పోటీలోకి అడుగుపెట్టడం అనేది ఊహకు కూడా అందని విషయం. సంప్రదాయ సౌందర్య ప్రమాణాలను బ్రేక్ చేసిన వ్యక్తిగా ఎందరికో స్ఫూర్తినిచ్చే చారిత్రక సందర్భం కూడా. బ్లాగర్, ఇన్ఫ్లూయెన్సర్, మోడల్, మేకప్–ఆర్టిస్ట్గా రాణిస్తున్న సలాహ్కు సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు.‘స్కిన్పాజిటివిటీ’ని ప్రచార అంశంగా తన ప్రయాణాన్నిప్రారంభించి ఎంతోమంది యువతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది సలాహ్. సలాహ్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమన్ మాత్రమే కాదు సానుకూల మార్పు, ఆత్మవిశ్వాసం... మొదలైన అంశాలలో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి గొప్ప వక్తగా పేరు తెచ్చుకుంది. న్యూయార్క్లోని బెవర్లీ హిల్స్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్ నుంచి లైసెన్స్ పొందిన సలాహ్ తన సోషల్ మీడియా ΄్లాట్ఫామ్లలో క్రియేటివ్ లుక్స్పై ట్యుటోరియల్స్ను నిర్వహించేది. 2023లో దుబాయ్ ఫ్యాషన్ వీక్లోపాల్గొనడం ద్వారా గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.‘బియాండ్ ది సర్ఫేస్ మూమెంట్’ వేదిక ద్వారా బాలికలు, యువతులలో సామాజిక స్పృహ కలిగిస్తోంది. దుబాయ్లో నివసిస్తున్న 34 సంవత్సరాల సలాహ్ ఒక బిడ్డకు తల్లి. సింగిల్ మదర్.‘మిస్ యూనివర్స్ 2024’లో లోగినా సలాహ్ టాప్ 30లో చోటు సాధించింది. బంగారు పక్షి‘మిస్ యూనివర్స్’ కిరీటం మిస్ అయిపోయినా ‘గోల్డెన్ బర్డ్’ కాస్ట్యూమ్తో ఎంతోమంది హృదయాలను గెల్చుకుంది రియా సింఘా. ‘మిస్ యూనివర్స్’కు మన దేశం నుంచిప్రాతినిధ్యం వహించిన రియా సింఘా ధరించిన ‘ది గోల్టెన్ బర్డ్’ దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఏడాదిప్రారంభంలో ‘మిస్ యూనివర్స్ ఇండియా’ కిరీటాన్ని గెల్చుకున్న సింఘా సింబాలిక్ దుస్తుల్లో రన్వేపై నడుస్తూ ప్రేక్షకులను మంత్రముగ్థుల్ని చేసింది. శ్రేయస్సు, సంపదకు బంగారు పక్షి చిహ్నం. ఈ డ్రెస్ను వియత్నాం డిజైనర్ గుయెన్ ఎన్లోక్ డిజైన్ చేశారు. -
మన విశ్వ సుందరీమణులు వీరే.. ముగ్గురు మహిళా మణులు(ఫొటోలు)
-
Miss Universe 2024: 'విశ్వ సుందరి'గా డెన్మార్క్ బ్యూటీ
ప్రతిష్టాత్మక 73వ మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో డెన్మార్క్కు చెందిన 21 ఏళ్ల యువతి గెలుపొందారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఈ అందాల పోటీల్లో విశ్వ సుందరిగా డెన్మార్క్కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ గెలుపొంది కిరీటాన్ని దక్కించుకున్నారు.మెక్సికో వేదికగా జరిగిన ఈ పోటీలలో 125 దేశాలకు చెందిన యువతులు పోటీ పడ్డారు. అయితే, 21 ఏళ్ల 'విక్టోరియా కెజార్' విజేతగా నిలిచారు. మొదటి రన్నరప్గా నైజీరియాకు చెందిన చిడిమ్మ అడెట్షినా, రెండో రన్నరప్గా మెక్సికోకు చెందిన మరియా ఫెర్నాండా బెల్ట్రాన్ నిలిచారు. ఈ అందాల పోటీలో టాప్ 5 ఫైనలిస్ట్లలో థాయిలాండ్కు చెందిన ఒపాల్ సుచతా చువాంగ్స్రీ, వెనిజులాకు చెందిన ఇలియానా మార్క్వెజ్ కూడా ఉన్నారు. 2023 మిస్ యూనివర్స్ విన్నర్ 'షెన్నిస్ పలాసియోస్' విజేతకు కిరీటాన్ని అందించారు. 'కొత్త శకం ప్రారంభమవుతుంది..! మా 73వ మిస్ యూనివర్స్ అయిన డెన్మార్క్ బ్యూటీకి అభినందనలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు స్ఫూర్తి నింపేలా మీ ప్రయాణం ఉండాలని ఆశిస్తున్నాం.' అని మిస్ యూనివర్స్ టీమ్ తెలిపింది. ఈ పోటీల్లో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించిన రియా సింఘా టాప్ 5 వరకు కూడా చేరుకోలేకపోయారు. -
Miss Universe Korea : జస్ట్ 80!
సియోల్: పేరు: చోయి సూన్ హ్వా, వయస్సు:80. ఇటీవలే మిస్ యూనివర్స్ కొరియాఫైనలిస్ట్ల్లో ఒకరిగా నిలిచిరికార్డు బద్దలు కొట్టారు. త్వరలో జరగబోయే మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొని, వయోధికురాలిగా చరిత్ర సృష్టించబోతున్నారు. మిస్ యూనివర్స్ పోటీలు ప్రారంభమవ్వడానికి దశాబ్ధం ముందు 1952లో ఈమె జన్మించారు. ఈ నెలారంభంలో మిస్ యూనివర్స్ కొరియా పోటీలో ఫైనలిస్ట్గా నిలిచారు. సోమవారం మరో 31 మంది పోటీదారులతో ‘మిస్ యూనివర్స్ కొరియా’కిరీటం కోసం పోటీ పడనున్నారు. ఇందులో విజేతగా నిలిస్తే నవంబర్లో మెక్సికోలో జరిగే మిస్ యూనివర్స్ ఫైనల్స్లో దక్షిణ కొరియాకు ప్రాతినిథ్యం వహించే ఛాన్స్ కొట్టేయనున్నారు. ‘80 ఏళ్ల మహిళ ఇంత ఆరోగ్యంగా ఎలా ఉండగలిగారు? శరీర సౌష్టవాన్ని ఎలా నిలుపుకోగలిగారు? ఏ ఆహారం తీసుకుంటున్నారు? అని ఈ ప్రపంచాన్ని ఆశ్చర్యపరచాలనుకుంటున్నా’అని ఆమె సీఎన్ఎన్తో అన్నారు. హాస్పిటల్లో చిన్న ఉద్యోగం చేసి రిటైరైన చోయి..ఆర్థిక ఇబ్బందుల కారణంగా మళ్లీ ఆ ఉద్యోగంలో చేరారు. మోడలింగ్ రంగంలోకి వెళ్లాలని తన వద్దకు వచ్చే రోగి ఒకరు ప్రోత్సహించారని ఆమె చెప్పారు. ‘మొదట్లో ఆమె సలహా అర్థం లేనిదిగా అనిపించింది. ఆ తర్వాత నా చిన్ననాటి అభిరుచిని నెరవేర్చుకునేందుకు ఇదే సమయమని తోచింది’అని తెలిపారు. అదే సమయంలో అప్పులు ఆమెకు భారంగా మారాయి. అలా, 72 ఏళ్ల వయసులో మోడలింగ్ రంగంలోకి ప్రవేశించారు. 2018లో 74 ఏళ్ల వయస్సులో సియోల్ ఫ్యాషన్ వీక్లో మొట్టమొదటిసారిగా కనిపించారు. ఆ తర్వాత హార్పర్స్ బజార్, ఎల్ల్ మ్యాగజీన్లలో కనిపించారు. ఇప్పుడు, కొరియన్ ఫ్యాషన్ ప్రపంచంలో ఆమె తనకంటూ స్థానం సంపాదించుకున్నారు. -
మిస్ యూనివర్స్ ఇండియా 2024గా రియా సింఘా! 'తాజ్ మహల్ కిరీటం"..!
ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరీటాన్ని గుజరాత్కి చెందిన రియా సింఘా దక్కించుకుంది. రాజస్థాన్లోని జైపూర్ వేదికగా జరిగిన గ్రాండ్ ఫినాలేలో రియా సింఘా విజయకేతనం ఎగరువేశారు. ఫైనల్లో మొత్తం 51 మందితో పోటిపడి ఈ కిరీటాన్ని సొంతం చేసుకుంది రియా. 2015లో మిస్ యూనివర్స్ ఇండియాగా కిరీటాన్ని దక్కించుకున్న ఊర్వశి రౌతేలా ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం విశేషం. ఊర్వసి చేతుల మీదుగానే 'తాజ్ మహల్ కిరీటం' పొందింది రియా. ఈ సందర్భంగా ఊర్వశీ మాట్లాడుతూ..ఆమె ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియాగా రియా కిరీటాన్ని గెలుపొందడం ఆనందంగా ఉంది. అంతేగాదు ఈ ఏడాది చివర్లో జరిగి ప్రపంచ మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో భారత్కు రియా ప్రాతినిధ్యం వహించనుంది. ఆ పోటీల్లో కూడా రియానే గెలవాలని ఆశిస్తున్నా. ఈ పోటీలో అమ్మాయిలంతా కూడా చాలా అంకితభావంతో కష్టపడారని అన్నారు ఊర్వశి. ఇక టైటిల్ విజేత రియా మాట్లాడుతూ.. ఈ మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్ను గెలుపొందినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ టైటిల్ దక్కించుకునేందుకు తాను అన్ని విధాల తగినదాన్ని అని ఆత్మవిశ్వాసంగా చెప్పింది. అలాగే తాను మునుపటి విజేతల నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని సగర్వంగా చెప్పుకొచ్చింది రియా. ఇదిలా ఉండగా, రియా ఫైనల్లో షాంపైన్ గోల్డ్ గౌనులో పుత్తడి బొమ్మలా ధగధగ మెరిసిపోయింది. అందుకు తగ్గట్టు చెవులకు ధరించిన డైమండ్ రింగులు ఆమెకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. కాగా, ఈ అందాల పోటీల్లో గుజరాత్కి చెందిన రియా సింఘా 18 ఏళ్ల వయసుకే పాల్గొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. View this post on Instagram A post shared by Miss Universe India (@missuniverseindiaorg) (చదవండి: ఇంత టాలెంటా..! ఓ పక్క నృత్యం..మరోవైపు..!) -
దక్షిణాఫ్రికా పొమ్మంది.. నైజీరియా పట్టం కట్టింది
లాగోస్: దక్షిణాఫ్రికాలో విదేశీయురాలని తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న చిడిమా అడెత్సీనా మిస్ యూనివర్స్ నైజీరియాగా ఎన్నికైంది. నవంబరులో మెక్సికోలో జరిగే మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో నైజీరియాకు ప్రాతినిధ్యం వహించనుంది. జాతీయతకు సంబంధించి ఆన్లైన్లో తీవ్రదాడి జరగడంతో అడెత్సీనా కిందటి నెల మిస్ సౌతాఫ్రికా పోటీ నుంచి వైదొలిగింది. నైజిరియాలో పోటీపడాల్సిందిగా వచి్చన ఆహ్వానాన్ని మన్నించింది. నైజీరియా తండ్రి, మొజాంబిక్ మూలాలున్న దక్షిణాఫ్రికా తల్లికి జని్మంచిందనే కారణంతో మిస్ సౌతాఫ్రికా పోటీల్లో పాల్గొనడానికి అడెత్సీనాకు అర్హత లేదనే వాదన మొదలైంది. ఆమె జాతీయతను దక్షిణాఫ్రికన్లు పశి్నంచారు. దాంతో అంతర్జాతీయ వేదికపై తండ్రి పుట్టినగడ్డకు ప్రాతినిధ్యం వహించే అవకాశంగా నైజీరియా అడెత్సీనాకు తమ ఆహ్వానాన్ని అభివరి్ణంచింది. చివరకు అదే నిజమైంది. ‘నా కల నిజమైంది. ఇదో అందాల కిరీటం కాదు. ఆఫ్రికా ఐక్యతకు పిలుపు’ అని అడెత్సీనా ఇన్స్టాగ్రామ్లో స్పందించింది. -
మిస్ యూనివర్స్ నైజీరియాగా దక్షిణాఫ్రికా బ్యూటీ!
దక్షిణాఫ్రికాలో నైజీరియన్ తండ్రికి జన్మించిన చిదిమ్మా అడెత్షినా అందాల కిరిటాన్ని కైవసం చేసుకునేందుకు ఎదుర్కొన్న అడ్డంకులు అవమానాలు అన్నీ ఇన్నీ కావు. కేవలం ఆమె గుర్తింపు కారణంగా అందాల పోటీ నుంచి చివరి నిమిషంలో వైదొలగాల్సి వచ్చింది. ఎంతో మందిని దాటుకుంటూ దక్షిణాఫ్రికా అందాల పోటీల ఫైనల్కి చేరుకుంటే. జస్ట్ ఆమె గుర్తింపే జాతీయ వివాదానికి దారితీసి అనర్హురాలిగా చేసింది. ఐతేనేం చివరికి అనుకున్నది సాధించి అందరినోళ్లు మూయించింది. ఐడెంటిటీతో ఏ మనిషి టాలెంట్ని తొక్కేయలేమని చాటిచెప్పింది. వివరాల్లోకెళ్తే..దక్షిణాప్రికాకు చెందిన చిదిమ్మా అడెత్షినా ఈ నెల ప్రారంభంలో దక్షిణాఫ్రికా అందాల పోటీల్లో ఫైనలిస్ట్గా ఎంపిక కావడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆమె నైజీరియన్ వారసత్వం పోటీకి అనర్హురాలిగా చేసింది. ఆమె తన తల్లి ఐడెంటిటీతో దక్షిణాప్రికన్గా గుర్తింపును తెచ్చుకుందంటూ ఆరోపణలు వచ్చాయి. అంతేగాదు ఈ అందాల పోటీల్లో అడెత్షినా దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించకూడదని పలు వాదనలు వినిపించాయి. దీంతో ఆమె వెంటనే ఆ పోటీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా పేర్కొంది. తన కుటుంబ శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ పోస్ట్ పెట్టిన మరుసటి రోజే అందాల పోటీల నిర్వాహకుల నుంచి అడెత్షినాకు ఆహ్వానం అందింది. అంతర్జాతీయ వేదికపై ఆమె తన తండ్రి మాతృభూమికి ప్రాతినిధ్యం వహించగలదని పేర్కొన్నారు నిర్వాహకులు. ఆ తర్వాత ఆమె శనివారం (ఆగస్టు 31)న మిస్ యూనివర్స్ నైజీరియాగా అందాల కిరీటాన్ని గెలుచుకుంది. ఎట్టకేలకు తన కలను నెరవేర్చుకున్నా అన్న భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఈ కిరీటం అందానికి మాత్రం కాదు 'ఐక్యతకు పిలుపు' అని న్యాయ విద్యార్థి అయిన అడెత్షినా గద్గద స్వరంతో చెప్పింది. "ఈ అందమైన కల చివరికి నిజమయ్యింది. ఈ కిరీటాన్ని ధరించడం ఎంతో గర్వంగానూ, గౌరంవంగానూ ఉంది. ఈ అత్యున్నత గౌరవాన్ని స్వీకరిస్తున్న సందర్భంగా ఎన్నేళ్లుగానో బాధను రగిలిస్తున్న ఆవేదనను పంచుకోవాలనుకుంటున్నా అన్నారు. ఆఫ్రికన్ ఐక్యత గురించి మాట్లాడాలనుకుంటున్నా. మనమంతా శాంతియుత సహజీనంతో మెలుగుతూ మనల్ని వేరుచేసే అడ్డంకులను చేధించుకుందాం. ప్రతి ఆఫ్రికన్ పక్షపాతం లేకుండా స్వేచ్ఛగా బతికేలా ఆ గొప్ప ఖండం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా". అని ఇన్స్టాగ్రాంలో రాసుకొచ్చింది అడెత్షినా. కాగా, అడెత్షినా నైజీరియన్ తండ్రి, దక్షిణాఫ్రికా తల్లి జన్మించిన మహిళ. మొజాంబికన్ సంతతికి చెందింది. సోవెటోలో జన్మించింది. ఐతే 1995 తర్వాత నుంచిఆ దేశ ప్రభుత్వం దక్షిణాప్రికాలోనే జన్మించిన వారికి లేదా శాశ్వత నివాసికి దక్షిణాఫ్రికా పౌరసత్వాన్ని మంజూరు చేసింది. ఆ నేపథ్యమే అడెత్షినాకి దక్షిణాఫ్రికా అందాల పోటీల్లో అడ్డంకి మారి తీవ్ర అవమానాల పాలయ్యేలా చేసింది. ఏదైతేనేం చివరికి ఆమె తన కలను సాధించడమే గాక గెలుపుతో విమర్శకుల నోళ్లు మూయించింది.(చదవండి: ఈ తెలంగాణ మిస్ డ్రీమ్.. 'మిస్ ఇండియా'!) -
Aishwarya Sushmita: వనితా విశేషణం..
యాక్ట్రెస్, సింగర్, మోడల్, బెల్లీ డాన్సర్, నేషనల్ లెవెల్ బాడ్మింటన్ ప్లేయర్.. ఈ విశేషణాలన్నింటి కలబోత ఐశ్వర్యా సుష్మితా! ‘బ్యాడ్ కాప్’ సిరీస్తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఐశ్వర్యా సుష్మితా పుట్టింది బిహార్లోని దర్భంగాలో. పెరిగింది ఢిల్లీలో. నాన్న.. నారాయణ్ వర్మ, ఎస్బీఐ ఉద్యోగి. అమ్మ.. నీతా వర్మ, గృహిణి. ఐశ్వర్యా.. ఫిలాసఫీలో పోస్ట్గ్రాడ్యుయేట్.ఐశ్వర్యా ఆసక్తిని గమనించి, తల్లిదండ్రులూ ఆమెను మోడలింగ్ వైపే ప్రోత్సహించారు. దాంతో ఢిల్లీ బేస్డ్ మోడలింగ్ ఏజెన్సీలో జాయిన్ అయింది ఐశ్వర్యా. అక్కడే ప్రింట్ అడ్వర్టయిజ్మెంట్స్కి మోడల్గా పనిచేసింది.స్కూల్ డేస్లో ఆమె లక్ష్యం ఐఏఎస్ కావాలని. అందుకే కాలేజీకొచ్చాక ఫిలాసఫీ సబ్జెక్ట్ని ఎంచుకుంది. ఆమెకు స్పోర్ట్స్ అంటే కూడా చాలా ఇష్టం. బాడ్మింటన్ ప్లేయర్గా జాతీయ స్థాయిలో రాణించింది. అంతేకాదు అందాల పోటీల్లోనూ పాల్గొని, 2016, ఎన్డీటీవీ గుడ్ టైమ్ కింగ్ఫిషర్ సూపర్మోడల్స్కీ ఎంపికైంది. ఇవన్నీ ఆమె లక్ష్యాన్ని మార్చాయి.ఆ టైమ్లోనే ముంబై మోడలింగ్ ఏజెన్సీల నుంచీ ఆఫర్స్ రావడం మొదలుపెట్టాయి. ముంబై వెళ్లింది. మనీశ్ మల్హోత్రా, అనితా డోంగ్రే, రేణు టాండన్, మానవ్ గంగ్వానీ, రాహుల్ ఖన్నా వంటి సూపర్ డిజైనర్స్కి మోడల్గా పని చేసింది. టీవీ కమర్షియల్స్లోనూ నటించింది. ఆ ఫేమే ఆమెకు ‘స్పెషల్ ఆప్స్ 1.5’ అనే వెబ్ సిరీస్లో అవకాశాన్నిచ్చింది.ఆ నటన ఆమెను తాజాగా ‘బ్యాడ్ కాప్’ వెబ్ సిరీస్లో ప్రాధాన్యమున్న పాత్రకు ప్రమోట్ చేసింది. ప్రస్తుతం ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతోంది.ఐశ్వర్యాకు సంబంధించి ఇంకో విశేషం, విశేషణం ఏంటంటే ఆమెకు స్పోర్ట్స్ బైక్ రైడింగ్ అంటే ప్రాణం. ఏ కొంచెం వీలు దొరికినా బైక్ రైడింగ్ చేస్తుంది. ఆమె ఫిట్నెస్ ఫ్రీక్ కూడా! రోజూ యోగా చేస్తుంది."నా పేరు విని అందరూ ఆశ్చర్యపోతారు సంబంధం లేకుండా రెండు పేర్లేంటని! ఐశ్వర్యా రాయ్, సుస్మితా సేన్లు మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ క్రౌన్స్ గెలుచుకున్న ఏడాదే పుట్టాను. మా పేరెంట్స్కి వాళ్లిద్దరంటే విపరీతమైన అభిమానం. ఆ అభిమానం కొద్దే నాకు ఆ ఇద్దరి పేర్లను కలుపుతూ ఐశ్వర్యా సుష్మితా అని పెట్టారు. అదన్నమాట నా పేరు వెనుకున్న స్టోరీ!" – ఐశ్వర్యా సుష్మితా -
మిస్ యూనివర్స్ స్టేట్ గ్రాండ్ ఫినాలే.. బ్యూటీ క్వీన్స్ క్యాట్ వాక్ (ఫోటోలు)
-
వైద్యురాలు కమ్ మోడల్: తొలి మిస్ యూనివర్స్ పెటిట్గా కన్నడ బ్యూటీ!
అమెరికాలో పొట్టి మహిళల కోసం నిర్వహించే అందాల పోటీల్లో విజయకేతనం ఎగురవేసింది కన్నడ బ్యూటీ. భారతదేశంలోని ఓ చిన్న పట్టణంలో ఉండే ఈ మోడల్ అతిపెద్ద కలను సాకారం చేసుకుంది. ప్రతి అమ్మాయి తాను అందాల రాణిని కావాలని ఆకాంక్షిస్తుంటది. అది సాధ్యం కానీ లక్ష్యమే అయినా పట్టుదలగా దాన్ని సాకారం చేసుకుని మరీ అందర్నీ ఆశ్చర్యపరిచింది ఈ కన్నడ మోడల్. ఆమె పేరు శృతి హెగ్డే. ఎవరీమె..? ఎలా ఈ అంతర్జాతీయ అందాల పోటీల్లో పాల్గొన కలిగిందంటే..బెంగళూరుకు చెందిన శృతి హెగ్డే అనే వైద్యురాలు మోడల్గా మారి అంతర్జాతీయ అందాల పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. ఈ అందాల పోటీ అంత సులభమైనది కాదు. ఇది పొట్టి మహిళలకు అవకాశం కల్పించేందుకు 2009లో ప్రారంభించిన అందాల పోటీ. ఈ పోటీల్లో పాల్గొన్న వాళ్లంతా అమేజనోనియన్ ప్రమాణాల ప్రకారం మరుగుజ్జుగా ఉంటారు. ప్రతి ఏడాది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపాలో ఈ పోటీలు నిర్వహిస్తారు.నిజానికి శృతి డాక్టర్గా పనిచేస్తూ మరోవైపు మోడల్గా ఈ అందాల పోటీల్లో పాల్గొనేందుకు ప్రిపేరయ్యేది. ఆస్పత్రిలో 36 గంటల షిఫ్ట్ల తోపాటు విశ్రాంతి తీసుకొని మెడికల్ ఎమర్జెన్సీని కూడా ఎదుర్కోంది. అందాల రాణి కావాలన్నది ప్రతి అమ్మాయి కల..అయితే తాను జస్ట్ ఒక ప్రయత్నం చేద్దాం అనుకున్నా, దీనికి తన అమ్మ అందించిన సపోర్టు కూడా ఎంతో ఉపయోగపడిందని అంటోంది హెగ్డే. తాను 2018 మిస్ ధార్వాడ్ పోటీకి సైన్ అప్ చేసింది. ఈ పోటీలో గెలిచేందుకు సన్నద్ధమవుతున్న క్రమంలో తాను చాలా పాఠాలను నేర్చుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ముందుగా తన వైద్య రంగాన్ని, మోడలింగ్ కెరీర్ని బ్యాలెన్స్ చేయడం చాలా సవాలుగా ఉండేది. ఒక్కోసారి విశ్రాంతి తీసుకునేంత తీరిక లేని పనులతో ఉక్కిరిబిక్కిరిగా ఉండేదని చెబుతోంది. ఇంతలో 2019లో తనకు గర్భాశయ కణితులు ఉన్నట్లు నిర్ధారణ అయిందని చెప్పింది. దీంతో ఓ రెండేళ్లు ట్రీట్మెంట్తోనే గడిచిపోయింది. ఇక కెరీర్ ముగిసిపోయింది. ఈ అందాల పోటీల్లో పాల్గొనలేను అనుకున్న సమయాన్ని ఆమె తల్లి అందించిన మద్దతుతో తిరిగా మళ్లీ అందాల పోటీల్లో పాల్గొనడం మొదలు పెట్టింది. అలా మిస్ ఆసియా ఇంటర్నేషనల్ ఇండియా 2023 రెండో రన్నరప్గా టైటిల్ని దక్కించుకుంది. ఎప్పుడైతే ఈ టైటిల్ గెలిచిందో అప్పుడు ఆమె మీద ఆర్థిక ఒత్తిడి తగ్గింది. అంతకమునుపు ఓ పక్క ట్రీట్మెంట్ మరోవైపు పోటీల ప్రీపరేషన్తో ఆర్థిక భారం ఎక్కువగా ఉండేది. దీంతో పోటీల్లో ప్రదర్శని ఇచ్చేందుకు కేవలం రెండు దుస్తులే ఉండేవి. వాటినే వేర్వురు ప్రదర్శనల్లో ధరించేదాన్ని అని చెబుతోంది. ఇప్పుడు ఆమెకు స్పాన్సర్లు లభించడంతో ఈ ఆర్థిక భారం నుంచి కాస్త ఉపశమనం పొందింది. ఆమె కష్టానికి ఫలితమే దక్కి గత నెల జూన్ 10న భారతదేశపు తొలి మిస్ యూనివర్సల్ పెటైట్గా కిరీటాన్ని గెలుచుకుంది. (చదవండి: స్పేస్లో భోజనం టేస్ట్ ఎలా ఉంటుందంటే..!) -
Sushmita Sen Throwback Photos: అందానికి పట్టాభిషేకం.. మిస్ యూనివర్స్గా 'సుస్మితా సేన్' 30 ఏళ్ల నాటి ఫోటోలు
-
Miss Universe: సుస్మితా సేన్ అందానికి దక్కిన కిరీటానికి 30 ఏళ్లు పూర్తి
బాలీవుడ్ హీరోయిన్, మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్కు ఈరోజు చాలా ప్రత్యేకం. తాను విశ్వసుందరిగా కిరీటాన్ని గెలుచుకుని నేటితో 30 ఏళ్లు. ఆ రోజులను గుర్తుచేసుకుంటూ ఆమె ఒకఫోటోను షేర్ చేసింది. 1994లో విశ్వ సుందరి కిరీటం గెలిచి భారత జాతి ఖ్యాతి పెంచిన సుస్మిత ఆపై సినిమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేస్తూ పేరు తెచ్చుకుంది.మే 21, 1994న మిస్ యూనివర్స్ టైటిల్ను గెలుచుకున్న మొదటి భారతీయురాలుగా సుస్మిత రికార్డ్ క్రియేట్ చేసింది. అప్పటి ఫోటోను షేర్ చేస్తూ సుస్మిత ఇలా చెప్పుకొచ్చింది. 'ఈ ఫొటో తీసినప్పుడు నా వయసు 18ఏళ్లు. నేను అనాథాశ్రమంలో ఈ చిన్నారిని కలిసిన క్షణంలో నేను జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకోవాని నిర్ణయించుకున్నాను. అత్యంత అమాయకమైన ఆ చిన్నారి చూపు నన్ను కట్టిపడేసింది. 30 ఏళ్ల క్రితం నేను ఏదైతే అలాంటి వారికి చేయాలని అనుకున్నానో ఇప్పుడు అదే చేస్తున్నాను.ప్రతి ఏడాది మే 21ని చాలా గర్వంగా సెలబ్రెట్ చేసుకుంటాను. 21 మే 1994 నా జీవిత చరిత్రలో చెరిగిపోని ఒక పేజీ.. ఆ క్షణాలు ఇప్పటికీ నా కళ్లముందు కనిపిస్తున్నాయి. భారతదేశం ఎల్లప్పుడూ నాకు గొప్ప గుర్తింపు, శక్తిని ఇచ్చింది. గత మూడు దశబ్ధాలుగా అభిమానులు అంతులేని ప్రేమను నాకు అందిస్తున్నారు. ఈ సంతోషం సందర్భంగా నాకు మెసేజ్లు పంపుతున్న అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది.' అని ఆమె తెలిపింది.1975, నవంబర్ 19న ఓ బెంగాలీ కుటుంబంలో సుస్మితా సేన్ జన్మించింది. తండ్రి షుబీర్ సేన్ భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్గా పని చేయగా, తల్లి శుభ్రా సేన్ నగల డిజైనర్. సుస్మిత హైదరాబాద్లో జన్మించినా చదువంతా ఢిల్లీలో సాగింది.తెలుగులో నాగార్జున సరసన 'రక్షకుడు' చిత్రంలో నటించింది. 2013 సంవత్సరానికి సుస్మితాసేన్ మదర్థెరిస్సా ఇంటర్నేషనల్ అవార్డు అందుకుంది. సామాజిక న్యాయం కోసం కృషిచేసేవారిని గుర్తించి గౌరవించేందుకు ద హార్మనీ ఫౌండేషన్ అనే సంస్థ ఈ అవార్డు నెలకొల్పింది. 2015 లోనే సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సుస్మితా సేన్.. ఓటీటీ కోసం ఆర్య, తాళి వంటి వెబ్ సీరిస్లలో నటించింది. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) -
సడెన్గా మిస్ యూఎస్ఏ స్థానం నుంచి తప్పుకుంటున్న మోడల్!కారణం ఇదే..
గతేడాది 2023లో మిస్ యూఎస్ఏ విజేతగా ఎంపికైన నోలియా వోయిగ్ట్ సడెన్గా తన స్థానం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. తన కిరీటాన్ని వెనక్కి ఇచ్చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఒక్కసారిగా షాక్కి గురయ్యారు ఆమె అభిమానులు. మానసిక ఆరోగ్యం కారణంగానే తాను ఈ అత్యున్నత స్థానానికి రాజీనామా చేస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొంది. ఆరోగ్యమే మహా సంపద అని అందువల్ల ముందు తన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తానని తెలిపింది. అలాగే మిస్ యూఎస్ఏగా తన జర్నీ చాలా అర్థవంతంగా సాగిందని చెప్పింది. మిస్ యూఎస్ఏ టైటిల్ని గెలుచుకున్న తొలి మెనిజులా అమెరికన్ మహిళ. తాను మిస్ యూఎస్ఏ 2023 టైటిల్కు రాజీనామా చేయాలన కఠినమైన నిర్ణయం తీసుకున్నాని వోయిగ్ట్ పేర్కొన్నారు. ఇది నాకు కొత్త అధ్యయనం అని తెలుసని, అందువల్ల స్థిరంగా ఉండేందుకు యత్నిస్తా. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు మిస్ యూఎస్ఏ ఆర్గనైజేషన్ ప్రతినిధి మాట్లాడుతూ..వోయిగ్ట్ తన విధుల నుంచి తప్పుకోవాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తాం. మా టైటిల్ హోల్డర్లకు ముందు ప్రాధన్యత ఇస్తాం. ఈ సమయంలో ఆమెకు తనకు తానుగా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది అని మేము గుర్తించాం. తన భాద్యతలకు వారసునిగా చేయడం కోసం చూస్తున్నారని అర్థమయ్యింది.త్వరలో ఆమె కోరుకున్నట్లుగానే కొత్తమిస్ యూఎస్ఏని ప్రకటించడం కూడా జరుగుతుంది. అని అన్నారు. ఇన్స్టాగ్రాంలో సంస్థ మోడల్కి మద్దతను ఇవ్వడమే గాక ఆమె చేసిన సేవకు ధన్యావాదాలు తెలిపింది. కాగా, హవాయికి చెందిన సవన్నా గాంకీవిచ్ మొదటి రన్నరప్గా నిలిచారు. ఆమె తదుపరి కొత్త యూఎస్ఏ కిరీటాన్ని పొందే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాల సమాచారం. ఇక వోయిగ్ట్ మిస్ యూఎస్ఏగా డేటింగ్ హింసకు వ్యతిరేకంగా, ఇమ్మిగ్రేషన్ హక్కులు, లాభప్రేక్ష లేని స్మైల్ ట్రైన్తో పనిచేయడం వంటి పలు సేవలందించారు. ఈ వేదిక తన కలను సాకారం చేసుకునేలా చేసింది. పైగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులతో కనెక్ట్ అయ్యేలా చేసిందని అందుకు తాను ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటానని సోషల్ మీడియా పోస్ట్లో రాసుకొచ్చింది.(చదవండి: సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ) -
మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో 60 ఏళ్ల వృద్ధురాలు..!
అందాల పోటీల్లో ఎందరో అతిరథ బ్యూటీలు పాల్గొని సత్తా చాటారు. విజేతలుగా గెలిచిన అందాల భామలు అసలైన అందానికి నిర్వచనం ఏంటో తమదైన శైలిలో వివరించి అందర్నీ మంత్ర ముగ్దుల్ని చేశారు. ఐతే ఈ పోటీల్లో పాల్గొనడానికి వయసు పరిమితి ఉండేది. అయితే ఓ నిర్ధిష్ట వయసు తర్వాత మఖ్యంగా మహిళలు తరుచుగా నిర్లక్ష్యానికి అవహేళనకు గురవ్వుతుంటారు. చెప్పాలంటే తల్లిగా మారే పరిణామ క్రమంలో వృధ్యాప్యానికి త్వరితగతిన చేరువయ్యేది మహిళలే. దీంతో వారికి గుర్తింపు ఉండదు సమాజంలో. ఆ తరహా ఆలోచనను మార్చి అందానికి అసలైన నిర్వచనం ఇచ్చేలా ఏకంగా 60 ఏళ్ల వయసులో అందాల పోటీల్లో పాల్గొని చరిత్ర సృష్టించనుంది వృద్ధురాలు. ఇంతకీ ఎవరామె అంటే..అర్జెంటినాలో మేలో మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ 2024 అందాల పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో న్యాయవాది అయిన 60 ఏళ్ల అలెజాండ్రా మారిసో రోడ్రిగ్జ్ పాల్గొని చరిత్ర సృష్టించనుంది. ఆమె గనుక ఈ అర్జెంటినా మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ 2024 టైటిల్ గెలుచుకుంటే 60 ఏళ్ల వయసులో టైటిల్ని గెలుచుకున్న తొలి సీనియర్ సిటిజన్గా అలెజాండ్రా రికార్డులకెక్కడమే గాక సెప్టెంబర్లో జరగనున్న మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న తొలి సీనియర్ సిటిజన్గా కూడా చరిత్ర సృష్టిస్తోంది.స. ప్రసుత్తం ఆమె మేలో జరగనున్న అర్జెంటినా మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ 2024 పోటీలకు సన్నద్ధమవుతుంది. ఈ టైటిల్ని గెలుచుకుంటే అలెజాండ్రా సెప్టెంబర్లో జరగనున్న మిస్ యూనివర్స్ పోటీల్లో అర్జెంటీనా తరుఫునా ప్రాతినిధ్యం వహించనుంది. ఆమె యువ పోటీదారులకు గట్టి పోటీ ఇచ్చేలా అద్భుతమైన దేహధారుడ్యంతోత్తా చాటనుంది. అంతేగాదు అందాల ప్రపంచంలో ఉన్న మూస పద్ధతులను తిప్పికొట్టి అందానికి వయసుతో సంబంధం ఉండదని ప్రూవ్ చేయనుంది. ఆరోగ్యకరమైన జీవన శైలితో వయసుని కనిపించకుండా చేయగలిగే ప్రతి స్త్రీ గొప్ప అందగత్తేనని చెబుతోంది. ఇక అలెజాండ్రా ఆరోగ్యకరమైన అలవాట్ల తోపాటు కఠిన వ్యాయామ నియమావళిని అనుసరిస్తానని తెలిపింది. అవే తనకు ఈ అందాల పోటీల్లో సహకరిస్తాయని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది అలెజాండ్రా. అలాగే 18 ఏళ్ల వయసులో ఉన్నట్లు దేహ సౌందర్యం ప్రతిమహిళకు వయసు రీత్యా విభిన్నంగా ఉండొచ్చు గానీ అందంగానే ఉంటారని అంటోంది. ఇక్కడ వయసుని అందానికి కొలమానంగా చూడకూడదని నొక్కి చెబుతోంది. అంతేగాదు సమాజానికి మహిళల అందాన్ని తక్కువ చేసి చూసే అవకాశం ఇవ్వకుండా తమపై శ్రద్ధ వహించేలా సమతుల్యమైన ఆహారపు అలవాట్లపై మహిళలంతా దృష్టి పెట్టాలని చెబుతోంది అలెజాండ్రా.(చదవండి: ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన ప్రాచీ: ఉచితంగా ట్రీట్ చేస్తామన్న వైద్యులు -
విశ్వసుందరి పోటీల్లో సౌదీ ముద్దుగుమ్మ! ఇంతకీ ఎవరీమె..?
ఇస్లాం సంప్రదాయవాదానికి చిరునామాగా నిలిచే సౌదీ అరేబియా నుంచి ఒక ముద్దుగుమ్మ మిస్ యూనివర్స్ పోటీలకు సిద్ధమైంది. సౌదీ నుంచి ఇలా ఒక అమ్మాయి అంతర్జాతీయ అందాల పోటీలకు ప్రాతినిధ్యం వహించడం చరిత్రలో ఇదే తొలిసారి. మలేసియాలో జరగనున్న విశ్వసుందరి పోటీల్లో సౌదీ తరఫున 27 ఏళ్ల మోడల్ రూబీ అల్ఖాతానీ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ అందాల రాశికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. తొలి పార్టిసిపెంట్గా ఆమె.. సౌదీ అరేబియాలో మహిళలపై ఎలాంటి ఆంక్షలుంటాయో అందరికి తెలిసిందే. కఠిన ఆంక్షలతో ఫక్తు సంప్రదాయవాదిగా పేరుమోసిన 38 ఏళ్ల సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఇటీవలి కాలంలో సౌదీని సంస్కరణల బాటలో పయనింపజేస్తున్నారు. ఇటీవలి కాలంలో పలు ఆంక్షల్ని సడలించి వార్తల్లో నిలిచారు. ఈ మేరకు ఆయన మహిళా డ్రైవర్లపై నిషేధం ఎత్తివేయడం, ఆహార్యం విషయంలో పెట్టిన నిబంధనల్ని సడలించడం, పురుషుల తోడు లేకుండా బయటికి వెళ్లే స్వేచ్ఛను అక్కడి మహిళలకు కల్పించడం.. వంటి పలు మార్పులు తీసుకొచ్చారు. అయితే అందాల పోటీల్లో పాల్గొనే విషయంలో కూడా నియమాల్ని సడలించడం విశేషం. ఎందుకంటే..ఇప్పటిదాకా అంతర్గతంగా జరిగే అందాల పోటీల్లో పాల్గొనేందుకు అక్కడి మహిళలకు అనుమతిచ్చిన ఈ దేశం.. తొలిసారి అంతర్జాతీయంగా జరిగే అందాల పోటీల్లో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేగాదు ఈ ఏడాది సెప్టెంబర్లో జరగబోయే ‘మిస్ యూనివర్స్’ పోటీల్లో ఈ దేశం కూడా పాలుపంచుకుంటోంది. విశ్వ సుందరి పోటీల్లో సౌదీ తరఫున 27 ఏళ్ల రుమీ అల్ ఖతానీ పోటీ పడనుంది. దీంతో ‘మిస్ యూనివర్స్’ పోటీల్లో పాల్గొననున్న తొలి సౌదీ అరేబియన్ మహిళగా రుమీ చరిత్ర సృష్టించనుంది. రుమీ రియాద్లో పుట్టి పెరిగింది. చిన్నతనం నుంచి ఎంతో ముద్దుగా, క్యూట్గా ఉండే ఆమెకు అందాల పోటీల్లో పాల్గొనాలన్నది చిరకాల కోరిక. అందువల్లే టీనేజ్ దశ నుంచే ఇటువైపుగా అడుగులు వేసి మోడల్గా కెరీర్ ప్రారంభించింది. కంటెంట్ క్రియోటర్గా.. అందాల పోటీలపై ఎంత మక్కువ ఉన్నా చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు రుమీ. దంత వైద్యంలో డిగ్రీ పట్టా పుచ్చుకుంది. కొత్త విషయాలు తెలుసుకోవడమన్నా, కొత్త భాషలు నేర్చుకోవడమన్నా ఈ ముద్దుగుమ్మకు చాలా ఇష్టమట! ఈ మక్కువతోనే అరబ్, ఫ్రెంచ్, ఇంగ్లిష్ భాషల్ని అనర్గళంగా మాట్లాడడం నేర్చుకున్న రుమీ.. మరిన్ని భాషలు నేర్చుకునే పనిలో ఉన్నానంటోంది. తన వ్యక్తిగత, కెరీర్ అనుభవాల్ని నలుగురితో పంచుకోవడంలో ఎప్పుడూ ముందే ఉంటుంది రుమీ. ఈ క్రమంలోనే మోడల్గా తాను సాధించిన ఘనతల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ నెటిజన్ల ప్రశంసలందుకుంది ఈ సౌదీ భామ. ఫ్యాషన్, అందం, లైఫ్స్టైల్కు సంబంధించిన అంశాలపై అందరిలో అవగాహన కల్పిస్తూ పోస్టులు పెడుతూ.. కంటెంట్ క్రియేటర్గా మంచి పేరు కూడా తెచ్చుకుంది. అంతేగాదు ఇన్స్టాలో కూడా ఆమెను 10 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. కుటుంబమే నా బలం.. ప్రయాణాలంటే ఈ అందాల ముద్దుగుమ్మకు మహా ఇష్టమట. తాను సందర్శించే దేశాలు, అక్కడి ప్రత్యేకతల్ని ఫొటోలు, రీల్స్ రూపంలో ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. విభిన్న ఫ్యాషన్స్ని ఫాలో అవడం, కొత్త ఫ్యాషన్లను ట్రై చేయడంలో ఎప్పుడూ ముందే ఉంటుంది రుమీ. ఫ్యాషనబుల్ దుస్తుల్లో మెరిసిపోతూ రుమీ తీయించుకున్న ఫొటోషూట్స్ని ఇన్స్టాలో పోస్ట్ చేయగా.. అవన్నీ వైరల్ అవుతుంటాయి. ఇలా ‘ఫ్యాషన్ క్వీన్’గానూ పేరు తెచ్చుకుందీ ఈ బ్యూటీ. తన వద్ద ఉన్న ఖరీదైన వస్తువులు, యాక్సెసరీస్, వాటికి సంబంధించిన ఫొటోల్నీ అందరితో పంచుకోవడానికి ఇష్టపడతుంది రుమీ. అంతేగాదు ఆమె వద్ద ఉన్న లగ్జరీ జ్యుయలరీ కలెక్షన్లను చూసి నెటిజన్లు ఫిదా అవుతుంటారు. తన కుటుంబమే తన బలం అని రుమీ తరచుగా చెబుతుంటుంది. అంతేగాదు తన కుటుంబ సభ్యులు, సోదరీమణులతో దిగిన ఫొటోల్ని కూడా సోషల్మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఇక రుమీ ఇప్పటికే పలు అందాల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. అలా ఆమె ‘మిస్ సౌదీ అరేబియా’, ‘మిస్ అరబ్ పీస్’, ‘మిస్ ఉమన్ సౌదీ అరేబియా’, ‘మిస్ యూరప్ సౌదీ అరేబియా’, ‘మిస్ ప్లానెట్ సౌదీ అరేబియా’, ‘మిస్ మిడిల్ ఈస్ట్ సౌదీ అరేబియా’, ‘మిస్ అరబ్ యునిటీ సౌదీ అరేబియా’, ‘మిస్ ఆసియా సౌదీ అరేబియా’.. వంటి ఎన్నో టైటిళ్లు దక్కించుకుంది. "ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా, స్వతంత్రంగా, సమానత్వంతో జీవించే హక్కు ఉంది. వయసు, స్త్రీ-పురుష భేదాలు, శక్తి సామర్థ్యాలు, ఆహార్యం/శరీరాకృతి పరంగా ఎవరూ వివక్షకు గురికాకూడదు. అప్పుడే వాళ్లు తామేంటో చూపించుకోగలరు.." అంటూ సోషల్ మీడియాలో స్ఫూర్తినింపే పోస్టులను పెడుతుంటుంది. కాగా, ఈ ఏడాది జరగబోయే ‘మిస్ యూనివర్స్’ పోటీల్లో తన దేశం తరఫున పాల్గొంటున్నందుకు ఆనందంలో మునిగితేలుతోంది ఈ ముద్దుగుమ్మ. అంతేగాదు ఈ ఏడాది మిస్ యూనివర్స్-2024 పోటీల్లో తన దేశానికి ప్రాతినిథ్యం వహించడం గర్వంగానూ సంతోషంగానూ ఉందని చెబుతోంది. ఈ ఏడాది తొలిసారిగా నా దేశం ఈ పోటీల్లో పోటీ పడుతుండడం, పైగా అందులో తానే తొలి పార్టిసిపెంట్ని కావడం ఎంతో సంతోషంగా అనిపించిందని సోషల్ మీడియా పోస్ట్లో రాసుకొచ్చింది రుమీ. (చదవండి: హీరోయిన్లా కనిపించాలని వందకు పైగా సర్జరీలు! అందుకోసం..) -
మిస్ యూనివర్స్ పోటీలో తొలిసారి సౌదీ సుందరి
రియాద్: ఇస్లాం సంప్రదాయవాదానికి చిరునామాగా నిలిచే సౌదీ అరేబియా నుంచి ఒక ముద్దుగుమ్మ మిస్ యూనివర్స్ పోటీలకు సిద్ధమైంది. సౌదీ నుంచి ఇలా ఒక అమ్మాయి అంతర్జాతీయ అందాల పోటీలకు ప్రాతినిధ్యం వహించడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. త్వరలో మలేసియాలో జరగబోయే విశ్వసుందరి పోటీల్లో తాను సౌదీ తరఫున పాల్గొనబోతున్నట్లు 27 ఏళ్ల మోడల్ రూబీ అల్ఖాతానీ సోమవారం ప్రకటించారు. సౌదీలోని రియాద్ నగరం ఈమె స్వస్థలం. ఇప్పటికే పలు అందాల పోటీల్లో పాల్గొన్నారు. కొద్ది వారాల క్రితం మలేసియాలో జరిగిన మిస్ అండ్ మిసెస్ గ్లోబల్ ఏషియన్లోనూ పాలుపంచుకున్నారు. ప్రపంచ సంస్కృతులపై అవగాహన పెంచుకుంటూనే మా సౌదీ సంప్రదాయాలు, సంస్కృతి, వారసత్వాన్ని విశ్వ వేదికలపై వివరిస్తా’ అని అరబ్ న్యూస్తో రూబీ అన్నారు. ఇప్పటికే మిస్ సౌదీ అరేబియా కిరీటాన్ని దక్కించుకున్న ఈమె మిస్ మిడిల్ ఈస్ట్(సౌదీ అరేబియా), మిస్ అరబ్ వరల్డ్ పీస్–2021, మిస్ ఉమెన్(సౌదీ అరేబియా) టైటిళ్లను గెలుపొందారు. ఈమెకు ఇన్స్టా గ్రామ్లో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈమె మోడల్గానే కాదు కంటెట్ క్రియేటర్ గానూ రాణిస్తున్నారు. కఠిన ఆంక్షలతో ఫక్తు సంప్రదాయవాదిగా పేరుమోసిన 38 ఏళ్ల సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఇటీవలి కాలంలో సౌదీని సంస్కరణల బాటలో పయనింపజేస్తున్నారు. మహిళల డ్రైవింగ్కు, పురుషుల పార్టీలకు వెళ్లేందుకు, పురుష సంరక్షులు లేకున్నా పాస్పోర్ట్కు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించారు. పూర్తి మద్యనిõÙధం అమల్లో ఉండే సౌదీలో తొలిసారిగా దౌత్యకార్యాలయాలుండే ప్రాంతంలో మద్యం అమ్మకాలకు అనుమతి మంజూరు చేశారు. -
Miss Universe 2023 : అదరహో అనిపించిన సుందరీమణులు వీళ్లు (ఫొటోలు)
-
‘వీలైతే నేను మలాల అవుతా’
72వ మిస్ యూనివర్స్ అందాల పోటీలు సెంట్రల్ అమెరికాలోని ఎల్ సాల్వడార్లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోటీల్లో నికరాగ్వా సుందరి షెన్నిస్ పలాసియోస్ ప్రతిష్టాత్మకమైన మిస్ యూనివర్స్–2023 కిరీటం దక్కించుకోగా ఫస్ట్ రన్నరప్గా థాయిలాండ్ భామ ఆంటోనియా పోర్సిల్డ్ నిలిచింది. అయితే ఈ పోటీల్లో ఆఖరి రౌండ్ ప్రశ్నలు చాలా ఆసక్తికరంగానూ గమ్మత్తుగా ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే అందాల భామలు తమదైన శైలిలో చెప్పి జడ్జిలను మత్రముగ్గుల్ని చేసి కీరిటాన్ని దక్కించుకుంటారు. ఇక్కడ ఈ ముగ్గుర్నీ ఒకే ప్రశ్న అడిగారు. అయితే ఆ ప్రశ్నకు థాయిలాండ్ భామ ఆంటోనియా పోర్సిల్డ్ చెప్పిన సమాధానం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఊహించిన రీతిలో ఆమె నుంచి వచ్చిన సమాధానం అక్కడున్న వారిని షాక్ గురి చేయడమే గాక సోషల్ మీడియాలోనూ వైరల్గా మారింది. ఇంతకీ పోర్సిల్డ్ ఏం చెప్పిందంటే..మిమ్మల్ని ఒక ఏడాది వేరొక మహిళల ఉండమంటే ఎవర్ని ఎంపిక చేసుకుంటారని జడ్జిలు ప్రశ్నించగా..అందుకు పోర్సిల్డ్ తాను మలాలా యూసఫ్జాయ్ని ఎంచుకుంటానని తేల్చి చెప్పింది. ఆమె ఈ రోజు ఆ స్థాయికి చేరుకోవడానికి ఎన్ని కష్టాలు ఫేస్ చేసిందో మనకు తెలుసు. మహిళల విద్యకోసం పోరాడింది. అందుకోసం ప్రాణాలను పణంగా పెట్టి అత్యంత బలంగా పోరాడింది మలాలా. అందువల్ల నేను ఎంచుకోవాల్సి వస్దే ఆమెను సెలక్ట్ చేసుకుంటానని సగర్వంగా చెప్పింది. ఐతే ఇదే ప్రశ్నకు కిరీటం దక్కించుకున్న నికరాగ్వా సుందరి షెన్నిస్ పలాసియోస్ పోర్సిల్డ్ మాదిరిగానే మహిళల హక్కుల కోసం పాటుపడిన మేరీ వోల్స్టోన్క్రాఫ్ట్ను ఎంచుకుంటాను చెప్పగా, మరో విశ్వసుందరి ఆస్ట్రేలియన్ మోరయా విల్సన్ మాత్రం తన తల్లిని ఎంచుకుంటానని చెప్పింది. ఆమె వల్ల ఈ రోజు ఇక్కడ వరకు రాగలిగానని, అందువల్ల తన తల్లిని ఎంపిక చేసుకుంటానని చెప్పింది. ఇక్కడ థాయిలాండ్ భామ పోర్సిల్డ్ పాక్కి చెందిన ఐకానిక్ మహిళ, నోబెల్ శాంతి గ్రహిత మలాలా యూసుఫ్ జాయ్ని చెప్పడం అందర్నీ షాక్కి గురి చేసింది. ఆమె సమాధానం ప్రతి ఒక్కరిని కదిలించింది, ఆలోచింప చేసేలా ఉందంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. కాగా సెంట్రల్ అమెరికా 1975 తర్వాత మళ్లీ తొలిసారిగా ఈ మిస్ యూనివర్స్ పోటీలను నిర్వహించింది. FINAL Q&A starting with Thailand! @porxild#72ndMISSUNIVERSE #MissUniverse2023 @TheRokuChannel pic.twitter.com/w71IH4kEvY — Miss Universe (@MissUniverse) November 19, 2023 (చదవండి: ఎవరికీ కనిపించనివి కనిపిస్తున్నాయా?.. వినిపించనివి వినిపిస్తున్నాయా?) -
ప్రపంచ సుందరిగా ఎంపికైన నికరాగ్వా భామ!
మిస్ యూనివర్స్ 2023 టైటిల్ను నికరాగ్వా భామ నిలిచింది. నికరాగ్వా దేశానికి చెందిన షెన్నిస్ పలాసియోస్ ఈ ఏడాది ప్రపంచసుందరిగా ఎంపికైంది. ప్రపంచవ్యాప్తంగా అందాల పోటీల్లో ఎంతో ప్రాముఖ్యత సొంతం చేసుకున్న 'మిస్ యూనివర్స్' కిరీటం షెన్నిస్ దక్కించుకుంది. కాగా.. మాజీ విశ్వ సుందరి ఆర్ బానీ గాబ్రియేల్ ప్రపంచసుందరి కిరీటాన్ని ఆమెకు అలంకరించారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు విశ్వ సుందరికి నెటిజన్లు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. శాన్ సాల్వడార్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో దాదాపు 84 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. మన దేశం తరఫున ఈ పోటీల్లో శ్వేతా శార్దా పాల్గొన్నారు. MISS UNIVERSE 2023 IS @sheynnispalacio !!!! 🇳🇮👑@mouawad #72ndMISSUNIVERSE #MissUniverse2023 pic.twitter.com/mmR90DJ16m — Miss Universe (@MissUniverse) November 19, 2023 -
మిస్ యూనివర్స్ పోటీల్లో దేవకన్యలా మెరిసిపోయిన శ్వేత
ప్రతిష్టాత్మక 72వ మిస్ యూనివర్స్ అందాల పోటీలు ఫైనల్కు చేరుకున్నాయి.ఎల్ సాల్వడార్లో వేదికగా ఆదివారం ఉదయం 9గంటలకు(భారత కాలమానం ప్రకారం).. మిస్ యూనివర్స్2023 ఎవరో తేలిపోనుంది. 90 దేశాలకు చెందిన అందాల భామలు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. భారత్ నుంచి 23ఏళ్ల శ్వేతా శార్దా ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం జరిగిన నేషనల్ కాస్ట్యూమ్ షోలో శ్వేత ధరించిన కాస్ట్యూమ్స్ ఇప్పుడు నెట్టింట సెన్సేషన్గా మారాయి. రీగల్ ఎంబ్రాయిడరీతో చేసిన దుస్తులు ధరించి శ్వేత దేవకన్యలా మెరిసింది. జాతీయ పుష్పం కమలం స్ఫూర్తితో రూపొందించిన కిరీటం ధరించి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది.దీంతో పాటు జాతీయ పక్షి నెమలి ప్రతిబింబించేలా కాస్ట్యూమ్ను ఎంబ్రాయిడరీతో తీర్చిదిద్దారు. సవాళ్లను ఎదుర్కొనే, అభివృద్ధి చెందుతున్న దృఢమైన భారత్కు ప్రతీకగా ఈ కాస్ట్యూమ్ను డిజైన్ చేసినట్లు డిజైనర్ నిధి యశా తెలిపింది. ప్రస్తుతం శ్వేతా శార్దా లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Miss Diva (@missdivaorg) ఎవరీ శ్వేతా శార్దా? చండీగఢ్కు చెందిన 23 ఏళ్ల శ్వేతా శార్దా ప్రతిష్టాత్మక మిస్ యూనివర్స్ అందాల పోటీలో ఈ ఏడాది భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తోంది. 16 ఏళ్ల వయసులో తన తల్లితో కలిసి ముంబై చేరిన శ్వేత చిన్నతనంలోనే డ్యాన్స్పై మక్కువ ఏర్పరుచుకుంది. ఇప్పటివరకు ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’, ‘డ్యాన్స్ దీవానే’ వంటి పలు రియాలిటీ షోల్లో ఆమె పాల్గొంది. ఫెమినా మిస్ ఇండియా గ్రూప్లో భాగమైన ‘మిస్ దివా యూనివర్స్-2023’ కిరీటాన్ని సొంతం చేసుకుంది. మరి మిస్ యూనివర్స్గా సత్తా చాటుతుందా అన్నది చూడాల్సి ఉంది. భారత్ నుంచి చివరగా 2021లో హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్గా గెలుపొందిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Miss Diva (@missdivaorg) -
Aishwarya Rai Birthday : నీలి కళ్ల సుందరి ఐశ్వర్య రాయ్ 50వ పుట్టినరోజు.. ప్రత్యేకమైన ఫోటోలు
-
ఎవరూ ఊహించలేని టార్గెట్ వైపు అడుగులేస్తున్న 'సితార'
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి సితార. కాదు.. కాదు.. 'సితార ఘట్టమనేని' అని చెప్పుకునే స్థాయికి చేరుకుంది. మొదట ప్రిన్స్ మహేష్ బాబు ఫేమ్తో గుర్తింపు దక్కినా తర్వాత తన టాలెంట్తో సపరేట్ ఫ్యాన్ బేస్నే క్రియేట్ చేసుకునే స్థాయికి చేరుకుంది. సితార శాస్త్రీయ నృత్యం నేర్చుకుంది. దీంతో సోషల్ మీడియాలో డ్యాన్స్ వీడియోలతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. గతంలో సినీ సెలబ్రిటీలను కూడా ఇంటర్వ్యూ చేసింది. అంతే కాకుండా ఇటీవలే ఓ ప్రముఖ జ్యూయెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా సైన్ చేసి.. ఆ సంస్థ నుంచి ఒక హీరోయిన్ అందకునేంత రెమ్యునరేషన్ తీసుకుంది. అంటే సుమారు కోటి రూపాయలకు పైగానే అని చెప్పవచ్చు. (ఇదీ చదవండి: Sitara Ad Remuneration: చిన్న యాడ్.. కళ్లుచెదిరే మొత్తం ఇచ్చారు!) గతంలో తన గురించి మహేష్ ఇలా అన్నారు. 'సితార ఎప్పుడో సూపర్ స్టార్ అయిపోయింది. తను ఇంగ్లీష్,తెలుగు చాలా చక్కగ మాట్లాడుతుంది. ముఖ్యంగా తను మాట్లాడేటప్పుడు అమెరికన్ యాక్సెంట్ ఉంటుంది. కానీ అలా మాట్లాడాలని మేము ఎప్పుడూ చెప్పలేదు. తనకు సొంతంగా వచ్చింది.' అని చెప్పారు. సితార ఇంత వరకు ఎలాంటి సినిమాలు తీయలేదు. యూట్యూబ్,ఇన్స్టాగ్రామ్లో మాత్రమే తను కనిపిస్తుంది. అక్కడ కూడా తనకు మిలియన్ల కొద్ది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే సితార ఒక స్టార్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం వెనుక ఆమె తల్లి నమ్రతా కృషి ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అమెకు డ్యాన్స్,యాక్టింగ్లో హావ భావాలు పలికించడంలో రాటుతేలేందకు శిక్షణ ఇప్పించింది. ఈ విధంగా చాలా విషయాల్లో సితార మీద చిన్నప్పటి నుంచే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది నమ్రత. దీంతో ఆమె ఒక స్టార్గా గుర్తింపు తెచ్చుకుంది. (ఇదీ చదవండి: ప్రభాస్ 'ప్రాజెక్ట్-కె' నుంచి బిగ్ అనౌన్స్మెంట్..!) తాజాగా సినీ ఇండస్ట్రీ నుంచే కాకుండా మహేష్ బాబు అభిమానుల్లో సితార గురించి ఒక వార్త ప్రచారం జరుగుతుంది. సితారని 'మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్' పోటీలకు నమ్రత సిద్ధం చేస్తోంది అని... ఆపై సితారను హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలో పరిచయం చెయ్యాలని అనుకుంటున్నారట.. ఇప్పుడు ఈ వార్త బాగా వైరల్ అవుతుంది. అయితే సితారకి ఇంకా పదకొండేళ్లే.. మిస్ యూనివర్స్ పోటీలలో పాల్గొనాలంటే ఇంకా సుమారుగా ఆరేళ్లు ఉండాల్సిందే. మరీ ఇప్పటి నుంచే ఎందుకంటారా? అలాంటి పోటీలకు శిక్షణ చాలా ముఖ్యం. అక్కడ రానించాలంటే లాంగ్ టర్మ్ తర్ఫీదు తప్పదు. ఈ శిక్షణల వల్లే తను బాలీవుడ్ టాప్ హీరోల పిల్లలను కూడా దాటేసి తనకంటు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ యాడ్ రిలీజ్ అయ్యాక ఆమె మరింత పాపులర్ అవడం ఖాయం. ఒక రకంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సితార ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు సాగడం ఖాయం అని మహేష్ ఫ్యాన్స్ అంటున్నారు. View this post on Instagram A post shared by sitara 🍓 (@sitaraghattamaneni) (ఇదీ చదవండి: 'రంగబలి' సినిమా రివ్యూ) -
ప్రపంచ సుందరి కిరీటం ఈసారి అగ్రరాజ్యం సొంతం
-
మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకున్న అమెరికా సుందరి
మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఈసారి అగ్రరాజ్యం సొంతం చేసుకుంది. అమెరికాకు చెందిన ఆర్బోనీ గాబ్రియల్ మిస్ యూనివర్స్ 2022 విజేతగా నిలిచింది. విన్నర్ గాబ్రియల్కు భారత్కు చెందిన మాజీ విశ్వ సుందరి హర్నాజ్ సంధు ఈ కిరీటాన్ని బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా గడిచిన పదేళ్లలో యూఎస్ఏకు ఇది తొలి విజయం. ఇప్పటి వరకు తొమ్మిది విశ్వసుందరి టైటిళ్లను దక్కించుకోగా.. పోటీ చరిత్రలో అత్యధిక సార్లు గెలిచిన దేశంగా యూఎస్ఏ రికార్డు సృష్టించింది. ఇక మిస్ వెనిజులా ఆమంద డుడామెల్ తొలి రన్నరప్గా నిలవగా.. మిస్ డొమిన్కన్ రిపబ్లిక్ ఆండ్రీనా మార్టినెజ్ రెండో రన్నరప్గా నిలిచింది. భారత్ తరపున ప్రాతినిథ్యం వహించిన మిస్ ఇండియా దివిట రాయ్ టాప్ 5లో సైతం చోటు దక్కించుకోలేకపోయింది. కేవలం టాప్ 16లో చోటు దక్కించుకొని సరిపెట్టుకుంది. అమెరికా లూసియానాలో వైభవంగా జరిగిన ఈ పోటీలో దాదాపు 80కుపైగా చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. The new Miss Universe is USA!!! #MISSUNIVERSE pic.twitter.com/7vryvLV92Y — Miss Universe (@MissUniverse) January 15, 2023 మరోవైపు 2021 మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు చివరి సారిగా వేదికపై ర్యాంప్ వాక్ చేశారు. హర్నాజ్ ర్యాంప్ మీదకు వస్తుండగా పోటీదారులందరూ చప్పట్లతో ఉత్సహంగా ఆమెకు గ్రాండ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి లోనయ్యింది. వేదికపై నడుస్తూ కంటి నుండి వస్తున్న కన్నీళ్లను ఆపుకునేందుకు ప్రయత్నించారు. అనంతరం తన చేతుల మీదుగా కొత్త మిస్ యూనివర్స్కు కిరిటాన్ని అందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంతేగాక విశ్వ సుందరి స్టేజ్పై హర్నాజ్ రెండు డిఫరెంట్ గౌన్లతో మెరిసిపోయారు. కాగా ఆమె ధరించిన స్పెషల్ గౌనుపై 1994 లో మిస్ యూనివర్స్గా గెలిచిన సుష్మితా సేన్ ఫోటో ఉండటం విశేషం.. కాగా హర్నాజ్ సంధు దాదాపు 21 ఏళ్ల తర్వాత భారత్కు మిస్ యూనివర్స్ టైటిల్ను అందించిన విషయం తెలిసందే. తన కంటే ముందు 1994లో సుష్మితా సేన్.. 2000 సంవత్సరంలో లారా దత్తా ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. Hold back tears as @HarnaazKaur takes the stage one last time as Miss Universe! #MISSUNIVERSE pic.twitter.com/L0PrH0rzYw — Miss Universe (@MissUniverse) January 15, 2023 -
మిస్ థాయ్లాండ్ ధరించిన ఈ డ్రెస్ వేటితో తయారు చేశారో తెలుసా..?
అందాల పోటీ అంటేనే గుర్తొచ్చేది వారు ధరించే దుస్తులు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఈ బ్యూటీ కాంటెస్ట్లో మోడల్స్ రకరకాల దుస్తులు ధరిస్తుంటారు. ఈ పోటీల్లో పాల్గొనే యువతులు అందం, ప్రతిభ ఎంత ముఖ్యమో వస్త్రధారణ కూడా అంతే ముఖ్యం. జడ్జిలతోపాటు యావత్ ప్రపంచాన్ని ఆకర్షించేలా వీరి వస్త్రధారణ ఉంటుంది. కళ్లు చెదిరే డ్రెస్లతో సాక్షాత్తు దేవకన్యే దిగివచ్చిందా? అనేలా క్యాట్ చేస్తూ మైమరిపిస్తుంటారు. మిస్ యూనివర్స్ 2022 పోటీలు తాజాగా న్యూజెర్సీలో జరిగాయి. ఈ పోటీల్లో థాయ్లాండ్ తరపున పోటీలో నిలిచిన అన్నాసుయాంగమ్-ఐయామ్ (Anna Sueangam-Iam) పేరు ఇప్పుడు మారుమోగుతోంది. ఇటీవల జరిగిన ప్రాథమిక పోటీలో ఆమె ధరించిన వెరైటీ గౌను అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆమె కాస్టూమ్ గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. టైటిల్ గెలవకుండానే అందరి దృష్టిని ఆకర్షించిన అన్నా గౌను అంత పాపులర్ కావడం వెనక ఓ బాధాకరమైన గతం ఉంది. వాడిపడేసిన కోక్ డబ్బా మూతలతో.. చూడటానికి ఎంతో అద్భుతంగా కనిపించిన ఈ గౌను వాస్తవానికి వాడిపడేసిన డ్రింక్ డబ్బాల మూతలతో తయారు చేశారు. మిస్ యూనివర్స్ థాయ్లాండ్ ఇన్స్ట్రాగ్రామ్ పేజ్లో అన్నా గౌనుకి సంబంధించిన వివరాలను షేర్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రఖ్యాత థాయ్ డిజైనర్ అరిఫ్ జహవాంగ్ ఈ డ్రెస్సును రూపొందించాడు. అన్నా తన బాల్యం, గత జీవితాన్ని ప్రపంచానికి తెలియజేసేలా ఈ డ్రెస్సును తయారు చేయించింది ఈ క్రమంలో ఉపయోగించిన డ్రింక్ క్యాన్స్ మూతలతో (రిసైకిల్ వ్యర్థాలతో) దీనిని తీర్చిదిద్దేలా జాగ్రత్త పడింది. లుక్ కోసం ఆ మూతల మధ్యలో స్వరోవ్స్కీ డైమండ్స్ వచ్చేలా రెడీ చేసుకుంది. ఈ గౌనుతోనే అన్నా ప్రాథమిక పోటీల్లో పాల్గొంది. బాల్యమంతా చెత్తలోనే కాగా థాయ్లాండ్కు చెందిన అన్నా తండ్రి చెత్త సేకరిస్తూ, తల్లి వీదుల్లో చెత్త ఊడుస్తూ జీవనం సాగిస్తుంటారు. దీంతో ఆమె బాల్యమంతా చెత్తకుప్పలు, వాడి పడేసిన వస్తువుల మధ్యే సాగింది. తల్లిదండ్రులు పని నిమిత్తం బయటే ఎక్కువ గడపడంతో అన్నా తన నానన్మ దగ్గరే పెరిగింది. తల్లిదండ్రులు తమ స్తోమతకు మించి కూతుర్ని చదివించారు. అందుకు తగ్గట్టే అన్నా కష్టపడి చదివి డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించింది. చదువుకునే రోజుల్లో కొందరు ఆమెను గార్బెజ్ బ్యూటీ క్వీన్గా ఎగతాళి చేసేవారు. అయినా అన్నా అవన్నీ పట్టించుకునేది కాదు. ఓవైపు చదువులో రాణిస్తూ మరోవైపు అందాల పోటీల్లో పాల్గొనేది. అలా మిస్ థాయ్లాండ్ 2020’ పోటీల్లో పాల్గొని ‘టాప్ 16’లో చోటు సంపాదించుకుంది. ఆ తర్వాత జరిగిన ‘మిస్ యూనివర్స్ థాయ్లాండ్ 2022’ పోటీల్లో టైటిల్ సంపాదించి తన కలను సాకారం చేసుకుంది. తనను విమర్శించిన నోళ్లను మూయిస్తూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. గతం ఎలా ఉన్నా కృషి పట్టుదల, నమ్మకంతో గొప్ప విజయాలను సాధించవచ్చని నిరూపించింది. View this post on Instagram A post shared by Miss Universe Thailand (@missuniverse.in.th) View this post on Instagram A post shared by Miss Universe Thailand (@missuniverse.in.th) తన డ్రెస్కు సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘ఈ గౌనులో నా బాల్యం దాగుంది. నా తల్లిదండ్రులు చెత్తను సేకరించేవారు. నా బాల్యమంతా చెత్తకుప్పల మధ్యే సాగింది. అందుకే అందరూ వాడి పడేసిన కూల్డ్రింగ్ మూతలతో ఈ గౌన్ను డిజైన్ చేయించాను. పనికిరాని వస్తువులకు కూడా అందం, విలువ ఉంటాయని దీని ద్వారా ప్రపంచానికి చూపించాలనుకున్నాం. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ చెప్పుకొచ్చింది. మిస్ యూనివర్స్ 2022 టైటిల్ గెలుచుకున్న అమెరికా భామ మిస్ యూనివర్స్ 2021 కీరిటాన్ని భారతీయ యువతి హర్నాజ్ కౌర్ సంధు గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా 2022గానూ పోటీలు న్యూజెర్సీలో (జనవరి 14న) జరిగాయి. ఈ ఏడాది భారత్ తరపున కర్ణాటకకు చెందిన 23 ఏళ్ల దివితా రాయ్ ప్రాతినిథ్యం వహించారు. గతేడాది మిస్ దివా యునివర్స్ టైటిల్ను ఈమె సొంతం చేసుకొని మిస్ యూనివర్స్ కంటెస్టెంట్గా అడుగుపెట్టింది. అయితే అమెరికాకు చెందిన ఆర్ బోనీ గాబ్రియేల్ మిస్ యూనివర్స్ 2022 కిరీటాన్ని దక్కించుకుంది. The new Miss Universe is USA!!! #MISSUNIVERSE pic.twitter.com/7vryvLV92Y — Miss Universe (@MissUniverse) January 15, 2023 -
మిస్ యూనివర్స్ ప్రిలిమినరీ పోటీల్లో అందాల భామల సందడి (ఫొటోలు)
-
మిస్ యూనివర్స్ పోటీలు నిర్వహించే సంస్థను కొనుగోలు చేసిన తొలిమహిళ
బ్యాంకాక్: మిస్ యూనివర్స్ వంటి అందాల పోటీలను నిర్వహించే సంస్థను తొలిసారిగా ఒక థాయి మహిళ సుమారు రూ. 164 కోట్లతో కొనుగోలు చేసింది. థాయి స్థానిక మీడియా ప్రాజెక్టు రన్వే ఎడిషన్ను నిర్వహిస్తున్న ట్రాన్స్ జెండర్ హక్కుల ప్రచారకర్త అయినా జకపాంగ్ జక్రాజుతాటిప్ ఈ సంస్థను కొనుగోలు చేసినట్లు జేకేఎన్ గ్లోబల్ గ్రూప్ బుధవారం ప్రకటించారు. ఈ మేరకు ఆమె సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా వ్యవహరిస్తారని గ్లోబల్ గ్రూప్ పేర్కొంది. అంతేగాదు 70 ఏళ్ల చరిత్రలో ఈ అందాల పోటీ సంస్థను సొంతం చేసుకున్న తొలిమహిళ జకపాంగేనని వెల్లడించింది. గతంలో ఈ సంస్థ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యజమాన్యంలో ఉన్నట్లు తెలిపింది. ఈమేరకు జకపాంగ్ మాట్లాడుతూ...తాను కొనుగోలు చేసిన బ్రాండ్ని అభివృద్ధి చేయడానికి దొరికిన అరుదైన అవకాశంగా పేర్కొంది. ఇది థాయ్లాండ్ ప్రతిష్టను మరింత పెంచుతుందని భావిస్తున్నానని చెప్పింది. ఈ సంస్థ థాయ్లాండ్కు ఒక మంచి శక్తిగా ఉపయోగపడుతుందని, పైగా ఎక్కువ మంది పర్యాటకులను తీసుకువస్తుందని విశ్వసిస్తున్నాని అని అన్నారు. ఈ సంస్థ తాను రన్ చేస్తున్న కంపెనీ ఫోర్ట్ఫోలియోకు బలమైన వ్యూహాత్మక శక్తిగా ఉంటుందని పేర్కొంది. అలాగే విభిన్న నేపథ్యాలు, సంస్కృతులు, సంప్రదాయాలు నుంచి వచ్చే ఉద్వేగభరితమైన వ్యక్తులకు వేదికను అందించే వారసత్వాన్ని కొనసాగిస్తూ..ఒక గొప్ప బ్రాండ్గా అభివృద్ధి చేసేందుకు యత్నిస్తానని జకపాంగ్ చెప్పారు. తదుపరి మిస్ యూనివర్స్ పోటీ యూఎస్లో న్యూ ఓర్లిన్స్లో జరగనుంది. (చదవండి: కళ్లు చెదిరే ఆవిష్కరణ: కన్నే ఫ్లాష్ లైట్లా వెలుగుతుంది...) -
Miss Universe: చారిత్రక మార్పు! ఇకపై వాళ్లు కూడా పాల్గొనవచ్చు! అయితే..
Miss Universe Beauty Pageant Rules: ‘స్వీయ–వ్యక్తీకరణకు వేదిక’ అంటూ తన గురించి ఘనంగా పరిచయం చేసుకుంటుంది మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ (ఎంయూఓ). అయితే స్వీయ–వ్యక్తీకరణకు ఆర్గనైజేషన్ రూల్బుక్లో కొన్ని నిబంధనలు అడ్డుపడుతున్నాయని, పరిమితులు విధిస్తున్నాయనే విమర్శ ఉంది. మొన్నటి వరకు– ‘ఆ నిబంధనలు అంతే. అప్పుడూ ఉన్నాయి. ఎప్పుడూ ఉంటాయి’ అన్నట్లుగా వ్యవహరించిన ఆర్గనైజేషన్ ఒక చారిత్రక మార్పునకు శ్రీకారం చుట్టబోతోంది... అప్పటి వరకు సింగిల్గానే ఉండాలి! మిస్ యూనివర్స్ 2023 పోటీలో వివాహితులు, మాతృమూర్తులు కూడా నిరభ్యంతరంగా పాల్గొనవచ్చు. నిబంధనను సవరించడానికి శ్రీకారం చుట్టడం ద్వారా విప్లవాత్మకమైన, చారిత్రాత్మక మార్పు దిశగా అడుగు వేసింది ఎంయూవో. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం విశ్వసుందరి పోటీల్లో వివాహితులు, మాతృమూర్తులు పాల్గొనడానికి అనర్హులు. టైటిల్ దక్కించుకున్నవారు కొత్త విజేత ఆగమనం వరకు సింగిల్గానే ఉండాలి. మార్పు మంచిదే! ‘ఎంయూవో’లో వచ్చిన మార్పుపై తన సంతోషాన్ని వ్యక్తపరిచింది ఆండ్రియా మెజా. మెక్సికోకు చెందిన ఆండ్రియా ‘మిస్ యూనివర్స్ 2020’ కిరీటాన్ని దక్కించుకున్న విజేత. ‘సమాజంలో రోజురోజూకు ఎన్నో మార్పులు వస్తున్నాయి. అవి ఆయా రంగాలలోప్రతిఫలిస్తున్నాయి. మహిళలు నాయకత్వ స్థానాల్లోకి వెళుతున్నారు. తమను తాము నిరూపించుకుంటున్నారు. మార్పు అన్ని రంగాలలోనూ రావాలి. దీని ప్రకారం చూసినప్పుడు మిస్ యూనివర్స్ పోటీలో వివాహితులు, తల్లులకు ప్రవేశం కల్పించడం అనేది ఆహ్వానించదగిన, హర్షించాల్సిన మార్పు. అయితే ఈ నిర్ణయం కొద్దిమందికి రుచించక పోవచ్చు. దీనికి కారణం వారి వ్యక్తిగత స్వార్థం తప్ప మరేదీ కాదు. ప్రస్తుత మార్గదర్శకాలలో అవాస్తవికత కనిపిస్తుంది. పెళ్లి, మాతృత్వంలాంటి వ్యక్తిగత నిర్ణయాలు వారి ప్రతిభకు అడ్డంకి కావడం అనేది సమర్థనీయం కాదు. ఇరవై ఏళ్లకే పెళ్లై పిల్లలు ఉన్నవారు ఉన్నారు. వారిలో ఎంతోమందికి మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొనాలనే కల ఉండవచ్చు. నిబంధనల వల్ల తమ కలను సాకారం చేసుకునే అవకాశం దక్కి ఉండకపోవచ్చు. తాజా మార్పు వల్ల ఇలాంటి మహిళల జీవితాల్లో అనూహ్యమైన మార్పు వస్తుంది’ అంటుంది ఆండ్రియా మెజా. రూల్ అంటే రూలే అనుకునే రోజులకు కాలం చెల్లింది! ‘ఇది మొదటి అడుగు. ఇంకా ఎన్నో అడుగులు పడాలి’ అంటుంది బెంగళూరుకు చెందిన సామాజిక కార్యకర్త అక్షర. విడాకులు తీసుకున్నవారు, అబార్షన్ చేయించుకున్నవారు పోటీలో పాల్గొనడానికి అనర్హులు అనేది ఒకప్పుడు ‘మిస్ అమెరికా’ నిబంధనలలో ఉండేది. మోడల్ వెరోనిక 2018లో ‘మిస్ ఉక్రెయిన్’ టైటిల్ను గెల్చుకుంది. అయితే ఆమె అయిదు సంవత్సరాల పిల్లాడికి తల్లి అని ఆలస్యంగా తెలుసుకున్న ఆర్గనైజేషన్ ఆ టైటిల్ను వెనక్కి తీసుకుంది. టైటిల్ను వెనక్కి తీసుకోవడంపై మండిపడడమే కాదు న్యాయపోరాటానికి కూడా సిద్ధపడింది వెరోనిక. ‘రూల్ అంటే రూలే అనుకునే రోజులకు కాలం చెల్లింది. కాలంతోపాటు అవి మారితేనే కాలానికి నిలబడతాయి’ అంటుంది జైపూర్కు చెందిన శాన్వి. అంతబాగానే ఉంది.. కానీ! తాజాగా 70 వసంతాల ప్రత్యేక సంచికను ఆవిష్కరించింది మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్. ఇది డిజిటల్ సంచిక. ‘175, 000 పేపర్ పేజీల అవసరం లేకుండా ఈ డిజిటల్ సంచిక తీసుకువచ్చాం’ అంటుంది ఆర్గనైజేషన్ పర్యావరణహిత స్వరంతో. ఇది బాగానే ఉందిగానీ, మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్లోని నిబంధనలు, భావజాలానికి సంబంధించి(వర్ణం, ఒడ్డూపొడుగు...ఇలాంటివి మాత్రమే అందానికి నిర్వచనాలా!) ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల శిబిరాల నుంచి ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయి. చెవివొగ్గి, వాటిని సానుకూలంగా అర్థం చేసుకొని ముందుకు కదిలితే సంస్థకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభించడానికి అట్టే కాలం పట్టదు. చదవండి: Kavitha Naga Vlogs: ఆమె మనసుకు రుచి తెలుసు Benefits Of Onion Juice: ఉల్లి రసాన్ని కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు పట్టిస్తే! నల్లని, ఒత్తైన కురులు..! The new Miss Universe is...India!!!! #MISSUNIVERSE pic.twitter.com/DTiOKzTHl4 — Miss Universe (@MissUniverse) December 13, 2021 -
ఛీ.. ఇదా మీరిచ్చే గౌరవం.. శిల్పా శెట్టి, బాద్షాపై నెటిజన్ల ఫైర్
Shilpa Shetty Badshah Gets Trolled Showing Attitude To Harnaaz Sandhu: హర్నాజ్ కౌర్ సంధు 'మిస్ యూనివర్స్ 2021' కిరీటాన్ని గెలిచి భారదేశం గర్వించేలా చేసింది. బాలీవుడ్ బ్యూటీ లారా దత్తా తర్వాత ఈ కిరీటాన్ని సాధించిన మూడో భారతీయురాలిగా హర్నాజ్ పేరు పొందింది. ఈ టైటిల్ సొంతం చేసుకున్నప్పటి నుంచి హర్నాజ్ సంధు అనేక వేడుకలకు హాజరవుతోంది. ఇటీవల లాక్మే ఫ్యాషన్ వీక్లో ర్యాంప్పై నడిచి ఆకట్టుకుంది. తాజాగా మోస్ట్ పాపులర్ అయిన బాలీవుడ్ షో 'ఇండియాస్ గాట్ టాలెంట్ 9'కు అతిథిగా హాజరైంది. ఈ రియాలిటీ షోలో శిల్పా శెట్టి, బాద్షా, మనోజ్ ముంతాషీర్, కిరణ్ ఖేర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షో నుంచి హర్నాజ్ సంధు అతిథిగా హాజరైన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వైరల్ వీడియోలో హర్నాజ్ సంధు న్యాయనిర్ణేతలను పలకరించేందుకు వచ్చినప్పుడు శిల్పా శెట్టి పట్టించుకోకుండా కనిపించింది. మిగతా జడ్జ్లతో హర్నాజ్ షేక్హ్యాండ్ ఇస్తూ మాట్లాడుతుంటే శిల్పా శెట్టి మాత్రం తన చెల్లెలు షమితా శెట్టితో ఉంది. తర్వాత చివర్లో హర్నాజ్ను పలకరించింది శిల్పా శెట్టి. ఇది చూసిన నెటిజన్లు శిల్పా శెట్టి, బాద్షాపై మండిపడుతున్నారు. కనీసం అతిథులుగా గౌరవం ఇచ్చే సంస్కారం లేదని దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే శిల్పా శెట్టి, బాద్షాలు పలకరించిన తీరు ఫేక్ అంటూ కామెంట్ పెడుతున్నారు. హర్నాజ్ షేక్హ్యాండ్ ఇస్తున్నప్పుడు శిల్పా ఇచ్చి ఎక్స్ప్రెషన్ నెటిజన్లకు మింగుడుపడటం లేదు. View this post on Instagram A post shared by Miss Diva (@missdivaorg) 'ఈ జడ్జ్లకు కనీస గౌరవమర్యాదలు తెలియవు. అంతా నకిలీ, కొంచెం కూడా ఇష్టం లేనట్టుంది. హర్నాజ్ సంధు ఎంత మంచి అమ్మాయి. దేశానికి ఎంత పేరు తీసుకొచ్చింది. కొంచెం కూడా గౌరవం లేదు. సిగ్గుచేటు.' అంటూ ఒకరు కామెంట్ పెట్టారు. మరొకరు 'వారి ముఖాలకు ఏమైంది ? ఫేక్ ఎక్స్ప్రెషన్స్', 'అసలు వాళ్లకైమైంది. వాళ్లదంతా నటన అని చాలా సులభంగా తెలిసిపోతుంది', 'ఈ అమ్మాయి దేశం కోసం చాలా చేసింది. 21 సంవత్సరాల తర్వాత కిరీటాన్ని తీసుకొచ్చింది. అందుకు జడ్జ్ల తీరు చూడండి. అదంతా ఫేక్. ఆమెను కలవడం వాళ్లకు బొత్తిగా ఇష్టం లేనట్టుంది', 'వారికి హర్నాజ్ నచ్చలేదని ఇప్పటిదాకా నేను మాత్రమే అనుకున్నాను' అని శిల్పా శెట్టి, బాద్షా తీరుపై మండిపడుతున్నారు నెటిజన్స్. View this post on Instagram A post shared by Miss Diva (@missdivaorg) View this post on Instagram A post shared by Miss Diva (@missdivaorg) -
Viral Video: వైరల్గా మిస్ యూనివర్స్ 2021 డాన్స్ వీడియో..
లక్నో: మిస్ యూనివర్స్ 2021 విజేతగా నిలిచిన ఇండియన్ మోడల్ హర్నాజ్ కౌర్ సంధు డ్యాన్స్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఇండో టిబేటియన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ) మహిళా సాధికారత, హెచ్డబ్ల్యూడబ్ల్యూఏ రైజింగ్ డేని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హర్నాజ్ సంధు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటీబీపీ జవాన్ల కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి డ్యాన్స్ చేశారు. మహిళలందరితో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. పంజాబీ సాంగ్స్కి హర్నాజ్ తనదైన స్టెప్పులతో అదరగొట్టారు. మొత్తం కారక్రమానికే ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అదే విధంగా అక్కడున్న వారందరితోనూ సరదాగా ఫోటోలు దిగారు. ఈ వీడియోను ఐటీబీపీ తన ట్విటర్లో పోస్టు చేసింది. ‘మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ కౌర్ సంధు.. హిమవీర్ కుటుంబాలు, పిల్లలతో కలిసి గ్రూప్ పెర్ఫార్మెన్స్ చేశారు’ అనే క్యాప్షన్తో షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. చదవండి: అందరిలో ఒకటే ఉత్కంఠ..ఆమె గోల్ వేయాలని ఐతే.. Miss Universe 2021 Harnaaz Kaur Sandhu joining #Himveer families and children in a group performance during a special programme organized on Women Empowerment & HWWA Raising Day at 39th Battalion ITBP Greater Noida today. Sh Ritu Arora, Chairperson, HWWA was the Chief Guest. pic.twitter.com/k4MSGAhNFI — ITBP (@ITBP_official) March 24, 2022 కాగా మిస్ యూనివర్స్ 2021 కీరిటాన్ని భారతీయ యువతి హర్నాజ్ కౌర్ సంధు గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో 21 ఏళ్ల తర్వాత మిస్ యూనివర్స్ కిరీటం గెలుపొందిన భారతీయురాలిగా సంధు రికార్డు సృషకటించారు. చివరిసారిగా లారా దత్తా 2000లో మిస్ యూనివర్స్ టైటిల్ను గెలుపొందింది. ఇజ్రాయిల్లోని ఇలాట్ నగరం జరిగిన 70వ మిస్ యూనివర్స్ పోటీల్లో పరాగ్వే, దక్షిణాఫ్రికా సుందరీమణుల నుంచి హర్నాజ్ తీవ్ర పోటీ ఎదుర్కొని.. చివరకు అందాల కిరీటాన్ని హర్నాజ్ సొంతం చేసుకున్నారు. చదవండి: జీవితంలో రోజుకు ఒకసారైనా ఇలా చేయండి!! -
నాది ఎక్స్పోజింగ్ అయితే! మరి ఆమె చేసిందో?
సెలబ్రిటీలకు చేదు అనుభవాలు ఎదురైనప్పుడు సోషల్ మీడియా సాక్షిగా చర్చలు నడవడం సహజం. మిస్ యూనివర్స్-2012 ఒలీవియా కల్పో తాజాగా తనకు ఎదురైన ఓ అనుభవం గురించి పోస్ట్ చేయగా.. అభిమానుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. గురువారం చోటు చేసుకున్న ఈ ఘటన ప్రకారం.. మెక్సికోలోని కాబో శాన్ లుకాస్ అనే రిసార్ట్కి తన సోదరి, బాయ్ఫ్రెండ్తో పాటు బయలుదేరింది. ఆ సమయంలో ఆమె పైన టాప్తో డ్రెస్ వేసుకుని ఉంది. అయితే క్లీవేజ్ కనిపించేలా ఆ డ్రెస్సు ఉండడంతో సిబ్బంది ఆమెను విమానంలోకి అనుమతించలేదు. దీంతో తన బాయ్ఫ్రెండ్ క్రిస్టియన్ మెక్కాఫెరే హూడీని తగిలించుకుని ఆమె ఫ్లైట్ ఎక్కింది. ఈ క్రమంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసిన ఆమెకు షాక్ తగిలింది. తనకంటే దారుణమైన దుస్తులతో ఉన్న మహిళను విమానంలోకి సిబ్బంది అనుమతించారు. దీంతో అక్కడి ఘటనతంతా వరుసగా ఫొటోలు, వీడియోల రూపంలో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది ఒలీవియా సోదరి అరోరా. తనకు ఎదురైన అమానం గురించి అందరికీ తెలియాలనే తాను ఈ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు ఓ మీడియా హౌజ్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది ఒలీవియా. Come on! Who dresses like that to go on a plane. I’m glad @AmericanAir made her cover up. People today think they can just walk around scantily clad and we’re just supposed to accept it. @oliviaculpo dress like an adult. #teamamericanairlines — Missy (@melissa_U25) January 15, 2022 PR stunt, it's the simplest explanation. It worked too, BTW. — 🍊💊Jorj X McKie🍊💊 (@Jorj_X_McKie) January 15, 2022 Funny how the sister who thinks Olivia looks cute and appropriate is covered from head to toe. You look like you’re wearing a bra and spanks. Try adulting and put some actual clothes on. You’d think a former Miss Universe would have some standards. 🤷🏻♀️ — Angela (@hotstuffmedic) January 15, 2022 -
డబ్బున్నోడు? కష్టపడేటోడు? విశ్వసుందరి ఛాయిస్ ఎవరంటే..
Miss Universe Harnaaz Sandhu About Dating: సుమారు 21 ఏళ్ల తర్వాత 21 ఏళ్ల భారతీయ యువతి హర్నాజ్ సంధు విశ్వసుందరిగా నిలవడంపై యావత్ దేశం హర్షం వ్యక్తం చేసింది. అయితే అంతర్జాతీయ వేదికగా ఆమెకు ఎదురైన ‘ఇబ్బందికర’ అనుభవం గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ నడిచింది. ఆ అనుభవంతో పాటు పలు అంశాగా తాజాగా ఈ ఛండీగఢ్ బ్యూటీ.. ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. బాగా డబ్బున్న ఓ ముసలి వ్యక్తి.. కష్టపడే తత్వం ఉన్న ఓ యువకుడు.. ఇద్దరిలో డేటింగ్ కోసం ఎవరిని ఎంచుకుంటారు? అనే ప్రశ్న ఎదురైంది హర్నాజ్కు. దానికి ఆలోచించకుండానే కష్టపడే వ్యక్తి అని సమాధానం ఇచ్చిందామె.‘‘కష్టం విలువేంటో నాకు తెలుసు. గతంలో చాలా కష్టపడ్డా. భవిష్యత్తులోనూ ఆ పరిస్థితి ఎదురుకావొచ్చు. నాకు కష్టం విలువేంటో తెలుసు. అందుకే కష్టం తెలిసిన వ్యక్తినే కోరుకుంటా.. అప్పుడే మా లక్ష్యాల్ని పరస్పరం గౌరవించుకున్నవాళ్లం అవుతాం’’ అని సమాధానమిచ్చింది హర్నాజ్. మిస్ యూనివర్స్ హర్నాజ్ గురించి ఈ విషయాలు తెలుసా? ఇక బాలీవుడ్ ఎంట్రీ, కాస్టింగ్ కౌచ్ అంశాలపై ప్రశ్న ఎదురుకాగా.. వాటిపై స్పందించడం తనకు తొందరపాటే అవుతుందని, ప్రస్తుతం తాను తన విజయాన్ని మాత్రమే ఆస్వాదిస్తున్నానని తెలిపింది హర్నాజ్. ఒకవేళ హాలీవుడ్లో గనుక అవకాశం వస్తే మాత్రం ఉమెన్ ఎంపవర్మెంట్ను చాటే బలమైన క్యారెక్టర్లకు ప్రాధాన్యం ఇస్తానని తెలిపింది. ఇక మిస్ యూనివర్స్-2021 గ్రాండ్ ఫినాలే సందర్భంగా.. అమెరికన్ టీవీ హోస్ట్ స్టీవ్ హార్వే, హర్నాజ్తో వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. జంతువులను అనుకరిస్తూ శబ్దాలు చేయాలంటూ స్టీవ్, హర్నాజ్ను కోరగా ఆమె అలానే చేసింది. ఈ వ్యవహారంపై హర్నాజ్ స్పందిస్తూ.. అది అనవసరమైన ప్రశ్న అని తాను అనుకోవట్లేదని, అంతర్జాతీయ పోటీల తీరు కొందరు అనుకుంటున్నట్లు ఉండదని, ఆయన తీరు తనకేం ఇబ్బంది అనిపించలేమని, పైగా ఆ సంభాషణను తాను ఆస్వాదించానని తెలిపింది. హర్నాజ్ తళుకులకు కారణం ఏంటో తెలుసా? -
మిస్ యూనివర్స్-2021 ఈవెంట్లో బాలీవుడ్ నటికి అరుదైన గుర్తింపు
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా హాట్టాపిక్గా మారింది. ఇందుకు కారణం ఆమె మిస్ యూనివర్స్ 2021 పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించడమే కాకుండా ఈవేడుకలో ఆమె ధరించిన ఫ్రాక్ ఖరీదుతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఒకప్పుడు మిస్ యూనివర్శర్గా పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకున్న ఆమె అదే వేదికకు జడ్జీగా వ్యవహరించడం నిజంగా విశేషమే. దీంతో ఆమె ప్రస్తుతం వార్తల్లో హాట్టాపిక్ మారింది. మోడల్గా కెరీర్ను ఆరంభించిన ఊర్వశి 2013లో ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. ‘సనమ్ రే’, ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’, ‘హేట్ స్టోరీ-4’, ‘పాగల్ పంతీ’, ‘వర్జిన్ భానుప్రియ’సినిమాల్లో నటించి మెప్పించింది. చదవండి: ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుతం నో ఆఫర్స్, అయినా తగ్గని క్రేజ్.. త్వరలో ‘బ్లాక్రోజ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించనుందీ ఈ భామ. ఈ క్రమంలో 2015లో భారత్ తరఫున మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా కిరీటం దక్కించుకుంది. ఇటీవల ఇజ్రాయెల్ వేదికగా జరిగిన ‘మిస్యూనివర్స్ -2021’ పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. దీంతో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ మిస్ యూనివర్స్ గ్రాండ్ ఈవెంట్కు భారత్ తరపున వెళ్లి న్యాయనిర్ణేతగా వ్యవహరించిన అతిపిన్న వయస్కురాలిగా ఊర్వశీ అరుదైన గుర్తింపు దక్కించుకుంది. ఈ పోటీల్లో మన దేశానికే చెందిన హర్నాజ్ సంధు విశ్వ సుందరి కిరీటం దక్కించుకున్న సంగతి తెలిసిందే. చదవండి: Pushpa Movie: విడుదలకు కొద్ది గంటలే, బంపర్ ఆఫర్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇదిలా ఉంటే ఈ గ్రాండ్ ఈవెంట్ ముగిసిన అనంతరం ఈ బాలీవుడ్లో ఫ్యాషన్ దివా ముంబై విమానాశ్రయంలో బేబీ పింక్ కలర్ డ్రెస్ ధరించి కనిపించింది. ఈ సందర్భంగా కెమెరా కళ్లు ఆమెను క్లిక్మనిపించాయి. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారగా తను ధరించిన డ్రెస్ ధర, విశేషాలు తెలుసుకొని చాలామంది అవాక్కయ్యారు. ఊర్వశి ధరించిన ఈ డ్రెస్ ధర సుమారుగా రూ. 5లక్షల వరకు ఉంటుందని, ఈ ప్రాక్లో డైమండ్లను కూడా పొందుపరచినట్లు తెలిసి అందరూ అవాక్కవుతున్నారు. ఆమె ధరించిన చెవి రింగులు కూడా వజ్రాలతో తయారైనవే. కాగా ఇలా వెరైటీ డ్రెస్లు, అవుట్ఫిట్లతో వార్తల్లో నిలవడం ఊర్వశికి మొదటిసారి కాదు. ఇంతకు ముందు ఓ మూవీ ఈవెంట్లో ఆమె ధరించిన రెడ్ ఫ్రాక్తో వార్తల్లో నిలిచింది. చదవండి: మహిళల పరువు పోయింది.. సమంత స్పెషల్ సాంగ్పై మాధవిలత షాకింగ్ కామెంట్స్ View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳 (@urvashirautela) -
విశ్వసుందరికి సాదర స్వాగతం
-
ప్రపంచాన్ని ఫిదా చేసిన ‘విశ్వ’సుందరి హర్నాజ్ కౌర్ సంధు.. ఫొటోలు
-
Harnaaz Sandhu: మిస్ యూనివర్స్ హర్నాజ్ గురించి ఈ విషయాలు తెలుసా?
Interesting Facts About Harnaaz Sandhu: ప్రపంచం ఎదుట భారతీయ సౌందర్యం మరోసారి మెరుపు నవ్వు నవ్వింది. ప్రపంచం ఎదుట భారతీయ సంస్కారం మరోసారి తన ఎరుకను ప్రదర్శించింది. ప్రపంచం ఎదుట భారతీయ స్త్రీ సౌందర్యకాంక్ష తన శిరస్సు మీదకు జయ కిరీటాన్ని ఆహ్వానించింది. చండీగఢ్కు చెందిన హర్నాజ్ సంధు ‘విశ్వ సుందరి’ కిరీటాన్ని గెలుచుకుంది. 21 ఏళ్ల హర్నాజ్ 2021లో 21 ఏళ్ల సుదీర్ఘ ఎదురు చూపుల తర్వాత మరోసారి ఈ కిరీటాన్ని దేశానికి తెచ్చింది. ‘చక్ దే ఫట్టే ఇండియా’ అని కేరింతలు కొట్టింది హర్నాజ్ కిరీటం గెలిచాక. అంటే ‘సాధించు. గెలుపు సాధించు ఇండియా’ అని అర్థం. నేడు ఇండియా గెలిచింది. ‘విశ్వసుందరి’ మిస్ ఇండియా హర్నాజ్ సంధు (మధ్యలో) ఇరువైపులా రన్నరప్స్ పరాగ్వేకు చెందిన మిస్ నాడియా, సౌతాఫ్రికాకు చెందిన మిస్ లలేలా డిసెంబర్ 12న (మన తేదీ ప్రకారం 13 తెల్లవారుజామున) భారతీయురాలైన హర్నాజ్ సంధు తల మీద విశ్వసుందరి కిరీటం తళుక్కున మెరిసింది. ప్రపంచమంతా కరతాళధ్వనులు మోగిస్తుండగా దేశం అందమైన ఈ విజయంతో ఉత్సాహంగా నిద్ర లేచింది.1994లో సుస్మితా సేన్ మొదటిసారి ఈ టైటిల్ గెలిచి స్ఫూర్తి ఇచ్చాక 2000లో లారా దత్తా రెండోసారి గెలిచాక మూడోసారి టైటిల్కై సాగుతున్న ఎదురుచూపులకు అడ్డుకట్ట వేస్తూ హర్నాజ్ ఈ సౌందర్యాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఇజ్రాయిల్ రేవు పట్టణం ఐలత్లో తాత్కాలికంగా నిర్మించిన భారీ ప్రాంగణంలో సుప్రసిద్ధ వ్యాఖ్యాత స్టీవ్ హార్వే హోస్ట్గా జరిగిన ఈ విశ్వ పోటీలో 80 దేశాల పోటీదారులను దాటి హర్నాజ్ ఈ కిరీటాన్ని గెలుచుకుంది. ఎర్రసముద్రం మురిసిపోయింది ఎర్రసముద్రం ఒడ్డు మీద ఉన్న 50 వేల జనాభా కలిగిన ఐలత్ పట్టణంలో హర్నాజ్ విజయంతో భారత్ పేరు మార్మోగింది. ఎవరీ అందగత్తె అని ఎర్రసముద్రం తొంగి చూసి మురిసిపోయింది. ‘భారతీయ సౌందర్యానికి నేను బెస్ట్ వెర్షన్ని’ అని పోటీలకు వెళ్లబోతూ వ్యాఖ్యానించిన హెర్నాజ్ 80 దేశాల అందగత్తెలతో తలపడి ముందు టాప్ 16లో ఆ తర్వాత టాప్ 10లో ఆపైన టాప్ 5లో వెళ్లి టైటిల్ మీద ఆశలు రేపింది. టాప్-3లోకి రాగానే ఉత్కంఠ నెలకొంది. చివరి ఇద్దరిలో పరాగ్వే దేశ పోటీదారైన నాడియా చేతులు పట్టుకుని అంతిమ ఫలితం కోసం నిలుచున్న హెర్నాజ్ ‘ఇండియా’ అన్న ప్రకటన వెలువడిన వెంటనే ఆనందబాష్పాలు రాల్చింది. సెకండ్ రన్నర్ అప్గా సౌత్ ఆఫ్రికాకు చెందిన లలేలా నిలిచింది. సౌందర్యంతో పాటు చైతన్యం కూడా అందాల పోటీలో భాగంగా ప్రశ్న–జవాబు ఘట్టంలో లాటరీ ద్వారా ‘గ్లోబల్ వార్మింగ్’ అంశం తన వంతుకు రాగా హర్నాజ్ చైతన్యవంతమైన జవాబు చెప్పింది. ‘ఒకనాడు మనకు మన జీవితం సాక్షాత్కరిస్తుంది. అది వీక్షించదగ్గదిగా ఉండాలని మనం అనుకుంటాం. కాని పర్యావరణానికి మనం చేస్తున్న అవమానకరమైన కీడు వల్ల ఆ జీవితం మనం ఆశించినట్టుగా ఉండదు. ప్రకృతి మరణిస్తుంది. ఇప్పటికైనా ఈ చేటును మనం నివారించగలం. కనీసం అక్కర్లేని లైట్లను ఈ రాత్రి నుంచే ఆఫ్ చేయడం మొదలెడదాం’ అంది. అలాగే ‘నేటి యువతులు ఎదుర్కొంటున్న వొత్తిడిని మీరెలా చూస్తారు’ అనే ప్రశ్నకు ‘నేటి యువతులకు అన్ని శక్తులూ ఉన్నాయి. కాని వారికి వారి పైన నమ్మకం లేదు. ఇతరులతో పోల్చుకుని న్యూనత చెందుతున్నారు. మీరు మీలాగే ఉండటం మీ ప్రత్యేకత అని తెలుసుకోవాలి’ అంటూ సమాధానం చెప్పింది. ప్రతి భారతీయుని గర్వం హర్నాజ్కు విశ్వకిరీటం దక్కగానే తొలి భారతీయ విశ్వసుందరి సుస్మితాసేన్ తన సంతోషాన్ని ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. ‘ప్రతి భారతీయుని గర్వం హర్నాజ్. సో ప్రౌడ్ ఆఫ్ యూ’ అని వ్యాఖ్యానించింది. ఇక లారాదత్తా అయితే ‘విశ్వసుందరుల క్లబ్లోకి ఆహ్వానం. ఈ విజయం కోసం 21 ఏళ్లుగా ఎదురు చూస్తున్నా’ అని ట్వీట్ చేసింది. నిన్న మొన్నటి వరకూ ఒకటి రెండు పంజాబీ సినిమాల్లో నటించింది సంధు. బహుశా అతి త్వరలో ఆమెను బాలీవుడ్ తెర మీద చూడొచ్చు. మధ్యతరగతి విజయం ‘హర్నాజ్ మధ్యతరగతి అమ్మాయి. మధ్యతరగతి అమ్మాయిలు కలలు కని సాధించుకోవచ్చు అనడానికి ఉదాహరణ’ అంటుంది హర్నాజ్ తల్లి రవిందర్ సంధు. ఆమె గైనకాలజిస్ట్గా పని చేస్తున్నారు. హర్నాజ్ తండ్రి పేరు పి.ఎస్.సంధు. ఒక అన్నయ్య ఉన్నాడు. పేరు హరూన్. వీరి కుటుంబం చండీగడ్లోని మోహలీలో ఉంటుంది. ఒకవైపు అందాలపోటీ జరుగుతుంటే హర్నాజ్ తల్లి దగ్గరలో ఉన్న గురుద్వార్లో రాత్రంతా ప్రార్థనలో కూచుంది. తెల్లవారుజామున హర్నాజ్ టైటిల్ గెలవడం చూసి సోదరుడు హరూన్ పరిగెత్తుకుంటూ వెళ్లి గురుద్వారాలోని తల్లికి ఈ విషయం తెలియచేశాడు. ‘నా కూతురు తిరిగి రావడంతోటే ఆమెకు ఇష్టమైన ‘మక్కికి రోటీ’, ‘సర్సన్ ద సాగ్’ చేసి పెడతాను’ అంది తల్లి ఉత్సాహంగా. హర్నాజ్ చిన్నప్పుడు చాలా సన్నగా ఉండేది. సాటి విద్యార్థుల గేలి ఎదుర్కొనేది. అయినా సరే టీనేజ్లోకి వచ్చాక అందాలపోటీ పట్ల ఆసక్తి పెంచుకుంది. 2017లో ‘మిస్ పంజాబ్’ టైటిల్ గెలుచుకుంది. 2019లో ‘మిస్ ఇండియా’లో సెమీ ఫైనలిస్ట్ దశకు చేరుకుంది. ‘అప్పుడు అర్థమైంది నాకు అందాల పోటీ అంటే కేవలం అందంగా కనిపించడం కాదు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం అని. విశ్వ కిరీటం సాధించడానికి ఆ విధంగా నేను సిద్ధమయ్యాను.’ అంటుంది సంధు. కుటుంబ సభ్యులతో హర్నాజ్ The new Miss Universe is...India!!!! #MISSUNIVERSE pic.twitter.com/DTiOKzTHl4 — Miss Universe (@MissUniverse) December 13, 2021 -
Miss Universe: ఏంటీ ఆండ్రియాకు పెళ్లైందా?!
మెక్సికో సిటీ: మిస్ యూనివర్స్-2020 విజేత, మిస్ మెక్సికో ఆండ్రియా మెజాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమెకు ఇది వరకే పెళ్లి అయ్యిందని, భర్తతో కలిసి దిగిన ఫొటోలే ఇందుకు నిదర్శనమంటూ వదంతులు వ్యాపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఆండ్రియా మెజా ఖండించారు. తనకు వివాహం కాలేదని స్పష్టం చేశారు. కాగా మెక్సికోని చిహువాకు చెందిన ఆండ్రియా... సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. మోడలింగ్పై ఆసక్తి గల ఆమె.. చిహువా టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యారు. అప్పటి నుంచి తమ ప్రాంత సంస్కృతీ సంప్రదాయాల గురించి ప్రపంచానికి చాటిచెప్పే కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం.. మెజా ఓ ఫొటోను షేర్ చేశారు. ఇందులో.. తెల్లటి వెడ్డింగ్ గౌనులో మెరిసిపోతున్న ఆమె.. సూటులో ఉన్న ఓ పురుషుడిని హత్తుకుని ఉన్నారు. ‘‘ఇందుకు 3-09-2019’’ అనే క్యాప్షన్తో పాటు ఉంగరం ఎమోజీని జతచేశారు. ఇక ఆదివారం అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన అందాల పోటీల్లో మిస్ యూనివర్స్గా ఆండ్రియా మెజా కిరీటం దక్కించుకున్న క్రమంలో ఈ ఫొటో నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో.. కొంతమంది ఆమెకు పెళ్లైందని, నిర్వాహకులను మోసం చేసి పోటీ చేసిందని కొంతమంది కామెంట్లు చేశారు. ఈ విషయంపై స్పందించిన ఆండ్రియా మెజా... ఈ వ్యాఖ్యలను కొట్టిపడేశారు. చిహువా టూరిజం డెవలప్మెంట్లో భాగంగా కాపర్ కెనన్ వద్ద చేసిన ఫొటోషూట్కు సంబంధించిన దృశ్యం అది అని వివరణ ఇచ్చారు. అంతేగాక ఆ ఫొటోలో ఉన్నది తన బెస్ట్ఫ్రెండ్ వాళ్ల తమ్ముడు అని, స్నేహితులను ఆటపట్టించేందుకు డేట్ వేసి, వెడ్డింగ్ రింగ్ ఎమోజీ పెట్టామని పేర్కొన్నారు. అయితే, ఈ ఫొటో విషయం ఇంత గందరగోళం సృష్టిస్తుందని ఊహించలేకపోయానని వాపోయారు. అయినా తను అసత్య ప్రచారాలకు భయపడేదానిని కాదని, కెరీర్పై దృష్టిసారిస్తానని చెప్పుకొచ్చారు. అది అవాస్తవం ఇక మిస్ యూనివర్స్ పోటీల అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘చాలా మంది ఈ ఫొటో గురించి మాకు మెసేజ్లు పంపిస్తున్నారు. కానీ మేం అన్ని పరిశీలించిన తర్వాతే పోటీకి అర్హురాలిగా పరిగణిస్తాం. మెజా వివాహిత అన్న ప్రచారం అవాస్తవం’’ అని స్పష్టం చేశారు. కాగా విశ్వ సుందరి పోటీల నియమం ప్రకారం... అందులో పాల్గొనే వారు అవివాహుతులై ఉండాలన్న సంగతి తెలిసిందే. చదవండి: Miss Universe: ఎవరీ ఆండ్రియా మెజా? The new Miss Universe is Mexico!!!! #MISSUNIVERSE pic.twitter.com/Mmb6l7tK8I — Miss Universe (@MissUniverse) May 17, 2021 -
Miss Universe: ఎవరీ ఆండ్రియా మెజా?
వాషింగ్టన్: మెక్సికో భామ ఆండ్రియా మెజా మిస్ యూనివర్స్గా ఎంపికయ్యారు. ఫ్లోరిడాలో జరిగిన అందాల పోటీ ఫైనల్లో గెలుపొంది విశ్వ సుందరి కిరీటం సొంతం చేసుకున్నారు. తొలి రన్నరప్గా మిస్ బ్రెజిల్ జులియా గామా, రెండో రన్నరప్గా మిస్ పెరూ జానిక్ మెసెటా డెల్ కాసిలో నిలిచారు. మిస్ ఇండియా అడెలిన్ కాస్టెలినో సైతం గట్టిపోటీనిచ్చి టాప్-5లో స్థానం సంపాదించుకున్నారు. ఇక దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ మిస్ యూనివర్స్(2019) జోజిబినీ తుంజీ విజేత ఆండ్రియాకు కిరీటం అలంకరించారు. కాగా మొత్తం డెబ్బై మందికి పైగా పాల్గొన్న ఈ పోటీలో విజయం సాధించారని ప్రకటించగానే ఆండ్రియా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీటి పర్యంతమవుతూనే క్యాట్వాక్ పూర్తి చేశారు. ఎవరీ ఆండ్రియా? మిస్ యూనివర్స్ వెబ్సైట్లో ఉన్న వివరాల ప్రకారం.. 26 ఏళ్ల ఆండ్రియా మెజా.. మెక్సికోని చిహువాకు చెందినవారు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో పట్టా పుచ్చుకున్నారు. మోడలింగ్పై ఆసక్తి గల ఆమె.. చిహువా టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ తమ సంస్కృతీ సంప్రదాయాల గురించి ప్రపంచానికి చాటిచెబుతున్నారు. అంతేగాకుండా, మహిళా హక్కులపై ఉద్యమిస్తూ.. లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నారు. ఇక సర్టిఫైడ్ మేకప్ ఆర్టిస్టు మోడల్ అయిన ఆండ్రియాకు క్రీడల అంటే కూడా ఆసక్తి. జంతు హింసను తట్టుకోలేని ఆమె.. వీగన్గా మారిపోయారు. పూర్తి శాకాహారమే తీసుకుంటున్నారు. కాగా మెక్సికో నుంచి మిస్ యూనివర్స్గా ఎంపికైన మూడో మహిళగా ఆండ్రియా నిలిచారు. అంతకు ముందు లుపితా జోన్స్(1991), షిమెనా నవరటె(2010) ఈ విశ్వ సుందరీమణులుగా నిలిచారు. గొప్ప హృదయం ఉన్నవాళ్లే.. ఫైనల్లో భాగంగా.. అందానికి ప్రామాణికత ఏమిటి అన్న ప్రశ్నకు..‘‘అత్యంత నాగరికమైన సమాజంలో మనం ఉన్నాం. అదే సమయంలో కొన్ని కట్టుబాట్లను కూడా మనతో పాటు ముందుకు తీసుకువెళ్తున్నాం. అందం అనేది కేవలం బాహ్య రూపురేఖలకు సంబంధించింది కాదు. మన ఆత్మలో, గొప్ప మనసు కలిగి ఉండటంలోనే ఉంటుంది. మనం విలువ గల వ్యక్తులం కాదని ఎదుటివాళ్లు అవహేళన చేసేందుకు అస్సలు అనుమతించకూడదు’’ అని బదులిచ్చి ఆండ్రియా 69వ మిస్ యూనివర్స్గా నిలిచారు. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతేడాది విశ్వ సుందరి పోటీలు రద్దు అయిన సంగతి తెలిసిందే. The new Miss Universe is Mexico!!!! #MISSUNIVERSE pic.twitter.com/Mmb6l7tK8I — Miss Universe (@MissUniverse) May 17, 2021 -
విశ్వ సుందరిగా బెజవాడ యువతి
సాక్షి, కృష్ణా: జిల్లాలోని విజయవాడకు చెందిన బి. నాగదుర్గా కుసుమసాయికి తెలుగు విశ్వసుందరి కిరీటం దక్కింది. తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా), ఇతర తెలుగు సంస్థలు కలిసి నిర్వహించిన ఆన్లైన్ వరల్డ్ తెలుగు కల్చరల్ ఫెస్ట్ 2020 పోటీలో భాగంగా మిస్ తెలుగు యూనివర్సల్ పోటీల్లో కుసుమసాయికి ఈ అరుదైన గౌరవం దక్కింది. విశ్వసుందరి పోటీలకు 600 పైగా ఎంట్రీలు రాగా ప్రతిభ ఆధారంగా న్యాయనిర్ణేతలు కుసుమసాయిని ఎంపిక చేశారని పోటీ నిర్వాహకులు చైతన్య పొలుజు చెప్పారు. కుసుమసాయి బీకాం చదువుతోందని, ఆమెకు నాట్యం, నాటక రంగాల్లోనూ ప్రవేశం ఉందని తెలిపారు. -
26 ఏళ్లు.. ఐ లవ్ యూ జాన్..!
‘‘26 ఏళ్లు అవుతోంది జాన్... మమ్మల్ని అందరినీ గర్వపడేలా చేశావు.. ఇంకా చేస్తూనే ఉన్నావు. ఐ లవ్ యూ’’అంటూ మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ పట్ల ఆమె ప్రియుడు రోహమన్ షాల్ ప్రేమను చాటుకున్నాడు. 1994లో సుస్మితా మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకుని అందాల పోటీల్లో భారత కీర్తిని ఇనుమడింపజేశారు. భారత్ నుంచి ఈ ఘనతను సొంతం చేసుకున్న తొలి సుందరీమణిగా ఆమె చరిత్ర సృష్టించారు. సుస్మిత మిస్ యూనివర్స్గా ఎన్నికై ఈ ఏడాదితో 26 ఏళ్లు పూర్తయ్యాయి. (‘అరుదైన వ్యాధితో బాధపడ్డాను’) ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రోహమన్ సుస్మితపై ప్రశంసలు కురిపించాడు. కాగా సుస్మితా సేన్... న్యూఢిల్లీకి చెందిన యువ మోడల్ రోహమన్ షాల్తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రతీ వేడుకలోనూ కలిసి సందడి చేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. ఇక రోహమన్ సుస్మితతో రిలేషన్షిప్ వరకే పరిమితం కాలేదు. ఆమె దత్తపుత్రికలు రీనా, అలీషాలకు తండ్రి ప్రేమను పంచుతూ వారిలో ఒకడిగా కలిసిపోయాడు. కాగా సుస్మితా సేన్ కంటే దాదాపు రోహమన్ పదిహేనేళ్లు చిన్నవాడు.(అందగత్తెల అపురూప చిత్రం) View this post on Instagram 26 years My Jaaan 😍😍💃🏻💃🏻 . . . How proud you made all of Us & still continue to do so !!❤️❤️❤️❤️ . . #Mine ❤️ I love you @sushmitasen47 #bestmissuniverseever #amazingwoman #love #India #proudbf #indiasfirst A post shared by rohman shawl (@rohmanshawl) on May 20, 2020 at 11:48am PDT -
‘ఆ అద్భుతానికి నేటితో 20 సంవత్సరాలు’
‘నా జీవితంలో చోటుచేసుకున్న ఆ అద్భుతమైన ఘట్టానికి నేటితో 20 సంవత్సరాలు పూర్తయ్యాయి. విశ్వం ఇచ్చిన ఈ బహుమతికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అన్నారు మిస్ యూనివర్స్, నటి లారా దత్తా. సరిగ్గా 20 ఏళ్ల క్రితం అంటే మే 12, 2000న లారా దత్తా మిస్ యూనివర్స్గా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ నాటి వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు లారా దత్తా. ‘నేటికి 20 ఏళ్లు.. మే 12,2000,నికొసియా, సిప్రస్. విశ్వం నుంచి లభించిన అద్భుతమైన బహుమతి.. సదా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అంటూ రాసుకొచ్చారు లారా దత్తా. ఆ ఏడాది జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఆఖరి రౌండ్లో లారా దత్తా 9.99 స్కోర్ సాధించి చరిత్ర సృష్టించింది. అదే సంవత్సరం ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ కిరీటం.. దియా మీర్జా మిస్ ఆసియా పసిఫిక్ టైటిల్ గెలుచుకున్నారు. మిస్ యూనివర్స్ కిరీటం పొందిన రెండవ భారతీయ మహిళ లారా దత్తా. ఆమె కంటే ముందు సుస్మితా సేన్ 1994 లో ఈ టైటిల్ గెలుచుకున్నారు. -
పెనుకొండ అమ్మాయినోయి.. మిస్ సౌతిండియానోయి..!
సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఒక యువతి దక్షిణ భారతదేశ స్థాయిలో మొదటి సాన్థంలో నిలిచి పేరు ప్రఖ్యాతులు పొందిందంటే సామాన్య విషయం కాదు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రులు, స్నేహితుల సహకారంతో ఆమె దూసుకెళ్లింది. సౌత్ ఇండియా 2020 కిరీటం పొందింది. గొప్పగొప్ప వారి ప్రశంసలు అందుకుంది. అందుకుంటూనే ఉంది. ఆమె పెనుకొండకు చెందిన సుగమ్య. మిస్ యూనివర్స్గా నిలవడమే తన లక్ష్యమని చెబుతున్న ఆమె సాక్షితో తన అనుభూతులను పంచుకుంది. -పెనుకొండ మాది పెనుకొండ. తండ్రి రవిశంకర్ ఆధ్యాత్మికవేత్త, యోగా గురువు. తల్లి గాయత్రి. పలు సినిమాల్లో నటించింది. ఇక్కడి సరస్వతి విద్యామందిర్లో 3వ తరగతి వరకు చదివా. 4, 5 తరగతులు హైదరాబాద్లో. 6, 7, 8,9 బెంగళూరు రిషీకుల పాఠశాలలో పూర్తిచేశా. బీఎస్సీ సైకాలజీ, కళాక్షేత్ర ఫౌండేషన్ చెన్నైలో డిప్లమాలో భరతనాట్యం చేసి, ప్రస్తుతం ఎంఏ భరతనాట్యం చదువుతున్నా. మహారాష్ట్రలోని పండరీపురలో ఉన్న మిట్ విశ్వనాథ్ గురుకుల భరతనాట్య డ్యాన్సు టీచర్గా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నా. మెమొంటోలుతల్లిదండ్రులతో సుగమ్యశంకర్ ఇలా మిస్ సౌతిండియా అయ్యా..! స్నేహితుల సహకారంతో మిస్ సౌత్ ఇండియా 2020 విషయం తెలుసుకున్నా. ఆన్లైన్లో దరఖాస్తు చేశా. 2019 డిసెంబర్లో బెంగళూరులో మొదటిసారిగా పరీక్ష నిర్వహించారు. కేరళలోని కొచ్చిలో జరిగే 4 రోజుల శిక్షణకు 2020 జనవరి మొదటి వారంలో పిలుపొచ్చింది. అక్కడ ఫోటో జెనిక్, టాలెంట్ పోటీలు, వ్యక్తిత్వ వికాసం, మానసికంగా దృఢంగా ఉండేలా శిక్షణ తీసుకున్నా. వ్యూయర్స్ ఛాయిస్ ద్వారా ఓటింగ్ ప్రారంభమైంది. 23 మంది పోటీ పడితే 67 వేల మంది నాకు మద్దతుగా ఓట్ చేశారు. ఈవెంట్లో మిస్ సౌత్ ఇండియా కిరీటం కట్టబెట్టారు. తల్లిదండ్రుల సహకారంతోనే ఇక్కడి దాకా.. అమ్మానాన్న, నా సోదరుడు, స్నేహితుల సహకారంతో ఇక్కడిదాకా నా ప్రయాణం సాధ్యమైంది. వారి తోడ్పాటు లేకుంటే ఇంత దాన్ని అయ్యే దానిని కాదు. ప్రతి విషయంలోనూ ఎన్నో సూచనలు అందించి ఆచరణలో పెట్టే వరకు సలహాలు ఇస్తూనే వుంటారు. అన్నయ్య సునాగ్ శంకర్భరద్వాజ్ ప్రోత్సాహం మరువలేనిది. మిస్ సౌత్ ఇండియా పోటీల సందర్భంగా ఇంగ్లిష్ మాట్లాడడంలోనూ, ర్యాంప్పై నడిచే విషయంలోనూ, హావభావాల ప్రదర్శన విషయంలోనూ అనేక సూచనలు, సలహాలు ఇచ్చారు. వీరే నా భవిష్యత్తు మార్గనిర్దేశకులు. ఈ జన్మ వారికే అంకితం. సుగమ్యను వరించిన అవార్డులు యువతకు లక్ష్యం ఉండాలి.. ప్రతి ఒక్కరికీ ఒక లక్ష్యం ఉండాలి. ముఖ్యంగా యువతకు. విద్యకు పెద్దపీట వేయాలి. పోటీతత్వాన్ని ఎదుర్కోవాలి. ముందుచూపు లేకుండా వెళ్ల రాదు. ప్రధానంగా యువతులు ఉదాశీన వైఖరి విడనాడాలి. ప్రాణాల మీదకు వచ్చే వరకు ఉండరాదు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. ఎన్నో అనుభూతులను నింపిన ప్రయాణమిది.. ప్రస్తుతం మాటల్లో చెప్పలేని ఎంతో ఆనందం అనుభవిస్తున్నా. ఇంతటి స్థానం పొందుతానని ఎన్నడూ ఊహించలేదు. ఎంతో మంది ప్రముఖులు ప్రశంసిస్తూ సన్మానం చేస్తుండడం తీయని అనుభూతి. ప్రస్తుతం కన్నడ, తమిళం, మళయాళం చిత్రాల్లో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని యాడ్ ఫిల్మ్లలో నటించా. లక్ష్యం మిస్ యూనివర్స్.. మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలవాలన్నదే నా ధ్యేయం. అలాగే, భరత నాట్య కళాక్షేత్రం పెనుకొండలో స్థాపించి ఈ ప్రాంత బాలికలకు శిక్షణ ఇవ్వాలనే కోరిక ఉంది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కళ ఇమిడి వుంటుంది. దాన్ని వెలికితీసినపుడే ఆత్మ సంతృప్తి వుంటుంది. అమ్మ కళాకారిణి, నాన్న యోగా గురువు. వీరి ప్రతిరూపంగా పోటీ రంగంలో ముందుకు వెళ్లాలన్నదే లక్ష్యం. అనేక పురస్కారాలు అందుకున్నా.. గుంటూరులో భరతనాట్యంతో యువకళారత్న అవార్డును మంజీర సాహిత్య అకాడమీ ద్వారా 2019లో పొందా. రాయల ఉత్సవాల సందర్భంగా భరతనాట్యంలో అనేక ప్రదర్శనలు ఇచ్చా. ప్రశంసలందుకున్నా. అనూష ఆర్ట్ అకాడమీ ద్వారా చెన్నైలో పురస్కారం పొందాను. అనంతసాహితీ అకాడమీ, త్యాగరాజ సంగీత సభల్లో అనేక పురస్కారాలూ వరించాయి. -
నల్లటి అపరంజి...
తెల్లగా ఉన్న చాలా మందిని జుజుబీ అంటూ తోసిరాజంది ఈ నల్లటి జోజిబిని తుంజి. విశ్వసుందరిగా విజయకేతనం ఎగరేసిన ఈ అమ్మాయి ఫెయిర్నెస్ ఫేట్ను సవాల్ చేసింది. తెల్లగా ఉంటేనే అందమా? నలుపులో నాణ్యమైన మెరుపుతో ఉంటే... మేని నిగారింపు జిగేలుమంటే అది అందం కాదా?... ఎన్నెన్నో సందేహాలు! నలుపులో అందం ఉంటుందో ఉండదో ఒకసారి కాస్త పరిశీలిద్దాం. పరికించిచూద్దాం. కార్యానికైనా, కదనానికైనా, కథనానికైనా శ్రీకారం చుట్టే ముందు కాస్త దైవప్రార్థన ఆనవాయితీ కదా. అందుకే దేముడైన రాముడి స్తుతితో మొదలుపెడదాం. శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం, సీతాపతిం, రఘుకులాన్వయ రత్నదీపం... అవునూ దేవుడికంటే అందమైన వారెవరైనా ఉంటారా? కోరి కోరి అరవింద దళాల్లాంటి కనువిందు చేసే కళ్లూ, ఆకర్షణీయమైన ఒళ్లూ లాంటి మంచి క్వాలిటీలన్నీ పుణికి పుచ్చుకున్నవాడు కావాలనుకుంటే తెల్లటి మేని ఛాయ పొందలేడా? ఈజీగా పొందగలడు. కానీ పొందలేదు. దీనికీ ఓ బ్యాక్గ్రౌండు స్టోరీ ఉంది. పుట్టింది ఉత్తర భారతదేశపు అయోధ్యలో! కావాలనుకుంటే ఫెయిర్ కాంప్లెక్షన్ పొందడం కష్టమేమీ కాదు. కాకపోతే... రేపు అరణ్యవాసంలో... కానల్లో మెలగాలి. కాలినడకన తిరగాలి. బండలెక్కాలి, కొండలెక్కాలి. మరి ఇన్ని పనులు చేయాల్సి ఉండగా ఎండకన్నెరగకుండా ఉంటే ఎలా? కన్నెర్ర జేసే ఎండలో తిరగకుండే ఎలా? కారడవుల్లో తిరగాలి కాబట్టే కారుమేఘపు రంగులో పుట్టాడు. దక్షిణభారత దేశపు కిష్కింధవాసుల మేని ఛాయకు దగ్గర్లో ఉన్నాడు. మీరూ నేనూ ఒకటే రంగన్నాడు. అందుకే... అందం తెల్లదనంలో లేదు. నాణ్యమైన నల్లదనంలోనే ఉంది. ఇక శ్రీకృష్ణుడి దగ్గరకు వద్దాం. ఆయనా అంతే. పాలసంద్రాన పవళించే స్వామికి, పాలరంగును మేనిరంగుగా పొందడం కష్టమా? కావాలనుకుంటే ఇంద్రజాలంతో చంద్రవర్ణం పొందలేడా? ఈయనకూ ఓ విజనుంది. ఓ మిషనుంది. రేపుమాపు గోపాలుడవ్వాలి. గోధూళి తగలాలి. గోవర్థనమెత్తాలి. సైనైడ్ నిండి ఉన్న కాళిందిలో ఈదులాడితే సైడెఫెక్ట్ కొద్దీ శరీరం నల్లబడదూ? రేపు పొద్దస్తమానం యుద్ధక్షేత్రం కురుక్షేత్రంలో ఉన్నప్పుడు ఎర్రటెండకు మేనిరంగు మారిపోదూ! అదేదో అప్పుడు నల్లబడేబదులు... ముందుగానే నలుపులోనే ఆ బాలగోపాలుడు ఆబాలగోపాలమందరినీ ఆకర్షించేంత అందగాడిగా పుడితే పోదా అనుకున్నాడు. దైవస్తుతి ముగిసింది. ఇహ ఇప్పుడు ఇహంలోకి వద్దాం. ఎలెక్స్హేలీ రాసిన ఏడుతరాలు చదివారా? తన మూలాలు తెలుసుకుంటూ చేసిన ప్రయాణాన్ని చూశారా? ఏడుతరాల తర్వాత ఎలెక్స్ తెల్లటివాడేమో. కానీ తరాలను తవ్వుకుంటూ పోయినప్పుడు... వేరులను వెతుక్కుంటూ వెళ్లినప్పుడు... తాతల తండ్రులు... తండ్రుల తాతలు... వాళ్ల మూలపురుషుడు కింటాకుంటే నల్లనివాడని! కింటాకుంటే పుట్టిన రాత్రి ఆనవాయితీగా ఆ బిడ్డను తండ్రి ఉమరో చంద్రుడికి చూపాడు. ‘నీకంటే గొప్పవాడు... ఇదుగో చూడు’ అనేసరికి నాణ్యమైన ఆ నల్లదనాన్ని చూసి తెల్లగా మెరుస్తున్న చంద్రుడు కాస్తా తెల్లబోయాడు. వెన్నెలరూపంలో వెలవెలబోయాడు. చరిత్ర నుంచి కాసేపు పక్కకు వెళ్లి పక్షిలోకంలోకి వెళ్దాం. ఈ సంగతి వింటే... ఆర్నీ... వార్నీ... ఆర్నిథాలజీలో కూడా అదే చెబుతోందా అంటూ మీరు అచ్చెరువొందకమానరు. కళ్లముందు తెల్లగా కనిపిస్తూ తిరగాడే ఫారం కోళ్లంటే మీకిష్టమా? లేక నీలిరంగులో ఎగురుతూ ఉండే పాలపిట్టంటే మీకు గౌరవమా? నీలిపింఛం ఉన్నందుకేగా నెమలికి ఆ కంఠంలో క్రేంకార గీర. అడవి పిట్టలను వదిలేసి మన సినిమాల్లోని ఆడపిల్లల అందాలకు వద్దాం. మన అలనాటి మేటి మహానటి సావిత్రి రంగులో ఓ వన్నె తక్కువే. ఆమె తెల్లటి తెలుపేమీ కాదు. రమణీయంగా, ఆకర్షణీయంగా ఉండే నటీమణుల్లో వాణిశ్రీ, వాణీవిశ్వనాథ్, అర్చన, భానుప్రియ, నల్ల రంగు పిల్లగా మరోచరిత్ర సృష్టించిన సరితలాంటి వనితలంతా నల్లవారే. ఇక రేఖ, స్మితాపాటిల్, నందితా దాస్లు కన్నుతిప్పుకోలేనంతటి అందగత్తెలంటే కాదనే దమ్ములెవరికి ఉన్నాయ్ చెప్పండి? కొందరు సైన్సును తప్ప మరోదాన్ని నమ్మరు. సైంటిఫిగ్గా నిరూపిస్తే చేస్తే తప్ప ఒక పట్టాన ఒప్పరు. అలాగే. నల్లదనం గొప్పదనాన్ని సైన్స్ సాయంతోనే చెబుదాం. అన్ని రంగుల్ని బెదరగొట్టీ, చెదరగొట్టీ, తిరగబెట్టీ వెనక్కుపంపితే కనిపించేది తెలుపు. అన్ని వర్ణాల్నీ తన అక్కున చేర్చుకుని, తనలో ఇముడ్చుకుంటే వచ్చే వర్ణం నలుపు. అందుకే ఫిజిక్సు మ్యాజిక్సు ప్రకారం చూసినా అన్నింటినీ దగ్గర చేసుకునే గుణం ఒక్క నల్లదనానికే ఉంది. గొప్పదనాన్ని గుర్తించే గుణం తమిళులకుండబట్టే మంచిదనానికి ‘నల్ల’ అనే మాటతో గౌరవించారు వారు. నలుపే అందం అని చెప్పడానికి ఇన్ని మాటలేల? నలుపంటే చిమ్మచీకటి కాదు... నిద్రలో కమ్మటి కలలవాకిలి. స్వప్నాల లోగిలి. ఒకింత ముదురు రంగు మంచిగంధానికే సౌరభం. ముగ్గుపిండికి కాదు. కారుమబ్బు చివరనున్న నల్లంచుకే వెండి తేజంపు మెరుపు. తెల్లమబ్బుకు కాదు. పేలవమైనదెప్పుడూ తెల్లగానే ఉంటుంది. నవనవలాడేదెప్పుడూ నల్లగానే ఉంటుంది. ఈ మాటనే జోజిబిని తుంజి మరోమారు నిరూపించింది. – యాసీన్ -
నలుపు సౌందర్యం కాదనుకునే లోకమా..
‘ఈ ప్రపంచం నలుపును ఎలా చూస్తుందో నాకు తెలుసు. నాలాంటి తల వెంట్రుకలు, చర్మపు రంగు ఉన్నవారిని ఎలా వ్యాఖ్యానిస్తారో నాకు తెలుసు. ఈ రోజుతో ఆ అభిప్రాయాలన్నింటికీ చెల్లుచీటీ పాడండి’ అని ‘మిస్ యూనివర్స్ 2019’ విజేత జొజిబిని తుంజి అన్నారు. 26 సంవత్సరాల ఈ నల్లజాతి మోడల్, హక్కుల కార్యకర్త, స్త్రీల కార్యకర్త దక్షిణాఫ్రికా దేశం నుంచి ‘మిస్ యూనివర్స్’ పోటీలలో పాలుపంచుకుని తన కంఠాన్ని గట్టిగా వినిపించి హర్షధ్వానాల మధ్య విజేతగా శిరస్సున అందాల కిరీటాన్ని ధరించారు. 67 సంవత్సరాలుగా జరుగుతున్న మిస్ యూనివర్స్ పోటీలలో ఇలా నల్ల జాతీయురాలు టైటిల్ గెలుచుకోవడం మూడోసారి. గతంలో అంగోలా నుంచి, ట్రినిడాడ్ నుంచి మిస్ యూనివర్స్ అయిన వారున్నారు. అమెరికా అట్లాంటాలో సోమవారం జరిగిన ఈ అందాలపోటీ వేడుకలో జొజిబిని తుంజి సాధించిన విజయం ప్రపంచవ్యాప్తంగా మూసకట్టు సౌందర్య ప్రమాణాలను దిగుదుడుపు అయ్యేలా చేసింది. తెల్లగా ఉంటేనే అందమని, పొడవైన వెంట్రుకలే సౌందర్యమని అనుకునేవారందరికీ ఇదొక చెంపపెట్టు, అలా లేని వానికి ఈ విజయం ఒక కొత్త స్ఫూర్తి అని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ‘తలుపు తెరిచి చూడండి. ఒక కొత్త వెలుతురు వస్తుంది. ప్రపంచంలోని ఆడపిల్లలంతా నా ముఖంలో తమ ప్రతిబింబాన్ని చూసుకోవాలని కోరుకుంటున్నాను. కలలు కనడానికి వెనుకంజ వేయవద్దని హితవు చెబుతున్నాను’ అని జొజిబిని తుంజి చెప్పారు. ‘నా పేరు జొజిబిని తుంజి. నాది దక్షిణాఫ్రికా. నేను మిస్ యూనివర్స్ విజేతను అని గర్వంగా చెబుతాను’ అని కూడా ఆమె అన్నారు. 90 దేశాల అతిలోక సౌందర్యవతులు ఈ కిరీటం కోసం పోటీ పడితే సౌందర్యవంతమైన దేహంతోపాటు సౌందర్యభరితమైన ఆలోచన కలగలిసిన జొజిబినికి విజయం లభించింది. ‘నేటి ఆడపిల్లలకు మనం ఎలాంటి పాఠాలు చెప్పాలి’ అని పోటీలో చివరి ప్రశ్నకు జొజిబిని ఏ మాత్రం తొట్రు పడకుండా ‘మనం వారికి నాయకులం కమ్మని చెప్పాలి. నాయకత్వం తమ పరిధిలోని సంగతి కాదని ఆడపిల్లలు అనుకుంటారు. వారు ఎదగాలి. వేదిక మీద తమ వాటా కోసం, దిశా నిర్దేశం చేయడం కోసం ఏ మాత్రం బెరుకు లేకుండా ప్రయత్నించాలి’ అని జొజొబిని చెప్పారు. ఈ పోటీలలో మిస్ పొర్టొ రీకో ఫస్ట్ రన్నరప్గా, మిస్ మెక్సికో సెకండ్ రన్నరప్గా నిలిస్తే భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించిన వర్తికా సింగ్ టాప్ 20 స్థానాలలో నిలిచి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దక్షిణాఫ్రికాలోని ట్సోలో అనే చిన్న మునిసిపాలిటీ సమీపంలోని పల్లెలో బాల్యం గడిచిన జొజొబిని కేప్టౌన్లో పబ్లిక్ రిలేషన్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. లింగవివక్ష కారణంగా స్త్రీలకు దొరకని సమాన అవకాశాల గురించి విద్యార్థి దశ నుంచే ఆమె పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ‘మిస్ యూనివర్స్’ కిరీటం ద్వారా దొరికిన కీర్తితో తన గొంతును ప్రపంచమంతా వినిపించాలనుకుంటున్నారు. స్త్రీ వికాసం కోసం ఆమె చేయబోయే ప్రయత్నాలకు శుభకామనలు తెలియచేద్దాం. -
మిస్ యూనివర్స్గా జోజిబినీ తుంజీ
-
నా ముఖం చూడండి: మిస్ యూనివర్స్
అట్లాంటా: ఈ ఏడాది విశ్వసుందరిగా దక్షిణాఫ్రికాకు చెందిన జోజిబినీ తుంజీ(26) ఎంపికయ్యారు. మొత్తం తొంభై మంది అందాల భామలు పాల్గొన్న ఈ పోటీలో మిస్ దక్షిణాఫ్రికా తుంజీ విశ్వసుందరి కిరీటం దక్కించుకున్నారు. అమెరికాలోని అట్లాంటాలోని టైలర్ పెర్రీ స్టూడియోస్లో జరిగిన ఈ అందాల పోటీలకు పాపులర్ టీవీ పర్సనాలిటీ స్టీవ్ హార్వే హోస్ట్గా వ్యవహరించారు. ఇక ఏడుగురు మహిళలతో కూడిన బృందం ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించింది. ఫైనల్లో ప్యూర్టో రికన్, మెక్సికన్ భామలను వెనక్కి నెట్టి జోజిబినీ తుంజీ విజేతగా నిలిచినట్లు వారు ప్రకటించారు. ఈ క్రమంలో తుంజీ మాట్లాడుతూ... ‘అచ్చం నాలాగే కనిపించే మహిళలు ఉన్న ప్రపంచలో నేను పెరిగాను. వారిది కూడా నాలాంటి శరీర వర్ణమే. శిరోజాలు కూడా నా వంటివే. అయితే మమ్మల్ని ఎవరూ ఎప్పుడూ సౌందర్యరాశులుగా పరిగణించలేదు. నేటి నుంచి ఆ భావన తొలగిపోతుందనుకుంటున్నా. అలా అనుకునే వాళ్లు నా ముఖం చూడండి. నా ముఖంలో ప్రతిబింబిస్తున్న మీ ముఖాలు చూసుకోండి’ అని తన దేశ మహిళల్లో ఆత్మవిశ్వాసం నింపారు. అనంతరం మిస్ యూనివర్స్-2018 కాట్రియోనా గ్రే(ఫిలిప్పైన్స్) తుంజీకి విశ్వ సుందరి కిరీటం అలంకరించగా.. తుంజీ కన్నీటి పర్యంతమయ్యారు. ‘ఇంకా చేయాల్సి చాలా ఉంది’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Making a statement... This is Miss Universe South Africa.#MissUniverse2019 LIVE on @FOXtv. Airing in Spanish on @Telemundo. pic.twitter.com/FWpqb0517w — Miss Universe (@MissUniverse) December 9, 2019 -
భారత సంతతి ప్రియా.. మిస్ ఆస్ట్రేలియా
మెల్బోర్న్: భారత సంతతికి చెందిన ప్రియా సెరావో మిస్ యూనివర్స్ ఆస్ట్రేలియా–2019 కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఈ పోటీల్లో భాగంగా 26 ఏళ్ల సెరావో మొత్తం 26 మంది యువతులను వెనక్కినెట్టి మిస్ యూనివర్స్ ఆస్ట్రేలియాను దక్కించుకుంది. దీంతో ఆమె ఈ ఏడాదిలో జరగనున్న మిస్ యూనివర్స్ పోటీల్లో ఆస్ట్రేలియా తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. ప్రియా సెరావ్ భారత్లోనే పుట్టింది. అయితే అనంతరం ఆమె కుటుంబం తొలుత ఒమన్లో.. తర్వాత దుబాయ్లో కొన్నాళ్లు ఉన్నారు. చివరగా ఆమె కుటుంబం ఆస్ట్రేలియాలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. న్యాయవిద్యలో డిగ్రీ పూర్తి చేసిన ఆమె.. ప్రస్తుతం మెల్బోర్న్ డిపార్ట్మెంట్ ఆఫ్ జాబ్స్, ప్రెసింక్ట్స్, అండ్ రీజియన్స్లో పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంతకుముందెన్నడూ ఇలాంటి పోటీల్లో పాల్గొనలేదని, మోడలింగ్లో కూడా పాలుపంచుకోలేదని తెలిపారు. మిస్ యూనివర్స్ కిరీటం తనను ఆశ్చర్యపరిచిందని వెల్లడించారు. ఇక వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు చెందిన బెల్లా కాసింబా, విక్టోరియా మారిజానా రద్మానోవిక్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. -
నేషనల్ కాస్ట్యూమ్ ప్రెజంటేషన్: తళుక్కుమన్న భామలు
-
‘మిస్ దివా యూనివర్స్’గా నేహల్
ముంబై: ఈ ఏడాది డిసెంబర్లో జరిగే మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరఫున నేహల్ చుడాసమా పోటీపడనుంది. 22 ఏళ్ల ఈ భామ శుక్రవారం రాత్రి ముంబైలో జరిగిన ‘మిస్ దివా యూనివర్స్ 2018’గా కిరీటాన్ని సొంతం చేసుకుంది. దీంతో మిస్ యూనివర్స్–2018 పోటీల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గెలుపు అనంతరం నేహల్ మాట్లాడుతూ ‘నా చిరకాల స్వప్నం నిజం కావడాన్ని నమ్మేందుకు నాకు కొంత సమయం పట్టింది. భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించడమే కాకుండా..మిస్ యూనివర్స్ టైటిల్ గెలవడం నా కల. ఎన్నో ఏళ్లుగా ఈ రోజు కోసమే కష్టపడ్డా. ఈ ప్రయాణాన్ని ముందుకు కొనసాగించేందుకు ఎదురుచూస్తున్నాను’ అని ఉద్వేగంతో చెప్పింది. గతంలో ఎన్నో వైఫల్యాల్ని ఎదుర్కొన్నానని, అయితే అందాల కిరీటం సొంతం చేసుకుంటాననే నమ్మకం ఎప్పుడూ కోల్పోలేదని ఆమె పేర్కొంది. తన లక్ష్యం గురించి వివరిస్తూ.. మిస్ యూనివర్స్ పోటీలు ముగిశాక సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమవుతానని వెల్లడించింది. ‘మిస్ దివా∙సుప్రానేషనల్’గా అదితి హుండియ, మిస్ దివా 2018 రన్నరప్గా రోష్నీ షెరన్ నిలిచారు. మిస్ యూనివర్స్ 2017 విజేత డెమి పీటర్స్, బాలీవుడ్ నటులు సుశాంత్ సింగ్ రాజ్పుత్, శిల్పా శెట్టి, నేహా దూఫియా, లారా దత్తా తదితరులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. -
మిస్ యూనివర్స్గా మిస్ దక్షిణాఫ్రికా
-
మిస్ యూనివర్స్గా మిస్ దక్షిణాఫ్రికా.!
-
గౌనుల్లో మెరిసిన అందాలు
-
ముద్దుల మిస్సమ్మలు
వావ్! వీళ్లలో ఎవరండీ మిస్ యూనివర్స్?! క్వొశ్చన్ నాట్ కరెక్ట్. వీళ్లలో మిస్ యూనివర్స్ కానిదెవరో చెప్పండి! నో కంటెస్టెంట్స్. ఓన్లీ విన్నర్స్. ఎలా సాధ్యం? ఇంతమంది విన్ అవడం? ఎవరో ఒకరికే కదా మిస్ యూనివర్స్ టైటిల్ దక్కుతుంది. అది కూడా ఊరికే దక్కుతుందా? గ్రూప్ ఎగ్జామ్స్లో ఉన్నట్లు ప్రిలిమ్స్ ఉంటాయి. మెయిన్స్ ఉంటాయి. సెమీ ఫైనల్స్ ఉంటాయి. ఫైనల్స్ ఉంటాయి. వాటికన్నా ముందు ‘స్విమ్ సూట్’ రౌండ్లు ఉంటాయి. ‘నైట్ గౌన్’ పరేడ్లు ఉంటాయి. మళ్లీ జడ్జీల ఇంటర్వూ్యలు ఉంటాయి. ఫైనల్గా 15 మంది నుంచి ఐదుగురిని, ఐదుగురి నుంచి ముగ్గురిని, ముగ్గురి నుంచి ఒక్కరిని జడ్జీలు ఎంపిక చేస్తారు. ఇంత ప్రాసెస్ ఉండగా, పుసుక్కున్న వీళ్లందరినీ ‘మిస్ యూనివర్స్లు’ అనేస్తే ఎలా అనే కదా మీ డౌట్! నిజమే. ఈ ఏడాది ‘మిస్ యూనివర్స్’ కిరీటం కోసం 85 మంది అందాల రాణులు పోటీలో ఉన్నారు. ఫిలిప్పీన్స్లో జనవరి 30న ఫైనల్స్కి వెళ్లే ఆ ముగ్గురు ఎవరో, ఆ ముగ్గురిలో ఆ ఒక్కరు ఎవరో తేల్చడం ఎలాగో అని జడ్జీలు ఆల్రెడీ కళ్లు తేలేశారట. అంత టఫ్గా నడుస్తోంది పోటీ. మరి ఈ చిన్నారి బ్యూటీలు ఎవరు? పెళ్లిలో తోడి పెళ్లికూతురిలా, అందాల పోటీలకు నిండుదనం తెచ్చే తోడి అందాల సుందరులా? అంతకన్నా ఎక్కువే. వీళ్లు ఒక్కొక్కరూ ఒక్కొక్క అందాల కిరీటం. వీళ్లలో ఎవరితో కలిసి మీరు సెల్ఫీ తీసుకున్నా... పోటీ లేకుండా మీరు ‘మిస్ యూనివర్స్’ టైటిల్ కొట్టేసినట్టే. (బిడ్డను ఎత్తుకుని నిలబడిన తల్లికి మంచిన మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్.. ఎక్కడైనా ఉంటారా! అలాగన్నమాట). ఇంతకీ.. మిస్ యూనివర్స్ పోటీలకు అన్నట్లుగా తయారై బస్సు ఎక్కబోతున్న ఈ చిన్నారులు వెళుతున్నది ఎక్కడికో తెలుసా? ఇప్పటికే ఫిలిప్పీన్స్ చేరుకుని ఉన్న అందాల అతిథులకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడానికి. -
మిస్ యూనివర్స్ పోటీలు షురూ..
విశ్వ సౌందర్యం ఫిలిప్పైన్స్లో అందాలు విందులు చేస్తున్నాయి. జనవరి 30న ఆ దేశంలో జరగనున్న ‘మిస్ యూనివర్స్’ పోటీల కోసం దాదాపు 85 దేశాల నుంచి అందాల భామలంతా రాజధాని మనీలా చేరుకున్నారు. స్థానిక ప్రజలు వీరికి కరతాళధ్వనులతో, కేరింతలతో స్వాగతం చెబుతున్నారు. పోలీసు విభాగం హడావిడి చేసి దాదాపు 1300 మంది పోలీసులను ఈ పోటీలకు కేటాయిం చింది. ఎందరు అందాల భామలు ఉన్నా 15 దేశాల వారు అంతిమంగా బరిలో నిలువవచ్చనీ, వారిలో ఒకరు ‘మిస్ యూనివర్స్’ కావచ్చుననీ పండితులు అంచనాలు కడుతున్నారు. కొలంబియా, జర్మనీ, అమెరికా, చిలీ, ఫిలిప్పైన్స్, వెనిజులా, మెక్సికో దేశాలకు చెందిన సుందరీమణులకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని వీరి ఉవాచ. భారతదేశం నుంచి రోష్మిత హరిమూర్తి ఈ పోటీల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అన్నట్టు మలేసియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కిరణ్మీత్ కౌర్ కూడా మన భారతీయ సంతతికి చెందిన అమ్మాయే. మొత్తానికి కిరీటధారిణి ఎవరో తేలాలంటే జనవరి 30 వరకు ఆగాలి. -
మిస్ యూనివర్స్ పోటీలపై ఐసిస్ కన్ను
-
మిస్ యూనివర్స్ పోటీలపై ఐసిస్ కన్ను
మనీలా: వచ్చే ఏడాది జనవరిలో ఫిలిప్ఫీన్స్లో జరగనున్న మిస్ యూనివర్స్ పోటీలే లక్ష్యంగా దాడికి పాల్పండేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఐసిస్ ప్రకటించింది. ఈ మేరకు ‘ఐఎస్ ఫిలిప్ఫీన్స్ సపోర్టర్స్’ అనే బృందానికి ఓ వీడియోను టెలిగ్రామ్ మెసేంజర్ ద్వారా పంపించింది. వీడియోలో ఆత్మాహుతి దాడి కోసం వాడే బెల్టులు, దుస్తులను ఎలా తయారుచేయాలో వివరించారు. అంతేకాకుండా మిస్ యూనివర్స్ను చంపడానికి ఓ బాంబు తయారు చేయాలంటూ జిహాదీలకు సలహాలిస్తున్న వీడియోను పోస్టు చేశారు. -
'హాలీవుడ్ నా బాయ్ ఫ్రెండ్.. బాండ్ గర్ల్గా వస్తా'
పిలిప్పీన్స్: తనకు బాండ్ చిత్రాల్లో నటించాలని ఉందని విశ్వసుందరి పియా అలంజో వూర్త్బాచ్ తన మనసులో మాట చెప్పింది. ఇటీవల మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకున్న ఈ పిలిప్పీన్స్ సుందరికి ప్రస్తుతం ఆ విజయాన్ని అనుభవిస్తున్నానని తెలిపింది. తాను విశ్వసుందరి కిరీటం దక్కించుకున్న రోజు మరువలేనిదని చెప్పింది. ప్రస్తుతం తనకు డేటింగ్, బాయ్ ఫ్రెండ్ వంటి ఆలోచనలేవీ లేవని, హాలీవుడ్ పరిశ్రమే ప్రస్తుతం తనకు బాయ్ ఫ్రెండ్ అని, అందుకే తన కలలు నెరవేర్చుకునేందుకు ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతానని చెప్పింది. 55 ఏళ్ల అక్వినోతో పియా డేటింగ్ చేసిందన్న పుకార్లు షికార్లు చేసిన నేపథ్యంలో ఆమె పై వివరణ ఇచ్చింది. మున్ముందు వచ్చే జేమ్స్ బాండ్ చిత్రాల్లో బాండ్ గర్ల్ గా నటించాలన్నదే తన కోరిక అని చెప్పింది. పదకొండేళ్ల వయసులోనే ఫ్యాషన్ రంగం వైపు అడుగుపెట్టిన పియా ఇప్పటికే పలు టీవీ కార్యక్రమాల్లో, సినిమాల్లో చిన్నపాత్రల్లో నటించింది. అవేవీ ఆమెకు పేరు ప్రఖ్యాతులు తీసుకురాలేదు. అదీ కాకుండా ఈ సారి ఆమెకు విశ్వసుందరి కిరీటం కూడా కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనల మధ్య చోటుచేసుకుంది. ఈ ఏడాది నిర్వహించిన విశ్వసుందరి పోటీల్లో వాస్తవానికి పియా నే విజేతగా నిలిచినా.. విజేతల ప్రకటనలో కొంత గందరగోళం జరిగి, వివాదాస్పదంగా మారింది. కార్యక్రమం నిర్వాహకుడు స్టీవ్ హార్వే తొలుత ఈ విజేతలను తారుమారుగా ప్రకటించారు. తొలిస్థానంలో కొలంబియా యువతి అరియాడ్నా, రెండో స్థానంలోఅలొంజో, మూడో స్థానంలో ఒలివియా నిలిచారని చెప్పారు. అరియాడ్నా వేదికపై క్యాట్వాక్ చేసి ప్రేక్షకులకు అభివాదం కూడా చేసింది. గత ఏడాది మిస్ యూనివర్స్, కొలంబియాకే చెందిన పౌలినా వెగా వేదికపైకి చేరుకుని అరియాడ్నా తలపై కిరీటం పెట్టింది. కానీ విజేతలను ప్రకటించడంలో పొరపాటు జరిగిందంటూ నిర్వాహకుడు స్టీవ్ హార్వే ఒక్కసారిగా షాకిచ్చారు. మొదటి స్థానంలో పియా, రెండో స్థానంలో అరియాడ్నా నిలిచినట్లు ప్రకటించారు. ఈ తప్పిదానికి తాను బాధ్యత వహిస్తానని, ఎవరూ బాధపడవద్దని వ్యాఖ్యానించారు. దీంతో తిరిగి వేదికపైకి వచ్చిన మాజీ మిస్ యూనివర్స్ పౌలినా వెగా.. అరియాడ్నా నుంచి కిరీటాన్ని తీసుకుని పియా అలొంజోకు అలంకరించారు. దీంతో గతంలో లేనంత స్థాయిలో విశ్వసుందరి విజేతగా పియాకు భారీ ఎత్తున ప్రచారం లభించింది. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో లక్షల్లో వీక్షించారు. ఈ ప్రచారంతోనే ప్రస్తుతం ఆమె హెచ్ఐవీపై ఇటు అమెరికా ప్రజలను, తమ మాతృదేశం పిలిప్పీన్స్ ప్రజలను చైతన్యవంతం చేసేందుకు కదలడానికి సిద్ధంగాఉంది. తమ దేశంలో హెచ్ఐవీ బాధితుల సంఖ్య 22శాతానికి పెరిగిందని, ఈ నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించే దిశగానే ఆమె ముందుకు సాగుతానని చెప్పారు. అమెరికాతో తమకు ముందునుంచే సత్సంబంధాలు ఉన్నందున వారి సహాయం కోరేందుకు వెనుకాడబోనని పియా పేర్కొంది. -
ఈ వారం యు ట్యూబ్ హిట్స్
స్టీవ్ హార్వే రాంగ్ విన్నర్ : మిస్ యూనివర్స్ ఈ ఏడాది మిస్ యూనివర్శ్ పోటీలు ‘బిగ్గెస్ట్ టీవీ ఫెయిల్యూర్ ఆఫ్ ది ఇయర్’ గా పూర్తయ్యాయి. కార్యక్ర మ వ్యాఖ్యాత స్టీవ్ హార్వే.. ఫస్ట్ రన్నర్ అప్ అయిన మిస్ కొలంబియాను మిస్ యూనివర్శ్గా ప్రకటించడంతో ఈ తప్పు జరిగిపోయింది. (నిజానికి జడ్జీలు నిర్ణయించిన విశ్వసుందరి మిస్ ఫిలిప్సీన్స్ పియా అలోంజో). కొలంబియా సుందరి అరియాడ్నా ఆకస్మాత్తుగా తను విజేత కాదని తెలుసుకుని క్షణం పాటు నివ్వెర పోయినా, తన కిరీటాన్ని వదులుకుంటున్న క్షణంలోనూ ఎంతో హూందాగా చిరునవ్వులు చిందించారు. నిడివి : 5 ని. 28 సె. హిట్స్ : 1,79,80,657 జై గంగాజల్ : ట్రైలర్ బాలీవుడ్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ ‘జై గంగాజల్’ ట్రైలర్ ఇది. చిత్రం 2016 మార్చి 4న విడుదలౌతోంది. ఇందులో ప్రియాంకా చోప్రా ఎస్పీగా నటిస్తున్నారు. చిత్రీకరణ అంతా ఎక్కువ భాగం భోపాల్లో జరిగింది. బీహార్లోని బంకీపూర్ జిల్లా తొలి మహిళా ఎస్పీగా ప్రియాంక ఎంపికవుతారు. లోకల్ ఎమ్మెల్యే మానవ్ కౌల్, అతడి అనుచరులు ఆమెకు అడుగడుగునా అడ్డుపడి సంఘ విద్రోహ కార్యకలాపాలు కొనసాగిస్తుంటారు. ఎస్పీకి, ఎమ్మెల్యేకు మధ్య జరిగే ఘర్షణల సన్నివేశాలను ఈ వీడియోలో చూడొచ్చు. నిడివి : 2 ని. 48 సె. హిట్స్ : 32,27,655 డెడ్పూల్ : ట్రైలర్ 2 మార్వెల్ కామిక్స్లోని ‘డెడ్పూల్’ క్యారెక్టర్ అధారంగా అదే పేరుతో వస్తున్న హాలీవుడ్ సూపర్హీరో మూవీ ‘డెడ్పూల్’. టిమ్ మిల్లర్ డెరైక్ట్ చేస్తున్నారు. 2016 ఫిబ్రవరి 12న చిత్రం విడుదల అవుతోంది. క్యాన్సర్ను నయం చేసుకునేందుకు వేడ్ విల్సన్ (డెడ్పూల్ అసలు పేరు) తనపై ప్రయోగం చేసుకుంటాడు. పర్యవసానంగా అతడికి మంత్రశక్తులు వస్తాయి ఆ శక్తులను తనకు అనుకూలంగా మార్చుకుని, తన జీవితాన్ని నాశనం చేయాలనుకున్న వ్యక్తికి వేటాడుతుంటాడు. వీడియో ఎంతో ఆసక్తికరంగా ఉంది. నిడివి : 2 ని 59 సె. హిట్స్ : 19,50,590 బాహా కిలిక్కి : ట్రిబ్యూట్ టు టీమ్ బాహుబలి ‘బాహుబలి’ చిత్ర బృందానికి ట్రిబ్యూట్గా పాప్ స్మిత రూపొందించిన ‘బాహా కిలిక్కి’ వీడియో ఆసక్తికరంగా ఉంది. ఐదు రోజుల క్రితం స్మిత్ బాహా కిలిక్కిని అప్లోడ్ చేశారు. ఇందులో నటుడు నోయల్ సీన్తో పాటు ‘కాలికేయ’ ప్రభాకర్ కూడా కనిపిస్తాడు. ఐటమ్ సాంగ్లా అనిపించే ఇందులోని నృత్యగీతాలు యువతను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ‘హేయ్.. టీచ్ మీ ఇంగ్లిష్’ అని అర్థం వచ్చే మాటలేవో కాలకేయుడు తనదైన స్టైల్లో అనగానే, ఆదిమజాతి రాకుమారి స్మిత ‘నో... నీకు కిలిక్కి భాషను నేర్పిస్తాం’ అని చెప్పడంతో వీడియో స్టార్ట్ అవుతుంది. నిడివి : 3 ని. 29 సె. హిట్స్ : 3,59,251 -
మిస్ యూనివర్స్గా ఫిలిప్పీన్స్ సుందరి
♦ గందరగోళం అనంతరం ఎంపికైన పియా అలొంజో ♦ రెండో స్థానంలో కొలంబియాకు చెందిన అరియాడ్నా లాస్వేగాస్: ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటం ఫిలిప్పీన్స్కు చెందిన పియా అలొంజో వుర్త్బాచ్ను వరించింది. ఫైనల్స్కు మొత్తం 79 మంది చేరుకోగా... అంతిమంగా పియా అలొంజో ఎంపికయ్యారు. రెండో స్థానంలో కొలంబియా సుందరి అరియాడ్నా గ్విటెర్జ్, మూడో స్థానంలో అమెరికా భామ ఒలివియా జోర్డాన్ నిలిచారు. భారత్ తరఫున పోటీ పడిన ఊర్వశి రుటెలా టాప్-15లోనూ చోటు దక్కించుకోలేకపోయింది. అయితే ఈ పోటీల విజేతల ప్రకటనలో కొంత గందరగోళం జరిగి, వివాదాస్పదంగా మారింది. కార్యక్రమం నిర్వాహకుడు స్టీవ్ హార్వే తొలుత ఈ విజేతలు వేర్వేరు స్థానాల్లో నిలిచినట్లు ప్రకటించారు. తొలిస్థానంలో కొలంబియా యువతి అరియాడ్నా, రెండో స్థానంలోఅలొంజో, మూడో స్థానంలో ఒలివియా నిలిచారని చెప్పారు. దీంతో ఎగిరి గంతేసిన కొలంబియా యువతి.. వేదికపై ‘క్యాట్వాక్’ చేసి ప్రేక్షకులకు అభివాదం కూడా చేశారు. గత ఏడాది మిస్ యూనివర్స్, కొలంబియాకే చెందిన పౌలినా వెగా వేదికపైకి చేరుకుని అరియాడ్నా తలపై కిరీటమూ పెట్టారు. కానీ విజేతలను ప్రకటించడంలో పొరపాటు జరిగిందంటూ నిర్వాహకుడు స్టీవ్ హార్వే ఒక్కసారిగా షాకిచ్చారు. మొదటి స్థానంలో పియా, రెండో స్థానంలో అరియాడ్నా నిలిచినట్లు ప్రకటించారు. ఈ తప్పిదానికి తాను బాధ్యత వహిస్తానని, ఎవరూ బాధపడవద్దని వ్యాఖ్యానించారు. దీంతో తిరిగి వేదికపైకి వచ్చిన మాజీ మిస్ యూనివర్స్ పౌలినా వెగా... అరియాడ్నా నుంచి కిరీటాన్ని తీసుకుని పియా అలొంజోకు అలంకరించారు. ఈ సందర్భంగా పియా అలొంజో ‘నాది హృదయంతో కూడిన సౌందర్యం’ అని పేర్కొన్నారు. ఈ మిస్ యూనివర్స్ కిరీటం బాధ్యతలతో కూడిన గౌరవంగా భావిస్తానని చెప్పారు. హెచ్ఐవీపై ప్రజలను చైతన్యవంతం చేస్తానని తెలిపారు. -
'ఆమె పేరు చెప్పడం తప్పు.. సారీ'
లాస్ వెగాస్: మిస్ యూనివర్స్ పోటీల్లో విజేత పేరును మొదట తప్పుగా ప్రకటించినందుకు నిర్వాహకుడు స్టీవ్ హార్వే క్షమాపణలు చెప్పారు. పొరపాటు చేశానని, ఇందుకు చింతిస్తున్నానని హార్వే వివరణ ఇచ్చారు. ఆదివారం రాత్రి జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో విజేత పేరును తప్పుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మిస్ ఫిలిప్పీన్స్ ఈ కిరీటాన్ని దక్కించుకోగా.. తొలుత కొలంబియా యువతి గుటిరేజ్ గెలుచుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఆమెకు కిరీటాన్ని కూడా తొడిగారు. అంతలోనే నిర్వాహకులు పొరపాటు తెలుసుకుని మిస్ యూనివర్స్ గెలుచుకుంది ఫిలిప్పీన్స్ యువతి ఉర్జ్ బ్యాక్ అని ప్రకటించారు. మిస్ కొలంబియా షాక్కు గురికాగా.. నిర్వాహకులు కిరీటాన్ని వెనక్కి తీసుకొని మిస్ ఫిలిప్పీన్స్ కు తొడిగారు. ప్రతిష్టాత్మకమైన పోటీల్లో నిర్వాహకుల తప్పిదం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. -
మిస్ యూనివర్స్ విజేత ఆమె..కాదు ఈమె!
లాస్ వెగాస్: ఆదివారం రాత్రి ప్రతిష్ఠాత్మకంగా జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. అమెరికా, ఫిలిప్పైన్స్, కొలంబియా దేశాలకు చెందిన ముగ్గురు యువతులు తుదిపోటీలో నిలవగా.. మిస్ ఫిలిప్పీన్స్ ఈ కిరీటాన్ని దక్కించుకుంది. అయితే ఆమెను విజేతగా ప్రకటించే ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మిస్ యూనివర్స్ కిరీటాన్ని కొలంబియా యువతి గుటిరేజ్ గెలుచుకున్నట్లు నిర్వాహకులు తొలుత ప్రకటించడంతో ఆమెకు కిరీటాన్ని తొడిగారు. నిజంగానే మిస్ యూనివర్స్ టైటిల్ వచ్చిందని భావించి సంతోషంలో ఉన్న గుటిరేజ్కు అంతలోనే షాకిచ్చిన నిర్వాహకులు 'వి ఆర్ రియల్లీ సారీ..' మిస్ యూనివర్స్ గెలుచుకుంది మీరు కాదు ఫిలిప్పీన్స్ యువతి ఉర్జ్ బ్యాక్ అని ప్రకటించారు. దీంతో కొన్ని క్షణాల పాటు మిస్ యూనివర్స్ గా ఉన్న మిస్ కొలంబియా షాక్కు గురైంది. నిర్వాహకులు మిస్ కొలంబియా నుండి కిరీటాన్ని వెనక్కి తీసుకొని మిస్ ఫిలప్పైన్స్ గుటిరేజ్కు తొడిగారు. పొరపాటున మిస్ యూనివర్స్గా ప్రకటించబడ్డ మిస్ కొలంబియా దీనిపై మాట్లాడుతూ 'ఇది నిర్వాహకులు కావాలని చేసిన పొరపాటు కాదు. అలా జరిగిపోయింది. దీని గురించి నేనేం బాధ పడట్లేదు' అని తెలిపింది. ప్రతిష్టాత్మకమైన పోటీల్లో నిర్వాహకుల తప్పిదం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. -
మీరూ మిస్ యూనివర్స్ కావొచ్చు..
కళ్లు తిప్పుకోనివ్వని నిండైన అందం, మెరుపు లాంటి చురుకుదనం, ఉత్తమ తెలివితేటలు, ప్రపంచాన్ని జయించే ఆత్మస్థైర్యం మీలో ఉందా? ఈ క్వాలిటీస్ ఉన్న కత్తిలాంటి అమ్మాయిలు ఇండియా తరఫున మిస్ యూనివర్స్- 2014 పోటీలో పొల్గొనాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? ఆ అవకాశం మీ ముంగిటకు వచ్చేసింది. మొదటగా మీరు చేయాల్సిందల్లా.. యమహా ఫ్యాసినో మిస్ దివా యూనివర్స్-2014 పోటీలో విజేతగా నిలవడమే. ఈ పోటీలకు త్వరలో ముంబయి వేదిక కానుంది. ఈ పోటీలో పాల్గొనదలిచిన అందాల భామలకు ఈనెల 7వ తేదీన గచ్చిబౌలిలోని హోటల్ హయత్లో ఆడిషన్స్ జరుగుతాయి. నగరంతో పాటు దేశంలోని ప్రముఖ పది నగరాల్లో జరిగే ఈ ఆడిషన్స్లో అందగత్తెలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తదుపరి ఆడిషన్స్ కోల్కతాలో. ఈ క్రమంలో నగరం నుంచి ఏ సుందరీమణి ఫైనల్కు వెళ్తుందోనని తీవ్ర ఆసక్తి కలుగుతోంది. దేశం తరఫున మిస్ యూనివర్స్లో పొల్గొనడం ఎందరో అందగత్తెల జీవితాశయం. అటువంటి సదావకాశం నిర్దిష్ట లక్షణాలు ఉంటే ఎవరికైనా దక్కొచ్చు. మరెందుకు లేట్.. మీ ప్రొఫైల్ను, ఫొటోలను missindiaorganization@gmail.com కు మెయిల్ చేయండి. ఆడిషన్స్కు సన్నద్ధమవ్వండి. ఆల్ ద బెస్ట్. వివరాలకు: 040 - 23306825, వెబ్సైట్: www.missdiva.com -
నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను: సుస్మితా సేన్
నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అని సుస్మితా సేన్ అన్నారు. అంతేకాకుండా ఓ అందమైన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తాను మీడియాకె వెల్లడించింది. ఈ సమాజంలోని ఆచారాలను పాటించను. మన సమాజమే ఈ వ్యవస్థను రూపొందించింది. 18 ఏళ్లకు డిగ్రీ పూర్తి చేసి.. 22 ఏళ్లకు పెళ్లి చేసుకుని.. 27 ఏళ్లకు పిల్లల్ని కనే పద్దతి తనకు నచ్చదని సుస్మితా అన్నారు. ఆచారాలు, సాంప్రదాయాలను తాను పాటించను అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రతి ఒక్క వ్యక్తి డీఎన్ ఏ వేర్వేరుగా ఉంటుంది. ఏదో ఒకరోజు పెళ్లి చేసుకుంటానని అన్నారు. మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకుని 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సుస్మిత క్యాన్సర్ రోగుల మధ్య ఓ వేడుకను జరుపుకుంది. రణదీప్ హుడా, విక్రమ్ భట్ బాలీవుడ్ నటులతోనూ, పాకిస్థాన్ క్రికెటర్ వసీం అక్రమ్ తో డేటింగ్ చేసినట్టు మీడియాలో రూమర్లు షికారు చేసిన సంగతి తెలిసిందే. -
మిస్ యూనివర్స్పై కేసు
తాజ్ వద్ద ఉన్న డయానా సీట్పై చెప్పులు పెట్టినట్లు ఫిర్యాదు ఆగ్రా: మిస్ యూనివర్స్ ఒలీవియా ఫ్రాన్సిస్ కల్పో.. తాజ్ మహల్ వద్ద ఓ ఘనకార్యం వెలగబెట్టి చిక్కుల్లో పడ్డారు. ఆదివారం ఆమె బ్యాగులోని చెప్పులను ‘డయానా సీట్’గా పేర్కొనే పాలరాతి బెంచీపై ఉంచి చెప్పుల కంపెనీ వ్యాపార ప్రకటన కోసం పోజిచ్చినట్లు భారత పురాతత్వ శాఖ(ఏఎస్ఐ) ఫొటో ఆధారంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కల్పో, ఫొటోషూట్ నిర్వహించిన ఆమె బృందంలోని వారిపై కేసు పెట్టారు. దివంగత బ్రిటన్ యువరాణి డయానా 1992 నాటి తాజ్ పర్యటన కు గుర్తుగా తాజ్లోని ఓ పాలరాతి బెంచీకి ‘డయానా సీట్’ అని పేరు పెట్టామని, కల్పో ఫొటో షూట్ తతంగం ఆ బెంచీని అగౌరవించడమేనని పోలీసులకు ఫిర్యాదు చేసిన తాజ్ సంరక్షణ అధికారి మునాజర్ అలీ చెప్పారు. అమెరికాకు చెందిన కల్పో భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. -
తీహార్ జైలును సందర్శించిన విశ్వసుందరి ఒలీవియా
విశ్వసుందరి ఒలీవియా ఫ్రాన్సెస్ కప్లో తీహార్ జైలును సందర్శించింది. జైల్లో జరుగుతున్న హరిత ఉద్యమాన్ని ఎంతగానో ప్రశంసించింది. మరొక్క ఏడాది గడిస్తే తీహార్ ఇంకెంత బాగుంటుందోనని వ్యాఖ్యానించింది. సెంట్రల్ జైలు నెం.2ను సందర్శించిన ఒలీవియా, అక్కడ రెండు గంటల పాటు గడిపింది. జైలు ఫ్యాక్టరీ, ఖైదీలు తయారుచేస్తున్న వివిధ వస్తువులు.. ఇలాంటి విశేషాలన్నింటినీ డైరెక్టర్ జనరల్ (జైళ్లు) విమలా మెహ్రా దగ్గరుండి ఆమెకు వివరించారు. జైలులోని బ్యాండ్ నిర్వహించిన 'ఫ్లయింగ్ సోల్స్' అనే సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా ఆమె చూసింది. మహిళలు, అమ్మాయిలపైన హింసకు పాల్పడకుండా ఉంటామని ఖైదీల నుంచి ఆమె మాట తీసుకున్నారు. ఆమెతోపాటు డిజైనర్ సంజనా జాన్ కూడా తీహార్ జైలుకు వచ్చారు. ఆడ శిశువుల సంరక్షణ, మహిళా సాధికారత, ఎయిడ్స్పై అవగాహన తదితర కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు ఈ అమెరికా సుందరి భారతదేశంలో పది రోజుల పాటు పర్యటిస్తోంది. -
‘ఎయిడ్స్’ ర్యాలీలో మిస్ యూనివర్స్
న్యూఢిల్లీ: హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించి, బాధితులకు సాయం చేసేందుకు ‘వాక్ ఫర్ లైఫ్’ పేరుతో నగరంలో ఆదివారం నిర్వహించిన ర్యాలీకి మిస్ యూనివర్స్ 2012 ఒలీవియా ఫ్రాన్సిస్ కల్పో హాజరయింది. ఇండియాగేటు వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించింది. మొదటిసారిగా భారత్కు వచ్చిన కల్పో శుక్రవారం కూడా గుర్గావ్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాలుపంచుకుంది. ‘ప్రాణాంతక ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన అవసరముంది. ముఖ్యంగా యువత అవగాహన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా చూడాలి. ఈ వ్యాధితో వచ్చే ఇబ్బందులను వివరించాలి’ అని ఆమె ఈ సందర్భంగా చెప్పింది. హెచ్ఐవీ బాధితులపై చిన్నచూపు చూసే దురాచారాన్ని పూర్తిగా నిర్మూలించాలని ఈ 21 ఏళ్ల బ్యూటీ స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని కోరింది. నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులు, యువత ఇందులో పాల్గొన్నారు. అమెరికాలో హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాధి అవగాహన కార్యక్రమాల్లో కల్పో చురుగ్గా పాల్గొంటోంది. భారత్లో బాలికా శిశుసంరక్షణ, మహిళా సాధికారత, ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన వంటి వాటిపై ప్రచారం చేయడానికి ఈ అమెరికన్ యువతి పది రోజులపాటు భారత్లో పర్యటించనుంది. పాలమ్విహార్లోని సులభ్గ్రామ్ను కూడా కల్పో శనివారం సందర్శించడం తెలిసిందే. పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసే పలువురు మహిళలతో రెండు గంటలసేపు ఈమె మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంది. లింగ, కుల వివక్ష నిర్మూలనకు గట్టి ప్రయత్నాలు జరగాలని ఆకాంక్షించింది. లింగనిర్ధారణ పరీక్షలకు వ్యతిరేకంగా ముంబైలో జరిగే కార్యక్రమాల్లోనూ కల్పో పాల్గొననుంది. బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ఖాన్ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నాడు. -
‘ఎయిడ్స్’ ర్యాలీలో మిస్ యూనివర్స్
న్యూఢిల్లీ: హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించి, బాధితులకు సాయం చేసేందుకు ‘వాక్ ఫర్ లైఫ్’ పేరుతో నగరంలో ఆదివారం నిర్వహించిన ర్యాలీకి మిస్ యూనివర్స్ 2012 ఒలీవియా ఫ్రాన్సిస్ కల్పో హాజరయింది. ఇండియాగేటు వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించింది. మొదటిసారిగా భారత్కు వచ్చిన కల్పో శుక్రవారం కూడా గుర్గావ్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాలుపంచుకుంది. ‘ప్రాణాంతక ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన అవసరముంది. ముఖ్యంగా యువత అవగాహన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా చూడాలి. ఈ వ్యాధితో వచ్చే ఇబ్బందులను వివరించాలి’ అని ఆమె ఈ సందర్భంగా చెప్పింది. హెచ్ఐవీ బాధితులపై చిన్నచూపు చూసే దురాచారాన్ని పూర్తిగా నిర్మూలించాలని ఈ 21 ఏళ్ల బ్యూటీ స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని కోరింది. నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులు, యువత ఇందులో పాల్గొన్నారు. అమెరికాలో హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాధి అవగాహన కార్యక్రమాల్లో కల్పో చురుగ్గా పాల్గొంటోంది. భారత్లో బాలికా శిశుసంరక్షణ, మహిళా సాధికారత, ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన వంటి వాటిపై ప్రచారం చేయడానికి ఈ అమెరికన్ యువతి పది రోజులపాటు భారత్లో పర్యటించనుంది. పాలమ్విహార్లోని సులభ్గ్రామ్ను కూడా కల్పో శనివారం సందర్శించడం తెలిసిందే. పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసే పలువురు మహిళలతో రెండు గంట లసేపు ఈమె మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంది. లింగ, కుల వివక్ష నిర్మూలనకు గట్టి ప్రయత్నాలు జరగాలని ఆకాంక్షించింది. లింగనిర్ధారణ పరీక్షలకు వ్యతిరేకంగా ముంబైలో జరిగే కార్యక్రమాల్లోనూ కల్పో పాల్గొననుం ది. బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ఖాన్ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నాడు. -
సల్మాన్ ఖాన్ ను కలుసుకోనున్న మిస్ యూనివర్స్!
మిస్ యూనివర్స్ 2012 ఓలివియా కల్పో శుక్రవారం భారత పర్యటనను ప్రారంభించారు. ఈ పర్యటనలో బాలికల సంక్షేమం కోసం నిధులను సేకరించేందుకు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను కూడా కలువనున్నారు. భారత పర్యటనలో ఓలివియా వెంట డిజైనర్ సంజనా ఉంటారు. బాలికల సంక్షేమం, మహిళపై లైంగిక వేధింపుల వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది అని అన్నారు. బాలికల సంక్షేమం కోసం నిధుల సేకరణ కోసం ఏర్పాటు చేసే మీడియా సమావేశంలో సల్మాన్ ఖాన్ తోపాటు లతా మంగేష్కర్, సంగీత దర్శకులు సాజిద్, వాజిద్ లు కూడా పాల్గొంటారని నిర్వహకులు తెలిపారు. ఈపర్యటనలో భారతీయ సాంప్రదాయ దుస్తులను ధరిస్తారని డిజైనర్ సంజనా తెలిపారు. అంతేకాక బాలీవుడ్ అంటే ఓలివియాకు ప్రత్యేక అభిమానం. పరిస్థితులు అనుకూలిస్తే.. సల్మాన్ ఖాన్ తో కలిసి పనిచేసే అవకాశం ఉంది అని సంజనా తెలిపారు.