nuziveedu
-
కొత్త గ్రూపులకు ‘సారథి’!
నూజివీడు: ఇంకా టీడీపీలో చేరనేలేదు... ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించలేదు... టికెట్ ఇస్తామని ప్రకటించలేదు... కానీ, అప్పుడే కొలుసు పార్థసారథి నూజివీడులో గ్రూపు రాజకీయాలు మొదలు పెట్టారు. దీంతో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వర్గం మండిపడుతోంది. ఇప్పటికే ఇక్కడ టీడీపీలో ఉన్న గ్రూపుల గోల సరిపోదన్నట్లు... పార్థసారథి రాకముందే మరో కొత్త గ్రూపును తయారు చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మొదట ప్రగల్బాలు.. చివరకు సొంత సామాజికవర్గ నేతకు ఎసరు గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పెనమలూరు నియోజకవర్గం నుంచి కొలుసు పార్థసారథి పోటీ చేసి విజయం సాధించారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ పెనమలూరు నుంచి సీటు ఇవ్వడం సాధ్యం కాదని, ప్రత్యామ్నాయం ఆలోచిద్దామని వైఎస్సార్సీపీ అధిష్టానం పార్థసారథికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. ఇందుకు ఆయన అంగీకరించకుండా తాను పెనమలూరు నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. అదే సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును రహస్యంగా కలిసి ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. కానీ, అక్కడ టీడీపీ ఇన్చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అడ్డం తిరగడంతో చంద్రబాబు వెనక్కి తగ్గారు. పెనమలూరు తనకు కావాల్సిందేనని బోడే ప్రసాద్ గట్టిగా పట్టుపట్టారని, బీసీ నేత ముద్దరబోయిన అయితే మౌనంగా వెళ్లిపోతారని పార్థసారథిని నూజివీడు నుంచి పోటీ చేయాలని చంద్రబాబు సూచించినట్లు ప్రచారం సాగుతోంది. చివరకు తాను పెనమలూరు నుంచే పోటీ చేసి గెలుస్తానని ప్రగల్బాలు పలికిన పార్థసారథి కూడా అస్త్రసన్యాసం చేశారు. పెనమలూరులో బోడే ప్రసాద్ను తప్పించి తనకు సీటు ఇవ్వాలని చంద్రబాబును అడిగే ధైర్యం చేయలేక నూజివీడు వచ్చి పదేళ్లుగా టీడీపీని నమ్ముకుని ఉన్న తన సొంత సామాజికవర్గ నేతకు అన్యాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ముద్దరబోయిన ఫొటోల తొలగింపు నూజివీడు మండలం రావిచర్లలోని ఓ టీడీపీ నాయకుడి ఇంట్లో బుధవారం జరిగే శుభకార్యానికి పార్థసారథి హాజరుకానున్నట్లు తెలిసింది. ఆయనకు స్వాగతం పలుకుతూ మంగళవారం నూజివీడు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. వాటిలో ప్రస్తుత టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఫొటో కూడా ఉంది. పార్థసారథి కనీసం టీడీపీలో చేరకుండానే ఆయనకు స్వాగతం పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ముద్దరబోయిన వర్గం కంగుతింది. దీనిపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వ్యక్తిని వారు నిలదీయగా.. తనకు ఇద్దరు నాయకులు కావాలని, అందుకే ఇద్దరి ఫొటోలు వేశానని అతను చెప్పినట్టు సమాచారం. ఇద్దరి ఫొటోలు ఉండటానికి వీల్లేదని ముద్దరబోయిన వర్గం స్పష్టం చేసింది. ముద్దరబోయిన ఫొటోను తీసేయాలని, లేకపోతే తామే తమ నాయకుడి ఫొటోను తొలగిస్తామని హెచ్చరించింది. ఆ తర్వాత ఫ్లెక్సీలపై ఉన్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఫొటోను వారే కట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం నూజివీడులో హాట్ టాపిక్గా మారింది. పార్థసారథి అధికారికంగా టీడీపీలోకి రాకముందే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఈ గ్రూపుల గోల మరింత పెరిగే అవకాశం ఉందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పదేళ్ల నుంచి పార్టీ ఇన్చార్జిగా ఉన్న నేతను అధిష్టానం విస్మరించడం, మరోసారి వలస నేతను తీసుకురావడం, ఆయన మరో కొత్త వర్గాన్ని తయారు చేసుకునే పని ప్రారంభించడంపై నియోజకవర్గంలోని టీడీపీ సీనియర్ నాయకులు సైతం మండిపడుతున్నారు. నియోజకవర్గంలో గ్రూపుల గోల వల్ల ఇప్పటికే వరుసగా రెండుసార్లు ఓడిపోయామని, తాజా పరిణామాలు కూడా రానున్న ఎన్నికల్లో తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
మీరిచ్చిందే.. మీ బిడ్డ ధైర్యం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘మీ బిడ్డ ఎవరికీ భయపడడు. ఎవరితోనూ పొత్తులు పెట్టుకోడు. మీ బిడ్డ పొత్తు ప్రజలతోనే. ఎన్నికలు సమీపిస్తుండటంతో గజదొంగల ముఠా, దత్తపుత్రుడు అంతా ఏకమై ప్రజలను మోసం చేసేందుకు అడుగులు వేస్తున్నారు’’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. మాజీ సీఎం చంద్రబాబు ఏనాడూ ప్రజలకు మంచి చేసి అధికారంలోకి రాలేదని, వంచనతోనే పదవి దక్కించుకున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఏలూరు జిల్లా నూజివీడులో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబు మోసాలను తీవ్రస్థాయిలో ఎండగట్టారు. ఆ అన్యాయాలను గుర్తు తెచ్చుకోండి.. గత ముఖ్యమంత్రి (చంద్రబాబు నాయుడు) మాదిరిగా తన వర్గం, తన వాళ్లు, గజదొంగల ముఠా, దత్తపుత్రుడి కోసం ప్రజలందరి ప్రయోజనాలను తాకట్టు పెడితే సామాజిక అన్యాయం జరుగుతుంది. గజదొంగల ముఠా, జన్మభూమి కమిటీల కోసం దోచుకోవాలని భావించే వ్యక్తి సీఎం స్థానంలో కూర్చుంటే ఏం న్యాయం చేస్తాడో మనమంతా చూశాం. రైతులు, అక్క చెల్లెమ్మలు, నిరుద్యోగులకు ఎంత అన్యాయం చేశాడో చూశాం. 2014 నుంచి 2019 వరకు ఆ ఐదేళ్లలో ప్రత్యక్ష సాక్షులుగా అవన్నీ గుర్తు తెచ్చుకోవాలని కోరుతున్నా. ప్రాంతాలకు, సమాజంలో మనుషులకు అన్యాయం చేసిన ఆ పెద్ద మనిషి చంద్రబాబు గురించి మరో రెండు మాటలు కూడా చెబుతా. చంద్రబాబు ఎన్నడూ ప్రజలకు మంచి చేసి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోలేదు. ఆయన తీసుకొచ్చిన మంచి స్కీముల వల్లనో లేక చేసిన మంచి పనుల వల్లనో ఏనాడూ సీఎం కాలేదు. ఆ పెద్ద మనిషి సీఎం ఎలా అయ్యాడో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. కూతుర్ని ఇచ్చిన మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి మొట్టమొదటిసారి సీఎం అయ్యాడు. రెండోసారి కార్గిల్ యుద్ధం పుణ్యమా అని సీఎం అయ్యాడు. రైతన్నలకు రూ.87,612 కోట్లు రుణమాఫీ చేస్తానని, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రుణమాఫీ చేస్తానని, ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని, జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పి 2014లో మూడోసారి సీఎం అయ్యాడు. ఆ తర్వాత రైతులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలను కూడా వదలకుండా ఎంత మోసం చేశాడో చూసిన ప్రజలు 2019 ఎన్నికల్లో చంద్రబాబు గూబ గుయ్మనిపించేలా 151 స్థానాలతో మీ బిడ్డను గెలిపించారు. అలాంటి వ్యక్తిని ఎవరైనా నమ్మగలరా? మిగతా సామాజిక వర్గాలంటే చంద్రబాబుకు ఎంత చులకనో ఆయన పాలనను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నోటి నుంచి వచ్చిన మాటలను జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నా. ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా..? అని ఆయన అన్న మాటలను గుర్తు తెచ్చుకోండి. నాడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆ వ్యక్తి బీసీల తోకలు కత్తిరిస్తా.. ఖబడ్దార్! అంటూ బెదిరించిన వైనాన్ని గుర్తు తెచ్చుకోండి. ఇదే పెద్దమనిషికి అక్క చెల్లెమ్మల మీద ఉన్న చులకన భావనను కూడా గుర్తు తెచ్చుకోండి. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా..? అంటూ చులకనగా వ్యాఖ్యానించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అసలు సమాజం మీద ప్రేమ గానీ రైతుల పట్ల గౌరవం గానీ అక్కచెల్లెమ్మల సాధికారత, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలపై కమిట్మెంట్ గానీ లేని ఇలాంటి నాయకుడు ఎవరికి మేలు చేయగలుగుతాడు? ఎప్పుడైనా మేలు చేశాడా? ఇలాంటి వారిని అసలు నమ్మగలరా? విజ్ఞతతో ఆలోచించండి.. రాబోయే రోజుల్లో ఆయన అబద్ధాలు, మోసాలు ఎక్కువ అవుతాయి. ఆయనకు తోడు గజదొంగల ముఠా! ఆ ముఠాకు తోడు దత్త పుత్రుడు ఏకమవుతారు. వీరందరూ కలసి ప్రజలను మోసం చేసేందుకు అడుగులు వేస్తారు. ప్రతి ఇంటికీ బంగారం, బెంజ్ కారు కూడా ఇస్తామంటారు. వాటిని విని మోసపోకండి. ఆ అబద్ధాలను నమ్మకండి. గతంలో ఇదే పెద్ద మనుషులిద్దరూ కలిసి వచ్చి 2014లో ఏం చెప్పారు? వాటిని అమలు చేశారా లేదా? అని ఆలోచించి విజ్ఞతతో అడుగులు ముందుకు వేయాలి. తోడేళ్లంతా ఏకమైనా.. ఒంటరిగానే సింహం వీళ్ల మాదిరిగా నాకు అబద్ధాలు చెప్పడం చేతకాదు. వాళ్ల మాదిరిగా మీ బిడ్డకు కుట్రలు, కుతంత్రాలు చేయడం తెలియదు. మీ బిడ్డ మోసం చేయడు, అబద్ధాలు ఆడడు. ఇది కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నా. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. తోడేళ్లన్నీ ఏకమవుతున్నాయి. మీ బిడ్డకు వారి మాదిరిగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడి సపోర్టు లేదు. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగిందా లేదా అని మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మీరే సైనికులుగా నిలబడండి. మీ బిడ్డ ఎవరితోనూ పొత్తు పెట్టుకోడు.. మీ బిడ్డ పొత్తు కేవలం మీతోనే ఉంటుంది. తోడేళ్లు మొత్తం ఏకమై వచ్చినా కూడా సింహం ఒంటరిగానే నడుచుకుంటూ వస్తుంది. మీ బిడ్డకు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఈ ధైర్యం మీ దగ్గర నుంచే వచ్చింది. నేను దేవుడిని నమ్ముతా. మీ ఆశీస్సుల మీద ఆధారపడతా. ఇవే మీ బిడ్డకు ధైర్యాన్ని ఇస్తాయి. సీఎం సభలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, తానేటి వనిత, పినిపే విశ్వరూప్, మేరుగ నాగార్జున, ఎంపీలు మిథున్రెడ్డి, కోటగిరి శ్రీధర్, కృష్ణా, ఏలూరు జిల్లాల ఎమ్మెల్యేలు మేకా వెంకట ప్రతాప అప్పారావు, తలారి వెంకట్రావు, పుప్పాల వాసుబాబు, తెల్లం బాలరాజు, దూలం నాగేశ్వరరావు, పేర్ని నాని, సామినేని ఉదయభాను, జెడ్పీ చైర్పర్సన్లు ఘంటా పద్మశ్రీ, ఉప్పాల హారిక తదితరులు పాల్గొన్నారు. నూజివీడులో పల్ప్ యూనిట్, ప్రాసెసింగ్ ప్లాంట్ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావు కోరినట్లుగా 16 వార్డు సచివాలయాల పరిధిలో పనులకు ఒక్కో సచివాలయానికి రూ.కోటి చొప్పున రూ.16 కోట్లు కేటాయిస్తున్నాం. రూ.275 కోట్లతో మ్యాంగో పల్ప్ యూనిట్, ప్రాసెసింగ్ ప్లాంట్కు త్వరలో పునాది రాయి వేయబోతున్నాం. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తాం. -
నూజివీడులో మామిడి పౌడర్ యూనిట్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అకాల వర్షం, ఈదురు గాలులకు నష్టపోతున్న మామిడి రైతులను ఆదుకునేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకొచ్చింది. అకాల వర్షాలు, ఈదురు గాలులకు రాలిపోయిన, దెబ్బతిన్న మామిడి కాయలను కొని, వాటి నుంచి పౌడర్ తయారు చేసే సరికొత్త మామిడి ప్రాసెసింగ్ యూనిట్కు శ్రీకారం చుట్టింది. అది కూడా స్థానికంగా ఉండే మహిళా రైతులను యజమానులుగా మార్చి వారి భాగస్వామ్యంతోనే మామిడి పౌడర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయిస్తోంది. రూ. 5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే ఈ యూనిట్లో వెయ్యి మంది మహిళలు రూ. 50 లక్షల భాగస్వామ్యం కలిగి ఉంటారు. మిగిలిన రూ.4.50 కోట్లు సబ్సిడీగా లభిస్తుంది. ఏలూరు జిల్లా నూజివీడులోని మార్కెట్ యార్డులో ఈ పరిశ్రమ ఏర్పాటు కానుంది. నూజివీడు మామిడికి ప్రసిద్ధి. ఏలూరు, కృష్ణా జిల్లాల్లో 1.40 లక్షల ఎకరాల్లో ఈ రకం మామిడి సాగవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఉంది. ఈ ఏడాది మామిడికి మంచి ధర ఉన్నప్పటికీ అకాల వర్షాలకు కాయకు మంగు రావడం, మచ్చలు ఉండటం, ఇతర కారణాలతో మార్కెట్ పూర్తిగా పతనమైంది. ప్రధానంగా నూజివీడులో పెద్ద రసాలు, చిన రసాలు, జలాలు, సువర్ణరేఖ, హిమామ్పసంగ్, బంగినపల్లి, తొతాపూరి తదితర వెరైటీలు సాగవుతుంటాయి. అయితే ఎక్కువగా తొతాపూరి, చిన్న రసాలు, పెద్ద రసాలు 90 శాతం మార్కెట్లో ఉంటాయి. మార్కెట్ యార్డ్లో ప్రాసెసింగ్ యూనిట్ ఈ ఏడాది అకాల వర్షాలు, ఈదురు గాలలకు కాయ రాలిపోవడంతో మామిడి రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. వీటికి పరిష్కారం చూపే విధంగా పంటకు మంచి ధర ఉండేలా స్ధానికంగా మార్కెట్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూజివీడు మార్కెట్ యార్డ్లో ఎకరం విస్తీర్ణంలో మామిడి ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గుజ్జు (పల్ప్) సేకరించే యూనిట్ కాకుండా పచ్చడి మామిడికాయ నుంచి పౌడర్ తీసే యూనిట్ను ఏర్పాటు చేయనున్నారు. స్థానికంగా వెయ్యి మంది మహిళా రైతులను గుర్తించి ఇప్పటికే వారితో ఒక సమాఖ్య రిజిస్ట్రేషన్ చేయించారు. ఒక్కొక్కరు రూ. 5 వేల మూలనిధితో రూ. 50 లక్షలు సమకూర్చుకోగా మిగిలిన రూ. 4.50 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ యార్డులో స్ధలం కేటాయించింది. పథకం అమలు కోసం జిల్లా కలెక్టర్ ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. మరో నెల రోజుల్లో ప్రభుత్వ ఆమోదముద్రతో పనులు ప్రారంభమై మూడు నెలల్లో ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం కానుంది. డీఆర్డీఏ నేతృత్వంలో మహిళా సమాఖ్య దీన్ని నిర్వహించనుంది. ప్రత్యేకంగా చెట్టు నుంచి కోసిన కాయలతో పాటు, రాలిపోయిన కాయలు, వర్షానికి దెబ్బతిన్న కాయలను కూడా సమాఖ్య మార్కెట్ ధరకు కొంటుంది. రైతుకు వెంటనే డబ్బు చెల్లిస్తుంది. కాయల నుంచి మామిడి పౌడర్ను తయారు చేసి క్యాండీ, జెల్లీలు తయారు చేసే పరిశ్రమలకు విక్రయించేలా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మొదటి ప్రాసెసింగ్ యూనిట్ రాష్ట్రంలోనే మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మొట్టమొదటి మ్యాంగో పౌడర్ యూనిటŒæ ఇది. నూజివీడులోని మార్కెట్ యార్డులో ఎకరం స్ధలంలో రూ. 5 కోట్లతో ఏర్పాటు చేస్తున్నాం. నూజివీడులో 12 వేల ఎకరాలు, ఆగిరిపల్లిలో 20 వేల ఎకరాల్లో మొత్తంగా 32 ఎకరాల్లో రైతులకు ప్రాసెసింగ్ యూనిట్ ఉపయుక్తంగా ఉంటుంది. మహిళలే యజమానులుగా దీన్ని డీఆర్డీఏ పర్యవేక్షణలో నిర్వహిస్తారు. – ప్రసన్న వెంకటేష్, జిల్లా కలెక్టర్, ఏలూరు -
ప్రచార పిచ్చితో ప్రాణాలు తీస్తున్నారు
-
చంద్రబాబు నూజివీడు పర్యటనలో అపశృతి
-
శారీరక సంబంధంతోనే పెద్దలు వివాహం చేస్తారని నమ్మించి..
సాక్షి, నూజివీడు (పశ్చిమగోదావరి): శారీరక సంబంధంతోనే పెద్దలు వివాహం చేస్తారని నమ్మించి మోసం చేయడంతో మనస్తాపంతో ఎలుకలమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ యువతి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని స్టేషన్తోటకు చెందిన రాణిమేకల రాణి(20) ఇంటర్ వరకు చదివింది. అదే ఏరియాకు చెందిన డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న కొండా ప్రదీప్కుమార్, రాణి ఆరునెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం రెండు నెలల క్రితం వారి ఇళ్లల్లో తెలిసి వీరి ప్రేమను అంగీకరించలేదు. దీంతో వీరు సైతం మాట్లాడుకోవడం లేదు. ఈ నేపధ్యంలో ఆగస్టు మొదటి వారంలో ప్రదీప్ మళ్లీ రాణితో మాటలు కలిపి ఇద్దరం శారీరకంగా ఒక్కటైతే పెద్దలు కచ్ఛితంగా పెళ్లికి అంగీకరిస్తారని చెప్పి నమ్మించాడు. 10వ తేదీన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో శారీరకంగా ఒక్కటయ్యారు. మరుసటి రోజు నుంచి ప్రదీప్ యువతితో మాట్లాడటం మానేశాడు. మహిళ భయంతో 27న తన తల్లి మంజులకు జరిగిన విషయాన్ని చెప్పింది. ఆమె పెద్దలతో చెప్పగా, వారు ప్రదీప్, అతని తల్లిని వివాహం చేసుకోవాలని అడగగా నిరాకరించారు. దీంతో 28న ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాణి ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయాన్ని తల్లికి చెప్పగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (అత్తతో అసభ్యంగా ప్రవర్తించిన అల్లుడికి ఐదేళ్ల శిక్ష) -
వారం రోజుల పాటు ‘అమృత భూమి’ చిత్రం ఉచిత ప్రదర్శన
ప్రకృతి వ్యవసాయంపై రైతులను చైతన్యవంతం చేస్తూ తెరకెక్కిన చిత్రం ‘అమృత భూమి’. కె.బి. ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కీ.శే. వంగపండు ప్రసాదరావు కథ, పాటలు అందించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కీలక పాత్రలో నటించారు. రసాయన వ్యవసాయం వల్ల భూములు నిస్సరమ అయిపోవటమే కాకుండా.. ప్రకృతి వనరులు, మనం తినే ఆహారం కూడా రసాయనాలు మయం అవుతోంది. అందుకే మనందరం - రైతులైనా, వినియోగదారులు అయినా - ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. ఆరోగ్యంగా జీవించాలంటే అమృతాహారం ఆవశ్యకతను గుర్తెరగాలి.. సమాజంలో ప్రతి ఒక్కరికీ ఈ సందేశాన్ని తెలిసేలా ప్రచారం చేయాలి. ఈ ఉదాత్తమైన అద్భుత సందేశాన్ని అత్యంత సృజనాత్మకంగా వెండి తెర పైకి ఎక్కించిన ఘనత ప్రముఖ స్వచ్ఛంద సేవకులు, ‘అమృతభూమి’ చిత్ర నిర్మాత పారినాయుడుకే దక్కింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ శాఖకు అనుబంధ సంస్థ రైతు సాధికార సంస్థ తోడ్పాటుతో ఈ చలన చిత్రాన్ని హృద్యంగా నిర్మించారు. పిల్లలు, పెద్దలు, రైతులు.. అందరూ చూడదగిన ఈ చిత్రాన్ని నూజివీడుకు చెందిన వ్యాపారవేత్త, మూల్పూరి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు లక్ష్మణ స్వామి నూజివీడు(కృష్ణా జిల్లా) ప్రాంత ప్రజలకు వారం రోజుల పాటు ఉచితంగా చూపించాలని సంకల్పించారు. ఇప్పుడు 7 రోజులూ .. రోజూ 4షోలకు మార్చారు. ఆగష్టు 5 నుంచి 11తేదీ వరకు రోజూ 4 ఆటలు.. మార్నింగ్ షో ఉదయం 11 గంటలకు, మాట్నీ 2 గంటలకు, ఫస్ట్ షో సాయంత్రం 6 గంటలకు, సెకండ్ షో రాత్రి 9 గంటలకు ఉచితంగా సత్యనారాయణ మినీ థియేటర్లో ప్రదర్శించనున్నారు. ఈ ఖర్చంతా లక్ష్మణ స్వామి భరిస్తున్నారు. ఈ సదవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని ప్రకృతి సేద్యం, ప్రకృతి ఆహారం తక్షణ ఆవశ్యకతను గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. -
ప్రాణం తీసిన వెయ్యి రూపాయల వివాదం
నూజివీడు: తనకు ఇవ్వాల్సిన వెయ్యి రూపాయలను ఇవ్వమన్నందుకు వ్యక్తిని హత్య చేసిన ఘటన ఏలూరు జిల్లా నూజివీడు మండలం వెంకటాద్రిపురంలో ఆదివారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెంకటాద్రిపురానికి చెందిన గొల్లపల్లి శ్రీనివాసరావు (45) మండలంలోని రావిచర్లలో ఉన్న సిమెంట్ ఇటుక రాళ్ల కంపెనీలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇంటి వద్ద అవసరమై 200 సిమెంట్ రాళ్లను గతంలో తెచ్చుకొని ఉంచాడు. వాటిలో 50 రాళ్లను అదే గ్రామానికి చెందిన కూచిపూడి రంగా (30) అనే వ్యక్తి రెండు నెలల క్రితం తీసుకెళ్లాడు. వాటికి సంబంధించి వెయ్యి రూపాయలు ఇవ్వాలని, లేదంటే సిమెంట్ రాళ్లనైనా తిరిగి ఇచ్చేయమని శ్రీనివాసరావు అతనిపై ఒత్తిడి చేస్తున్నాడు. ఇదే విషయమై ఇద్దరూ పలుమార్లు గొడవ పడ్డారు. ఆదివారం సాయంత్రం కూడా ఇదే విషయమై వారి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో రంగా సమీపంలో ఉన్న కర్రతో శ్రీనివాసరావుపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావును స్థానికులు హుటాహుటిన నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. మృతుడికి భార్య, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఊహించని ఈ ఘటన గ్రామంలో తీవ్ర సంచలనం కలిగించింది. రూరల్ ఎస్ఐ ఎం.లక్ష్మణ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రిపుల్ ఐటీ భవితకు దివిటీ
ప్రతిభ గల పేద విద్యార్థులకు ఇంటర్మీడియెట్ నుంచి ఇంజనీరింగ్ వరకు ఉచిత విద్యనందించే సదుద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ కళాశాలలను ఏర్పాటుచేశారు. ఏలూరు జిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో చదువు పూర్తిచేసుకుని బయటికి వచ్చిన విద్యార్థులు మెరుగైన ప్యాకేజీతో ఉద్యోగావకాశాలు అందుకుంటున్నారు. పలువురు విదేశాల్లో చదువులు, కొలువులకు సైతం వెళ్తుండగా, మరికొందరు ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టి పెట్టి స్థిరపడినవారూ ఉన్నారు. – నూజివీడు ప్రపంచ స్థాయి ప్రమాణాలు, ఉన్నత సాంకేతిక విద్యను అందిస్తూ నూజివీడు ట్రిపుల్ఐటీ పేద విద్యార్థుల భవిష్యత్కు బంగారు బాటలు వేస్తోంది. ఆరేళ్లపాటు ఒక్కరూపాయి ఖర్చు లేకుండా చదువుకుంటున్న విద్యార్థులు క్యాంపస్ సెలెక్షన్స్లో సత్తాచాతున్నారు. ఏటా 350 నుంచి 500 మందికి పైగా వి ద్యార్థులు మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఏడాదికి రూ.7.60 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు ప్యాకేజీలకు ఎంపికవుతున్నారు. సాఫ్ట్వేర్ కొలువులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడిన వారు, విదేశీ కంపెనీల్లో పనిచేస్తున్న వారు ఉన్నారు. ఇస్రోలో సైంటిస్టులుగా, రైల్వేలో ఉన్నతోద్యోగులుగా, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శా ఖల్లో ఇంజినీర్లుగా, బ్యాంకు, సచివాలయ ఉద్యోగులుగా ట్రిపుల్ఐటీ విద్యార్థులు పనిచేస్తున్నారు. సీడీపీసీ ప్రముఖ పాత్ర : విద్యార్థులు ప్లేస్మెంట్లు సాధించడంలో కెరీర్ డెవలప్మెంట్ అండ్ ప్లేస్మెంట్ సెల్ (సీడీపీసీ) ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం నుంచే విద్యార్థులకు మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించడం, కంపెనీల అవ సరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులను అన్నిరకాలు గా తీర్చిదిద్దేలా ప్రత్యేక శిక్షణలు ఇస్తున్నారు. కంపెనీల ప్రతినిధులతో నిరంతరం మాట్లాడుతూ వారిని ప్లేస్మెంట్లకు వచ్చేలా చేస్తున్నారు. ప్రపంచ స్థాయి కంపెనీలు ప్రపంచస్థాయి సాఫ్ట్వేర్ కంపెనీలు క్యాంపస్ సెలెక్షన్స్ నిర్వహిస్తున్నాయి. టీసీఎస్, విప్రో, టెక్మహీంద్ర, క్యాప్జెమినీ, ఎఫ్ట్రానిక్స్, ఫ్రెష్డెస్క్, థాట్వర్క్స్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్, ఐబీఎం, సినోప్సిస్, ఇంటెల్ తదితర 80 కంపెనీలు ఇక్కడకు వస్తున్నాయి. 3,856 మందికి క్యాంపస్ ప్లేస్మెంట్లు ట్రిపుల్ఐటీలో ఇప్పటివరకూ 8 బ్యాచ్లు కోర్సును పూర్తిచేసుకుని వెళ్లగా వీరిలో 3,856 మందికి క్యాంపస్ ప్లేస్మెంట్లు వచ్చాయి. మరికొందరు గేట్లో ర్యాంకులు సాధించి ఎంటెక్ చదువుతున్నారు. ఈ ఏ డాదిలో ఇప్పటివరకూ 768 మందికి ఉద్యోగాలు రాగా అన్లాగ్ డివైస్ కంపెనీ ఏడాదికి రూ.20 లక్షల జీతంతో నలుగురిని, గప్చుప్ టెక్నాలజీస్ రూ.15 లక్షల వేతనంతో ఇద్దరిని, జస్పే సంస్థ రూ.27 లక్ష ల వేతనంతో ఒక విద్యార్థిని ఎంపిక చేసుకున్నాయి. వైఎస్సార్ వెలుగులు నింపారు ట్రిపుల్ఐటీ స్థాపించి దివంగత వైఎస్సార్ నా జీవితంలో వెలుగులు నింపారు. మాది దిగువ మధ్య తరగతి కుటుంబం. ట్రిపుల్ఐటీలో ఈసీఈ బ్రాంచితో ఇంజినీరింగ్ పూర్తిచేశా. తర్వాత మద్రాస్ ఐఐటీలో ఎంటెక్ చదివా. ఏడాదిన్నర పాటు దక్షిణ మధ్య రైల్వేలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేశా. ప్రస్తుతం ఇస్రో ప్రధాన కార్యాలయం (బెంగళూరు)లో సైంటిస్టు–సీగా పనిచేస్తున్నా. –గుత్తా వెంకట శేషారావు, ఇస్రో సైంటిస్ట్ -
ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు..
సాక్షి, గొల్లపల్లి(నూజివీడు) కృష్ణా: పెళ్లిచేసుకుంటానని నమ్మించిన ఓ యువకుడు తనను గర్భవతిని చేసి, ఆ తర్వాత మోసం చేశాడని.. తనకు న్యాయం చేయాలంటూ ఓ యువతి తన ఏడునెలల కుమారుడితో మండలంలోని గొల్లపల్లి సచివాలయం వద్ద సోమవారం బైఠాయించింది. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా.. తనకేమీ న్యాయం చేయట్లేదని వాపోయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని తూర్పు దిగవల్లికి చెందిన మిసమెట్ల వెంకటేశ్వరమ్మ(19)కు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. దీంతో గ్రామంలోని ఆమె బంధువుల వద్ద ఉండి మూడేళ్ల క్రితం గొల్లపల్లిలోని ఆమె పెద్దమ్మ సాయల రాములమ్మ వద్దకు వచ్చి ఉంటోంది. కూలిపనులకు వెళ్తున్న సమయంలో గొల్లపల్లికి చెందిన తటకలూరి విష్ణుబాబు(20) అనే యువకుడు ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని ఆమె వెంట పడేవాడు. రోజూ వెంట పడటంతో వెంకటేశ్వరమ్మ సైతం అతనితో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఇరువురూ ఒక్కటయ్యారు. దీంతో వెంకటేశ్వరమ్మ గర్భవతి అయ్యింది. ఈ నేపథ్యంలో గతేడాది సర్పంచి ఎన్నికలకు ముందు స్థానిక రూరల్ పోలీస్స్టేషన్ ఫిర్యాదు సైతం చేసింది. చదవండి: (ఒకరు బీటెక్.. మరొకరు బీఎస్సీ.. ఏ కష్టమొచ్చిందో.!) అయితే ఈ పంచాయతీ గ్రామంలోని పెద్దల వద్దకు వెళ్లగా, వారి ముందు పెళ్లి చేసుకుంటామని ఒప్పుకొని ఆ తరువాత యువకుడితో పాటు వారి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో పెద్దలు కూడా చేతులెత్తేశారు. ఆ తర్వాత యువతి మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఎన్నిసార్లు తిరిగినా గ్రామంలో పెద్దలు గాని, పోలీసులు గాని పట్టించుకోకపోవడంతో చివరకు ఏమి చేయాలో తెలియక సచివాలయం వద్ద బైఠాయించింది. ఆమెకు మద్దతుగా సోషల్ వర్కర్ పంతం మార్తమ్మ, బీఎస్పీ నియోజకవర్గ ఉపాధ్యక్షురాలు రంగు ధనలక్ష్మిలు, గ్రామంలోని పలువురు మహిళలు నిలిచారు. చదవండి: (తల్లి మందలించిందని పారిపోయిన యువతి.. చివరికి ఏమైందంటే..) -
కనురెప్పకు ఏ కష్టమొచ్చిందో..!?
సాక్షి, విజయవాడ: కట్టుకున్నవాడు లేడు.. జన్మనిచ్చిన తల్లిదండ్రులు లేరు.. ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు... ఇద్దరు ఆడపిల్లలు మరోవైపు.. ఎలా పెంచాలో తెలియదు.. ఏమి చేయాలో అర్థం కాదు.. దీనికి చావు ఒక్కటే పరిష్కారం అనుకుని.. కన్న తల్లే కర్కశంగా తన ఇరువురు ఆడపిల్లలకు విషమిచ్చి తాను విషం తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటనలో ఏడేళ్ల చిన్నకుమార్తె మృతిచెందగా, పెద్దకుమార్తె, తల్లి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి.. తిరువూరుకు చెందిన దైద నాగలక్ష్మి(35)కు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చండ్రుపట్లకు చెందిన తుంగా సురేష్తో 10ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కర్ణిక(9), కావ్య(7) కుమార్తెలు. భార్యభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకు సురేష్ చనిపోయాడు. ఈ పరిస్థితుల్లో నాగలక్ష్మి నూజివీడు మున్సిపాలిటీలోని గొడుగువారిగూడెంలో అద్దెకుంటూ ఇళ్లల్లో పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏమైందో ఏమో గాని, శుక్రవారం ఉదయం 9గంటల సమయంలో టిఫిన్ చేసిన తర్వాత ఇరువురు పిల్లలతో గుళికలు తినిపించి, తానూ తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంటి చుట్టుపక్కల వారు గమనించి ముగ్గురిని 108 లో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్న కుమార్తె కావ్య మృతిచెందింది. తల్లి నాగలక్ష్మి, పెద్దకుమార్తె కర్ణికలకు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సీఐ ఎం. వెంకటనారాయణ ఏరియా ఆస్పత్రికి వచ్చి సంఘటనపై విచారించారు. ఎస్ఐ తలారి రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నూజివీడు వండర్ కిడ్ తోషిత్రామ్
నూజివీడు: రెండున్నరేళ్ల వయస్సులో తన జ్ఞాపకశక్తితో అబ్బురపరుస్తున్నాడు కృష్ణా జిల్లా నూజివీడు పట్టణానికి చెందిన కలపాల తోషిత్రామ్. రెండున్నరేళ్లు అంటే మాటలుకూడా రాని వయస్సు. కానీ తోషిత్రామ్ మాత్రం తన ఐక్యూతో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సాధించాడు. ఈ ఏడాది జూలైలో నిర్వహించిన పోటీల్లో తోషిత్ ఇంగ్లిష్ అక్షరాలను ఏ నుంచి జెడ్ వరకు, తిరిగి రివర్స్ ఆర్డర్లో జెడ్ నుంచి ఏ వరకు కేవలం 22 సెకన్లలోనే టకటకా చెప్పేశాడు. దీంతో యంగెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ కిడ్గా తోషిత్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సాధించాడు. గతంలో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించిన ఈ బాలుడి తండ్రి కలపాల శ్రీరామ్ప్రసాద్ టీటీడీలో ఉద్యోగి, తల్లి భవ్యశ్రీ స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. (చదవండి: పది కోళ్లను తిన్న కొండచిలువ ) -
AP: ‘విద్యావిధానంలో చేసిన మార్పులు, సంస్కరణలు దేశానికే తలమానికం’
సాక్షి, నూజివీడు: మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్యాలయాల్లో ఉన్న కోర్సులను మార్పులు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఆయన బుధవారం నూజివీడులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో డిగ్రీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు విద్యార్థులతో ‘ఇంటర్న్ షిప్’ని చేయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని తెలిపారు. గడిచిన రెండేళ్లలో విద్యావిధానంలో చేసిన మార్పులు, సంస్కరణలు దేశానికే తలమానికంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలోని జూనియర్ కాలేజీ వ్యవస్థను కార్పొరేట్ విద్యా సంస్థలు నిర్వీర్యం చేశాయని పేర్కొన్నారు. నూజివీడులో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయెట్ సెంటర్ను అటామనస్ ఇనిస్టిట్యూట్గా గుర్తించి యూనివర్సిటీతో సంబంధం లేకుండా స్వయం ప్రతిపత్తి హోదాతో అభివృద్ధి చేయాలని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. -
కృష్ణాజిల్లా: పబ్జీ ఆటలో చెలరేగిన వివాదం
-
పబ్జీ ఆట: రెండు గ్రామాల మధ్య చిచ్చు
సాక్షి, కృష్ణాజిల్లా: పబ్జీ ఆటలో చెలరేగిన వివాదం రెండు గ్రామాల మధ్య చిచ్చు పెట్టింది. పరస్పర దాడులకు దారి తీసింది. ఈ క్రమంలో ఇద్దరు గాయాలపాలయ్యారు. వివరాలు.. నూజివీడులో కళాశాల నుంచి బస్సులో వెళుతూ కొత్తూరు తండా, సిద్దార్ధనగర్ విద్యార్థులు పబ్జీ ఆడారు. ఈ క్రమంలో మాటా మాటా పెరిగి బాహాబాహాకి దిగారు. ఈ గొడవ కాస్తా ముదిరి రెండు గ్రామాల మధ్య చిచ్చు పెట్టింది. ఇందులో పెద్దలు జోక్యం చేసుకోవడంతో వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ క్రమంలో గ్రామస్తులు కర్రలు ,రాళ్లతో పరస్పర దాడులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ప్రస్తుతం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా చైనీస్ పబ్జీ గేమ్పై భారత ప్రభుత్వం నిషేధం విధించిన విషయం విదితమే. చదవండి: ‘డబ్బు ఇవ్వకుంటే పురుగుల మందు తాగుతాం’ -
కూతుర్ని అమ్మేసి, తల్లిపై హత్యాయత్నం
సాక్షి, కృష్ణా: జిల్లాలోని ముసునూరు మండలం వలసపల్లిలో అమానవీయ ఘటన చోటుచేసుకొంది. భార్య కళ్లుగప్పి ఓ భర్త కన్న కూతురిని అమ్మేశాడు. వివరాలు.. నవీన్బాబు అనే వ్యక్తి ఆడపిల్లలు పుడుతున్నారని తన తల్లిదండ్రులతో కలిసి భార్య రజనీని చిత్రహింసలకు గురిచేసేవాడు. ఈక్రమంలోనే మరోసారి తీవ్రంగా కొట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఇదే అదనుగా భావించిన నవీన్బాబు నాలుగో కూతురిని లక్షా 50 వేల రూపాయలకు అమ్మేశాడు. అయితే, డబ్బుల పంపిణీలో నవీన్బాబుకు అతని తల్లిదండ్రులకు మధ్య వాగ్వివాదం జరగటంతో విషయం బయటపడింది. గాయాల నుంచి కోలుకున్న రజనీ తన బిడ్డ ఎక్కడనీ భర్త, అత్తమామలను నిలదీసింది. దీంతో వారంతా కలిసి మరోసారి రజనీపై దాడి చేసి హత్యాయత్నం చేశారు. వారి బారి నుంచి తప్పించుకున్న రజనీ తన తల్లి దండ్రులతో కలిసి బిడ్డ అమ్మకంపై ముసునూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, న్యాయం చేస్తాడనుకున్న ముసునూరు ఎస్ఐ మరోలా చేశాడు. బిడ్డను కొన్న దంపతులను స్టేషన్కి పిలిపించి తల్లి రజనీతో ఫొటోలు తీయించి తిరిగి వారికే అప్పగించాడు. ఎస్ఐ తీరుపై రజనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తన బిడ్డను ఇప్పించాలని బాధితురాలు నూజివీడు ఎమ్మెల్యేని ఆశ్రయించింది. (చదవండి: నకిలీ పోలీసుల గుట్టురట్టు) -
సొంత బ్యాంకుకే కన్నం వేసిన క్యాషియర్
-
సొంత బ్యాంకుకే కన్నం వేసిన క్యాషియర్
సాక్షి, కృష్ణా: నూజివీడు పంజాబ్ నేషనల్ బ్యాంక్లో బుధవారం ఘరానా మోసం బట్టబయలైంది. హెడ్ క్యాషియర్గా పనిచేస్తున్న గుండ్ర రవితేజ కోట్ల రూపాయలను ఖాచేసి సొంత బ్యాంకుకే కన్నం వేశాడు. రూ. 1,56,56,897 కోట్ల ఖాతాదారుల నగదును బ్యాంక్ నుంచి కాచేసి చేతి వాటం చూపించాడు. దీనిపై బ్యాంక్ చీఫ్ మేనేజర్ మాట్లాడుతూ.. రవీతేజ 2017లో నుంచి బ్యాంక్లో పనిచేస్తున్నాడని చెప్పాడు. కాగా ఖాతాదారుల నగదును, ఫిక్సిడ్ డిపాజిట్లను తన అకౌంట్కు బదిలీ చేసుకున్నట్లు క్యాష్ తనిఖీలో వెల్లడైందని ఆయన తెలిపారు. వెంటనే నూజివీడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నాడు. కాగా రవీతేజకు ఆన్లైన్లో రమ్మీ, కాసినో ఆటలకు అలవాడు పడి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణతో తెలింది. బ్యాంక్ చీఫ్ మేనేజర్ ఫిర్యాదు మేరకు రవీతేజపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
నూజివీడు టు లండన్
సాక్షి, అమరావతి బ్యూరో: నూజివీడు మామిడి తొలిసారిగా లండన్ పయనమైంది. 16 టన్నుల నాణ్యమైన బంగినపల్లి మామిడి పండ్లను శనివారం వేకువజామున నూజివీడు నుంచి కంటైనర్లో విశాఖ పోర్టుకు చేర్చారు. అక్కడ నుంచి సముద్ర మార్గం ద్వారా నౌకలో లండన్ చేరుకుంటాయి. కృష్ణా జిల్లా నూజివీడుతో పాటు ప్రకాశం జిల్లా ఉలవపాడు ఏరియాలో పండిన బంగినపల్లి మామిడిని అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఎపెడా) ద్వారా విజయనగరానికి చెందిన ఓ ఎగుమతి దారు కొనుగోలు చేశారు. ఈ మామిడిని నూజివీడు లోని ఇంటిగ్రెటెడ్ ప్యాక్ హౌస్లో గ్రేడింగ్ చేశారు. నాణ్యతకు అవసరమైన ప్రక్రియను అక్కడ ఉన్న వేపర్ హీట్ ట్రీట్మెంట్ ప్లాంట్లో పూర్తయ్యాక 5 కిలోల చొప్పున అట్టపెట్టెల్లో వీటిని ప్యాక్ చేసి కంటైనర్లో పేర్చారు. ఏసీ కంటైనర్ ద్వారా.. మామిడి పండ్లను రైతులు, ఉద్యాన శాఖ అధికారుల సమక్షంలో శనివారం వేకువజామున కంటైనర్లో విశాఖపట్నం పోర్టుకు పంపారు. అక్కడ నుంచి నౌకలో 10 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ఎయిర్ కండిషన్డ్ కంటైనర్లో లండన్కు పంపుతారు. విశాఖపట్నం నుంచి లండన్కు నౌక చేరుకోవడానికి 28 రోజుల సమయం పడుతుంది. 10 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచడడం వల్ల మామిడి పాడవదు. ఇన్ని రోజులు సరకు పాడవకుండా ఉండేందుకు ప్యాక్ హౌస్లో ముందుగానే పెస్టిసైడ్ ట్రీట్మెంట్ కూడా చేశారు. 16 టన్నుల మామిడిని విశాఖ నుంచి లండన్ చేరవేసేందుకు నౌక యాజమాన్యం 2,500 డాలర్లు వసూలు చేస్తోంది. -
బాలికలతో బాడీ మాసాజ్.. టీవీ యాంకర్పై కేసు
సాక్షి, కృష్ణా : ఇద్దరు బాలికలతో వెట్టిచాకిరి చేయించుకుంటున్న ఓ టీవీ యాంకర్పై శిశు సంక్షేమ కమిటీ ఫిర్యాదు మేరకు పోలీసులకు కేసు నమోదు చేశారు. శిశు సంక్షేమ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం.. నూజివీడులోని చైల్డ్ కేర్లో చదువుకుంటున్న ఇద్దరు బాలికల్ని పండుగ సెలవుల పేరుతో తల్లి హైదరాబాద్ తీసుకెళ్లింది. దీనిలో భాగంగానే నగరంలోని ఓ టీవీ యాంకర్ ఇంట్లో బాలికల్ని పనికి కుదిర్చింది. అయితే సెలవులు ముగిసినప్పటికీ.. బాలికలు చైల్డ్ కేర్కి తిరిగిరాకపోవడంతో సీసీఐ అధికారులు మిస్సింగ్ కేసు పెట్టారు. అనంతరం బాలికల మిస్సింగ్పై దర్యాప్తు చేయగా.. హైదరాబాద్లో టీవీ యాంకర్ ఇంట్లో వెట్టిచాకరి చేస్తున్నట్టు శిశు సంక్షేమ కమిటీ గుర్తించింది. ఈ క్రమంలోనే ఇద్దరు బాలికల్ని కమిటీ సభ్యులు అదుపులోకి తీసుకుని విచారించగా పలు విషయాలు బయటపడ్డాయి. ఇంటి పనితో పాటు బాడీ మసాజ్ లాంటి పనులను సైతం వారితో చేయించుకుంటున్నట్లు బాలికలు తెలిపారు. దీంతో సీడబ్ల్యూసీ సభ్యుల ఫిర్యాదు మేరకు నూజివీడు పోలీసులు ఆ యాంకర్పై కేసు నమోదు చేశారు. మైనర్లని పనిలో పెట్టుకోవడం, వెట్టిచాకిరి చేయించుకోవడం చట్టరిత్యా నేరంమని వివిధ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు పిల్లల్ని తన ఇంట్లో పనికి పెట్టుకుని.. వివరాలు అడిగితే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని సీడబ్ల్యూసీ అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
మైనర్ బాలికపై లైంగికదాడి; 24 గంటల్లో నిందితుడు అరెస్టు
సాక్షి, కృష్ణా : నూజివీడు పట్టణంలో బుధవారం మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని 24 గంటల్లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న ఎస్పీ రవీంద్రబాబు నిందితుడిని పట్టుకునేందుకు ఓ ఐపీఎస్ అధికారితోపాటు నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో 8 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు. శుక్రవారం నిందితుడు వెంకటేశ్వర రావును అతని ఇంటి వద్దనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు పట్టణంలోని గాంధీనగర్ నివాసి అని, హోటల్లో సప్లైయర్గా పనిచేస్తునట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును చేధించిన రూరల్ ఎస్ఐ రంజిత్, ఇద్దరు కానిస్టేబుళ్లకు డీఎస్పీ శ్రీనివాసులు అవార్డులు అందజేశారు. (అర్థరాత్రి బాలికపై అత్యాచారం) మరోవైపు విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ దిశ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం నూజివీడులో అత్యాచారానికి గురైన మైనర్ బాలికను పరామర్శించారు. చిన్నారిపై అఘాయిత్యానికి ఒడికట్టిన వ్యక్తిని దిశ చట్టం కింద శిక్షిస్తామన్నారు. ఇలాంటి ఘటన జరగటం బాధాకరమని విచారణ వ్యక్తం చేశారు. ఈ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నేర నియంత్రణను ప్రతి ఒక్కరు తమ వంతు సామాజిక బాధ్యతగా తీసుకొని పోలీసులకు సహకరించాలని సూచించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. -
ఆమె పేరు చెబితే కార్యదర్శులకు హడల్
సాక్షి, నూజివీడు : అధికారులు అవినీతికి దూరంగా ఉండాలని ఒకవైపు ప్రభుత్వం పదేపదే చెప్తున్నా, అధికారులు మాత్రం తమ తీరును మార్చుకోవడం లేదు. నూజివీడు నియోజకవర్గంలోని ఓ మండలంలో అధికారి పేరు చెబితే పంచాయతీ కార్యదర్శులు హడలెత్తుతున్నారు. ప్రతి విషయంలోనూ డబ్బులు ఇవ్వాలంటూ వేధిస్తుండడంతో వారంతా సెలవుపై వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. తన ఇంట్లో పూజలు నుంచి మనవరాలి పుట్టినరోజు వరకు, వినాయక చవితి నుంచి దీపావళి వరకు ఏ పండుగ వచ్చినా ఒత్తిడి చేసీ మరీ సెక్రటరీల నుంచి వేలకువేలు గుంజుతున్నట్లు తెలిసింది. దసరా పర్వదినానికి చీర కొనిపెట్టమని కార్యదర్శులను ఒత్తిడి చేయడంతో రూ.5వేలు సమరి్పంచుకున్నట్లు సమాచారం. వినాయకచవితికి పూజా కార్యక్రమాలకు, దీపావళికి బాణసంచా కూడా కార్యదర్శులే కొని ఇచ్చినట్లు సమాచారం. ఆమె తనకు కావాల్సిన గృహోపకరణాలను సైతం కార్యదర్శులను పీడించి మరీ వారితో కొనుగోలు చేయిస్తున్నట్లు సమాచారం. రూ.30వేలతో వాషింగ్ మెషిన్ కొనుగోలు చేశారు. అందులో రూ.20వేలు ఆమె చెల్లించగా, మిగిలిన రూ.10వేలు ఓ కార్యదర్శి పేరుతో షోరూమ్లో అప్పురాయించారు. చేసేదేమీ లేక తప్పని పరిస్థితుల్లో ఆ కార్యదర్శి రూ.10వేలు షోరూమ్లో చెల్లించినట్లు సమాచారం. ఆ అధికారి మనమరాలి జన్మదిన వేడుకలకు కార్యదర్శుల జేబులు ఖాళీ అయ్యాయి. పంచాయతీలలో సొంత డబ్బులు పెట్టి పనులు చేయించి బిల్లులు పెడితే వాటిపై సంతకాలు చేయడానికి చేయి తడపాల్సిందే. వాళ్లూ, వీళ్లు అనే తేడా లేకుండా నిత్యం డబ్బులు గుంచే ఆలోచనలో ఉండడంతో కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే మండలంలోని మరో అధికారి కూడా పంచాయతీ కార్యదర్శుల వద్ద నుంచి వసూలు చేస్తున్నారు. కార్యాలయంలోని టేబుల్పైన ఒక పంచాయతీ కార్యదర్శి తన బ్యాగ్ను ఉంచి పక్కకు వెళ్తే ఆ బ్యాగులోని రూ.2వేలను ఆ అధికారి తీసుకోవడం చర్చనీయాంశమైంది. వీరిద్దరి తీరుపై ప్రజాప్రతినిధులలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. -
నకిలీ పోలీసులు అరెస్టు
సాక్షి, విజయవాడ(నూజివీడు) : పోలీసులమని చెప్పి డబ్బు వసూలు చేసిన నకిలీ పోలీసులను అరెస్టు చేసినట్లు హనుమాన్జంక్షన్ సీఐ డి.వి.రమణ తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జి.కొండూరు మండలం కందులపాడుకు చెందిన నాగారపు సురేష్బాబు, గణేష్ కలసి బత్తులవారిగూడెం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా సీతారామపురం గ్రామం చివర పోలీస్ స్టిక్కర్లతో ద్విచక్ర వాహనంపై ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు వెనుకగా వచ్చి ఆపారు. ‘మేము పోలీసులం బైక్ ఆపమంటే ఆపకుండా వస్తున్నావు అని బెదిరించి రూ.5,900 లాక్కోని నూజివీడు వైపు వెళ్లారు. దీనిపై నాగారపు సురేష్బాబు ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు, గ్రామస్తులకు తెలిపి శనివారం ఆగిరిపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన ఏఎస్ఐ శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి శోభనాపురం సమీపంలోని గణపవరం అడ్డరోడ్డు వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా నంబర్ లేని వాహనాన్ని నడుపుతూ అనుమానాస్పదంగా ఉన్న మైలవరం మండలం గణపవరానికి చెందిన బెల్లంకొండ నాగరాజు(33), బెల్లంకొండ వంశీ(19)లను అదుపులోకి తీసుకుని విచారించగా డబ్బులు వసూలు చేసినట్లు నేరం అంగీకరించినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్.ఐ పి.కిషోర్, ఏఎస్ఐ ఎం.శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
భరతమాతకు ట్రిపుల్ సెల్యూట్
ఈ ముగ్గురి నేపథ్యం.. అతి సాధారణం. కష్టాలకు ఎదురొడ్డుతూనే ‘పది’లో సత్తా చాటారు. నూజివీడు ట్రిపుల్ఐటీలో సీటు సాధించి తమ కలల సాకారం వైపు కదిలారు. ఇంజినీరింగ్ విద్యలో నైపుణ్యం చూపి కొలువులను తమ వద్దకు రప్పించారు. అయితే దేశ రక్షణ కంటే తమ కుటుంబం, ఉద్యోగం ఏవీ ఎక్కువ కాదని భావించి, నెలకు లక్షలు తెచ్చిపెట్టే కొలువులను తృణపాయంగా త్యజించి, భరతమాత సేవలో పునీతులవుతున్నారు.. సాక్షి, నూజివీడు : ముగ్గురూ అతి సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారే. చదువులో ప్రతిభ చాటి నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ పూర్తిచేశారు. భారీ వేతనాలతో కూడిన ఉన్నత ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చినా కాదనుకున్నారు. దేశ రక్షణలో తాము భాగస్వాములు కావాలనే లక్ష్యంతో సైన్యంలో చేరి కెప్టెన్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ ముగ్గురు వీరులు.. మహాధీరులై భరత మాత సేవలో పునీతులవుతున్నారు. ఆర్మీలో కెప్టెన్లుగా సేవలందిస్తున్న వారి నేపథ్యాన్ని ఓసారి పరికిస్తే.. కూలీ కొడుకు.. ఆర్మీ కెప్టెన్ బర్నాన యాదగిరి స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలంలోని శేఖరపురం. తండ్రి గురవయ్య హైదరాబాద్లోని సిమెంట్ ఫ్యాక్టరీలో దినసరి కూలీ కాగా, తల్లి తులసమ్మ పోలియో వల్ల ఇంటివద్దే ఉంటోంది. యాదగిరి పదో తరగతిలో 94.5 శాతం మార్కులతో ఉత్తీర్ణుడై, 2008 ఫస్ట్బ్యాచ్లో ట్రిపుల్ ఐటీలో చేరాడు. 83.4 శాతం మార్కులతో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. అనంతరం టెక్ మహేంద్ర సంస్థలో ఉద్యోగంలో చేరినా.. సంతృప్తి చెందక మాతృభూమికి సేవ చేయాలనే లక్ష్యంతో 2015లో యూపీఎస్సీ నిర్వహించిన సీడీఎస్, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ లను పూర్తిచేశాడు. మరోవైపు క్యాట్ పరీక్షలో 93.4 శాతంతో ప్రతిభను చాటి ఐఐఎం ఇండోర్లో ప్రవేశం పొంది, దేశ భద్రతా రంగం వైపు అడుగు వేశాడు. 2016 జూలై 8న ఇండియన్ మిలటరీ అకాడమీ శిక్షణలో రాణించి ‘టెక్నికల్ గ్రాడ్యుయేషన్’ కోర్సులో టాపర్గా నిలిచి కెప్టెన్గా సేవలందిస్తున్నాడు. శివారు ప్రాంతం నుంచి కెప్టెన్గా.. చిరుమామిళ్ల సీతారామకృష్ణతేజ స్వగ్రామం విజయనగరం జిల్లా శృంగవరపుకోట. తండ్రి వైన్షాపులో గుమస్తా కాగా.. తల్లి నాగమణి మృతి చెందారు. 2008 తొలి బ్యాచ్లో ట్రిపుల్ ఐటీలో చేరిన సీతారామకృష్ణతేజ మెకానికల్ ఇంజినీరింగ్లో 8.4 జీపీఏతో ఉత్తీర్ణత సాధించాడు. 17వ స్టాఫ్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బీ) నిర్వహించిన ఇంటర్వ్యూలో అర్హత సాధించి డెహ్రాడూన్లోని ఇండియన్ మిలటరీ అకాడమీలో 2015 జూన్ 23 నాటికి శిక్షణ పూర్తి చేసుకున్నాడు. ఆ తరువాత కమిషన్డ్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించి అసోం, అరుణాచల్ ప్రదేశ్లో బాధ్యతలు నిర్వర్తించాడు. ప్రస్తుతం రాజస్థాన్లోని మోడిఫైడ్ ఫీల్డ్లో కెప్టెన్ ర్యాంక్లో పర్మినెంట్ కమిషన్డ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పేద కుటుంబాల్లో నుంచి వచ్చి ట్రిపుల్ ఐటీలో ఉత్తమ ప్రతిభతో ఇంజినీరింగ్ విద్యను పూర్తిచేసి.. సైన్యంలో కెప్టెన్లుగా పనిచేస్తున్న యాదగిరి, సురేంద్రనాథ్, కృష్ణతేజలు నేటి విద్యార్థులకు స్ఫూర్తిప్రదాతలు.. ఉన్నతోద్యోగం వదిలి..దేశసేవకు నడుం బిగించి.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన నాదెళ్ల సురేంద్రనాథ్ ట్రిపుల్ ఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఇండియన్ ఆర్మీలో కెప్టెన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సురేంద్రనాథ్ తండ్రి వెంకట్రావు ప్రైవేట్ సంస్థలో పనిచేస్తుండగా.. తల్లి లక్ష్మి సాధారణ గృహిణి. 2009–15బ్యాచ్కు చెందిన సురేంద్రనాథ్ టీసీఎస్లో క్వాలిటీ అస్యూరెన్స్ కన్సల్టెంట్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్లో ఉద్యోగాలను వదిలేసి ఆర్మీవైపే అడుగులు వేశాడు. ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ పూర్తిచేసి శిక్షణ పొంది భారత సైన్యంలో కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించాడు. ప్రస్తుతం అసోంలో కౌంటర్ (తిరుగుబాటు) ఆపరేషన్స్లో విధులు నిర్వహిస్తున్నాడు. వ్యాయామ అధ్యాపకుడు నవీన్ అందించిన ప్రోత్సాహంతోనే తాను ఆర్మీలోకి అడుగుపెట్టానని పేర్కొంటున్నాడు. -
నూజివీడులో ఘోరం
నూజివీడు: కృష్ణా జిల్లా నూజివీడు మండలం వెంకటాయపాలెంలో ఘోరం చోటుచేసుకుంది. జీవితాంతం తోడుండాల్సిన భర్తే, భార్య పాలిట యముడయ్యాడు. స్థానికంగా నివాసం ఉంటున్న వీరయ్య, తన భార్య సత్యవాణీని హత్య చేశాడు. చున్నీతో ఊపిరాడకుండా చేసి చంపాడు. అనంతరం ఆ చున్నీని అత్తమామల ముఖం మీద కొట్టి మీ కూతురిని చంపేశానని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నట్లుగా తెలిసింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారైన వీరయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
కొడుకును రక్షించబోయి.. తండ్రి దుర్మరణం
సాక్షి, కృష్ణాజిల్లా : నూజివీడు: తండ్రికొడుకులు గొడవపడిన నేపథ్యంలో తాను చనిపోతానంటూ కొడుకు ట్రాన్స్ఫార్మర్ను పట్టుకొని విద్యుత్షాక్కు గురయ్యాడు. కొడుకును కాపాడేందుకు యత్నించిన తండ్రి కూడా విద్యుత్షాక్కు గురై మృతిచెందాడు. ఈ ఘటన నూజివీడు మండలం లీలానగర్ అడ్డరోడ్డులో గురువారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చాట్రాయి మండలం చిత్తపూర్కు చెందిన మంతెన ఇస్మాయిల్(48)కి ఇరువురు కుమారులు. వీరిలో చిన్న కుమారుడు మంతెన వెంకటేశ్వరరావు(25) మద్యానికి బానిసై జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తాగుడు మాన్పించాలనే లక్ష్యంతో ఇస్మాయిల్ కుటుంబం రెండు నెలల క్రితం నూజివీడు మండలం లీలానగర్ అడ్డరోడ్డు వద్ద ఉన్న చర్చి వద్దకు వచ్చి ఉంటూ అక్కడే పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం కుమారుడు వెంకటేశ్వరరావు మద్యం సేవించి గొడవ చేస్తుండటంతో తండ్రి వారించాడు. దీంతో తండ్రిపై చేయి చేసుకున్నాడు. తాగుడు మాన్పిద్దామని ఇక్కడకు వస్తే మార్పేమీ లేకుండా నిత్యం తాగుతూనే ఉంటే ఎలాగని తండ్రి నిలదీశాడు. ఈ నేపథ్యంలో రాత్రి 8.30 గంటల సమయంలో నేను చచ్చిపోతానంటూ మద్యం మత్తులో చర్చి ఎదురుగా రోడ్డు వెంబడి ఉన్న ట్రాన్స్ఫార్మర్ను వెంకటేశ్వరరావు పట్టుకున్నాడు. కొడుకు ట్రాన్స్ఫార్మర్ను పట్టుకోవడానికి వెళ్తుండటం చూసి తండ్రి ఇస్మాయిల్ కూడా వెళ్లి కొడుకు కాళ్లు పట్టుకుని లాగడానికి ప్రయత్నించాడు. అప్పటికే వెంకటేశ్వరరావు మరణించగా, ఇస్మాయిల్ పట్టుకోవడంతో అతనికి కూడా విద్యుత్షాక్ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కొన ఊపిరితో ఉన్న ఇస్మాయిల్ను పట్టణంలోని అమెరికన్ ఆసుపత్రికి తీసుకురాగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇరువురి మృతదేహాలను పోస్ట్మార్టమ్ నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు వెంకటేశ్వరరావుకు బార్య, కుమార్తె ఉన్నారు. రూరల్ ఎస్ఐ దుర్గాప్రసాదరావు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆత్మకూరు వీవీ ప్యాట్ స్లిప్లపై సీఈ ఆగ్రహం
-
ద్వివేది ఆగ్రహం
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీప్యాట్ స్లిప్పులు దొరికిన వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పందించారు. ఆ స్లిప్పులు పోలింగ్ నాటివి కాదని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా కృష్ణా జిల్లా నూజివీడులో వాడని ఈవీఎంల తరలించిన వ్యవహారంపై స్పందించిన ద్వివేది.. ఈ రెండు వ్యవహారాల్లోనూ అధికారులపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాలను ఈవీఎంల కమిషనింగ్ సెంటర్గా మాత్రమే వినియోగించామని, ఆత్మకూరు ఆర్డీవో ఆధీనంలో ఉన్న ఈ కమిషనింగ్ సెంటర్లో బ్యాలెట్ పత్రాలు పెట్టిన తర్వాత చెక్ చేశారని, పోలింగ్కు ముందే ఒక్కో నియోజకవర్గానికి కేటాయించిన ఈవీఎంలలో వెయ్యి ఓట్లను బెల్ ఇంజినీర్లు పోల్ చేశారని, ఈవీఎంలు సక్రమంగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకున్న తర్వాత వాటిని పోలింగ్ కేంద్రాలకు తరలించారని తెలిపారు. ఎవరో ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా ఈవీఎంలు కమిషనింగ్ చేసిన సమయంలో వచ్చిన వీవీప్యాట్ స్లిప్పులను బయట పారేశారని, వీవీ ప్యాట్ స్లిప్పుల విషయంలో ఆత్మకూరు ఎన్నికల ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన ఉద్యోగులపై క్రిమినల్ కేసు పెట్టి తక్షణం అరెస్ట్ చేయాలని జిల్లా కలెక్టర్ను సీఈఓ ద్వివేది ఆదేశించారు. ప్రతి నియోజకవర్గం పరిధిలో జరిగే తప్పులకు రిటర్నింగ్ అధికారులే బాధ్యులవుతారని హెచ్చరించారు. ఆ ఈవీఎంల తరలింపుపైనా ఆగ్రహం.. స్ట్రాంగ్ రూమ్ నుంచి వాడని ఈవీఎంలను తరలించడంపై సీఈఓ ద్వివేది ఆగ్రహం వ్యక్తం చేశారు. నూజివీడు సబ్ కలెక్టర్, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) వెంటనే ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కోరారు. దీంతో దాదాపు గంటన్నరపాటు ఈవీఎంల తరలింపుపై నుజువీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కృష్ణా జిల్లా జేసీ మిషా సింగ్ వివరణ ఇచ్చారు. వినియోగించని, రిజర్వ్ చేసిన ఈవీఎంలను మాత్రమే తరలించామని వారు తెలిపారు. పోలింగ్ కేంద్రాలనుంచి ఈవీఎంలు రాకముందే.. వినియోగించని ఈవీఎంలను ఎందుకు తరలించలేదని ద్వివేది నిలదీశారు. ఈ విషయంలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. పొరపాట్లు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
నూజీవీడులో అవినీతి ముద్దర
సాక్షి, కృష్ణా : అధికారంలో ఉన్నది తమ పార్టీయే కదా అనే ధీమాతో తన అనుచరులతో కలిసి అవినీతికి ఆకాశమే హద్దు అన్నట్లు చెలరేగిపోయాడు.. ‘నీరు–చెట్టు’లో మట్టి దోపిడీకి తెరతీశారు.. ఈ నాలుగున్నరేళ్లలో ఒక్క మట్టి అక్రమ తరలింపులోనే ఈయన, అనుచరులు రూ.100 కోట్లు వెనకేశారంటే ఈయన నడిపిన దందా ఏమిటో అర్థమవుతోంది.. ఈయన వెంట ఉన్న చోటామోటా నాయకులకు ఒకప్పుడు ఏమీ లేకపోగా నేడు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.. ఒక్క మట్టిదోపిడే కాకుండా ఇసుక అక్రమ రవాణా, రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణంలో కమీషన్లు, పేదలకు ఇచ్చే కార్పొరేషన్ రుణాల్లో వసూళ్ల దందా, చివరకు మరుగుదొడ్ల కేటాయింపు, నిర్మాణంలోనూ అవినీతి కంపు.. ఇలా కాదేదీ అవినీతికి అనర్హం అన్నట్లుగా అన్నిరంగాల్లో తన దందా కొనసాగించారు. ఆయనే నూజివీడు టీడీపీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావు.. అగ్నికి ఆజ్యం తోడైనట్లు పక్క జిల్లాకు చెందిన ఎమ్మెల్యే చింతమనేని ఇక్కడ తమ్మిలేరులోనూ తన హవా కొనసాగించడంతో ఇసుక దోపిడీ భారీ స్థాయిలో జరిగి ఏరులు, చెరువులు తమ రూపునే కోల్పోయిన దుస్థితి ఏర్పడింది. చింతమనేని హవా.. ముసునూరు మండలాన్ని ఆనుకొని ఉన్న తమ్మిలేరులో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇసుకదందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. రోజుకు 100 నుంచి 200 ట్రాక్టర్ల వరకు ఇసుకను అక్రమంగా తవ్వేస్తూ వందల కోట్లు ఆర్జిస్తున్నారు. ట్రక్కు ఇసుక రూ.3వేల నుంచి రూ.4వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సాధారణ ప్రజలు ఎవరైనా ఇంటివద్ద అవసరం కోసం ఒక ట్రక్కు ఇసుకను తెచ్చుకుంటుంటే ట్రాక్టర్లను సీజ్చేసి జరిమానాలు విధించే అధికారులు, ఎమ్మెల్యే ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నా అటువైపు కన్నెత్తి చూడరు. బలివే సమీపంలోని రంగంపేట వద్ద చింతమనేని ఇసుక దోపిడీని అడ్డుకోవడానికి ప్రయత్నించిన నేపధ్యంలోనే అప్పటి ముసునూరు తహసీల్దార్ దోనవల్లి వనజాక్షిపై తన అనుచరులతో దాడి చేయించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అలాగే లోపూడి, గుళ్లపూడి, వలసపల్లి, యల్లాపురం, రంగంపేట, బలివేల వద్ద నుంచి ముసునూరు మండలానికి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు చిలుకూరి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు కొల్లిగంగారామ్, చిల్లబోయినపల్లి బుజ్జి తదితరులు ట్రాక్టర్లలో ఇసుకను విక్రయిస్తూ రూ.లక్షలు ఆర్జించారు. ఈ అక్రమార్జనలోనూ ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు రూ. కోట్లు కప్పం కట్టినట్లు సమాచారం. నీరు– చెట్టు పనుల్లో రూ.100కోట్లు లూటీ నియోజకవర్గంలో నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాల్లో చేపట్టిన నీరు చెట్టు పనుల్లో మట్టిని విచ్చలవిడిగా విక్రయించి అధికారపార్టీ నాయకులు రూ.100 కోట్ల పైన లూఠీ చేశారు. నాలుగున్నరేళ్లలో నూజివీడు మండలంలో రూ.28 కోట్లు, ముసునూరు మండలంలో రూ.24 కోట్లు, చాట్రాయి మండలంలో రూ.6 కోట్లు, ఆగిరిపల్లి మండలంలో రూ.5 కోట్లు చొప్పున మొత్తం రూ.63కోట్లు విలువైన పనులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దీనిలో పొక్లెయిన్కు లోడింగ్ ఖర్చు కింద క్యూబిక్ మీటర్కు రూ.29 చొప్పున ప్రభుత్వం చెల్లించగా, టీడీపీ నాయకులు చెరువులలో మట్టిని ట్రక్కు రూ.500 నుంచి రూ.1,000 వరకు విక్రయించుకున్నారు. దాదాపు వేలాది ట్రిప్పుల మట్టిని విక్రయించి రూ.100కోట్ల పైనే దోచుకున్నారు. ప్రభుత్వమే నీరు–చెట్టు కింద లోడింగ్కు రూ.60కోట్ల వరకు చెల్లించిందంటే మట్టిని అమ్ముకోవడం ద్వారా ఎంత విక్రయించారో అర్ధమవుతోంది. నూజివీడు మండలంలోని చెరువుల్లోని మట్టి అంతా రహదారుల నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లకు వెంచర్ల నిర్వాహకులకు, పట్టణంలోని నివేశన స్థలాలకు తోలి విక్రయించుకున్నారు. అంతేగాకుండా ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన పనులను సైతం నీరు చెట్టు పనుల్లో చేపట్టినట్టుగా చూపించి దోచుకున్నారు. టీడీపీ నాయకులు చేసిన మట్టి దందాతో కొన్ని చెరువులు తమ రూపురేఖలనే కోల్పోవడం గమనార్హం. చాట్రాయి పెద్దచెరువు, దీప చెరువుల్లో రూ.30లక్షలతో చేసిన పనులను తూతూమంత్రంగా చేసి లక్షలు దోచుకున్నారు. పోలవరం మట్టి మాఫియా పోలవరం కుడికాలువపైన ఉన్న మట్టిని అధికార టీడీపీకి చెందిన మట్టిమాఫియా లక్షలాది క్యూబిక్ మీటర్లు అమ్ముకుని కోట్లాది రూపాయలు ఆర్జించారు. రాత్రి,పగలు అనే తేడా లేకుండా తరలించారు. తవ్విన మట్టిని తవ్వినట్టే విక్రయించేసి సొమ్ము చేసుకున్నారు. ఇక్కడి మట్టి పల్లెర్లమూడి పరిధిలో ఉన్న క్వారీ గోతులకు, పలువురు రైతుల తోటలకు,హనుమాన్జంక్షన్, గుడివాడ వంటి దూరప్రాంతాలకు తరలిపోయింది. ఈ గ్రామ పరిధిలో ఎర్రచెరువుకు ఎగువభాగాన ఉన్న దాదాపు 15 ఎకరాల క్వారీ గోతులను పూడ్చివేశారు. ఈ గోతులు 20 నుంచి 25 అడుగుల లోతులో 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. పల్లెర్లమూడి వద్ద నుంచి మర్రిబంధం వరకు పోలవరం కాలువను తవ్వతే 8.30లక్షల క్యూబిక్మీటర్ల మట్టి రాగా అందులో దాదాపు 5 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని అమ్మేసుకున్నారు. క్యూబిక్మీటరు మట్టికి ప్రభుత్వం రూ.30 ఇస్తున్న నేపధ్యంలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే తరలిపోయిన మట్టి విలువ రూ.1.50కోట్లు ఉంది. కేవలం నెలరోజుల వ్యవధిలో ఇంత పెద్దమొత్తంలో మట్టిని అమ్ముకున్నారు. ఏలూరు ఎంపీకి అనుచరుడిగా చెప్పుకునే టీడీపీకి చెందిన పల్లెర్లమూడికి చెందిన గ్రామనాయకుడు మట్టిని అమ్ముకోవడంలో కీలకపాత్ర పోషించాడు. పనుల్లో వాటా ఇవ్వాల్సిందే.. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావు నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి పనుల్లో కమీషన్ల దందా సాగించి రూ. కోట్లు పోగేశారు. సర్పంచుల పదవీకాలం పూర్తయిన నాటి నుంచి ఈ దందా మరింత పెరిగి ప్రతి పనిలో 10శాతం వరకు కమీషన్ రూపంలో వసూలు చేస్తున్నట్లు సొంతపార్టీలోనే ప్రచారం జరిగింది. ఈ కమీషన్ల దందా కోసం కావాలనే వేరే డివిజన్లో పనిచేసే పంచాయతీరాజ్ డీఈని నూజివీడు డివిజన్కు ఇన్చార్జి ఈఈగా నియమించినట్లు సమాచారం. ఉపాధిహామీ, జడ్పీ, ఎంపీ నిధులు, ఇతర గ్రాంట్లు ద్వారా వచ్చే నిధులు కలిపి నియోజకవర్గంలో గత నాలుగున్నరేళ్ల కాలంలో రూ.42కోట్లు పనులు జరగగా, ఈ ఏడాదికి రూ.33కోట్లు మంజూరయ్యాయి. ఈ పనుల్లో 10 శాతం కమీషన్ రూపంలో ముద్దరబోయినకు దక్కినట్లు సమాచారం. ఇదే కాకుండా తన బినామీలతో నీరు–చెట్టు పనుల్లో భాగంగా చెరువుల్లో తవ్విన మట్టిని విక్రయించి పోగేసిన సొమ్ములోనూ ఆయనకు పెద్ద ఎత్తున వాటా ఉన్నట్లు తెలుస్తోంది. -
డబ్బుల మూటలతో వస్తారు.. జాగ్రత్త: షర్మిల
సాక్షి, నూజివీడు: ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చూపించారు.. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండకూడదో నారా చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకోవాలని వైఎస్సార్సీసీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నూజివీడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ షర్మిల ప్రసగించారు. వైఎస్ఆర్ హయాంలో ఒక్క ఛార్జీ, పన్ను పెంచకుండా సంక్షేమ పథకాలు అమలుపరిచారని, కుల, మత, పార్టీలకతీతంగా పేదవారికి మేలు చేసిన ఘనత వైఎస్సార్కే దక్కిందన్నారు. ముఖ్యమంత్రి పదవికి అవమానం తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. అధికారం పోతున్న సమయంలో పసుపు-కుంకుమ పేరుతో మహిళలకు చంద్రబాబు ఎంగిలి చేయి విదిలిస్తున్నారని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెంచేశారని ఆరోపణలు గుప్పించారు. రాజధానిలో పర్మినెంట్ బిల్డింగ్లు లేవు ఐదేళ్లు రాజధానిలో ఉండి ఒక్క పర్మినెంటు బిల్డింగ్ కట్టలేకపోయారని, కనీసం ఐదేళ్లలో దుర్గగుడి ప్లైఓవర్ను కూడా పూర్తి చేయలేని చంద్రబాబు ఇంకో ఐదేళ్లు అధికారం ఇస్తే అమరావతిని అమెరికా చేస్తాడట..శ్రీకాకుళాన్ని హైదరాబాద్ చేస్తాడట.. నమ్ముతారా అని ప్రజలని ప్రశ్నించారు. బాబు వస్తే జాబు వస్తుందన్నారు..కానీ లోకేష్కు మాత్రమే జాబు వచ్చిందన్నారు. ఏం అర్హత ఉందని లోకేష్ 3 శాఖలు కేటాయించారు? ఇది పుత్రవాత్సల్యం కాదా అని సూటిగా అడిగారు. చంద్రబాబు రోజుకో మాట మాట్లాడతారు.. పూటకో వేషం వేస్తారు.. బాబును చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుతో పారిపోతుందని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్తోనే ప్రత్యేక హోదా సజీవం నారా చంద్రబాబు నాయుడు బీజేపీతో కుమ్మక్కై ప్రత్యేక హోదాను నీర్చుగార్చారని ఆరోపించారు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రత్యేక హోదా కావాలన్నారు.. తర్వాత ప్యాకేజీ అన్నారు.. ఇప్పుడు మళ్లీ హోదా అంటున్నారు..ఒకే విషయంపై పదేపదే మాట మారుస్తూ యూటర్న్లు తీసుకుంటున్న చంద్రబాబును నమ్మాలా వద్దా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ పోరాటాలతోనే ప్రత్యేక హోదా సజీవంగా ఉందని వ్యాఖ్యానించారు. సింహం సింగిల్గానే వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొత్తులు అవసరం లేదని, సింహం సింగిల్గానే వస్తుందని షర్మిల అన్నారు. చంద్రబాబు మాత్రం 2014లో బీజేపీతో, 2019లో కాంగ్రెస్తో, పరోక్షంగా జనసేనతో పొత్తు పెట్టుకున్నారని చెప్పారు. ఎన్నికల కోసమే చంద్రబాబు, మీ(ప్రజల) భవిష్యత్ నా బాధ్యత అంటున్నారు.. ఈ ఐదేళ్లు మీ బాధ్యత కనిపించలేదా? లోకేష్ బాధ్యతే కనిపించిందా అని ప్రశ్నించారు. ఐదేళ్లలో లోకేష్, హెరిటేజ్ కోసమే చంద్రబాబు పనిచేశారని విమర్శించారు. డబ్బుల మూటలతో వస్తారు..జాగ్రత్త ఎన్నికలకు ఒక రోజు ముందు గ్రామాల్లో టీడీపీ నాయకులు డబ్బుల కట్టలతో వస్తారు.. చేతిలో రూ.3 వేలు పెడతారు.. డబ్బులు తీసుకుని ఫ్యాన్ గుర్తుకే ఓటేయండని ప్రజలకు సూచించారు. చంద్రబాబు ఆడపిల్ల పుడితే రూ.25 వేలు, విద్యార్థులకు ఐప్యాడ్లు, మహిళలకు స్మార్ట్ఫోన్లు ఇస్తానన్నాడు.. ప్రతి నిరుద్యోగి కుటుంబానికి రూ.లక్షా ఇరవై వేలు బాకీ ఉన్నారు.. టీడీపీ నాయకులు ఓటేయాలని అడిగితే ఈ బాకీలన్నీ ఎన్నికల ముందే తీర్చాలని అడగండని సూచించారు. ప్రతి రైతుకు రూ.12,500 ల పెట్టుబడి సాయం ప్రతి రైతు కుటుంబానికి మే నెలలోనే రూ.12,500 పెట్టుబడి సాయం అందిస్తామని, అలాగే పిల్లలను బడులకు పంపిన తల్లులకు ప్రతి సంవత్సరం రూ.15 వేలు అందిస్తామని తెలిపారు. 45 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు పింఛన్ అందిస్తామన్నారు. డ్వాక్రా మహిళల రుణాలు నాలుగు దఫాల్లో పూర్తిగా చెల్లిస్తామని, అలాగే సున్నా వడ్డీకే మళ్లీ రుణాలు ఇప్పిస్తామని చెప్పారు. ప్రజలకు మేలు చేసేవాడు కావాలంటే జగనన్న రావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ఎప్పుడు వస్తే అప్పుడు రాష్ట్రంలో కరవు వస్తుందని అన్నారు. బైబై చంద్రబాబు..ఇదే ప్రజాతీర్పు కావాలన్నారు. ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి వైఎస్సార్సీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్ను, నూజివీడు ఎమ్మెల్యే అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్ అప్పారావుని గెలిపించాలని కోరారు. -
డబ్బుల మూటలతో వస్తారు.. జాగ్రత్త: షర్మిల
-
ఇక్కడ అన్నం తింటే ఆస్పత్రి పాలే!
సాక్షి, నూజివీడు : శ్రీకాకుళం ట్రిపుల్ఐటీ విద్యార్థులకు అందించే భోజనం నాసిరకంగా ఉండటం, పలువురు విద్యార్థులు అనారోగ్యానికి గురికావడంతో వారిలో ఒక్కసారిగా ఆగ్రహం పెల్లుబికింది. నాసిరకం భోజనం పెడుతుండటంతో విద్యార్థులందరం అనారోగ్యానికి గురవుతున్నామని, భోజనంలో పురుగులు, ఈగలు వస్తున్నా పట్టించుకోవడం లేదంటూ శ్రీకాకుళం ట్రిపుల్ఐటీ విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. ఉదయం అల్పాహారం కూడా తినకుండా మెస్ వద్దనే 8 గంటల నుంచి ఆందోళన చేశారు. నూజివీడు ట్రిపుల్ఐటీ క్యాంపస్లోనే శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీని నిర్వహిస్తున్నారు. ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అనూష కేటరర్స్ నిర్వహించే డైనింగ్హాల్–7లో భోజనం చేస్తున్నారు. అయితే వారం రోజులుగా భోజనంతో పాటు, ఉదయం పూట అల్పాహారం కూడా అధ్వానంగా ఉండటమే కాకుండా ఈగలు, పురుగులు ఉంటున్నాయి. దీనిపై విద్యార్థులు ఆఫీస్ సిబ్బందికి పలుమార్లు తెలిపినప్పటికీ ఎవరి నుంచి స్పందన లేకపోవడమే కాకుండా భోజనం విషయంలో ఎలాంటి మార్పు లేదు. దీంతో చివరకు చేసేదేమీ లేక విద్యార్థులందరూ కలిసి అల్పాహారం కూడా చేయకుండా ధర్నాకు దిగారు. వందల మంది బాధితులు.. కడుపులో నొప్పి, వాంతులు, గ్యాస్ట్రబుల్లో సమస్యలతో ఈనెల 25న 120మంది విద్యార్థులు క్యాంపస్లోనే ఉన్న ఆస్పత్రిలో వైద్యచికిత్స చేయించుకున్నారు. వీరిలో 21 మందికి సెలైన్లను కూడా పెట్టారు. అలాగే 26న మరో 108 మందికి వైద్యచికిత్స చేసి 22 మందికి సెలైన్లను పెట్టారు. ఇంత జరుగుతున్నా డైరెక్టర్గాని, వైస్చాన్సలర్ గాని పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈనెల 18వ నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి రోజుకు 60 నుంచి 90 మంది వరకు ఆస్పత్రికి వెళ్లి వైద్యచికిత్స పొందుతున్నారు. ఆ సంఖ్య 25, 26 తేదీలలో పెరిగింది. నాసిరకంగా అల్పాహారం.. అల్పాహారంలో భాగంగా ఇడ్లీ, చపాతి, పులిహోర పెడతారని, ఇడ్లీ ఏమీ బాగోదని, చపాతి పిండి పిండిగా ఉంటుందని, రాత్రిపూట అన్నం మిగిలిపోతే దానిని తరువాత రోజు ఉదయం పులిహోరగా చేసి పెడుతున్నారని ఆరోపించారు. అపరిశుభ్రంగా ఉండడంతో పురుగులు, ఈగలు ఉంటున్నాయని విద్యార్థులు వాపోయారు. మెస్లపై ఏమాత్రం పర్యవేక్షణ లేని, మెస్ కమిటీలను నియమించినా కమిటీ సభ్యులు పరిశీలించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందిస్తున్న మంచినీరు కూడా సరిగా లేకపోవడంతో పాటు మంచినీటి ట్యాంకులను శుభ్రం చేస్తున్న దాఖలాలు లేవని చెబుతున్నారు. ఆహారాన్ని పరిశీలించిన వీసీ విద్యార్థుల ఆందోళనతో ఆర్జీయూకేటీ వైస్ఛాన్సలర్ వేగేశ్న రామచంద్రరాజు మధ్యాహ్నం 12గంటలకు శ్రీకాకుళం ట్రిపుల్ఐటీకి చేరుకున్నారు. సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెస్లను, పరిసరాలను, తయారు చేస్తున్న ఆహార పదార్థాలను, భోజనాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెస్ల నిర్వహణను మెరుగుపరుస్తామని, వీటిని పర్యవేక్షించడానికి కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులను కూడా భాగస్వాములం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. -
ఫలించిన మొక్కజొన్న రైతుల పోరాటం
మీర్జాపురం(నూజివీడు): మొక్కజొన్న రైతులు మంగళవారం నాటి నుంచి చేపట్టిన ఆందోళనతో కంపెనీ దిగొచ్చి నష్టపరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. దీంతో రైతులు గురువారం ఆందోళన విరమించారు. రైతుసంఘం ఆధ్వర్యంలో 30 గంటల పాటు జరిగిన ఆందోళనతో ఎకరాకు రూ.62,500 చొప్పున నష్టపరిహారం చెల్లించేందుకు సీపీ కంపెనీ అంగీకరించింది. దాదాపు 5వేల ఎకరాలలో మొక్కజొన్న సాగుచేయగా, కంపెనీ చెప్పిన విధంగా దిగుబడులు రాకపోగా, పూర్తిగా నష్టపోయారు. మద్దతుగా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు.. నష్టపరిహారం చెల్లించాలని ఆందోళన చేస్తున్న రైతులకు నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్అప్పారావు మద్దతుగా నిలిచారు. మీర్జాపురంలోని సీపీ సీడ్ కంపెనీ వద్ద ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు వెళ్లి చర్చించారు. ఆ తరువాత కంపెనీ ఆర్గనైజర్లతోను, ప్రతినిధితోను మాట్లాడారు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో నష్టపరిహారం ఎంతిస్తారో తేల్చాలని, లేనిపక్షంలో నూజివీడు– హనుమాన్జంక్షన్ రోడ్డుపై రైతులతో కలసి ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే ప్రతాప్, పోలీసు అధికారులతోను, తహసీల్దార్కు సమాచారం ఇచ్చారు. ఆందోళన జరుగుతున్న ప్రాంతానికి డీఎస్పీ బమ్మిడి శ్రీనివాసరావు రావడంతో ఎమ్మెల్యే ప్రతాప్ మాట్లాడుతూ రైతులు ఎకరాకు రూ.90వేలు నష్టం పరిహారం అడుగుతున్నారని, అసలు ఎంతిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఆర్గనైజర్లు, కంపెనీ ప్రతినిధులతో తహసీల్దార్ తేజేశ్వరరావు, డీఎస్పీ, సీఐలు పలుమార్లు చర్చించి, నష్టపరిహారాన్ని ప్రకటించాలని సూచించారు. చివరకు ఎకరాకు రూ.62,500 నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో రైతుసంఘం నాయకులు పగడాల వెంకట ఆంజనేయులు, నిమ్మగడ్డ నరసింహా, గరిశేపల్లి రాజు, చిటికెల రామారావు పాల్గొన్నారు. -
అవినీతి ‘ముద్దర’
సాక్షి టాస్క్ఫోర్స్: ఆయన అధికారపార్టీకి చెందిన నియోజకవర్గ సమన్వయకర్త. అధికారంలో ఉన్నది తమ పార్టీయే కదా అనే ధీమాతో తన అనుచరులతో కలిసి అవినీతికి ఆకాశమే హద్దు అన్నట్లు చెలరేగిపోయాడు.. ‘నీరు–చెట్టు’లో మట్టి దోపిడీకి తెరతీశారు.. ఈ నాలుగున్నరేళ్లలో ఒక్క మట్టి అక్రమ తరలింపులోనే ఈయన, అనుచరులు రూ.100 కోట్లు వెనకేశారంటే ఈయన నడిపిన దందా అర్థమవుతోంది.. ఈయన వెంట ఉన్న చోటామోటా నాయకులకు ఒకప్పుడు ద్విచక్రవాహనాలకు కూడా దిక్కులేకపోగా నేడు ఖరీదైన కార్లలో దర్జాగా తిరుగుతున్నారు.. ఒక్క మట్టిదోపిడే కాకుండా ఇసుక అక్రమ రవాణా, రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణంలో కమీషన్లు, పేదలకు ఇచ్చే కార్పొరేషన్ రుణాల్లో వసూళ్ల దందా, చివరకు మరుగుదొడ్ల కేటాయింపు, నిర్మాణంలోనూ అవినీతి కంపు.. ఇలా కాదేదీ అవినీతికి అనర్హం అన్నట్లుగా అన్నిరంగాల్లో తన దందా కొనసాగించారు. ఆయనే నూజివీడు టీడీపీ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు.. అగ్నికి ఆజ్యం తోడైనట్లు పక్క జిల్లాకు చెందిన ఎమ్మెల్యే చింతమనేని ఇక్కడ తమ్మిలేరులోనూ తన హవా కొనసాగించడంతో ఇసుక దోపిడీ భారీ స్థాయిలో జరిగి ఏరులు, చెరువులు తమ రూపునే కోల్పోయిన దుస్థితి ఏర్పడింది. పోలవరం మట్టి మాఫియా పోలవరం కుడికాలువపైన ఉన్న మట్టిని అధికార టీడీపీకి చెందిన మట్టిమాఫియా లక్షలాది క్యూబిక్ మీటర్లు అమ్ముకుని కోట్లాది రూపాయలు ఆర్జించారు. రాత్రి,పగలు అనే తేడా లేకుండా తరలించారు. తవ్విన మట్టిని తవ్వినట్టే విక్రయించేసి సొమ్ము చేసుకున్నారు. ఇక్కడి మట్టి పల్లెర్లమూడి పరిధిలో ఉన్న క్వారీ గోతులకు, పలువురు రైతుల తోటలకు, హనుమాన్జంక్షన్, గుడివాడ వంటి దూరప్రాంతాలకు తరలిపోయింది. ఈ గ్రామ పరిధిలో ఎర్రచెరువుకు ఎగువభాగాన ఉన్న దాదాపు 15 ఎకరాల క్వారీ గోతులను పూడ్చివేశారు. ఈ గోతులు 20 నుంచి 25 అడుగుల లోతులో 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. పల్లెర్లమూడి వద్ద నుంచి మర్రిబంధం వరకు పోలవరం కాలువను తవ్వతే 8.30లక్షల క్యూబిక్మీటర్ల మట్టి రాగా అందులో దాదాపు 5 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని అమ్మేసుకున్నారు. క్యూబిక్మీటరు మట్టికి ప్రభుత్వం రూ.30 ఇస్తున్న నేపధ్యంలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే తరలిపోయిన మట్టి విలువ రూ.1.50కోట్లు ఉంది. కేవలం నెలరోజుల వ్యవధిలో ఇంత పెద్దమొత్తంలో మట్టిని అమ్ముకున్నారు. ఏలూరు ఎంపీకి అనుచరుడిగా చెప్పుకునే టీడీపీకి చెందిన పల్లెర్లమూడికి చెందిన గ్రామనాయకుడు మట్టిని అమ్ముకోవడంలో కీలకపాత్ర పోషించాడు. కార్పొరేషన్ రుణాల్లోనూ కమీషన్లు నియోజకవర్గ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా మంజూరైన రుణాలకు ఇచ్చే రాయితీని కూడా టీడీపీ నాయకులు వదిలిపెట్టలేదు. రుణాలు మంజూరు చేయాలంటే లబ్ధిదారులు టీడీపీ నాయకులకు కమిషన్ ముట్ట జెప్పాల్సిందే.. ముద్దరబోయిన అనుచరులు ఈదందా నడిపించారు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలో 50శాతం వరకు కమీషన్ వసూలు చేశారు. నూజివీడు పట్టణానికి చెందిన నాయకుడు ఒకరు పెద్ద ఎత్తున కమీషన్లు వసూలు చేయడం జరిగింది. అలాగే నూజివీడు మండలలోని ఒక ప్రజాప్రతినిధి సైతం కమీషన్లు బొక్కడం జరిగింది. కార్పొరేషన్ రుణాల మంజూరుకు ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీలు సైతం యూనిట్లు ఏర్పాటు చేయకుండానే లబ్ధిదారులకు బ్యాంకు రుణం ఇప్పించి సబ్సిడీలో సగం వసూలు చేస్తున్నారు. ముసునూరు మండలంలో రమణక్కపేటలో టీడీపీ నాయకుడు రంగు వెంకటేశ్వరరావు కొందరి పేర్లతో వారికి తెలియకుండానే బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించి ఎస్సీ కార్పొరేషన్ నుంచి వచ్చిన కమీషన్ దాదాపు రూ.20లక్షల వరకు స్వాహా చేశాడు. రోడ్ల నిర్మాణంలో వాటా ఇవ్వాల్సిందే.. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావు నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి పనుల్లో కమీషన్ల దందా సాగించి రూ. కోట్లు పోగేశారు. సర్పంచుల పదవీకాలం పూర్తయిన నాటి నుంచి ఈ దందా మరింత పెరిగి ప్రతి పనిలో 10శాతం వరకు కమీషన్ రూపంలో వసూలు చేస్తున్నట్లు సొంతపార్టీలోనే ప్రచారం జరిగింది. ఈ కమీషన్ల దందా కోసం కావాలనే వేరే డివిజన్లో పనిచేసే పంచాయతీరాజ్ డీఈని నూజివీడు డివిజన్కు ఇన్చార్జి ఈఈగా నియమించినట్లు సమాచారం. ఉపాధిహామీ, జడ్పీ, ఎంపీ నిధులు, ఇతర గ్రాంట్లు ద్వారా వచ్చే నిధులు కలిపి నియోజకవర్గంలో గత నాలుగున్నరేళ్ల కాలంలో రూ.42కోట్లు పనులు జరగగా, ఈ ఏడాదికి రూ.33కోట్లు మంజూరయ్యాయి. ఈ పనుల్లో 10 శాతం కమీషన్ రూపంలో ముద్దరబోయినకు దక్కినట్లు సమాచారం. ఇదే కాకుండా తన బినామీలతో నీరు–చెట్టు పనుల్లో భాగంగా చెరువుల్లో తవ్విన మట్టిని విక్రయించి పోగేసిన సొమ్ములోనూ ఆయనకు పెద్ద ఎత్తున వాటా ఉన్నట్లు తెలుస్తోంది. చింతమనేని హవా.. ముసునూరు మండలాన్ని ఆనుకొని ఉన్న తమ్మిలేరులో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇసుకదందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. రోజుకు 100 నుంచి 200 ట్రాక్టర్ల వరకు ఇసుకను అక్రమంగా తవ్వేస్తూ వందల కోట్లు ఆర్జిస్తున్నారు. ట్రక్కు ఇసుక రూ.3వేల నుంచి రూ.4వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సాధారణ ప్రజలు ఎవరైనా ఇంటివద్ద అవసరం కోసం ఒక ట్రక్కు ఇసుకను తెచ్చుకుంటుంటే ట్రాక్టర్లను సీజ్చేసి జరిమానాలు విధించే అధికారులు, ఎమ్మెల్యే ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నా అటువైపు కన్నెత్తి చూడరు. బలివే సమీపంలోని రంగంపేట వద్ద చింతమనేని ఇసుక దోపిడీని అడ్డుకోవడానికి ప్రయత్నించిన నేపధ్యంలోనే అప్పటి ముసునూరు తహసీల్దార్ దోనవల్లి వనజాక్షిపై తన అనుచరులతో దాడి చేయించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అలాగే లోపూడి, గుళ్లపూడి, వలసపల్లి, యల్లాపురం, రంగంపేట, బలివేల వద్ద నుంచి ముసునూరు మండలానికి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు చిలుకూరి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు కొల్లిగంగారామ్, చిల్లబోయినపల్లి బుజ్జి తదితరులు ట్రాక్టర్లలో ఇసుకను విక్రయిస్తూ రూ.లక్షలు ఆర్జించారు. ఈ అక్రమార్జనలోనూ ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు రూ. కోట్లు కప్పం కట్టినట్లు సమాచారం. మరుగుదొడ్లలో అవినీతి కంపు.. నూజివీడు మండలంలోని మరుగుదొడ్ల నిర్మాణాల్లో సైతం అవినీతి తారాస్థాయికి చేరింది. ముక్కొల్లుపాడు, సిద్ధార్థనగర్లలో నిర్మించిన మరుగుదొడ్లు అసంపూర్తిగా ఉండటం, వాటికి సంబంధించిన నిధులను మాత్రం అధికార టీడీపీ నాయకులు పూర్తిగా డ్రాచేసుకుని జేబులో వేసుకోవడం జరిగిపోయింది. ముక్కొల్లుపాడును ఇంటిలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు దత్తత తీసుకోగా, గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు తన అనుచరుడితో 350 మరుగుదొడ్లు నిర్మించగా అందులో ఇంకా 150 మరుగుదొడ్లు వరకు అసంపూర్తిగానే ఉన్నాయి. కాని వాటికి సంబంధించిన నిధులను కూడా పూర్తిచేయకుండా బొక్కేశారు. అలాగే సిద్ధార్థనగర్లో కూడా 200వరకు మరుగుదొడ్లు మంజూరు కాగా గ్రామస్థాయి టీడీపీ నాయకుడు అందులో సగం మాత్రమే నిర్మించి, మిగిలిన వాటిని అసంపూర్తిగా నిర్మించేసి నిధులను మాత్రం తన జేబులో వేసేసుకున్నాడు. ఇలా అవకాశం లేని చోట కూడా అవకాశం కల్పించుకుని ప్రజాధనాన్ని స్వాహా చేశారు. నీరు– చెట్టు పనుల్లో రూ.100కోట్లు లూటీ నియోజకవర్గంలో నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాల్లో చేపట్టిన నీరు చెట్టు పనుల్లో మట్టిని విచ్చలవిడిగా విక్రయించి అధికారపార్టీ నాయకులు రూ.100 కోట్ల పైన లూఠీ చేశారు. నాలుగున్నరేళ్లలో నూజివీడు మండలంలో రూ.28 కోట్లు, ముసునూరు మండలంలో రూ.24 కోట్లు, చాట్రాయి మండలంలో రూ.6 కోట్లు, ఆగిరిపల్లి మండలంలో రూ.5 కోట్లు చొప్పున మొత్తం రూ.63కోట్లు విలువైన పనులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దీనిలో పొక్లెయిన్కు లోడింగ్ ఖర్చు కింద క్యూబిక్ మీటర్కు రూ.29 చొప్పున ప్రభుత్వం చెల్లించగా, టీడీపీ నాయకులు చెరువులలో మట్టిని ట్రక్కు రూ.500 నుంచి రూ.1,000 వరకు విక్రయించుకున్నారు. దాదాపు వేలాది ట్రిప్పుల మట్టిని విక్రయించి రూ.100కోట్ల పైనే దోచుకున్నారు. ప్రభుత్వమే నీరు–చెట్టు కింద లోడింగ్కు రూ.60కోట్ల వరకు చెల్లించిందంటే మట్టిని అమ్ముకోవడం ద్వారా ఎంత విక్రయించారో అర్ధమవుతోంది. నూజివీడు మండలంలోని చెరువుల్లోని మట్టి అంతా రహదారుల నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లకు వెంచర్ల నిర్వాహకులకు, పట్టణంలోని నివేశన స్థలాలకు తోలి విక్రయించుకున్నారు. అంతేగాకుండా ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన పనులను సైతం నీరు చెట్టు పనుల్లో చేపట్టినట్టుగా చూపించి దోచుకున్నారు. టీడీపీ నాయకులు చేసిన మట్టి దందాతో కొన్ని చెరువులు తమ రూపురేఖలనే కోల్పోవడం గమనార్హం. చాట్రాయి పెద్దచెరువు, దీప చెరువుల్లో రూ.30లక్షలతో చేసిన పనులను తూతూమంత్రంగా చేసి లక్షలు దోచుకున్నారు. నూజివీడు మండలం సుంకొల్లు, కొన్నంగుంట తదితర గ్రామాల్లోని చెరువుల్లోని మట్టిని, గ్రావెల్ను టీడీపీ ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు బాణావతు బద్రు, తలపంటి రాజశేఖర్ తదితరులు ట్రక్టు రూ.500 నుంచి రూ.1,000 వరకు రోడ్లనిర్మాణానికి, వెంచర్ల అభివృద్ధికి అమ్ముకున్నారు. నూజివీడు పట్టణంలోని టీడీపీ మున్సిపల్ ఫ్లోర్లీడర్ చెరుకూరి దుర్గాప్రసాద్ నూజివీడు పెద్ద చెరువు, పోతురెడ్డిపల్లిలోని చెరువులలోను, ముసునూరు మండలంలోని చెరువులలోని మట్టిని ఇటుకబట్టీల వారికి, నివేశనస్థలాల వారికి, కాంట్రాక్టర్లకు విక్రయించి కోట్లు ఆర్జించారు. ముసునూరు మండలం లోపూడిలో కోమటి చెరువు, పెద్దచెరువు, కొత్తచెరువులలో నీరు చెట్టు పనులు చేసిన టీడీపీ నాయకులు వేంపాటి రామచంద్రరావు, వేంపా టి.శ్రీనివాసరావులు రూ.లక్షలు కొల్లగొట్టారు. కొత్తూరు చెరువులో అనుమతిలేకుండా గ్రావెల్ తవ్వుతుండగా విజిలెన్స్ అధికారులు సైతం యంత్రాలను సీజ్ చేయడం జరిగింది. టీడీపీ జిల్లా కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు, చనుబండ పెద్ద చెరువులో నీరుచెట్టు పని నిర్వహించి, అందులో మట్టిని విక్రయించి రూ.30లక్షలు వరకు దోచుకున్నారు. ఇదే వ్యక్తి చేసిన సీసీ రోడ్లు సైతం నాసిరకంగా ఉండి అడ్డంగా బీటలు వారుతున్నాయి. కోటపాడు గ్రామంలో మంచిన పూర్ణచంద్రరావు అనే టీడీపీ నాయకుడు గ్రామంలోని నాలుగు చెరువుల్లో రూ.30లక్షలతో నీరుచెట్టు పనులు చేసి లక్షలు ఆర్జించాడు. ఉపాధిహామీ పథకంలో చేసిన పనులను సరిచేసి నీరు–చెట్టులో దోచుకున్నారు. పోలవరం గ్రామంలో టీడీపీ వ్యక్తులు శ్మశానం స్థలాన్ని ఆక్రమించుకుని లైవ్ఫిష్ వ్యాపారం చేస్తున్నారు. ఈ గ్రామంలో రూ.40లక్షలతో నిర్వహిం చిన పనుల్లో మంత్రి దేవినేని ఉమా అనుచరుడని చెప్పుకునే తెలుగు యువత జిల్లా కార్యదర్శి మరిడి వెంకటేశ్వరరావు ప్రధాన పాత్ర పోషించి మట్టిని కొల్లగొట్టారు. మండలంలోని పల్లెర్లమూడి వద్ద పోలవరం కాలువ తవ్వగా వచ్చిన మట్టిని సైతం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మింగేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని ట్రాక్టర్లలో, లారీలలో తరలించి విక్రయించడం ద్వారా లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకున్నారు. -
నూజీవీడులో వైఎస్ఆర్సీపీ అధ్వర్యంలో రైతుల ర్యాలీ
-
తప్పిన ప్రమాదం.. 21 మంది సురక్షితం
సాక్షి, కృష్ణా : అతివేగంతో వస్తున్న విజయవాడకు చెందిన ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను తప్పించబోయి ఇంట్లోకి దూసుకెళ్లెంది. ఈ ఘటన కృష్ణా జిల్లా నూజువీడు పట్టణం తిరువూరు రోడ్డులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు తీవ్రగాయాలయ్యాయి. కాగా బస్సులోని 21 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. డ్రైవర్ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అకస్మాత్తుగా ప్రమాదం జరుగడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. -
హోదా కోసం ఆత్మహత్యాయత్నం
ఆగిరిపల్లి (నూజివీడు): రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఎన్టీఆర్ వీరాభిమాని బెజవాడ శ్రీనివాసరావు బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బొద్దనపల్లి పంచాయతీ శివారు శోభనాపురం గ్రామానికి చెందిన బెజవాడ శ్రీనివాసరావు (55) ఆగిరిపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్దకు బుధవారం చేరుకుని ప్రత్యేకహోదా కోసం పురుగుల మందు సేవించాడు. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు ఆవేదన చెందుతూ తాను పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన వెంట తెచ్చుకున్న లేఖలో పేర్కొన్నాడు. గత ఎన్నికల్లో ప్రత్యేక హోదా ఇస్తామని వెంకన్నస్వామి సాక్షిగా మాట ఇచ్చి మోసం చేశారని లేఖలో పేర్కొన్నాడు. హోదా విషయంలో వైఎస్సార్ సీపీ, జనసేన పార్టీలు సహకరించాలని లేఖలో పేర్కొన్నారు. తహసీల్దార్ కార్యాలయం చెట్టు వద్ద అపస్మారక స్థితిలో పడిఉన్న శ్రీనివాసరావును తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, ఏఎస్ఐ ఎం.శ్రీనివాసరావులు ప్రైవేటు ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీనివాసరావు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. -
నూజివీడులో టీడీపీ వర్గ విభేదాలు
సాక్షి, నూజివీడు : కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గం పాత రావిచర్లలో బుధవారం ఉద్రిక్తత నెలకొంది. అధికార టీడీపీలోని ఎంపీ మాగంటి బాబు, నియోజకవర్గ ఇన్చార్జి ముద్రబోయిన వెంకటేశ్వరరావు వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. గ్రామకమిటీ అధ్యక్షుడిగా గతంలో ఎంపీ మాగంటి బాబు వర్గీయుడు మువ్వ శ్రీనివాస్ ఎన్నికయ్యాడు. అయితే దానిని వ్యతిరేకిస్తూ ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఇవాళ తన వర్గీయుడు దాసరి పంగిడేశ్వరరావును గ్రామకమిటీ అధ్యక్షుడిగా ప్రకటించారు. కాగా ఈరోజు సాయంత్రం ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం సందర్భంగా పాత రావిచర్లలో ముద్రబోయిన పర్యటన ఉంది. ఈ వివాదం తేల్చిన తరువాతే పర్యటనకు అంగీకరిస్తామంటూ ఎంపీ మాగంటి వర్గీయులు హెచ్చరికలు చేశారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తటంతో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. -
వివాహితకు లైంగిక వేధింపులు.. ఎస్సైకి ఎస్పీ షాక్!
సాక్షి, కృష్ణా: జిల్లాలో ఓ ఎస్ఐ నిర్వాకం కలకలం రేపుతోంది. ఈ మధ్యనే హనుమాన్ జంక్షన్ ఎస్ఐ విజయ్కుమార్.. నూజివీడుకు చెందిన ఓ బ్యూటీపార్లర్ నిర్వాహకురాలితో వివాహేతర సంబంధం కొనసాగించి సస్పెండైన ఘటన మరువకముందే.. తాజాగా మరో ఎస్ఐ దాష్టీకం వెలుగులోకి వచ్చింది. కృష్ణాజిల్లా నూజివీడు వెంకటకుమార్ అనే ఎస్ఐ ఓ వివాహితను ఫోన్లో లైంగిక వేధింపులకు గురిచేసిన వైనం.. సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై స్పందించిన జిల్లా ఎస్పీ త్రిపాఠి ఆ ఎస్ఐని పిలిచి చీవాట్లు పెట్టారు. తాజాగా అతనిపై వేటు వేశారు. మూడు నెలలపాటు అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ఎస్పీ త్రిపాఠీ ఆదేశాలు జారీ శారు. తెలుస్తోంది. ఓ కేసు విషయంలో సాయం కోసం పోలీసు స్టేషన్కు వచ్చిన వివాహితను న్యూజివీడు ఎస్సై వెంకటకుమార్ వేధించడం ప్రారంభించారు. ఆమె ఫోన్ నంబర్లు తీసుకొని.. ఫోన్లో తరచూ మాట్లాడుతూ ఆమెను లైంగికంగా వేధించారు. తన కోరిక తీర్చాలని, లేదంటే నీ భర్తను కేసులో ఇరికిస్తానని ఎస్సై నీచంగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. తనను వేధించవద్దని, ఏదైనా అల్లరి జరిగితే తనకు ఆత్మహత్యే శరణ్యమని ఆమె వేడుకుంటున్నా ఆ ఎస్ఐ తీరు మారలేదు. ఆమె చెప్పినా వినకుండా గత కొద్ది రోజులుగా అదే పనిగా ఫోన్ చేసి వేధిస్తుండటంతో ఆమె.. ఆ ఫోన్ కాల్స్ను రికార్డ్ చేసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఈ ఫోన్ కాల్స్ రికార్డింగ్స్ పై స్పందించిన జిల్లా ఎస్పీ.. ఎస్సై గత చరిత్రను ఆరా తీయగా.. వెంకటకుమార్ గురించి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎస్సైపై ఎస్పీ వేటు వేశారు. -
వివాహితను లైంగికంగా వేధించిన ఎస్ఐ
-
హాస్టల్లో ఉరేసుకుని విద్యార్ధి ఆత్మహత్య
-
ర్యాగింగ్పై మంత్రి గంటా ఆగ్రహం
నూజివీడు: కృష్ణా జిల్లా నూజివీడు ఐఐఐటిలో ర్యాగింగ్ ఘటన వార్తలపై మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జీయూకేటీ డైరెక్టర్తో ఆయన మాట్లాడి ర్యాగింగ్ నిరోధానికి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ర్యాగింగ్కు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ర్యాగింగ్ ఘటనలను ఏమాత్రం సహించవద్దని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. ర్యాగింగ్ ఘటనలు, తీసుకొన్న చర్యలపై నివేదిక పంపాలని ఆదేశించారు. పవిత్రమైన విద్యాలయాల్లో ర్యాగింగ్ను సహించేది లేదని మంత్రి గంటా స్పష్టం చేశారు. -
నూజివీడుకు పిడుగు హెచ్చరిక!
కృష్ణా : నూజివీడు మండలంలో సోమవారం రాత్రి పిడుగులు పడే అవకాశం ఉందని రెవెన్యూ శాఖ హెచ్చరించింది. నూజివీడు పరిసర గ్రామాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రెవెన్యూ శాఖ సూచించింది. -
నూజివీడులో దారుణం
నూజివీడు: కృష్ణాజిల్లా నూజివీడులో దారుణం చోటుచేసుకుంది. స్థానిక అజరయ్యపేటలో మైనర్ అయిన తన కుమార్తెపై కన్న తండ్రే ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. వివరాలు.. తొమ్మండ్రు వెంకటేశ్వరరావుకు ఇద్దరు కుమార్తెలు. పెయింటింగ్ పనులు చేసుకుంటున్నాడు. భార్య కూడా ఇళ్లల్లో పనులు చేస్తూ ఉంటుంది. పెద్ద కుమార్తె పదో తరగతి చదువుతుండగా రెండో కుమార్తెకు మతిస్థిమితం లేనందున ఇంట్లోనే ఉంటోంది. తాగుడుకు బానిస అయిన తండ్రి ఇంట్లోనే ఉంటున్న రెండో కుమార్తెపై ఏడాది కాలంగా అత్యాచారం చేస్తున్నాడు. ఈ విషయం పెద్ద కుమార్తె ద్వారా తెలుసుకున్న తల్లి తాను పనిచేస్తున్న ఓ న్యాయవాదికి చెప్పుకుంది. వెంటనే ఆయన శనివారం ఉదయం నూజివీడు పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి తల్లి, సోదరి నిందితుడిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధితురాలిని వైద్యపరీక్షలకు తరలించారు. నిందితుడిపై పోలీసులు ఫోక్సా చట్టం కింద కేసు నమోదు చేశారు. తండ్రి పరారయ్యాడు. -
నూజివీడులో విషాదం.. ముగ్గురి మృతి
నూజివీడు(కృష్ణాజిల్లా): కృష్ణాజిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మత పరమైన కార్యక్రమంలో భాగంగా.. జెండాలు కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ముగ్గురు యువకులు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కృష్ణాజిల్లా ఎం.ఆర్ అప్పారావు కాలనీలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. మహ్మద్ ప్రవక్త(సఅసం) పుట్టిన రోజు(మిలాదున్ నబి) సందర్భంగా ఎం. ఆర్ అప్పారావు కాలనీలో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కాలనీని విద్యుద్దీపాలు, జెండాలతో అలంకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కాలనీకి చెందిన షేక్ తన్వీర్, షేక్ ఇస్మాయిల్, షేక్ కాలేషాలు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులని నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
ఉపాధ్యాయులు పనితీరు మార్చుకోవాలి
నూజివీడు : డివిజ న్లోని హైస్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పనితీరు దారుణంగా ఉందని, మెరుగుపరచకుంటే ఉపాధ్యాయులు ఇబ్బంది పడాల్సి వస్తుందని జిల్లా విద్యాశాఖాధికారి ఏ సుబ్బారెడ్డి హెచ్చరించారు. పట్టణంలోని ఎస్ఆర్ఆర్ హైస్కూల్లో డివిజన్లోని హైస్కూల్ హెచ్ఎంలు, ఎంఈవోలు, సీఆర్పీల సమావేశం బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సమ్మెటివ్ అసెస్స్మెంట్ –1లో విద్యార్థులకు వచ్చిన మార్కులు చూస్తుంటే చాలా దారుణంగా పరిస్థితి ఉందన్నారు. పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన పిల్లల వివరాలు, ఆధార్ నంబర్లు త్వరితగతిన ఆ న్లై న్లో నమోదు చేసి, నామినల్ రోల్స్ను సరిచేసి సీఎస్ఈ వెబ్సైట్లో అప్డేట్ చేయాలన్నారు. చెప్పారు. డైస్ వివరాలను సీఎస్ఈ వెబ్సైట్ నుంచి డౌ న్లో న చేసుకుని ఏమైనా తేడాలంటే వాటిని సరిచేసి ఆ న్లై న్ చేయాలని సూచించారు. మధ్యాహ్న భోజనంలో వారానికి తప్పనిసరిగా మూడు కోడిగుడ్లు ఇవ్వాలని కోరారు. హాజరు వివరాలు, ఎంతమంది భోజనం చేశారనే వివరాలను యాప్ ద్వారా ప్రతిరోజు పంపాలన్నారు. బియ్యం ఇండెంట్లను ఈ పోస్ విధానం ద్వారా ఇవ్వాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులకు సంబంధించి యూనిట్ 1, 2, క్వార్టర్లీ పరీక్షలకు సంబంధించిన మార్కుల వివరాలను వెంటనే ఆ న్లై న్లో ఉంచాలని, వీటిని ఆధారంగానే ఇంటర్నల్ మార్కులు ఉంటాయని వివరించారు. ఈనెల 30, వచ్చేనెల 1వ తేదీ రెండురోజుల పాటు గుడివాడలో నిర్వహించనున్న జిల్లా స్థాయి సైన్స ఎగ్జిబిషన్లో ప్రతి పాఠశాల నుంచి పాల్గొనాలని పేర్కొన్నారు. అనంతరం డివిజన్లోని హైస్కూల్ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో నూజివీడు డీవైఈవో ఎన్వీ రవిసాగర్, అసిస్టెంట్ కమిషనర్ ఎగ్జామ్స్ లింగేశ్వరరావు, కామన్బోర్డు సెక్రటరి రామకృష్ణ, సర్వశిక్ష అభియాన్ ఎంఐఎస్ ఆర్.హైమేశ్వరరావు పాల్గొన్నారు. -
కృష్ణా వర్సిటీ బాస్కెట్బాల్ విజేత పీబీ సిద్ధార్థ
నూజివీడు: కృష్ణా విశ్వవిద్యాలయం పురుషుల బాస్కెట్బాల్ పోటీల విజేతగా విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాల జట్టు నిలిచింది. రెండురోజులుగా పట్టణంలోని విక్టోరియా టౌన్హాల్ బాస్కెట్బాల్ కోర్టులో ఫ్లడ్లైట్ల వెలుగులో నిర్వహించిన పోటీల్లో ఆరు జట్లు తలపడ్డాయి.ఫైనల్లో పీబీ సిద్ధార్థ జట్టు లయోలా జట్టుపై 58–38 తేడాతో విజయం సాధించింది. మూడు, నాలుగు స్థానాల్లో నూజివీడు ఎంవీఆర్,, విజయవాడ కేబీఎ¯ŒS కళాశాలల జట్లు నిలిచాయి.విజేతలకు మునిసిపల్ చైర్పర్సన్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యులు బసవా భాస్కరరావు, పీజీ కేంద్రం ప్రత్యేకాధికారి ఎంవీ బసవేశ్వరరావు, వర్సిటీ స్పోర్్ట్స బోర్డ్ కార్యదర్శి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ నాయకుడు కోటగిరి గోపాల్, బాస్కెట్బాల్ కోచ్ వాకా నాగరాజు, పీఈటీలు ఎస్.లక్షి్మ, ఆలీఖాన్, బలరామ్, డీఏఆర్ కళాశాల పీడీ అంజాద్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
జనాలపైకి దూసుకెళ్లిన లారీ
నూజివీడు(కృష్ణాజిల్లా): కృష్ణాజిల్లా నూజివీడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందగా.. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కృష్ణాజిల్లా నూజివీడు మండలం తుక్కులూరు వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. నూజివీడు పట్టణంలోని స్టేషన్తోటకు చెందిన 20 మంది కూలీలు గబ్బల మంగమ్మ తల్లి దేవస్థానంకు బయలు దేరారు. రెండు టాటా ఏస్లలో బయలుదేరిన వీరు తుక్కులూరు సమీపంలోకి చేరుకోగానే ఓ టాటాఏస్ వాహనం టైర్ బోల్టు విరిగి పోయింది. ఇది గుర్తించిన డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి టైర్ మార్చడానికి యత్నిస్తుండగా.. మరో వాహనం కూడా అక్కడికి చేరుకుంది. రెండు వాహనాల్లో ఉన్న సుమారు 20 మంది రోడ్డు పైన నిల్చొని ప్రత్యామ్నయ వాహనం కోసం ప్రయత్నిస్తుండగా.. నూజివీడు నుంచి హనుమాన్ జంక్షన్ వైపు వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. దీంతో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
నూజివీడులో కొండచిలువ కలకలం
నూజివీడు: కృష్ణాజిల్లా నూజివీడు పట్టణం పాతపేటలో భారీ కొండచిలువ కలకలం రేపింది. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లోకి బుధవారం తెల్లవారుజామున కొండచిలువ ప్రవేశించింది. 12 అడుగుల కొండచిలువను గుర్తించిన కుటుంబ సభ్యులు భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు అప్రమత్తమై కొండచిలువను చంపేశారు. -
బాస్కెట్ బాల్ జిల్లా యూత్ జట్లు ఇవే
నూజివీడు : బాస్కెట్ బాల్ కృష్ణా జిల్లా యూత్ జట్లను పట్టణంలోని ధర్మ అప్పారావు కళాశాలలో నిర్వహించిన సెలక్షన్లో ఎంపిక చేశారు. బాలుర విభాగంలో 105 మంది, బాలికల విభాగంలో 36 మంది పాల్గొనగా వారి నుంచి బాలబాలికల జట్లను ఎంపిక చేశారు. ఎంపికైన జట్లు ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరంలో జరిగే ఒకటో అంతర్జిల్లా రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో పాల్గొం టాయి. ఈ ఎంపికలో బాస్కెట్ బాల్ అసోసియేషన్ సభ్యులు టీవీ కృష్ణారావు, జి.రామచంద్రరావు, ఎస్.రామ్మోహన్రావు, జి.ప్రేమ్కుమార్, ఎండీ అంజాద్అలీ పాల్గొన్నారు. బాలుర జట్టు నూజివీడుకు చెందిన సీహెచ్ వేణుమోహన్, షేక్ అబ్దుల్నజీర్, పి.సందీప్కుమార్, జి.రామ్గోపాల్, కె.శ్యామ్సుందర్, గుడివాడ నుంచి ఎం.పవన్కుమార్, డి. ఆకాష్, విజయవాడ నుంచి డి.గురుదత్తా, జె.ఆకాష్, జె.ప్రశాంత్, గౌతమ్, కె.అశ్విన్రెడ్డి ఎంపికయ్యారు. బాలికల జట్టు నూజివీడు నుంచి వాకా సాత్విక, ఎం.హిమబిందు, వి.తేజస్విని, ఆర్.శ్వేత, డి.వినీల, ఆర్.సంధ్య, టి.లహరి, ఎస్వీకే కీర్తి, అర్ఫాఫరోజ్, విజయవాడ నుంచి ఆర్.అనూహ్య, థెరిస్సా, గుడివాడ నుంచి ఒ.సఖీ ఎంపికయ్యారు. వీరిని జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి బొబ్బిలి కొండలరావు అభినందించారు. ఈ రెండు జట్లకు ఈ నెల 22వ తేదీ నుంచి డీఏఆర్ కళాశాలలో నాలుగు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. -
మహిళల కబడ్డీ విజేత వైజాగ్
నూజివీడు : దసరా సందర్భంగా నూజివీడులో మూడు రోజులుగా సాగుతున్న అఖిల భారత 65వ పురుషుల చెడుగుడు, మహిళల కబడ్డీ పోటీలు గురువారం రాత్రి ముగిశాయి. మహిళల కబడ్డీ పోటీల్లో విశాఖపట్నం జట్టు విజేతగా నిలవగా, గత ఏడాది విజేత అయిన విజయనగరం జట్టు ద్వితీయస్థానంతో సరిపెట్టుకుంది. లీగ్ పద్ధతిలో జరిగిన ఈ పోటీలో ప్రారంభం నుంచి ఉత్తమ ప్రతిభ చూపిన విశాఖపట్నం, విజయనగరం జట్లు ఫైనల్కు చేరాయి. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్లో విశాఖపట్నం జట్టు మెరుగైన ఆటతీరును ప్రదర్శించి విజయాన్ని సాధించి విజేతగా నిలిచింది. గత ఏడాది మాదిరిగానే కృష్ణాజట్టు మూడో స్థానంలోను, తూర్పుగోదావరి జట్టు నాల్గో స్థానంలోనూ నిలిచాయి. హోరాహోరీగా ఫైనల్ విశాఖపట్నం, విజయనగరం జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ప్రథమార్థం నిలిచే సరికి 13–10 పాయింట్లతో విజయనగరం జట్టు ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్థంలో విశాఖ జట్టు తమ మెరుగైన ఆటతీరుతో రైడర్లు వరుసగా పాయింట్లు తీసుకురావడంతో 17–13 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంకా ఆట రెండు నిమషాలుందనగా, ఇరుజట్లు వరుసగా పాయింట్లు సాధించినప్పటికీ చివరికి 21–17 స్కోరుతో విశాఖపట్నం విజయాన్ని సాధించింది. విశాఖ జట్టు డిఫెన్స్లోను, ఎఫెన్స్లోను పూర్తి ఆధిక్యతను సాధించింది. ఆటలకు నిలయం నూజివీడు : ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, సినీహీరో వేణు, కావూరి భాస్కర్, మూల్పురి లక్ష్మణస్వామి చేతులమీదుగా విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ మాట్లాడుతూ నూజివీడులో పూర్వకాలం నుంచి ఆటలకు గొప్ప పేరుందన్నారు. నటుడు వేణు మాట్లాడుతూ 65 ఏళుల్గా అఖిల భారతస్థాయిలో చెడుగుడు పోటీలు నిర్వహిస్తున్నారంటే మామూలు విషయం కాదన్నారు. కార్యక్రమంలో స్పోర్టింగ్ క్లబ్ అధ్యక్షుడు బొబ్బిలి కొండలరావు, కార్యదర్శి టీవీ కృష్ణారావు, ఉపాధ్యక్షుడు గాజుల శోభనాచలం, స్పోర్టింగ్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా కబడ్డీ పోటీలు
నూజివీడు : దసరా సందర్భంగా నూజివీడు స్పోర్టింVŠ Sక్లబ్ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న 65వ వార్షిక అఖిల భారత పురుషుల చెడుగుడు, మహిళల కబడ్డీ పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగుతున్నాయి. మహిళల కబడ్డీ పోటీల్లో విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, అనంతపురం జట్లు పాల్గొంటున్నాయి. స్థానిక ఎస్ఆర్ఆర్ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన బీచ్ కబడ్డీ, కబడ్డీ కోర్టులలో మంగళవారం, బుధవారం సాయంత్రం 7 నుంచి రాత్రి 10గంటల వరకు ఈ జట్ల మధ్య లీగ్ మ్యాచ్లు జరిగాయి. విశాఖపట్నం జట్టు అన్ని లీగ్ మ్యాచ్లలో గెలుపొంది అగ్రస్థానంలో కొనసాగుతోంది. విజయనగరం, కృష్ణా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. చివరకు విజయనగరం జట్టు విజయం సాధించింది. రెఫరీలుగా కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధులు పీఎస్ సుధాకర్, సీహెచ్ శ్రీనివాస్, పి.శ్రీనివాసరావు, పీఎస్ఎన్ మల్లేశ్వరరావు, బి.శంకర్, ఇ.రామకృష్ణ, ఎం.మధు వ్యవహరించారు. స్పోర్టింగ్ క్లబ్ అధ్యక్షుడు బొబ్బిలి కొండలరావు, ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి వెంకట కృష్ణారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
చింతలపూడి, నూజివీడులో బొగ్గు నిక్షేపాలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో బొగ్గునిక్షేపాలపై అన్వేషణకు రాష్ట్రప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కేజీ బేసిన్ పరిధిలోని పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి, కృష్ణాజిల్లా నూజివీడు పరిసర ప్రాంతాల్లో అపార బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు కొంత కాలం క్రితం అధ్యయనాల్లో తేలిన విషయం విదితమే. బొగ్గు ఎక్కడెక్కడ నిక్షిప్తమై ఉందో అన్వేషించటానికి ప్రభుత్వం మైనింగ్ ఎక్స్ప్లొరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఇసిఎల్), నేషనల్ మైనింగ్ ఎక్స్ప్లొరేషన్ ట్రస్ట్(ఎన్ఎంఇటి) ప్రతినిధులతో త్రైపాక్షిక ప్రాథమిక అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. బుధవారం ముఖ్యమంత్రి కార్యాలయంలోని చీఫ్ సెక్రెటరీ శ్రీ ఎస్పీ టక్కర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎంఓయూ చేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సున్నపురాయి వేలం, బంగారు ఖనిజాన్వేషణలో ఈ సంస్థలు సహకారం అందిస్తాయి. 2017 నాటికి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేందుకు పనులు వేగవంతం చేయాలని తమ శాఖ కార్యకలాపాల ప్రగతిని సమీక్షించామని మంత్రి పీతల సుజాత చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్కు ఖనిజాన్వేషణ పూర్తవుతుందని ఆమె అన్నారు. ఎంఓయూ ప్రకారం రాష్ట్రంలో పెద్దతరహా ఖనిజాలపై ఎన్ఎంఇటీకి 2% రాయల్టీ లభిస్తుంది. ఈ రాయల్టీ సొమ్మును ఎన్ఎంఇటి రాష్ట్రంలో ఖనిజాన్వేషణ చేపట్టనున్న ఎంఇసిఎల్కు చెల్లిస్తుంది. కొత్త ఖనిజ నిక్షేపాలను గుర్తించిన తర్వాత వాటిని బ్లాకులుగా చేసి వేలం వేస్తారు. ఎన్ఎంఇటి, ఎంఇసిఎల్ల సహకారంతో జరిగే ఖనిజాన్వేషణ నిరంతర ప్రక్రియ అవుతుంది. ఒప్పంద పత్రాల మార్పిడి కార్యక్రమంలో మంత్రి పీతల సుజాత, శ్రీ ఎస్పీ టక్కర్, గనుల శాఖ కార్యదర్శి శ్రీ గిరిజా శంకర్, ఎన్ఎంఇటి పక్షాన కోషిఖాన్, ఎంఇసిఎల్ తరపున శ్రీ యోగేష్ శర్మ పాల్గొన్నారు. -
బాలిక హత్యకేసులో నిందితురాలు అరెస్ట్
నూజివీడు (కృష్ణా జిల్లా) : నూజివీడు పట్టణంలో గత శుక్రవారం దారుణ హత్యకు గురైన వేముల రూప అనే గిరిజన బాలిక హత్యకేసును నూజివీడు పోలీసులు 24 గంటల్లో చేధించారు. రూప తల్లి పనిచేస్తున్న చోట పనిచేస్తున్న ఇస్లావత్ సీత అనే మహిళ ఈ హత్య చేసినట్లు ఒప్పుకుంది. బాలిక తల్లి మరియమ్మ మీద వ్యక్తిగత కక్షతో ఈ హత్య చేసినట్లు సీత పోలీసుల వద్ద అంగీకరించింది. ముందుగా పథకం ప్రకారం మరియమ్మ పనిచేస్తున్న ఇటుక తయారీ ఫ్యాక్టరీలో పనికి చేరింది సీత. మృతురాలు రూప ఆ రోజు ఉదయం తన తల్లి మరియమ్మ దగ్గరకు వెళ్లింది. రూపను తీసుకుని సీత బయటకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుని వస్తాను తోడు పంపమని అడిగింది. సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి బాలికను దారుణంగా చంపేసింది. నోట్లో మట్టిపోసి ఊపిరి ఆడకుండా చేసి, రూప గౌనును తీసి మెడకు బిగించి హత్య చేసింది. తిరిగి పనిలోకి వెళ్లి రూప ఆడుకోవడానికి వెళ్లినట్లు మరియమ్మకు చెప్పిందని నూజివీడు డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. -
నూజివీడులో అగ్నిప్రమాదం
నూజివీడు: ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలలో 3 పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన కృష్ణాజిల్లా నూజివీడు పట్టణం ఆర్.ఆర్.పేటలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎంత ఆస్తి నష్టం జరిగిందో తెలియాల్సి ఉంది. -
పసరువైద్యం పేరుతో మహిళపై అత్యాచారం
-
ఏసీబీకి చిక్కిన సబ్రిజిస్ట్రార్
నూజివీడు (కృష్ణా జిల్లా) : మార్ట్గేజ్ డాక్యుమెంట్ కోసం లంచం డిమాండ్ చేసిన సబ్రిజిస్ట్రార్ను శుక్రవారం సాయంత్రం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్రిజిస్ట్రార్గా పనిచేస్తున్న ఆర్వీపీ ధర్మలింగేశ్వర్రావు.. నూజివీడుకు చెందిన శివసాయి నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. మార్ట్గేజ్ డాక్యుమెంట్ కోసం కార్యాలయానికి వెళ్లిన శివసాయిని సబ్రిజిస్ట్రార్ రూ. 20 వేలు లంచం డిమాండ్ చేయడంతో శివసాయి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన విజయవాడ ఎసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ.. ధర్మలింగేశ్వర్రావు లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. -
'చింతమనేనిని విప్ పదవి నుంచి తొలగించాలి'
నూజివీడు (కృష్ణా జిల్లా) : ముసునూరు మహిళా ఎమ్మార్వో వనజాక్షితో అనుచితంగా ప్రవర్తించిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను టీడీపీ వెంటనే విప్ పదవి నుంచి తొలగించాలని ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శుక్రవారం కృష్ణా జిల్లా నూజివీడులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ అధికారులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. రెవెన్యూ అధికారులు ఎలాంటి ఒత్తిడులకు తలొగ్గకుండా వ్యవహరించాలని రామకృష్ణ కోరారు. -
ఆ డీజిల్ దొంగ దొరికాడు
-
ఆ డీజిల్ దొంగ దొరికాడు
కృష్ణాజిల్లా: డీజిల్ దొంగలిస్తున్న దొంగను గుర్తించిన స్థానికులు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన జిల్లాలోని నూజివీడు ఎంప్లాయిస్కాలనీలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. కారు నుంచి డీజిల్ దొంగలిస్తున్న యువకున్ని స్థానికులు ప్రశ్నించడంతో.. పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో అతన్ని బంధించిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. -
ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ట్రిపుల్ ఐటీల ప్రవేశానికి సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్జేయూకేటీ (రాజీవ్గాంధీ సాంకేతిక వైజ్ఞానిక యూనివర్సిటీ వైస్ చాన్సులర్ సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేశారు. హైదరాబాద్, బాసర, ఇడుపులపాయ, నూజివీడులో ప్రవేశాలకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.విద్యార్థులకు దరఖాస్తులు ఆన్లైన్లో లభ్యం అవుతాయి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూన్ 19వ తేదీ. రెండు రాష్ట్రాల్లో 85 శాతం స్థానికత, 15 శాతం ఓపెన్ కేటగిరి ద్వారా విద్యార్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. -
'నాకు చదువు వద్దు..ఏమోద్దు'
విజయవాడ : విద్యావిధానం సరిగాలేదని లేఖ రాసి ఒక ఇంజనీరింగ్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన గురువారం కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో చోటు చేసుకుంది. వివరాలు..కలిదండి మండలం మూలలంక గ్రామానికి చెందిన పువ్వాడ కిరణ్ కుమార్ నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీలో ఏ సమస్య వచ్చిన ముందుండే కిరణ్ గురువారం మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదు. దీంతో స్నేహితులు కాలేజీ యాజమాన్యానికి తెలిపారు. సాయంత్రం వరకు రాకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు బంధువులను ఆరా తీసిన పలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు హాస్టల్లో తనిఖీ చేయగా కిరణ్ రాసిన లేఖ బయటపడింది. 'నాకు చదువు వద్దు ఏమోద్దు నేను వెళ్లి పోతున్నాను' అని కిరణ్ ఆ లేఖలో రాశాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి... కిరణ్ అచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
నూజివీడు సీడ్స్లో అగ్ని ప్రమాదం
ప్రకాశం: ప్రకాశం జిల్లా ఇంకొల్లు గ్రామంలోని నూజివీడు సీడ్స్ కంపెనీలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. పత్తి మూటలకు నిప్పు అంటుకోవడంతో మంటలు ఎక్కువ అవుతున్నాయి. ఆ ప్రాంతంలో భారీగా పొగలు వస్తుండటంతో ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు. ప్రమాదం ఎలా జరిగింది ? ఎవరైనా కావాలనే చేశారా ? లేక అదే జరిగిందా ? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
పదిలక్షలతో పెళ్లికొడుకు జంప్!
నూజివీడు: ఏడడుగులేసి మూడు రోజుల కాకముందే పెళ్లి కొడుకు పరారైన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కృష్ణాజిల్లా నూజివీడులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గత మూడు రోజుల క్రితమే పెళ్ల ఓ జంటకు పెళ్లైంది. అయితే పది లక్షల కట్నంతో పెళ్లి కొడుకు పరారయ్యాడు. పెళ్లి కూతురు కుటుంబం ఫిర్యాదు చేశారు అని పోలీసు తెలిపారు. పెళ్లి కూతురు తల్లి తండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పెళ్లికొడుకు గురించి గాలింపు చేపట్టారు. -
ఏపి రాజధాని:రియల్టర్లకు లాభాల పంట!
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు లాభాల పంట పండించుకుంటున్నారు. మూడు నెలల నుంచి రాజధాని ఎక్కడో స్పష్టంగా తేల్చకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మంత్రులు, ఎంపిలు అందరూ ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ ఇంకా తేల్చలేదు. చంద్రబాబు విజయవాడ- గుంటూరు మధ్య ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద ప్రమాణస్వీకారం చేశారు. దాదాపు ఆ ప్రాంతంలోనే రాజధాని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందని విస్తృతంగా ప్రచారం చేశారు. దాంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. నంబూరు, కాజ, కంతేరు, తాడికొండ, అమరావతి రోడ్డు పక్కల, పొన్నెకల్లు, మంగళగిరి చుట్టుపక్కల నీరుకొండ, నిడమర్రు, పరిమి, చినకాకాని, ఆత్మకూరు, విప్పటం .....గ్రామాలలోతోపాటు, గుంటూరు చుట్టుపక్కల చిలకలూరిపేట వరకు భూముల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దానికి తోడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ గ్రామాలలో ఎక్కడబడితే అక్కడ భూములు కొనుగోలు చేసి, ఉడా ఆమోదంలేకుండా, 20, 30 అడుగుల రోడ్లు మాత్రమే చూపుతూ వందల వెంచర్లు వేసేశారు. కొందరైతే కాగితాలమీదే వెంచర్లు వేసి అమ్మకాలు కొనసాగించారు. ఇంకా కొనసాగిస్తున్నారు. ఈ పక్కన ఆ ప్రాజెక్టు, ఈ పక్కన మరో ప్రాజెక్టు అని చెప్పేసి అమ్మకాలు చేసేస్తున్నారు. ఆ తరువాత అమరావతి వద్ద అని ప్రచారం జరిగింది. దాంతో అమరాతి చుట్టుపక్కలతోపాటు, పక్కనే ఉన్న తుళ్లూరు మండలంలో భూముల ధరలు పెరిగిపోయాయి. మళ్లీ కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంతం అని ప్రచారం జరిగింది. అక్కడ కూడా ఇదే పరిస్థితి. గన్నవరం, ఆగిరిపల్లి, నూజివీడు చుట్టుపక్కల ఎకరం ధర లక్షల నుంచి కోట్ల రూపాయలకు చేరింది. అడ్డదిడ్డంగా ఎక్కడబడితే అక్కడ ఉడా ఆమోదంలేకుండా వెంచర్లు వేసేశారు. 18 అడుగుల రోడ్లు, 65 గజాల ప్లాట్లు కూడా వేసి అందినకాడికి దండుకుంటున్నారు. రాజధాని సమీపంలో ఇల్లు కట్టుకోవడానికి వంద గజాల స్థలం ఉన్నా చాలునని చాలా మంది భావిస్తున్నారు. దాంతో అందరూ ఎగబడి కొనడం మొదలు పెట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభాల పంటపండుతోంది. మొదటి నుంచి గుంటూరు, కృష్ణా జిల్లాలలో ఎక్కడో ఒకచోట రాజధాని ఏర్పడుతుందనేది అందరి నమ్మకం. ఆ విధంగా ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో ప్రకనైతే చేశారు గానీ, ఎక్కడ అనేది స్పష్టం చేయలేదు. విజయవాడ చుట్టుపక్కల అని మాత్రమే చెప్పారు. కృష్ణా నదికి అటువైపా? ఇటువైపా? అనేది స్పష్టం చేయలేదు. నూజివీడా? అమరావతా? మంగళగిరా? అనేది కూడా వివరించలేదు. దానికి తోడు ఎంపిలు, మంత్రులు పోటీలు పడి ఒకరు నూజివీడు అంని చెబుతుంటే, మరొకరు మంగళగిరి వైపని, ఇంకొకరు అమరావతి వైపని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంకా కొందరు ప్రమాణస్వీకారం చేసిన వద్దనుంచి మొదలుకొని అటు అమరావతి వైపు విస్తరిస్తుందని చెబుతున్నారు. ఈ రకమైన ప్రచారాలతో ఈ అన్ని ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ వ్యాపారాలను మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితులలో బాధ్యత గల ప్రభుత్వం ఇప్పటికైనా రాజధాని విషయంలో ఒక స్పష్టత ఇవ్వవలసిన అవసరం ఉందని భావిస్తున్నారు. - శిసూర్య -
రెండుగా చీలిన మంత్రులు: చంద్రబాబుకు తలనొప్పి
ఏపి రాజధాని విషయంలో ప్రతిపక్షం నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేకపోయినా, స్వపక్షంలో విభేదాలు తలెత్తడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తలనొప్పిగా తయారైంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఈ నెల 4వ తేదీ గురువారం శాసనసభలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిని ప్రతిపక్షం వైఎస్ఆర్ సిపి కూడా స్వాగతించింది. అయితే ముందుగా చర్చ జరగకుండా ప్రకటించిన విధానం సరిగాలేదని విమర్శించింది. ఎటువంటి వివాదాలకు తావులేకుండా రాజధాని ప్రకటన జరిగిపోయిందని అనుకుంటున్న తరుణంలో అధికారపక్షానికి చెందిన మంత్రులలోనే విభేదాలు వచ్చాయి. సీఎం విజయవాడ పరిసర ప్రాంతాలలో అని చెప్పి వదిలివేశారు. ఎక్కడ? అనేది ఆయన స్పష్టంగా చెప్పలేదు. విజయవాడకు 41 కిలో మీటర్ల దూరంలో నూజివీడు, 40 కిలో మీటర్ల దూరంలో గుంటూరు జిల్లాలోని అమరావతి, 15 కిలో మీటర్ల దూరంలో మంగళగిరి ఉన్నాయి. కృష్ణా జిల్లా నూజివీడు వైపు రాజధాని విస్తరించాలని కొందరు మంత్రులు పట్టుబడుతున్నారు. మరికొందరు గుంటూరు జిల్లా మంగళగిరి వైపు విస్తరించాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన రాజ్యసభ సభ్యులు యలమంచిలి సుజనా చౌదరి మంగళగిరివైపు కావాలని కోరుతుండగా, సిఎం రమేష్ నూజివీడు వైపు ఉండాలని కోరుతున్నారు. ఈ విషయంలో మంత్రులు కూడా రెండు వర్గాలుగా చీలిపోయారు. రాజధానిపై మంత్రులు అందరూ ఒకే మాట మాట్లాడమని చెప్పినప్పటికీ, ఇప్పుడు మంత్రులు ఈ విధంగా చీలిపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు చికాకు కలుగుతోంది. దానికి తోడు తనకు అత్యంత సన్నిహితులైన సుజనా చౌదరి, సిఎం రమేష్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఆయన తల పట్టుకొని కూర్చున్నారు. ** -
రాజధానిపై రోజుకో ప్రకటన వెనుక కారణాలు?
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించే ప్రదేశం ఎక్కడన్న దానిపై ప్రభుత్వంలో ఉన్నవారే రోజుకోరకంగా మాట్లాడటం, తేపకో లీక్ ఇవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని నిర్మించే ప్రాంతాన్ని సూచించడానికి కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఓ పక్క రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఆ కమిటీ నివేదిక ఇవ్వడానికి ఇంకా సమయం ఉంది. మరో పక్క రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం సలహాలు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ అధ్యక్షతన ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ సభ్యులు రాజధాని నిర్మాణానికి సంబంధించి అధ్యయనం చేయడానికి సింగపూర్, మలేషియా వెళ్లనున్నారు. ఈ ప్రక్రియ ఓ పక్క జరుగుతుండగా ప్రభుత్వంలో ఉన్నవారు, అధికార పార్టీ సీనియర్ నేతలు తలా ఒక రకంగా మాట్లాడుతున్నారు. గుంటూరు-విజయవాడ మధ్య - కృష్ణా జిల్లా నూజివీడు - ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతం - అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నిర్మాణం - అందరికి అందుబాటులో ఉండే ప్రదేశం - అన్ని వసతులు ఒకే చోట ... అని రకరకాలుగా చెబుతున్నారు. ఎక్కువగా విజిటిఎం(విజయవాడ-తెనాలి-గుంటూరు-మంగళగిరి) ప్రాంతం పేరు వినవస్తోంది. ప్రభుత్వంలో ముఖ్య నేతలు కూడా ఈ ప్రాంతం పేరునే చెబుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి తగినంత భూమి లేదు. ఎక్కవగా భూమిని ప్రైవేటు వ్యక్తుల వద్ద నుంచి సేకరించవలసి ఉంది. ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతం, రాయలసీమలలో ప్రభుత్వ భూములు తగినంత ఉన్నాయి. అయితే ఆ ప్రాంతాలలో ఇతర మౌలిక వసతులు తగిన స్థాయిలో లేవన్న అభిప్రాయం ఉంది. మరో పక్క శ్రీభాగ్ ఒప్పందాల ప్రకారం ఆంధ్రరాష్ట్ర రాజధాని కర్నూలుని రాజధాని చేయాలని రాయలసీమ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ ఉద్యమరూపం కూడా దాల్చుతోంది. ఇంకోపక్క రాజధాని నిర్మాణానికి ప్రభుత్వ భూములు ఉన్న ప్రదేశమైతే మేలని కొందరు సూచిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపధ్యంలో తలా ఒక రకంగా చెప్పడంతో ఒక స్పష్టతరాలేదు. దాంతో ప్రజలు అయోమయంలో పడుతున్నారు. అధికారంలో ఉన్న ముఖ్యులే రోజుకో ప్రదేశం పేరు చెప్పడంతో ఆయా ప్రాంతాలలో భూముల ధరలకు రెక్కలొచ్చేశాయి. రాజకీయ నేతలు, వ్యాపారులు అవకాశం ఉన్నమేరకు ఆయా ప్రాంతాలలో భూములు కొనిపెట్టుకున్నారు. బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు దండిగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు భారీగా లాభపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభాలు వచ్చే విధంగా మంత్రులు ప్రకటనలు చేస్తున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. కొందరు నేతలు తమ భూములు అమ్ముకోవడానికి ఈ ప్రాంతంలోనే రాజధాని ఏర్పడబోతుందని ప్రచారం చేస్తున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. మరోవైపు పరిశీలిస్తే ఇప్పుడు ప్రచారం జరుగుతున్న ప్రాంతాలలో భూముల అమ్మకాలు కొనుగోలులు విపరీతంగా జరుగుతున్నాయి. అక్కడ ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించిన ధరలు ఎకరం రెండు లక్షలు, మూడు లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఎకరం 50 లక్షల రూపాయల నుంచి మూడు కోట్ల రూపాయల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. అయినా ప్రభుత్వ ధరల ప్రకారమే రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లిస్తున్నారు. ఆ విధంగా ప్రభుత్వానికి రావలసిన రాబడులు కూడా రావడంలేదు. రాజధాని నిర్మించే ప్రదేశాన్ని అధికారికంగా ప్రకటించేవరకు మంత్రులు తమ ఇష్టం వచ్చిన రీతిలో ప్రజలను అయోమయంలో పడవేసే విధంగా మాట్లాడకుండా ఉంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుంతోంది. - శిసూర్య -
ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లోని బాసర, ఇడుపులపాయ, నూజివీడు ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. 3 వేల మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించే నోటిఫికేషన్ ను ఆర్జేయూకేటీ వైస్ ఛాన్సలర్ రాజ్ కుమార్ విడుదల చేశారు. జూన్ నెల 21 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుందని, జూన్ 16 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారని ఓ ప్రకటనలో వెల్లడించారు. జూలై 8న విద్యార్థుల ఎంపిక, జూలై 23, 24 కౌన్సిలింగ్ జరుగుతుందన్నారు. జూలై 28న తరగతులు ప్రారంభిస్తామని వీసీ ఓ ప్రకటనలో తెలిపారు. -
వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై గొడ్డళ్లతో దాడి
నూజివీడు : కృష్ణాజిల్లా నూజివీడు టీడీపీ అభ్యర్థి అనుచరులు దాడులకు తెగబడ్డారు. నూజివీడులో మున్సిపల్ ఎన్నికల్లో గెలిచామంటూ తెలుగు తమ్ముళ్లు సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై గొడ్డళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. టీడీపీ అభ్యర్థి దుర్గాప్రసాద్ అనుచరులు ఈ దాడులు చేశారు. కాగా టీడీపీ కవ్వింపు చర్యలకు పాల్పడటాన్ని వైఎస్ఆర్సీపీ ఖండించింది. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
'పవన్ కళ్యాణ్ హద్దులు దాటవద్దు!'
నూజివీడు: జనసేన పార్టీ స్థాపకుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు మండిపడ్డారు. తన కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఏదో ఒక సినిమా హిట్టు అయ్యిందని ఏదేదో మాట్లాడేస్తే ప్రజలు ఓట్లు వేస్తారనుకోవడం భ్రమ అని ధ్వజమెత్తారు. ‘‘పవన్ కళ్యాణ్ హద్దులు దాటవద్దు.రాజకీయాలలో అఆ లు నేర్చుకునే దశ నీది.నువ్వెంత?, నీ సర్వీసు ఎంత?, నీ శక్తి ఎంత? వెయ్యి జన్మలెత్తినా కాంగ్రెస్ను ఏమీ చేయలేవు'' అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హద్దులు మీరి ప్రవర్తిస్తే ఎంతమాత్రం మంచిది కాదని హెచ్చరించారు. బీజేపీ తరుపున ప్రచారం చేసుకో. అంతేగాని నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు కాంగ్రెస్ గురించి మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదన్నారు. నువ్వు సినిమాల్లో విశ్వరూపం చూపిస్తావేమో, అంతకంటే వంద రెట్లు ఎక్కువగా విశ్వరూపాన్ని రియల్గా తాను చూపించగలని హెచ్చరించారు. ఏ విషయంపైనైనా బహిరంగ సమావేశంలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బీజెపీ అనే దీపం అనేక సార్లు వెలిగి ఆరిపోయిందని, ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ తెలుసుకుంటే మంచిదన్నారు. తనది, పవన్ది గమ్యం ఒకటేనని కేంద్ర మంత్రి చిరంజీవి పేర్కొనడం విచారకరమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజలలోకి తప్పుడు సంకేతాలను పంపుతాయన్నారు. పవన్కళ్యాణ్ కాంగ్రెస్ హఠావో అంటుంటే, ఇద్దరి గమ్యాలు ఒక్కటేనని ఎలా చెపుతారని ఆయన చిరంజీవిని ప్రశ్నించారు. చిరంజీవి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీని తరిమేయండి అని పవన్ కళ్యాణ్ అంటుంటే ఏమని అర్థం చేసుకోవాలని విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎందరో సీనియర్లు ఉన్నప్పటికీ వారందరినీ పక్కన బెట్టి కాంగ్రెస్ను బతికిస్తాడని చిరంజీవికి ప్రచార బాధ్యతను అప్పగించడం జరిగిందన్నారు. బాధ్యతాయుత స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు తెలిసి చేశాడో, తెలియక చేశాడో అర్ధం కావడం లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ క్యాడర్ను అయోమయానికి గురిచేసేలా మాట్లాడిన చిరంజీవి తమ గమ్యం ఒక్కటి కాదని రాష్ట్ర ప్రజలకు స్పష్టంచేయాలన్నారు. -
హరికృష్ణకు విజయవాడ తూర్పు లేక నూజివీడు?
హైదరాబాద్: రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణకు కృష్ణా జిల్లాలోని విజయవాడ తూర్పు లేక నూజివీడు శాసనసభ నియోజకవర్గాలలో ఏదో ఒకటి కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు స్థానాలను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎవరికీ కేటాయించలేదు. పెనమలూరు టికెట్ లేదా హిందూపురం టికెట్ ఇవ్వమని తాను ముందే అడిగినట్లు హరికృష్ణ చెప్పారు. అయితే హిందూపురం బాలకృష్ణకు, పెనమలూరును బడే ప్రసాద్కు కేటాయించారు. కృష్ణాజిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ స్థానం తనకు ఇస్తారని ఆశించినట్లు హరికృష్ణ చెప్పారు. ఈ నేపధ్యంలో కృష్ణా జిల్లాలో మిగిలి ఉన్నా విజయవాడ తూర్పు, నూజివీడు స్థానాలలో ఏదో ఒకటి ఆయనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా, కృష్ణా జిల్లా నూజివీడులో ముద్రబోయిన వెంకటేశ్వరరావు రహస్యంగా నామినేషన్ దాఖలు చేశారు. ముద్రబోయిన ఇటీవలే కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. విజయవాడ తూర్పు శాసనసభ స్థానానికి మాజీ ఎంపి, పార్టీ తూర్పు నియోజకవర్గ బాధ్యుడు గద్దె రామ్మోహన్ తన తరపున భార్య అనూరాధతో నామినేషన్ వేయించారు. ఈ రెండిటిలో ఏదైనా హరికృష్ణకు కేటాయిస్తారా లేక మొండిచేయి చూపుతారా అనేది తెలుసుకోవాలంటే వేసి చూడవలసిందే. -
'వినేవారుంటే ఆరోగ్యశ్రీ కూడా నాదే....'
-
'వినేవారుంటే ఆరోగ్యశ్రీ కూడా నాదే....'
నూజివీడు : 'జగనన్న నాయకత్వంలో ఒక నూతన అధ్యాయం తెచ్చుకుందాం...ఒక్క అవకాశం ఇవ్వండి..మీ కోసం జగనన్న తన జీవితాన్ని ధారపోస్తాడు' అని వైఎస్ షర్మిల కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె బుధవారం కృష్ణాజిల్లా నూజివీడులో ప్రసంగించారు. వైఎస్ఆర్ సీపీకి ఓటేద్దాం.. రాజన్నరాజ్యం తెచ్చుకుందామని షర్మిల పిలుపునిచ్చారు. విభజనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఖరివరకూ పోరాటం చేసిందని ఆమె తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్ షర్మిల ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు అయిదేళ్లలో ఒక్కసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయలేదన్నారు. కాంగ్రెస్ సర్కార్ను బాబు భుజాన మోసి.... విప్ జారీ చేసి ప్రభుత్వాన్ని కాపాడారని షర్మిల అన్నారు. చంద్రబాబుకు తొమ్మిదేళ్లలో ఒక్కసారి కూడా రైతులకు రుణమాఫీ చేయాలనే ఆలోచనే రాలేదని షర్మిల ఎద్దేవా చేశారు. వినేవారుంటే ఆరోగ్యశ్రీ కాఊడా నాదే..ఫీజు రీయింబర్స్మెంట్, 108 కూడా నాదే అని అబద్దాలు చెబుతారని అన్నారు. చంద్రబాబు ఏ రోజు అయితే నిజం చెబుతారో... ఆరోజు ఆయన తల వెయ్యి ముక్కలవుతుందని ఒక ముని శాపముందట...అని షర్మిల వ్యాఖ్యాంచారు. అందుకే చంద్రబాబు మాటల్లో నిజం లేదని ...విశ్వసనీయత అనే పదానికి అర్థం తెలీదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే దానికి బాబు మద్దతు తెలిపారన్నారు. చంద్రబాబు ఒక ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాన్ని...మరో ఎలక్షన్ వచ్చేసరికి మర్చిపోతారని షర్మిల విమర్శించారు. పనిలో పనిగా చిరంజీవి, కిరణ్ కుమార్ రెడ్డిపై ఆమె నిప్పులు చెరిగారు. ప్రజలపై రూ.32 వేల కోట్ల విద్యుత్ భారాన్ని కిరణ్ మోపారన్నారు. ఓటేసిన ప్రజలను పిచ్చోళ్ళను చేసి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో కలిపిన చరిత్ర చిరంజీవిదని షర్మిల అన్నారు. -
‘కస్టమర్ హైరింగ్ సెంటర్లకు నిధులు పుష్కలం’
నూజివీడు రూరల్, న్యూస్లైన్ : కస్టమర్ హైరింగ్ సెంటర్ల స్థాపనకు నిధులు పుష్కలంగా ఉన్నాయని వ్యవసాయాశాఖ జాయింట్ డెరైక్టర్ ఎన్సీహెచ్.బాలునాయక్ తెలిపారు. పట్టణ పరిధిలోని గొడుగువారిగూడెంలో నిర్వహిస్తున్న కస్టమర్హైరింగ్ సెంటర్ (రైతులకు యంత్రాలను అద్దెకిచ్చు కేంద్రం) ను శనివారం ఆయన పరిశీలించారు. జిల్లాలో కస్టమర్ హైరింగ్ సెంటర్ల నిర్వహణ కేంద్రాల స్థాపనకు, గ్రూప్రైతులకు అందించేందుకు రూ 9.55 కోట్ల యాంత్రీకరణ రుణాలు మంజూరయ్యాయని తెలిపారు. కేంద్రాలు స్థాపించేందుకు ఆసక్తి ఉన్న రైతులు గ్రూపులుగా ఏర్పడి దరఖాస్తు చేసుకున్నట్లైతే తక్షణమే రుణం, సబ్సీడి మంజూరు చేస్తారని చెప్పారు. జిల్లాలో పత్తి యంత్రాలు 20, మొక్కజొన్న 10, పోగాకు 05, వేరుశనగ 04, వరినాటే యంత్రాలు 4 ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు. 43 యంత్రాలకు గానూ ప్రస్తుతానికి 10 యంత్రాలను రైతులకు అందించామని చెప్పారు. వ్యవసాయశాఖ డెప్యూటీ డెరైక్టర్ వెంకటేశ్వరరావు ఏడీ విజయకుమారి, ఏవో జే భవాని తదితరులు పాల్గొన్నారు. -
కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు ఎవరు ఇస్తారు?
విజయవాడ: రాష్ట్ర విభజన జరిగితే కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు ఎవరిస్తారు? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ ప్రశ్నించారు. నూజివీడులో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. విభజనతో హైదరాబాద్పై సీమాంధ్రులకు హక్కు ఉండదని చెప్పారు. కొత్త రాజధాని నిర్మాణానికి లక్ష ఎకరాల భూమి, 10 లక్షల కోట్ల రూపాయలు అవసరం ఉంటుందని తెలిపారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలకు 500 కోట్ల రూపాయల ప్యాకేజి కూడా ఇవ్వలేదని ఆయన చెప్పారు. విభజన జరిగితే పోలవరం నిర్మాణం సాధ్యం కాదన్నారు. ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకే కాంగ్రెస్ విభజన చేస్తోందని విమర్శించారు. విభజనను అడ్డుకునే ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన రెడ్డి మాత్రమేనని చంద్రశేఖర్ అన్నారు.