NVS Reddy
-
హైదరాబాద్ మెట్రో రెండో దశ.. కొత్త కారిడార్లలో మెగా జంక్షన్లు
సాక్షి, హైదరాబాద్: మెట్రో రెండో దశ కారిడార్లలో మెగా జంక్షన్లు ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రెండో దశలోని పార్ట్ ‘బి ’ప్రతిపాదిత జేబీఎస్– శామీర్పేట్ (22 కి.మీ.), ప్యారడైజ్ – మేడ్చల్ (23 కి.మీ.) మార్గాలకు ఉమ్మడిగా ఒక మెగా జంక్షన్ (Mega Junction) ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి (Revanth Reddy) సూచనల మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. రెండో దశలోని పార్ట్ ‘ఏ’లో ఉన్న 5 కారిడార్ల డీపీఆర్లకు కేంద్రం నుంచి త్వరలో ఆమెదం లభించే అవకాశాలు ఉన్నాయన్నారు. కేంద్రం అనుమతి లభించిన వెంటనే పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. అప్పటివరకు పాతబస్తీలో భూసేకరణ, రోడ్ల విస్తరణలో భాగంగా కూల్చివేతలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.సంక్రాంతి సందర్భంగా ఎల్అండ్ టీ మెట్రో, హైదరాబాద్ మెట్రో రైల్ (Hyderabad Metro Rail) సంస్థలు ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లో ప్రారంభించిన ‘మి టైం ఆన్ మెట్రో’ (Me Time On My Metro) మూడు రోజుల వినూత్న ప్రచార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎల్అండ్ టీ హైదరాబాద్ మెట్రో ఎండీ కేవీబీరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.మెట్రో సృజనాత్మక వేదిక.. ప్రయాణికులు సృజనాత్మక నైపుణ్యాలను ప్రదర్శించుకొనేందుకు మెట్రోస్టేషన్లు చక్కటి వేదికలుగా నిలుస్తాయని ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఎంజీబీఎస్ స్టేషన్తోపాటు అన్ని ప్రధాన స్టేషన్లలో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. నిత్యం లక్షలాది మందికి ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న మెట్రో ఇప్పుడు ప్రయాణికులకు సరికొత్త అనుభూతులను అందజేయనుందని తెలిపారు. కళలు, సాహిత్యం, సాంస్కృతిక రంగాల పట్ల అభిరుచి ఉన్న ప్రయాణికులు మెట్రో స్టేషన్లలో తమ సృజనాత్మక కళా రూపాలను ఆవిష్కరించుకోవచ్చని అన్నారు.‘మెట్రో అంటే కేవలం కాంక్రీట్, గోడల నిర్మాణాలతో కూడిన ఒక రవాణా వ్యవస్థ మాత్రమే కాదు. అది హైదరాబాద్ జనజీవితాలతో ముడిపడి ఉన్న ఆత్మ వంటిది’అని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా మెట్రో ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా కొన్ని ముఖ్యమైన స్టేషన్ల జంక్షన్లను, విశాలమైన స్థలాలను ప్రత్యేక హబ్లుగా, అంతర్జాతీయ కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. చదవండి: కూల్చి'వెతలు' లేని హైవే!ఎల్ అండ్టీ మెట్రోరైల్ ఎండీ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ మెట్రో రైళ్లలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆర్డర్ ఇచ్చిన తరువాత 18 నెలల్లో కొత్త రైళ్లు రానున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ‘మి టైం ఆన్ మెట్రో’ప్రచారంలో భాగంగా లఘు చిత్రాలను, నృత్యాలను పలువురు ప్రదర్శించారు. ‘సంక్రాంతి సంబురాలు’గా చేపట్టిన ఈ ప్రచార కార్యక్రమం రూపొందించిన మెట్రో రైలును ఎన్వీఎస్ రెడ్డి, కేవీబీరెడ్డిలు జెండా ఊపి ప్రారంభించారు. -
మెట్రో రెండో దశతో గ్లోబల్ సిటీగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: మెట్రోరైలు రెండో దశ ప్రాజెక్టు భాగ్యనగర అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలవనుందని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోరైల్ లిమిటెడ్ సంస్థల ఎండీ ఎనీ్వఎస్ రెడ్డి అన్నారు. ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా, అద్భుతమైన గ్లోబల్ సిటీగా అవతరించనుందని చెప్పారు. హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టును ప్రారంభించి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ఎల్ అండ్ టీ మెట్రో రైల్ ఆధ్వర్యంలో అమీర్పేట్ మెట్రో స్టేషన్లో గురువారం 7వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎనీ్వఎస్ రెడ్డి మాట్లాడుతూ మెట్రో రెండో దశకు ఇప్పటికే భూసేకరణ ప్రారంభమైందని.. త్వరలోనే ప్రాథమిక పనులను ప్రారంభిస్తామని చెప్పారు. రెండో దశ ప్రాజెక్టుకు నిధుల లభ్యత పుష్కలంగా ఉందని.. కేంద్రం అనుమతి లభించగానే పెట్టుబడి పెట్టేందుకు మల్టీ లేటరల్ డెవలప్మెంట్ బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని ఆయన వివరించారు. అదనపు కోచ్ల కోసం సన్నాహాలు... ప్రస్తుతం రూ. 6 వేల కోట్లకుపైగా నష్టాలతో మెట్రో నడుస్తున్నప్పటికీ వచ్చే మూడు, నాలుగేళ్లలో నష్టాలను అధిగమించి లాభాల బాటలో పయనించే అవకాశం ఉందని ఎల్ అండ్ టీ మెట్రో రైల్ ఎండీ, సీఈఓ కేవీబీ రెడ్డి తెలిపారు. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మెట్రో రైళ్ల ఆపరేషన్ను మరింత సమర్థంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందుకోసం కొత్త కోచ్లను తెప్పించేందుకు సన్నాహాలు చేపట్టామని.. మరో 3 నెలల్లో అదనపు కోచ్లకు పరిష్కారం లభిస్తుందని ఆయన వివరించారు. అయితే భద్రతా తనిఖీలు పూర్తి చేసుకొని ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చేందుకు 12–15 నెలలు పట్టొచ్చన్నారు. 10 లక్షల మంది ప్రయాణించేలా అదనపు కోచ్లు, రైళ్ల నిర్వహణ ఉంటుందని వివరించారు. కాగా, ఈ ఏడేళ్లలో మెట్రో రైళ్లలో 63.40 కోట్ల మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకున్నారు. -
Old City Metro Rail: అనగనగా మెట్రో..
సాక్షి, హైదరాబాద్: మెట్రో రెండోదశ నిర్మాణానికి నిధుల లభ్యతలో ఎలాంటి ఇబ్బంది లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు తక్కువ వడ్డీ రేటుకు నిధులు అందజేసేందుకు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. 2028లో రెండో దశ పూర్తయ్యేనాటికి సుమారు 8 లక్షల మంది ప్రయాణికులు మెట్రో సేవలను వినియోగించుకుంటారని.. 2030 నాటికి 10 లక్షలకు చేరే అవకాశం ఉందన్నారు. రెండో దశ కారిడార్లలో ప్రయాణికుల డిమాండ్పై లీ అసోసియేషన్ సంస్థ రూపొందించిన కాంప్రహెన్సివ్ మొబిలిటీ నివేదిక (సీఎంపీ) ప్రకారం ప్రతిపాదించిన అయిదు కారిడార్లలో ప్రయాణికుల డిమాండ్ అత్యధికంగా ఉంటుందన్నారు. హైదరాబాద్ మెట్రోరైల్ మొదట దశ ప్రాజెక్టుకు 7 ఏళ్లు పూర్తయిన (ఈ నెల 28) సందర్భంగా మంగళవారం బేగంపేట్ మెట్రో భవన్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎన్వీఎస్ రెడ్డి ఏం చెప్పారంటే.. ఏడేళ్లలో 63.40 కోట్ల ప్రయాణికులు.. గత ఏడేళ్లలో నాగోల్– రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్, జూబ్లీ బస్టేషన్–ఎంజీబీఎస్ మూడు కారిడార్లలో 63.40 కోట్ల మంది ప్రయాణం చేశారు. రోజుకు 5 లక్షల మంది ప్రయాణం చేస్తుండగా.. ఈ ఏడాది ఆగస్టు 14న అత్యధికంగా 5.63 లక్షల మంది ప్రయాణం చేశారు. రెండో దశ పూర్తిస్థాయిలో అందుబాటు లోకి వస్తే మొదటి, రెండు దశల్లో కలిపి సుమారు 15 లక్షల నుంచి క్రమంగా 20 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. వచ్చే డిసెంబరు నెలాఖరుకు పాతబస్తీలో రోడ్డు విస్తరణలో భాగంగా కూల్చివేతలు చేపట్టనున్నాం. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో రెండో దశ పనులు ప్రారంభమవుతాయి. జాయింట్ వెంచర్.. ⇒సమాజంలోని అన్ని వర్గాల ప్రయాణ అవసరాలకు అనుగుణంగా రెండో దశ రూట్లను ఎంపిక చేశాం. ఇది మొత్తం 6 కారిడార్లలో 116.4 కి.మీ. ఉంటుంది. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ నుంచి ఫోర్త్సిటీ మెట్రోకు సర్వే పనులు ప్రారంభించాం. రెండో దశ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల (50: 50) జాయింట్ వెంచర్. ఈ ప్రాజెక్టు డీపీఆర్ను ఈ నెల 4న కేంద్రానికి అందజేశారు. కేంద్రం నుంచి అనుమతి లభించిన వెంటనే పనులు మొదలవుతాయి. ప్రస్తుతం 5 కారిడార్లలో చేపట్టనున్న 76.4 కి.మీ. కారిడార్ల నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.7,313 కోట్లు (30 శాతం), కేంద్రం రూ.4,230 కోట్లు (18 శాతం) చొప్పున అందజేయనున్నాయి. మిగతా 48 శాతం నిధు లు రూ.11,693 కోట్లను ప్రాజెక్ట్ రుణాలుగా కేంద్ర ప్రభుత్వం పూచీకత్తుగా ఇచ్చే సావరిన్ గ్యా రంటీతో జైకా, ఏడీబీ, ఎన్డీపీ వంటి మల్టీ లేటరల్ సంస్థల నుంచి సేకరించనున్నారు. మరో 4 శాతం నిధులు రూ.1,033 కోట్లను మాత్రం పీపీపీ విధానంలో సమకూర్చుకుంటారు. రెండోదశలో నిర్మాణ వ్యయం భారీగా తగ్గనుంది. భూసేకరణ వేగవంతం... ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మించనున్న పాతబస్తీ మెట్రో ప్రాజెక్టులో భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. రోడ్డు విస్తరణతో 1100 పైగా ఆస్తులు ప్రభావితం కానున్నాయి. వీటిలో ఇప్పటి వరకు 800 ఆస్తుల వివరాలను హైదరాబాద్ జిల్లా కలెక్టర్కు అందజేశాం. వాటిలో 200 కట్టడాల తొలగింపునకు ఆయన చర్యలు చేపట్టారు. డిసెంబర్లో పరిహారం చెల్లింపుతో పాటు కూలి్చవేతలు చేపట్టనున్నారు. ప్రభుత్వ ధరల ప్రకారం అక్కడ గజానికి రూ.23,000 చొప్పున ఉంది. దానికి రెట్టింపుగా ప్రస్తుత మార్కెట్ విలువకు అనుగుణంగా గజానికి రూ.65,000 చొప్పున చెల్లించనున్నారు. మొత్తం ఆస్తుల సేకరణకు సుమారు రూ.700 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. 3 కోచ్లు.. 35 కి.మీ వేగం.. ప్రస్తుతం మొదటి దశలో ఉన్నట్లుగానే రెండో దశలోనూ మెట్రో రైల్కు 3 కోచ్లు ఉంటాయి. గంటకు 35 కిలోమీటర్ల సగటు వేగంతో రైళ్లు నడుస్తాయి. ప్లాట్ఫాంలు మాత్రం 6 కోచ్లు నిలిపేందుకు వీలుగా నిర్మిస్తారు. -
Hyderabad Metro: ‘ఎయిర్పోర్టు మెట్రో’కు గ్లోబల్ టెండర్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టుకు ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) కాంట్రాక్టర్ ఎంపిక కోసం హెచ్ఏఎంఎల్ టెండర్లను ఆహ్వానించింది. ఈ కాంట్రాక్టు అంచనా రూ 5,688 కోట్లు అని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వియస్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన కాంట్రాక్టర్ మెట్రో రైలు వ్యవస్థకు అవసరమైన ఎలివేటెడ్ వయాడక్ట్, భూగర్భ పనులు, స్టేషన్లు, ట్రాక్ పనులు, ఎలక్ట్రికల్, మెకానికల్, సరఫరా పనులను చేపట్టాల్సి ఉంటుంది. అలాగే రోలింగ్ స్టాక్ (రైలు బోగీలు), ఎలక్ట్రిక్ ట్రాక్షన్, విద్యుత్ సరఫరా, సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్స్, రైలు నియంత్రణ వ్యవస్థలు, ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ (ఏఎఫ్సీ) గేట్లను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన సర్వే, పెగ్ మార్కింగ్, అలైన్మెంట్ ఫిక్సేషన్ వంటి ప్రాథమిక పనులన్నింటినీ ఇప్పటికే పూర్తి చేశారు. భూసామర్థ్య పరీక్షల పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. కొత్త సర్వే ప్రకారం రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్ టెర్మినల్ స్టేషన్ వరకు దూరం 31 కి.మీ. ఉంది. ఇందులో 29.3 కి.మీ. ఆకాశమార్గం (ఎలివేటెడ్) కాగా. అండర్గ్రౌండ్లో 1.7 కి.మీ పొడవున పనులు చేపట్టాల్సి ఉంటుందని ఎన్విఎస్ రెడ్డి తెలిపారు. విమానాశ్రయ టెర్మినల్కు ఆనుకొని ఒక భూగర్భ మెట్రో స్టేషన్తో కలిపి రాయదుర్గం నుంచి ఎయిర్పోర్టు వరకు మొత్తం 9 స్టేషన్లు ఉంటాయి. ఆఖరు తేదీ జూలై 5 ఎయిర్పోర్టు మెట్రో రైలు నిర్మాణం పట్ల ఆసక్తి ఉన్న సంస్థలు జూలై 5లోగా టెండర్ పత్రాలను తెలంగాణ ప్రభుత్వ ఇ–పోర్టల్ https://tender. telangana.gov.in లో అప్లోడ్ చేయాలి. విమానాశ్రయ మెట్రో కారిడార్కు సమీపంలో అనేక వాణిజ్య, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం పెద్దఎత్తున జరుగుతోందని ఎన్విఎస్ రెడ్డి చెప్పారు. శివార్లలో మధ్యతరగతి వారికోసం తక్కువ ఖర్చుతో నివాసప్రాంతాలను అభివృద్ధి చేసి అన్ని తరగతులవారు ఎయిర్పోర్ట్ మెట్రో ద్వారా గమ్యస్థానాలకు చేరుకొనేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అవసరమైతే నాలుగు అదనపు స్టేషన్ల నిర్మాణానికీ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. టెండర్ విలువ, ప్రాజెక్టు వ్యయం వేర్వేరు ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.6,250 కోట్లు కాగా, ప్రస్తుతం రూ,5,688 కోట్లకే టెండర్లను ఆహ్వానించారు. దీనిపై ఎన్విఎస్ రెడ్డి స్పందిస్తూ, ప్రాజెక్టు వ్యయం, టెండర్ విలువ రెండూ భిన్నమైనవని చెప్పారు. అంచనా వేసిన టెండర్ విలువలో జీసీ ఖర్చు, ఆకస్మిక పరిస్థితులు, మల్టిమోడల్ ఇంటిగ్రేషన్ వంటివి ఉండవన్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో మాత్రం అవి ఉంటాయన్నారు. అందుకే ఈ రెండింటి మధ్య తేడా ఉన్నట్లు స్పష్టం చేశారు. -
శరవేగంగా ఎయిర్పోర్ట్ మెట్రో నిర్మాణానికి ముందస్తు పనులు: ఎన్వీఎస్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎయిర్పోర్ట్ మెట్రో పనులను వేగవంతం చేయడానికి సమాంతరంగా అనేక ముందస్తు నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభించబడ్డాయని, అవి శరవేగంగా సాగుతున్నాయని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. జనరల్ కన్సల్టెంట్ (జిసి) కోసం బిడ్ల సమర్పణకు ఈ నెల 20 చివరి తేదీ కాగా, ఈ నిపుణులైన ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు వచ్చే నెల మొదటి వారంలో నియమితులవుతారు. ఈలోగా మెట్రో అలైన్మెంట్ను పక్కాగా సరిదిద్దడానికి, స్టేషన్ల స్థానాలను నిర్ణయించడానికి సర్వే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. శాటిలైట్ ఆధారిత డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (DGPS) మరియు ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ అనే రెండు పద్ధతులు ఉపయోగించి, ఖచ్చితమైన కోఆర్డినేట్లను తెలుసుకోవడం కోసం సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ల సాయంతో సర్వే పని జోరుగా జరుగుతోంది. శంషాబాద్ పట్టణానికి సమీపంలోని ఫోర్ట్ గ్రాండ్ అండర్పాస్ వరకు ఇప్పటిదాకా 21 కిలోమీటర్ల మేర సర్వే పూర్తయింది. ఈ నెలాఖరులోగా మొత్తం సర్వే పూర్తి కానుందని, ఆ తర్వాత అలైన్మెంట్ను తెలియజేసేలా పెగ్ మార్కింగ్ ప్రారంభిస్తామని ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. చదవండి: (ఆగస్టు 15లోపు 10 లక్షల ఉద్యోగాల భర్తీ : కిషన్రెడ్డి) స్టేషన్ స్థానాలను గుర్తించడానికి ఢిల్లీ మెట్రో వారు తయారు చేసిన డీపీఆర్ మామూలు రైల్వే ఇంజనీరింగ్ పద్ధతిని అనుసరించగా, నానక్రామ్గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేటలలో గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన భారీ వాణిజ్య మరియు నివాస అభివృద్ధిని గుర్తించడం ద్వారా ఇప్పుడు ఒక వినూత్న విధానాన్ని అవలంబిస్తున్నామని ఆయన అన్నారు. నానక్రాంగూడా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, నార్సింగి, రాజేంద్రనగర్, శంషాబాద్ వంటి ప్రాంతాల అభివృద్ధికి హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ను దృష్టిలో ఉంచుకొని, నగరాన్ని దాని శివార్లలోకి విస్తరించడం, పని ప్రదేశాలకు అరగంట కంటే తక్కువ ప్రయాణ దూరంలో సరసమైన ధరలకు గృహాలను అందించాలనే సీఎం కేసీఆర్ దార్శనికతకు అనుగుణంగా ఎయిర్ పోర్ట్ మెట్రోను రూపొందిస్తున్నామని ఎండీ పేర్కొన్నారు. ట్రాఫిక్ సర్వేలో స్థానిక ట్రాఫిక్ పోలీసు ఇన్స్పెక్టర్లను జతచేయడం వల్ల స్టేషన్ స్థానాలను సరిగా గుర్తించడంలోను, స్టేషన్ యాక్సెస్ సౌకర్యాలను తక్కువ ఖర్చుతో రూపొందించడంలోనూ మంచి ఫలితాలను ఇస్తోందని ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. -
Hyderabad Metro: ప్రయాణికుల సంఖ్య పెరిగినా అవే సాంకేతిక ఇబ్బందులు
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇటీవల గణేష్ నిమజ్జనం సందర్భంగా రైళ్లలో రద్దీ నాలుగు లక్షల మార్కును దాటి.. ప్రస్తుతం దాదాపు అదే స్థాయిలో కొనసాగుతోంది. కానీ.. మెట్రో రైళ్లు తరచూ మందగిస్తున్నాయి. కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక లోపాలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా నాంపల్లి– లక్డీకాపూల్ మార్గంలో ట్రాక్కు సంబంధించి సాధారణ నిర్వహణ, మరమ్మతులో భాగంగా గ్రౌటింగ్ పనులు జరుగుతుండడంతో రైళ్ల వేగం అకస్మాత్తుగా 15 కేఎంపీహెచ్కు పడిపోవడం గమనార్హం. మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. సాంకేతిక చిక్కులు.. ► సాధారణంగా మెట్రో రైళ్ల వేగం 50–60 కేఎంపీహెచ్ మధ్యన ఉంటుంది. ఒక్కసారిగా రైళ్ల మందగమనంతో సమయానికి గమ్యస్థానానికి చేరుకుందామన్న ప్రయాణికుల అంచనాలు తప్పుతున్నాయి. రైళ్లు కిక్కిరిసి ఉంటున్న నేపథ్యంలో అకస్మాత్తుగా రైళ్ల వేగం పడిపోయిన ప్రతిసారీ ఏం జరిగిందోనని ప్రయాణికుల్లో ఆందోళన, గందరగోళం నెలకొంటోంది. ► నగర మెట్రో రైళ్లలో డ్రైవర్ అవసరం అంతగా లేని కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ వ్యవస్థను వినియోగిస్తున్నారు. వాతావరణ మార్పులు, ఒక్కసారిగా వాయు కాలుష్యం పెరిగిన సమయంలో ఈ టెక్నాలజీలో తరచూ లోపాలు తలెత్తుతున్నాయి. ఉన్నపళంగా రైళ్లు పట్టాలపై నిలిచిపోవడం, వేగం తగ్గడం తదితర సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సాంకేతికతను మన నగర పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేపట్టాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రద్దీ పెరుగుతోంది.. ప్రస్తుతం నగరంలో అన్నిరకాల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు పుంజుకోవడంతో రైళ్లలో రద్దీ కోవిడ్కు ముందున్న స్థాయిలో నాలుగు లక్షలకు చేరువైంది. అత్యధికంగా ఎల్బీనగర్– మియాపూర్ రూట్లో నిత్యం రెండు లక్షల మంది జర్నీ చేస్తున్నారు. ఐటీ కంపెనీల్లో కార్యకలాపాలు ప్రారంభం కావడంతో నాగోల్– రాయదుర్గం రూట్లోనూ రద్దీ 1.75 లక్షల మేర ఉంది. జేబీఎస్– ఎంజీబీఎస్ రూట్లో రద్దీ నిత్యం సరాసరిన 25 వేల మేర ఉంది. పండగలు, సెలవురోజుల్లో మూడు మార్గాల్లో కలిపి ప్రయాణికుల రద్దీ అదనంగా మరో 30 వేల 50 వేల వరకు ఉంటుందని మెట్రో వర్గాలు తెలిపాయి. (క్లిక్ చేయండి: ఫార్ములా– ఈ పనులు రయ్..రయ్) -
ఆమె కోసం మెట్రో పరుగు!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరాన్ని ఓవైపు కుంభవృష్టి ముంచెత్తుతున్న వేళ... రోడ్లన్నీ చెరువులను తలపిస్తుండగా... రాత్రిపూట రోడ్డు ప్రయాణం అసాధ్యమైన సమయాన కేవలం ఒకే ఒక్కరి కోసం హైదరాబాద్ మెట్రో రైలు పరుగులు తీసింది. సర్వీసు సమయం ముగిసినప్పటికీ ప్రత్యేకంగా రైలును నడిపి ఆ ఒక్కరిని భద్రంగా గమ్యానికి చేర్చింది. అత్యవసర సమయాల్లో నగరవాసులను ఆదుకుంటామనే భరోసా కల్పించింది. రాత్రిపూట ఒంటరిగా స్టేషన్కు... ఈ నెల 14న రాత్రి నగరవ్యాప్తంగా భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఎల్బీ నగర్–మియాపూర్ మార్గంలోని విక్టోరియా మెమోరియల్ (కొత్తపేట) స్టేషన్కు రాత్రి దాదాపు 10 గంటలకు ఓ గర్భిణి చేరుకుంది. తనను ఎలాగైనా మియాపూర్ మెట్రో స్టేషన్కు చేర్చాలని అధికారులను వేడుకుంది. మెట్రో సర్వీసులను పునరుద్ధరించినప్పటికీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే నడుపుతున్నారు. గర్భిణి విజ్ఞప్తి మేరకు మానవత్వంతో స్పందించిన మెట్రో సిబ్బంది... ఉన్నతాధికారుల అనుమతితో ఆ ఒక్క మహిళ కోసమే మెట్రోరైలును నడిపారు. ఎల్బీ నగర్ నుంచి రాత్రి 10 గంటలకు బయలుదేరిన రైలు... 10:40 గంటలకు మియాపూర్కు గర్భిణిని సురక్షితంగా చేర్చారు. శుక్రవారం మెట్రోరైలు భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్ఎంఆర్) ఎండీ ఎన్వీఎస్రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. అత్యవసర సమయాల్లో పౌరులను కాపాడేందుకు మెట్రో రైళ్లను నడపాలన్న నిబంధన ఉందన్నారు. ప్రస్తుతం నగరంలో వర్ష బీభత్సానికి రోడ్లు అధ్వానంగా మారిన నేపథ్యంలో మెట్రో రైళ్లలో గ్రేటర్ ప్రజలు సురక్షితంగా ప్రయాణించాలని ఆయన కోరారు. -
మెట్రో ప్రయాణీకులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్: పండగల సందర్భంగా ప్రయాణికులకు మెట్రో శుభవార్త అందించింది. చార్జీల్లో రాయితీ ప్రకటించింది. ఈ సందర్భంగా.. హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. అక్టోబర్ 17నుంచి 31 వరకు పలు ఆఫర్లు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ఆఫర్లు బతుకమ్మ నుంచి సంక్రాంతి వరకు ఈ ఆఫర్లు కొనసాగుతాయన్నారు. ఇక నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తిన నేపథ్యంలో.. వర్షాలకు సిటీలో చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బ తిన్నాయన్న ఆయన, ముసాపేట్ మెట్రో పిల్లర్కు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. రేపటి నుంచి ఈనెలాఖరు వరకు ఈ కింది రాయితీ వర్తింపు మెట్రో సువర్ణ ఆఫర్ కింద ప్రయాణాల్లో ఈ నెల 31 వరకు 40 శాతం రాయితీ స్మార్ట్ కార్డు ద్వారా 14 ట్రిప్పుల చార్జీతో ... 30 రోజుల్లో 20 ట్రిప్పులు తిరిగే అవకాశం 20 ట్రిప్పుల చార్జీతో... 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం 40 ట్రిప్పుల చార్జీతో... 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవకాశం టీ సవారీ మొబైల్ అప్లికేషన్ ద్వారా నవంబర్ 1 తేదీ నుంచి ఈ ఆఫర్ అమలు 7 ట్రిప్పులకు చార్జీ చెల్లిస్తే ... 30 రోజుల్లో 10 ట్రిప్పులు తిరిగే అవకాశం 14 ట్రిప్పులకు చార్జీ చెల్లిస్తే ... 30 రోజుల్లో 20 ట్రిప్పులు తిరిగే అవకాశం 20ట్రిప్పులకు చార్జీ చెల్లిస్తే ... 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం 30 ట్రిప్పులకు చార్జీ చెల్లిస్తే ... 45 రోజుల్లో45 ట్రిప్పులు తిరిగే అవకాశం 40 ట్రిప్పులకు చార్జీ చెల్లిస్తే ... 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవకాశం -
హైదరాబాద్ మెట్రో.. ఇవి తెలుసుకోండి
సాక్షి, హైదరాబాద్: జనతా కర్య్ఫూ నుంచి నిలిచిపోయిన మెట్రో సేవలు ఈ నెల ఏడు నుంచి అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్ వీ ఎస్ రెడ్డి ప్రయాణికులు పాటించాల్సిన మార్గదర్శకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మాట్లాడుతూ.. ‘అన్లాక్ 4కు అనుగుణంగా ఈ నెల 7 నుంచి మెట్రో సర్వీసులు పున: ప్రారంభిస్తున్నాం. అన్ని కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరి. మార్కింగ్కు తగ్గట్టుగా ప్రయాణీకులు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నిత్యం స్టేషన్ పరిసరాలను శానిటైజ్ చేస్తాం. నగదు రహిత లావాదేవీలు జరుపుతాం. ప్రయాణికులు ఆన్లైన్, స్మార్ట్ కార్డ్, క్యూ ఆర్ కోడ్ యూజ్ చేయాలి. ప్రతి 5 నిముషాలకు ఒక ట్రైన్ అందుబాటులో ఉంటుంది. రద్దీని బట్టి వేళల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఫేస్ మాస్క్ తప్పనిసరి. లేనివారు స్టేషన్లో కొనుక్కోవాలి. ప్రతి ప్రయాణీకుడిని థర్మల్ స్క్రీనింగ్ చేస్తాం. నార్మల్ టెంపరేచర్ ఉంటేనే అనుమతిస్తాం. హ్యాండ్ శానిటైజర్ నిత్యం అందుబాటులో ఉంటుంది’ అని తెలిపారు.(చదవండి: సిటీ బస్సులు లేనట్టేనా?) ఆయన మాట్లాడుతూ.. ‘ప్రయాణికులు మెటల్ ఐటమ్స్ లేకుండా మినిమం బ్యాగేజ్తో రావాలి. 75 శాతం ఫ్రెష్ ఎయిర్ ట్రైన్లో అందుబాటులో ఉంటుంది. అక్కడక్కడ టెర్మినల్స్ వద్ద ట్రైన్ డోర్లు కొద్దిసేపు తెరిచి ఉంచుతాము. ప్రతి స్టేషన్లో ఐసోలేషన్ రూంలు ఏర్పాటు చేస్తాం. మొదటి వారంలో రోజుకు 15 వేల మంది ప్రయాణీకులు వస్తారని అంచనా వేస్తున్నాం. ప్రతి స్టేషన్లో మెట్రో రైల్ 30-50 సెకన్లు ఆగుతుంది’ అని తెలిపారు. -
మెట్రో పయనం.. సులభతరం
బొల్లారం: నగరానికే తలమానికంగా నిలిచిన హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణం మరింత సులభతరం కానుంది. మెట్రో ఎక్కాలంటే ఇప్పటి వరకు టికెట్ కొనేందుకు కౌంటర్ల వద్ద క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చేది. కానీ మెట్రో ప్రారంభ దశలో ఈ కౌంటర్లలో టికెట్ కొనడం సులువుగానే ఉండేది. కొద్ది రోజులుగా ప్రయాణికులు పెరగడంతో.. టికెట్ కౌంటర్ల వద్ద ఒక్కొసారి క్యూలైన్లలో బారులుతీరే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మెట్రో అధికారులు ప్రయాణికులు టికెట్ కొనేందుకు సులువైన పద్ధతిని ఆవిష్కరించారు. దీంతో పేటీఎంతో ఇక క్యూఆర్– కోడ్ టికెట్ పద్ధతిని అమలు చేయనున్నట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం రసూల్పురాలోని మెట్రో భవన్లో పేటీఎం సంస్థ ప్రతినిధులతో కలిసి డిజిటల్ మెట్రో పేటీఎం క్యూఆర్– కోడ్ టికెట్ పద్ధతిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. సమయం వృథా కాకుండా పేటీఎంతో క్యూఆర్ కోడ్ పద్ధతి ద్వారా ప్రయాణించవచ్చని చెప్పారు. నగదు రహిత ప్రయాణానికి సులువైన మార్గంగా ఉండే పేటీఎం క్యూఆర్ కోడ్ పద్ధతిని అమల్లోకి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో అందరి చేతిలో మొబైల్స్ ఉండడం వల్ల ప్రయాణాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా సాగించవచ్చన్నారు. పేటీఎంకు సంబంధించిన యాప్లోకి వెళ్లి ఎక్కాల్సిన స్టేషన్, ప్రయాణంలో దిగాల్సిన స్టేషన్ పేర్లను నమోదు చేస్తే టికెట్ చార్జి కనిపిస్తుంది. పేమెంట్ పూర్తి కాగానే టికెట్ యాప్లో కనబడటంతోపాటు మొబైల్కు మెసేజ్ ద్వారా కన్ఫర్మేషన్ సమాచారం వస్తుంది. దీంతోపాటు స్టేషన్ ఎంట్రీలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మెట్రో ఎక్కిన తర్వాత గమ్యస్థానానికి సంబంధించిన ఎగ్జిట్ గేట్ ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ (ఏఎఫ్సీ) దగ్గర క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పేటీఎం వ్యాలెట్ నుంచి టికెట్ చార్జి కట్ అవుతుంది. వీటిని ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద ఉన్న స్కాన్ చేసి సులభంగా మెట్రోలో రాకపోకలు సాగించవచ్చు. పేటీఎం క్యూఆర్ కోడ్ స్కానింగ్తో మెట్రోలో ప్రయాణించే వీలుగా దీనిని నూతన విధానంతంఓ రూపొందించినట్లు పేటీఎం వైస్ ప్రెసిడెంట్ అభయ్ శర్మ అన్నారు. మెట్రో ప్రయాణికులు సౌకర్యవంతమైన పద్ధతిలో గమ్యస్థానాలకు చేరుకునే విధంగా పేటీఎం ముందు అడుగులు వేసిందన్నారు. అనంతరం మెట్రో ప్రయాణంలో పేటీఎం క్యూఆర్ కోడ్ పద్ధతి ఎలా పనిచేస్తుందో అనే దానిపై రసూల్పురా మెట్రో రైల్ స్టేషన్లో ఉన్న ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద స్కానింగ్ చేసి పలు అంశాలను వివరించారు. కార్యక్రమంలో ఎల్ అండ్ టీ ఎండీ కేవీబీ రెడ్డి, మెట్రో అధికారులతో పాటు పేటీఎం సంస్థ ప్రతినిధులు అంకిత్ చౌదరి, అనిల్తో సహా పలువురు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉపయోగించుకోవడం ఎలా..? ♦ పేటీఎం యాప్లో ‘మెట్రో’ ఐకాన్పై క్లిక్ చేయాలి ♦ మీ నగరాన్ని ఎంచుకోవాలి. రూట్ సెర్చ్పై క్లిక్ చేయాలి ♦ గమ్య స్థానాన్ని ఎంచుకోవాలి. రూట్స్ చూడడానికి సెర్చ్ బటన్పై క్లిక్ చేయాలి. ♦ రూట్ను సూచిస్తుంది. ఎంపిక చేసుకున్న స్టేషన్స్ మధ్య ప్రయాణ సమయాన్ని కూడా చూపిస్తుంది. -
మరో మూడు మార్గాల్లో మెట్రో దౌడ్
సాక్షి, హైదరాబాద్/రాంగోపాల్పేట్: మెట్రో రెండో దశలో భాగంగా మరో 3 మార్గాల్లో మెట్రో ప్రాజెక్టు చేపట్టేందుకు డీపీఆర్ సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించామని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే ఈ పనులు ప్రారంభిస్తామన్నారు. మంగళవారం రసూల్పురాలోని మెట్రో భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. రాయదుర్గ్– శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు వయా నానక్రాంగూడ రూట్లో 31 కి.మీ.లు, మియాపూర్–బీహెచ్ఈఎల్కు అక్క డి నుంచి వయా హఫీజ్పేట్, కొండాపూర్, గచ్చిబోలి, ఓల్డ్ ముంబై హైవే, రేతిబౌలి, మెహదీపట్నం, మాసబ్ట్యాంక్ మీదుగా లక్డీకాపూల్ కారి డార్ 1కు మరో 26 కి.మీ., నాగోల్– ఎల్బీనగర్ వరకు 5 కి.మీ. దూరం మేర రెండోదశ ప్రాజెక్టు చేపడతామన్నారు. మొత్తం ఫేజ్– 2లో 62 కి.మీ. మెట్రో రైల్ మార్గం నిర్మించేందుకు డీపీఆర్ తయా రు చేసినట్లు చెప్పారు. నగరంలోని చాలా ప్రాంతాలవాసులు మెట్రో రైల్ విస్తరణ గురించి విజ్ఞప్తులు చేస్తున్నారని చెప్పారు. ఇందులో ఎల్బీనగర్– హయత్నగర్, తార్నాక– మెట్టుగూడ– ఈసీఐఎల్–మల్కాజ్గిరి, ప్యారడైజ్– మేడ్చల్ వరకు విస్తరించాలనే విజ్ఞప్తులు వస్తున్నాయని అన్నారు. ఫేజ్–1లో ప్రతి కిలోమీటర్ మెట్రో ఏర్పాటుకు రూ.230 కోట్లు ఖర్చు కాగా ఫేజ్–2లో రూ.300 కోట్ల వరకు ఖర్చు అవుతుందని స్పష్టం చేశారు. ఫేజ్– 1లో ఎంజీబీఎస్–ఫలక్నుమా రూట్లో (5 కి.మీ.) మార్గంలో మెట్రో నిర్మించాల్సి ఉందన్నారు. రోడ్డు విస్తరణకు కొన్ని చోట్ల కొన్ని మతాలకు సంబంధించిన భవనాలు, సమస్యాత్మక స్థలాలు అడ్డుగా ఉన్నాయన్నారు. మెట్రో స్పీడ్ పెంచాలని తాము రైల్వే సేఫ్టీ కమిషనర్ను కోరామని అన్ని రకాల పరీక్షలు పూర్తయ్యాయని త్వరలోనే స్పీడ్ పెరుగుతుందని తద్వారా ప్రీక్వెన్సీ కూడా పెంచుతామన్నారు. రోజుకు వెయ్యి ట్రిప్పులు... ప్రస్తుతం 55 రైళ్లను నడుపుతున్నామని, మరో రెండు రైళ్లను పరీక్షిస్తున్నామని 10 రోజుల్లో వాటిని కూడా అందుబాటులోకి తీసుకుని వస్తామని వివరించారు. గతంలో రోజూ 700 నుంచి 800 ట్రిప్పులు తిప్పే వారమని ప్రస్తుతం అది వెయ్యి ట్రిప్పులకు పెరిగిందన్నారు. ప్రతి రోజు నాలుగు లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తున్నారని అన్నారు. కారిడార్–1 నుంచి, కారిడార్–3 నుంచి అమీర్పేట్కు ఎక్కువగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండటంతో రాయ్దుర్గ్ రూట్లో సమస్య వస్తుందని అన్నారు. మెట్టుగూడ నుంచి రాయ్దుర్గ్ కొన్ని రైళ్లను, అమీర్పేట్ నుంచి రాయ్దుర్గ్కు అదనపు రైళ్లను తిప్పుతున్నామని వివరించారు. మెట్రోకు అధికంగా భూములిచ్చారని కొందరు ఆరోపణలు చేస్తున్నారని.. కానీ, 3 మెట్రో డిపోలకు 212 ఎకరాలు, మరో 57 ఎకరాలు స్టేషన్ల కోసం మొత్తం 269 ఎకరాలు మాత్రమే ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. మియాపూర్ డిపో వద్ద ఇచ్చిన 100 ఎకరాల్లో డిపోకు 70 ఎకరాలు 30 ఎకరాలు వాణిజ్య సముదాయాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ప్రతి కిలోమీటరు మెట్రో ఏర్పాటుకు ఢిల్లీలో 6 ఎకరాలు, నాగ్పూర్లో 7 ఎకరాలు, చెన్నైలో 4 ఎకరాలు ప్రభుత్వం కేటాయించిందని.. హైదరాబాద్ మెట్రోకు కి.మీ.కు 4 ఎకరాలు మాత్రమే కేటాయించారన్నారు. మెట్రో ఏర్పాటుకు ఎల్అండ్టీ తీసుకున్న రుణానికి వాణిజ్య బ్యాంకులకు ఏటా 11 శాతం వడ్డీ చెల్లిస్తున్నారని చెప్పారు. ప్రతి ఏడాది రూ.1,300 కోట్లు వడ్డీ చెల్లించాల్సి వస్తుందన్నారు. మెట్రోకు రోజుకు రూ.కోటి.. ఏటా రూ.480 కోట్ల ఆదాయం లభిస్తుం దన్నారు. ఇందులో రూ.365 కోట్లు చార్జీలు మిగతాది మెట్రో మాల్స్ ద్వారా లభిస్తోందన్నారు. తిరుపతి మెట్రో కోసం ప్రాథమికంగా పరిశీలించాం.. తిరుమల తిరుపతి మెట్రో రైల్ కోసం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరిక మేరకు మూడు రోజుల పాటు ప్రాథమికంగా పరిశీలన మాత్రమే చేశామని ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుమల మార్గంలో అత్యధిక మలుపుతో ఉన్న ఘాట్రోడ్డు ఉందని, అలాగే అటవీ ప్రాంతం, వన్యప్రాణుల అభయారణ్యం ఉండటంతో అన్నీ పరిశీలించాల్సి ఉంటుందన్నారు. గతంలో రోప్వే నిర్మాణానికి ఆగమశాస్త్రం ఒప్పుకోలేదని, దీన్ని కూడా పరిశీలించాల్సి ఉందన్నారు. శాస్త్రాలను, కాంటూర్స్ను అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. అవన్నీ చూశాక ఒక పరిష్కార మార్గం కనుగొనాలని అన్నారు. -
5 సంవత్సరాలు అవుతే కానీ మెట్రో లాభాల్లోకి రాదు
-
తిరుపతిలో లైట్ మెట్రో రవాణా బెటర్!
సాక్షి, తిరుపతి : తిరుపతి నుంచి తిరుమల మార్గంలో రద్దీ తగ్గించడానికి లైట్ మెట్రో వాహన విధానం బావుంటుందని హైద్రాబాద్ మెట్రో రైల్వే ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం శ్రీ పద్మావతీ అతిథి గృహంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతి, తిరుమలలో ట్రాఫిక్ ను తగ్గించేందుకు చేపట్టాల్సిన అంశాల గురించి చర్చించారు. తిరుపతి రైల్వే స్టేషన్, బస్టాండ్ నుంచి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా రవాణా మెరుగు పరిచేందుకు తీసుకోవాల్సిన అంశాలు, అలాగే రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతి వరకు సుందరీకరణ గురించి చర్చించారు. భవిష్యత్తులో తిరుపతి, తిరుమలను అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక దివ్యకేంద్రాలుగా తీర్చిదిద్దడానికి టీటీడీ అధికారులతో కలిసి పూర్తిస్థాయి నివేదిక తయారు చేయాలని సుబ్బారెడ్డి సూచించారు. -
ఆర్టీసీ సమ్మె: సోషల్ మీడియా పోస్టులతో ఆందోళన వద్దు
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ సమ్మె ప్రభావంతో మెట్రో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ఎల్బీనగర్–మియాపూర్, నాగోల్–హైటెక్సిటీ మార్గాల్లో ఆదివారం 3.50 లక్షల మంది రాకపోకలు సాగించినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. సాధారణ రోజుల్లో రద్దీ 3 లక్షలుండగా, నిత్యం 50 వేల మంది అధికంగా ప్రయాణం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రయాణికుల డిమాండ్కు అనుగుణంగా ప్రతి 3–5 నిమిషాలకో రైలు నడిపినట్లు చెప్పారు. ప్రయాణికుల రద్దీతో ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, ఎంజీబీఎస్, అమీర్పేట్, కూకట్పల్లి, మియాపూర్ స్టేషన్లు కిటకిటలాడాయి. ఆయా స్టేషన్ల ఆవరణలో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాల్లోనూ స్థలం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అమీర్పేట్ స్టేషన్లో ప్రయాణికుల రద్దీ ఇక నాగోల్–హైటెక్సిటీ రూట్లో నాగోలు, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, బేగంపేట్, మాదాపూర్, హైటెక్సిటీ స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. రద్దీ పెరగడంతో హెచ్ఎంఆర్ అధికారులు అప్రమత్తమయ్యారు. స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు, సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత మరింత పెంచినట్లు తెలిపారు. సోమవారం సుమారు 4లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు. రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మెట్రో రైళ్లు, స్టేషన్ల భద్రతపై కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులతో ప్రయాణికులు ఆందోళన చెందవద్దన్నారు. నగరంలోని మెట్రో రైళ్లు, స్టేషన్లు అత్యంత సురక్షితమైనవని ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. స్టేషన్లు, రైళ్లలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ‘స్వచ్ఛ నగరం.. విశ్వనగరం’ దిశగా మెట్రో అడుగులు వేస్తున్నామన్నారు. -
హైదరాబాద్ మెట్రోరైల్: డేంజర్ బెల్స్
-
హైదరాబాద్ మెట్రోరైల్: డేంజర్ బెల్స్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోరైల్ బాలరిష్టాలు ఎందుకు దాటడం లేదు ? ఎల్ అండ్ టీ లాంటి పెద్ద సంస్థలో సైతం నిర్వాహణ లోపాలు పదేపదే ఎందుకు తలెత్తుతున్నాయి ? ఊడుతున్న పెచ్చులు, టెక్నికల్ సమస్యలతో మెట్రో ఎందుకు మొరాయిస్తోంది? మెట్రోరైల్లో పరిస్థితులు మారవా? రెండు సంవత్సరాలు కూడా కాలేదు. ట్రాఫిక్ జామ్ల నుంచి ప్రజల్ని కాపాడుతుందని ఏర్పాటుచేసిన మెట్రోరైల్లో తరుచూ సమస్యలు తలెత్తుతున్నాయి. మొన్నటికి మొన్న అమీర్పేట స్టేషన్లో పెచ్చులూడిపడటంతో ఓ మహిళ ప్రాణాల్ని కోల్పోయింది. దీనికి కారణం పర్యవేక్షణ లోపమేనని అధికారులు తేల్చిన పరిస్ధితి. మెట్రో స్టేషన్ల కింద నిలుచున్న ప్రయాణీకుల ప్రాణాలు గాలిలో కలిసే స్ధాయికి మెట్రో నిర్మాణంలో లోపాలు వచ్చాయంటే ఇది ఎవరి తప్పు అనేది ఒకసారి ఆలోచించాలి. ఎల్ అండ్ టీ లాంటి పెద్ద నిర్మాణ రంగ సంస్థ నిర్మిస్తున్న మెట్రోరైల్లో ఇన్ని లోపాలున్నాయా? అని ప్రయాణీకులు విస్మయపోయే పరిస్ధితి. సాంకేతిక లోపం.. ప్రయాణికులకు అష్టకష్టాలు ప్యారడైజ్ సర్కిల్ ప్రాంతంలో మెట్రోరైల్లో ఎలక్ట్రికల్ లోపాల కారణంగా మెట్రోరైల్ ఆగిపోయింది. కనీసం అక్కడికి వెళ్లి మరమత్తులు చేద్దామని టెక్నికల్ టీమ్ అనుకున్నాకూడా మెట్రోరైల్లో లోపాన్ని సరిచేయలేకపోయారు. దీంతో మరో ట్రైన్ను తెప్పించి దాన్ని అమీర్ పేట్ జంక్షన్కు తీసుకువెళ్ళిన పరిస్ధితి. దీంతో దాదాపు గంటపాటు ప్రయాణీకులు అష్టకష్టాలు పడ్డారు. వర్షాలు పడితే చాలు కింద రోడ్లమీద ఎలాగు ప్రయాణించలేం.. కనీసం మెట్రోరైల్లోనైనా ప్రయాణించాలనుకుంటే వర్షాలకు ఫ్లెక్సీలు మెట్రో ట్రాక్పై పడటంతో మెట్రోట్రైన్లు ఆగిపోతున్నాయి. అసెంబ్లీ ప్రాంతంలో లెథనింగ్ అరెస్టర్ రాడ్ ట్రాక్పై ఫ్లెక్సీలు పడటంతో ట్రైన్ను సడెన్గా ఆపివేసిన పరిస్థితి తలెత్తింది. సరిగ్గా ట్రాక్ పైన సేఫ్టీ చెకింగ్లు చేసి ఉంటే ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదనే వాదనలు అప్పట్లో వినపడ్డాయి. అంతేకాదు చాలాసార్లు మెట్రోరైల్ సడెన్ బ్రేక్లతో ప్రయాణీకులకు దెబ్బలుతగిలి గాయలపాలు అయ్యారు. ఇక, వాహనాల పార్కింగ్కు స్ధలాలు లేవు. పైగా ప్రజలకు ఉచితంగా ఇవ్వాల్సిన పార్కింగ్ స్థలాలను సైతం ప్రైవేటువారికి కట్టబెట్టి ఛార్జీల మోత మోగిస్తున్నారు. ఇక మెట్రోస్టేషన్లో ప్రయాణీకుల కనీస అవసరాలు తీర్చేందుకు కావాల్సిన టాయిలెట్స్ కానరావు. హైటెక్ హంగులతో నిర్మించిన మెట్రోరైల్లో మంచి నీళ్ళు ఉండవు. వాటర్ బాటిల్స్ కొనుకున్నా వాటిని మెట్రోట్రైన్లో అనుమతించరు. తాగుబోతు వీరంగం తమకు సేఫ్టీ ముఖ్యమంటూ హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఎంత చెపుతున్నా అందుకు తగ్గ ఏర్పాట్లు మెట్రోరైల్లో పెద్దగా కనపించవు. దీంతో తాగుబోతులు ఎంచక్కా మెట్రోరైల్ ఎక్కి తోటి ప్రయాణీకుల్ని ఇబ్బందుల పాలు చేస్తున్న సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే ఒక ప్రయాణీకుడు బాగా తాగేసి ట్రైన్లోకి వచ్చి హల్చల్ చేశాడు. ఇది కూడా నిర్లక్ష్యానికి నిదర్శనంగానే చెప్పవచ్చు. పైగా మెట్రోరైల్ ఏర్పాటు చేసింది సాధారణ ప్రయాణీకులకు కానీ ఇక్కడ ఆర్టీసీ బస్ బేలుండవు. ఊబర్, ఓలా లాంటి కంపెనీల కార్లకు మాత్రం స్వయంగా హెచ్ఎంఆర్ఎల్ పార్కింగ్ సదుపాయాల్ని కల్పించి ఇస్తుంది. దీనిపై మెట్రో అధికారులపైన విమర్శలు కూడా వస్తున్నాయి. మెట్రోస్టేషన్ల నిర్మాణంలో సైతం లోపాలున్నాయని చాలామంది ఆరోపిస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే ఉప్పల్ స్టేషన్కు సంబంధించిన మెట్రోస్టేషన్కు పగుళ్లు ఏర్పడ్డాయి. వర్షం కురియడంతో నీరు లోపలికి వచ్చి చేరింది. దీంతో అప్రమత్తమైన మెట్రో అధికారులు దానికి కాస్త మెరుగులు దిద్ది.. రంగులు వేసి కప్పిపెట్టారు. తొందరపాటు నిర్ణయాలు.. పర్యవేక్షణాలోపం అనుకున్న టార్గెట్ పూర్తి కావటానికి అనుకున్న టైం కంటే ముందుగా ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఎల్ అండ్ టీ తీసుకుంటున్న కొన్ని తొందరపాటు నిర్ణయాలు మెట్రో సేఫ్టీని ప్రశ్నార్థకంగా చేస్తున్నాయి. పైన ట్రాక్ నుంచి కింద పిల్లర్ల వరకు చెక్ చేయాల్సిన ఇంజనీర్లు లేకపోవడమే ప్రమాదాలకు కారణంగా కనపడుతోంది. అమీర్పేట్ మెట్రోస్టేషన్ బయట జరిగిన ప్రమాదమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇండియన్ రైల్వేలో ప్రతి 50 కిలోమీటర్ల ట్రాక్ చేయడానికి ఒక సీనియర్ ఇంజనీర్తోపాటు 200 మంది గ్యాంగ్మెన్స్ ఉంటారు. కానీ, హైదరాబాద్ మెట్రోరైల్లో మాత్రం ఆ పరిస్ధితి లేదు. రెండు పిల్లర్ల మధ్య కట్టే గోడలలో కూడా నాణ్యత లోపించింది. పనులు త్వరగా పూర్తి కావాలనే నెపంతో క్వాలిటీ లేకుండానే కట్టిపడేసి పనిపూర్తయ్యిందనిపించారని, పనులు జరుగుతున్నా సరే కొన్నిచోట్ల ట్రాఫిక్కు అనుమతి ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. పైన మెట్రో వర్క్ జరుగుతున్నప్పుడు సేఫ్టీ నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. పర్యావేక్షణ లోపమే కొట్టొచ్చినట్టు కనపడుతోంది. ఇకనైనా ప్రైవేటు కంపెనీలకు పట్టం కట్టడం మానేసి ప్రయాణీకుల్ని ఎంతమందిని ఎక్కించాం అని సొంత డబ్బలు కొట్టుకోకుండా.. వారిని ఎంత జాగ్రత్తగా గమ్యానికి చేర్చామనే దానిపైనే హైదరాబాద్ మెట్రోరైల్ అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. -రాజ్కుమార్, బిజినెస్ స్పెషల్ కరస్పాండెంట్, సాక్షిన్యూస్ -
సాంకేతిక కారణాలతో నిలిచిన మెట్రో రైలు
సాక్షి, హైదరాబాద్: కాటెనరీ ఓహెచ్ఈ పార్టింగ్ కారణంగా శనివారం మూసాపేట్–మియాపూర్ మధ్య మెట్రో సేవలకు అంతరాయం కలిగినట్లు మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. ఉదయం 9.57 నుంచి 11.40 గంటల వరకు మెట్రో రైళ్లు నిలిచిపోయినట్లు పేర్కొన్నా రు. ఉదయం 11.40కి సింగిల్ లైన్ పనిచేసేలా చర్యలు తీసుకోవడంతో పాటు, సర్వీసులను మూసాపేట్ నుంచి మియాపూర్ మార్గంలో డీగ్రేడెడ్ పద్ధతిలో పునరుద్ధరించారు. సాంకేతిక లోపాలను సరిదిద్దేందుకు కాటెనరీ మెయింటెనెన్స్ వెహికల్ (సీఎంవీ)తో పాటు, మెయింటెనెన్స్ బృందం సత్వరమే స్పందించి చర్యలు చేపట్టింది. దీంతో మధ్యాహ్నం 1.20కి మెట్రో రైలు సర్వీసులను యధావిధిగా పునరుద్ధరించారు. మెట్రో రైళ్ల రాకపోకల అంతరాయం వల్ల ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, సాంకేతికంగా తలెత్తిన సమస్యలపై అధ్యయనం చేస్తున్నామని ఎన్వీఎస్ రెడ్డి ఓ ప్రకటనలో తెలియజేశారు. -
వచ్చె ఏడాది హైదరాబాద్ మోట్రోరైల్ పూర్తి
-
మెట్రో స్టేషన్లలో ‘సాక్షి’
-
మెట్రో స్టేషన్లలో ‘సాక్షి’
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని మెట్రో స్టేషన్లలో ప్రయాణికులకు ప్రతినిత్యం సాక్షి దినపత్రిక అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఉన్న 24 మెట్రో కేంద్రాలలో ప్రయాణికుల కోసం ఇకనుంచి ప్రతిరోజూ సాక్షి దినపత్రిక అందుబాటులో ఉంచే కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం మొదలైంది. అమీర్పేట మెట్రో స్టేషన్లో ఏర్పాటుచేసిన తొలి "సాక్షి స్టాల్"ను ఆయన ప్రారంభించారు. బుధవారం నుంచి అన్ని మెట్రో కేంద్రాల్లో సాక్షి దినపత్రిక ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. అందుకోసం మెట్రో స్టేషన్లలోని ఫ్లాట్ఫామ్స్కు ఇరువైపుల సాక్షి స్టాల్స్ ఏర్పాటుచేశారు. ప్రతిరోజూ మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్న వేలాదిమందికి సాక్షి దినపత్రికను అందుబాటులో తేవడం శుభపరిణామమని ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి అభినందించారు. అమీర్పేట మెట్రో స్టేషన్లో ప్రారంభమైన తొలి స్టాల్ నుంచి సాక్షి అడ్వర్టయిజింగ్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ కేఆర్పీ రెడ్డి చేతుల మీదుగా ‘సాక్షి’ ప్రతిని అందుకుని ఈ సరికొత్త ప్రయోగానికి ఎన్వీఎస్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె రామచంద్రమూర్తి, డైరెక్టర్ కార్పొరేట్ అఫేర్స్ రాణిరెడ్డి, ఫైనాన్స్ డైరెక్టర్ వై ఈశ్వరప్రసాద రెడ్డి, అడ్వర్టయిజింగ్ అండ్ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ కమల్ కిషోర్ రెడ్డి, ఎల్ అండ్ టీ ప్రతినిధి సారికా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మెట్రోరైల్ రెండో ఫేజ్కు అంతా సిద్ధం
-
మెట్రో జర్నీ రికార్డు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వాసుల కలల మెట్రో రైలులో ప్రయాణించే వారి సంఖ్య లక్షణంగా ‘లక్ష’దాటింది. ఈ నెల 16న నాగోల్–అమీర్పేట్–మియాపూర్ మార్గంలో ప్రయాణించిన వారి సంఖ్య 1.07 లక్షలుగా ఉందని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి శుక్రవారం తెలిపారు. రోజురోజుకూ మెట్రో ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందని..మెట్రో రూట్లలో క్రమంగా వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గుముఖం పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ మొదటివారంలో ఎల్బీనగర్–అమీర్పేట్ మార్గంలో మెట్రో ప్రారంభం కానుండటంతో ఈ మార్గంలో నిత్యం 2.5 లక్షల మంది మెట్రో జర్నీ చేసే అవకాశం ఉందని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మార్గానికి సంబంధించి త్వరలో కమిషనర్ ఆఫ్ రైల్వేసేఫ్టీ నుంచి భద్రతా ధ్రువీకరణ పత్రం అందనుందని తెలిపారు. -
గవర్నర్.. మెట్రో జర్నీ
సాక్షి, హైదరాబాద్: మెట్రోరైలులో సాధారణ ప్రయాణికుడిలా జర్నీ చేసి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆదర్శంగా నిలిచారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా, ప్రొటోకాల్, భద్రతా ఏర్పాట్లు లేకుండా ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు సతీసమేతంగా నగర మెట్రో రైలులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. బేగంపేట్ మెట్రో స్టేషన్కు సాధారణ ప్రయాణికుడిలా భార్యతో కలసి వచ్చిన ఆయన అమీర్పేట్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. అమీర్పేట్ మెట్రో స్టేషన్లో దిగి మరో రైలులో మియాపూర్ వరకు(కారిడార్–1) వెళ్లారు. ఆయన రాకను గుర్తించిన మెట్రో అధికారులు హైదరాబాద్ మెట్రో రైలు(హెచ్ఎంఆర్) ప్రాజెక్టు ఎండీ ఎన్వీఎస్రెడ్డికి సమాచారమిచ్చారు. ఆయన వెంటనే మియాపూర్ మెట్రోస్టేషన్కు పరుగున వచ్చి గవర్నర్ దంపతులకు సాదర స్వాగతం పలికారు. మెట్రో స్టేషన్లో ప్రయాణికులకు కల్పించిన వసతులను చూపారు. తన పర్యటన సందర్భంగా సాధారణ ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించవద్దని గవర్నర్ ఆదేశించడం గమనార్హం. మియాపూర్ మెట్రోస్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన ఆర్ట్ సెంటర్, ఇనాగరల్ ప్లాజా, వాటర్లెస్ యూరినల్స్, ప్రజోపయోగ స్థలాలను గవర్నర్ దంపతులు పరిశీలించారు. స్టేషన్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన ప్రజోపయోగ స్థలాలు, అభివృద్ధి పనులను చూసి ముగ్ధులైన గవర్నర్ దంపతులు హైదరాబాద్కు మెట్రో ప్రాజెక్టు ఓ మణిహారం అని, జీవించేందుకు అత్యంత అనువైన నగరమే కాదు, పీపుల్ ఫ్రెండ్లీ సిటీకి హైదరాబాద్ నిదర్శనంగా నిలుస్తోందని కొనియాడారు. మాస్కో తరహాలో మెట్రో స్టేషన్లను ఆర్ట్ మ్యూజియంలుగా తీర్చిదిద్దాలని ఎన్వీఎస్రెడ్డికి సూచించారు. -
మెట్రో జర్నీ.. మేడ్ ఈజీ!
సనత్నగర్: అమీర్పేట్–ఎల్బీనగర్ రూట్లో ఆగస్టులో మెట్రో రైళ్లు పరుగులు తీస్తాయని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో ప్రయాణికులకు లాస్ట్మైల్ కనెక్టివిటీ వరకు సౌకర్యవంతమైన ప్రయాణం సాకారం చేసేందుకు మెట్రోస్టేషన్ల వద్ద ద్విచక్ర వాహనాలతో పాటు కార్లను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. మెట్రో స్టేషన్ల వద్ద నూతనంగా ప్రవేశపెట్టిన ‘డ్రైవ్ జీ’ యాక్టివా వాహనాలను గురువారం ఆయన బేగంపేట తాజ్వివంతా హోటల్ వేదికగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్రెడ్డి మాట్లాడుతూ.. ఏ నగరానికైనా ప్రజా రవాణా ముఖ్యమని, నగరాలను కార్ల కోసం అభివృద్ధి చేయడం కాదని, ప్రజల కోసం, వారి అవసరాల కోసమేనని స్పష్టం చేశారు. గ్రేటర్లో హైదరాబాద్ మెట్రో రైల్ తరుఫున అన్ని హంగులతో కూడిన ప్రజారవాణా వ్యవస్థను తీర్చిదిద్దేదిశగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే పెడల్, జూమ్కార్ సంస్థలతో కలిసి మియాపూర్, కేపీహెచ్బీ, కూకట్పల్లి, బేగంపేట, నాగోలు, పరేడ్గ్రౌండ్ మెట్రోస్టేషన్లలో ద్విచక్రవాహనాలు, కార్లను అద్దె ప్రాతిపదికన అందజేసే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మరో ఐదు స్టేషన్లలో ‘డ్రైవ్జీ’ యాక్టివా వాహనాలను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఫస్ట్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ అందించే దిశగా డ్రైవ్జీ వాహనాలను ప్రారంభించినట్లు వివరించారు. 125 డ్రైవ్ జీ యాక్టివా వాహనాలు షురూ... మొదటి విడతగా 125 డ్రైవ్జీ వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ వాహనాలను బాలానగర్, కూకట్పల్లి, ప్రకాష్నగర్, తార్నాక, మెట్టుగూడ మెట్రోస్టేషన్లలో అందుబాటులో ఉంచారు. డబ్లు్యడబ్లు్యడబ్లు్య.డ్రైవ్జీ.కామ్ వెబ్సైట్ ద్వారా వాహనాన్ని బుక్ చేసుకుని ఆయా స్టేషన్ల వద్ద వీటిని పికప్ చేసుకోవచ్చు. అయితే ముందుగా మీ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు పాన్కార్డును కూడా ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కిలోమీటర్కు రూ.3... డ్రైవ్జీ వాహనాలను అద్దెకు తీసుకునే వారి నుంచి కిలోమీటరుకు రూ.3 ఛార్జీగా వసూలు చేస్తారు. కనీస దూరం ఐదు కిలోమీటర్లుగా పరిగణించి రూ.15 వసూలు చేయాలని నిర్ణయించారు. నెలవారీగా అద్దెకు తీసుకోవాలంటే రూ.2,700 చెల్లించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో వినియోగదారుల సంఖ్యను బట్టి ఈ ధర మారుతుందన్నారు. త్వరలో ఏడు రోజులు, 15 రోజుల చొప్పున పాస్లు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మల్టీలెవల్ పార్కింగ్కు ప్రతిపాదనలు... ప్రకాష్నగర్ స్టేషన్ మినహాయించి అన్ని మెట్రోస్టేషన్లలోనూ పార్కింగ్కు ఏర్పాట్లు చేసినట్లు ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. రద్దీగా ఉండే మెట్రో స్టేషన్లకు సమీపంలో మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాలకు ప్రతిపాదనలు సిద్ధంచేశామన్నాన్నారు. ఎంజీబీఎస్ వద్ద స్కైవాక్లు... ఎంజీబీఎస్కు అనుసంధానం చేసేలా రెండు వైపులా స్కైవాక్ల నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా మెట్రో స్టేషన్ల నుంచి నేరుగా ఎంజీబీఎస్లోకి వెళ్లేందుకు సౌలభ్యంగా ఉంటుందని చెప్పారు. త్వరలోనే ఈ పనులను పూర్తి చేయనున్నట్లు ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. -
మెట్రో కార్ ఆగయా!
మియాపూర్: సిటీ రూపురేఖలను సమూలంగా మార్చేసిన మెట్రో రైల్.. మరో ముందడుగు వేసింది. ఆయా స్టేషన్లలో దిగిన ప్రయాణికులు చివరి గమ్యస్థానం చేరేందుకు ఎలక్ట్రికల్ కార్లను ప్రవేశపెట్టింది. వీటిని స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లే సౌకర్యం సైతం కల్పించింది. మహేంద్ర తయారు చేసిన ‘ఈ2ఓ ప్లస్’ ఎలక్ట్రిక్ కారును శుక్రవారం మియాపూర్ మెట్రో స్టేషన్లో హైదరా బాద్ మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. మెట్రో ప్రయాణికులకు సెల్ఫ్ డ్రైవ్ సౌకర్యంతో పాటు.. గ్రేటర్లో వాయు కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించేందుకు ఈ ఎలక్ట్రిక్ కార్లు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అన్నారు. గ్రేటర్ సిటీజన్లుడీజిల్, పెట్రోల్ వాడకాన్ని తగ్గించి ఎలక్ట్రికల్ కార్లను వినియోగించాలని సూచించారు. భవిష్యత్లో నగరంలో మూడు కారిడార్లలోని 65 మెట్రో స్టేషన్ల వద్ద దశలవారీగా ఎలక్ట్రికల్ కార్లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, మెట్రో జర్నీ చేసే పప్రయాణికులు తక్కువ ఖర్చుతో గమ్యస్థానానికి చేరుకోవచ్చన్నారు. ప్రస్తుతం మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద 25 ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి తెచ్చామన్నారు. అందుబాటులోకి ‘బయో టాయిలెట్స్’.. మియాపూర్ మెట్రోస్టేషన్ వద్ద నేచర్ సని ఆర్గనైజేషన్ సంస్థ ఏర్పాటు చేసిన బయో టాయిలెట్లను హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఈ మరుగుదొడ్లలో నీరు అవసరం లేకుండానే పరిశుభ్రంగా ఉంటాయన్నారు. వీటి ఏర్పాటులో వినియోగించే సాంకేతిక పరిజ్ఞానంతో మూత్రాన్ని శుద్ధిచేసి.. ఆనీటిని మొక్కల పెంపకానికి వినియోగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ డీవీఎస్ రాజు, అనిల్కుమార్ షైనీ, జూమ్ కార్ సీఈఓ సురేందర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ కార్లు వినియోగించండిలా.. ఎలక్ట్రికల్ కారును వినియోగించాలనుకునే ప్రయాణికులు మొదటగా ‘జూమ్ యాప్’లో అందులో డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు ఖాతా వివరాలను ఆప్లోడ్ చేయాలి. అనంతరం యాప్ ద్వారా కారు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మెట్రో స్టేషన్ల సమీపంలో ఉండే ఈ కారు వద్దకు వెళ్లి కారు డోరుకు ఉన్న బటన్ ప్రెస్ చేస్తే డోర్ తెరుచుకుంటుంది. కారులో ఉన్న తాళం చెవితో స్టార్ట్ చేసుకొని డ్రైవ్ చేసుకుంటూ గమ్యస్థానానికి వెళ్లవచ్చు. గమ్యానికి చేరుకున్న తరువాత కారు కీని అందులోనే ఉంచి మరల డోర్కు ఉన్న బటన్ ప్రెస్ చేస్తే కారు లాక్ అయిపోతుంది. ఎలక్ట్రిక్ కార్ల అద్దె ఇలా.. ఈ కారుకు అటోమెటిక్ గేర్, సెల్ఫ్ డ్రైవింగ్ సౌకర్యం ఉంటుంది. గంటకు రూ.40 చొప్పున అద్దెగా నిర్ణయించారు. లేదా నెలకు రూ.10 వేలు చెల్లించి కారును వినియోగించుకోవచ్చు. ఇలా కాకుండా ప్రతీ కిలోమీటరుకు అద్దె చెల్లిస్తూ వాడినట్లయితే ప్రతి కి.మీ.కి రూ.8.50 చార్జీ చెల్లించాలి. నెల వారీగా అద్దెకు తీసుకునే వారు ఇంట్లో కూడా చార్జింగ్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. 8 గంటలు చార్జింగ్ చేస్తే 120 కిలో మీటర్లు ప్రయాణించవచ్చు. మెట్రో స్టేషన్లో ఏర్పాటు చేసిన ‘స్పీడ్ చార్జర్’తో 90 నిమిషాల్లో 90 శాతం చార్జింగ్ పూర్తవడం ఈ కారు ప్రత్యేకత. శంషాబాద్ ఎయిర్పోర్ట్, గచ్చిబౌలి, మాదాపూర్, జీవీకే మాల్, పరేడ్ గ్రౌండ్, కొత్తపేట్, మియాపూర్ ప్రాంతాల్లో ఈ ఎలక్ట్రిక్ కారు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జూమ్కార్స్ నిర్వాహకులు తెలిపారు. -
మహిళల కోసం ప్రత్యేకంగా మెట్రో స్టేషన్ ఏర్పాటు
-
మహిళల కోసం ప్రత్యేక మెట్రో స్టేషన్
సాక్షి, హైదరాబాద్: మహిళల కోసం ప్రత్యేకంగా మెట్రో స్టేషన్ ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళల కోసం ప్రత్యేకంగా తరుణి పేరిట మధురానగర్ స్టేషన్ను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అదే విధంగా మహిళల కోసం ఓ కోచ్లో కొంత భాగాన్ని కేటాయించామన్నారు. డిమాండ్ను బట్టి పూర్తి కోచ్ను కేటాయిస్తామని చెప్పారు. మెట్రో రైలు కేవలం రవాణా సాధనంగానే కాకుండా నగరాభివృద్ధిలో భాగస్వామ్యంగా మారుతుందని తెలిపారు. మెట్రో స్టేషన్లలో భద్రతను దృష్టిలో ఉంచుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. జులైలో ఎల్బీనగర్ - అమీర్పేట్, అక్టోబర్లో అమీర్పేట్ - హైటెక్ సిటీ లైన్ను పూర్తి చేస్తామన్నారు. 2019లో ఎంజీబీఎస్- జేబీఎస్ లైన్లు అందుబాటులోకి వస్తుందన్నారు. రెండో ఫేజ్లో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో మెట్రోను శంషాబాద్ వరకు నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. -
ఎల్బీనగర్ - అమీర్పేట్ మెట్రోలైన్ ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్ - అమీర్పేట్ మెట్రో లైన్ సేవల ప్రారంభం మరింత ఆలస్యం కానుంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. ఎల్బీనగర్- అమీర్పేట్ మెట్రో లైన్ ఈ జూన్లో ప్రారంభం కాదన్నారు. సీటీఎస్ టెక్నాలజీతో ఈ ఆగస్టులో ఈ ఆ మెట్రో లైన్ సేవలు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. అమీర్పేట్- హైటెక్ సిటీ మెట్రో లైన్ను అక్టోబర్ నెలలో ప్రారంభించనున్నట్లు మెట్రోరైలు ఎండీ వివరించారు. అమీర్పేట్ నుంచి మియాపూర్ వరకు కొనసాగుతున్న మెట్రోరైలు వేగం బాగానే ఉందన్నారు. అయితే మెట్టుడూడ నుంచి అమీర్పేట్ వరకు సీబీటీ టెక్నాలజీ అందుబాటులో లేకపోవడంతో మెట్రో వేగం ఈ మార్గంలో కాస్త తక్కువగా ఉంటుందని వెల్లడించారు. ప్రతిరోజూ 60 వేల మంది ప్రయాణికులు మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. -
ఇది మెట్రో ఇయర్
హైదరాబాద్ చరిత్రలో 2017 సంవత్సరం మర్చిపోలేనిది. ప్రజల కలల మెట్రో రైలు పట్టాలెక్కిన వేళ...ఇది ‘మెట్రో ఇయర్’ అని చెప్పొచ్చు. వచ్చే ఏడాది జూన్ నాటికి అమీర్పేట–ఎల్బీనగర్ (17 కిలోమీటర్లు), అమీర్పేట– హైటెక్ సిటీ (8.5 కిలోమీటర్లు) మార్గంలోనూ మెట్రో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తాం. నెల రోజుల్లో 32.25 లక్షల మంది మెట్రో రైలులో ప్రయాణించారు. మార్చి నుంచి రైళ్ల ఫ్రీక్వెన్సీ, బోగీల సంఖ్యను పెంచుతాం. చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే..వాటిని అధిగమించి రానున్న రోజుల్లో నగరవాసులకు అద్భుతమైన ప్రయాణ అనుభవాన్ని కల్పించేందుకు గట్టిగా కృషి చేస్తాం. – ఎన్వీఎస్ రెడ్డి, మెట్రో రైల్ ఎండీ సాక్షి, సిటీబ్యూరో/సనత్నగర్ : వచ్చే ఏడాది జూన్ నాటికి అమీర్పేట–ఎల్బీనగర్ (17 కిలోమీటర్లు), అమీర్పేట– హైటెక్ సిటీ (8.5 కిలోమీటర్లు) రూట్లో మెట్రో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. పాతనగరంలోనూ ఎంజీబీఎస్–ఫలక్నుమా మార్గంలో మెట్రో పూర్తికి ప్రయత్నాలు ముమ్మరం చేశామన్నారు. గ్రేటర్ వాసుల కలల మెట్రో ప్రారంభమై శుక్రవారానికి నెలరోజులు పూర్తయిన సందర్భంగా రసూల్పురాలోని మెట్రోరైల్ భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా చేపట్టిన ప్రతిష్టాత్మక మెట్రో ప్రాజెక్టు అమలు సాధ్యం కాదంటూ ప్రారంభంలో చాలామంది కొట్టిపడేశారని, అలాంటి ప్రాజెక్టును సుసాధ్యం చేసినట్లు తెలిపారు. ఆర్థిక వనరుల లేమి కారణంగా పీపీపీ కింద ఈ ప్రాజెక్టును చేపట్టామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన సమయంలో చాలామంది మెట్రోరైల్ ప్రాజెక్టుపై పుకార్లు సృష్టించారని, వాటన్నింటినీ తాము ఏమాత్రం పట్టించుకోకుండా మెట్రోరైల్ ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేశామన్నారు. హైదరాబాద్ చరిత్రలో 2017 సంవత్సరం మెట్రో ఏడాదిగా నిలిచిపోనుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషిలో మెట్రోరైల్ ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు. హైటెక్సిటీ–రాయదుర్గం(1.5 కి.మీ)మార్గంలో మెట్రో పిల్లర్ల ఏర్పాటుకు అలైన్మెంట్ ఖరారు చేశామని..త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. 30 రోజుల్లో 32.25 లక్షల మంది ప్రయాణికులు గడిచిన 30 రోజుల్లో 32.25 లక్షల మంది ప్రయాణికులు మెట్రో రైలులో ప్రయాణించారని ఎండీ తెలిపారు. సరాసరిన రోజుకు లక్ష మంది ప్రయాణికులు మెట్రోరైల్ ప్రయాణం చేశారన్నారు. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ మెట్రోలు ప్రారంభమైన తొలినాళ్లలో ఇంత భారీ స్థాయిలో రద్దీలేదని ఆయన స్పష్టం చేశారు. మెట్రోరైళ్లు రాకపోకలు సాగిస్తోన్న నాగోలు–అమీర్పేట–మియాపూర్ మార్గంలోని 24 స్టేషన్లలో ఒక్క ప్రకాష్నగర్ స్టేషన్ మినహా మిగతా 23 స్టేషన్లలో పార్కింగ్ వసతి కల్పించామన్నారు. ఇందులో 11 చోట్ల ఎక్స్క్లూజివ్ పార్కింగ్ స్టేషన్లు (అర ఎకరా స్థలం కంటే ఎక్కువ) ఉన్నా వాటిల్లో సగం కూడా నిండని పరిస్థితి ఉందన్నారు. త్వరలో కంప్యూటరైజ్డ్ స్మార్ట్ పార్కింగ్ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నామన్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సు, ఆటోలకు కలరింగ్ కోడ్ ఇచ్చి పార్కింగ్ విధానం అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. మెట్రో స్టేషన్ల నుంచి సమీప భవనాలకు చేరుకునేందుకు వీలుగా స్కైవాక్లు ఏర్పాటుచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జనవరి 15 నాటికి స్టేషన్ల సుందరీకరణ.. అన్ని స్టేషన్ల వద్ద పట్టణ నవీకరణ పథకం కింద చేపట్టిన స్ట్రీట్ఫర్నీచర్, ఫుట్పాత్లు, హరిత వాతావారణం, టైల్స్ ఏర్పాటు పనులు 80 శాతం వరకు పూర్తి చేశామన్నారు. ఒక్కో స్టేషన్ నిర్మాణానికి రూ.60 కోట్లు ఖర్చు చేశామని..వీటివద్ద సుందరీకరణ పనులకు మరో రూ.2 కోట్లు ఖర్చు చేశామన్నారు. అమీర్పేట్, మియాపూర్ ఇంటర్ఛేంజ్ స్టేషన్ల నిర్మాణానికి రూ.250 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ప్రతీ స్టేషన్కు రెండు వైపులా 1.5 కిలోమీటరు మేర ఫుట్పాత్ నిర్మాణ పనులతో పాటు సుందరీకరణ పనులు చేపట్టామన్నారు. జనవరి 15 వరకు దాదాపు అన్ని స్టేషన్లలో ఆయా పనులు పూర్తి చేయాలనే లక్ష్యం నిర్దేశించామన్నారు. కారిడార్–3లోని జూబ్లీహిల్స్ నుంచి హైటెక్ సిటీ వరకు పెద్ద సంఖ్యలో ఆక్రమణలను తొలగించామని, ఇదో సవాల్గా మారిందన్నారు. బస్సులు, క్యాబ్లకు ప్రత్యేక పార్కింగ్ కేపీహెచ్బీ, అమీర్పేట్ మెట్రో స్టేషన్ల నుంచి హైటెక్ సిటీకి వెళ్లేందుకు బస్సులతో పాటు ఓలా, ఉబర్ క్యాబ్లు నిలిపేందుకు ప్రత్యేక పార్కింగ్ స్థలం కేటాయించామన్నారు. మెట్రో స్టేషన్ల నుంచి ఆర్టీసీ 57 ఫీడర్ బస్సులు నడుపుతుందని..త్వరలో స్టేసన్ల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు నడిపేందుకు వీలుగా ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీని ప్రభుత్వం అమలు చేయనుందన్నారు. అన్ని మెట్రో స్టేషన్ల నుంచి ఫీడర్ బస్సు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అలాగే హైదరాబాద్ బైస్కిల్ క్లబ్ తరుపున స్టేషన్లలో అధునాతన సైకిళ్లను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. గడచిన నెల రోజుల్లో 1.5 లక్షల మెట్రో స్మార్ట్ కార్డులను విక్రయించామన్నారు. ప్రస్తుతం రోజుకు రెండు వేల కార్డుల వరకు విక్రయాలు జరుగుతున్నాయన్నారు. స్మార్ట్కార్డు రీచార్జిని పేటీఎం లేదా టీసవారీ యాప్ ద్వారా చేసుకోవచ్చన్నారు. మార్చి తరవాత పెరగనున్న రైళ్ల ఫ్రీక్వెన్సీ.. ప్రస్తుతం మూడు బోగీలతో వెయ్యి మంది ప్రయాణికులతో నడుస్తుండగా మార్చి నుంచి ప్రతీ మెట్రోకు ఆరు బోగీలు ఏర్పాటుచేసి రెండు వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మియాపూర్ నుంచి అమీర్పేట మార్గంలో ప్రస్తుతం ఎనిమిది నిమిషాలకో సర్వీసు, అమీర్పేట్– నాగోలు మార్గంలో ప్రతి 15 నిమిషాలకో సర్వీసు నడుస్తుందన్నారు. మార్చి తరవాత ఫ్రీక్వెన్సీని 3–5 నిమిషాలకు తగ్గిస్తామని..రైళ్ల సంఖ్యను కూడా రద్దీని బట్టి పెంచుతామన్నారు. ప్రస్తుతం మెట్టుగూడా–అమీర్పేట్ మార్గంలో మార్చి వరకు కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ మార్గదర్శకాల మేరకు రైళ్లను మ్యాన్యువల్గానడుపుతున్నామని..ఈ మార్గంలో మరిన్ని భద్రతా పరీక్షలు జరుగుతున్నాయన్నారు. మార్చి తరవాత ఈ రూట్లోనూ కమ్యూనికేషన్బేస్డ్ ట్రైన్ కంట్రోల్ వ్యవస్థ ఆధారంగా రైళ్లు నడపనుండడంతో రైళ్ల వేగం పెరుగుతుందని ఆయన స్పష్టంచేశారు. 24 మెట్రో స్టేషన్లలో ..ప్రతీ స్టేషన్కు రెండు చివరలా టాయిలెట్ల ఏర్పాటు, నిర్వహణకు టెండర్లను ఆహ్వానించామని..త్వరలో మెట్రో స్టేషన్లలో త్రీస్టార్ హోటళ్లలో ఉండే విధంగా టాయిలెట్స్ నిర్మాణం జరుగుతుందన్నారు. ప్రస్తుతం పోలీసు శాఖ బాంబు హెచ్చరికల నేపథ్యంలో స్టేషన్లలో డస్ట్బిన్లు ఏర్పాటుచేయలేదని..త్వరలో పూర్తిగా పారదర్శకంగా ఉండేలా డిజైన్ చేసిన డస్ట్బిన్లను ఏర్పాటుచేస్తామన్నారు. మెట్రో వ్యయం రూ.16,511 కోట్లు.. మెట్రో ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.16,511 కోట్లు ఖర్చు చేశామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇందులో ఎల్అండ్టీ సంస్థ రూ.14,261 కోట్లు (ఎల్ అండ్ టీ) ఖర్చు చేయగా.. తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిపి మరో రూ.2250 కోట్లు ఖర్చుచేసినట్లు ఎండీ తెలిపారు. మరో రూ.500 కోట్ల వ్యత్యాస నిధులు(వీజీఎఫ్) కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందన్నారు. జర్మనీకి చెందిన కెఫ్డబ్లు్య సంస్థనుంచి సుందరీకరణ పనులకు రుణం సేకరించనున్నామన్నారు. ఎల్అండ్టీ సంస్థ రూ.12,500 కోట్లు వివిధ బ్యాంకుల నుంచి రుణంగా సేకరించిందన్నారు. పంజగుట్ట, హైటెక్ సిటీ ప్రాంతాల్లోని షాపింగ్ మాల్స్ త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని, వాటిల్లోని మొత్తం 16 అధునాతన తెరలపై పడుకుని మరీ సినిమాను వీక్షించే వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. టిక్కెట్ ధరల తగ్గింపు లేనట్టే.. మెట్రో ప్రయాణ ఛార్జీలు అధికంగా ఉన్నాయన్న ఆందోళన ఉన్నప్పటికీ ఇప్పట్లో ఛార్జీల తగ్గింపు లేనట్టేనని..ఛార్జీలపై నిర్ణయం ఉన్నతస్థాయి కమిటీదేనన్నారు. ఇక ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లలో ప్రయాణించేందుకు వీలుగా కామన్ బస్పాస్ను ప్రవేశపెట్టేందుకు చర్చలు జరుగుతున్నాయన్నారు. -
ప్రజారవాణాను పెంచడం పైనే తమ దృష్టి
-
‘ఒక్క నెలలో 32 లక్షల మంది ప్రయాణించారు’
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైలు ప్రారంభించిన ఒక్క నెలలోనే 32.25 లక్షల మంది ప్రయాణించారని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ప్రకటన సారాంశం...అనేక సమస్యలు ఎదుర్కొని మెట్రో రైలును అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తాను ఎన్నో సార్లు మదనపడ్డానని, ఎన్నో విమర్శలు కూడా వచ్చాయని చెప్పారు. తెలంగాణ వస్తే ఎల్ అండ్ టీ వెళ్లిపోతుందనే పుకార్లు కూడా వచ్చాయని అన్నారు. అన్నింటినీ తట్టుకున్నామని వ్యాఖ్యానించారు. నెల రోజుల కిందట రైలు ప్రారంభం అయిందని, ప్రి మెట్రో, పోస్ట్ మెట్రోకు సంబంధించి ముందే ప్రెజేంటేషన్ ఇచ్చానని వెల్లడించారు. రైలు ప్రారంభం అయిన తర్వాత కూడా విమర్శలు వచ్చాయని, సగటున రోజుకు లక్షమంది ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. 23 స్టేషన్ల వద్ద పార్కింగ్ సౌకర్యం ఉందని, ఒక్క ప్రకాష్ నగర్ స్టేషన్ వద్ద మాత్రమే పార్కింగ్ సౌకర్యం లేదన్నారు. ప్రజారవాణాను పెంచడం పైనే తమ దృష్టి ఉందన్నారు. కంప్యూటరైజ్డ్ స్మార్ట్ పార్కింగ్ వ్యవస్థను త్వరంలో ప్రవేశపెడతామని చెప్పారు. కలర్ కోడింగ్ను అమలు చేసి పార్కింగ్ ఇబ్బందులు తొలగిస్తామన్నారు. ఫుట్ పాత్ నడకను నగర వాసులకు అలవాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు, 220 మీటర్ల ప్రాంతం ప్రతి స్టేషన్లో ఫుట్ పాత్ కోసం కేటాయిస్లున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకూ 1.5 లక్షల స్మార్ట్ కార్డులు అమ్ముడు పోయానని, 22 శాతం ప్రయాణికులు స్మార్ట్ కార్డులు ఉపయోగిస్తున్నారని తెలిపారు. ప్రతిరోజూ కొత్తగా రెండు వేల మంది ప్రయాణికులు స్మార్ట్కార్డులు తీసుకుంటున్నారని చెప్పారు. నాలుగైదు రోజుల్లో ప్రతి స్టేషన్లో మెట్రో టైం టేబుల్ ప్రదర్శించేవిధంగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే టాయిలెట్ల ఏర్పాటు, మెయింటెనన్స్ కోసం వారంలో టెండర్లు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. -
మెట్రో సాకారానికి ఆద్యుడు వైఎస్సార్
ప్రపంచస్థాయిలో నిర్మాణం జరుగుతున్న హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు మొదటగా ప్రోత్సాహం ఇచ్చిందీ, మద్దతు పలికిందీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సారే అని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో సాగునీటి ప్రాజెక్టులు, గ్రామీణాభివృద్థి ప్రాధమ్యాలుగా తీసుకున్నప్పటికీ మెట్రో రైల్ ప్రాజెక్టు గురించి ప్రతిపాదించగానే డబ్బు విషయంలో తనను ఇబ్బంది పెట్టవద్దు కానీ ప్రాజెక్టును మీ సొంత ఆలోచనలతో ముందుకు తీసుకెళ్లాలని భుజం తట్టింది వైస్సారే అని అన్నారు. మెట్రో విషయంలో మీరేం చేయాలంటే అది చేయండి. మీకు ఎంత పవర్ కావాలంటే అంత ఇస్తాను అని ఆయన చెప్పిన తర్వాతే ముందుకు కదిలామంటున్న ఎన్వీఎస్ రెడ్డి అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... హైదరాబాద్లో మెట్రోరైలు నిర్మాణం అనే ఆలోచన మీకు ఎలా తట్టింది? మా గురువు శ్రీధరన్ ఢిల్లీలో మెట్రో కడుతున్నప్పుడు హైదరాబాద్లో మెట్రో ఎందుకు కట్టకూడదు అనే ఆలోచన వచ్చింది. నేనూ, నా బ్యాచ్మేట్ ఎస్పీ సింగ్ ఇద్దరం కలిసి హైదరాబాద్లో మనమూ మెట్రో కడదాం అనుకున్నాం. అంతకుముందు ఈ ప్రాజెక్టు ప్రతిపాదనే లేదా? లేదండి. చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్నప్పుడు నేను రాష్ట్రానికి వచ్చాను. ఈ ప్రాజెక్టు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దివాలా ఎత్తుతుందని, రోజుకు కోటి రూపాయల నష్టం వస్తుం దని ఆయనకు అందరూ చెప్పారు. దాంతో సరే చూద్దాం అని బాబు మెట్రో ప్రతిపాదనను అలా పక్కన పెట్టారు. తర్వాత వైఎస్సార్ అధికారంలోకి వచ్చారు. హైదరాబాద్ పెరుగుతున్న నగరం కాబట్టి మెట్రో తప్పకుండా కట్టితీరాలి అని నేనూ, ఎస్పీ సింగ్ నిర్ణయించుకుని వైఎస్ని కలిశాం. ‘‘దానిదేముంది. చేయండి.. కానీ నన్ను మాత్రం డబ్బు అడగొద్దు’’ అనేశారు. ‘ఇంత పెద్ద ప్రాజెక్టు కదా. డబ్బు అడగొద్దంటే ఎలా’? అన్నాం. ‘ఈ ప్రాజెక్టుకు కావలసిన డబ్బుకోసం మీ సొంత సృజనాత్మక శక్తిని ఉపయోగించండి. ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టులు, గ్రామీణాభివృద్ధి నా ప్రాధాన్యతలు. మీరేం చేయాలంటే అది చేయండి. మీకు ఎంత పవర్ కావాలంటే అంత ఇస్తాను’ అని వైఎస్సార్ చెప్పారు. అలా ప్రారంభించాం. ప్రారంభంలో సమస్యలు వచ్చాయి. చివరకు 2012లో ప్రాజెక్టు మొదలైంది. మెట్రోకు రూ.30 వేల కోట్లు ఎదురిస్తామని మైటాస్ చెప్పడం వివాదమైంది కదా! వచ్చే 35 ఏళ్లలో అంత మొత్తం ఇస్తామన్నారు. కానీ దాని ప్రస్తుత విలువ రూ. 1,200 కోట్లు మాత్రమే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం ఖర్చుపెట్టాల్సి ఉండగా మాకేమీ వద్దు మేమే పెడతాం అని మైటాస్ ముందుకొచ్చింది. మైటాస్తో వైఎస్సార్ ప్రభుత్వానికి ఇబ్బంది ఎదురైందా? ప్రభుత్వం ఏదైనా, ఎవరిదైనా కావచ్చు. ఆ అవకతవకలను సత్యం బోర్డులో ఉన్న నిష్ణాతులైన సభ్యులు కూడా ఊహించలేకపోయారు. ప్రపంచ స్థాయి వ్యక్తులకు కూడా సత్యంలో ఇలా జరుగుతోందని చివరిదాకా తెలీకుండా పోయింది. అప్పుడే ఢిల్లీ మెట్రో ఎండీ శ్రీధరన్ హైదరాబాద్ మెట్రో గురించి విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా ఉన్న మాంటెక్ సింగ్ అహ్లువాలియాను కలిసి పరిస్థితి మొత్తంగా వివరించాను. ఆయన ఒకేమాటన్నారు. మీ ప్రాజెక్టు నమూనాలో ఏ తప్పూ లేదు. దాన్నే కొనసాగిస్తూ పోండన్నారు. మెట్రో ప్రాజెక్టుకు వైఎస్సార్ ఇచ్చిన ప్రోత్సాహం ఏమిటి? మైటాస్ ఫెయిలయిన తర్వాత వైఎస్ఆర్ మమ్మల్ని పిలిచి ‘తదుపరి చర్యలు ఏమిటి’ అని అడిగారు. మెట్రోను ప్రభుత్వమే కట్టాలంటే చాలా వ్యయం అవుతుంది. కానీ మళ్లీ పీపీపీ పద్ధతిలోనే పోవాలని కేంద్రం సూచించినట్లు చెప్పాను. ‘అలాగే ముందుకెళ్లండి’ అన్నారు. వైఎస్సార్ది చాలా గొప్ప వ్యక్తిత్వం. ఒక ఆలోచనను నమ్మారంటే దానికే కట్టుబడి ఉంటారు. పైగా అధికార్లను సమర్థించేవారు. అది చాలా గొప్ప విషయం. ఆ సమయంలోనే ఎల్ అండ్ టీ వారు ముందుకొచ్చారు. వారు నిర్మాణానికి ప్రభుత్వం నుంచి చాలా తక్కువగా అంటే పది శాతం మాత్రమే.. అంటే రూ. 1,453 కోట్లు కావాలని అడిగారు. దాంతో వారికే అవకాశం ఇచ్చాం. తర్వాత జరిగింది మీకందరికీ తెలుసు. ఈ ప్రాజెక్టు విధానాలు, ఎల్ అండ్ టీ పెట్టిన షరతుల గురించి చెబుతారా? ఈ ప్రాజెక్టును చాలా జాగ్రత్తగా చేస్తూ వచ్చాం. ప్రజలకు, నగరానికి, నిర్మాణ సంస్థకు కూడా ఉపయోగపడేలా మెట్రో ఉండాలి. పైగా ధర్మకర్తృత్వం కోసం ఎవరూ ఇలాంటి ప్రాజెక్టులు చేయరు కాబట్టి కంపెనీ కూడా నష్టపోలేదు. మా అంచనా ప్రకారం ప్రారంభంలో నాలుగేళ్లపాటు నష్టం వస్తుంది. వారు చెప్పినట్లు నిర్మాణ వ్యయం పెరిగి ఉంటే ఆరు లేక ఏడో సంవత్సరంలో లాభాలు వస్తాయి. ప్రపంచంలో 250 మెట్రో ప్రాజెక్టులు జరుగుతున్నాయి. కాని హైదరాబాద్ మెట్రోకు పెట్టినంత పెట్టుబడి మరెక్కడా పెట్టలేదు. ప్రజలు చెల్లించే పన్నులతో, ప్రభుత్వ ధనంతో కాకుండా ప్రైవేట్ ప్రాతిపదికన చేస్తున్న ప్రాజెక్టు ఇది. 50 శాతం ప్యాసింజర్ల నుంచి, 45 శాతం ప్రాపర్టీ అభివృద్ధి నుంచి ఆదాయం వస్తుందని మా ఆంచనా. అభివృద్ధి చేసిన ప్రాపర్టీని కూడా అమ్మడానికి వీల్లేదు. లీజు ప్రకారం అద్దెలు వస్తాయంతే. మిగిలిన 5 శాతం ఆదాయం ప్రకటనలు ఇతరరూపంలో వస్తుంది. మెట్రో ప్రాజెక్టుకు కేసీఆర్ మద్దతు ఏ స్థాయిలో ఉంది? ఇంత అద్భుతంగా సక్సెస్ అయ్యారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ మమ్మల్ని ప్రశంసించారు. ఒక దశను మొదటినుంచి చివరివరకు పూర్తి చేయండి. ఫలితాలు చూడండి అని సలహా ఇచ్చారాయన. నిజానికి ఆయన చెప్పిందే కరెక్టయింది. మెట్రో ప్రాజెక్టు చక్కగా విజయవంతం కావడానికి ఎండ్ టు ఎండ్ పనులు పూర్తి చేయడమే కారణం. మొదటి దశ పనులను పూర్తి చేస్తే వీలైనంత త్వరగా ఫేస్–2 పనులను కూడా చేద్దాం అని సీఎం ప్రోత్సహించారు. టికెట్ల రేట్లు ఇప్పటికే ఎక్కువంటున్నారు. మరి మెట్రో లాభదాయకమేనా? మెట్రో రేట్లు ఎక్కువ అని అనుకుంటే తప్పు. ముఖ్యంగా మనకు మంచి నాణ్యత కావాలి. పైగా సెంట్రల్ మెట్రో నిబంధనల ప్రకారం నిర్మించిన కంపెనీకి రేట్లు నిర్ణయించే హక్కు ఉంది. పైగా కేంద్రం చెప్పినట్లు సెంట్రల్ మెట్రో యాక్ట్ కిందకు దేశం లోని మెట్రోలన్నీ వస్తే ఏడాదికి 1,450 కోట్లు కేంద్రం ఇస్తుంది కూడా. మిగతా మెట్రో వ్యవస్థలకు అనుగుణంగానే చార్జి చేయమని చెప్పాం. దాన్ని వారు పాటించారు. మెట్రో పట్ల హైదరాబాద్ ప్రజల స్పందన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ప్రారంభంలో అటూ ఇటుగా రోజుకు 50 వేలమంది ప్రయాణిస్తున్నారని అనుకున్నాం. కానీ పని దినాల్లో దాదాపు లక్షమంది ప్రయాణిస్తున్నారు. ఇక శని, ఆదివారాల్లో అయితే దాదాపు రెండు లక్షలమంది ప్రయాణిస్తున్నారు. ఊహించని స్పందన ఇది. ప్రారంభంలో మూడు కోచ్లు మాత్రమే నడుపుతున్నాం. తదుపరి దశలో ఆరు కోచ్లు పెడితే ప్రతి 2 నిమిషాలకు ఒక ట్రైన్ చొప్పున 2 వేలమంది ఒకేసారి ప్రయాణిస్తారు. అంటే గంటకు 60 వేల మంది ప్రయాణించవచ్చు. 2018 చివరికి తొలి దశ ప్రాజెక్టు పూర్తయితే కనీసం రోజుకు 10 లక్షలమంది మెట్రోలో ప్రయాణించే అవకాశముంది. తదుపరి దశలో 15 లక్షల మంది ప్రయాణించేలా ఏర్పాటు చేస్తాం. కానీ పార్కింగ్, గమ్యస్థానం చేరుకోవడం వంటి సమస్యలు ఉన్నాయి కదా? మెట్రో పార్కింగ్ విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. అంతర్జాతీయ ట్రాఫిక్ నిపుణుల అభిప్రాయం ప్రకారం మెట్రో రైలు వ్యవస్థలో పార్కింగ్ వసతి కల్పించవద్దు. ఎందుకంటే పార్కింగ్ పేరిట రోడ్డు వెడల్పును అనవసరంగా పెంచి, పార్కింగ్ అవకాశం కల్పిస్తే వ్యక్తిగత వాహనాలు మరింత పెరుగుతాయి. దానికి బదులు ప్రజారవాణా వ్యవస్థను పెంచండి. చివరి గమ్యం వరకు రైల్ కనెక్టివిటీని పెంచండి అని సూచించారు. కానీ మన దేశంలో ఇలాంటి పరిస్థితి లేదు కాబట్టి మేం మెట్రోలో పార్కింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం 24 స్టేషన్లలో మొత్తం 12 చోట్ల పార్కింగ్ ప్లేస్ సిద్ధం చేశాము. మిగతా చోట్ల కూడా సిద్ధం చేస్తున్నాం. (ఎన్వీఎస్ రెడ్డితో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/3mvfkc https://goo.gl/Y3KAQF -
మెట్రోలో మరదలు మైసమ్మ..!
మారేడుపల్లి: మెట్రోరైలు ఎండీ గొంతు సవరించారు. తనలోని కొత్త కోణాన్ని పరిచయం చేశారు. శుక్రవారం కస్తూర్భా గాంధీ మహిళా జూనియర్ కళాశాల వార్షికోత్సం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్.రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘మెట్రోరైలులో మరదలు మైసమ్మ.. ఏసీలో వచ్చే మరదలు మైసమ్మ.. చెమటలు పట్టేదిలేదు మరదలు మైసమ్మ’.. అంటూ పాటలు పాడి విద్యార్థినులను ఉర్రూతలూగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మెట్రోరైలు రాకతో నగరం గ్లోబల్ సిటీగా మారుతుందన్నారు. 25 వేల కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్ట్ ప్రారంభమైందని, 50 వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి వస్తాయని వివరించారు. ఇంటర్ దశ ఎంతో కీలకమని, ఎన్ని కష్టాలు వచ్చినా శ్రద్ధగా చదివి అనుకున్న గమ్యాన్ని చేరాలని సూచించారు. ఈ సందర్భంగా కాలేజీ టాపర్స్కు బహుమతులను ప్రదానం చేశారు. కాగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కస్తూర్భాగాంధీ మహిళా కళాశాల చైర్మన్ ఎన్.వి.ఎన్.చార్యులు, సెక్రటరీ హైదర్, ట్రెజరర్ అజయ్కుమార్, ప్రిన్సిపాల్ ప్రతిమారెడ్డి, పలువురు పాల్గొన్నారు. వార్షికోత్సవ సభలో మాట్లాడుతున్న ఎన్వీఎస్ రెడ్డి -
'అది హైదరాబాద్ మెట్రో కాదు'
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో పిల్లర్కు పగుళ్లు వచ్చినట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తమని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. నగరంలోని ఐఎస్బీ- గచ్చిబౌలి మార్గంలోని మెట్రో పిల్లర్కు పగుళ్లంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని.. అసలు ఆ మార్గంలో మెట్రో లైనే లేదని తెలిపారు. ఇలాంటి వార్తలపై గతంలోనే మంత్రి కేటీఆర్ వివరణ కూడా ఇచ్చారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో హైదరాబాద్ మెట్రోది కాదని.. పెషావర్లోని మెట్రో పిల్లర్ అని ఆయన బుధవారం వెల్లడించారు. వేల టన్నుల బరువు, భూకంపాలను సైతం తట్టుకునేలా హైదరాబాద్ మెట్రోను నిర్మించామన్నారు. కొందరు ఓర్వలేక మెట్రోపైన దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా నగర వాసుల కలల మెట్రో నవంబర్ 28న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైన విషయం తెలిసిందే. నాగోల్–అమీర్పేట్, మియాపూర్–అమీర్పేట్ మధ్య 30 కిలో మీటర్లు నడుస్తున్న మెట్రోకు గ్రేటర్వాసుల నుంచి విశేష ఆదరణ వస్తోంది. లక్షలాదిమంది సిటీజన్లు కుటుంబ సభ్యులతో కలిసి మెట్రోలో జాయ్రైడ్స్ చేసి ఆనందిస్తున్నారు. గడిచిన వారంలో దాదాపు 9 లక్షల మంది మెట్రో రైలులో ప్రయాణించారు. లక్షా 50 వేల మెట్రో స్మార్టు కార్డులు విక్రయించారు. -
నాగోల్ నుంచి మియాపూర్ వరకూ ఒకే రైలు!
సాక్షి, హైదరాబాద్ : మెట్రో రైల్కు విపరీత స్పందన వచ్చిందని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. మెట్రో రైలులో మొదటి రోజు లక్ష మంది ప్రయాణించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఇందులో సరదాగా ప్రయాణించాలనుకున్న వారు ఇరవై శాతం వరకు ఉంటారని ఎన్వీఎస్ అన్నారు. హైదరాబాద్ ప్రజలు క్రమశిక్షణ గలవారని మరోసారి నిరూపించుకున్నారని కితాబునిచ్చారు. ట్రైన్ ఎక్కేప్పుడు దిగేప్పుడు హడావుడి పడవద్దని ప్రయాణికులను కోరారు. ట్రైన్ లో వృద్దులకు, మహిళలకు చోటు ఇవ్వడానికి ప్రయత్నించాలని కోరారు. ఇంకా కొన్ని సాంకేతిక పనులు అసంపూర్తిగా ఉన్నాయని చెప్పారు. మియాపూర్ నుంచి అమీర్పేటకు మొదటిరోజు ఎనిమిది నిమిషాలకు ఒక రైలు, అలాగే అమీర్పేట నుంచి నాగోల్ వరకూ 15 నిమిషాలకు ఒకసారి రైళ్లు నడుస్తాయన్నారు. భవిష్యత్తులో నాగోల్ నుంచి మియాపూర్ వరకూ ఒకే రైలు మధ్యలో అమీర్ పేట్ ఇంటర్ ఛేంజ్ పాయింట్ కంపల్సరీ కాదు హైదరాబాదు ప్రజలు పూర్తి భద్రత తో మెట్రో ప్రయాణాలు చేయవచ్చు త్వరలో మెట్రో పాసులను కూడా అందుబాటులోకి తెస్తాం పార్కింగ్ పనులు పూర్తి అవడానికి నెల సమయం పడుతుంది ఇంకా పార్కింగ్ ధరలు నిర్ణయించలేదు సెంట్రల్ మెట్రో యాక్ట్ కింద గవర్నమెంటు ఆఫ్ ఇండియా టికెట్ ధరలను నిర్ణయింస్తుంది 2018 జూన్ వరకి 66 కిమీల మూడు కిమీల కారిడార్ పూర్తి చేస్తాం మూడు కారిడార్లు 2018 జూన్ వరకి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం -
అలా చేయడం ఇండియా చరిత్రలోనే మొదటిసారి
-
నవంబర్లో మెట్రో పరుగులు!
30 కి.మీ. మార్గంలో మెట్రో ప్రారంభిస్తామన్న ఎన్వీఎస్ రెడ్డి - కార్యక్రమానికి హాజరుకానున్న ప్రధాని మోదీ - మియాపూర్–అమీర్పేట్, అమీర్పేట్–నాగోల్ రూట్లు ప్రారంభం - ఆసియాలోనే అతిపెద్ద ఇంటర్ చేంజ్ స్టేషన్గా అమీర్పేట్ సాక్షి, హైదరాబాద్: గ్రేటర్వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రో రైలు నవంబర్లో పరుగులు పెట్టనుంది. ఈ ఏడాది నవంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ మెట్రోను ప్రారంభించనున్నారు. తొలి విడతగా నాగోల్–అమీర్పేట్(17కి.మీ), మియాపూర్–అమీర్పేట్ (13 కి.మీ).. మొత్తంగా 30 కి.మీ మార్గంలో మెట్రో పరుగులు తీయనున్నట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. నవంబర్లోగా ఈ 2 రూట్లలో మిగిలిన స్టేషన్లు, రైలు ఓవర్ బ్రిడ్జీలు, ఇతర నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నా రు. నగర మెట్రో ప్రాజెక్టులో మరో అద్భుతం చోటుచేసుకుందని.. ఆసియాలోనే అతిపెద్ద విశిష్ట మెట్రో స్టేషన్గా అమీర్పేట్ ఇంటర్ చేంజ్ స్టేషన్ ఖ్యాతి గడించిందని ఆయన పేర్కొన్నారు. అమీర్పేట్ మెట్రో స్టేషన్ మియాపూర్–ఎల్బీనగర్ (కారిడార్–1), నాగోల్–రాయదుర్గం (కారిడార్–3) కారిడార్లు కలిసే చోట నిర్మిస్తోన్న ఇంటర్చేంజ్ స్టేషన్ ఇదేనన్నారు. సుమారు 2 లక్షల చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో ఈ స్టేషన్ను నిర్మిస్తున్నామన్నారు. ఆదివారం ఈ పనులను ఇతర అధికారులతో కలసి ఆయన తనిఖీ చేశారు. స్టేషన్ విశిష్టతలివే.. ► మూడు అంతస్తులుగా విభజన ఉండే ఈ స్టేషన్ మధ్యభాగంలో సాంకేతిక గదులు, ఆటోమేటిక్ టికెట్ కలెక్షన్ గేట్లు, టికెటింగ్ గదులుంటాయి. ► ఈ స్టేషన్కు ఇరువైపులా 16 లిఫ్టులు, 12 ఎస్కలేటర్లు, 12 మెట్ల దారులున్నాయి. ► రెండు కారిడార్లలో రాకపోకలు సాగించే ప్రయాణికులు ఒక కారిడార్ నుంచి మరో కారిడార్కు మారేందుకు విశాలమైన మెట్లు, స్కైవేస్ ఏర్పాటు. ► రోజుకు దాదాపు 30 వేల మంది ప్రయాణికులు ఉపయోగించే ఈ స్టేషన్లో ఏ సమయంలోనైనా ఒకేసారి 6,000 మంది ప్రయాణికులు సులువుగా రాకపోకలు సాగించవచ్చు. ► స్టేషన్ కింది భాగం(రోడ్ లెవల్) పాదచారులు నడిచేందుకు ప్రత్యేకమైన దారులు, బస్సులు, ఆటోలు ఇతర వాహన మార్గాలను అనుసంధానించేందుకు సర్వీస్ లేన్లు, ఫీడర్ సౌకర్యాలను రూపకల్పన చేస్తున్నారు. ► ప్రస్తుతం ఈ స్టేషన్ నిర్మాణం కోసం 800 మంది కార్మికులు.. 24 గంటల పాటు శ్రమిస్తున్నారు. ► స్టేషన్లో ప్లాట్ఫాం ఎత్తు 92 అడుగులు కాగా..పైకప్పు ఎత్తు 112 అడుగులు. -
32 చోట్ల మెట్రో మల్టీ లెవెల్ వెహికల్ పార్కింగ్
- అందుబాటులోకి 400 బైక్ స్టేషన్లు.. 10 వేల సైకిళ్లు - మియాపూర్ –జేఎన్టీయూల మధ్య 500 మీటర్ల స్కైవాక్ - మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి హైదరాబాద్: మెట్రో రైల్వే స్టేషన్కు వచ్చే ప్రయాణికుల వాహనాల పార్కింగ్ కోసం ప్రాథమికంగా 32 చోట్ల మల్టీ లెవెల్ వాహన పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. శనివారం బేగంపేటలోని మెట్రో రైల్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్అండ్టీ ఆధ్వర్యంలో 17 చోట్ల 57 ఎకరాల్లో, హెచ్ఎంఆర్ ఆధ్వర్యంలో 15 చోట్ల ఈ పార్కింగ్ సదుపాయం కల్పించినట్లు ఆయన వివరించారు. మొత్తం 62 చోట్ల వాహనాల పార్కింగ్ సదుపాయం ఉంటుందని.. వీటితో పాటు ప్రభుత్వ భూములు గుర్తించి దాన్ని వాహనాల పార్కింగ్ సదుపాయం కోసం వినియోగిస్తామని చెప్పారు. మెట్రో మాల్స్లో రెండు, మూడు లెవెల్లో ఈ పార్కింగ్ సౌకర్యం ఉంటుందని చెప్పారు. మెట్రో రైల్వే స్టేషన్ల ప్రాంతాల్లో అందుబాటులో ఉండే ప్రైవేటు భూముల యజమానులు ముందుకు వస్తే వాటిని అభివృద్ధి చేస్తామని.. వీటిపై ప్రభుత్వం త్వరలోనే పాలసీ తీసుకుని రాబోతుందని తెలిపారు. అందుబాటులోకి మెట్రో ఫీడర్ బస్సులు నగరంలో ప్రైవేటు వాహనాలు తగ్గించి ప్రజారవాణా వ్యవస్థ మెరుగు పరిచేందుకు ప్రతి స్టేషన్ నుంచి రైల్ టెర్మినల్స్, ఎంఎంటీఎస్ స్టేషన్లు, ఆర్టీసీ బస్ డిపోలను అనుసంధానం చేస్తామని చెప్పారు. మెట్రో రైల్వే స్టేషన్ల నుంచి కాలనీలకు వెళ్లేందుకు మెట్రో ఫీడర్ బస్లు అందుబాటులో ఉంచుతామని.. అదే టికెట్పై దీనిలో ప్రయా ణించవచ్చని చెప్పారు. స్టేషన్ల నుంచి నాలుగు కి.మీ. పరిధిలో వెళ్లేందుకు 400 బైక్ స్టేషన్లలో 10 వేల సైకిళ్లు అందుబాటులో ఉంచుతా మన్నారు. వాటిని ప్రయాణికులు తీసుకుని వెళ్లి ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసే బైక్ స్టేషన్లో అప్పగించవచ్చని వివరించారు. ప్రతి స్టేషన్లో సోలార్ ప్యానెల్స్ రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్ వాహనాలు మాత్రమే ఉంటాయని.. ఎలక్ట్రికల్ వాహనాలు చార్జింగ్ చేసుకునేందుకు ప్రతి మెట్రో రైల్వే స్టేషన్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తామ న్నారు. ఇందులో ఉత్పత్తి అయిన విద్యుత్తో ఎలక్ట్రికల్ వాహనాలను చార్జింగ్ చేసుకోవడం తో పాటు ఖాళీ బ్యాటరీ ఇచ్చి, చార్జింగ్ చేసిన బ్యాటరీ తీసుకుని వెళ్లే సౌకర్యం అందుబాటు లోకి తెస్తున్నామని వివరించారు. మియాపూర్ స్టేషన్ నుంచి హైదర్నగర్ మధ్య రెండు కి.మీ. పరిధిలో రాహ్గిరి వేదికను పిల్లలు ఆడుకునేం దుకు, యోగా తదితర అన్ని అవసరాలకు ప్రజలు ఉపయోగించుకునేందుకు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. భిన్న ఆకృతుల్లో స్ట్రీట్ ఫర్నిచర్ ఏర్పాటు మెట్రో కారిడార్ సెంట్రల్ మీడియంలో గ్రీనరీని పెంచి బ్యూటిఫికేషన్ చేస్తున్నామని మెట్రో స్టేషన్లలో ప్రజలు కూర్చునేందుకు భిన్న ఆకృతులతో స్ట్రీట్ ఫర్నిచర్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మియాపూర్, జేఎన్టీయూల మధ్య 500 మీటర్ల స్కైవాక్ నిర్మిస్తామని.. మొదట ఎస్ఆర్నగర్ స్టేషన్లో దీన్ని ప్రారంభిస్తామని చెప్పారు. అలాగే కూకట్పల్లి మీదుగా 200 మీటర్ల స్కై వాక్ ఉంటుందన్నారు. ప్రతి స్టేషన్లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను వేరువేరుగా రోడ్డుపైన ఉండే ప్రధాన ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా ఉండేలా ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి స్టేషన్లో ఎయిర్పోర్టు మాదిరిగా సెక్యూరిటీ సిస్టమ్, లగేజ్ స్కానింగ్ ఉంటుందన్నారు. మెట్రో కారిడార్ 1, 3 పనులు ఈ సంవత్సరం పూర్తవుతాయని త్వరలోనే ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించాలనేది చెబుతుందని చెప్పారు. కారిడార్ 2 వచ్చే సంవత్సరానికి పూర్తవుతుందని చెప్పారు. -
ఉప్పల్-యాదాద్రి ‘మెట్రో’కు స్థల పరిశీలన
-
ఉప్పల్-యాదాద్రి ‘మెట్రో’కు స్థల పరిశీలన
► భువనగిరి, రాయగిరి వద్ద స్థలాలను పరిశీలించిన ఎన్వీఎస్ రెడ్డి ► ఎంఎంటీఎస్ పొడిగింపు, మెట్రో మార్గంపై పరిశీలన సాక్షి, హైదరాబాద్: యాదాద్రికి రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఉప్పల్ నుంచి యాదాద్రికి 52 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. బుధవారం ఈ మార్గంలో హైదరాబాద్ మెట్రో రైల్(హెచ్ఎంఆర్) మేనేజింగ్ డెరైక్టర్ ఎన్వీఎస్ రెడ్డితోపాటు భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఇతర నిపుణుల బృందం పర్యటించింది. భువనగిరి, రాయగిరి ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను ఈ బృందం పరిశీలించింది. ఆకాశమార్గం(ఎలివేటెడ్) తరహాలో మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేయాలా లేదా ఎంఎంటీఎస్ రెండో దశను సికింద్రాబాద్ నుంచి యాదాద్రికి పొడిగించాలా అన్న అంశాన్ని సైతం నిపుణుల బృందం పరిశీలించింది. ఉప్పల్-యాదాద్రి మార్గంపై సమగ్ర అధ్యయనం జరిపి త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. సెలవు రోజులు, పర్వదినాల్లో యాదాద్రికి నగరం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతుండడంతో రోడ్డు మార్గంలో వాహనాలు బారులు తీరుతున్నాయి. దీంతో మెట్రో మార్గం ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మార్గంలో మెట్రో స్టేషన్లు, పార్కింగ్ వసతులు, ప్రధాన రహదారి మధ్యలో పనులు చేపట్టేందుకు వీలుగా విశాల రహదారులు అందుబాటులో ఉండడంతో మెట్రో నిర్మాణం నల్లేరు మీద నడకేనని నిపుణులు చెబుతుండడం విశేషం. పీపీపీ విధానమా.. ప్రభుత్వ నిధులా..? ఉప్పల్ నుంచి 52 కి.మీ. దూరంలో ఉన్న యాదాద్రికి ఎలివేటెడ్ తరహాలో మెట్రో మార్గాన్ని నిర్మించిన పక్షంలో కిలోమీటర్కు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వ్యయం కానుంది. అంటే ప్రాజెక్టుకు మొత్తం రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల వ్యయం అవుతుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం భరించడం కష్టమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టి నిర్వహణ బాధ్యతలు సదరు సంస్థకే అప్పజెబితే గిట్టుబాటు అవుతుందని చెబుతున్నారు. అయితే మెట్రో కన్నా ఎంఎంటీఎస్ను పొడిగిస్తే అంచనా వ్యయం భారీగా తగ్గుతుందన్న అభిప్రాయాన్ని సైతం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో నిపుణుల బృందం అధ్యయన నివేదికలను పరిశీలించిన తర్వాత తాజా ప్రతిపాదనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. -
యాదాద్రి మెట్రోపై హెచ్ఎంఆర్ బృందం అధ్యయనం
యాదాద్రికి రోజు రోజుకూ భక్తుల రద్దీ పెరుగుతోన్న నేపథ్యంలో... నగర శివార్లలోని ఉప్పల్ నుంచి యాదాద్రికి 52 కిలోమీటర్ల మేర మెట్రోరైలు మార్గం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈమార్గంలో బుధవారం హెచ్ఎంఆర్ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్వీఎస్రెడ్డితోపాటు, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఇతర నిపుణుల బృందం పర్యటించింది. భువనగిరి, రాయగిరి ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు సంబంధించి అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను పరిశీలించింది. ఆకాశమార్గం (ఎలివేటెడ్) మార్గంలో మెట్రో మార్గమా లేక ఎంఎంటీఎస్ రెండోదశను సికింద్రాబాద్ నుంచి యాదాద్రికి పొడిగించాలా అన్న అంశంపై దృష్టి సారించింది. సమగ్ర అధ్యయనం జరిపి ప్రభుత్వానికి త్వరలో నివేదిక సమర్పించనున్నట్లు ఎన్వీఎస్రెడ్డి 'సాక్షి'కి తెలిపారు. -
ఉప్పల్ నుంచి యాదాద్రికి మెట్రో రైలు?
ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదన సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ నుంచి పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి వ రకు హైస్పీడ్ మెట్రో మార్గం ఏర్పాటు చేసే ప్రతిపాదనపై రాష్ట్రప్రభుత్వం దృష్టి సారించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏటా రూ. 100 కోట్ల బడ్జెట్ కేటాయించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో యాదాద్రికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం భవిష్యత్లో హైస్పీడ్ మెట్రో రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని సీఎం సంకల్పించినట్లు తెలిసింది. ఈ అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మున్సిపల్ పరిపాలన, మెట్రోరైలు అధికారులను సీఎం ఆదేశించినట్లు సమాచారం. ప్రస్తుతం నాగోలు నుంచి రహేజా ఐటీపార్క్ వరకు మెట్రో మార్గం ఏర్పాటు చేస్తున్న విషయం విదితమే. ఇప్పటికే ఉప్పల్ రింగ్రోడ్డులో మెట్రో రైలు స్టేషన్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఉప్పల్ రింగ్రోడ్డు నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదాద్రి పుణ్యక్షేత్రానికి మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేయాలంటే ప్రతి కిలోమీటరుకు రూ. 200 కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఈ స్థాయిలో నిధులను వెచ్చించే పరిస్థితి లేకపోవడంతో పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఇటీవలే రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ రెండోదశ మెట్రో మార్గాన్ని 83 కి.మీ. మేర ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ ఈ మార్గంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. ప్రభుత్వ ఆదేశాలు అందలేదు ఉప్పల్ మెట్రోరైలు స్టేషన్కు సమీపంలో ప్రయాణికులకు వివిధ రకాల మౌలిక వసతులు కల్పించేందుకు ఎకరం స్థలాన్ని హెచ్ఎంఆర్ సంస్థ లీజుకు తీసుకుంది. యాదాద్రి వరకు మెట్రో మార్గాన్ని పొడిగించే అంశంపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు మాకు ఆదేశాలేమీ అందలేదు. - ఎన్వీఎస్రెడ్డి, హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ -
వచ్చే ఏడాది ప్రారంభంలో మెట్రో పరుగులు
జంటనగరాల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ప్రారంభించిన హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు మొత్తం 2017 జూన్ నాటికి పూర్తవుతుందని హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. నాగోల్- సికింద్రాబాద్, మియాపూర్- పంజాగుట్ట మార్గాలలో మాత్రం వచ్చే సంవత్సరం ప్రారంభంలోనే మొదలవుతాయని వివరించారు. ఈ ప్రాజెక్టు లాభనష్టాలు లేని స్థితికి రావడానికి ముందు అనుకున్న సమయం కంటే ఒకటి రెండేళ్లు ఎక్కువ పట్టే అవకాశం ఉందని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన వల్ల మెట్రోపై మరీ అంత ఎక్కువ ప్రభావం పడలేదు గానీ, బ్రేక్ ఈవెన్కు వచ్చేందుకు మాత్రం ఒకటి రెండేళ్లు ఆలస్యం అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్టు ప్రారంభమైన నాలుగు- ఐదేళ్లలోనే బ్రేక్ ఈవెన్ వస్తుందని భావించామని, కానీ ఇప్పుడు ఆరేడేళ్లు పట్టేలా ఉందని ఆయన తెలిపారు. హైదరాబాద్ మంచి వాణిజ్య కేంద్రమని.. ఇది ఎప్పటికీ మారదని ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులన్నీ షెడ్యూలు ప్రకారమే జరుగుతున్నాయని, రెండు ప్రాంతాల్లో రూటు మార్పుకు సంబంధించి సాంకేతిక నివేదికలు ప్రభుత్వానికి చేరాయని ఆయన చెప్పారు. ముందు అనుకున్నట్లుగానే 2017 జూన్ నాటికి మొత్తం ప్రాజెక్టు అంతా సిద్ధంగా ఉంటుందని, మెట్రో రైలు పరుగులు తీస్తుందని ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. -
'మెట్రో రైల్లో స్థానికులకే ఉద్యోగాలు'
-
నాగోలులోని మెట్రో డిపోను సందర్శించిన దత్తాత్రేయ
హైదరాబాద్ : కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ శనివారం నాగోల్లో మెట్రో రైలు డిపోను పరిశీలించారు. మెట్రో పనులను ఆయన పర్యవేక్షించారు. దేశంలో అన్నింటికంటే హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ అధునాతనమైందని బండారు దత్తాత్రేయ అన్నారు. మెట్రో పనులు త్వరగా పూర్తి చేయటంపై ముఖ్యమంత్రి కేసీఆర్ను కలుస్తామని ఆయన తెలిపారు. మెట్రో ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ సందర్భంగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ మెట్రో ప్రాజెక్ట్ ప్రారంభంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. వచ్చే ఏడాది ప్రారంభం కావచ్చని ఆయన అన్నారు. కాగా నాగోల్ స్టేషన్ పేరును ఉప్పల్ స్టేషన్గా మార్చుతున్నట్లు చెప్పారు. -
'ఉగాదికి మెట్రో రైలు లేనట్టే!'
-
'ఉగాదికి మెట్రో రైలు పట్టాలెక్కడం లేదు'
హైదరాబాద్ : అనుకున్నట్లే అయింది. మెట్రో రైలు ఉగాదికి పట్టాలు ఎక్కటం లేదు. ఈ విషయాన్ని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సోమవారమిక్కడ తెలిపారు. అంతా సవ్యంగా జరిగితే మార్చి 21 (ఉగాదిన)న మెట్రో రైలు సర్వీసును నాగోలు- మెట్టగూడల మధ్య ప్రారంభం కావాల్సి ఉండేది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల మెట్రో రైలు తొలిదశ ప్రారంభం కావటం లేదని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.. మొత్తం ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాతే మెట్రో రైలు ఆరంభం అవుతుందని ఆయన తెలిపారు. కాగా ఇప్పటికే నాగోల్-మెట్టుగూడ రూట్లో మెట్రో స్టేషన్ల నిర్మాణం తుది దశకు చేరుకుంది. -
స్వప్నాల దారిలో...
అది ఒక మహా స్వప్నం. వైవిధ్యభరితం.... భిన్న సంసృతుల సమ్మిళితమైన చారిత్రక భాగ్యనగరిని ప్రపంచ మహా నగరాల సరసన నిలబెట్టే మహత్తర యత్నం. అదే నిలువెత్తు ఒంటి స్తంభం పట్టాలపై పరుగులు తీసే నీలి అంచుల తెల్లటి అందమైన మెట్రో రైలు. ఈ కలల సాకార యత్నంలో ఎన్నో ఒడిదుడుకులు. మరెన్నో ఆటంకాలు. ఆ ప్రతిబంధకాలనే నిచ్చెనమెట్లుగా మలుచుకొని...‘మెట్రో’ను పట్టాలెక్కించేందుకు ఆయన భగీరథ ప్రయత్నం సాగిస్తున్నారు. ఆయనే హైదరాబాద్ మెట్రో రైలు మేనేజింగ్ డెరైక్టర్... ఎన్వీఎస్ రెడ్డిగా అందరికీ తెలిసిన నల్లమిల్లి వెంకట సత్యనారాయణరెడ్డి. ‘ఆధునిక సాంకేతిక ఫలాలు సామాన్యుడి చెంతకు చేరాలనే దే నా లక్ష్యం. అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని వర్గాలకు అందుబాటులో మెట్రో రైలు ప్రయాణం ఉండాలనేది సంకల్పం. అప్పటి ప్రణాళికా సంఘ సభ్యుడు గజేంద్ర హల్దియాతో కలిసి ప్రాజెక్టు రూపురేఖలు, విధి విధానాల రూపకల్పనలో పాలు పంచుకోవడంతో నా సంకల్ప యాత్ర మొదలైందని చెప్పవచ్చు’ అంటారాయన. శనివారం మార్నింగ్ వాక్లో తన అంతరంగాన్ని, జీవన ప్రస్థానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... - సాక్షి, సిటీబ్యూరో కొత్తగా ఆలోచిస్తేనే... ఎనిమిదోతరగతిలో ఇంగ్లీష్ రాకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాను. దాంతో నెహ్రూ ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ను తెలుగులోనే చదివా. ఇంటర్ వరకు ఇంగ్లీష్ బాధలు తప్పలేదు. డిగ్రీలో మా లెక్చరర్ వై.వెంకట్రామయ్య ఆంగ్లంలో ప్రావీణ్యున్ని చేశారు. మరో లెక్చరర్ డాక్టర్ రుద్రయ్య చౌదరి గొప్ప మేథావి. ఆ ఇద్దరి నుంచి విశాల దక్పథం అలవర్చుకున్నాను. జేఎన్యూలో రషీదుద్దీన్ఖాన్ అనే ప్రొఫెసర్ చక్కటి మార్గనిర్దేశం చేశారు. ఓపెన్ మైండ్తో ఉండడం, ఓటమికి వెరవకపోవడం నేను నమ్మిన ఫిలాసఫీ. తార్కిక దక్పథంతో ఆలోచించాలి. కొత్త విషయాలను నేర్చుకోవడం అలవాటు చేసుకుంటే వరుస విజయాలు సాధించవచ్చని నమ్మాను. ఆ నమ్మకమే నన్ను విజయం వైపు నడిపించింది. ప్రతి నిత్యం కొత్తగా ఆలోచించడం నేర్చుకుంటేనే ఏ రంగంలోనైనా విజయ శిఖరాలు అధిరోహించవచ్చన్న సూత్రాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతాను.‘ డీస్కూలింగ్ సొసైటీ ’ అన్న పుస్తకం నా ఆలోచనలను బాగా ప్రభావితం చేసింది. చేదు జ్ఞాపకం... 2008లో సత్యం కుంభకోణం వెలుగు చూసినపుడు మెట్రో పనులు దక్కించుకున్న మైటాస్ సంస్థ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. మెట్రో ప్రాజెక్టుపై నీలినీడలు క మ్ముకున్నాయి. మా టీం కూడా డీలాపడింది. నన్ను ఈ బాధ్యతల నుంచి తొలగించాలని అప్పటి ప్రభుత్వంపై ఇంటా బయటా ఒత్తిడి అధికమైంది. కానీ నేను ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఆ సమయంలోనే నాకు కొన్ని బహుళజాతి సంస్థల నుంచి మంచి అవకాశాలు వచ్చాయి. ఏడాదికి రూ.కోటికి పైగా జీతం ఇస్తామన్నారు. కానీ నేను అంగీకరించలేదు. ఎంతో శ్రమించి సాధించిన మెట్రో ప్రాజెక్టును మధ్యలో వదిలేయడం ఏ మాత్రం ఇష్టం లేదు. పైగా జట్టు సభ్యులు నాపై నమ్మకంతోనే ఈ ప్రాజెక్టులో పని చేసేందుకు ముందుకొచ్చారు. తిరిగి 2010లో ఎల్అండ్టీ సంస్థ మెట్రో పనులు దక్కించుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నాం. జీవితంలో ప్రతి దశలోనూ గెలుపోటములను సమంగా భావించాను. జీహెచ్ఎంసీలో అడిషనల్ కమిషనర్గా పని చేస్తున్నపుడు పంజగుట్ట ఫ్లైఓవర్ కూలిపోయింది. నన్ను తొలగించాలని ప్రభుత్వం పైన ఒత్తిడి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ నిపుణులైన ఇంజినీర్ల బృందంతో వాస్తవాలను వెలికి తీయించారు. నా తప్పు లేదని తేలింది. రైతు కుటుంబం... తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు మా సొంతూరు. నాన్న సత్యనారాయణరెడ్డి. అమ్మ ఆదిలక్ష్మి. మాది రైతు కుటుంబం. మొదటి నుంచీ నాన్న గ్రామ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఆ రాజకీయాల్లో పడిపోయి చాలా ఆస్తులు పోగొట్టుకున్నారు. అమ్మ ఎక్కువగా చదువుకోకపోయినా లోక జ్ఞానం తెలిసిన మనిషి. జీవిత పాఠాలు అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. ఆమె నేర్పిన పాఠాలు... సమాజంలో మసలుకోవలసిన తీరు... మార్గదర్శకాలు ఇప్పటికీ నన్ను ముందుకు నడిపిస్తూనే ఉంటాయి. ఎలా జీవించాలో అమ్మ చెబితే... విధులు, బాధ్యతలు ఎలా నిర్వర్తించాలో మా తాత నుంచి నేర్చుకున్నాను. ఆయన నాకు మేనేజ్మెంట్ గురువు. ఆయన వ్యవసాయ పనులు నిర్వహించే తీరు చూసిన నేను చిన్నప్పుడే మేనేజ్మెంట్ పాఠాలు నేర్చుకున్నా. డాక్టర్ను చేయాలనుకున్నారు... అమ్మానాన్నలు నన్ను డాక్టర్ను చేయాలని కలలుగన్నారు. నేను సివిల్స్ వైపు వెళ్లాను. హైస్కూల్ వరకు మా ఊళ్లోనే చదువుకున్నాను. రామచంద్రాపురం వీఎస్ఎం కళాశాలలో ఇంటర్ చదివాను. ఆ తరవాత సివిల్స్ లక్ష్యంగా బీఏలో చేరాను. అప్పుడు మా అమ్మానాన్న, టీచర్లు కోప్పడ్డారు. సైన్స్ గ్రూపు చదివి ఆర్ట్స్కు వెళ్లడమేమిటని ని లదీశారు. కొందరు ఎగతాళి చేశారు. నేను ఎవరి మాటా వినిపించుకోలేదు. డిగ్రీలో ఆంధ్రా యూనివర్సిటీ టాపర్గా నిలిచాను. ఆ తరవాత ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ వర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్లో చేరాను. అప్పట్లో సివిల్స్కు ఎంపికయ్యే వారిలో అత్యధికులు అక్కడి వారే. తొలి ప్రయత్నంలో సివిల్స్లో విఫలమయ్యాను. రెండో ప్రయత్నంలో (1983లో) ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీసెస్ (ఐఆర్ఏఎస్)కు ఎంపికయ్యాను.పీజీలో మా పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ రషీదుద్దీన్ ఖాన్ నా సిద్ధాంత పత్రాలు చూసి..హార్వర్డ్లో ప్రొఫెసరయ్యే అర్హతలుండి...సివి ల్స్కు ప్రిపేరవ్వడం దండగనేవారు. కానీ నేను సివిల్స్ బాటనే ఎంచుకున్నా. ఆ తరువాత దక్షిణ మధ్య రైల్వేలోనూ, రాష్ట్ర ప్రభుత్వంలోనూ వివిధ పదవులు చేపట్టాను. ఎంఎంటీఎస్ మొదటి దశ రైలు పట్టాలెక్కించిన అనుభవం కూడా ఉంది. కారల్మార్క్స్ ప్రభావం నాపైన మార్క్సిజం ప్రభావం ఉంది. కారల్మార్క్స్ సాహిత్యం బాగా చదివాను. ప్రపంచంలో ఎందరో తత్వవేత్తలు ఉన్నప్పటికీ సగానికి పైగా ప్రపంచాన్ని కమ్యూనిజం వైపు మలుపు తిప్పిన గొప్ప తత్వవేత్త ఆయన. చార్లెస్ డార్విన్, కార్ల్ పాపర్, థామస్ కున్ల రచనలు బాగా ప్రభావితం చేశాయి. తెలుగు సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. ఉన్నవ లక్ష్మీనారాయణ ‘మాలపల్లి’ చిన్నప్పుడే చదివాను. చలం, రంగనాయకమ్మ, బుచ్చిబాబు, తిలక్, ఆరుద్ర, విశ్వనాథ సత్యనారాయణ, సినారె, దాశరథి, గజ్జెల మల్లారెడ్డి వంటి ఎంతోమంది రచనలు బాగా చదివాను. శ్రీశ్రీ అంటే చాలా ఇష్టం. తీపి గుర్తులు... కొంకణ్ రైల్వే ప్రాజెక్టులో పని చేసేందుకు మెట్రో మ్యాన్ శ్రీధరన్ నన్ను ప్రత్యేకంగా ఎంపిక చేశారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశాం. నగరంలో ఎంఎంటీఎస్ మొదటి దశ విజయవంతానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించాను. మన రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు మొదలైనపుడు నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ఫైనాన్స్ డెరైక్టర్గా చేరాను. రూ.500 కోట్ల నష్టంతో ఉన్న సంస్థను ఏడాది తిరిగే లోగా లాభాల బాట పట్టించడం మరిచిపోలేని తీపి జ్ఞాపకం. పేరు : ఎన్వీఎస్ రెడ్డి స్వస్థలం : తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు తల్లిదండ్రులు : సత్యనారాయణ రెడ్డి, ఆదిలక్ష్మి భార్య : {పతిమ, కస్తుర్బా గాంధీ కళాశాలలో ఇంగ్లిష్ లెక్చరర్ పిల్లలు : ఇద్దరు అబ్బాయిలు. మొదటివాడు అర్జున్. అమెరికాలో ఎంఎస్ చేసి మెకిన్సే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.రెండోవాడు రాహుల్. నగరంలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. పుట్టిన తేదీ : 13 ఏప్రిల్ 1957 అభిమాన నాయకులు : జవహర్లాల్ నెహ్రూ, మహాత్మాగాంధీ. ఇష్టమైన ప్రదేశం : సింగపూర్ హాబీలు : పుస్తక పఠనం, కవితలు రాయడం, గార్డెనింగ్. మధుర జ్ఞాపకం : చిన్నపుడు పాఠశాలలో రాసిన ఓ విప్లవ కవితకు మహాకవి శ్రీశ్రీ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకోవడం. కొంకణ్ రైల్వే ప్రాజెక్టును విజయవంతంగా పూర్తిచేసి నాటి ప్రధాన పీవీ నరసింహారావు నుంచి అవార్డు అందుకోవడం. ఇష్టమైన ఆటలు : చిన్నప్పుడు కబడ్డీ బాగా ఆడేవాడిని. ఇష్టమైన ఆహారం : చికెన్ కర్రీ, పాలకూర కర్రీ సినిమాలు : గత 30 ఏళ్లుగా చూడలేదు. చిన్నప్పుడు శంకరాభరణం చూశా. గుర్తుంచుకొనేవి : కొంకణ్ రైల్వే ప్రాజెక్టును పూర్తి చేయడం. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో మీటర్గేజ్ రైల్వే లైన్లను బ్రాడ్గేజ్లుగా మార్చే పనుల్లో కీలక బాధ్యతలు నిర్వహించడం. -
అఖిలపక్షం తరవాతే మెట్రో మార్గం ఖరారు
హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడి మెట్రో ప్రాజెక్టుకు తొలగిన అడ్డంకులు మెట్రోకు కరెంటు కష్టాల్లేవు, ఉద్యోగాలపై అసత్య ప్రచారం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరమే మారిన మెట్రోరైలు మార్గా న్ని ఖరారు చేయనున్నట్లు హెచ్ఎంఆర్ (హైదరాబాద్ మెట్రోరైల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. కొత్త అలైన్మెంట్తో సుల్తాన్బజార్, అసెంబ్లీ వద్ద మెట్రో మార్గంలో పెద్దగా దూరం పెరగలేదన్నారు. జేబీఎస్-ఫలక్నుమా (కారిడార్-2)లో అదనంగా 3.2 కి.మీ దూరం పెరిగిందన్నారు. సోమవారం హెచ్ఎంఆర్ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అలైన్మెంట్ మార్పుతో అవసరమైన ఆస్తుల సేకరణ, పెరిగే అంచనా వ్యయం పై స్వతంత్ర ఇంజనీరింగ్ ఏజెన్సీ లూయిస్ బెర్జర్ సంస్థ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందన్నారు. తాజా మార్పుతో ఆస్తులు కోల్పోయే వారికి 2012 భూసేకరణ-పునరావాస చట్టం ప్రకారం పరిహార మిస్తామన్నారు. మెట్రో స్టేషన్లు, రైళ్లలో వికలాంగులకు వసతులు కల్పిస్తామన్నారు. మెట్రోకు తొలగిన అడ్డంకులు బేగంపేట్ గ్రీన్ల్యాండ్స్ నుంచి జూబ్లీహిల్స్ వరకు మెట్రో పనులపై ఉన్న స్టేను ఇటీవలే హైకోర్టు తొల గించిందని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో ప్రాజెక్టుకు కరెంట్ కష్టాలు లేవని స్పష్టంచేశారు. ఉప్ప ల్, మియాపూర్ మెట్రో డిపోల్లో ప్రత్యేకంగా విద్యుత్ సబ్స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మెట్రో ప్రా జెక్టుకు అన్నిరకాల అడ్డంకులు తొలగినట్లేనని తెలి పారు. మొత్తం 72 కి.మీ.కి గాను 40 కి.మీ. మార్గంలో పిల్లర్ల నిర్మాణం పూర్తయిందని, 3 కారిడార్లలో 2,800 పిల్లర్లకుగాను 1,525 పిల్లర్ల నిర్మాణం పూర్తిచేశామన్నారు. పిల్లర్లపై వయాడక్ట్ సెగ్మెంట్ల అమరిక 30 కి.మీ. పూర్తయిందన్నారు. నాగోల్-మెట్టుగూడ (8 కి.మీ)మార్గంలో స్టేషన్ల నిర్మాణం తుదిదశకు చేరుకుందన్నారు. ముంబై, ఢిల్లీ కంటే ఆధునిక కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ సిస్టం (సీబీటీసీ) సాంకేతికత ఆధారంగా మెట్రో రైళ్ల రాకపోకలను నియంత్రిస్తామన్నారు. ఇందులో డ్రైవర్లెస్ టెక్నాలజీ ఉంటుందని, ఉప్పల్లోని కంట్రోల్ కేంద్రం ద్వారా 2 నిమిషాలకోమారు ఒకదాని వెనక మరొకటి వెళ్లేలా మెట్రో రైళ్ల రాకపోకలను నియంత్రిస్తామన్నారు. మెట్రో నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ, హెచ్ఎంఆర్లలో ఉద్యోగాలిప్పిస్తామంటూ సోషల్ మీడియా, వెబ్సైట్లలో జరుగుతున్న అసత్యప్రచారాన్ని నమ్మవద్దన్నారు. ప్రస్తుతానికి ఉద్యోగాల భర్తీ లేదని ఆయన స్పష్టంచేశారు. నేడు వికలాంగుల అవగాహన నడక ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా హెచ్ఎంఆర్, వికలాంగుల హక్కుల వేదికల ఆధ్వర్యంలో మంగళవారం వికలాంగుల అవగాహన నడకను నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఉదయం 7కి నెక్లెస్రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి పీపుల్స్ప్లాజా వరకు నడక ఉంటుందన్నారు. ఈ కార్యక్రమా న్ని స్పీకర్ మధుసూదనాచారి ప్రారంభిస్తారన్నారు. -
ఆధ్యాత్మిక, చారిత్రక కట్టడాలకు విఘాతం లేకుండా..
* మెట్రో అలైన్మెంట్ మార్పుపై ముఖ్యమంత్రి కేసీఆర్ * మూడు చోట్ల మార్పులకు ప్రతిపాదన * పాతబస్తీలో మెట్రో అలైన్మెంట్ మార్పుపై సీఎం సమీక్ష సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, ముస్లింల ప్రార్థనామందిరాలు, ప్రజల మనోభావాలతో ముడిపడిన ఇతర చిహ్నాలకు ఎలాంటి విఘాతం కలగకుండా ‘మెట్రో’ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చెప్పారు. మూడుచోట్ల మెట్రోరైలు మార్గాన్ని మార్చాలని ఇదివరకే తాము ఎల్ అండ్ టీకి స్పష్టం చేసినట్లు వివరించారు. పాతబస్తీలో అలైన్మెంట్ మార్పునకు సంబంధించి ఎంఐఎం పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఆర్థికశాఖ కార్యదర్శులతో సీఎం కేసీఆర్ మంగళవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. గతంలో సూచించిన మార్పులకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన నేపథ్యంలో ఎక్కడెక్కడ మార్పులు అవసరం, మెట్రో రైలు ఏ మార్గం నుంచి వెళ్లాలనే వివరాలను ఎల్ అండ్ టీకి అధికారికంగా తెలియజేసేందుకు ముఖ్యమంత్రి ఈ సమావేశాన్ని నిర్వహించారు. అసెంబ్లీ భవనంతోపాటు, ప్రజల మనోభావాలతో ముడిపడివున్న తెలంగాణ అమరవీరుల స్తూపానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అసెంబ్లీ వెనుకవైపు నుంచి వెళ్లేలా మొదటి మార్పు... వ్యాపార కేంద్రంగా పేరొందిన సుల్తాన్బజార్, బడిచౌడి మధ్యనుంచి కాకుండా ఉమెన్స్ కళాశాల వెనుకవైపు నుంచి వెళ్లేలా రెండో మార్పు ఉండాలని సూచించినట్టు తెలిపారు. ఇక, పాతబస్తీలో ప్రస్తుతం ఉన్న అలైన్మెంట్ ప్రకారం నిర్మాణం జరిగితే ఏడు హిందూ దేవాలయాలు, 28 ముస్లింల ప్రార్థనా మంది రాలు, వెయ్యి నివాసగృహాలు దెబ్బతింటాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు. ఇక్కడ అలైన్మెంట్ మార్పుతో అక్కన్న మాదన్న దేవాలయం, జగదీష్ టెంపుల్, బంగారు మైసమ్మ, లక్ష్మి నర్సింహ దేవాలయంతోపాటు ఆజాఖానా జోపురా, అసుర్ఖానా నాల్ ముబారక్, ఇత్తెబార్చౌక్ మసీదు. కోట్లా మసీదు తదితర ఆధ్యాత్మిక కట్టడాలకు ఇబ్బంది ఉండదని తెలిపారు. ఈ ప్రతిపాదనలకు సంబంధించి అలైన్మెంట్ వివరాలను ప్రభుత్వం అధికారికంగా ఎల్ అండ్టీకి అందించనుంది. ఇదిలాఉండగా, పాతబస్తీలో మెట్రోరైలు అలైన్మెంట్కు సంబంధించి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కూడా కొన్ని ప్రతిపాదనలు చేశారు. అభివృద్ధిలో భాగస్వాములవుతాం కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల్లో తామూ భాగస్వాములవుతామని ఎల్అండ్టీ గ్రూపు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎఎం నాయక్ స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు ఆయన రాసిన లేఖ విశేషాలను సీఎం కార్యాలయం మంగళవారం విడుదల చేసింది. రాష్ట్రంలో విద్యుత్, మౌలిక సదుపాయాల రంగంలో పనిచేస్తామని, ఉభయ ప్రయోజనం ఉండాలన్నది తమ అభిమతమని నాయక్ వివరించారు. ఈ నెల 15న ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో ఆయన ప్రదర్శించిన దీర్ఘకాలిక అభివృద్ధి పథకాలు, ముందుచూపు నచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన సుదీర్ఘ పోరాటం తమకు తెలుసునని వ్యాఖ్యానించారు. రాష్ట్ర సంపూర్ణ అభివృద్ధితోపాటు సామాజిక, ఆర్థికాభివృద్ధిపై ముఖ్యమంత్రి విజన్ తమను ప్రభావితం చేసిందన్నారు. గుజరాత్లోని హజిరాలో ఎల్అండ్టీ నిర్మించిన ప్రసిద్ధ తయారీ రంగ సంస్థను సందర్శించాలని ఆ లేఖలో కేసీఆర్ను కోరినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం వివరించింది. -
ఉగాది నాటికి ‘మెట్రో’
మెట్రోరైల్ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్వీఎస్ రెడ్డి శామీర్పేట: వచ్చే ఉగాది నాటికి నగరంలో మెట్రోరైలును అందుబాటులోకి తెస్తామని హైదరాబాద్ మెట్రోరైలు మేనేజింగ్ డెరైక్టర్ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా శామీర్పేట మండలం బిట్స్ పిలానీలో జరుగుతున్న ‘అట్మాస్- 2014’ టెక్నో మేనేజ్మెంట్ ఫెస్ట్లో పాల్గొన్నారు. ఏ నగరంలోనూ రూపొందించని విధంగా ఈ ప్రాజెక్టు కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నామని చెప్పారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విద్యార్థులు నూతన ఒరవడితో ముందుకు సాగాలన్నారు. మెట్రోరైలు ప్రాజెక్టుకు 80 వేల యూనిట్ల విద్యుత్ అవసరం ఉంటుందని, అందులో 35శాతం వృథా అవుతుందన్నారు. ఆధునిక పద్ధతుల్లో విద్యుత్ను ఉపయోగంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ నిర్మాణాలను రోడ్లపై నిర్మిస్తే కిలో మీటరుకు రూ. 250 కోట్లు ఖర్చు అవుతుందని, భూగర్భంలో నిర్మిస్తే కిలోమీటర్కు రూ. 600 కోట్లు అవుతుందని తెలిపారు. బిట్స్ వరకు మెట్రోరైలు నిర్మిస్తారా? అని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానమి స్తూ అల్వాల్ వరకు మెట్రో రైలు విస్తరించి, అక్కడి నుంచి బస్సులను సమకూరుస్తామన్నారు. ముగిసిన ‘అట్మాస్- 2014’ బిట్స్ పిలానీలో నాలుగు రోజు లుగా జరుగుతున్న ‘అట్మాస్- 2014’ కార్యక్రమాలు ఆదివా రం రాత్రి ముగిశాయి. దేశంలోని సుమారు 200 కళాశాలల నుంచి 1,500 మంది విద్యార్థులతో పాటు బిట్స్లోని 3వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
మెట్రోపై పూర్తి హక్కులు తెలంగాణవే
హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపై పూర్తి హక్కులు తెలంగాణవేనని దీనిపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఆదివారం ‘గ్రీన్ బకెట్ చాలెంజ్’ పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రూ.1,450 కోట్లతో మెట్రో ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. కాలుష్యంతో పట్టణ ప్రజల జీవన కాలం తగ్గిపోతోందన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం దేశ సేవగా భావించాలన్నారు. -
సీఎస్తో మెట్రో ఎండీ భేటీ
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రైలు ప్రాజెక్టు పనుల పురోగతి, తాజా పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం సచివాలయంలో సమీక్షించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైలు మేనేజింగ్ డెరైక్టర్ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్అండ్టీ ప్రతినిధులు పాల్గొన్నట్లు తెలిసింది. మెట్రో ప్రాజెక్టుపై రాజకీయ దుమారం రేగిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మెట్రో పనులు సాఫీగా జరిగేందుకు అవసరమైన ఆస్తుల సేకరణ, రహదారుల విస్తరణ ఇతర అంశాలను ఎలా పరిష్కరించాలన్న అంశంపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. కాగా, సమావేశంలో చర్చించిన అంశాలు మీడియాకు పొక్కకుండా అధికారులు పలు జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం. -
మెట్రో భూములు ఎవరికీ ఇవ్వం
రాజకీయ ఆరోపణలు అవాస్తవం: మెట్రో రైలు ఎండీ సాక్షి, హైదరాబాద్: మెట్రో రైల్ ప్రాజెక్టు భూములను ప్రైవేటు వ్యక్తులు ఎవరికీ ఇచ్చే ప్రసక్తే లేదని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టంచేశారు. రాయదుర్గంలో మెట్రో రైలుకు కేటాయించిన 31.5 ఎకరాల భూ ములను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నించినందునే.. ప్రాజెక్టు పనులు చేయలేమని ప్రభుత్వానికి ఎల్ అండ్ టీ లేఖ రాసిందంటూ కొందరు నాయకులు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2012 ఆగస్టు 28న జీవో నంబర్ 123తో ప్రభుత్వం శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం గ్రామంలోని సర్వే నంబర్ 83/1లో 15 ఎకరాల భూమిని హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు టెర్మినల్ స్టేషన్, పార్కింగ్ స్థలం అభివృద్ధి కోసం ఇచ్చినట్లు తెలిపారు. మూడో కారిడార్ను శిల్పారామం నుంచి రాయదుర్గం వరకు పొడిగించాల్సిన కారణంగా రాయదుర్గంలో ఈ 15 ఎకరాల భూమి ని ఇచ్చినట్టు వివరించారు. ఎల్ అండ్ టీ ఆధీనంలో ఉన్న ఆ స్థలాన్ని వేరే వ్యక్తులకు అప్పగించే ప్రశ్నే లేదని స్పష్టంచేశారు. కాగా, గురువారం ఎన్వీఎస్రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మను కలిశారు. అనంతరం మీడి యాతో మాట్లాడుతూ మెట్రో రైలు ముందు కు సాగుతోందని, ఆగడంలేదని తెలిపారు. -
'సాఫీగా మెట్రోరైలు ప్రాజెక్టు పనులు'
హైదరాబాద్: మెట్రో రైలు ప్రాజెక్టు పనులు సజావుగా కొనసాగుతున్నాయని హైదరాబాద్ మెట్రో రైలు మేనేజింగ్ డెరైక్టర్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో పనులపై ఈ రోజు పూర్తిస్థాయిలో పర్యవేక్షణ జరిపామని ఆయన చెప్పారు. బేగంపేట నుంచి చిలకలగూడవరకు పనులను పరిశీలించమన్నారు. అలైన్మెంట్ మార్పుపై ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎల్ అండ్ టీ సంస్థకు తెలియజేస్తామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్వర్మతో ఆయన గురువారం సమావేశమయ్యారు. మెట్రో రైలు ప్రాజెక్టు పనుల్లో పురోగతిని ప్రధాన కార్యదర్శికి వివరించారు. మెట్రో ప్రాజెక్టు పనులు సాఫీగా ముందుకుసాగుతాయని, పనులు ఎక్కడా ఆగలేదన్నారు. -
'మెట్రో' కథనాలపై కేసీఆర్ ఆగ్రహం
-
‘మెట్రో’ను దెబ్బతీసే యత్నం
ఎల్ అండ్ టీ మెట్రోరైల్ విభాగం ఎండీ వీబీ గాడ్గిల్ భారీ ప్రాజెక్టు చేపట్టినప్పుడు ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి.. వాటి పరిష్కారం కోసం ప్రభుత్వానికి లేఖలు రాస్తుంటాం దాన్ని పట్టుకొని కొన్ని పత్రికలు కావాలని అడ్డగోలుగా వార్తలు ప్రచురించాయి సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన మెట్రోరైలు ప్రాజెక్టును దెబ్బతీయడానికే కొన్ని పత్రికలు అడ్డగోలుగా కథనాలను ప్రచురించాయని ఎల్ అండ్ టీ మెట్రోరైలు విభాగం ఎండీ వీబీ గాడ్గిల్ స్పష్టం చేశారు. మహానగరంలో ఇలాంటి భారీ ప్రాజెక్టు చేపట్టినప్పుడు ఏవో సమస్యలు వస్తాయని, వాటిని పరిష్కరించుకోవడానికి వీలుగా లేఖలు రాయడం పెద్ద విషయమేమీ కాదని ఆయన పేర్కొన్నారు. గాడ్గిల్ బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. పలు సమస్యలున్న నేపథ్యంలో.. మెట్రోను టేకోవర్ చేసుకోవాలంటూ గత ఫిబ్రవరిలోనే ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్కుమార్రెడ్డికి రాసిన లేఖలో ప్రస్తావించామని గుర్తుచేశారు. అలా తాము ప్రభుత్వానికి రాసిన లేఖల్లోంచి అక్కడక్కడా కొన్ని అంశాలను మాత్రమే తీసుకుని పలు పత్రికలు ప్రచురించాయని.. సమస్య మొత్తాన్ని అర్థం చేసుకోలేదని వీబీ గాడ్గిల్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అధికారులతో తాము మంచి సమన్వయంతో కలసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. కానీ కొన్ని పత్రికలు కావాలనే పనిగట్టుకుని మెట్రోరైలు ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. మెట్రోరైలు పనులు ఆలస్యమయ్యే అవకాశాలున్న పక్షంలో... వాటిని ఉన్నతస్థాయిలో పరిష్కరించుకుంటూ ముందుకు వెళతామన్నారు. ఎన్నో సమస్యలున్నా.. దేశంలోనే అత్యంత వేగంగా మెట్రో రైలు పనులు జరుగుతున్నాయని.. మెట్రోపై వచ్చిన కథనాలపై తమ యాజమాన్యం కూడా అసంతృప్తితో ఉందని గాడ్గిల్ తెలిపారు. ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టును గడువు కంటే ముందే పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని వివరించారు. ప్రభుత్వం సహకరించకుండా.. సమస్యలు పరిష్కరించని పక్షంలో మరో ఆప్షన్ ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ.. హైదరాబాద్లో మెట్రో రైలు ప్రయోజనకరమేనని గాడ్గిల్ వివరించారు. ప్రభుత్వానికి లేఖలు రాయడం నేరమేమీ కాదన్నారు. అలైన్మెంట్ మార్పు తెలియదు.. మెట్రో రైలు మార్గం అలైన్మెంట్ మార్పు గురించి తమకు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి లేఖ అందలేదని గాడ్గిల్ వివరించారు. అసెంబ్లీ, సుల్తాన్బజార్ ప్రాంతాల్లో మాత్రం పనులు ఆపేయాలని కోరిన మాట వాస్తవమేనని అంగీకరించారు. తమకు పనిచేసుకోవడానికి రైట్ ఆఫ్ వే ఇవ్వాలని ప్రభుత్వాన్ని ముందు నుంచి కోరుతున్నట్లు వివరించారు. -
ఆ లేఖ పాతదే: ఎన్వీఎస్రెడ్డి
సాక్షి,సిటీబ్యూరో: మెట్రో ప్రాజెక్టుకు ఎదురవుతున్న అడ్డంకులపై ఎల్అండ్టీ సంస్థ ప్రభుత్వానికి రాసిన లేఖ ఈ ఏడాది ఫిబ్రవరిలో రాసినదేనని ఇందులో కొత్తవిషయమేమీ లేదని హైదరాబాద్ మెట్రో రైలు మేనేజింగ్ డెరైక్టర్ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టంచేశారు. ఆర్నెల్ల క్రితం రాసిన ఈ లేఖను భూతద్దంలో పెట్టి చూడడం సరికాదన్నారు. బుధవారం ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ..నగరంలో మెట్రో ప్రాజెక్టు పనులు సాఫీగా ముందుకుసాగుతాయని, పనులు ఎక్కడా ఆగలేదని ఒక్కో సమస్యను సానుకూలంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతున్నామన్నారు. ప్రాజెక్టు పనుల నుంచి ఎల్అండ్టీ సంస్థ వైదొలగడం లేదని స్పష్టంచేశారు. మెట్రో పనులు చేపడుతున్న ఎల్అండ్టీ సంస్థ ప్రభుత్వానికి పలు అంశాలపై లేఖలు రాయడం సహజమేనన్నారు. ఎల్అండ్టీ,హెచ్ఎంఆర్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ సూచనలు,మార్గదర్శకాల మేరకు పనిచేస్తున్నాయని ఈ విషయంలో రాద్ధాంతం అవసరం లేదని తెలిపారు. -
'మెట్రో' కథనాలపై కేసీఆర్ ఆగ్రహం
మెట్రో రైల్వేపై వచ్చిన కథనాలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే ప్రయత్నమని మండిపాటు సీఎంను కలిసి వివరణ ఇచ్చిన ‘మెట్రో’ ఎండీ, ఎల్అండ్టీ సంస్థ ఎండీ రెండో దశపై చర్చ కోసం ఢిల్లీకి సీఎస్, ప్రభుత్వ సలహాదారు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణంపై ఎల్అండ్టీ సంస్థ చేతులెత్తేసిందంటూ పలు పత్రికల్లో వచ్చిన కథనాలపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కథనాలు తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకమని.. ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే యత్నమని ఆయన మండిపడ్డారు. బుధవారం సీఎం కేసీఆర్ మెట్రో రైలు ప్రాజెక్టు పురోగతిపై ప్రభుత్వ సీఎస్ రాజీవ్శర్మ, ‘ఎల్అండ్టీ మెట్రో రైల్’ ఎండీ వీబీ గాడ్గిల్, మెట్రో రైలు ప్రాజెక్టు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సలహాదారు పాపారావుతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ‘మెట్రో’పై పత్రికల్లో వచ్చిన కథనాలు చర్చకు రాగా... అవి తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎల్అండ్టీ సంస్థ, ప్రభుత్వం మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరగడం సాధారణ ప్రక్రియని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా ఎల్అండ్టీ రాసిన లేఖలోని కొన్ని అంశాలను మాత్రమే పేర్కొంటూ ప్రాజెక్టుపై తప్పుడు అభిప్రాయం కలిగించేలా పలు పత్రికల్లో కథనాలు రావడంపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మెట్రోరైలు ప్రాజెక్టును కావాలనే తప్పుడు కోణంలో చూపించే యత్నం జరిగిందని అభిప్రాయపడ్డారు. మెట్రోరైలుకు సంబంధించిన సమస్యలు ఈ సమీక్షా సమావేశంలో పరిష్కారం అయ్యాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే మెట్రోరైలుకు సంబంధించి వచ్చిన కథనాలపై ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఉదయమే సచివాలయానికి చేరుకుని ప్రభుత్వ సీఎస్ రాజీవ్శర్మ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషీకి వివరణ ఇచ్చారు. సీఎం సచివాలయానికి వచ్చాక ఆయనను కూడా కలిసి విషయం వివరించారు. ఇదే సమయంలో ఎల్అండ్టీ మెట్రో ఎండీ వీబీ గాడ్గిల్ సైతం సచివాలయానికి చేరుకుని సీఎస్తో సమావేశమయ్యారు. అనంతరం సీఎంతో కొద్దిసేపు భేటీ అయ్యారు. రెండో దశ కోసం ఢిల్లీకి సీఎస్.. మెట్రో రైలు రెండో దశ పై ప్రభుత్వ సీఎస్ రాజీవ్శర్మ, సలహాదారు పాపారావు ఢిల్లీ వెళ్లి సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతారని సీఎం కేసీఆర్ తెలిపారు. అలాగే మెట్రోరైలు నిపుణుడు శ్రీధరన్ సలహాలు కూడా తీసుకుంటారని చెప్పారు. -
కేసీఆర్తో సీఎస్, మెట్రో ఎండీ భేటీ, వివరణ
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్తో బుధవారం మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి భేటీ అయ్యారు. ఆయనతో పాటు తెలంగాణ సీఎస్ కూడా సమావేశం అయ్యారు. మెట్రో ప్రాజెక్ట్పై మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన ఈ సందర్భంగా కేసీఆర్కు వివరణ ఇచ్చినట్లు సమాచారం. కాగా అంతకు ముందు మెట్రో ఎండీ, తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మను కలిశారు. మరోవైపు కేసీఆర్ తీరు వల్లే మెట్రో రైలు ప్రాజెక్ట్ నుంచి ఎల్అండ్టీ తప్పుకుంటామంటోందని విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై మెట్రో ఎండీ వివరణ ఇస్తూ మెట్రో ప్రాజెక్ట్ పనులు ఆగిపోలేదని, కొనసాగుతున్నాయని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రోరైలు ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు లేవని, దీనిపై వస్తున్న వదంతులను నమ్మొద్దని పేర్కొన్నారు. ప్రాజెక్టు అమలు విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిపై ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతూనే ఉంటాయని ఆయన చెప్పారు. -
'ఉగాదికి మెట్రో రైలు సర్వీసు ప్రారంభం'
హైదరాబాద్: నగరంలో మెట్రో రైలు పనులు వేగవంతంగా జరగుతున్నాయని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఉగాది పర్వదినాన మెట్రో రైలు సర్వీసును నాగోలు మెట్టగూడల మధ్య ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం మెట్రో ఎండీ మీడియాతో మాట్లాడుతూ... మెట్రో ట్రయిల్ రన్ త్వరలో నిర్వహిస్తామని చెప్పారు. మరో నాలుగు బోగీలను తెప్పిస్తున్నామని అన్నారు. మెట్రో కోసం ఇప్పటి వరకు రూ. 4600 కోట్లు ఖర్చ చేసినట్లు వివరించారు. మెట్రో రైలు నిర్మాణంపై ప్రభుత్వం చేసిన సూచనలు పరిశీలిస్తున్నామని తెలిపారు. అసెంబ్లీ, ఎంజీఎంల వద్ద భూగర్బ రైలు మార్గం లేనట్టే అని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానిదే అని చెప్పారు. -
మెట్రో అలైన్మెంట్ మార్పుపై కేసీఆర్ ఆరా
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఎలివేటెడ్ మెట్రో రైలు అలైన్మెంట్ (మార్గం) మార్పుపై ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎల్ అండ్ టీ, హెచ్ఎంఆర్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. శనివారం రాత్రి సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఎల్ అండ్ టీ ఎండీ ఈడీ గాడ్గిల్, హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిలతో సమావేశమయ్యారు. ముఖ్యం గా సుల్తాన్ బజార్ చారిత్రక మార్కెట్, మొజాం జాహి మార్కెట్, గన్పార్కు, అసెంబ్లీ మీదుగా వెళ్లే మెట్రో మార్గాన్ని భూగర్భ మార్గం గుండా మార్చితే ఎలా ఉంటుందన్న అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి తక్షణం నివేదిక సమర్పించాలని ఆయన అధికారులను ఆదేశించా రు. కాగా, నగరంలో ఇప్పటికే ఈ మార్గంలో పలుచోట్ల ఎల్ అండ్ టీ సంస్థ పిల్లర్లు నిర్మించిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వారి వా దనతో సీఎం ఏకీభవించకుండా, తాను చెప్పిన అంశాన్ని సీరియస్గా పరిగణించాలని స్పష్టం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నగర చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించే కట్టడాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా మెట్రో పనులు చేపట్టాలని సూచించారు. కాగా, సమావేశంలో చర్చించిన అంశాలను మీడియాకు లీక్ చేయవద్దని సీఎం సంబంధిత అధికారులను గట్టిగా ఆదేశించినట్లు సమాచారం. -
హెచ్ఎమ్ఆర్ ఎమ్డి NVS రెడ్డితో చిట్ఛాట్
-
యమస్పీడ్గా మెట్రో
= 2015 ఉగాదికి పట్టాలపైకి రైలు = ఇప్పటి వరకు రూ. 4,000 కోట్లు ఖర్చు = రికార్డు స్థాయిలో 1000వ పునాది పూర్తి = ఒప్పందం ప్రకారమే భూ కే టాయింపులు = అలైన్మెంట్ మార్చే ప్రసక్తే లేదు = మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టీ సీఈవో వి.బి.గాడ్గిల్ వెల్లడి సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ మెట్రోరైలు పనులు శరవేగంగా సాగుతున్నాయని నిర్మాణ, నిర్వహణ సంస్థలు స్పష్టం చేశాయి. ముందుగా చెప్పినట్టే 2014 డిసెంబర్ నాటికి నాగోల్- మెట్టుగూడ తొలిదశ పనులు పూర్తిచేసి 2015 ఉగాది (మార్చి 21)న తొలిరైలు నడుపుతామని పునరుద్ఘాటించారు. హైదరాబాద్ మెట్రో పనుల పురోగతిని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్.వి.ఎస్. రెడ్డి, ఎల్ అండ్ టీ మెట్రోరైలు సీఈఓ, ఎండీ వి.బి.గాడ్గిల్ గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు. ఎక్కడా రాజీ పడకుండా, ముందస్తు ప్రణాళిక ప్రకారమే మెట్రో పనులు సాగుతున్నాయన్నారు. ఇప్పటివరకు మెట్రోరైలు పనుల కోసం ఎల్అండ్టీ సంస్థ రూ. 3,100 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 900 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. నిర్మాణ పనులు పూర్తయిన తరువాతే కేంద్ర ప్రభుత్వం ఒప్పందం ప్రకారం వీజీఎఫ్ కింద అందజేస్తుందని చెప్పారు. మెట్రో రైలు కోసం రూ. 16,375 కోట్లు ఫైనాన్షియల్ క్లోజర్ను ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. మెట్రో పిల్లర్లకు పునాదులు మొదలుకొని వాటి నిర్మాణం, స్పాన్ ఏర్పాటుతో పాటు ఉప్పల్, మియాపూర్లలో డిపోల పనులు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగుతున్నట్లు వారు తెలిపారు. మూడు కేరిడార్లలో నిర్మించతలబెట్టిన 2,434 పిల్లర్స్(స్థంభాలు)లో భాగంగా రెండు రోజుల క్రితమే 1000వ పిల్లర్కు పునాది పడిందని, ఇది అంతర్జాతీయ రికార్డుగా వారు పేర్కొన్నారు. వీటిలో 26 కిలోమీటర్ల మేర అంటే 850 పిల్లర్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. 11 కిలోమీటర్ల వరకు సెగ్మెంట్ల అనుసంధానం పూర్తయిందని చెప్పారు. 72 కిలోమీటర్ల మెట్రోలైన్లో 28వేల సెగ్మెంట్లు అవసరమవుతాయని, వీటి నిర్మాణం కోసం ఉప్పల్, కుత్బుల్లాపూర్లలో ప్రత్యేక యార్డులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. నగరంలోని ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని పిల్లర్ల ఏర్పాటు, సెగ్మెంట్లు అమర్చడం, స్పాన్ తయారుచేయడం అనే ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉప్పల్లో డిపో నిర్మాణం పనులు 83 శాతం పూర్తికాగా, మియాపూర్ డిపోలో 63 శాతం పనులు పూర్తయినట్లు వివరించారు. నిర్దేశిత మొదటిదశ సివిల్ పనులు 90 శాతం వరకు పూర్తయ్యాయని, నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు స్టేషన్ల ఏర్పాటు, రైల్వేట్రాక్ ఏర్పాటు, ఇతర సాంకేతిక పనులు కూడా జరుగుతున్నాయని తెలిపారు. రైలు కోచ్లు, సిగ్నలింగ్, రైలు నియంత్రణ వ్యవస్థ, సీబీటీసీ టెక్నాలజీ, ఎఎఫ్సీ వ్యవస్థల కోసం అంతర్జాతీయంగా మేటి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. పారదర్శకంగా, ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా ఎల్ అండ్ టీ, హెచ్ఎంఆర్, రాష్ట్ర ప్రభుత్వం మెట్రో పనులను సాగిస్తున్నట్లు తెలిపారు. మెట్రో అలైన్మెంట్ మార్పులు, ఇతరత్రా వస్తున్న ఆరోపణలను వారు కొట్టేశారు. ఒప్పందం ప్రకారమే ఎల్ అండ్ టీకి భూ కేటాయింపులు: ఎన్వీఎస్ రెడ్డి నిర్మాణ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే భూ కేటాయింపులు జరిగాయని మెట్రోరైలు ఎండీ ఎన్.వి.ఎస్. రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. కొందరు వ్యక్తులు ఐదేళ్లుగా మెట్రోరైలు పనులు అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, వారి ఆరోపణలేవీ ఇప్పటి వరకు నిరూపితం కాలేదని అన్నారు. అయినా నిర్మాణ సంస్థకు కేటాయించిన భూములు పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసి, నిర్ణీత గడువు పూర్తయిన తరువాత రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించడం జరుగుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. 269 ఎకరాల భూమి ఎల్ అండ్ టీ సంస్థకు ఇవ్వాల్సి ఉండగా, డిపోల కోసం 212 ఎకరాలు కేటాయించారని, మిగతా 57 ఎకరాలు పార్కింగ్, సర్క్యులేషన్ కోసం ఇవ్వాలన్నారు. ఈ 57 ఎకరాల్లో ఇప్పటి వర కు 34.5 ఎకరాలే ఎల్ అండ్ టీకి ఇవ్వగా, మరో 22 ఎకరాలు కేటాయించలేదన్నారు. ఒప్పందం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్థలాలు ఇవ్వాల్సి ఉందని, కోర్టు కేసులు, ఇతర సమస్యల వల్ల సాధ్యం కాలేదని చెప్పారు. హైదరాబాద్కు మెట్రోరైలు తలమానికం లాంటిదన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో దేశ, విదేశాల్లో నిర్మాణాలు జరిపే సంస్థ ఎల్ అండ్ టీ అని, రాజకీయ జోక్యానికి తలవంచదని ఎల్ అండ్ టీ మెట్రోరైలు సీఈవో గాడ్గిల్ స్పష్టం చేశారు. అలైన్మెంట్ మార్పులు, ఒత్తిళ్లకు తలొగ్గడం వంటివేవీ ఉండవని ఆయన వివరించారు. -
అక్టోబరు 2న నగరానికి మెట్రో మోడల్ కోచ్
నగరవాసుల కలల మెట్రో రైలుకోచ్ త్వరలో నగరానికి చేరుకోనుంది. అక్టోబరు 2న మోడల్ కోచ్ను నక్లెస్రోడ్డులో ప్రదర్శించనున్నట్లు హెచ్ఎంఆర్ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. అన్ని వర్గాల సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకొని ఈ భోగీల్లో మార్పులు చేర్పులు చేస్తామన్నారు. దక్షిణకొరియాకు చెందిన హ్యూండాయ్ రోటెమ్ కంపెనీ మెట్రో రైలు భోగీలు(కోచ్)తయారు చేస్తున్న విషయం విదితమే. ఇప్పటికే ఈ సంస్థకు 171 భోగీలకు ఆర్డరు ఇచ్చినట్లు ఎండీ తెలిపారు. అత్యాధునిక వసతులుండే ఈ ఏసీ భోగీ ఒక్కొక్కటి రూ.10 కోట్ల వ్యయంతో తయారవుతున్నాయన్నారు. కాగా రాష్ట్ర విభజన అంశంతో సంబంధం లేకుండా నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు గడువులోగా పట్టాలెక్కుతుందని ఆయన స్పష్టంచేశారు.