OBC
-
మూగబోయిన దళితుల గొంతుక
పది రోజుల క్రితం మరణించిన వి.టి.రాజశేఖర్ మండల్ నిశ్శబ్ద విప్లవం ప్రారంభం కాకముందే దళితవాదం వైపు మళ్లారు. ఒక కన్నడ అగ్రకుల శూద్ర శెట్టి అయినప్పటికీ దళితుల కోసం అదే పేరుతో(దళిత్ వాయిస్) ఒక పత్రికను స్థాపించారు. దానివల్ల సామాజిక ఒంటరితనాన్ని అనుభవించారు. ఆయన బలమైన జాత్యహంకార వ్యతిరేకి. చివరివరకూ దళిత ఉద్యమకారులకు, రచయితలకు అండగా నిలిచారు. దళితులు–ఓబీసీల ఐక్యత కంటే దళితులు–ముస్లింల ఐక్యత గురించిన ఆయన ఆలోచన మరింత స్థిరమైనది. ముస్లింగా మారకపోయినా, ఇస్లాం మతానికి బలమైన మద్దతుదారుగా నిలిచారు. అంటరానితనానికి వ్యతిరేకంగా, దళిత విముక్తి ప్రచారకర్తగా ఆయన లాంటి ఏ ఉన్నత శూద్ర మేధావీ ఇప్పటివరకూ ఉద్భవించలేదు.2024 నవంబర్ 20న 93 సంవత్సరాల వయస్సులో వి.టి.రాజశేఖర్ మరణం, ఒక కోణంలో నన్ను తీవ్రంగా బాధించినప్పటికీ, మరో కోణంలో ఆయన జీవితాన్నీ, వారసత్వాన్నీ వేడుకగా జరుపుకొనే వీలు కల్పించింది. ఆయన భారతదేశ వ్యాప్తంగానూ, దేశం వెలుపలా కూడా ఉన్న నాలాంటి ఉద్యమకారులకు, రచయితలకు ధైర్యం, విశ్వాసం కలిగించిన స్నేహితుడూ, మార్గదర్శకుడూ! ఆయన వల్లే నా పుస్తకం ‘నేను హిందువు నెట్లయిత’ (వై ఐ యామ్ నాట్ ఎ హిందూ)కు 2008లో ‘లండన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియా’(లీసా) అవార్డు వచ్చింది. వెస్ట్మినిస్టర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ (బ్రిటిష్ పార్లమెంట్)లో నా ఉపన్యాసం తర్వాత జరిగిన అవార్డు వేడుకకుఆయన వ్యక్తిగతంగా హాజరయ్యారు. మేము లండన్లో ప్రపంచ రాజ కీయాల గురించి చర్చించుకుంటూ, కలిసి భోజనం చేస్తూ విలువైన సమయం గడిపాము.ఆయన, ఆయన పత్రిక గురించి నాకు తెలియకముందే, ఒక చక్కటి సమీక్ష రాసి, నా పుస్తకానికి తన ‘దళిత్ వాయిస్’ పాఠకులలో ప్రాచుర్యం కలిగించారు. ఆయన భిన్నాభిప్రాయాలకు సంబంధించిన విషయాలపై వెంటనే తగాదాకు తెరతీయగల వ్యక్తి, కానీ అదే సమయంలో విషయాలు ఆమోదయోగ్యమైన స్థానాలకు మారిన ప్పుడు స్నేహాన్ని పునరుద్ధరించగల వ్యక్తి. ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’లో పని అనుభవంతో, దృఢమైన పాత్రికేయ నేపథ్యంతో, బంట్ అని కూడా పిలువబడే కన్నడ శెట్టి సంఘం నుండి వచ్చిన వి.టి. రాజశేఖర్కు దళిత విముక్తిపై ఉన్న తిరుగులేని వైఖరి నిజంగా విశేషమైనది. చనిపోయే వరకు ఆయన దళితవాద నిబద్ధతతోనే ఉన్నారు. ఆయన తరాన్ని అలా ఉండనివ్వండి, అంటరానితనానికి వ్యతిరేకంగా, దళిత విముక్తి ప్రచారకర్తగా ఆయన లాంటి ఏ ఉన్నత శూద్ర మేధావీ ఇప్పటివరకూ ఉద్భవించలేదు.‘దళిత్ వాయిస్’ని ప్రారంభించిన తర్వాత తన మధ్యతరగతి ఉన్నత కుల స్నేహితులందరినీ కోల్పోయానని ఆయన చెప్పారు.బెంగళూరులోని తన సొంత ఇంటి నుండి ఆ పత్రిక రచన, ముద్రణ, పంపిణీని ఒంటరిగా నిర్వహించారు.మండల్ నిశ్శబ్ద విప్లవం ప్రారంభం కాకముందే ఆయన దళితవాదం వైపు మళ్లారు. అప్పట్లో అంబేడ్కర్ అనంతర దళితులకు ఇంగ్లిష్ చదవడం, రాయడానికి సంబంధించిన పాండిత్యం లేదు. దళిత్ పాంథర్ మరాఠీ సాహిత్య ఉద్యమం కారణంగా దళిత్ అనే పదం కొన్ని మీడియా సర్కిళ్లలో మాత్రమే గుర్తించబడుతోంది.ఆయన కూడా ఒక రిపోర్టర్గా బొంబాయి నగరంలో ఉన్నందున, ఏకంగా ఒక పత్రికను ప్రారంభించడం ద్వారా ‘దళిత’ అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తేవడంలోని ప్రాముఖ్యతను వెంటనే అర్థం చేసు కున్నారు. కానీ ఒక కన్నడ అగ్ర కుల శూద్ర శెట్టికి ఆ నిర్ణయం తీసుకోవడం, పర్యవసానంగా సామాజిక ఒంటరితనాన్ని ఎదుర్కో వడం, ముఖ్యంగా తన జర్నలిస్టు సర్కిళ్లలో ఒక హింసాత్మక ప్రక్రియ అయి ఉండాలి!ఒక లాభదాయకమైన జర్నలిస్టు ఉద్యోగాన్ని విడిచిపెట్టి, ఆ శీర్షికతో ఆంగ్ల పత్రికను ప్రారంభించడం మండల్కు ముందటి పరిస్థితుల్లో ఊహించుకోండి. 2024 లోనే దళిత, ఓబీసీ, ఆదివాసీలకు చెందిన జర్నలిస్టులు ఎంత మంది ఉన్నారని రాహుల్ గాంధీ ఒక జాతీయ మీడియా సమావేశంలో ప్రశ్నించగా, అందులో ఎవరూ చేయి ఎత్తలేదు. అది కూడా ఒక ప్రధాన ప్రతిపక్ష రాజకీయ నేత, విదేశీ మీడియా సమక్షంలో... ఇదీ పరిస్థితి! దేశంలోని ప్రముఖ మీడియాలో ఉన్న ఆంగ్ల బ్రాహ్మణ జర్నలిస్టు కులతత్వపు వలయాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించిన ఒంటరి శూద్రుడు వీటీ రాజశేఖర్ అయివుండాలి! ప్రధాన స్రవంతి మీడియాలోని కులతత్వం కారణంగా ఆయన నిరాశతో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. తన ప్రత్యర్థులతో పోరాడేందుకు రాడికల్ దళిత్ జర్నల్ను ప్రారంభించానని నాకు చెప్పారు.ఆయన భారతదేశంలోని అగ్రవర్ణ జర్నలిజంతో ఎప్పుడూ రాజీ పడలేదు. దళిత్ వాయిస్ను ప్రారంభించిన తర్వాత ఆయన కథనాలు ఏ జాతీయ ఆంగ్ల వార్తాపత్రికలోనూ కనిపించలేదు. భారతీయ మీడియా గురించి చర్చ జరిగినప్పుడల్లా ఆయన దాని కులతత్వాన్ని దుయ్యబట్టేవారు. అగ్ర కులాల భారతీయ వార్తాపత్రికలన్నీ ‘టాయి లెట్ పేపర్లు’ అనేవారు. నేను జాతీయ వార్తాపత్రికలలో రాస్తున్నానని తెలుసుకున్నప్పుడు, ఆయన నాతో ‘మీ ఆలోచనలను అగ్రవర్ణాల వారికి అమ్మవద్దు, వారు మారరు’ అన్నారు. వాస్తవానికి నేను చిరునవ్వుతో దానిని అక్కడే వదిలేశాను. ఎందుకంటే ప్రధాన స్రవంతి మీడియాలో వీలైనంత ఎక్కువగా పాల్గొనాలనీ, రాయాలనీ నేను నమ్ముతాను. అలాంటి విభేదాలు ఉన్నప్పటికీ ఆయన చనిపోయే వరకు మా స్నేహం ఆప్యాయంగా కొనసాగింది.దళితులు–ఓబీసీల ఐక్యత కంటే దళితులు–ముస్లింల ఐక్యత గురించి ఆయన ఆలోచన మరింత స్థిరమైనది. దళితుల కంటే ఓబీసీలు ఆర్ఎస్ఎస్/బీజేపీతో కలిసి వెళ్తారని ఆయన అన్నారు. ఆయన ముస్లింగా మారకపోయినా, ఇస్లాం మతానికి బలమైన మద్దతుదారుగా నిలిచారు. తన పాకిస్తాన్ పర్యటనల కారణంగా కొంతకాలం పాటు ఆయన వీసా రద్దు చేయబడింది. ఆయన బలమైన జాత్యహంకార వ్యతిరేకి. యూదులకు వ్యతిరేకంగా పదే పదే వ్యాసాలు రాశారు.తన జీవితం చివరి రోజుల్లో ఆరోగ్య కారణాల వల్ల బెంగళూరు నుండి మంగళూరుకు మారిన తర్వాత ఆయన మౌనం మరింత పెరిగింది. అయినప్పటికీ, తన 80వ దశకం చివరి వరకూ ప్రయాణిస్తూనే ఉన్నారు. 2016లో హైదరాబాద్ సెంట్రల్ యూని వర్సిటీలో రోహిత్ వేముల వ్యవస్థీకృత హత్యకు వ్యతిరేకంగాజరిగిన నిరసన సభకు హాజరయ్యేందుకు వచ్చినప్పుడు నేను చివరిసారిగా ఆయనను కలిశాను. దురదృష్టవశాత్తు క్యాంపస్లోకి ప్రవేశించడానికి ఆయనను అనుమతించలేదు. అయినప్పటికీ గేటు వద్ద చాలాసేపు నిల్చొని నిరసన తెలిపారు. అది దళితుల పట్ల ఆయనకున్న నిబద్ధత.ఆయన ఎప్పుడూ ఖాదీ కుర్తా, పైజామా ధరించే వ్యక్తి. ఒక సాధారణ కన్నడ కాంగ్రెస్ రాజకీయ నాయకుడిలా కనిపిస్తారు. కానీ ఆయన నిజమైన మతం మారిన దళిత మేధావి.ఈ సంవత్సరం ప్రారంభంలో పాల్ దివాకర్ బృందం ‘దళిత్ వాయిస్’ను డిజిటలైజ్ చేశారు. ఆ వెబ్సైట్ ప్రారంభోత్సవానికిబెంగళూరు ఇండియన్ సోషల్ ఇన్ స్టిట్యూట్కు నన్ను ఆహ్వానించారు. దురదృష్టవశాత్తు నేను వెళ్ళలేకపోయాను. అయితే ఈ లెజెండరీ దళితుడు జీవించి ఉన్నప్పుడే అది జరిగింది.శూద్ర అగ్రవర్ణం నుండి దళితవాదంలోకి మారి, వారి విముక్తి కోసం తన జీవితాంతం పోరాడగలిగే మరో రాజశేఖర్ ఉద్భవిస్తాడని అనుకోలేము. ఆయన దళిత్ వాయిస్ పత్రిక ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఆఫ్రికాలో, అనేక ముస్లిం దేశాలలో ప్రసిద్ధి చెందింది.ప్రపంచంలోని అత్యంత అణగారిన ప్రజల విముక్తి కోసం బతికిన ఆయన ఇంత సుదీర్ఘ జీవితం తర్వాత ఈ భూమిని విడిచి పెట్టారు. కాబట్టి, మనం కూడా జీవించి ఉన్నంత కాలం వీటీ రాజ శేఖర్ జీవితాన్ని, ఆలోచనలను, రచనలను వేడుకగా జరుపుకోవాలి. గుడ్ బై వీటీఆర్.-వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త - ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ -
నాయబ్సింగ్ సైనీ అనే నేను..
చండీగఢ్: హరియాణా ముఖ్యమంత్రిగా ఓబీసీ నాయకుడు నాయబ్సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం చేశారు. పంచకులలోని దసరా గ్రౌండ్లో గురువారం అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. నూతన మంత్రుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. గురువారం వాలీ్మకి జయంతి కావడంతో ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారానికి బీజేపీ నాయకత్వం ఇదే రోజును ముహూర్తంగా ఎంచుకుంది. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, చిరాగ్ పాశ్వాన్తోపాటు బీజేపీ/ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, భూపేంద్ర పటేల్, ప్రమోద్ సావంత్, హిమంత బిశ్వ శర్మ, విష్ణుదేవ్ సాయి, పుష్కర్సింగ్ దామీ తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం కంటే ముందు సైనీ గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇటీవల జరిగిన హరియాణా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను కమలం పార్టీ 48 స్థానాలు గెలుచుకుని వరుసగా మూడోసారి అధికారంలోకి వచి్చంది. మోదీ అభినందనలు హరియాణా సీఎం నాయబ్సింగ్ సైనీతోపాటు కొత్త మంత్రులకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. మంత్రివర్గం కూర్పు చక్కగా ఉందని ప్రశంసించారు. ఈ మేరకు గురువారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. హరియాణా ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తుందని, రాష్ట్ర అభివృద్ధిని నూతన శిఖరాలకు చేరుస్తుందని పేర్కొన్నారు. పేదలు, రైతులు, యువత, మహిళలతోపాటు సమాజంలోని ఇతర వర్గాల సంక్షేమం, సాధికారత విషయంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు. బీజేపీతో మూడు దశాబ్దాల అనుబంధం బీజేపీ సీనియర్ సీనాయకుడు నాయబ్సింగ్ సైనీని మరోసారి అదృష్టం వరించింది. హరియాణా సీఎంగా వరుసగా రెండోసారి ఆయన ప్రమాణం చేశారు. ఈ ఏడాది మార్చి నెలలో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. మనోహర్లాల్ ఖట్టర్ స్థానంలో ఆయనను బీజేపీ అధిష్టానం నియమించింది. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడంతోపాటు ఓబీసీల ఓట్లపై గురిపెట్టిన కమల దళం అదే వర్గానికి చెందిన సైనీని తెరపైకి తీసుకొచి్చంది. ఈ ప్రయోగం సత్ఫలితాలు ఇచి్చంది. హరియాణాలో బీజేపీ వరుసగా మూడోసారి నెగ్గింది. అనూహ్యంగా పార్టీని గెలిపించిన సైనీకే మళ్లీ సీఎం పీఠం దక్కింది. ఆయన సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. సైనీ 1970 జనవరి 25న అంబాలా జిల్లాలోని మీర్జాపూర్ మాజ్రా గ్రామంలో జని్మంచారు. మూడు దశాబ్దాలుగా బీజేపీలో కొనసాగుతున్నారు. పార్టీలో వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో ఎమ్మెల్యేగా, 2019లో ఎంపీగా గెలిచారు. 2014 నుంచి 2019 దాకా మనోహర్లాల్ ఖట్టర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2023 అక్టోబర్లో హరియాణా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఖట్టర్ ఈ ఏడాది మార్చి సీఎం పదవితోపాటు కర్నాల్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఖట్టర్ స్థానంలో సైనీ ముఖ్యమంత్రి అయ్యారు. మే నెలలో జరిగిన కర్నాల్ ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అక్టోబర్ 5న జరిగిన అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో లాడ్వా స్థానం నుంచి 16,054 ఓట్ల మెజారీ్టతో జయకేతనం ఎగురవేశారు. -
పార్లమెంట్ ఓబీసీ సంక్షేమ కమిటీ సభ్యునిగా బీద మస్తాన్ రావు
ఢిల్లీ, సాక్షి: పార్లమెంట్లో ఓబీసీ సంక్షేమ కమిటీ సభ్యునిగా వైఎస్సార్ర్సీపీ రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు ఎన్నికయ్యారు. ఓబీసీల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ కమిటీ పరిశీలించనుంది. ఎన్నిక పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఎంపీ బీద మస్తాన్రావు.. ముందుగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే.. ఓబీసీ లకు ఉద్యోగాలలో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కమిటీ తరఫున నిష్పక్షపాతంగా పరిశీలిస్తానని, ఓబీసీల సంక్షేమానికి సంబంధించిన విషయాల్ని పరిశీలించి పార్లమెంటుకు నివేదిక సమర్పిస్తానని చెప్పారు. -
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు!
ముంబై : తన గొంతెమ్మ కోర్కెలతో వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఐఏఎస్ పరీక్ష గట్కెక్కేందుకు ఆమె పలు నకిలీ పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతుండగా..తాజాగా ఆమెకున్న కోట్లలో విలువ చేసే ఆస్తులు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ (ఓబీసీ)నాన్ క్లిమిలేయర్ సర్టిఫికెట్లు మరింత భవిష్యత్తును మరింత ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.పూజా ఖేడ్కర్ ప్రకటన ప్రకారం.. గత ఏడాది తన ఆస్తులు ఎంతున్నాయనే వివరాల్ని జనవరి1,2024 అప్డేట్ చేసింది. వాటి ఆధారంగా పూజా ఖేడ్కర్కు మహరాష్ట్రలో సొంతంగా ఐదు ప్లాట్లు,రెండు అపార్ట్మెంట్లు ఉండగా..ఆ మొత్తం స్థిరాస్థుల విలువ రూ.22 కోట్లుగా ఉంది.దీంతో పాటు పూణే జిల్లా మహాలుంగేలో రూ.16 కోట్లు విలువ చేసే రెండు ఫ్లాట్లు, ధడవాలిలో రూ.4 కోట్ల విలువైన రెండు ప్లాట్లు, అహ్మద్నగర్లోని పచుండేలో రూ.25లక్షలు, నందూర్లో రూ.1 కోటి విలువ చేసే ల్యాండ్లు ఉన్నాయి. పచుండే,నందూరులోని ప్లాట్లు ఆమె తల్లి తనకు బహుమతిగా ఇచ్చినట్లు తెలిపింది. మొత్తం మీద ఆమెకు 22 ఎకరాలకు పైగా భూమి ఉంది.అహ్మద్నగర్,పూణేలో రెండు అపార్ట్మెంట్లు ఉన్నాయి. అహ్మద్నగర్లోని సవేదిలో రూ.45లక్షలు విలువ చేసే 984 చదరపు అడుగుల ఫ్లాట్, పూణేలోని కోంధ్వాలోని 724 చదరపు అడుగుల అపార్ట్మెంట్ విలువ రూ.75 లక్షలుగా ఉన్నట్లు వెల్లడించింది. ఈ మొత్తం ఆస్తుల ద్వారా ఖేడ్కర్ 2014-2019 మధ్య ఏడాదికి రూ.42 లక్షలు సంపాదించారు.పూణేకు చెందిన ఆర్టీఐ కార్యకర్త విజయ్ కుంభార్ ప్రకారం ఆమె తండ్రి ఆస్తుల విలువ రూ.40 కోట్లకు పైమాటే.పైగా ఓబీసీ నాన్ క్రిమిలేయర్ఐఏఎస్ పరీక్ష గట్టెక్కేందుకు పూజా ఖేడ్కర్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ పత్రాలు సమర్పించారు. ఈ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ప్రయోజనం పొందే అభ్యర్ధుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం లేదా కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు. కానీ ఆమె ఆస్తులు,తల్లిదండ్రుల ఆస్తులు కోట్లలో ఉంటే ఐఏఎస్కు ఎలా ఎంపికయ్యారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాగా పూజా ఖేడ్కర్ వ్యవహారం మరింత వివాదం కావడంతో ఆమె సమర్పించిన డాక్యుమెంట్లను పరీశీలించేందుకు కేంద్రం ఏక సభ్య ప్యానెల్ను ఏర్పాటు చేసింది.రెండు వారాల్లో కమిటీ తన నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. -
ప్రభుత్వానికి థాంక్స్.. కేటీఆర్
-
Rahul Gandhi: ప్రధాని మోదీ జన్మతః ఓబీసీ కాదు
ఝార్సుగూడ(ఒడిశా): ప్రధాని మోదీ జన్మతః ఇతర వెనుకబడిన వర్గం(ఓబీసీ)వ్యక్తి కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తనను తాను ఓబీసీ అని చెప్పుకుంటూ ప్రజలను మోదీ తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. మోదీ ఘాంచి కులంలో పుట్టారని, 2000 సంవత్సరంలో గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం ఈ కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చిందని వివరించారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా గురువారం రాహుల్ గాంధీ ఒడిశాలోని ఝార్సుగూడలో జరిగిన సభలో మాట్లాడారు. గుజరాత్కు ముఖ్యమంత్రి అయ్యాక మోదీయే ఈ కులాన్ని ఓబీసీలో చేర్చారు. ఈ దృష్ట్యా, మోదీ పుట్టుకతోనే ఓబీసీకి చెందిన వ్యక్తి కారని పేర్కొన్నారు. అంతకుముందు, మోదీది తెలి కులమని పేర్కొన్న రాహుల్ ఆ తర్వాత తన ఉద్దేశం ఘాంచి కులమంటూ వివరణ ఇచ్చారు. దేశంలో సామాజిక న్యాయం సాధించకుండా ప్రధాని మోదీ కులగణనను ఎప్పటికీ చేపట్టలేరని రాహుల్ చెప్పారు. ఓబీసీలతో కరచాలనం చేయని మోదీ బిలియనీర్లను మాత్రం ఆలింగనం చేసుకుంటారని విమర్శించారు. ‘ఒడిశాలోని గిరిజనుల భూములను లాగేసుకునేందుకు కుట్ర జరుగుతోంది. రాష్ట్రంలోని అధికార బీజేడీ, బీజేపీల మధ్య పీ, డీ తేడా మాత్రమే ఉంది. మిగతాదంతా సేమ్ టూ సేమ్. ఒకే నాణేనికి ఈ పారీ్టలు రెండు పార్శా్వలు’అని రాహుల్ పేర్కొన్నారు. ఒడిశాలో సుమారు 200 కిలోమీటర్ల మేర సాగిన జోడో యాత్ర గురువారం ఛత్తీస్గఢ్లోకి ప్రవేశించింది. -
పేదరికమొకటే కులమన్నపుడు.. ఓబీసీనని ఎలా చెప్పుకుంటారు?
జగదల్పూర్: దేశంలో పేదరికం ఒక్కటే కులమన్న ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ తాను ఇతర వెనుకబడిన వర్గానికి (ఓబీసీ) చెందిన వాడినని ఎలా చెప్పుకుంటారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిలదీశారు. చత్తీస్గఢ్లోని జగదల్పూర్లో శనివారం రాహుల్ ఎన్నికల సభలో ప్రసంగించారు. గిరిజనులను ‘ఆదివాసీ’లకు బదులుగా వనవాసీలని సంబోధిస్తూ బీజేపీ వారిని అవమానిస్తోందని అన్నారు. ‘బీజేపీ నాయకులు ఆదివాసీలను వనవాసీలు అనే పేరుతో పిలుస్తున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ఈ వనవాసీ పదాన్ని పరిచయం చేశాయి. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. మధ్యప్రదేశ్లో ఓ బీజేపీ నాయకుడు గిరిజన యువకుడిపై మూత్రం పోశాడు. దీన్ని వీడియో తీసి వైరల్ చేశారు. ఇదీ బీజేపీ ఆలోచనాధోరణి. అడవుల్లో జంతువుల్లా మిమ్మల్ని వారు చూస్తారు’ అని రాహుల్ పేర్కొన్నారు. ఆదివాసీలే దేశానికి అసలు సిసలైన యజమానులు. అందుకే బీజేపీ ఈ పదాన్ని వాడదు. ఆదివాసీలని సం¿ోదిస్తే... మీ భూమి, నీళ్లు, అడవులను మీకు ఇచ్చేయాల్సి వస్తుందని బీజేపీ భయమని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ధ్వజమెత్తారు. -
అధికారంలోకి రాగానే ఓబీసీ గణన
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ / సాక్షి, నాగర్కర్నూల్/కల్వకుర్తి/ సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఓబీసీ జనగణన చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చెప్పారు. దేశంలో 50 శాతానికి పైగా ఉన్న ఓబీసీలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నారని తెలిపారు. అయితే దేశంలో ఎంతమంది ఓబీసీలు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు ఉన్నారో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. బీజేపీ పాలనలో దేశాన్ని నడిపించేది లోక్సభ, రాజ్యసభలోని ఎంపీలు కాదని, కేవలం 90 మంది అధికారుల చేతుల్లోనే ఈ ప్రభుత్వం ఉందని చెప్పారు. వీరిలో ముగ్గురు మాత్రమే ఓబీసీలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఓబీసీ అధికారులకు తగిన ప్రాధాన్యత లేదని.. ఓబీసీలకు శక్తి ఇవ్వడానికి బీజేపీ, బీఆర్ఎస్ ఇష్టపడవంటూ మండిపడ్డారు. దేశాన్ని నడిపించే అవకాశం ఓబీసీ, దళిత, గిరిజన, మైనార్టీలకు రాకూడదా? అని ప్రశ్నించారు. బుధవారం నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో కాంగ్రెస్ విజయ భేరి బహిరంగ సభతో పాటు మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో, సాయంత్రం రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో నిర్వహించిన కార్నర్ మీటింగుల్లో ఆయన మాట్లాడారు. మోదీ, కేసీఆర్లు ఉలిక్కిపడేలా చేశా.. ‘దేశంలో, రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ విద్వేషాలను పెంచాయి. వీటికి ఎక్కడా స్థానం లేదు. అందుకే నేను ప్రేమ, ఆప్యాయతలు పెంచేలా దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేశా. ఒక బజార్లో నేను ప్రేమను పంచే దుకాణాన్ని తెరిచా. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల సమరం కొనసాగుతోంది. ఓ వైపు దొరలు, కేసీఆర్, కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులు.. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఒకటిగా కలిసి పనిచేస్తున్నాయి. ఎక్కడైనా కాంగ్రెస్ పోటీ చేస్తే అక్కడ ఎంఐఎం అభ్యర్థులు ప్రత్యక్షమవుతారు. వారికి బీజేపీ నేతలే డబ్బులు పంపుతారు. కాళేశ్వరంలో కేసీఆర్ దోచుకున్న సొమ్ము కూడా ఆయా రాష్ట్రాల్లోని అభ్యర్థులకు చేరుతోంది. విపక్ష నేతలపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు జరుగుతాయి. సీఎం కేసీఆర్పై మాత్రం ఏ దాడులూ ఉండవు. ఇదెందుకో గ్రహించాలి. ప్రధాని మోదీ నన్ను రోజూ తిడుతూనే ఉంటారు. ఆయనతో యుద్ధం చేస్తున్నా. 24 గంటలు తిట్టేలా కదిలించా. నాపై 24 కేసులు పెట్టారు.. నా లోక్సభ సభ్వత్వాన్ని రద్దు చేశారు.. ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు కూడా లాక్కున్నారు. అయినా నేను భయపడలేదు. యావత్ హిందుస్తాన్, తెలంగాణే నా ఇల్లు.. అవసరమైతే కోట్లాది మంది ప్రజలే నన్ను అక్కున చేర్చుకుంటారు. కేసీఆర్ కూడా ప్రతి క్షణం ఉలిక్కి పడేలా చేశా. నా పేరు వినపడితే చాలు.. నిద్రలోనూ ఉలిక్కిపడుతున్నారు..’ అని రాహుల్ అన్నారు. ఒక్క ప్రాజెక్టు కూడా సరిగ్గా కట్టలేదు ‘రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో ఇష్టారాజ్యంగా అంచనాలు పెంచారు. లక్ష కోట్ల సొమ్మును సీఎం కేసీఆర్ పేదల జేబు నుంచి లాక్కొని కనీసం ఒక్కదానిని కూడా సరిగ్గా కట్టలేదు. కుంగిపోయిన కాళేశ్వరం బ్యారేజీ నిర్మాణాన్ని సీఎం సమీక్షించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ఒక రాజులా పేదలపై పెత్తనం చెలాయిస్తున్నారు. మంత్రిత్వ శాఖల్లో ఎక్కువ డబ్బులు వచ్చే మద్యం, ఇసుక, భూమి వంటి వాటిని కేసీఆర్ కుటుంబ సభ్యులే చూసుకుంటున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికి తప్ప ప్రజలకు లాభం జరగలేదు. అందుకే ప్రజలంతా కేసీఆర్కు బైబై అంటున్నారు. కేసీఆర్ దోచిన సొమ్ము కక్కించి ప్రతి పైసా పేదల ఖాతాల్లో వేస్తాం. నేను ప్రధాని మోదీలా కాదు. ఆయనలా మాట తప్పను. ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నీ నెరవేరుస్తాం..’ అని చెప్పారు. ప్రతి ఎకరా తిరిగి పేదలకు పంచుతాం.. ‘భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో తీసుకొచ్చిన ధరణి సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లక్ష ఎకరాలు మాయం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఎకరాను తిరిగి స్వా«దీనం చేసుకుంటాం. ఆ భూములను మళ్లీ పేదలకు పంచి పెడతాం. పేదలకు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం కూడా అందజేస్తాం..’ అని హామీ ఇచ్చారు. కేవలం 2% ఓట్లతో ఓబీసీని సీఎం ఎలా చేస్తారు? ‘తెలంగాణలో బీజేపీ లీడర్లు భుజాలు ఎగిరేసి తిరిగేటోళ్లు. కాంగ్రెస్ పార్టీ వాళ్ల గ్యాస్ తీసేసింది. కారు నాలుగు టైర్లను పంక్చర్ చేసింది. రాష్ట్రంలో ఓబీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ చెబుతోంది. కేవలం 2 శాతం ఓట్లతో సీఎంని ఎలా చేస్తారు. మోదీ అమెరికా వెళ్లి ఓబీసీని ప్రెసిడెంట్ చేస్తామని చెప్పినట్టుగా ఉంది. అమెరికాలో ఓబీసీ ప్రెసిడెంట్ను, ఇక్కడ మీరు.. సీఎంను ఏర్పాటు చేయలేరు..’ అని రాహుల్ ఎద్దేవా చేశారు. మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలి: రేవంత్ రాష్ట్రంలో అభివృద్ధితో పాటు మార్పు కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. రూ.లక్ష కోట్లు మింగి కాళేశ్వరం ప్రాజెక్టు సరిగా కట్టలేకపోయారని ఆరోపించారు. మొన్న మేడిగడ్డ కుంగితే, నిన్న సుందిళ్ల పగుళ్లు బారిందని అన్నారు. పని మంతుడు పందిరేస్తే, కుక్క తోక తగిలి కూలిపోయినట్టుగా సీఎం కేసీఆర్ పనితీరు ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి లక్షలాది ఎకరాలకు నీరందించింది కాంగ్రెస్సేనని చెప్పారు. జన గణనతోనే బీసీల అభివృద్ధి: భట్టి నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కన్నీళ్లే మిగిలాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. బీసీల జనగణన జరిగితేనే బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రతి ఇంటికీ చేర్చాలని, భూసంస్కరణలు తీసుకొచ్చి పేదలకు భూములు పంచిన కాంగ్రెస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. సభల్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్రెడ్డి, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మల్లురవి, పార్టీ అభ్యర్థులు కసిరెడ్డి నారాయణరెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, అనిరుధ్రెడ్డి, జి. మధుసూదన్రెడ్డి, వీర్లశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇలావుండగా అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన కల్వకుర్తి మండలం జిల్లెలకి చెందిన రైతు చంద్రయ్య కుటుంబసభ్యులను రాహుల్ పరామర్శించారు. చంద్రయ్య భార్య తిరుపతమ్మ, కొడుకు నితిన్తో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందంటూ ధైర్యం చెప్పారు. నేడు అంబట్పల్లిలో 5వేల మంది మహిళలతో సభ రాహుల్ గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లికి రానున్నారు. ఇక్కడ 5 వేల మంది మహిళలతో మహిళా సాధికారతపై సభ నిర్వహించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ బ్యారేజీ)లో పియర్లు కుంగిన ప్రాంతాన్ని కూడా రాహుల్ సందర్శించనున్నారు. దాదాపు మూడు గంటలపాటు అక్కడ ఉంటారని సమాచారం. కాగా హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం కాంగ్రెస్ చేసిన విజŠక్షప్తి మేరకు జిల్లా కలెక్టర్ అనుమతి ఇచ్చారు. రాహుల్తో నేతల భేటీ బుధవారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టులోని నోవాటెల్ హోటల్లో కాంగ్రెస్ కీలక నేతలు పలువురు రాహుల్తో సమావేశమయ్యారు. రేవంత్, భట్టితో పాటు ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీ రాజయ్య, షబ్బీర్ అలీ తదితరులు వీరిలో ఉన్నారు. కొడంగల్ నియోజకవర్గం బీఆర్ఎస్కు చెందిన సుమారు రెండొందల మంది కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. -
ఓ వైపు గాంధీ.. మరోవైపు గాడ్సే: రాహుల్ గాంధీ
భోపాల్: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే లోక్సభ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య జరిగే యుద్ధంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అభివర్ణించారు. ఒక వైపు మహాత్మాగాంధీ, మరోవైపు ఆయనని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే మధ్య ఎన్నికల పోరు జరగనుందన్నారు. తాము అధికారంలోకి వస్తే ఓబీసీల సంఖ్య తెలుసుకోవడానికి కులగణన చేపడతామని చెప్పారు. ఈ డిసెంబర్లో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్లోని షాజపూర్లో జన ఆక్రోశ్ ర్యాలీలో రాహుల్ గాంధీ శనివారం పాల్గొన్నారు. ‘‘ఈ సారి ఎన్నికల పోరు రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు బీజేపీ, ఆరెస్సెస్, ఒక వైపు మహాత్మాగాంధీ మరోవైపు గాడ్సేలు నిలిచి పోరాడతారు. ప్రేమ, సోదరభావం ద్వేషానికి మధ్య ఈ పోరాటం ఉంటుంది’’ అని రాహుల్ చెప్పారు. బీజేపీ ప్రజలకి ఏం ఇస్తే వారు అదే తిరిగి ఇస్తారని, ఇన్నాళ్లూ బీజేపీ వారిలో విద్వేషం నింపిందని, ఇప్పుడు ప్రజలే బీజేపీని ద్వేషిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ఈ దేశంలో ఆరెస్సెస్కు చెందిన కొందరు కేంద్ర ప్రభుత్వ అధికారులే చట్టాలు చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని, బీజేపీ ప్రజాప్రతినిధులకి ఎలాంటి పాత్ర లేదని అన్నారు. ఆరెస్సెస్ చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఆడుతోందని రాహుల్ ఆరోపించారు. అవినీతి కేంద్రంగా ఎంపీ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కుల ప్రాతిపదికన జనాభా గణన చేపడతామని రాహుల్ మరోసారి స్పష్టం చేశారు. ఇతర వెనుకబడిన కులాల (ఓబీసీ) సంఖ్యను తెలుసుకోవడానికే కుల గణన చేపడతామన్నారు. అవినీతికి మధ్యప్రదేశ్ కేంద్రంగా మారిందని రాహుల్ ఆరోపించారు. బీజేపీ హయాంలో గత 18 ఏళ్లలో 18 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రాహుల్ చెప్పారు. -
మహిళా రిజర్వేషన్ బిలుపై బీజేపీ నాయకురాలు అసంతృప్తి
న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్ భవనంలో మొదటి బిల్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టిన బీజేపీ ప్రభుత్వం ఈసారి బిల్లు ఆమోదం పొందుతుందన్న ఆశాభావంతో ఉండగా సీనియర్ బీజేపీ నేత ఉమాభారతి బిల్లుపై అసంతృప్తిని వ్యక్తం చేసారు. బిల్లులో ఓబీసీ మహిళల ప్రస్తావన లేకవడం నిరాశ కలిగించిందన్నారు. ప్రధానికి లేఖ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహళలకు ముస్లిం మైనారిటీ మహిళలకు చోటు కల్పించకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు సీనియర్ బీజేపీ నేత ఉమాభారతి. ఈ సందర్బంగా ఆమె ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఎట్టకేలకు పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా ఉంది. కానీ బిల్లులో ఓబీసీల ప్రస్తావన లేకపోవడం నిరాశ కలిగించిందన్నారు. నమ్మకం కోల్పోతాం.. మొత్తం 33 శాతం రిజర్వేషన్లలో సగం ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ, వెనుకబడిన ముస్లిం మహిళలకు కేటాయించాలని కోరారు. లేదంటే వెనుకబడిన బీసీ ముస్లిం మహిళలలోనూ ఓబీసీ మహిళలలోనూ పార్టీ నమ్మకాన్ని కోల్పోతుందని అన్నారు. గతంలో హెచ్డి దేవెగౌడ ప్రభుత్వం ఇలాంటి బిల్లునే ప్రవేశ పెట్టగా అందులో కూడా తాను కొన్ని మార్పులు సూచించానని అటుపై ఆ బిల్లు స్టాండింగ్ కమిటీకి పంపించారని గుర్తు చేశారు. బిల్లు ఆమోదం పొందాలంటే.. ఇక మహిళా రిజర్వేషన్ బిల్లు సాకారం కావాలంటే రాజ్యాంగంలోని 239-ఏఏ, 330, 332, 334 అధికరణల సవరణ అవసరమని బిల్లులో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అలాగే జనగణన, డీలిమిటేషన్ తర్వాతే మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వచ్చాక పదిహేనేళ్ల పాటు అమలవుతుందని, తర్వాత ప్రత్యేక చట్టం ద్వారా చట్టాన్ని కొనసాగించాల్సి ఉంటుందని ప్రభుత్వం బిల్లులో పేర్కొంది. ఇది కూడా చదవండి: రాజ్యాంగంలో ఆ 'రెండు' పదాలు మిస్సింగ్: అధిర్ రంజన్ చౌదరి -
మహిళా రిజర్వేషన్ బిల్లు చరిత్రాత్మకం
సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్కు సంబంధించిన బిల్లు ఆమోదం విషయంలో కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సోమవారం రాత్రి తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడాన్ని స్వాగతించారు. బిల్లులో పేర్కొన్న అంశాలపై స్పష్టత ఇవ్వాలని, ఆమోదంలో ఎలాంటి అడ్డంకులు తలెత్తకుండా చూడాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాల్సిందిగా ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రోజుల క్రితం లేఖ రాసిన విషయాన్ని కవిత గుర్తు చేశారు. ఇదే తరహాలో చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్ బిల్లును కూడా ప్రవేశ పెడితే తాము మద్దతు ఇస్తామని కవిత ప్రకటించారు. కాగా మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో హైదరాబాద్లోని ఎమ్మెల్సీ కవిత నివా సం వద్ద సంబురాలు జరి గాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరు తూ ఇటీవల 40కి పైగా రాజకీయ పార్టీల నేతలకు ఎమ్మెల్సీ కవిత లేఖలు రాసిన విషయా న్ని ప్రస్తావిస్తూ మిఠాయిలు పంచారు. -
గ్రీజ్ అంటిన చేతితో తాకాడని.. దళితుడి ఒంటికి మలం రాశాడు!
చత్తర్పూర్: అనుకోకుండా గ్రీజ్ పూసిన చేతితో తాకినందుకు ఓబీసీ కులానికి చెందిన ఓ వ్యక్తి తనకు మలం పూశాడంటూ మధ్యప్రదేశ్కు చెందిన ఓ దళితుడు ఆరోపించడం కలకలం రేపుతోంది. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. దశరథ్ అహిర్వార్ అనే వ్యక్తి బికౌరా గ్రామంలో పంచాయతీ మురుగుకాల్వ నిర్మాణ పనులు చేస్తున్నాడు. సమీపంలోని చేతి పంపు వద్ద రామ్కృపాల్ పటేల్ స్నానం చేస్తున్నాడు. గ్రీజ్ అంటిన చేతితో తాకడంతో ఆగ్రహించిన పటేల్ చేతిలోని మగ్గుతో మలాన్ని తీసుకువచ్చి అహిర్వార్ ముఖం, తల సహా ఒంటిపై రాశాడు. కులం పేరుతో దూషించాడు. పంచాయతీ పెద్దలు అహిర్వార్కు రూ.600 జరిమానా కూడా విధించారు. బాధితుడు కేసు పెట్టడంతో పటేల్పై కేసు నమోదయ్యాయి. వారు సరదాగా వస్తువులు విసిరేసుకున్నారు. అది కాస్తా ఇలా వికటించినట్టు విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. కాగా, మధ్యప్రదేశ్లోని సిద్ధి జిల్లాలో గిరిజన యువకుడిపై ఒక వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైన విషయం తెలిసిందే. -
ఎస్పీకి ఎదురుదెబ్బ... ఎన్డీయే కూటమిలో చేరిన కీలక పార్టీ..
లక్నో: 2024 ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. దేశంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూటమి దిశగా పావులు కదుపుతుండగా.. అటు.. ఎన్డీయే తన మిత్ర పక్షాలన్నిటినీ ఏకం చేయడానికి జులై 18న సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్లో సమాజ్ వాదీ పార్టీకి రెండోసారి ఎదురుదెబ్బ తగిలింది. తన మద్దతుదారైన సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బీస్పీ) బీజేపీతో చేతులు కలిపింది. మరో ఎమ్మెల్యే దారా సింగ్ చౌహాన్ కూడా బీజేపీలో చేరనున్నారు. తూర్పు యూపీలో ఓబీసీ సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బీస్పీ) ఎన్డీయే గూటికి చేరింది. ఈ మేరకు సామాజిక న్యాయం, దేశ భద్రత, వెనకబడిన, అణగారిన వర్గాల అభివృద్ధి కోసం బీజేపీతో కలిసి పోరాడేందుకు సిద్ధమైనట్లు ఆ పార్టీ అధినేత ఓం ప్రకాశ్ రాజ్భర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధాని మోదీకి, హోం మంత్రి అమిత్ షాకు, సీఎం యోగి ఆదిత్య నాథ్కు ధన్యవాదాలు తెలిపారు. भाजपा और सुभासपा आए साथ सामाजिक न्याय देश की रक्षा- सुरक्षा, सुशासन वंचितों, शोषितों, पिछड़ों, दलितों, महिलाओं, किसानों, नौजवानों, हर कमजोर वर्ग को सशक्त बनाने के लिए भारतीय जनता पार्टी और सुहेलदेव भारतीय समाज पार्टी मिलकर लड़ेगी। pic.twitter.com/CDMXCc9EAM — Om Prakash Rajbhar (@oprajbhar) July 16, 2023 యూపీలో యోగీ ఆదిత్యనాథ్ మొదటిసారి సీఎంగా ఉన్న కాలంలో ఓం ప్రకాశ్ మంత్రి పదవి పొందారు. ఆ తర్వాత దానికి రాజీనామా చేసి సమాజ్వాదీ పార్టీ తరపున చేరి 2022 ఎన్నికలో పోరాడారు. ప్రస్తుతం మళ్లీ ఎన్డీయే గూటికి చేరారు. దీనిపై బీజేపీపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 2024 ఎన్నికల్లో తమ 'వెనకబడిన, దళిత, మైనారిటీ' ఫార్ములాకు బీజేపీ భయపడిందని ఆరోపించారు. తిట్టినవారిని కూడా బీజేపీ తమ వర్గంలో కలిపేసుకుంటున్నారని అన్నారు. ఎస్బీస్పీ ఎన్డీయేలో చేరినప్పటికీ ఆ పార్టీ ఓటర్ల మద్దతు తమకే ఉంటుందని ఎస్పీ నాయకులు చెప్పారు. #WATCH | SBSP chief Om Prakash Rajbhar speaks on his decision of joining the NDA alliance "We met Union Home Minister Amit Shah on July 14 and discussed various issues and decided to fight the 2024 elections together. I want to thank PM Modi, HM Amit Shah, CM Yogi Adityanath… pic.twitter.com/gvI0whp1dl — ANI (@ANI) July 16, 2023 సమాజ్వాదీ పార్టీకి చెందిన దారా సింగ్ చౌహాన్ నిన్ననే తన అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. బీజేపీతో కలవడానికి అమిత్ షాను కలిశారు. ఈయన కూడా ఒకప్పుడు యోగీ వర్గం నుంచి రాజీనామా చేసి 2022లో బీజేపీకి వ్యతిరేకంగా ఎస్పీ తరపున పోరాడారు. తూర్పు యూపీ నుంచి బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం వహించిన చౌహాన్ మళ్లీ ఇప్పుడు సొంత గూటికే చేరారు. ఇదీ చదవండి: ఉత్తరాదిలో దంచికొడుతున్న వానలు.. మళ్లీ యమునకు పోటెత్తిన వరద.. రెడ్ అలర్ట్ జారీ.. -
త్రిముఖ పోరులో కన్నడనాట కులాల కోలాటం.. కరుణ కోసం పార్టీల ఆరాటం
మన దేశంలో ఎన్నికలంటేనే కులం చుట్టూ తిరుగుతుంటాయి. అందులోనూ కర్ణాటక రాజకీయాల్లో కులాలు, మతాల పాత్ర మరీ ఎక్కువ. లింగాయత్, వొక్కలిగ, ఓబీసీ, ముస్లిం వర్గాలు నాలుగు స్తంభాలుగా ఎన్నికల ఫలితాలను శాసిస్తూ వస్తున్నాయి. అందుకే మరోసారి వారి మనసు చూరగొనేందుకు బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్) సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి... కర్ణాటకలో త్రిముఖ పోరు నేపథ్యంలో కులాలవారీగా ఓటర్లను ఆకర్షించడంలో బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. జేడీ(ఎస్) మాత్రం ప్రధానంగా రాష్ట్ర జనాభాల్లో లింగాయత్ల తర్వాత అత్యధికంగా 15% ఓటర్లున్న వొక్కలిగ ఓటు బ్యాంకునే నమ్ముకుంది. 59 అసెంబ్లీ స్థానాలున్న పాత మైసూరు ప్రాంతంలో వొక్కలిగలు ఇప్పటికీ మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడను ఎంతగానో ఆరాధిస్తారు. ఆ ఓటు బ్యాంకును చీల్చే లక్ష్యంతో ఎన్నికల ముందు నుంచే కోటా రాజకీయాలకు బీజేపీ తెర తీసింది. దాంతో దాన్ని ఎలాగైనా కాపాడుకునే పనిలో జేడీ(ఎస్) తలమునకలుగా ఉంది. కోటాతో రాజకీయ ఆట అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే అధికార బీజేపీ అన్ని సామాజిక వర్గాల ఓట్లూ రాబట్టేలా వ్యూహాలు పన్నడం మొదలు పెట్టింది. 2018 ఎన్నికల్లో 100కు పైగా స్థానాలు సాధించినా మెజారిటీ మాత్రం అందలేదు. పాత మైసూరులోని 59 సీట్లలో ఆరు మాత్రమే దక్కడం అందుకు ప్రధాన కారణం. దాంతో ఈసారి సరిగ్గా ఎన్నికల వేళ ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ సంచలనం నిర్ణయం తీసుకోవడమే గాక వాటిని బలమైన సామాజిక వర్గాలైన లింగాయత్, వొక్కలిగలకు చెరో 2 శాతం చొప్పున పంచింది. ఈ నిర్ణయం పాత మైసూరు ప్రాంతంలో తమ భాగ్యరేఖలను కాస్త మెరుగు పరుస్తుందని ఆశ పడుతోంది. అలాగే ఎస్సీ రిజర్వేషన్లను 15 నుంచి 17 శాతానికి పెంచడమే గాక అంతర్గత కోటాను అమలు చేయాలని కూడా నిర్ణయించింది. ఈ నిర్ణయాలను లింగాయత్లు, దళితుల్లో ఒక వర్గం ఆహ్వానించినా ముస్లింలు భగ్గుమంటున్నారు. బంజారాల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అంతర్గత రిజర్వేషన్లతో తమకు మరింత అన్యాయం జరుగుతుందన్న భయం వారిలో ఉంది. పాత మైసూరులో బీజేపీ ఏకంగా 41 మంది వొక్కలిగలకు టికెట్లిచ్చింది! వీరు వ్యవసాయం మీద ఆధారపడ్డవారే కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ కార్యక్రమాలు బాగా జనంలోకి వెళ్లేలా ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తరచూ పాత మైసూరులో పర్యటిస్తున్నారు. హింద్ వర్సెస్ అహిందా లింగాయత్, బ్రాహ్మణుల ఓట్లతో పాటుగా హిందూత్వ ఓటు బ్యాంకునే బీజేపీ బాగా నమ్ముకుంది. హిందూత్వ, దేశభక్తి, అభివృద్ధి నినాదాలతో ఓట్లు రాబట్టజూస్తోంది. బాహుబలిగా పేరొందిన లింగాయత్ నేత బి.ఎస్.యడియూరప్పనే ముందుంచి ఎన్నికల వ్యవహారాలను నడిపిస్తోంది. 51 మంది లింగాయత్లకు టికెట్లిచ్చింది. కానీ బలమైన లింగాయత్ నేతలైన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాది పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం బీజేపీలో తాజాగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాను కనీసం 25 సీట్లలో బీజేపీ అవకాశాలకు గండి కొడతానన్న శెట్టర్ హెచ్చరికలను వారు గుర్తు చేస్తున్నారు. ఓబీసీలు ఎటువైపో...! వీరశైవ లింగాయత్లలో బీజేపీ ఓట్లలో 2 నుంచి 3% తమకు వస్తాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. హిందూత్వకు పోటీగా అహిందా (ఓబీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ) నినాదంతో ఓట్లు కొల్లగొట్టే పనిలో పడింది. ఓబీసీల్లో ఒకప్పుడు కాంగ్రెస్కు ఓటుబ్యాంకుగా ఉన్న బిల్వాస్, మొగవీరాస్, విశ్వకర్మ, కొలిస్లు కొన్నేళ్లుగా బీజేపీ వైపు తిరిగారు. ఈసారి లింగాయత్, వొక్కలిగలు ఏ ఒక్క పార్టీకీ పూర్తిస్థాయిలో మద్దతునిచ్చే అవకాశాలు లేవన్న అభిప్రాయాల నడుమ ఈ ఓబీసీల ఓటు బ్యాంకే కీలకంగా మారింది. వారి ఓటుబ్యాంకును ఈసారి బీజేపీ నిలబెట్టుకోని పక్షంలో దానికి కాంగ్రెస్ నుంచి గట్టి ముప్పు పొంచి ఉన్నట్టే! – సాక్షి, నేషనల్ డెస్క్ -
తెలంగాణలో ఓబీసీలకు సముచిత స్థానం.. ప్రధాని హామీ: సురేష్
సాక్షి, హైదరాబాద్: ఓబీసీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని ఓబీసీ మోర్చా సోషల్ మీడియా జాతీయ సభ్యులు పెరిక సురేష్ పేర్కొన్నారు. ప్రతాప్గఢ్ ఎంపీ సంగమ్ లాల్ ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా ప్రతినిధులు ప్రధాని నరేంద్రమోదీని కలిసి ఓబీసీల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అంశంపై సానుకూలంగా స్పందించారు. దేశంలో సామాజిక, ఆర్థిక అసమానతలను రూపుమాపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని, వెనుక బడిన వర్గాలకు వెన్ను దన్నుగా నిలిచి తోడ్పాటు అందిస్తామని హామీ నిచ్చినట్లు సురేష్ తెలిపారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ వ్యతిరేక విధానాలతో ఓబీసీలు విసిగిపోయి బీజేపీ పట్ల ఆకర్షితులు అవుతున్నారని అన్నారు. ప్రస్తుతం బీజేపీలో ఓబీసీలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తున్నారని, అయితే జనాభాకు అనుగుణంగా ఓబీసీలకు పార్టీలో మరింత ప్రాధాన్యత కల్పించాలని ప్రధాని మోదీని కోరినట్లు వెల్లడించారు. పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని, అందరి కృషితో రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ఓబీసీలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని ప్రధాని హామీనిచ్చారని సురేష్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చదవండి: పేపర్ లీక్ కేసులో కీలక ట్విస్ట్.. -
బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు
ఏలూరు (టూటౌన్): స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ చెప్పారు. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఏలూరులో ఆదివారం నిర్వహించిన సామాజిక చైతన్యసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీసీల అభివృద్ధి, సంక్షేమానికి ప్రధాని మోదీ పెద్దపీట వేస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా గత పాలకుల విధానాల కారణంగా చేతివృత్తులు అంతరించిపోయే పరిస్థితి దాపురించిందని చెప్పారు. బీసీలను లక్ష్యంగా చేసుకుని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు తర్వాత వారిని చిన్నచూపు చూస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో తమ మిత్రపక్షమైన జనసేనతో కలిసి పనిచేస్తామని ఆయన చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ అధికారంలోకి రావడానికి సహకరించిన కేఈ కృష్ణమూర్తిని టీడీపీ నేత చంద్రబాబు నాయుడు పక్కనబెట్టారన్నారు. ఏపీలో బీసీలను అభివృద్ధి చేయడంలో, రాజకీయంగా ముందుంచడంలో బీజేపీ కృషిచేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో 56 కార్పొరేషన్లు ఉన్నాయని, బీజేపీ అధికారంలోకి వస్తే కార్పొరేషన్లకు రూ.10 వేలకోట్లు, కాంట్రాక్టులు ఇస్తామని చెప్పారు. రూ.3 వేల కోట్లతో మొక్కలు పెంచే కార్యక్రమాన్ని బీసీ కార్పొరేషన్లకే ఇస్తామన్నారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపీశ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఆరుజిల్లాలకు చెందిన మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
BP Mandal: మండల్ దన్నుతో ఉద్యమించాలి!
ఇండియా జనాభాలో సగాని కన్నా ఎక్కువ ఉన్న వెనుక బడిన తరగతులవారు (బీసీలు)... తరతరాలుగా భారతీయ సమాజానికి సేవ చేస్తున్నారు. కానీ వారు మాత్రం అన్ని రంగాల్లో వెనక బడే ఉన్నారు. అందుకే బీసీల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయడం కోసం 1953 జనవరిలో కాకా కలేల్కర్ కమిషన్ను అప్పటి ప్రభుత్వం నియమించింది. 1955 మార్చిలో కమిషన్ నివేదిక సమర్పించి బీసీల అభివృద్ధికి పలు సూచనలు చేసింది. ఆ నివేదికను ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. 1977లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక... కాక కలేల్కర్ కమిషన్ నివేదిక సమర్పించి చాలా ఏండ్లు అయిందని... కొత్త కమిషన్ను 1978 డిసెంబర్లో నియమించింది. దీనికి బిహార్ మాజీ ముఖ్య మంత్రి బీపీ మండల్ సారధ్యం వహించారు. మండల్ 1980 డిసెంబర్ 31న నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. కానీ దాని సూచనలు అమలుకు నోచుకోలేదు. దీంతో బీసీలంతా ఉద్యమించారు. బహుజన్ సమాజ్ పార్టీ ఉద్యమానికి అండగా నిలిచింది. చివరికి అప్పటి ప్రధాని వీపీ సింగ్ 1990 ఆగస్టు 7న మండల్ నివేదికను అమలు పరుస్తానని ప్రకటన చేశారు. ప్రధాని ప్రకటనతో దేశవ్యాప్తంగా ఆధిపత్య కులాలు ఆందోళనకు దిగాయి. అన్ని పార్టీలు మండల్ నివేదికకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేశాయి. బయట నుండి వీపీ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న బీజేపీ తన మద్దతును ఉపసంహరించి తానెవరి వైపో తేల్చి చెప్పింది. మండల్ కమిషన్ను అమలు చేయరాదని ఆధిపత్య కులాల వారు కోర్టును ఆశ్రయించారు. చివరకు 1993లో మండల్ నివేదిక అమలుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో బీసీలకు కేంద్ర విద్యాసంస్థల్లో, సర్వీసుల్లో 27 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. కేంద్ర రిజర్వేషన్ సౌకర్యం పొందే బీసీలను ‘అదర్ బ్యాక్వార్డ్ క్లాసెస్’ (ఓబీసీలు)గా వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద మండల్ కమిషన్ బీసీల అభివృద్ధికి 40 సూచనలు చేయగా అందులో ఒకటైన విద్యా, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని మాత్రమే అమలుచేసి అప్పటి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. బీసీల అభ్యున్నతికి విలువైన సూచనలు చేసిన బీపీ మండల్ బీసీల మదిలో ఎప్పటికీ నిలిచిపోతారు. ఆయన 1918 ఆగస్టు 25న బిహార్ మధేపూర్ జిల్లా మోరో గ్రామంలో... రాస్ బీహారీ లాల్ మండల్ జమీందారీ కుటుంబంలో జన్మించారు. 1952 మొదటి సారిగా శాసనసభకు ఎన్నికైన మండల్ ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. రామ్ మనోహర్ లోహియా నాయకత్వంలో పనిచేసిన మండల్ 1967 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 69 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. దీంతో 1968 ఫిబ్రవరిలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. (క్లిక్: వారి విడుదల దేనికి సంకేతం?) బయట నుండి మద్దతునిచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకుల అవినీతిపై విచారణ జరిగితే... ఆ విచారణ నివేదికను బుట్టదాఖలు చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల్పై ఒత్తిడి చేసింది. అయినా నిజాయితీగా కాంగ్రెస్ అవినీతి నాయకులపై చర్య తీసుకున్నారు. దాంతో కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం కూలిపోయింది. నీతి కోసం నిలబడిన గొప్ప నాయకుడు బీపీ మండల్. 1974లో ఎమ్మేల్యే పదవికి రాజీనామా చేసి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని 1977లో జనతా పార్టీ తరఫున లోకసభకు ఎన్నికయ్యారు. కులాలుగా చీలిపోయి ఉన్న బీసీలు ఏకమై... పార్టీలకు, సంఘాలకు అతీతంగా ఐక్యమై బీపీ మండల్ కమిషన్ ఇచ్చిన స్థైర్యంతో ముందుకు సాగి తమ హక్కులను సాధించుకోవాలి. (క్లిక్: 75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!) - సాయిని నరేందర్ బీసీ స్టడీ ఫోరం వ్యవస్థాపక చైర్మన్ (ఆగస్టు 25న బీపీ మండల్ జయంతి) -
ఢిల్లీలో ఆగస్టు 7న జాతీయ ఓబీసీ మహాసభలు
కవాడిగూడ (హైదరాబాద్): బీసీలకు ఉద్యోగ, సామాజిక, ఆర్థిక రాజకీయ రంగాల్లో జనాభా దామాషా పద్ధతిపై ప్రాతినిధ్యం దక్కాలని కోరుతూ ఆగస్టు 7న ఢిల్లీలో తల్కటోర స్టేడియంలో జాతీయ ఓబీసీ మహాసభలను నిర్వహిస్తున్నట్లు కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్చారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్లు తెలిపారు. మహాసభకు సంబంధించిన పోస్టర్ను దోమలగూడలోని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో గురువారం వారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆగస్టు 7న అఖిల భారత ఓబీసీ మహాసభ: జాజుల
కవాడిగూడ (హైదరాబాద్): విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీల జనాభా దామాషా పద్ధతిన ప్రాతినిధ్యం దక్కాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా బీసీలకు రావాల్సిన హక్కుల కోసం ఆగస్టు 7న ఢిల్లీలో అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. శనివారం ఈ మహాసభకు సంబంధించిన వాల్పోస్టర్ను దోమలగూడలోని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ప్రతిని«ధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ 75 ఏళ్ల స్వాతంత్ర పాలనలో 60%పైగా ఉన్న బీసీలకు 15% ప్రాతినిధ్యం కూడా ప్రభుత్వాలు కల్పించకపోవడం దురదృష్టకరమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నారని మండిపడ్డారు. -
ఓబీసీ నేతల జంప్.. కీలకంగా మారిన కేశవ్ ప్రసాద్.. యోగి లేకుంటే సీఎం అయ్యేవారే!
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్లో కాషాయ పార్టీకి పట్టుకొమ్మలుగా ఉన్న ఓబీసీ నేతలు ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తున్న వేళ... సామాజిక సమీకరణాలు మారకుండా చూసుకునేందుకు పార్టీ నమ్ముకున్న ఏకైక వ్యక్తి ‘కేశవ్ ప్రసాద్ మౌర్య’. ఐదేళ్ల కిందట యూపీ పీఠాన్ని అధిరోహించేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ముందుండి నాయకత్వం వహించిన ఆయనే ప్రస్తుత ఎన్నికల్లో పార్టీకి పెద్దదిక్కుగా మారారు. ఓబీసీల్లో బలమైన పట్టున్న కేశవ్ప్రసాద్నే ప్రధాన ముఖంగా పెట్టి ఎన్నికలను ఢీకొనే కార్యాచరణను తీసుకోవడంతో ఆయన ప్రాధాన్యం మరింత పెరిగింది. 2017లోనే ముఖ్యమంత్రి పదవికి ఆయన బలమైన పోటీదారుగా ఉన్నప్పటికీ, ఆశ్చర్యకరంగా యోగి ఆదిత్యనాథ్ తెరపైకి రాగా, ఈ మారు మాత్రం మౌర్యను సీఎంగా చూడాలనుకుంటున్న నేతల సంఖ్య గణనీయంగా పెరగడం ఆయన ఛరిష్మాను చెప్పకనే చెబుతోంది. (చదవండి: స్కూలు విద్యార్థి ఆత్మహత్య కేసులో దోషుల్ని విడిచిపెట్టం) సంఘ్ నుంచి డిప్యూటీ దాకా... యూపీలో అధికంగా ఓబీసీ వర్గాలకు చెందిన వారు 42 శాతం వరకు ఉండగా, వర్గాల్లో అధిక పట్టు కలిగిన వర్గంగా మౌర్యాలు ఉన్నారు. మౌర్య వర్గానికి చెందిన కేశవ్ ప్రసాద్కు తొలినుంచి జన్సంఘ్ బజ్రంగ్దళ్తో అనుబంధం ఉంది, గోసంరక్షణ, రామజన్మభూమి ఉద్యమాల్లో పాల్గొన్న కేశవ్ప్రసాద్ అనంతరం బీజేపీలో చేరి వివిధ విభాగాల్లో పనిచేశారు. అనంతరం 2002, 2007లో సిరతు నియోకవర్గం నుంచి ఓడిన కేశ్ప్రసాద్ తదనంతరం 2012లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2014 ఎన్నికల్లో పుల్పూర్ స్థానం నుంచి లోక్సభకు పోటీ చేసి గెలిచారు. జవహార్లాల్ నెహ్రూ ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గం కాంగ్రెస్కు కంచుకోటగా ఉండగా, దాన్ని బద్ధలు కొట్టడంతో ఈయన పేరు అందరికీ తెలిసింది. అనంతరం 2016లో సంఘ్ జోక్యంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల నాయకత్వ బాధ్యతలను పూర్తిగా తనపై మోసిన కేశవ్ప్రసాద్ ఏకంగా 200 ర్యాలీలు చేపట్టి 312 సీట్లు రావడంలో కీలకపాత్ర పోషించారు. ఈ సమయంలోనే కేశవ్ప్రసాద్ను సీఎంను చేస్తారని అంతా భావించినా అనూహ్యంగా యోగి తెరపైకి రావడంతో ఆయన ఎమ్మెల్సీగా ఎంపిక చేసి డిప్యూటీ సీఎం చేశారు. పీడబ్ల్యూడీ మంత్రిగా యూపీ అభివృధ్ధిలో తనదైన ముద్ర వేసిన కేశవ్ప్రసాద్ తనకిచ్చిన పనిని చేసుకుంటూ వెళ్లారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీకి చెందిన ఇద్దరు ఓబీసీ మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, ధారాసింగ్ చౌహాన్లు పార్టీని వీడటంతో పార్టీ ఒక్కసారిగా ఖంగుతింది. ఈ సమయంలో కేశవ్ప్రసాద్ మౌర్య అత్యంత కీలకంగా వ్యవహరించి, మరింతమంది ఓబీసీ నేతలు జారిపోకుండా చర్యలు చేపట్టారు. అదీగాక సమాజ్వాదీ పార్టీలో బలంగా ఉన్న యాదవేతర నేతలు బీజేపీలో చేరేలా కృషి చేశారు. దీంతో పాటే పార్టీ మిత్రపక్షాలు, అప్నాదళ్, నిషాద్ పార్టీలతో కేశవ్ మౌర్యకు ఉన్న మంచి సంబంధాలను దృష్టిలో పెట్టుకొని పార్టీ ఆయనకు సీట్ల సర్దుబాటుకు ప్రధాన అనుసంధాన కర్తగా పెట్టింది. ఆయన వల్లే సీట్ల సర్దుబాటు అంశం సాఫీగా సాగిందనే భావన ఉంది. ఇక ఆయను ప్రస్తుత ఎన్నికల్లో పోటీచేయించే అంశమై చర్చోపచర్చలు జరగ్గా, తన సొంత నియోకవర్గం సిరాతు నుంచి పోటీ చేసేందుకు ఆయన మొగ్గు చూపారు. ఈ స్థానంలో సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే శీతలా ప్రసాద్ సైతం కేశవ్ప్రసాద్కు సిరాత్ టిక్కెట్ కేటాయించడాన్ని స్వాగతించారు. తన గురువు కోసం సీటును త్యాగం చేయడం తనకేబి ఇబ్బందిగా లేదని ప్రకటించిందంటే కేశవ్ప్రసాద్పై లాంటి వ్యక్తో అర్థం చేసుకోవచ్చు. (చదవండి: ఆయనొక క్రౌడ్ పుల్లర్.. మాటలు తూటాల్లా పేలుతాయ్..) -
UP Assembly Election 2022: నువ్కొకటి కొడితే... నేను రెండేస్తా!
ఇప్పుడు సరిగ్గా.. ఇదే పంథాలో ఉత్తరప్రదేశ్ రాజకీయ యవనికపై టిట్ ఫర్ టాట్ క్రీడ రక్తికడుతోంది. అబ్బురపరిచే ఎత్తులతో సమాజ్వాదీ పార్టీ, బీజేపీ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. హిందుత్వ కార్డుతో ఓటర్లు సంఘటితం కాకుండా చూసుకుంటే సగం యుద్ధం గెలిచినట్లేనని భావించిన ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్... చాణక్యాన్ని ప్రదర్శించారు. కీలకమైన ఓబీసీ నేతలను లాగేశారు. తామేమి చేయకపోతే చేష్టలుడిగి చూస్తుండిపోయిందనేది ప్రజల్లోకి వెళుతుందని... దిక్కుతోచని స్థితిలోకి బీజేపీ వెళ్లిపోయిందని భావిస్తారని కమలదళం భయపడింది. ఎత్తుకు పైఎత్తుకు వేసింది. చిన్న కోడలు అపర్ణా యాదవ్ను లాగేయడం ద్వారా ములాయం సింగ్ ఇంట్లోనే చిచ్చు పెట్టింది. ఈ రాజకీయ సమయంలో వ్యూహాలు పదునెక్కుతున్న వైనంపై ‘సాక్షి’ సవివర కథనం... మౌర్య ఇచ్చిన షాక్తో ‘మైండ్ బ్లాంక్’ ఇతర వెనుకబడిన వర్గాల్లో (ఓబీసీల్లో) బలమైన నాయకులైన మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య జనవరి 12న, దారాసింగ్ చౌహాన్ 13న మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో కలకలం రేగింది. రోజుకో మంత్రి, ఒక ఎమ్మెల్యే చొప్పున పార్టీని వీడిపోవడంతో బీజేపీకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మొత్తం ముగ్గురు మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీని వీడారు. కాషాయపార్టీ తేరుకునే లోగానే... ఓబీసీలను బీజేపీ అవమానిస్తోందని... అందుకే వారంతా సమాజ్వాదీ పార్టీలోకి క్యూ కడుతున్నారనే సందేశం బలంగా ప్రజల్లోకి వెళ్లింది. ములాయం ఇంట్లోనే ముసలం నష్టనివారణకు దిగిన బీజేపీ దిమ్మతిరిగేలా కొట్టాలని భావించి అసంతృప్తితో ఉన్న అఖిలేశ్ మరదలు అపర్ణా యాదవ్కు (సవతి సోదరుడు ప్రతీక్ యాదవ్ భార్య) గాలం వేసింది. సొంత మనిషినే ఆపలేకపోతే అఖిలేశ్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటారు. సరిగ్గా బీజేపీ అక్కడే కొట్టి లక్ష్యాన్ని సాధించింది. మైండ్గేమ్ కీలక ఓబీసీ మంత్రులు పార్టీని వీడి వెళ్లిపోవడంతో తూర్పు యూపీలో నష్టం తప్పదని భావించిన బీజేపీ దీన్ని పూడ్చుకోవాలనే ఉద్దేశంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ను గోరఖ్పూర్ నుంచి బరిలోకి దింపింది. తర్వాత బీజేపీ కేంద్రమంత్రులు, రాష్ట్ర నాయకులు ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ ఎన్నికల బరిలోకి దిగడానికి భయపడుతున్నారని ప్రతిరోజూ వల్లెవేస్తూ ఎస్పీ చీఫ్ను పిరికివాడిగా చూపే ప్రయత్నం చేశారు. పరిస్థితి తీవ్రతను గ్రహించిన అఖిలేశ్ తాను మెయిన్పురి నుంచి పోటీ చేస్తానని గురువారం ప్రకటించారు. నిజానికి వీరిద్దరూ పోటీచేసింది... కంచుకోటలైన సొంత నియోజకవర్గాల నుంచే. నిజానికి ఈ విషయంలో ఏటికి ఎదురీదే గుండె ధైర్యాన్ని ప్రదర్శించి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఒకప్పటి తన కుడిభుజం సువేందు అధికారికి కంచుకోటగా మారిన ‘నందిగ్రామ్’ నుంచి పోటీచేస్తానని ప్రకటించి నివ్వెరపరిచారు. తాను నందిగ్రామ్ బరిలో ఉంటే సువేందు అధికారి సొంత నియోజకవర్గానికి బాగా సమయం కేటాయించాల్సి వస్తుందని, ఇతర ప్రాంతాల్లో ప్రచారానికి తిరగలేరనేది దీదీ ఎత్తు. తాను ఓడిపోయినా... మమత వ్యూహం మాత్రం బ్రహ్మాడంగా వర్క్ అవుట్ అయి దీదీ హ్యాట్రిక్ కొట్టారు. కొట్టారు.. తీసుకున్నాం. మాకూ టైమొస్తుంది.. మేమూ కొడతాం – 2017లో నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక ముగిశాక... చంద్రబాబు సర్కారు కుట్రపూరిత వేధింపులపై అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సంధించిన ఈ వాగ్భాణం ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది. ‘ఇది కదా... సిసలైన పోరాటయోధుడి గుండెధైర్యం’ అనుకున్నారు జనం. ప్రియాంక నినాదం తుస్సుమనేలా.. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో కొడిగట్టిన కాంగ్రెస్ కనీసం గౌరవప్రద స్థితిలో నిలిపితే.. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా సానుకూలత రావడానికి ఉపయోగపడుతుందని యూపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ప్రియాంకా గాంధీ ‘లడకీ హూ... లడ్ సక్తీ హూ (ఆడబిడ్డను... పొరాడగలను)’ అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. తద్వారా ‘మేమెందుకు పురుషులతో సమానం కాదు. మాకేం తక్కువ’ని నేటితరం యువతుల్లో బలంగా నాటుకుపోయిన భావజాలాన్ని ప్రేరేపించారు. బాగా జనంలోకి వెళ్లిపోవడంతో ఈ నినాదంతో కాంగ్రెస్ యూపీ నలుమూలగా నిర్వహించిన మారథాన్లకు యువతుల నుంచి భారీ స్పందన వచ్చింది. ప్రియాంక ఎత్తుగడ ఫలించింది. దాంతో ఆమె 40 శాతం అసెంబ్లీ టిక్కెట్లను మహిళలకు కేటాయిస్తామని ప్రకటించి.. చేతల్లో చూపడం ద్వారా మహిళా ఎజెండాను మరిం త ముందుకు తీసుకెళ్లారు. చదవండి: (కరోనానే పెద్ద పరీక్ష!) ఈ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ప్రియాంక పోరాట సన్నద్ధంగా ఉన్న ముగ్గురు యువతుల ఫోటోతో కూడిన హోర్డింగ్లు, పోస్టర్ల ను యూపీ వ్యాప్తంగా విస్తృతంగా అతికిం చారు. ఈ ముగ్గురిని లీడ్ చేస్తూ మధ్యలో ఉన్న యువతి పేరు ప్రియాంకా మౌర్య, వృత్తిరీత్యా డాక్టర్. మంచి వక్త. లింగ సమానత్వం కోసం ప్రియాంకా గాంధీ చేపట్టిన ఈ ఉద్యమాన్ని బలంగా తీసుకెళ్లిందని ప్రియాం క మౌర్య. ఆమె స్వభావం, ఆహార్యం దీనికి బాగా ఉపకరించాయి. దాంతో ఈ ఉద్యమానికి ప్రియాంక మౌర్య బ్రాండ్ అంబాసిడర్గా, పర్యాయపదంగా మారారు. సరిగ్గా బీజేపీ ఇక్కడే గురిచూసి కొట్టింది. 40 శాతం టిక్కెట్లు కేటాయిస్తే మహిళల్లో కాంగ్రెస్కు మంచి సానుకూలత వస్తుందని, అసలే ఒకవైపు ఎస్పీ– రాష్ట్రీయ లోక్దళ్ పొత్తులో తమ హిందూత్వ కార్డు నిర్వీర్యమైన పోయిన పరిస్థితుల్లో ప్రియాంకా గాంధీ ఎత్తుగడ తమకు భారీ నష్టం కలుగుజేస్తుందని భయపడ్డ బీజేపీ మాస్టర్ గేమ్ ఆడింది. ‘అడపిల్లను... పోరాడగలను’ అనే నినాదానికి బ్రాండ్ అం బాసిడర్గా ఉన్న ప్రియాంక మౌర్యను లాగేస్తే కాంగ్రెస్ను చావుదెబ్బ కొట్టొచ్చని భావించి అమలులో పెట్టేసింది. మహిళలకు 40 టిక్కెట్లు ఇచ్చామని కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటోందని.. చేతల విషయానికి వచ్చే సరికి కష్టజీవి ప్రియాంక మౌర్యకే మొండి చేయి చూపిందనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా పంపింది. ఇప్పుడిక ప్రియాంకా గాంధీ మహిళలకు ఇచ్చే టికెట్లు 50 శాతానికి పెంచినా, ఈ విషయాన్ని ఎన్నికల ర్యాలీల్లో 500 సార్లు చెప్పినా జనం నమ్మరు. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
బీజేపీకి షాకిచ్చేలా.. మాస్టర్ స్ట్రోక్.. మైండ్గేమ్!
ఉత్తరప్రదేశ్లో ఏదో జరుగుతోంది. నిన్న మొన్నటి దాకా బీజేపీ మంచి స్థితిలో ఉన్నట్లు కనిపించింది. కానీ ఉన్నట్టుండి ఈ వలసలేమిటి? ఒకరివెంట మరొకరు పోటీలుపడి ఓబీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు బీజేపీని ఎందుకు వీడుతున్నారు. బీసీల ప్రయోజనాలను సమాజ్వాదీ పార్టీ మాత్రమే కాపాడగలదా? బీజేపీ మునిగిపోయే నౌకా? నాయకగణంలో, జనసామాన్యంలో ఇప్పుడీ అభిప్రాయం బలపడుతోంది. బీజేపీలో ‘ఆల్ ఈజ్ నాట్ వెల్’ అనేది బాగా ప్రబలింది. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ బృందానికి సరిగ్గా ఇదే కావాలి. అంతా వారనుకున్నట్లే జరుగుతోంది. ఆడించినట్లే రక్తి కడుతోంది. వ్యూహరచనలో, క్షేత్రస్థాయిలో తమకు తిరుగులేదని భావిస్తున్న బీజేపీ పెద్దలకు అఖిలేశ్ ఇచ్చిన గట్టి ఝలక్ ఇది. ఎన్నికల నగారా మోగాక.. అసలుసిసలు ‘సినిమా’ చూపిస్తున్న వైనమిది. ఇదంతా ఈనెల 11న ప్రముఖ ఓబీసీ నేత, మంత్రి స్వామి ప్రసాద్ మౌర్యతో మొదలైంది. ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసి బీజేపీకి గుడ్బై చెబుతున్నట్లు ప్రకటించారు. మౌర్య మద్దతుదారులైన నలుగురు ఎమ్మెల్యేలు అదే బాట పట్టారు. చిన్న అలజడి మొదలైంది. 12న మరో ఓబీసీ ముఖ్యనేత, మంత్రి దారాసింగ్ చౌహాన్ బీజేపీకి టాటా చెప్పారు. 13న మరో ఓబీసీ నేత ధరమ్సింగ్ సైనీ కాషాయదళాన్ని వీడారు. మూడురోజుల్లో ముగ్గురు మంత్రులు... ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీని విడిచి వెళ్లిపోయారు. చిన్న పాయ కాస్తా ముందుకెళ్లిన కొద్దీ నదిగా మారుతున్న దృశ్యం గోచరమవుతోంది. బీజేపీ మిత్రపక్షమైన అప్నాదళ్ (సోనేలాల్)కూ సెగ తగిలింది. ఈ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎస్పీ పంచన చేరుతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల వేళ కప్పదాట్లు సహజమే అయినా... నలుగురైదుగురు పోతే ఫర్వాలేదు. అలాకాకుండా కీలక ఓబీసీ నేతలు పక్కా ప్రణాళిక ప్రకారం బీజేపీని టార్గెట్ చేస్తూ... కాషాయదళంలో ఓబీసీలను, దళితులను చిన్నచూపు చూస్తున్నారనే సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ‘బౌన్సర్లు’ వేస్తున్నారు. ఆల్రౌండర్ ఆదిత్యనాథ్ యోగి (రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల యూపీ సీఎంను క్రికెట్ పరిభాషలో ఆల్రౌండర్గా అభివర్ణించారు), జట్టు కెప్టెన్ జేపీ నడ్డా (బీజేపీ అధ్యక్షుడు), కోచ్... అమిత్ షా (ప్రధాన వ్యూహకర్త)లకూ అఖిలేశ్ టీమ్ షాక్ల మీద షాక్లు ఇస్తూనే ఉంది. పసిగట్టలేకపోయారా? ఫర్వాలేదనుకున్నారా? ఎన్నికల వేళ ఏ పార్టీ అయినా, ప్రభుత్వమైనా అప్రమత్తంగా ఉంటుంది. అసంతృప్తులు, అనుమానం ఉన్నవారి కదలికలపై నిఘా ఉంటుంది. వారేం చేస్తున్నారు... ఎవరిని కలుస్తున్నారనే దానిపై ఓ కన్నేసి ఉంచుతాయి. అలాంటిది కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీయే అధికారంలో ఉండి, ఐబీ, రాష్ట్ర నిఘా విభాగాలు రాబోయే ఈ వలసల ఉద్యమాన్ని ఎందుకు పసిగట్టలేకపోయాయి. ఒకవేళ కొంత సమాచారం ఉన్నా ఆ పోతే ఒకరిద్దరు పోతారు, దాంతో మనకొచ్చే నష్టమేముందని బీజేపీ అగ్రనేతలు తేలిగ్గా తీసుకున్నారా? ఈ స్థాయి ప్రణాళికాబద్ధమైన దాడిని ఊహించలేకపోయారా?. ఇప్పుడు నష్టనివారణకు దిగి ఎస్పీ, కాంగ్రెస్ల నుంచి ఇద్దరిని చేర్చుకున్నా జరిగిన డ్యామేజీని ఇలాంటివి పూడుస్తాయా? కసికొద్దీ ఇంకా కొంతమందిని లాగినా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే అవుతుందనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. చెప్పి... మరీ! ఈనెల 11న మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామా చేయగానే నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్పవార్ మొత్తం 13 మంది ఎమ్మెల్యేలు, ఇంకొందరు నేతలు ఎస్పీలోకి వస్తారని ప్రకటించారు. జనవరి 20వ తేదీదాకా బీజేపీలో రోజుకు ఒకటి రెండు వికెట్లు పడుతూనే ఉంటాయని, 20న నాటికి బీజేపీని వీడిన మంత్రులు, ఎమ్మెలేల సంఖ్య 18కి చేరుతుందని ఎస్పీ మిత్రపక్షమైన సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఓంప్రకాశ్ రాజ్బర్ బుధవారం ప్రకటించారు. 20 దాకా రాజీనామాల పరంపర కొనసాగుతుందని, రోజుకొక మంత్రి, ఎమ్మెల్యే కాషాయపార్టీకి గుడ్బై చెబుతారని రాజీనామా చేస్తూ మంత్రి ధరమ్సింగ్ గురువారం చెప్పారు. భవిష్యత్తు చేరికలపై ఎస్పీ మాట్లాడకుండా... బయటి వారు మాట్లాడుతుండటం... ఇదంతా ఒక విస్తృత అవగాహనతో జరుగు తోందనేది దానికి అద్దం పడుతోంది. నిజానికి పార్టీ మారేటపుడు ఎవరూ అంత ఆషామాషీగా అడుగు వేయరు. భవిష్యత్తుకు సంబంధించిన స్పష్టమైన భరోసా, తాము కోరిన నియోజకవర్గాల్లో తమ వారికి టికెట్లు ఖరారు చేసుకున్నాకే... బయటపడతారు. రాజీనామా చేస్తారు. అంటే అఖిలేశ్ వీరిందరితో ఎంతోకాలంగా టచ్లో ఉన్నట్లే లెక్క. పైగా ఎవరెవరు వస్తే ప్రయోజనం, ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వగలం... అనేది బాగా కసరత్తు చేశారు ఎస్పీ చీఫ్. అధికార, బీజేపీ వేగులకు ఉప్పందకుండా ఎంతో జాగ్రత్తగా ఈ డీల్ను పూర్తి చేయడం అఖిలేశ్ వయసుతో పాటే రాజకీయ వ్యూహాల్లో ఆరితేరారనే విషయాన్ని చాటిచెబుతోంది. ఇది ఒక ఎత్తైతే... తమ ప్రణాళికను అమలులో పెట్టిన తీరు బీజేపీ చాణక్యులనే నివ్వెరపరుస్తుండొచ్చు. అఖిలేశ్ను కలవడం... ఫొటోలు దిగడం, బయటకు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు తాము బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం అంతా పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిపోతోంది. వీరి రాజీనామా ప్రకటన వెలువడిందో లేదో నిమిషాల్లో అఖిలేశ్ ట్విట్టర్ హ్యాండిల్ వారు ఎస్పీ చీఫ్తో దిగిన ఫొటోలు ప్రత్యక్షమవుతున్నాయి. అంతా కట్టగట్టుకొని ఏ 20 మందో ఒకేసారి బీజేపీని వీడితే... అది ఒక్కరోజుకే టీవీ చానళ్లకు, పత్రికలకు వార్త అవుతుంది. మరుసటి రోజు ఫోకస్ వేరే అంశాలపైకి మళ్లుతుంది. అలాకాకుండా విడతల వారీగా వలసలు చోటుచేసుకుంటే రోజూ మీడియాలో సమాజ్వాదీ కవరేజీయే. పత్రికల్లో, టీవీల్లో రోజూ ఎస్పీలో చేరికలపై వార్తలు ఉంటే... ప్రజల్లోకి ఒకరకమైన సానుకూల సందేశం వెళుతుంది. బీజేపీ అధికార, అంగ, అర్థబలాన్ని ఎదుర్కొనగలమా అని లోలోపల సంశయంలో ఉన్న ఎస్పీ శ్రేణుల్లో నైతిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోతాయి. వారు ద్విగుణీకృత ఉత్సాహంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తారు. ప్రజల్లోనూ ఎస్సీకే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయనే భావన వస్తే... తటస్థ ఓటర్లు కూడా కొంతమేరకు సైకిల్ వైపు మొగ్గే అవకాశాలుంటాయి. అన్నింటికంటే ముఖ్యమైన అంశం... తమకు ఎదురులేదనే భావనలో ఉన్న బీజేపీని ఈ అనూహ్య పరిణామాలు ఆత్మరక్షణలోకి నెట్టేస్తాయి. ఊగిసలాటలో ఉన్న నాయకులు ఎస్సీవైపు చూసేలా ఈ పరిణామాలు ప్రోత్సహిస్తాయి. ఎవరుంటారో... ఎవరు పోతారో తెలియని పరిస్థితుల్లో బీజేపీ సొంత నాయకులనే అనుమాన చూపులు చూసే పరిస్థితి. ఒక్కసారి గనక బీజేపీ అవకాశాలు సన్నగిల్లుతున్నాయనే అభిప్రాయం బలపడితే... మునిగే నౌకలో ఉండటానికి ఎవరూ ఇష్టపడరు. కమలదళానికి సరైన ప్రత్యామ్నాయంగా ఉన్న ఎస్పీలోకి నాయకులు క్యూ కడతారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే అఖిలేశ్ విడతల వారీగా బీజేపీని దెబ్బకొట్టే వ్యూహాన్ని ఎంచుకున్నారు. చక్కటి మైండ్గేమ్ ఆడుతున్నారు. పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న బీజేపీ తదుపరి ఎలాంటి పావులు కదుపుతుందో చూడాలి. – నేషనల్ డెస్క్, సాక్షి -
జీవించే హక్కు అందరి సొంతం కాదా?
ఢిల్లీలో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి శూద్ర ఓబీసీల సదస్సు చేసిన డిక్లరేషన్ చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రకటన అని చెప్పాలి. కులాలవారీ జన గణనను సాధించడం, రిజర్వుడ్ ఉద్యోగాలను కొల్లగొట్టడానికి ఉపాధి రంగాన్ని మొత్తంగా ప్రైవేటీకరించడాన్ని నిరోధించడం, జాతీయ సంపదను అగ్రకుల పారిశ్రామికవేత్తల చేతుల్లో పెట్టడాన్ని అడ్డుకోవడం కోసం మరో కీలకమైన శూద్ర ఓబీసీల ఉద్యమం అవసరముందని ఇది స్పష్టం చేసింది. బ్యాంకులు, రైల్వేలు, ఎయిర్లైన్స్ను ప్రైవేటీకరించడం పూర్తయితే ఇకపై వాటిలో శూద్ర ఓబీసీలకు, దళితులకు, ఆదివాసీలకు ఉద్యోగాలు ఉండవని తెలిసిందే. ప్రస్తుత పాలకవర్గ శక్తులు వెనుకబడిన వర్గాలకు మంచి జీవితం అందించడంపై ఏ మాత్రం శ్రద్ధ పెట్టడం లేదు. కాబట్టే శూద్ర ఓబీసీ దళిత, ఆదివాసీ శక్తులు రెండో స్వాతంత్య్ర సమరానికి సిద్ధం కావాలి. ఢిల్లీలో ఇటీవలే ముగిసిన శూద్ర ఓబీసీ సదస్సు ఇస్తున్న సందేశమిదే! ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో 2021 డిసెంబర్ 21న భారీస్థాయి జాతీయ శూద్ర ఓబీసీల సదస్సు జరిగింది. వందలాది శూద్ర ఓబీసీ కార్యకర్తలు, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలు, వివిధ యూనివర్శిటీలు, పౌరసమాజ సంస్థలకు చెందిన మేధావులు ఈ సదస్సుకు హాజరయ్యారు. మొట్టమొదటి శూద్ర ఓబీసీ డిక్లరేషన్ని వీరు తీసుకొచ్చారు. ఇది దేశం మొత్తానికి చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రకటన. చరిత్రాత్మకమైన రైతుల పోరాటం... భారతీయ వ్యవసాయ మార్కెట్లను హిందుత్వశక్తులు ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా శూద్ర ఓబీసీలు చేసిన పోరాటం మాత్రమే. ఆ తర్వాత కులాలవారీ జనగణనను సాధించడం, రిజర్వుడ్ ఉద్యోగాలను కొల్లగొట్టడానికి ఉపాధి రంగాన్ని మొత్తంగా ప్రైవేటీకరించడాన్ని నిరోధించడం, జాతీయ సంపదను అగ్రవర్ణ పారిశ్రామికవేత్తల చేతుల్లో పెట్టడాన్ని అడ్డుకోవడం కోసం మరొక కీలకమైన శూద్ర ఓబీసీల ఉద్యమం ఇప్పుడు నడుస్తోంది. అయితే శూద్ర ఓబీసీ శక్తులను బలహీనపర్చి వారిని ప్రాచీన భారతదేశంలోని బానిసల్లాగా మార్చడానికి హిందుత్వ శక్తులు కుట్రపన్నుతున్నాయి. శూద్ర ఓబీసీల సదస్సు నిర్వాహక కమిటీకి మండల్ ఉద్యమ హీరో శరద్ యాదవ్ నేతృత్వం వహించారు. కాగా, చగన్ భుజ్బల్ (ఎన్సీపీ కేబినెంట్ మంత్రి, మహారాష్ట్ర), తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ అధ్యక్షుడు), కనిమొళి కరుణానిధి (ఎంపీ, డీఎంకే), కంచ ఐలయ్య (ఎడిటర్, విజన్ ఫర్ ఎ న్యూ పాత్) సునీల్ సర్దార్ (ప్రెసిడెంట్, సత్య శోధక్ సమాజ్) ఈ కమిటీ సభ్యులుగా వ్యవహరించారు. సమృద్ధ భారత్ ఫౌండేషన్–ఢిల్లీ, మహాత్మా ఫూలే సమతా పరిషద్–మహారాష్ట్ర సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి. ఢిల్లీ డిక్లరేషన్పై పలువురు పండితులు, రాజకీయ నేతలు, కార్యకర్తలు ప్రసంగించి, లోతుగా చర్చించారు. రాబోయే నెలల్లో వివిధ రాష్ట్రాల్లో అనుసరించాల్సిన భవిష్యత్ కార్యాచరణపై వీరు చర్చిం చారు. దేశంలో మండల్ అనంతర పోరాటాలు ఎన్నింటికో నాయకత్వం వహించిన లాలూ ప్రసాద్ యాదవ్ వర్చువల్గా మాట్లాడారు. సామాజిక న్యాయాన్ని సాధించాలంటే కులాలవారీ జనగణన ఒక్కటే మార్గమని ఆయన స్పష్టంగా చెప్పారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, చగన్ భుజ్బల్, డీఎంకే ఎంపీ టీకేఎస్ ఇళంగోవన్, కాంగ్రెస్ మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, హరియాణా మాజీ మంత్రి అజయ్ యాదవ్తోపాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు, మేధావులు ఈ ప్రకటనలోని లక్ష్యాల సాధనకు, దేశవ్యాప్తంగా శూద్ర ఓబీసీ శక్తులను సంఘటితం చేయడానికి అవసరమైన రాజకీయ, బౌద్ధిక ఎజెండాను రూపొందించారు. సుప్రసిద్ధ రచయిత్రి అరుంధతీ రాయ్ ఈ సదస్సుకు శక్తిమంతమైన సందేశం పంపారు. భారతదేశంలో సామాజిక బాధ్యత కలిగిన ప్రతి మేధావికీ కులాలవారీ జనగణన ఉమ్మడి లక్ష్యంగా ఉండాలని ఆమె వక్కాణించారు. ప్రస్తుతం కేంద్రప్రభుత్వంలో ఉన్న పాలక రాజకీయ వ్యవస్థ శూద్ర ఓబీసీలను బలహీనపర్చాలని ప్రయత్నిస్తోంది. రిజర్వేషన్ వ్యవస్థను రద్దు చేయాలని, ద్విజ గుత్తాధిపత్య కుటుంబాలను పైకి తేవాలని అది కంకణం కట్టుకుంది. ఈ పరిస్థితుల్లో కులాలవారీ జనగణన కోసం, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం పోరాటం దేశీయ ఆహార ఉత్పత్తిదారులకు, హస్తకళల నిపుణులకు జీవన్మరణ సమస్యగా మారుతోంది. వ్యవసాయ సంస్కరణ చట్టాలకు వ్యతిరేకంగా గత 13 నెలలుగా మన దేశంలోని రైతులు చావో రేవో చందంగా పోరాడుతూ వచ్చారు. ఈ క్రమంలో 750 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి ఓటు వేసిన శూద్రఓబీసీలు తమను కూడా వారు భరతమాత ముద్దుబిడ్డల్లాగే చూస్తారని నమ్మారు. కానీ ఏడేళ్ల పాలనా కాలంలో నేటి పాలకులు తమ రైతు వ్యతిరేక, ఓబీసీ వ్యతిరేక వైఖరిని చాటుకున్నారు. 1990లలోని మండల్ ఉద్యమంతో సామాజిక న్యాయ పోరాటం ముగియలేదని, అది ఇప్పటికీ కొనసాగుతోందని ఢిల్లీ డిక్లరేషన్ వాగ్దానం చేసింది. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ మండల్ రిజర్వేషన్ కోసం నాడు పోరాడిన శూద్రులు, ఇప్పుడు రిజర్వేషన్ల కోసం ప్రయత్నిస్తున్న మరాఠాలు, జాట్లు, కాపు వంటి కులాలకు చెందిన శూద్రులు ప్రస్తుత ప్రమాదానికి వ్యతిరేకంగా సర్వశక్తులూ ఉపయోగించాల్సి ఉంది. బీజేపీ ఆరెస్సెస్ అధికారంలోకి రాగానే వ్యవసాయం సంపద్వంతమౌతుందని, లంచగొండితనం తగ్గిపోతుందని రెడ్లు, కమ్మ, వెలమలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ), కేరళలో నాయర్లు, బెంగాల్లో మహిష్యాలు నిజంగానే భావించారు. కానీ జరుగుతున్నదేమిటి? మునుపటిలా చిన్నపాటి అవినీతి స్థానంలో లక్షలాది కోట్ల రూపాయలను రుణమాఫీ ద్వారా గుత్తసంస్థలకు కట్టబెడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వ యాజమాన్యంలోని అన్ని బ్యాంకులను, రైల్వేలను, ఎయిర్లైన్స్ను ప్రైవేటీకరించడం గురించి ఆలోచిస్తున్నారు. ప్రైవేటీకరించిన సంస్థల్లో శూద్ర ఓబీసీలకు, దళితులకు, ఆదివాసీలకు ఉద్యోగాలు లేవన్న విషయం తెలిసిందే. ఆరెస్సెస్ బీజేపీ మద్దతుదారులు తమ పిల్లలను ఉత్తమమైన ఇంగ్లిష్ మీడియం ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చేర్పించి చదివిస్తున్నారు. పైగా ఇంగ్లిష్ను ఆధునిక సంస్కృతం లాగా చేసి ద్విజుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉంచాలని ఆర్ఎస్ఎస్ కోరుకుంటోంది. శూద్ర ఓబీసీల్లో అతి కొద్దిమంది మాత్రమే ఈ గేమ్ ప్లాన్ని అర్థం చేసుకుంటున్నారు. వారి పిల్లలను సంపద లేని వ్యవసాయ రంగంలోకి నెట్టేస్తున్నారు. పైగా ఆహారాన్ని, మతాన్ని అధికారంతో ముడిపెడుతున్నారు. ఇది శూద్ర ఓబీసీల చుట్టూ పన్నుతున్న అతి పెద్ద ఉచ్చు. భవిష్యత్తులో వీరి పిల్లల మెదళ్లు, శరీరాలు బలహీనంగా మారిపోతాయి. మొత్తం మీద పాలక వర్గ శక్తులు వీరికి మంచి జీవితం అందించడంపై ఏ మాత్రం శ్రద్ధపెట్టడం లేదు. శూద్ర దళిత ఆదివాసీ శక్తుల అజ్ఞానాన్నే తప్ప వారిలో విజ్ఞానాన్ని పాలకులు ప్రేమించడం లేదు. శూద్ర ఓబీసీ మేధావులు ప్రప్రథమంగా వీరి ఆటను పసిగట్టడం ప్రారంభించాయి. ఈ వర్గాల నుంచి అత్యున్నత విద్యావంతులైన మేధావులు, చింతనాపరులు, రచయితలు, పోరాటకారులు ఆవిర్భవించకపోతే వీరి పిల్లలు తిరిగి బానిసలుగా మారిపోతారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు అటు గ్రామాల్లోనూ, ఇటు ప్రైవేటీకరించిన పరిశ్రమల్లోనూ ఉపాధి దొరకడం లేదు. యజమానుల కంపెనీల్లో, కొద్దిమంది సంపన్నుల కంపెనీల్లో సెక్యూరిటీ సిబ్బందిగా మాత్రమే శూద్ర ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు చేరుతున్నారు. వీటిలో నెలకు పదివేల రూపాయల కంటే తక్కువ వేతనంతో పనిచేస్తున్నారు. ఈ కంపెనీలు మొత్తంగా ప్రైవేట్ కంపెనీలే. బిజినెస్ కుటుంబాలు ఆరెస్సెస్ – బీజేపీ శాఖల సమన్వయంతో వీటిని నిర్వహిస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన శూద్ర ఓబీసీల సదస్సు ఈ ప్రక్రియను గుర్తించింది కూడా! అసలు విషయం మరొకటుంది. దళితులు, ఉదివాసీలను అలా పక్కన బెట్టండి. చివరకు శూద్ర ఓబీసీలు కూడా మేధావులు, చింతనాపరులుగా మారడానికి పాలక వ్యవస్థ ఏ మాత్రం అంగీకరించడం లేదు. ప్రపంచస్థాయి విజ్ఞానం వీరికి కూడా అందాలని పాలకవ్యవస్థ భావించడం లేదు. ఆరెస్సెస్ అగ్రనేతల ప్రసంగాలు పదే పదే దీన్నే నిరూపిస్తున్నాయి. కాబట్టే శూద్ర ఓబీసీ, దళిత, ఆదివాసీ శక్తులు రెండో స్వాతంత్య్ర సమరానికి సిద్ధం కావాలి. ఢిల్లీ సరిహద్దుల్లో మొన్నటి వరకు పోరాడి మరణించిన రైతు హీరోల మార్గం వీరికి ఆదర్శం కావాలి. దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవలే జరిగిన శూద్ర ఓబీసీ సదస్సు ఇస్తున్న సందేశమిదే! ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
కుల గణనపై కుటిల రాజకీయాలు
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్నా ఓబీసీల పరిస్థితి దారుణంగా ఉందని చెప్పకతప్పదు. ఓబీసీలు అన్ని విధాలుగా ముందుకు వచ్చేందుకు కేంద్రం అడ్డుపడుతోంది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం, తెలంగాణ సర్కారు కుల గణన చేయాలని అసెంబ్లీ తీర్మానం చేయడం ఒక సాహసోపేతమైన చర్యే నని చెప్పవచ్చు. కానీ, బీజేపీ మాత్రం దేశవ్యాప్తంగా కుల గణనపై కుటీల రాజకీయాలు చేస్తోంది. ఈ విషయంలో కాంగ్రెస్ కూడా ఏమి తక్కువ తినలేదు. జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్లకు బీసీల హక్కులు, సామాజిక న్యాయం పట్ల సోయే లేదు. అణగారిన ప్రజలు అప్పుడూ ఇప్పుడూ అధికారానికి దూరంగా ఉన్నా, కనీసం సామాజిక న్యాయానికి కూడా దూరమేనా అనే ఆందోళన యావత్ బీసీ సమాజాన్ని ఆవహించింది. కొత్తగా కులాల గణనను చేపడితే, గతంలో మండల్ కమిషన్ చెప్పిన 52 శాతం కంటే ఎక్కువగానే ఓబీసీ జనాభా ఉండొచ్చన్నది సర్వత్రా వినిపిస్తున్న టాక్. దీంతో కోటా కోసం మరిన్ని ఉద్యమాలు జరిగే అవకాశం ఉంటుందని అగ్రకుల అధికారవర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇది బీజేపీ, కాంగ్రెస్కు రాజకీయంగా నష్టం కల్గించవచ్చని అనధికారిక విశ్లేషణలు, వ్యాఖ్యానాలు చేస్తున్నారు. (చదవండి: ‘ఆఖరి మైలు’ జనహృదయానికి దగ్గరయితే...) దేశంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితిని నిశితంగా గమనిస్తే 2017 అసెంబ్లీ, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రత్యే కించి యూపీలో బీజేపీ ఓబీసీల కారణంగా బాగా లాభపడి నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మిగతా ప్రాంతాల్లో ఓబీసీలను అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఉపయో గించుకుంటున్నాయి. కానీ వారికి ఏ విధమైన లబ్ధి చేకూర్చడం లేదు. ఏపీ, తెలంగాణల్లో వైసీపీ, టీఆర్ఎస్ సాధ్యమైనంత మేరకు అవకాశం కల్పిస్తున్నాయి. జనాభా సేకరణ–2021లో కులగణనను చేర్చడం సాధ్యంకాదని కేంద్ర ప్రభుత్వం భారత సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్లో పేర్కొనడం నిజంగా బాధాకరం. ఈ నిర్ణయం అనేక తర్జనభర్జనల తర్వాత తీసుకున్నదని నరేంద్ర మోదీ సర్కారు సమర్థించుకుంటోంది. సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో వెనుకబడిన వర్గాల కులగణన చెయ్యడం పరిపాలనాపరంగా చాలా కష్టమైనదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కష్టపడి చేసినా నమ్మదగిన, సరియైన సమాచారం రాదని, ఆ సమాచారాన్ని అధికారిక అవసరాలకు వాడు కోలేమని ప్రభుత్వం చెబుతోంది. కుల గణన డిమాండ్ను తిరస్కరించడానికి చెప్పిన ఈ వాదనలు పక్కా అబద్ధాలే. (చదవండి: ఆర్థికమే కాదు... సామాజికం కూడా!) భారత దేశానికి స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ పాలనలో 1881 నుంచి 1941 వరకు ప్రతి దశాబ్దానికొకసారి జరిగిన జనగణనలో కుల వివరాలు సేకరించారు. ఇప్పుడు అందరూ వాడుతున్న కులగణన లెక్కలు 1931 జనగణన లోనివే అన్న విషయం ఎంతమందికి తెలుసు. అప్పటి నుంచి ఇప్పటివరకు అసలు కులగణన జరగడం లేదు. మనమెంతో మనకే తెలియని పరిస్థితి ఉంది. దీనిపై పోరాడాల్సిన అవసరం, ఆవశ్యకత యావత్ బహుజన సమాజంపై ఉంది. బీపీ మండల్ కమిషన్ ఈ గణాంకాలపై ఆధారపడే వెనక బడిన కులాల జనాభాను 52 శాతంగా అంచనా వేసిందని సామాజిక రంగ నిపుణులు చెబుతుంటారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలు సోషల్ ఇంజనీరింగ్, సామాజికీకరణలు అంటూ పద బంధాలు వాడేది ఆ కమిషన్ సిఫార్సుల ఆధారంగానే. మరి తాజా వివరాలు వస్తే... మనకు మరింత న్యాయం జరుగుతుంది కదా. 2011లో యూపీఏ–2 ప్రభుత్వ హయాంలో దేశ వ్యాపితంగా కుల గణన జరిగింది. అందులో 98.87 శాతం సమాచారం సక్రమంగా ఉందని 2016లో భారత సెన్సెస్ కమిషనర్ గ్రామీణాభివృద్ధి పార్లమెంటరీ కమిటీ ముందు ప్రకటించినట్టు వార్తలు వచ్చాయి. 2011 కులగణనలో జరిగిన కొన్ని సాంకేతిక లోపాలు దిద్దుబాటు చేసుకోగలిగినవే అయినా, వాటిని కేంద్ర ప్రభుత్వం భూతద్దంలో చూపి కులగణన అవసరాన్ని తిరస్కరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆరోపించినట్టు కులగణన వృథా అనుకోరాదు. దాని ద్వారా లభించే శాస్త్రీయమైన, సరైన సమాచారం వివిధ తరగతుల పరిస్థితిని అర్థం చేసుకోవడానికి సామాజిక న్యాయాన్ని అందించేందుకు ఉపయోగపడుతుంది. దీని కోసం జరిగే సమరంలో కులగణన ద్వారా అందే వాస్తవ సమాచారం ఒక ఆయుధంగా వినియోగపడుతుంది. అందుకే కులగణన జరగాలని కోరుతున్నాం. (చదవండి: ఈ వెనుకడుగు వ్యూహాత్మక ముందడుగు) తెలంగాణ బీజేపీ నేతల ద్వంద్వ వైఖరి అటు కేంద్రంలోనూ... ఇటు రాష్ట్రంలోనూ ఓబీసీ కుల గణనపై బీజేపీ వైఖరిలోని కపటత్వం అందరికీ తెలుస్తున్నది. ఇటీవల బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ తొలుత రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ గణన చేపట్టాలని ఒక కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. ఆయన మాటల తీరు నిజంగా హాస్యాస్పదం. ఆయన సొంత ప్రభుత్వానికి ఓబీసీ ప్రెసిడెంట్గా కనీసం లేఖ కూడా రాయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాలట. మరి బీజేపీ ప్రభుత్వాలకు ఎందుకు ఆయన ప్రత్యేకంగా లేఖలు రాయడం లేదో వివరణ చెప్పాల్సి ఉంది. రాష్ట్రంలో ఆ పార్టీ బీసీ నేతలకు కీలక పదవులు ఇస్తూ... సమూహ లబ్ధి జరిగే కుల గణన అంశాన్ని విస్మరించడం నిజంగా దుర్మార్గం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా బీసీ కుల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కుల గణన, రిజర్వేషన్లపై జాతీయ స్థాయిలో రాజకీయ పక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి కేంద్రంపై పోరాటం చేస్తామని కేసీఆర్ ప్రకటించటం బీసీల పట్ల కేసీఆర్కు ఉన్న చిత్తశుద్ధిని ప్రతిబింబిస్తుంది. (చదవండి: మహిళలు... కొంచెం ఎక్కువ సమానం) గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్ని కల వరకు భారతదేశంలో కులానికి ఎంత ప్రాధా న్యముందో అందరికీ తెలిసిందే. కులాలవారీగా జనాభా లెక్కల సేకరణ చేపడితే హిందూ ఓట్లలో చీలిక వస్తుందన్న భయం బీజేపీకి ఏర్పడుతోంది. కులాలను పక్కనబెట్టి మతపరంగా ఎక్కువ జనాభాను తనవైపు తిప్పుకున్న బీజేపీ, ఇప్పుడు తన ఓటు బ్యాంకును చీల్చుకోవడానికి ఇష్టపడటం లేదు. కులాలవారీ జనగణన వల్ల కుల అస్తిత్వం, గుర్తింపు శాశ్వతమైపోతుందని ఆ పార్టీ భయపడుతోంది. సమాజంలో మార్పు రాదని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే, కుల గుర్తింపు అనేది తమకు అవసరమని మిగతా వర్గాలు వాదిస్తున్నాయి. ఓబీసీలకు సమూల మార్పు కావాలంటే... కేంద్రంలో అధికారం వెలగబెట్టే జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలకు రాబోయే ప్రతి ఎన్నికలో బుద్ధి చెప్పడం అవశ్యం. - మన్నారం నాగరాజు వ్యాసకర్త రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ లోక్సత్తా పార్టీ -
2011 ఎస్ఈసీసీ డేటాలో లోపాలు!
న్యూఢిల్లీ: పదేళ్ల క్రితం చేపట్టిన సామాజికార్థిక కులగణన(ఎస్ఈసీసీ–2011) గణాంకాల్లో లోపాలున్నాయని, ఓబీసీల డేటాకు సంబంధం లేదని కేంద్రం మంగళవారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. లోపభూయిష్ట సమాచారం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందనే ఈ నివేదికను బహిర్గతం చేయలేదని తెలిపింది. ఓబీసీలకు రిజర్వేషన్లను తాము సమర్థిస్తామని, అయితే ఇందుకు సంబంధించిన ప్రక్రియ సుప్రీం రాజ్యాంగ బెంచ్ తీర్పునకు అనుగుణంగా ఉండాలని పేర్కొంది. చదవండి: లైన్ క్లియర్.. పన్నీరు, పళనిలకు భారీ ఊరట ఎస్ఈసీసీ 2011 వివరాలను తమకందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్పై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. తాము ఎన్నిమార్లడిగినా కేంద్రం ఈ గణాంకాలు అందించడం లేదని మహారాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిపై సమాధానమిచ్చిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఈ గణాంకాల ఆధారంగా రిజర్వేషన్లు, ఇతర ఏ అంశాలను చేపట్టలేమని, ఇందులో లోపాలున్నాయని తెలిపారు. -
నీట్–పీజీ కౌన్సెలింగ్ నిలిపివేత
న్యూఢిల్లీ: ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కోటాపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు వచ్చేదాకా నీట్–పీజీ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించబోమని కేంద్ర ప్రభుత్వం సోమవారం అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేసింది. ప్రస్తుత(2021–22) విద్యా సంవత్సరం నుంచే ఎంబీబీఎస్/బీడీఎస్, ఎండీ/ఎంఎస్/ఎండీఎస్ కోర్సుల్లో అఖిల భారత కోటా సీట్ల భర్తీకి ఓబీసీలకు 27 శాతం, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు(ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు జూలై 29న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ పలువురు ‘నీట్’ అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీబీ నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్ర సర్కారు తరపున అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ హాజరయ్యారు. రిజర్వేషన్లపై న్యాయస్థానం తుది ఉత్తర్వులు ఇచ్చేవరకూ కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టబోమని వెల్లడించారు. అంతకుముందు పిటిషనర్ల తరపున సీనియర్ అడ్వొకేట్ అరవింద్ దత్తార్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం ప్రకటించిన ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కోటాతో చాలామంది అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని వివరించారు. మెడికల్, డెంటల్ అండర్ గ్రాడ్యుయేట్(యూజీ) కోర్సుల్లో 15 శాతం సీట్లు, పోస్టు గ్రాడ్యుయేట్(పీజీ) కోర్సుల్లో 50 శాతం సీట్లు అఖిల భారత కోటా కింద ఉంటాయి. ఈ సీట్ల భర్తీలో ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్కు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేంద్రప్రభుత్వం ప్రకటించడం పట్ల వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ‘డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్’ ఉత్తర్వుల ప్రకారం నీట్–పీజీ సీట్ల భర్తీకి సంబంధించి ఈ నెల 25వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. -
పార్లమెంటు నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ కంటే రెండు రోజులు ముందే ముగిసిపోయాయి. ఉభయ సభలు బుధవారం రవధికంగా వాయిదా పడ్డాయి. జనాభాలో ఇతర వెనుకబడిన కులాలను (ఓబీసీ) గుర్తించి జాబితాను తయారు చేసే అధికారాలను రాష్ట్రాలకు పునరుద్ధరించే 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. పెగసస్ స్పైవేర్ వివాదం, వ్యవసాయ చట్టాలు, పెట్రో ధరలు పెంపు వంటి అంశాలపై విపక్ష పార్టీల సభ్యులు ఈసారి వర్షాకాల సమావేశాలను అడుగడుగునా అడ్డుకున్నారు. జూలై 19న మొదలైన ఈ సమావేశాలు ఆగస్టు 13న ముగియాల్సి ఉంది. అయితే సభా కార్యకలాపాలు జరగకుండా విపక్షాలు నిరంతరాయంగా అడ్డుకోవడంతో సభలో ప్రతిష్టంభన నెలకొంది. ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య లోక్సభలో 19 బిల్లులు పాసయ్యాయి. విపక్షాలు కలిసి రావడంతో ఓబీసీ బిల్లుపై మాత్రమే ఉభయసభల్లో పూర్తిస్థాయి చర్చ జరిగింది. లోక్సభ సమావేశాలు మొత్తం కేవలం 21 గంటలు మాత్రమే జరిగాయి. సభ ఉత్పాదకత 22 శాతం మాత్రంగానే ఉంది. ఈ సమావేశాల్లో విపక్ష సభ్యులు పెగసస్పై చర్చకు పట్టుబట్టడం వంటి దృశ్యాలే ప్రతీరోజూ కనిపించాయి. బుధవారం సభను నిరవధికంగా వాయిదా వేసినప్పుడు ప్రధాని మోదీ సభలోనే ఉన్నారు. ఓబీసీ బిల్లుని ఆమోదించిన రాజ్యసభ ఇతర వెనుకబడిన కులాల జాబితాను సొంతంగా రూపొందించుకునే అధికారాన్ని రాష్ట్రాలకు తిరిగి కట్టబెట్టే 127వ రాజ్యాంగ సవరణ బిల్లు 2021కి రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది. 187 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు. ఈ బిల్లును లోక్సభ మంగళవారం ఆమోదించింది. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి ఈ చర్చలో పాల్గొంటూ ప్రభుత్వం కుల జనాభా గణన చేపట్టడానికి ఎందుకు వెనకడుగు వేస్తోందన్నారు. మార్షల్స్ మోహరింపు ఓబీసీ బిల్లుకు సభ ఆమోద ముద్ర వేసిన తర్వాత రాజ్యసభలో గందరగోళం జరిగింది. జనరల్ ఇన్సూరెన్స్ సవరణ బిల్లుని ప్రవేశపెట్టిన సమయంలో సభ్యులు మళ్లీ సభను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ప్రభుత్వ రంగంలోని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను ప్రైవేటుపరం చేయడానికి వీలు కల్పించే ఈ బిల్లును విపక్షసభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. కాగితాలు చింపి విసిరేశారు. మార్షల్స్తో ఎంపీలకు తోపులాట జరిగింది. మార్షల్స్ తమతో దురుసుగా ప్రవర్తించారని కాంగ్రెస్ మహిళా ఎంపీలు ఆరోపించారు. రెండుసార్లు వాయిదాపడ్డాక రాత్రి ఏడు తర్వాత సభ తిరిగి ప్రారంభం కాగా... టీఎంసీ, డీఎంకేలు దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేయగా ప్రభుత్వం తోసిపు చ్చింది. కాగా మంగళవారం సభ్యులు టేబుల్స్ పైకి ఎక్కి రభస చేయడంతో అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేశారు. వెల్లోనికి ఎవరూ రాకుండా 50 మంది మార్షల్స్ని మోహరించారు. ఇన్సూరెన్స్ బిల్లుతోపాటు మరో రెండు బిల్లులు ఆమోదించాక సభ నిరవధికంగా వాయిదా పడింది. కఠిన చర్యలు తీసుకోవాలి: జోషి ప్రతిపక్ష సభ్యులే మార్షల్ను తోసివేశారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఆరోపణలను తోసిపుచ్చారు. మార్షల్ ఎంపీలను తాకే సాహసం చేయరని, సీసీటీవీ ఫుటేజీ చూస్తే ఎవరు అబద్ధాలు చెబుతున్నారో తెలిసిపోతుందని అన్నారు. -
ఓబీసీ బిల్లుకు లోక్సభ ఆమోదం.. అసలు ఎందుకీ బిల్లు..?
న్యూఢిల్లీ: జనాభాలో ఇతర వెనుకబడిన కులాల (ఓబీసీ)లను గుర్తించి సొంతంగా జాబితా తయారు చేసుకునే హక్కును రాష్ట్రాలకు తిరిగి కట్టబెట్టే కీలక బిల్లును లోక్సభ మంగళవారం ఆమోదించింది. హాజరైన మొత్తం 385 మంది సభ్యులు ఈ బిల్లుకు మద్దతు పలికారు. జూలై 19న వర్షాకాల సమావేశాల ఆరంభం తర్వాత లోక్సభలో ఒక బిల్లుపై సాఫీగా చర్చ జరిగి ఆమోదం పొందడం ఇదే తొలిసారి. బిల్లుకు కొన్ని సవరణలను విపక్షాలు సూచించినా వాటికి ఆమోదం లభించలేదు. ఇది రాజ్యాంగసవరణ బిల్లు కావడంతో పార్లమెంట్ రెండు సభల్లో ప్రత్యేక మెజార్టీతో (హాజరైన వారిలో మూడింట రెండొంతల మంది ఆమోదం) ఆమోదం పొందాల్సి ఉంటుంది. పెగసస్, రైతు చట్టాలపై నిరసనతో సభను అడ్డుకుంటున్న విపక్షాలు, ఈ బిల్లును మాత్రం అడ్డుకోమని గతంలోనే ప్రకటించాయి. ఈ నేపథ్యంలో 127వ రాజ్యాంగ సవరణ బిల్లు –2021ను సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి వీరేంద్రకుమార్ లోక్సభలో ప్రవేశపెట్టారు. బిల్లుకు పూర్తి న్యాయం జరగాలంటే దేశవ్యాప్తంగా కులాధారిత జనగణన జరగాలని చర్చ సందర్భంగా జేడీయూ, బీఎస్పీ, ఎస్పీ, డీఎంకే డిమాండ్ చేశాయి. రిజర్వేషన్లలో 50 శాతం పరిమితి వద్దని కాంగ్రెస్ సహా పలు విపక్షాలు ప్రభుత్వాన్ని కోరాయి. చర్చ అనంతరం బిల్లుకు ఆమోదం లభించింది. 50 శాతం సీలింగ్ వద్దు ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లుకు మద్దతు ఇస్తున్నామన్న ప్రతిపక్షాలు, బిల్లులో పేర్కొన్న రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని డిమాండ్ చేశాయి. బిల్లుకు మద్దతిస్తామని, అయితే రాష్ట్రాల అభిప్రాయాలను గౌరవించాలని, రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న పరిమితిని తీసివేయాలని అధిర్ రంజన్ చర్చ సందర్భంగా కోరారు. సుప్రీంకోర్టు మండల్ తీర్పు ద్వారా 30 ఏళ్ల క్రితం విధించిన ఈ పరిమితి సడలించాలని ఎస్పీ, డీఎంకే సైతం డిమాండ్ చేశాయి. ఈ విషయంపై సంపూర్ణ అధ్యయనం జరగాల్సి ఉందని మంత్రి వీరేంద్ర కుమార్ జవాబిచ్చారు. విపక్షాల ఆందోళనను ప్రభుత్వం అర్ధం చేసుకుందన్నారు. కానీ కోర్టులు ఈ విషయంలో స్థిరంగా వ్యవహరిస్తున్నాయని గుర్తుచేశారు. అందువల్ల దీనికి సంబంధించిన న్యాయ, చట్టపరమైన అంశాలను సంపూర్ణంగా అధ్యయనం చేసి నిర్ణయానికి రావాల్సి ఉందన్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే రిజర్వేషన్లు 50 శాతం దాటవచ్చన్న ఇందిరా సాహ్నీ కేసులో కోర్టు తీర్పును గుర్తు చేశారు. తమ ప్రభుత్వం పేద, దళిత, ఓబీసీల ప్రయోజనాలకు అన్ని చర్యలు తీసుకుంటుందని కార్మిక శాఖా మంత్రి భూపేందర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఓబీసీలపై ప్రేమే ఉంటే నలభై ఏళ్లుగా కాంగ్రెస్ ఏమి చేసిందని ఎద్దేవా చేశారు. యూపీఏ హయంలో బీసీ కమిషన్కు రాజ్యాంగ బద్దత కూడా కల్పించలేదని, మోదీ ప్రభుత్వం వచ్చాక ఆ పని జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుత బిల్లు ఉద్దేశం రాష్ట్రాలు సొంత ఓబీసీ జాబితా తయారు చేసుకునే వీలు కల్పించడమేనని చెప్పారు. ‘ఈ బిల్లు తీసుకురావడం వెనుక ఘనత మహారాష్ట్ర ప్రభుత్వానిది. ఓబీసీ రిజర్వేషన్లపై మా ప్రభుత్వ యత్నాల వల్లనే ఈ బిల్లుకు రూపం వచ్చింది. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగించకుండా ఈ బిల్లుకు పరిపూర్ణత రాదు’’ అని ఎన్సీపీ నేత సుప్రియా సూలే వ్యాఖ్యానించారు. ఎందుకీ బిల్లు జాతీయ బీసీ కమిషన్ విధివిధానాలను నిర్దేశిస్తూ 2018లో ప్రభుత్వం 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 338బీ, 342ఏ, 366 (26సి) అధికరణలను చేర్చింది. మరాఠాలకు ప్రత్యేక రిజర్వేషన్లను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఈ ఏడాది మే 5న కీలకమైన తీర్పు చెప్పింది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాల (ఎస్ఈబీసీ) జాబితాలో కొత్త కులాలను నోటిఫై చేసే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుందని, మార్పులు, చేర్పులు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని 342ఏ చెబుతోందని, 102వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాలు ఓబీసీ జాబితాలో కులాలను చేర్చే అధికారాన్ని కోల్పోయాయని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రాలకు సొంత ఓబీసీ జాబితా తయారు చేసుకునే అవకాశం పోయింది. ఈ తీర్పును సమీక్షించాలన్న కేంద్ర విజ్ఞప్తిని మేలో సుప్రీం తోసిపుచ్చింది. ఓబీసీలను గుర్తించే తమ అధికారాలను హరించడంపై పలు రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్రం 127వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకువచ్చింది. దీన్ని 671 కులాలకు ప్రయోజనం చేకూర్చే చరిత్రాత్మక చట్టంగా మంత్రి వీరేంద్ర కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రాలు తమ పరిధిలోని ఓబీసీ కులాలను గుర్తించే హక్కును పునరుద్ధరించటం ద్వారా ఎన్నో కులాలకు సామాజిక, ఆర్థిక న్యాయం కలిగించవచ్చన్నారు. ఇందుకోసం అధికరణ 342ఏతో పాటు 338బీ, 366ను కూడా సవరించాల్సి ఉందని వీరేంద్రకుమార్ తెలిపారు. ఈ బిల్లుపై చర్చ ప్రారంభించిన కాంగ్రెస్ లోక్సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ఓబీసీ బిల్లుకు మనస్ఫూర్తిగా మద్దతిస్తున్నట్టు చెప్పారు. 2018లో చేసిన 102 రాజ్యాంగ చట్ట సవరణను ఆయన తప్పుబట్టారు. నాడు ప్రతిపక్షాలు చేసిన సూచన చట్టంలో చేర్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. రాజ్యసభలో రభస పలురోజులుగా చర్చలు లేకుండా వాయిదా పడుతున్న రాజ్యసభలో మంగళవారం సైతం అదే ధోరణి కనిపించింది. ఎన్నడూ లేని విధంగా కొందరు విపక్ష సభ్యులు అధికారుల టేబుల్స్పైకి ఎక్కి నల్ల జండాలు ఊపుతూ, ఫైళ్లు విసిరేస్తూ రభస సృష్టించారు. చాలామంది వెల్లో వలయాకారంగా నిలబడి నినాదాలు చేశారు. పలుమార్లు సభ్యుల ఆందోళనలతో వాయిదాలు పడుతూ వచ్చిన సభ చివరకు బుధవారానికి వాయిదా పడింది. నిరసనల మధ్యనే బీజేపీ సభ్యులు రైతుల సమస్యలను ప్రస్తావించారు. ఇదే సమయంలో ఆప్కు చెందిన సంజయ్ సెక్రటరీ జనరల్ బల్లపైకి ఎక్కి నినాదాలిచ్చారు. తర్వాత ఇద్దరు కాంగ్రెస్ సభ్యులూ బల్ల ఎక్కి నినదించారు. -
ఓబీసీ బిల్లుకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు
-
ఓబీసీ బిల్లుకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు
న్యూఢిల్లీ: లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓబీసీ సవరణ బిల్లుకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎంపీలు మంగళవారం ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. ఓబీసీ బిల్లుకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. ఓబీసీలను గుర్తించే అధికారం రాష్ట్రాలకు ఇవ్వడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఏయే కులాలు వెనకబాటు తనంలో ఉన్నాయో.. రాష్ట్ర ప్రభుత్వాలకే అవగాహన ఉంటుందన్నారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డ ఓబీసీలకు ఈరోజు వరకు పూర్తిగా న్యాయం జరగలేదని రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఓబీసీల రిజర్వేషన్లను పలుమార్లు కేంద్రం దృష్టికి తెచ్చారని గుర్తు చేశారు. ఓబీసీ బిల్లును స్వాగతిస్తున్నామని తెలిపారు. బీసీ వర్గాల అభ్యున్నతి కోసం కేంద్రం కేటాయిస్తున్న బడ్జెట్ నామమాత్రం బడ్జెట్ అని విమర్శించారు. అదే ఏపీలో సీఎం జగన్ బీసీల అభివృద్ధి కోసం 30 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే..మరి 29 రాష్ట్రాలు ఉన్న కేంద్ర ప్రభుత్వం వెయ్యి కోట్లు మాత్రమే కేటాయించడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. సుమారు 67 ఏళ్ల నుంచి ఓబీసీ కేటగిరీ కింద వెనకబడి ఉన్న కులాలకు ఇన్ని సంవత్సరాలుగా అన్యాయం జరుగుతుందని వైఎస్సార్సీపీ లోక్సభ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. వారికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఈ బిల్లును తీసుకురావడం మనస్పూర్తిగా స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కేంద్ర గుర్తించలేని ఓబీసీ కులాలు సుమారు 671 ఉన్నాయని, ఈ బిల్లు ద్వారా వారికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. -
డిసెంబర్లో ఓబీసీ మహాగర్జన
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ డిమాండ్ చేసింది. ఇందుకోసం డిసెంబర్ మొదటివారంలో ఢిల్లీలో ఓబీసీ మహాగర్జన నిర్వహించాలని నిర్ణయించింది. సోమవారం తెలంగాణ భవన్లో మహాసంఘ్ జాతీయ అధ్యక్షుడు బాబాన్రావు తేవాడే అధ్యక్షతన సమావేశం జరిగింది. జనగణనలో కులాల వారీగా లెక్కలు తీయాలని, నీట్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లను జనాభా ప్రకారం పెంచాలని కోరారు. అలాగే క్రీమిలేయర్ ఆదాయ పరిమితిని పెంచడంతోపాటు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు. ఇలా మొత్తం 8 డిమాండ్లకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బీసీ సంఘాల అధ్యక్షులు కేసన శంకరరావు, జాజుల శ్రీనివాస్గౌడ్, 24 రాష్ట్రాలకు చెందిన బీసీ సంఘాల నేతలు, తదితరులు పాల్గొన్నారు. క్రీమిలేయర్ను రద్దు చేయండి క్రీమిలేయర్ను రద్దు చేయాలని, లేనిపక్షంలో ఆదాయ పరిమితిని 8 లక్షల నుంచి 20 లక్షలకు పెంచాలని బీసీ ప్రతినిధుల బృందం.. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ను కలసి విజ్ఞప్తి చేసింది. అలాగే దేశంలోని జాతీయ ప్రాజెక్టులు, పార్కులు, పర్యాటక స్థలాలకు మహాత్మ జ్యోతిబా పూలే పేరు పెట్టాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్రెడ్డిని కలిసి విన్నవించింది. కాగా.. యూజీ, పీజీ వైద్య విద్య సీట్ల కేటాయింపుల్లో ఓబీసీలకు అన్యాయం జరుగుతోందని, ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించాలని ఓబీసీ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి జె.లక్ష్మీనరసింహ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో పలువురు ఎంపీలను కలిసి ఆయన వినతిపత్రం అందించారు. -
సీనియర్ జర్నలిస్టు కోప్ర కన్నుమూత
ముషీరాబాద్: జర్నలిస్టు, కవి, రచయిత, బహుజన మేధావి కోలపూడి ప్రసాద్ (56) ఆదివారం రాత్రి కన్నుమూశారు. కోప్రగా ఆయన అందరికీ సుపరిచితుడు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. వారం క్రితం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మొదట పెరాలసిస్ రావడంతో కొన్ని అవయవాలు పనిచేయలేదు. కిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో మృతి చెందారు. ఏపీలోని నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన ప్రసాద్ మొదట్లో ఆర్ అండ్ బిలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేశారు. కొంతకాలం విరసంలో, అప్పటి పీపుల్స్వార్ పార్టీలో పనిచేశారు. అనంతరం ఆ పార్టీకి దూరమై హైదరాబాద్ వచ్చారు. జర్నలిస్టుగా అనేక పత్రికలలో పనిచేశారు. అనేక పాటలు, కవితలు, వ్యాసాలు రాసి బహుజన మేధావిగా గుర్తింపుపొందారు. ముఖ్యంగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్స్ (ఎంబీసీ) సిద్ధాంతకర్తగా ప్రాచుర్యం పొందారు. కోలపూడి ప్రసాద్ (కోప్ర) మరణంపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతిపట్ల బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, తెలంగాణ ఎమ్మార్పీఎస్ నేతలు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ, మేడి పాపయ్య మాదిగలతోపాటు బహుజన మేధావులు, కవులు, రచయితలు, ప్రజాసంఘాల ప్రతినిధులు సంతాపం తెలిపారు. కోప్ర మరణం బీసీ ఉద్యమానికి తీరనిలోటన్నారు. చదవండి: కాల్పుల విరమణ దిశగా మావోలు? -
బెంగాల్ రాజకీయాల్లో కీలక అంశం ఇదే!
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల సమయంలో బెంగాల్ను కుల రాజకీయాలు, సమీకరణాలే శాసిస్తున్నాయి. అభివృద్ధి మంత్రం జపించాల్సిన స్థానంలో రాజకీయపార్టీలు కుల సమీకరణాలే లక్ష్యంగా ప్రజలను మచ్చికచేసుకొనే పనిలో బిజీగా ఉన్నాయి. ఇన్నేళ్లుగా కుల రాజకీయాలకు దూరంగా ఉన్న బెంగాల్లో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కులమే రాజకీయ పార్టీలకు ప్రధానాస్త్రంగా మారింది. అధికార పీఠాన్ని వదులుకోవడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వరాదనే ఉద్దేశంతో వ్యూహాలు రచిస్తున్న టీఎంసీ ఒకవైపు, ఎట్టి పరిస్థితుల్లోనూ బెంగాల్ కోటలో కమలాన్ని వికసింపచేయాలని ఉవ్విళ్లూరుతున్న కమలదళం మరోవైపు కుల సమీకరణాలపై ప్రధానంగా దృష్టి పెట్టాయి. మేనిఫెస్టోల్లో ఓబీసీ అంశం బెంగాల్ అసెంబ్లీలో 50కి పైగా స్థానాల్లో కీలకంగా ఉన్న ఇతర వెనుకబడిన తరగతుల(ఓబీసీ)ను తమకు అనుకూలంగా మార్చుకొని ఎన్నికల్లో లబ్ధిపొందాలని బీజేపీ, టీఎంసీ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గత బుధవారం విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టోలో మహిషి–తేలి, సాహా వంటి కులాలకు ఓబీసీ రిజర్వేషన్లు మంజూరు చేయాలనే నిర్ణయం ఆయా వర్గాలను తమ వైపు తిప్పుకొనేందుకు చేసిన ఒక కీలక పరిణామంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయ చదరంగంలో తృణమూల్ ఆడిన ఈ పందెంతో కమలదళం సైతం పావులు కదిపింది. మూడు, నాలుగు రోజుల క్రితం బెంగాల్లో పర్యటించిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా దీదీని విమర్శించారు. కొన్నేళ్లుగా ఓబీసీ కేటగిరీలో చేర్చేందుకు టీఎంసీ అడ్డుకుంటున్న కొన్ని కులాలను బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేరుస్తామని నడ్డా హామీ ఇచ్చారు. తాజాగా విడుదల చేసిన బీజేపీ మేనిఫెస్టోలో మండల్ కమిషన్ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకొని మహిష్య, తిల్లి, ఇతర హిందూ ఓబీసీ కులాలను ఓబీపీ రిజర్వేషన్లో చేరుస్తామని ప్రకటించింది. టీఎంసీ కంచుకోటగా పరిగణించే ఉత్తర 24 పరగణాలు, నాడియా జిల్లాలతో సహా దక్షిణ బెంగాల్లోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ జనాభా ఉన్న జంగల్మహల్ జిల్లాల్లో 2019 లోక్సభ ఎన్నికల సమయంలో కమలదళం క్షేత్రస్థాయిలో తమ వ్యూహాలను అమలు చేసి విజయం సాధించింది. అయితే బీజేపీకి 2019 సార్వత్రిక ఎన్నికలు కలిసిరావడానికి ప్రధాన కారణం ఓబీసీ ఓట్ల బదిలీ. వాస్తవానికి తూర్పు– పశ్చిమ మేదినీపూర్, హుగ్లీ, హౌరా జిల్లాల్లో బీజేపీ పట్టుపెంచుకుంది. దీంతో ఈ జిల్లాల్లోని ఎమ్మెల్సీ నియోజకవర్గాలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ బల నిరూపణకు కలసివస్తాయని బీజేపీ పెద్దలు ఉవ్విళూరుతున్నారు. అదే సమయం లో తాయిలాలను ప్రకటించి తిరిగి అధాకారంలోకి రావాలని తృణమూల్ కాంగ్రెస్ భావిస్తోంది. ఇతర వర్గాలపై కన్ను: చాలాకాలంగా తృణమూల్ కాంగ్రెస్కు దూరంగా ఉన్న మతువా, ఆదివాసీ, రాజవంశీ, బౌరి, బాగ్డి వంటి కులాల ప్రజలకు తాయిలాలు ప్రకటించడం ద్వారా మచ్చిక చేసుకొనేందుకు మమతా బెనర్జీ ఒకవైపు ప్రయత్నిస్తుంటే, మరోవైపు బీజేపీ నాయకులు కూడా ఈ వర్గాలను ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా రాజవంశీలు, మతువాలపై కమలదళం ప్రత్యేక దృష్టిపెట్టింది. మతువాలకు సంబంధించి అనేక అంశాల్లో కీలక ప్రకటనలు చేయడంతో పాటు, 2019 సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్ని అమలు చేసే ప్రక్రియపై కమలనాథులు ప్రణాళికలు అమలు చేస్తున్నారు. మతువా సామాజిక వర్గం తీర్థస్థలంగా భావించే ప్రాంతాన్ని మోడీ సందర్శించనున్నారు. బెంగాల్లో ఈ నెల 27న జరిగే తొలిదశ ఓటింగ్ ప్రక్రియతో మొత్తం ఎనిమిది దశల పోలిం గ్ ప్రక్రియ ప్రారంభమౌతుంది. అయితే తొలిదశ పోలింగ్కు ఒక్కరోజు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 26న బంగ్లాదేశ్కు వెళుతున్నారు. ఆ మరుసటి రోజు 27వ తేదీన మతువా సామాజిక వర్గం దైవంగా కొలిచే హరిచంద్ ఠాకూర్ జన్మస్థలం, మతువాలకు తీర్థస్థలం అయిన గుడాకాం దీని సందర్శిస్తారు. ప్రధాని మోదీ ఈ పర్యటనపై కమలదళం పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని సందర్శించే తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ నిలువనున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 5 కోట్లకు పైగా మతువా వర్గ ప్రజల మనసుల్లో మోదీ చోటు సంపాదించుకున్నవారు అవుతారని బీజేపీ నాయకత్వం, మతువా మహాసంఘ్ నాయకులు భావిస్తున్నారు. 50 సీట్లపై ప్రభావం 2011లో తొలిసారి అధికారంలోకి వచ్చిన ఏడాదికి బెంగాల్ బ్యాక్వర్డ్ క్లాస్ బిల్లు–2012ను తీసుకొచ్చారు. ఈ జాబితాలో ముస్లింలలోని సయ్యద్, సిద్దిఖీ వర్గాలు మినహా మిగతా అందరినీ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం చేర్చింది. హిందువుల్లో సూత్రధర్, స్వర్ణకర్, తేలి, కుంభకర, కుర్మి, మంజి, మోదక్, కన్సారీ, కహార్, మిడాస్, కపాలి, కర్మకర్లను కూడా ఓబీసీ కులాల్లోకి చేర్చారు. వాస్తవానికి రాష్ట్రంలోని 50 సీట్లపై మహిష, తోమర్, తేలి కులాలు తమదైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రాష్ట్రంలో సుమారు 38 లక్షల మందికి బెంగాల్ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఓబీసీ ధృవీకరణ పత్రాలను జారీచేసిందని సమాచారం. ఇదేకాకుండా ఇటీవల ఒక ప్రభుత్వ పథకం కింద వేలాదిమందిని ఓబీసీలుగా గుర్తించేందుకు నమోదు ప్రక్రియను మమతా ప్రభుత్వం చేసిందని అనధికార వర్గాల సమాచారం. చదవండి: నేనో పెద్ద గాడిదనని.. అతడి అసలు రంగును గుర్తించలేకపోయా: మమత పరాజయాన్ని మమతా బెనర్జీ ముందే ఊహించారు: ప్రధాని మోదీ -
మరోసారి అటకెక్కిన ఓబీసీ కులగణన
బ్రిటిష్ పాలనలో జనాభా లెక్కల్లో ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, పార్సీలు, ఆంగ్లో ఇండి యన్స్, ముస్లి మేతరుల (హిందు వులు) లెక్కలు తీసేవారు. 1872 నుండి జనాభా లెక్కలలో ఆయా కులాల గణాంకాలను 1931,1932 వరకు లెక్కించింది. శూద్ర కులాల సామాజిక, ఆర్థిక, విద్య, సాంస్కృతిక అంశాలు తెలిస్తే తప్ప దేశ అభివృద్ధి సాధ్యం కాదని గుర్తిం చింది. దేశానికి స్వాతంత్య్ర సిద్ధించిన అనంతరం 1951 నుండి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీస్తు న్నారు. ఇందులో స్త్రీలు, పురుషులు, పిల్లలు, మతంతో పాటుగా షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) లెక్కలను తీస్తున్నారు. కానీ దేశ జనాభాలో యాభై శాతం పైగా జీవిస్తున్న వెనుకబడిన తరగతుల (బీసీ/ఓబీసీ) లెక్కలు తీయడం లేదు. మొదటి జాతీయ బీసీ కమిషన్ మొదలుకొని, అన్ని రాష్ట్రా లలో నేటి వరకు నియమించిన బీసీ కమిషన్లు అన్నీ ఓబీసీ కులగణన చేయాలని సూచించాయి. సుప్రీంకోర్టు, హైకోర్టులు అనేక సందర్భాలలో వెనుకబడిన తరగతుల లెక్కలను తేల్చా లని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించాయి. 2012లో మద్రాస్ హైకోర్టు ధర్మాసనం ‘సెన్సస్ కమిషనర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఆర్.కృష్ణమూర్తి’ మధ్య కేసు తీర్పులో కేంద్ర ప్రభుత్వాన్ని జనాభా లెక్కలతో పాటుగా ఓబీసీ కులగణన చేయాలని సూచించింది. 2010లో జరిగిన పార్లమెంట్ సమావేశాలలో ఓబీసీ కుల గణన చేయాలని అన్ని ప్రతిపక్ష పార్టీలు, భారతీయ జనతా పార్టీతో సహా ముక్తకంఠంతో నినదించాయి. అందుకు స్పందిం చిన కేంద్ర ప్రభుత్వం 2011లో చేయబోయే జనాభా లెక్కలలో సాధ్యం కాదనీ; అప్పటికే జనాభా లెక్కలకు సంబంధించిన సామగ్రిని దేశవ్యాప్తంగా పంపించడం జరిగిందనీ; తరువాత తీయబోయే జనాభా లెక్కలలో ఓబీసీ గణన చేస్తామనీ లోకసభ, రాజ్యసభ సాక్షిగా ప్రకటించింది. 2014లో అధికారం లోకి వచ్చిన బీజేపీ సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల జనగణన 2021లో చేపడుతామని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ రిజిస్ట్రార్ జనరల్ వారు 2021 జనగణనకు సంబంధించిన షెడ్యూలు విడుదల చేస్తూ మొదట శాంపిల్ సర్వేకు ప్రతి రాష్ట్రంలో మూడు మండలాలను ఎంపిక చేసి మొబైల్ మరియు డేటా షీట్ ద్వారా సర్వేను 12 ఆగస్టు నుండి 30 సెప్టెంబర్ 2019 వరకు నిర్వహించారు. ఇందులో ఎస్సీ, ఎస్టీల వివరాలు సేకరించారు గానీ ఓబీసీల వివరాలను సేకరిం చలేదు. శాంపిల్ సర్వేలో చేయలేదంటే ఈసారి కూడా ఓబీసీ కులగణన చేయడం లేదని తేటతెల్లమైంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీల పరిస్థితి పెనం మీది నుండి పొయ్యిలో పడ్డట్లుగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 స్థానిక సంస్థలైన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికలలో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు పరిచారు. కానీ 2019లో పంచాయతీ ఎన్నికలలో తెలంగాణ ప్రభుత్వం 50% పరిమితికి సంబంధించి కోర్టు తీర్పులను సాకుగా చూపి 34 నుండి 23 శాతానికి బీసీ రిజర్వేషన్లను కుదించారు. ఫలితంగా సుమారు 1000 సర్పంచి సీట్లను బీసీలు కోల్పోవలసి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం 2014లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం అధికారికంగా బీసీ జనాభాను కోర్టులకు సమర్పించి 34% రిజర్వేషన్ల అమలుకు ఆమోదం తీసుకోవచ్చు. కానీ అలా చేయలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019లో జీవో 176 ద్వారా గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీసీలకు 34%, ఎస్సీలకు 19.08%, ఎస్టీలకు 6.77% మొత్తం వర్టికల్ రిజర్వేషన్ 60% శాతంగా కల్పించింది. ఈ రిజర్వేషన్లపై హైకోర్టు ధర్మాసనం బిర్రు ప్రతాపరెడ్డి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ మధ్య కేసు తీర్పులో బీసీల జనాభా లెక్కలు లేవు కనుక వర్టికల్ రిజర్వేషన్ 50% దాటడానికి వీలులేదని తీర్పిచ్చింది. తప్పని పరిస్థితులలో ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను జీవో 559 ద్వారా 34% నుండి 24%కి తగ్గించింది. ఇప్పటికీ ఎన్నికలు జరగలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2021 జనాభా లెక్కలలో ఓబీసీ గణన చేపట్టి సమసమాజానికి బాటలు వేయాలని 70 కోట్ల మంది బీసీలు ఆశిస్తున్నారు. లెక్కలు అధికారికంగా కేంద్ర ప్రభుత్వం చేయని కారణంగా వీరికి అమలుపరుస్తున్న రిజర్వేషన్లపై అనేక న్యాయపరమైన చిక్కులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టులలో ఎదుర్కోవాల్సి వస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓబీసీలకు విద్య, ఉద్యోగ తదితర రంగాలలో వారి జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లను అమలు చేయాలంటే ఓబీసీ కులగణన తప్పనిసరి. ఇది అన్ని సమస్యలకు సర్వరోగ నివారిణిగా ఉపయోగపడుతుంది. కోడెపాక కుమార స్వామి వ్యాసకర్త అధ్యక్షులు, జాతీయ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ‘ మొబైల్ : 94909 59625 -
సెంట్రల్ వర్సిటీల్లో ఓబీసీలకు అన్యాయం
దేశంలోని 40 కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో 9 మంది ఓబీసీ ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారంటూ యూజీసీ ఒక ఆర్టీఐకి ఇచ్చిన సమాధానం ఓబీసీ మేధావులలో చర్చకు దారితీసింది. ఇదే పరిస్థితి అసోసియేట్ ప్రొఫెసర్స్, అసి స్టెంట్ ప్రొఫెసర్స్లో చూడవచ్చు. మండల్ కమిషన్ ప్రవేశపెట్టి 30 ఏళ్ళు అవుతున్నా ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో, కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో, ఐఐటీలు, ఐఐఎంలు, ఏఐఎంఎంలు, ఎన్ఐటీలలో తీరని అన్యాయం జరుగుతుందని చెప్పవచ్చు. 1978 డిసెంబర్ 20న నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ రెండవ జాతీయ వెనుకబడిన కమిటీని బీపీ మండల్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఆయన సెప్టెంబర్ 7, 1980లో భారత ప్రభుత్వానికి నివేదికను సమర్పిం చారు. ‘సమానంగా ఉన్నవాళ్ళలో మాత్రమే సమానత్వం ఉంటుంది. అసమానతలను సమానంగా చేయాలంటే, అసమానత మార్గాలను ఎంచుకోవాల్సి వస్తుంది’ అని నివేదిక తొలి పేజీలోనే రాశారు. మండల్ కమిషన్ ఆధారంగా 1993లో కేంద్రం ప్రభుత్వ ఉద్యోగాలలో ఓబీసీ రిజర్వేషన్లను అమలు చేసినప్పటికి అవి ఉన్నత విద్యా సంస్థలలో 2007 నుండి సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇన్ట్యూషన్స్ 2006 చట్టం ద్వారా అమలులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకుంటున్న అన్ని విద్యా సంస్థల బోధన సిబ్బంది, విద్యార్థుల అడ్మిషన్ సీట్లలో 27% రిజర్వేషన్లను అమలులోకి తెచ్చారు. దేశంలో 40 కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో 2,498 ప్రొఫెసర్లు, 5,011 అసోసియేట్ ప్రొఫెసర్లు, 10,830 అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండగా ఓబీసీలకు 313 ప్రొఫెసర్లు, 735 అసోసియేట్ ప్రొఫెసర్లు, 2,232 అసిస్టెంట్ ప్రొఫెసర్లను మాత్రమే కేటాయించారు. కానీ రిజర్వేషన్ కోటా కింద 674 ప్రొఫెసర్లు, 1,352 అసోసియేట్ ప్రొఫెసర్లు, 2,924 అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఓబీసీలకు కేటాయించాలి. కేటాయించిన ఓబీసీ పోస్టులలో కేవలం 9 మంది ప్రొఫెసర్లు, 38 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 1,327 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను మాత్రమే భర్తీ చేశారు.. అంటే 97.12% ప్రొఫెసర్లు, 94.82% అసోసియేట్ ప్రొఫెసర్లు 40.54% అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ కాలేదు. ఓబీసీలకు 27% కేటాయింపులో తొలి అన్యాయం జరిగితే, కేటాయించిన పోస్టులను కూడా భర్తీ చేయకపోవడం రెండవ అన్యాయం. ఐఐటీల్లో మొత్తం 8,856 మంది బోధన సిబ్బంది ఉంటే, కేవలం 329 మంది ఓబీసీలు మాత్రమే ఉన్నారు. 18 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ల్లో 724 మంది బోధన సిబ్బంది ఉంటే, కేవలం 27మంది ఓబీసీ సిబ్బంది మాత్రమే ఉన్నారు. కేంద్ర ఉన్నత విద్యా సంస్థలలో ఓబీసీల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వీటికి అనేక కారణాలు. మొదటిది విద్య కొన్ని కులాల అధీనంలోనే ఉండాలనే మనువాద ధర్మాన్ని అగ్రకులాల వారు 2020లో కూడా ఇంకా కొనసాగిస్తున్నట్లు కనిపిస్తుంది. రెండవ విమర్శ ఏంటంటే, ఓబీసీలకు అర్హత కండిషన్స్ లేవంటూ వారిని ఉన్నత స్థానాలకు వెళ్ళకుండా చూస్తున్నారు. కానీ జనరల్ క్యాటగిరీలో అగ్రకులాల వారికి అర్హతలు లేకపోయినా ఉద్యోగ అవకాశాలను కలుగజేస్తున్న ధోరణులను మనం చూడవచ్చు. కానీ 52% ఉన్న ఓబీసీల విషయంలో తగిన అభ్యర్థులు లేరు అని, పోస్టులను మూడు సార్లు వేసి, నాలుగవసారి జనరల్గా మార్చుతున్నారు. అంతేకాకుండా కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు చదువుకోవడానికి వస్తున్నా ఓబీసీ విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులలాగా సంఘటితం కాకపోవడం, కులాలవారీగా విడిపోయి వీళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిచూపడంలో విఫలం అయ్యారనే చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఓబీసీల సమస్యలపై దృష్టి పెట్టాలి. 52% ఉన్న ఓబీసీలకు ఉన్నత విద్య సంస్థలలో తీరని అన్యాయం జరుగుతుంది. మొత్తం మంజూరయిన 27% ఓబీసీల ఉద్యోగాలను అమలు చేయాలి. సెంట్రల్ వర్సిటీలు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను అమలు చేయాల్సి ఉంది. కానట్లయితే రాజ్యాంగాన్ని, సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇన్ట్యూషన్ యాక్ట్ 2006ను ఉల్లంఘించినట్లే అవుతుంది. నో సూటబుల్ క్యాండిడేట్ ఫౌండ్ అనే పద్ధతి ద్వారా అన్యాయం జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కేంద్ర ప్రభుత్వం యూపీఎస్సీ తరహా జాతీయ రిక్రూట్మెంట్ సంస్థతో ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించడం ద్వారా అక్రమాలు జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. జి. కిరణ్కుమార్, వ్యాసకర్త అధ్యక్షుడు, అఖిల భారత ఓబీసీ విద్యార్థుల సంఘం, పరిశోధక విద్యార్థి, రాజనీతి శాస్త్రవిభాగం, హైదరాబాద్ వర్సిటీ మొబైల్ : 80745 11654 -
చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలి
-
‘తూర్పుకాపులను ఓబీసీలో కలపండి’
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుకాపు సామాజికవర్గాన్ని ఓబీసీ జాబితాలలో చేర్చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా బుధవారం ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, రఘురామకృష్ణంరాజు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్లు కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి తావర్ చంద్ గెహ్లాత్తో భేటీ అయ్యారు. తూర్పు కాపులను కేంద్ర ప్రభుత్వ ఓబీసీలో చేర్చాలని ఈ నేతలు ఆయనకు విజ్ఞప్తి చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ.. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో ఆంధ్రప్రదేశ్లో తూర్పు కాపులను రాష్ట్రమంతటా బీసీలుగా గుర్తించారని గుర్తుచేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇంకా మూడు జిల్లాలోని తూర్పు కాపులను మాత్రమే ఓబీసీలుగా గుర్తిస్తోందని పేర్కొన్నారు. దీనివల్ల మిగిలిన జిల్లాల్లోని తూర్పుకాపులకు అన్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని తూర్పు కాపులను కేంద్ర ప్రభుత్వ ఓబీసీ జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశామన్నారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి తావర్ చంద్ గెహ్లాత్ను కలిసి వినతిపత్రం అందజేశామని ఆయన పేర్కొన్నారు. ‘మంత్రి తూర్పు కాపుల సమస్య తెలుసని ఈ విషయాన్ని బీసీ కమిషన్కు బదిలీ చేస్తున్నాను. బీసీ కమిషన్ నివేదిక రాగానే దానిపై తదుపరి చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు’ అని మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ వెల్లడించారు. -
సమైక్య ఉద్యమం
సాక్షి, హైదరాబాద్ : జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని, అదే ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కేంద్రంలో బీసీ రిజర్వేషన్లు సరిగ్గా అమలు కావడం లేదని, నిర్దేశిత 28% రిజర్వేషన్లు తప్పనిసరి చేయాల్సి ఉంటే 6–11% మాత్రమే అమలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం కలి్పంచిన హక్కులను సాధించుకునేందుకు బీసీలు చేపడుతున్న ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతిస్తుందని ప్రకటించారు. బుధవారం సరూర్నగర్ స్టేడియంలో జరి గిన జాతీయ ఓబీసీ మహాసభలో ఆయన మాట్లాడారు. ఈ మహాసభలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధులు, బీసీ ఉద్యమకారులు పాల్గొన్నారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ బీసీలంతా కలిసికట్టుగా రిజర్వేషన్ ఉద్యమాలు చేపట్టాలన్నారు. జాతీయ బీసీ సదస్సు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. బీసీలకు నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంబీసీలకు రూ.1000 కోట్లు కేటాయించిందని, ఖర్చు విషయాన్ని పక్కనపెడితే బీసీల పట్ల కేంద్రం కంటే ఉదారంగా రాష్ట్రం వ్యవహరిస్తుందన్నారు. కేటాయించిన నిధులను తర్వాతైనా ఖర్చు చేయాల్సిందేనన్నారు. రాజ్యాంగం కలి్పంచిన హక్కులన్నీ సాధించుకునే వరకు ఉద్యమాన్ని ఆపొద్దని పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాది కృష్ణారావు అన్నారు. జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలు ఐక్యంగా పోరాడితేనే డిమాండ్లు సాధించుకోవచ్చని అన్నారు. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలు వినతులు ఇచ్చే స్థాయిలో ఉంటే.. అతి తక్కువ జనాభా ఉన్న వర్గాలు మాత్రం పరిపాలించే స్థాయిలో ఉన్నాయని మహారాష్ట్ర మంత్రి మహదేవ జనార్దన అన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని, ప్రతి బీసీ ఉద్యమకారుడిగా ఎదగడంతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని అన్నారు. బీసీ జనగణన చేపట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఈ ప్రక్రియ పూర్తి చేసి వివరాలను బహిర్గతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీ డిక్లరేషన్ ఏమైంది?: జస్టిస్ ఈశ్వరయ్య రాష్ట్రంలో బీసీ డిక్లరేషన్ చేపట్టాలని జస్టిస్ ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ‘ఒక్క సంతకంతో ఈ డిమాండ్లన్నీ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పినప్పటికీ.. దాని ఊసేలేదు. బీసీ డిక్లరేషన్ అమలు కావటం లేదు. దేశవ్యాప్తంగా బీసీల జనాభాను తేల్చడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఉద్యమం చేస్తేనే హక్కులు రక్షించబడతాయి. పాఠశాల విద్యను జాతీయం చేయాలి. ప్రాథమిక ఆరోగ్య విధానం మెరుగుపర్చాలి. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కలి్పంచాలి. క్రిమిలేయర్ను వెంటనే తొలగించాలి. బీసీల అభ్యున్నతికి పలు కమిషన్లు ఇచ్చిన సూచనలు, రిపోర్టులు తదితర పూర్తిస్థాయి సమాచారాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ప్రత్యేకంగా వెబ్సైట్ను ప్రారంభిస్తున్నాం’అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేసిందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఆరోపించారు. రాజ్యాధికారంతోనే బీసీల అభివృద్ధి సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. బడుగు, బలహీనవర్గాల నుంచి చట్టసభలకు ఎన్నికైతేనే వారి డిమాండ్లను ప్రభుత్వానికి చెప్పే అవకాశం వస్తుందన్నారు. వెనుకబడిన తరగతులకు చెందిన నాయకులంతా ఐక్యంగా ఉద్యమించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. బీసీల సంక్షేమానికి కేంద్రం పలు సంక్షేమ పథకాలను తీసుకొచి్చందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీలు దేవేందర్ గౌడ్, బూర నర్సయ్య గౌడ్, సినీనటుడు ఆర్.నారాయణ మూర్తి పాల్గొని మాట్లాడారు. ఈ సదస్సుకు మహారాష్ట్ర, కేరళ, పాండిచేరీ, పంజాబ్, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 18 రాష్ట్రాల ఓబీసీ నాయకులు పాల్గొని వారి అభిప్రాయాలు వెల్లడించారు. చదువుతోనే చైతన్యం వస్తుందని, బీసీలంతా తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించేలా ప్రోత్సహించాలని సినీ నటుడు సుమన్ తల్వార్ అన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. జాతీయ ఓబీసీ మహాసభ ముఖ్యమైన తీర్మానాలివే! కులాల వారీగా బీసీ జనాభాను ప్రభుత్వం బహిర్గతం చేయాలి వెనుకబడిన తరగతుల కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, బీసీ వర్గాలకు చెందిన వారికే ఈ శాఖ పగ్గాలు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో బీసీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన కేటాయించాలి బీసీలకు చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలి బీసీ రిజర్వేషన్లకున్న క్రిమిలేయర్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కలి్పంచాలి ఎస్సీ, ఎస్టీల మాదిరిగా పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుతున్న బీసీ విద్యార్థులకు 100% ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వ విభాగాల్లో ఉన్నత స్థానాల్లోని పోస్టుల్లోనూ బీసీ రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు చేయాలి బీసీ అట్రాసిటీ చట్టాన్ని రూపొందించి పకడ్బందీగా అమలు చేయాలి మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేలకు భారతరత్న ఇవ్వాలి -
ఓబీసీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా బండి సంజయ్
న్యూఢిల్లీ : బలహీన వర్గాల సంక్షేమ స్థాయి సంఘం సభ్యుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కుమార్ ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో బండి సంజయ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు.. లోక్సభ స్పీకర్ కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. ఈ సందర్భంగా బలహీన వర్గాల అభ్యున్నతికి, అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేస్తానని సంజయ్ తెలిపారు. దీంతోపాటు ఓబీసీ స్టాండింగ్ కమిటీలో అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరపున కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసిన బండి సంజయ్ టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్పై విజయం సాధించిన విషయం తెలిసిందే. -
లాభాల బాటలోనే ఓబీసీ..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో రూ.113 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.393 కోట్ల నికర నష్టాలు వచ్చాయని ఓబీసీ తెలిపింది. సీక్వెన్షియల్గా చూస్తే, గత క్యూ4లో రూ.202 కోట్ల నికర లాభం సాధించామని పేర్కొంది. రుణ నాణ్యత మెరుగుపడటం, మొండి బకాయిలు తగ్గడంతో కేటాయింపులు తక్కువగా ఉండటం, ట్రెజరీ ఆదాయం పెరగడం.. తదితర కారణాల వల్ల గత క్యూ1లో నికర లాభం సాధించామని ఓబీసీ ఎమ్డీ, సీఈఓ ముకేశ్ జైన్ తెలిపారు. వరుసగా నాలుగో క్వార్టర్లోనూ లాభాలు సాధించామని పేర్కొన్నారు. గత క్యూ1లో రూ.4,730 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.5,635 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. సాధారణంగా జూన్ క్వార్టర్లో వ్యాపారం మందకొడిగా ఉంటుందని, అయినప్పటికీ, రూ. లక్ష కోట్ల మేర వ్యాపారం సాధించామని ముకేశ్ జైన్ తెలిపారు. ట్రెజరీ ఆదాయం రూ.76 కోట్ల నుంచి రూ.179 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. వడ్డీ ఆదాయం రూ.4,269 కోట్ల నుంచి 15 శాతం వృద్ధితో రూ,.4,919 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఇతర ఆదాయం రూ.461 కోట్ల నుంచి 55 శాతం వృద్ధితో రూ.715 కోట్లకు పెరిగిందని తెలిపారు. నికర వడ్డీ మార్జిన్ 2.82 శాతం నుంచి 2.41 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. రూ.3,000 కోట్ల సమీకరణ స్థూల మొండి బకాయిలు 17.89 శాతం నుంచి 12.56 శాతానికి, నికర మొండి బకాయిలు 10.63 శాతం నుంచి 5.91 శాతానికి తగ్గాయని జైన్ వివరించారు. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.1,222 కోట్ల నుంచి రూ.865 కోట్లకు తగ్గాయని పేర్కొన్నారు. మార్కెట్ పరిస్థితులు మెరుగుపడితే, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ మార్గంలో రూ.3,000 కోట్లు సమీకరించనున్నామని తెలిపారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఓబీసీ షేర్ 2 శాతం నష్టంతో రూ.80.35 వద్ద ముగిసింది. -
ఓబీసీ ఉప వర్గీకరణకు దేశవ్యాప్త సర్వే
న్యూఢిల్లీ: ఇతర వెనుకబడిన వర్గాల(ఓబీసీలు) జనాభా అంచనా వేసేందుకు దేశవ్యాప్త సర్వే చేపట్టాలని జస్టిస్(రిటైర్డు)జి.రోహిణి కమిషన్ నిర్ణయించింది. నమ్మకమైన ఏజెన్సీ ద్వారా నిర్వహించే ఈ సర్వేకు రూ.200 కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ‘ఓబీసీల కేంద్ర జాబితాలో 2,600కు పైగా కులాలున్నాయి. వీరి జనాభా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఓబీసీ జన గణన చేపట్టలేదు. ఓబీసీ కులాల జనాభాపై కచ్చితమైన లెక్క తేలాలంటే జాతీయ స్థాయి సర్వే తప్పనిసరి. పది లక్షలకు పైగా కుటుంబాల్లో జరిపే ఈ సర్వే బాధ్యతలను ఒక ఏజెన్సీకి అప్పగించాలని యోచిస్తున్నాం. 2011 సామాజిక–ఆర్థిక జనగణనకు కేటాయించిన బడ్జెట్ను బట్టి ఓబీసీ సర్వేకు రూ.200 కోట్లు అవసరమవుతాయని అంచనా. ఈ మేరకు బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వానికి లేఖ రాశాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావంతో ఉన్నాం’ అని కమిషన్ తెలిపింది. ఓబీసీ రిజర్వేషన్లు అన్ని కులాల వారికి సమానంగా దక్కేందుకు అవసరమైన నిబంధనలు రూపొందించే ఉద్దేశంతో కేంద్రం 2017లో జస్టిస్(రిటైర్డు)జి.రోహిణి అధ్యక్షతన ఐదుగురు సభ్యుల కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర బీసీ కమిషన్ల, వివిధ కుల సంఘాలు, సంబంధిత వర్గాలతో చర్చలు జరిపింది. -
నెరవేరిన కరుణానిధి చిరకాల కోరిక
సాక్షి, చెన్నై : తమిళనాడు మధురైలోని ఓ ఆలయంలో బ్రాహ్మనేతర పూజారిని నియమించడం ద్వారా ఆలయ అధికారులు కులనిర్మూలన దిశగా ఒక ముందడుగేశారు. దీంతో తమిళ కురువృద్ధుడు, మాజీ సీఎం కరుణానిధి చిరకాల కోరిక నెరవేరినట్లయింది. ఆలయంలో బ్రాహ్మణేతర పూజారులను నియమించడం తమిళనాడులో ఇదే తొలిసారి. 1970లో కరుణానిధి సీఎంగా ఉన్నకాలంలో బీసీ (బ్రాహ్మనేతర) కులాల వారికి కూడా ఆలయ పూజారులుగా అవకాశం కల్పిస్తూ రాష్ట్రంలోని దేవాలయాలకు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆయన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనిపై 2006లో మరోసారి సమీక్ష నిర్వహించిన కరుణానిధి.. అర్చకులుగా శిక్షణ పొందేందుకు ఆరునెలల సర్టిఫికెట్ కోర్సులను ప్రవేశపెట్టారు. ఈ కోర్సు చేసిన అన్ని కులాల వారికి దేవాలయాల్లో పూజారులుగా అవకాశం కల్పించాలని భావించారు. డీఎంకే ప్రభుత్వ నిర్ణయాన్ని మరోసారి సుప్రీంకోర్టు తప్పపట్టింది. కోర్టు తీర్పుపై అప్పట్లో కరుణానిధి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని కులాలకు సామాజిక న్యాయం చేకురాలనే పెరియార్ రామస్వామి ఆశయం మేరకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల డిమాండ్ మేరకు 2015లో ఆలయంలో అర్చకుల నియామకాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణకు వదిలేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఆగమశాస్త్రం నిబంధనలకు విరుద్ధంగా ఈ నియామకాలు ఉండకూడదని సుప్రీం సూచించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆరు నెలలపాటు అర్చకత్వ కోర్సులో శిక్షణపొందిన వారిని దేవాదాయశాఖ పూజారులుగా నియమించింది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న కరుణానిధికి ఈ విషయం తెలిస్తే సంతోషిస్తారని డీఎంకే వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. -
జస్టిస్ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో జాతీయ ఓబిసీ ఫెడరేషన్ సమావేశం
-
బీసీల రాజ్యాధికారం కోసం సుదీర్ఘ పోరాటం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఓబీసీ ఫెడరేషన్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జాతీయ ప్రెసిడెంట్ జస్టిస్ వి.ఈశ్వరయ్య, టీడీపీ ఎంపీ దేవేందర్ గౌడ్, మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ, పొన్నాల లక్ష్మయ్య, టీడీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, మాజీ ఎంపీ వి.హనుమంత రావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీ బూరనర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. బీసీల రాజ్యాధికారం కోసం సుదీర్ఘ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత బీసీలపై ఉందన్నారు. లోక్ సభలో బీసీలపై బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. బీసీల కోసం కేంద్ర మంత్రులకు 2వేల లేఖలు రాశానని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం 11 సంవత్సరాలు పోరాటం చేశానని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు అన్నారు. బీసీల కోసం ప్రత్యేక పార్టీ అవసరం లేదు.. ప్రతి పార్టీలో బీసీ నేతలు ఉన్నారన్నారు. జ్యోతిరావు పూలే బీసీల కోసం గొప్ప పోరాటం చేశారని తెలిపారు. పూలే విగ్రహాలను అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసి, ఆయన భవనాలు కట్టించాలని కోరినా ఫలితం లేకుండా పోయిందన్నారు. బీసీ భవన్ కోసం ఏర్పాటు చేసిని స్థలాలను బీసీ నాయకులే కబ్జా చేశారని పేర్కొన్నారు. కొంతమంది నేతలు రాజ్యాధికారం మా రక్తంలోనే ఉంది అన్నట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓట్లు మాత్రమే బీసీలవి అధికారం మాత్రం ఎవరిదో అన్నట్లు ఉందన్నారు. కేసీఆర్ క్యాబినెట్లో ఎంత మంది బీసీలన్నారో చెప్పాలని ప్రశ్నించారు. టీటీడీపీ ప్రెసిడెంట్ ఎల్.రమణ మాట్లాడుతూ.. పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం కోసం పోరాటం చెయ్యాలని అన్నారు. బీసీల ఓట్లను ఇతర నేతలు ఎలా ఉపయోగించుకుంటున్నారో తెలుసుకొని వాటిని మన కోసం మన వైపు మళ్లించుకోవాలని రమణ పేర్కొన్నారు. బీసీ కులాలను ఒకేతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చెయ్యాలన్నారు.బీసీలకు అధికారం వచ్చేందుకు నా వంతు కృషిచేస్తానని రమణ అన్నారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఓబీసీల అధికారం కోసం కృషిచేస్తున్న ఈశ్వరయ్యకు అభినందనలు తెలిపారు. బీసీల సంఖ్య ఎక్కువ ఉన్నా.. ఐకమత్యం లేదని, ఓబీసీలను దేశంలో చిన్నచూపు చూస్తున్నారని పేర్కొన్నారు. ఓబీసీ బిల్లు బీజేపీ ఆధ్వర్యంలో లోక్సభలో ఆమోదం పొందినా రాజ్యసభలో మాత్రం పాస్ కాదని తెలిపారు. టీటీడీపీ ఎంపీ దేవేందర్ గౌడ్ మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాల నుంచి రిజర్వేషన్లు ఉన్నాయి.. కానీ రాను రాను ఒకరిపై ఒకరు అజమాయిషీ చలాయించడం జరుగుతుందని అన్నారు. ఓటు హక్కు అనే విషయంపై సుదీర్ఘమైన చర్చ జరిగిన తరువాతే ఓటు హక్కును కల్పించారని తెలిపారు. ఈ రోజుల్లో కొంత మంది రాజుల తరహాలో ప్రవర్తిస్తున్నారు.. కానీ గతంలో ప్రతి ఒక్కరు అధికారులే, నాయకులేనని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు రాజ్యాంగానికి లోబడే పని చెయ్యాలి.. కానీ ఎవ్వరూ రాజ్యాంగానికి లోబడి పనిచెయ్యడం లేదన్నారు. -
‘చట్టసభల్లో బీసీ ప్రతినిధుల సంఖ్య పెరగాలి’
సాక్షి, హైదరాబాద్ : చట్టసభల్లో బీసీ ప్రతినిధుల సంఖ్య పెరగాలని జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన జాతీయ ఓబీసీ ఫెడరేషన్ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో బండారు దత్తాత్రేయ, పొన్నాల లక్ష్మయ్య, ఎల్ రమణ, దేవేందర్ గౌడ్లతో పాటు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. చైతన్యం ద్వారానే మార్పు సాధ్యమని అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల్లో శాస్త్రీయత లేకుండా గత ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని విమర్శించారు. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు పెంచుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రభుత్వాలు ఆ దిశలో చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బీసీలంతా ఒకేతాటి పైకి రావాలని పిలుపునిచ్చారు. బీసీలకు రాజ్యాధికారం రావాలన్నారు. ఓటుకు నోటు ఇస్తున్నారు.. అయినా బీసీ సామాజిక వర్గానికే ఓటు వేయాలని కోరారు. పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒత్తిడి పనిచేస్తోంది.. ఒత్తిడితోనే మన హక్కులు సాధించుకోవాలన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా బీసీలు ఎదగాలని అకాంక్షించారు. -
‘చట్టసభల్లోకి వెళ్తెనే బీసీలకు న్యాయం’
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ అధికారంతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని హైకోర్టు రిటైర్డ్ జడ్జి, జాతీయ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. చట్టసభల్లోకి వెళితేనే సమన్యాయం జరుగుతుందని పేర్కొనారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన ఓబీసీ జాతీయ జాయింట్ కమిటీ సమావేశంలో 27 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. జస్టిస్ ఈశ్వరయ్యను జాతీయ ఓబీసీ యాక్షన్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం, సమానత్వం రావాలంటే పార్లమెంట్, అసెంబ్లీలో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, క్రిమీలేయర్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఓటర్ల గణన శాస్త్రీయంగా జరగలేదని, పంచాయతీ రాజ్ ఎన్నికలవరకల్లా సమగ్ర కుటుంబ సర్వేను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓబీసీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు యాక్షన్ కమిటీ కృషిచేస్తుందని పేర్కొన్నారు. యాక్షన్ కమిటీకి తోడుగా మండల స్థాయివరకూ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ, పార్లమెంట్, కోర్టుల్లో ప్రజాస్వామ్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటును అమ్ముకోకుండా, ప్రలోభాలకు లొంగకుండా బీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. -
భారతదేశంలో శ్రమకు గుర్తింపు ఏది?
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘బత్తాయి రసం అమ్ముకునే వ్యక్తి కోకాకోలా కంపెనీ స్థాపనకు కారకుడయ్యాడు. మెకానిక్లు నెలకొల్పిన ఫోర్డ్, మెర్సిడెస్, హోండా సంస్థలు ప్రపంచ దిగ్గజాలుగా ఎదిగాయి. దాబా నడుపుకొనే అతను మెక్డోనాల్డ్స్ ఫ్రాంచైజ్లు పెట్టగలిగేస్థాయికి ఎదిగాడు. మరి మన భారతదేశంలో? ఇక్కడి కమ్మరి, కుమ్మరి, చాకలి, చర్మకార, నాయీ.. లాంటి వందల కొద్దీ వృత్తులు నిర్వహించే శ్రమకు గుర్తింపు ఉందా? వాళ్లు గౌరవప్రదంగా బతకగలుగుతున్నారా? మూడు పూటలా పట్టెడన్నం తినగలుగుతున్నారా? నోరు తెరిస్తే మన దేశస్తులకు వృత్తినైపుణ్యం(స్కిల్స్) లేవని, వాటిని పెంపొందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అంటారు. కానీ అది పచ్చి అబద్ధం. మన వృత్తికారులు ఏ విదేశీయుడి కంటే తక్కువకాదు. కావాల్సిందల్లా వాళ్ల కోసం బ్యాంకుల తలుపులు తెరుచుకోవడమే! ఆ పని చేయగలిగింది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. బీజేపీలా ఏ 20 మంది బడాబాబులకో దేశాన్ని దోచిపెట్టబోము. బస్సు తాళాలు ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు, గిరిజనుల చేతుల్లో పెడతాం..’’ అని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. సోమవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఓబీసీ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. బానిస దేశంగా మార్చారు: ‘‘కష్టపడి పనిచేసేవాడు ఎప్పుడూ వెనుకే ఉండిపోతాడు. రైతులు, కూలీలు నెత్తురు ధారపోసి పనిచేస్తుంటే, లాభాలు మాత్రం వేరొకరు పొందుతున్నారు. స్కిల్స్ ఒకరివి.. షోకు ఇంకొకరిది అన్నట్లు తయారైంది పరిస్థితి. గడిచిన నాలుగేళ్లలో 15-20 మంది వ్యాపారవేత్తలకు మాత్రమే బ్యాంకుల నుంచి భారీగా డబ్బులు అందాయి. ప్రధాని కార్యాలయంలో పేదవాడి జాడ కూడ లేదు. ప్రజల్ని బెదిరించి, నోరుమూయించి, ఒకరిద్దరు మాత్రమే బస్సును నడిపిస్తున్నారు. దేశాన్ని ఆర్ఎస్ఎస్ బానిసగా మోదీ, అమిత్షాలు మార్చేశారు. ఓబీసీల మధ్య చిచ్చుపెట్టి, ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు, ఇతర కులాల్లోని పేదలంతా ఒక్కటికావాలి. ఆరు నెలలా, ఏడాదా అన్నది లెక్కకాదు. ఏ ముగ్గురో ఇష్టానుసారంగా భారత్ను నడిపించలేరని మనం నినదించాలి. దేశాన్ని ప్రజలు, యువకులే నడిపించాలి. ఆ క్రమంలో కాంగ్రెస్ అందరితో కలిసి పనిచేస్తుంది. ఎవరి హక్కులు వారికి దక్కేలా ప్రభుత్వాన్ని నడపగల ఏకైక పార్టీ కాంగ్రెసే అన్నది సత్యం’’ అని రాహుల్ చెప్పారు. -
జనరల్ కేటగిరీల కన్నా వేగంగా..
సాక్షి, హైదరాబాద్ : జనరల్ కేటగిరీ విద్యార్థుల కంటే వేగంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతులు, ఓబీసీ వర్గాలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు నేర్చుకుంటున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థుల నేర్చుకునే సామర్థ్యాన్ని వివిధ కొలమానాలకు అనుగుణంగా పరీక్షించినపుడు ఆసక్తి రేకెత్తించే ఈ అంశం వెల్లడైంది. అంతేకాకుండా ఎస్సీ విద్యార్థుల కంటే ఎస్టీ విద్యార్థులు త్వరగా నేర్చుకుంటున్నట్టు, ఓబీసీ విద్యార్థుల కంటే ఎస్సీ విద్యార్థులు మెరుగైన స్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికాకు చెందిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ దేశవ్యాప్తంగా విస్తతస్థాయిలో నిర్వహించిన ఓ సర్వేలో ఇది వెలుగులోకి వచ్చింది. ఈ విశ్వవిద్యాలయంతో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) గతేడాది కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఈ అధ్యయనం జరిగింది. రెండు భాగాలుగా పరిశీలన... 2017 అక్టోబర్, నవంబర్లలో విద్యా సంబంధిత అంశాలు, ఉన్నతస్థాయి ఆలోచన ధోరణిలపై రెండు భాగాలుగా దీనిని నిర్వహించారు. ఇందులో గణితం, భౌతికశాస్త్రం తదితరాల్లో పరీక్షలతో పాటు, సృజనాత్మకత, తార్కితతో కూడిన హేతుబద్ధత, శాస్త్రీయ ధోరణి వంటి అంశాలను పరిశీలించారు. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం నుంచి మూడో సంవత్సరం వరకు చదువుతున్న విద్యార్థుల్లో అణగారిన వర్గాలకు చెందిన వారు ఈ అంశాల్లో పరిణామాత్మక ప్రదర్శన కనబరిచారు. అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థుల్లో నేర్చుకోవాలనే తపనే వారిని తామున్న ఇబ్బందికర పరిస్థితులను అధిగమించేందుకు పురిగొల్పుతోందని ఏఐసీటీఈ చైర్మన్ అనిల్ సహస్రబుద్ధే పేర్కొన్నారు. ఉన్నతవర్గాల పిల్లలు చదువుకునే విద్యాసంస్థల్లో కాకుండా ఇతర కాలేజీల్లో ఇంజనీరింగ్ అభ్యసిస్తున్న వారిలోనూ ఈ వర్గాల వారు థర్డ్ ఇయర్కు ఇచ్చేప్పటికీ గణితం, భౌతికశాస్త్రం, పరిణామాత్మక అక్షరాస్యతలోనూ ఒకస్థాయికి చేరుకుంటున్నారని ఓ అధికారి వెల్లడించారు. దేశవ్యాప్తంగా 50 విద్యాసంస్థల్లో... దేశవ్యాప్తంగా ఒక క్రమపద్ధతి లేకుండా మొత్తం 50 సాంకేతిక విద్యా సంస్థలు వాటిలో ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ వంటి 8 ఉన్నతస్థాయి, ఈ కోవలోకి రాని 42 విద్యాసంస్థలను స్టాన్ఫోర్డ్ వర్సిటీ ఎంపిక చేసింది. అన్ని వర్గాలకు తగిన ప్రాతినిధ్యం ఉండేలా గతేడాది మొదటి ఏడాది, 2019లో మూడో ఏడాది కూడా ఇదే గ్రూపుల విద్యార్థులను పరీక్షిస్తారు. ఐఐటీ వంటి ఉన్నతస్థాయి సంస్థల్లోని స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్) కోర్సుల్లో అమ్మాయిల ప్రాతినిధ్యం తక్కువగా ఉన్నట్టుగా, మిగతా వాటిలో అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరిగినట్టుగా ఈ పరిశీలనలో గుర్తించారు. సంపూర్ణస్థాయిలో చూస్తే చైనా, రష్యాల కంటే వీరు వెనకబడినట్టు, అయితే ఈ దేశాల విద్యార్థుల కంటే భార త ఇంజనీరింగ్ విద్యార్థులు వేగంగా నేర్చుకున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. ఈ రెండుదేశాల్లోని ఇంజనీరింగ్ విద్యార్థులపై సైతం స్టాన్ఫోర్డ్ వర్సిటీ ఇదే విధమైన పరిశీలన నిర్వహించిన నేపథ్యంలో ఆయా అంశాలు వెల్లడయ్యాయి. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
భారీ కుంభకోణం: సీఎం అల్లుడు బుక్
సాక్షి, లక్నో: ప్రభుత్వ రంగ బ్యాంకులో మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది. ప్రభుత్వ రంగ బ్యాంకు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ)కు రుణాల ఎగవేతకు సంబంధించి సీబీఐ తాజాగా మరో కేసు నమోదు చేసింది. ప్రైవేట్ చక్కెర ఉత్పాదక సంస్థ శింబోలీ షుగర్స ఓబీసీకి రూ.109 కోట్ల మేర రుణాలు ఎగవేసిన కేసులో పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అల్లుడు, శింభోలీ షుగర్స్ డిప్యూటీ డైరెక్టర్ గురుపాల్ సింగ్ కీలక నిందితుడుగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన సంస్థ శింభోలీ షుగర్స్ రుణాల చెల్లింపులో విఫలంకావడంతో ఓబీసీ సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కేసులో పంజాబ్ సీఎం కుమార్తె జై ఇందర్ సింగ్ భర్త, కంపెనీ డిప్యూటీ డైరెక్టర్లలో ఒకరైన గురుపాల్ సింగ్, శింభోలీ సీఎండీ, సీఈవో, సీఎఫ్వో సహా,13మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మొత్తం ఎనిమిది కంపెనీల్లో గురుపాల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉన్నట్టు తెలుస్తోంది. 20111 లో చక్కెర రైతులు 5700మందికి సహాయం చేసే ఉద్దేశంతో ఆర్బీఐ పథకంకింద 150కోట్ల మేర రుణం మంజూరైంది. అయితే ఈ మొత్తం రైతులకు పంపణీ చేయకుండా అక్రమార్గాల్లో కంపెనీ అకౌంట్లో మళ్లించారనేది సీబీఐ ప్రధాన ఆరోపణ. అలాగే శింభోలీ సిబ్బందితోపాటు బ్యాంక్ అధికారులు కొందరిపై సైతం కేసు రిజిస్టర్ అయింది. ఈ వార్తలతో శింబోలి షుగర్స్షేరు 15 శాతం కుప్పకూలి నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, హపూర్, నోయిడాలలో కంపెనీల డైరెక్టర్ల నివాసాలు, ఫ్యాక్టరీ, కార్పోరేట్ ఆఫీస్, రిజిస్ట్రేషన్ ఆఫీసు సహా ఎనిమిది ప్రాంగణాలలో సోదాలు నిర్వహించామని సిబిఐ అధికార ప్రతినిధి అభిషేక్ దయాల్ వెల్లడించారు. నిందితులపై నేరపూరిత కుట్ర, మోసంఅవినీతి నిరోధక చట్టంకింత కేసు నమోదు చేశామన్నారు. సీబీఐ ఎఫ్ఐఆర్ ప్రకారం, 97.85 కోట్ల రూపాయల నగదును బ్యాంకు ప్రకటించగా, అసలు రుణం రూ.109.08 కోట్లకు చేరింది. మరోవైపు ఈ రుణాన్ని తీర్చేందుకు జనవరి 28, 2015 లో రూ.110కోట్ల మరో కార్పొరేట్ రుణాన్ని మంజూరు చేసిన బ్యాంకు మొత్తం రుణాన్ని రూ.113 కోట్లుగా తేల్చింది. అయితే 2016 నవంబరులో ఎన్పీఏగా ప్రకటించింది. కాగా 2017 నవంబరు 17న బ్యాంకు సిబిఐకి ఫిర్యాదు చేయగా, ఫిబ్రవరి 22, 2018 న మాత్రమే నమోదు చేయడం గమనార్హం. -
బ్యాంకును ముంచేసిన మరో డైమండ్ వ్యాపారి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మోసాలకు సంబంధించి మరిన్ని కేసులు వెలుగులో వస్తున్నాయి. ఢిల్లీకి చెందిన వజ్రాల వ్యాపారి బుట్టలో మరో ప్రభుత్వ రంగ బ్యాంకు పడటం పలు ప్రశ్నల్ని రేకెత్తిస్తోంది. ఇటీవల నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వేల కోట్ల కుంభకోణం తాలూకు ప్రకంపనల వేడి ఇంకా చల్లాకరముందే మరో డైమండ్ వ్యాపారిపై సీబీఐ శుక్రవారం కేసు నమోదు చేసింది. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) రూ. 389 కోట్ల మేర మనీ లాండరింగ్కు పాల్పడ్డాడన్న ఆరోపణలపై సంస్థపైనా, డైరెక్టర్లపైనా కేసు నమోదైంది. ఢిల్లీకి చెందిన వజ్రాల ఎగుమతిదారుడు ద్వారకా దాస్ సేథ్ కూడా నీరవ్ మోదీ, చోక్సీ మోడస్ ఒపరాండీని ఫాలో అయ్యాడు. అక్రమ లావాదేవీలతో భారీ ఎత్తున ప్రభుత్వ రంగ బ్యాంకు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కు కుచ్చుటోపీ పెట్టాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గమనించిన బ్యాంకు సీబీఐకు ఫిర్యాదు చేసింది. దీంతో ద్వారకా దాస్ సేథ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. డైమండ్ వ్యాపారి నిరవ్ మోడీ, మెహల్ చోక్సిల తరహాలోనే ఓబీసీలో 2007-2012 మధ్య కాలంలో ద్వారకా దాస్ రూ.389.85 కోట్లు మోసానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో సంస్థలోని మొత్తం డైరెక్టర్లు సభా సేథ్, రీటా సేథ్, కృష్ణ కుమార్ సింగ్, రవి సింగ్పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వీరితోపాటు ద్వారకా దాస్ సేథ్ సెజ్ ఇన్కార్పొరేషన్ అనే మరో సంస్థను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చింది. కంపెనీలెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ)ల ద్వారానే మోసానికి పాల్పడినట్టు బ్యాంకు ఆరోపించింది. ఈ సంస్థ కూడా ఉనికిలో లేని సంస్థలపేర్లతో వ్యాపార లావాదేవీలు చేసినట్టు చెప్పింది. కాగా బ్యాంకు ఆరు నెలల క్రితమే సీబీఐకి ఫిర్యాదు చేయడం గమనార్హం. -
మోదీపై నానా తీవ్ర విమర్శలు
సాక్షి, నాగ్పూర్ : సొంత పార్టీ బీజేపీపైనే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీకి, ఎంపీ పదవికి గుడ్ బై చెప్పిన నానా పటోలే ప్రధాని నరేంద్రమోదీపై విమర్శల దాడి ఎక్కుపెట్టారు. రాజకీయ లబ్ధిని పొందేందుకు ప్రధాని మోదీ ఓబీసీలను వాడుకుంటున్నారని ఆరోపించారు. ఓబీసీ కార్డులతో ఆయన ఎన్నికల ప్రచారానికి వెళుతూ వారిని కూడా సొంత మేలుకు ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. రైతులపట్ల బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిదర్శనంగానే తాను లోక్సభ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందని, ప్రధాని మోదీ ద్వంద్వ వైఖరి అనుసరించే మనస్తత్వం ఉన్న వ్యక్తి అని ఆరోపించారు. ప్రతిసారి ఓబీసీలను ఉపయోగించుకుంటున్న మోదీ వారికి చేస్తుంది మాత్రం ఏదీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ తాను ఒక నీచ జాతి నుంచి వచ్చినట్లు చెప్పుకున్నారు. దీంతోనే తనకు మోదీ ద్వంద్వ వైఖరిపట్ల ఆగ్రహం వేసి ఎంపీ పదవికి రాజీనామా చేశాను. మోదీ చేసిన వాగ్దానాలను అటు కేంద్ర ప్రభుత్వంగానీ, రాష్ట్ర ప్రభుత్వంగానీ నెరవేర్చలేదు' అని ఆయన విమర్శించారు. -
మళ్లీ లోక్సభకు ‘ఎన్సీబీసీ’ బిల్లు!
న్యూఢిల్లీ: ఇతర వెనకబడిన తరగతుల(ఓబీసీ) జాతీయ కమిషన్ బిల్లును ఈ శీతాకాల సమావేశాల్లో లోక్సభలో మరోసారి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. గత సమావేశాల్లోనే ఈ బిల్లు లోక్సభ ఆమోదం పొందింది. కానీ రాజ్యసభ మాత్రం కొన్ని సవరణలతో దీన్ని ఆమోదించడంతో.. ఈ బిల్లు మరోసారి లోక్సభ ముందుకు రావాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే.. ‘నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ (ఎన్సీబీసీ)’కు కూడా షెడ్యూల్డ్ కులాలు, తెగల జాతీయ కమిషన్ తరహాలో రాజ్యాంగబద్ధ హోదా లభిస్తుంది. ఓబీసీలు చాన్నాళ్లుగా కోరుతున్న ఈ రాజ్యాంగబద్ధ హోదా లభిస్తే.. దేశవ్యాప్తంగా వెనకబడిన వర్గాల మద్దతు బీజేపీకి లభించే అవకాశాలున్నాయని కాషాయ పార్టీ భావిస్తోంది. ఎన్సీబీసీ రాజ్యాంగబద్ధ సంస్థగా ఏర్పడితే.. దానికి ఓబీసీల హక్కులు, ప్రయోజనాలకు బలమైన రక్షణ కల్పించే అధికారం లభిస్తుంది. 1993లో ఎన్సీబీసీని పరిమిత అధికారాలతో చట్టబద్ధ సంస్థగా ఏర్పాటు చేశారు. ఏ కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలి, ఏ కులాన్ని జాబితా నుంచి తొలగించాలనే సూచనలిచ్చే అధికారం మాత్రమే ఆ సంస్థకు ఉండేది. ఓబీసీల ఫిర్యాదుల పరిష్కార బాధ్యత కూడా షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్కే ఉండేది. ఎన్సీబీసీ ఏర్పడితే ఓబీసీల ఫిర్యాదుల పరిష్కారం, హక్కులు, అధికారాల పరిరక్షణ.. మొదలైనవి ఆ సంస్థ పరిధిలోకి వస్తాయి. -
క్రీమీలేయర్లోకి పీఎస్యూ ఉద్యోగాలు
ప్రభుత్వ బ్యాంకులు, బీమా కంపెనీలు కూడా.. కేంద్ర కేబినెట్ నిర్ణయం న్యూఢిల్లీ: ఓబీసీల్లో సంపన్న వర్గమైన ‘క్రీమీలేయర్’ పరిధిని కేంద్రం విస్తరించింది. ప్రభుత్వ రంగ సంస్థలు(పీఎస్యూలు), ప్రభుత్వ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల్లో కొన్ని పోస్టులు దీని కిందికి వస్తాయని పేర్కొంది. దీంతో ఆయా స్థానాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు, కుటుంబీకులు ఓబీసీ కోటాలో రిజర్వేషన్కు దూరమవుతారు. ఇందుకు సంబంధించి కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఓబీసీల్లో సామాజికంగా అభివృద్ధి చెందిన వ్యక్తులు, వర్గాలను కూడా రిజర్వేషన్ పరిధి నుంచి తప్పించింది. తాజా నిర్ణయం ప్రకారం... పీఎస్యూల్లో అన్ని ఎగ్జిక్యూటివ్ పోస్టుల(బోర్డు, మేనేజ్మెంట్ స్థాయి కలుపుకుని)ను గ్రూప్ ఏ పోస్టులతో సమానంగా క్రీమీలేయర్గా భావిస్తారు. ప్రభుత్వ బ్యాంకులు, బీమా కంపెనీల్లో జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్–1 ఆపై స్థాయి ఉద్యోగులని గ్రూప్ ఏ ఉద్యోగులతో సమానంగా భావిస్తూ క్రీమీలేయర్ హోదా ఇస్తారు. ఇక క్లర్క్లు, ప్యూన్లకు సంబంధించి సమయానుగుణంగా వారి ఆదాయ వనరుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు‘క్రీమీలేయర్ పరిధి విస్తరణతో పీఎస్యూలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో దిగువ స్థాయుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు... ప్రభుత్వ విభాగాల్లో దిగువ స్థాయుల్లో పనిచేస్తున్న వారి పిల్లలతో సమానంగా ఓబీసీ రిజర్వేషన్ల ఫలాలు పొందుతారు’ అని కేబినెట్ భేటీ అనంతరం ప్రకటనలో కేంద్రం పేర్కొంది. ♦ ఎన్నికల నిర్వహణలో ఆరు దేశాలతో ఒప్పందాలు చేసుకోవాలన్న ఈసీ ప్రతిపాదనకు కేబినెట్ అంగీకారం. ఇందులో ఈక్వెడార్, ఆల్బేనియా, భూటాన్, అఫ్గానిస్తాన్, గినియా, మయన్మార్ దేశాలున్నాయి. ♦ పారిశ్రామిక అభివృద్ధి కోసం 40 మిలియన్ డాలర్లతో ఫండ్ ఏర్పా టుకు భారత్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన ఒప్పందానికి ఆమోదం. -
క్యూ4 లో ఓబీసీకి భారీ నష్టాలు
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది జనవరి-మార్చి త్రైమాసిక ఫలితాలను శుక్రవారం వెల్లడించింది. క్యూ4లో రూ.1,218 కోట్ల రూపాయలను ఆర్జించింది. విశ్లేషకుల అంచనాలతో పోల్చితే రూ. 77.4 కోట్లు నష్టం. క్యూ4లో రూ. 18 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 1,086.5 కోట్ల రూపాయల నికర లాభాలు ఆర్జించగా .. అంతకు ముందు త్రైమాసికంలో రూ.1,429.6 కోట్లుగా ఉంది. ఎసెట్ క్వాలిటీని మెరుగుపర్చకున్నప్పటికీ ప్రొవిజన్లు మాత్రం 3 శాతం జంప్ చేసి రూ.3,050కు పెరిగాయి. గత ఏడాది ఇవి రూ.1,086లుగాఉన్నాయి. ఇతర ఆదాయాలు, వడ్డీ కాని ఆదాయాలు 20 శాతం పెరిగి రూ .590.98 కోట్లు, ఆపరేటింగ్ లాభం 15.75 శాతం పెరిగి రూ .1017.13 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం, వడ్డీని సంపాదించిన వడ్డీ మరియు వ్యయం మధ్య వ్యత్యాసం, 2017 మార్చితో ముగిసిన త్రైమాసికంలో 3.4 శాతం పెరిగి 1,307.3 కోట్ల రూపాయలకు పడిపోయింది. అయితే నికర వడ్డీ మార్జిన్లు 2.14 శాతం నుంచి 2.54 శాతానికి పెరగడం విశేషం. నిరర్ధక ఆస్తులు 13.7 శాతం నుంచి 13.8 శాతాన్ని నమోదుచేశాయి. ఈ ఫలితాలో నేపథ్యంలో బిఎస్ఇలో 7శాతానికిపైగా కుప్పకూలింది. -
75వ యేట అడుగుపెట్టిన OBC సంస్థ
-
కోటిన్నర పాత నోట్లు కొట్టేశారు..
-
కోటిన్నర పాత నోట్లు కొట్టేశారు..
హరియాణా: ఒక వైపు పెద్ద నోట్ల రద్దుతో ఖాతాదారుల అవసరాలు తీర్చడానికి అష్టకష్టాలుపడుతున్న బ్యాంకులను మరో తలనొప్పి వేధిస్తోంది. సందట్లో సడేమియాలా దొంగలు తమ చోరకళను ప్రదర్శిస్తున్నారు. హరియాణాలో దొంగల ముఠా మరోసారి రెచ్చిపోయింది. హిసార్ జిల్లాలో ఖార్ ఖోడాలోని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లో చోరీకి పాల్పడ్డారు. ప్రజలు జమ చేసిన పాతనోట్లను సర్దుకు పోయారు. బుధవారం రాత్రి జరిగిన ఈఘటనలో దాదాపు రూ 1.22 కోట్లు పాతనోట్లను లూటీ చేశారు. గురువారం ఉదయం బ్యాంకు తెరిచిన తరువాత ఈవిషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, బ్యాంకు వెనకవైపు గోడకు కన్నం వేశారు. రద్దుచేసిన రూ .500, రూ.1,000 నోట్లను ఎత్తుకుపోయారు. అయితే వీటిలో కొత్త కరెన్సీ విలువ సుమారు రూ 30,000 ఉండొచ్చని చెప్పారు. మొఖాలకు ముసుగులు వేసుకొని, బ్యాంకు కన్నంవేసిన దొంగలు, అనంతరం సీసీటీవీలను ధ్వంసం చేశారని పోలీసు అధికారి రవీందర్ తెలిపారు. దీంతో సీసీటీవీ ఫుటేజ్ లో కేవలం నిందితుల చేతులు మాత్రమే కనిపిస్తున్నాయని చెప్పారు. దొంగతనం, క్రిమినల్ కుట్ర కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామన్నారు. కాగా ఇటీవల (నవంబర్ 19) పంజాబ్ నేషనల్ బ్యాంకు ను టార్గెట్ చేసినదొంగల ముఠా రూ.81.46 లక్షలను ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. -
ఏడాది చివరికల్లా ఓబీసీ సంపన్నశ్రేణిపై సమీక్ష
న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరికల్లా ఓబీసీ సంపన్నశ్రేణి (క్రిమిలేయర్) విధానాన్ని కేంద్రం సమీక్షిస్తుందని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రి థావర్చంద్ గెహ్లాట్ చెప్పారు. ఓబీసీల్లో కుటుంబాదాయం ఏడాదికి రూ.6 లక్షలకు మించి ఉన్నవారిని ప్రస్తుతం సంపన్నవర్గంగా పరిగణిస్తున్నారు. వీరికి విద్య, ఉద్యోగాల్లో ఓబీసీ రిజర్వేషన్లు వర్తించవు. ఈ ఏడాది చివరికల్లా నిర్వచనాన్ని మరోసారి సమీక్షిస్తామని మంత్రి తెలిపారు. ఈ సమీక్షలో ఆదాయ పరిమితిని రూ.8 లక్షలకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. -
ఓబీసీ నికర లాభం రూ. 22 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.22 కోట్ల నికర లాభం ప్రకటించింది. అంతక్రితం ఏడాది (2014-15) ఇదే కాలంలో రూ.178 కోట్ల నికర నష్టం వచ్చిందని ఓబీసీ ఎండీ, సీఈఓ అనిమేశ్ చౌహాన్ పేర్కొన్నారు. మొత్తం ఆదాయం రూ.5,719 కోట్ల నుంచి రూ.5,452 కోట్లకు తగ్గిపోయిందని పేర్కొన్నారు. వడ్దీ ఆదాయం రూ.5,091 కోట్ల నుంచి రూ.4,958 కోట్లకు పడిపోయిందని తెలిపారు. స్థూల మొండి బకాయిలు 5.18 శాతం నుంచి 9.57 శాతానికి, అలాగే నికర మొండి బకాయిలు 3.34 శాతం నుంచి 6.7 శాతానికి పెరిగాయని వివరించారు. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.1,107 కోట్ల నుంచి 1,026 కోట్లకు తగ్గాయని పేర్కొన్నారు. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్కు 70 పైసలు డివిడెండ్ను ఇవ్వనున్నామని తెలిపారు. ఇక 2015-16 పూర్తి ఏడాదిని పరిగణనలోకి తీసుకుంటే... బ్యాంక్ నికర లాభం 69 శాతం క్షీణించి రూ.497 కోట్ల నుంచి రూ.156 కోట్లకు పడిపోయింది. మొత్తం ఆదాయం రూ.22,083 కోట్ల నుంచి రూ.21,825 కోట్లకు పడిపోయినట్లు వివరించారు. -
జాట్లకు ట్విట్టర్లో మల్లిక సూచన
ముంబై: రిజర్వేషన్ల కోసం ఆందోళనలు చేస్తున్న జాట్లకు బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ ట్విట్టర్లో ఒక సూచన చేసింది. శాంతియుతంగా, అహింసాయుతంగా ముందుకుసాగాలని ఆమె జట్లకు విజ్ఞప్తి చేసింది. తమను ఓబీసీల్లో చేర్చి ప్రభుత్వ విద్య, ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ గత కొన్ని రోజులుగా జాట్లు హింసాత్మక ఆందోళనలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. 'మర్డర్' సినిమాతో సంచలనం సృష్టించిన మల్లికా షెరావత్ది హరియాణా హిస్సార్ లోని ఓ మారుమూల కుగ్రామం. బాలీవుడ్ హీరోయిన్ అయిన మల్లిక చివరిసారిగా 'డర్టీ పాలిటిక్స్' సినిమాలో కనిపించింది. జాట్ల ఆందోళనలతో హరియాణ అట్టుడుకుతున్న నేపథ్యంలో బాలీవుడ్, క్రికెట్ సెలబ్రిటీలు వారికి విన్నపాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు రణదీప్ హూడా, క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా శాంతియుతంగా ముందుకుసాగాలని జాట్లకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. -
డిపాజిట్ రేట్లను పావు శాతం తగ్గించిన ఓబీసీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) ఎంపిక చేసిన (91-179 రోజులు) మెచ్యూరిటీస్ల డిపాజిట్ రేట్లను 0.25 శాతం తగ్గించింది. దీంతో ఈ రేటు 7 శాతానికి దిగింది. అలాగే 270 రోజుల మెచ్యూరిటీ డిపాజిట్ల వడ్డీ రేట్లు కూడా గతంతో పోలిస్తే 0.25 శాతం తక్కువతో 7.5 శాతంగా ఉండనున్నాయి. బీఎస్ఈలో ఓబీసీ షేరు ధర 5 శాతం పెరిగి రూ.182 వద్ద ముగిసింది. -
ఐదు గంటలపాటు నగ్నంగా ఊరేగించారు
షాజహాన్పూర్ : ఉత్తరప్రదేశ్ తో కులం రక్కసి మరోసారి పడగవిప్పింది. షాజహాన్పూర్ జిల్లా హరేవా ప్రాంతంలో అయిదుగురు దళిత మహిళలను నగ్నంగా ఊరేగించారు. సభ్య సమాజం తలదించుకునేలా చేసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి... తమ అమ్మాయి దళిత యువకుడితో వెళ్లిపోవడంతో ఆగ్రహంతో రగిలిపోయిన వెనుకబడిన వర్గానికి చెందిన గ్రామస్తులు మంగళవారం ఉదయం దళిత మహిళలపై విరుచుకుపడ్డారు. బూతులు తిడుతూ వారిని ఇళ్లల్లోంచి బయటకు లాక్కొచ్చారు. చెప్పులతో కొట్టారు.. నడివీధికి తీసుకొచ్చి ఘోరంగా అవమానించారు. ఒంటిపై ఉన్న దుస్తులను లాగేసి విసిరిపారేశారు. ఆ తర్వాత ప్రధాన రహదారిపై ఊరేగించారు. దాదాపు అయిదు గంటలపాటు ఈ అమానుషకాండ కొనసాగింది. ఇంత జరుగుతున్నా ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు. కొందరు గ్రామస్తుల సమాచారంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆలస్యంగా మేల్కొన్న పోలీసులు గ్రామంలో మకాం వేశారు. పరిస్థితిని సమీక్షిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు అమ్మాయి తండ్రితో సహా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ విచారణకు ఆదేశించారు. మరోవైపు దీనిపై రాజకీయ పార్టీలు స్పందించాయి. బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహిరించిన పోలీసులు చర్యలు తీసుకోవాలంటున్నాయి. -
ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయండి
ప్రధాని మోదీకి ఓబీసీ ఎంపీల ఫోరం విజ్ఞప్తి న్యూఢిల్లీ: ఓబీసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఓబీసీ పార్లమెంటరీ ఫోరం ఆధ్వర్యంలో ఎంపీల ప్రతినిధి బృందం ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసింది. అలాగే జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించాలని విన్నవిం చింది. ఓబీసీ పార్లమెంటరీ ఫోరం కన్వీనర్ వి.హనుమంతరావు నేతృత్వంలో ఎంపీల ప్రతినిధి బృందం బుధవారం పార్లమెంటులో ప్రధానిని కలసి వినతి పత్రాన్ని అందజేశారు. దేశ జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న ఓబీసీల్లో 50 శాతం మంది పేదరికంలో ఉన్నారని వారి ఆర్థిక వికాసానికిక, ఓబీసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు. జాతీయ బీసీ కమిషన్ చట్టంలో సవరణలు తీసుకురావాలని, క్రీమీలేయర్ను ఎత్తివేసి ఓబీసీలను వర్గీకరించాలని కోరారు. మోదీని కలిసిన వారిలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీలు నాచి యప్పన్, దేవేందర్ గౌడ్, ఎంపీ బూర నర్స య్య గౌడ్, రాపోలు, కొనకళ్ల నారాయణ, కె.రామ్మోహన్నాయుడు, రాంకృపాల్ యాదవ్, రాంగోపాల్ యాదవ్ తదితరులున్నారు. -
ఓబీసీలకు మంత్రిత్వశాఖ అవసరం లేదు
కేంద్ర మంత్రి థావర్చంద్ గెహ్లాట్ సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితుల్లో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరమనిపించడం లేదని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత మంత్రి థావర్చంద్ గెహ్లాట్ వ్యాఖ్యానించారు. ఓబీసీల అభివృద్ధికి సంబంధించి సామాజిక న్యాయశాఖకు చెందిన బీసీ బ్యూరో అన్ని చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. జాతీయ బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించాలని, ఓబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కోరుతూ.. ఎంపీ వి.హనుమంతరావు గత నవంబర్లో ప్రధాని మోదీకి లేఖ రాశారు. దీనిపై బదులిస్తూ మంత్రి థావర్చంద్ గెహ్లాట్ రాసిన లేఖ శుక్రవారం అందినట్టు వీహెచ్ కార్యాలయవర్గాలు వెల్లడించాయి. జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగ అధికారాలు కల్పించడానికి సంబంధించిన ప్రతిపాదనలను మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని లేఖలో పేర్కొన్నట్లు తెలిపాయి. -
దేశ చరిత్రను మార్చే శక్తి బీసీలకు ఉంది
అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి హైదరాబాద్: ఓబీసీలందరూ సంఘటితమై సమస్యలు పరిష్కరించుకోవాలని తెలంగాణ శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి పిలుపునిచ్చారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం వార్షిక సర్వసభ్య సమావేశం ఆదివారమిక్కడి పద్మశాలి భవన్లో జరిగింది. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. బలమైన ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని, దీనికి ఓబీసీలు ముందుకు రావాలన్నారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ.. భారతదేశ చరిత్రను మార్చే శక్తి ఓబీసీలకు ఉందన్నారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన, ప్రజాస్వామ్యబద్ధమైన హక్కుల కోసం తెగించి పోరాడాలని సూచించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి, స్వామిగౌడ్, ఆర్.కృష్ణయ్యలను ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. -
ఐఐటీ కటాఫ్పై అయోమయం
జనరల్ విద్యార్థులకు 492, ఓబీసీకి 503 మార్కులు జేఈఈ అడ్వాన్స్డ్లో వింత విధానం మన విద్యార్థులు నష్టపోయే అవకాశం హైదరాబాద్ : ఎక్కడ ఏ భర్తీలు జరిగినా జనరల్ అభ్యర్థుల కంటే ఓబీసీకి కటాఫ్ మార్కులు తక్కువగా ఉంటుంది. అది సహజం. కానీ ఐఐటీల్లో ప్రవేశాలకు ఖరగ్పూర్ ఐఐటీ సోమవారం రాత్రి ఇంటర్మీడియెట్లో టాప్-20 పర్సంటైల్కు ప్రకటించిన కటాఫ్ మార్కులు తీవ్ర గందరగోళానికి కారణమవుతున్నాయి. జనరల్ విద్యార్థుల కన్నా ఓబీసీ విద్యార్థులకు కటాఫ్ మార్కులు ఎక్కువ నిర్ణయించడమే దీనికి కారణం. అంతేకాక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కటాఫ్ మార్కులపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాము విద్యార్థుల మార్కుల సీడీ మాత్రమే పంపించామని, అంతకుమించి తాము కటాఫ్ మార్కులకు సంబంధించిన అదనపు సమాచారం ఇవ్వలేదని ఇంటర్మీడియెట్ బోర్డు పేర్కొంటోంది. కటాఫ్పై అటు సీబీఎస్ఈ గానీ, ఐఐటీ ఖరగ్పూర్ గానీ ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. రెండు రాష్ట్రాల నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరైన విద్యార్థుల టాప్-20 పర్సంటైల్ కటాఫ్ విషయంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర మార్కులను లేదా ఇంటర్మీయట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర మార్కులను కలిపి చూపించుకోవచ్చని స్పష్టం చేసింది. దాని ప్రకారం పరీక్షకు హాజరైన తెలుగు విద్యార్థులకు కేవలం ద్వితీయ సంవత్సర మార్కుల మేరకు 530కి గాను టాప్-20 పర్సంటైల్కు కటాఫ్ను జనరల్ అభ్యర్థులకు 492గా ఓబీసీలకు 503, ఎస్సీలకు 464, ఎస్టీలకు 463, వికలాంగులకు 463గా ప్రకటించింది. ఇక రెండేళ్ల (ఇంటర్ ప్రథమ, ద్వితీయ కలిపి) మార్కులను తీసుకుంటే మొత్తం 1000 మార్కులకు జన రల్ అభ్యర్థులకు 920 మార్కులను కటాఫ్గా ప్రకటించింది. అదే ఓబీసీలకు 867 మార్కులు, ఎస్సీలకు 810, ఎస్టీలకు 807, వికలాంగులకు 807 మార్కులను కటాఫ్గా పేర్కొంది. రెండు సంవత్సరాల మార్కులను కలిపి చూస్తే బాగానే ఉన్నా... ద్వితీయ సంవత్సరం ఒక్కటే పరిగణలోకి తీసుకుంటే మాత్రం ఓబీసీ అభ్యర్థులు నష్టపోయే స్థితి ఉంది. ఈ పద్ధతిలో జనరల్ అభ్యర్థికంటే ఓబీసీ అభ్యర్థి కటాఫ్లో 11 మార్కులు ఎక్కువుంది. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. మొదటి దశ సీట్లు కేటాయింపు... ఇదిలాఉండగా, మొదటి దశ సీట్ల కేటాయింపులను మంగళవారం ఐఐటీ ఖరగ్పూర్ ప్రకటించింది. రెండో దశ సీట్ల కేటాయింపును జూలై 7న, మూడో దశ సీట్ల కేటాయింపును జూలై 12న ప్రకటించనుంది. అయితే సీట్ల కేటాయింపును ప్రకటించినా వెబ్సైట్లో వివరాలు ఓపెన్ కాకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం తరువాత ఛాయిస్ ఇచ్చేందుకు అవకాశం లభించింది. వారు జూలై 4 వరకు ఫీజు చెల్లించవచ్చు. తెలుగువిద్యార్థులకు నష్టం: మధుసూదన్రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి ఓబీసీ కటాఫ్ మార్కు ఎక్కువగా ఉండడంతో తెలుగు విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. తెలుగు వారు ఎక్కువగా ఐఐటీకి రాకుండా తగ్గించే కుట్ర చేశారు. సీబీఎస్ఈ కటాఫ్ను అన్ని రాష్ట్రాలకు ప్రామాణిక ంగా అమలు చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అపుడు ఎవరికి అన్యాయం జరగదు. ప్రతిభావంతులే ఐఐటీలకు వెళతారు. -
ఆంక్షలు లేని ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కావాలి
ఏలూరు సిటీ : రాష్ట్రంలో ఆంక్షలు లేని ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పూర్తిస్థాయిలో పేదవర్గాల విద్యార్థులందరికీ అందించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం చిట్టివలసపాకల ప్రాంతంలోని ఇఫ్టూ జిల్లా కార్యాలయంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలుపై ఆయా ప్రజా, విద్యార్థి, యువజన సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రవిచంద్ర మాట్లాడుతూ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో చదువుతున్న మన రాష్ట్ర విద్యార్థుల ఫీజులను ఏపీ ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. బీసీ, ఓబీసీ, మైనార్టీ, వికలాంగులైన విద్యార్థులకు ఆదాయ పరిమితిని రూ.2 లక్షలకు పెంచాలన్నారు. రూ.1200 కోట్ల ఫీజు బకాయిలను, తెలంగాణలో చదువుతున్న ఆంధ్ర విద్యార్థులకు సంబంధించిన బకాయిలు రూ.196 కోట్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.రామ్మోహన్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి.ప్రభాకర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పి.రవికుమార్, ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి బీఏ సాల్మన్రాజు తదితరులు పాల్గొన్నారు. -
నరేంద్ర మోడీ ఓ నకిలీ ఓబీసీ
న్యూఢిల్లీ: తుది విడత ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై కాంగ్రెస్ విమర్శల జోరు పెంచింది. ఎన్నికల ప్రచారంలో మోడీ ఉపయోగించుకుంటున్న ‘ఓబీసీ’, ‘చాయివాలా’ కార్డులను లక్ష్యంగా చేసుకుని గురువారం విమర్శలు గుప్పించింది. మోడీ నకిలీ ఓబీసీ అని, తాను గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తరువాతే తన ‘మోధ్ ఘాంచీ’ కులాన్ని ఇతర వెనకబడిన తరగతుల కులాల జాబితాలో చేర్చారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, గుజరాత్ మాజీ సీఎల్పీ నేత శక్తిసిన్హ్ గోహిల్ ఆరోపించారు. 2001 సెప్టెంబర్లో గుజరాత్ సీఎం అయిన మోడీ.. 2002 జనవరిలో మోధ్ ఘాంచీలను ఓబీసీల్లో చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. అందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వును కూడా ఆయన చూపించారు. నిజానికి మోధ్ ఘాంచీలు ఉన్నత కులానికి చెందిన సంపన్న వ్యాపార వర్గాలని, వారిని ఓబీసీల్లో చేర్చడం ద్వారా నిజమైన ఓబీసీలకు మోడీ అన్యాయం చేశారని గోహిల్ ఆరోపించారు. గతంలో ఏ కమిషన్ కూడా మోధ్ ఘాంచీలను ఓబీసీల్లో చేర్చడానికి సిఫారసు చేయలేదని, అలాగే మోధ్ ఘాంచీ కులస్తులు కూడా తమను ఓబీసీల్లో చేర్చమంటూ ఏనాడూ డిమాండ్ చేయలేదని ఆయన వివరించారు. -
జాతీయ ఉద్యమాలతోనే ఓబీసీ సంక్షేమం
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ఉద్యమాలతోనే ఓబీసీల సంక్షేమం, సమగ్రాభివృద్ధి జరుగుతుందని అఖిల భారత బ్యాంక్ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ కస్తూరి జయప్రసాద్ పేర్కొన్నా రు. ఏపీభవన్లోని గురజాడ సమావేశమంది రం లో నిర్వహించిన సమావేశంలో భాగంగా సంఘం జాతీయ కార్యకవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యుల వివరాలను జాతీయ బీసీ కమిషన్చైర్మన్ జస్టిస్ వి ఈశ్వరయ్య,సభ్యులు ఎస్కే కార్వెంతన్ వెల్లడించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. పూలే కలలుగన్న సమన్యాయం కోసం ఓబీసీలు ఉద్యమించాలన్నారు. ఓబీసీ కార్యవర్గాలు సైతం రాజ్యాధికారం కోసం కృషిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో అఖిలభారత బ్యాంక్ ఉద్యోగుల(ఓబీసీ) సంక్షే మ సంఘం ప్రధానకార్యదర్శి పి.మురళి పాల్గొన్నారు. -
ఎస్బీఐ పండుగ ధమాకా
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొన్ని రుణాలపై వడ్డీరేట్లను తగ్గించింది. కారు, వినియోగ వస్తువులపై వడ్డీరేట్లను తగ్గించడంతోపాటు, ప్రాసెసింగ్ ఫీజులను సైతం తగ్గించాలని నిర్ణయించింది. పండుగ సీజన్లో రుణ డిమాండ్ను ఆకర్షించడంలో భాగంగా బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఐఓబీ, దేనా బ్యాంకులు కూడా ఇదే బాటలో నడిచాయి. ఇప్పటికే పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ), ఐడీబీఐ బ్యాంక్లు ఆటోమొబైల్స్సహా టెలివిజన్లు, ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్ల వంటి వినియోగ వస్తువులపై ప్రత్యేక వడ్డీరేట్లను ఆఫర్ చేశాయి. తాజా నిర్ణయంతో ఎస్బీఐ కూడా ఈ జాబితాలో చేరింది. తగ్గింపు ఇలా...: బ్యాంకింగ్ దిగ్గజం రేట్ల తగ్గింపు విషయానికి వస్తే- కారు రుణాలపై వడ్డీరేటు 0.20 శాతం తగ్గింది. 10.55 శాతానికి చేరింది. ప్రాసెసింగ్ ఫీజు రుణ మొత్తంలో 0.51 శాతం తగ్గించింది. అంటే కనీస ప్రాసెసింగ్ ఫీజు రూ.1,020 నుంచి రూ.500 ఫ్లాట్ రేట్కు తగ్గుతుంది. వేతన జీవులకు ప్రత్యేకం తన బ్యాంకులో వేతన అకౌంట్లు ఉన్న ఖాతాదారులకు సంబంధించి వినియోగ వస్తువులు, కారు, ద్విచక్ర వాహనాల కొనుగోళ్ల విషయంలో కూడా ప్రత్యేక పండుగల రుణ పథకాలను బ్యాంక్ ఆవిష్కరించింది. ఈ ఆఫర్ కింద పలు డిస్కౌంట్లు లభించనున్నాయి. 12.05 శాతం నుంచి వడ్డీరేట్లపై రుణ లభ్యత అందుబాటులో ఉంటుంది. ఇందుకు సంబంధించి ‘ఉత్సవ్ కీ ఉమంగ్ ఎస్బీఐ కీ సంగ్’ ఆఫర్ అక్టోబర్ 7 నుంచి 31 జనవరి 2014 వరకూ అందుబాటులో ఉంటుంది. నేపథ్యం ఇదీ...: కొన్ని రంగాలలో డిమాండ్ పెంపు లక్ష్యంగా కొంత తక్కువ రేటుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు రుణాలను మంజూరు చేయాలని, ఇందుకు తగిన పెట్టుబడులను ప్రభుత్వం బ్యాంకులకు పంప్ చేయాలని కేంద్రం గతవారం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే పలు బ్యాంకులు ఈ దిశలో అడుగులు వేస్తున్నాయి. ఆర్థిక మంత్రి పీ చిదంబరం, ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అరవింద్ మాయారాం మధ్య ఇటీవల జరిగిన సమావేశం ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకుంది. ‘బడ్జెట్లో పేర్కొన్న రూ.14,000 కోట్ల కన్నా ఎక్కువగా, బ్యాంకులకు కావాల్సినంత మూలధన నిధులు సమకూర్చాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. ఈ చర్య మందగమనాన్ని ఎదుర్కొనేందుకు, ఉత్పత్తిని పెంచేందుకు కూడా దోహదపడగల దని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవలి పారిశ్రామికోత్పత్తి గణాంకాల ప్రకారం కన్సూమర్ డ్యూరబుల్స్ రంగం గతేడాది జూలైతో పోలిస్తే ఈసారి జూలైలో 9.3 శాతం మేర క్షీణించింది. గతేడాది ఏప్రిల్-జూలై మధ్యకాలంలో 6.1 శాతం వృద్ధి ఉండగా.. ఈసారి అదే వ్యవధిలో ఏకంగా 12 శాతం క్షీణించింది. కార్ల కొనుగోళ్లు సైతం గణనీయంగా పడిపోయాయి. కాగా ఈ ప్రణాళికలను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి వ్యతిరేకిస్తున్నారు. ఇవి బ్యాంకుల అసెట్ క్వాలిటీపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని ఆయన ఇప్పటికే వ్యక్తం చేశారు. ఐవోబీ కూడా... వినియోగ వస్తువులపై రుణ రేట్లను ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) కూడా 2% వరకూ తగ్గించింది. దీనితో ఈ రేటు 13.25%కి తగ్గింది. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. వేతన జీవులు వినిమయ వస్తువుల కొనుగోళ్లకు సంబంధించి ఒక కొత్త వ్యక్తిగత రుణ పథకాన్ని కూడా ఆవిష్కరించినట్లు బ్యాంక్ తెలిపింది. దేనాబ్యాంక్ కాంబో లోన్ ప్లాన్... దేనాబ్యాంక్ కూడా కొన్ని విభాగాలకు సంబంధించి వడ్డీరేట్లను తగ్గించింది. కోటి రూపాయల వరకూ గృహ రుణాలపై వడ్డీరేట్లను బేస్రేట్ 10.25%గా నిర్ణయించినట్లు తెలిపింది. ఆపైన ఈ రేటు 10.50%గా ఉంటుంది. హౌసింగ్ లోను తీసుకున్న వారికి కాంబో ప్లాన్గా కార్, కన్జూమర్ డ్యూరబుల్స్ రుణాన్ని కూడా అందచేస్తామని పేర్కొంది. కాంబోప్లాన్లోని కార్ రుణానికి బేస్ రేట్ వర్తిస్తుంది. వినియోగ వస్తువులపై రుణ రేటు 11.75%గా ఉంది. కాగా కాంబో ఆఫర్తో సంబంధం లేకుండా కార్రుణంపై రేటును 1% తగ్గించింది. దీనితో ఈ రేటు 11%కి చేరింది. -
రుణాలపై వడ్డీ రేట్ల ఊరట..
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ), ఐడీబీఐలు వినియోగ వస్తువులు, వాహన రుణాలపై వడ్డీరేట్లను 2.50% దాకా తగ్గించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరిన్ని రుణాలిస్తామన్న ప్రభుత్వ హామీతో ఈ బ్యాంకులు వడ్డీరేట్లలో కోత విధించాయని, త్వరలో ఎస్బీఐ కూడా ఇదే బాట పట్టనున్నదని నిపుణులంటున్నారు. పండుగ సీజన్లో రుణాలిచ్చి కొనుగోళ్ల ద్వారా ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు అందించడానికి ప్రభుత్వం ఈ నిధులను అందిస్తోంది. 100% పీఎన్బీ రుణం : కారు కొనుగోళ్లకు 10.65% వడ్డీరేట్లకే రుణాలందిస్తామని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) పేర్కొంది. టూ-వీలర్ల రుణాలపై వడ్డీరేట్లను 12.25%కి, వ్యక్తిగత రుణాలపై వడ్డీరేట్లను 12.75 శాతానికి తగ్గించామని వివరించింది. మొత్తం మీద వడ్డీరేట్లను 1-2.50% మేర తగ్గించామని పేర్కొంది. కారు రుణాలపై ఎలాంటి డాక్యుమెంటేషన్ చార్జీలు వసూలు చేయబోమని, ఎక్స్షోరూమ్ ధరపై 100% రుణమందిస్తామని పేర్కొంది. ఈ ఆఫర్లు వచ్చే ఏడాది జనవరి 31 వరకూ అందుబాటులో ఉంటాయని పీఎన్బీ పేర్కొంది. అయితే గృహ రుణాల రేట్లలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. ఓబీసీ కూడా: వినియోగ వస్తువులు, వ్యక్తిగత, వాణిజ్య వాహన రుణాలపై వడ్డీరేట్లను 0.25 శాతం తగ్గిస్తున్నామని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) మంగళవారం తెలిపింది. ఈ వడ్డీరేట్ల తగ్గింపు రేపటి(గురువారం) నుంచి అమల్లోకి వస్తుందని వివరించింది. ఫోర్ వీలర్ల కొనుగోళ్లకు ఇచ్చే రుణాలపై వడ్డీరేట్లను 12.25% నుంచి 12 శాతానికి తగ్గిస్తున్నామని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే వ్యక్తిగత, వినియోగ వస్తువుల రుణాలపై వడ్డీరేట్లను 12.75% నుంచి 12.50 శాతానికి తగ్గించామని వివరించింది. కార్లు, టూ-వీలర్ల రుణాలకు సంబంధించి మూడేళ్లలో చెల్లించే రుణాలపై 10.75%, మూడేళ్లకు మించిన రుణాలపై 11% వడ్డీ రేట్లకే రుణాలను ఆఫర్ చేస్తున్నామని పేర్కొంది. బేస్రేట్కే ఐడీబీఐ రుణం కొత్తగా గృహ, వాహన రుణాలు తీసుకునే వారికి బేస్ రేట్కే(10.25 శాతం) రుణాలందిస్తామని ఐడీబీఐ పేర్కొంది. ఇది నేటి నుంచే వర్తిస్తుందని వివరించింది. ఈ రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేయబోమని వివరించింది. గృహ రుణాల రేట్లు అంతే..: ఎస్బీఐ కారు, కన్జూమర్ గూడ్స్ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది కానీ గృహ రుణాలపై మాత్రం తగ్గించే అవకాశాలే లేవని ఎస్బీఐ ఎండీ(ఇంచార్జ్) ఎ. కృష్ణకుమార్ స్పష్టం చేశారు. గృహ రుణాల వడ్డీ రేట్లు ఇప్పటికే చాలా కనిష్ట స్థాయిలోనే ఉన్నాయని ఆయన చెప్పారు. రిటైల్ రుణాల వడ్డీ రే ట్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి కొన్ని సూచనలు వచ్చాయని, రాబోయే నెలల్లో వీటి అమలుపై దృష్టి సారిస్తామన్నారు. ఇప్పటికే ఉన్న ఉత్పత్తులపైనే వడ్డీ రేట్ల తగ్గింపు ఉండగలదే తప్ప కొత్త వాటిని జాబితాలో చేర్చే యోచనేమీ లేదని కృష్ణకుమార్ చెప్పారు.