Papua New Guinea
-
ఫెర్గూసన్ అద్భుతం.. పీఎన్జీపై న్యూజిలాండ్ అద్బుత విజయం
న్యూజిలాండ్ టి20 ప్రపంచకప్ నుంచి ఇదివరకే నిష్క్రమించింది. అయితే గ్రూప్ ‘సి’లో తమ ఆఖరి పోరులో విజయంతో పాటు పేస్ బౌలర్ ఫెర్గూసన్ (4–4–0–3) పుటలకెక్కిన రికార్డు గణాంకాలతో కివీస్ శిబిరం సంతృప్తి చెందింది. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో పపువా న్యూగినీపై నెగ్గింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన పపువా న్యూగినీ జట్టు 19.4 ఓవర్లలో 78 పరుగులకే ఆలౌటైంది. చార్లెస్ అమిని (17; 2 ఫోర్లు), నొర్మాన్ వనువా (14; 1 ఫోర్, 1 సిక్స్), సెసె బవు (12; 1 ఫోర్) రెండంకెల స్కోర్లు చేశారు. పరుగివ్వకుండా అన్ని మెయిడిన్లే వేసిన ఫెర్గూసన్ 3 వికెట్లు తీశాడు. తద్వారా కెనడా బౌలర్ సాద్ బిన్ జఫర్ 2021లో పనామాపై వేసిన 4–4–0–2 రికార్డు స్పెల్ తుడిచిపెట్టుకుపోయింది. అనంతరం సులువైన లక్ష్యాన్ని న్యూజిలాండ్ 12.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసి గెలిచింది. కాన్వే (35; 2 ఫోర్లు, 3 సిక్స్లు), కెపె్టన్ విలియమ్సన్ (18 నాటౌట్; 2 ఫోర్లు), మిచెల్ (12 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు) రాణించారు. -
NZ Vs PNG: న్యూజిలాండ్, పీఎన్జీ మ్యాచ్.. తుది జట్లు ఇవే..!
టీ20 వరల్డ్కప్ 2024 గ్రూప్-సిలో భాగంగా ఇవాళ (జూన్ 17) న్యూజిలాండ్, పపువా న్యూ గినియా జట్లు తలపడనున్నాయి. ట్రినిడాడ్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం పలు మార్లు అంతరాయం కలిగించడంతో టాస్ ఆలస్యంగా పడింది. టాస్ అనంతరం మరోసారి వర్షం మొదలుకావడంతో మ్యాచ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండింది. న్యూజిలాండ్, పపువా న్యూ గినియా సూపర్-8 రేసు నుంచి నిష్క్రమించడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది. న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్కు ఇది టీ20 వరల్డ్కప్లో చివరి మ్యాచ్.తుది జట్లు..న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(వికెట్కీపర్), రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీ, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్పపువా న్యూ గినియా: టోనీ ఉరా, అసద్ వలా(కెప్టెన్), చార్లెస్ అమిని, సెసే బావు, హిరి హిరి, చాడ్ సోపర్, కిప్లిన్ డోరిగా(వికెట్కీపర్), నార్మన్ వనువా, అలీ నావో, కబువా మోరియా, సెమో కమియా -
టీ20 వరల్డ్కప్లో నేడు (జూన్ 17) మరో ఆసక్తికర సమరం
పొట్టి ప్రపంచకప్ 2024లో ఇవాళ (జూన్ 17) మరో ఆసక్తికర మ్యాచ్ జరుగనుంది. సూపర్-8 బెర్త్లు ఖరారు కావడంతో నామమాత్రంగా సాగనున్న ఈ మ్యాచ్లో వెస్టిండీస్-ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఢీకొట్టనున్నాయి. గ్రూప్-సిలో భాగంగా జరుగనున్న ఈ మ్యాచ్ సెయింట్ లూసియా వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రేపు ఉదయం 6 గంటలకు మొదలుకానుంది. గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ జట్లు ఇదివరకే సూపర్-8కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.గ్రూప్-సిలో భాగంగా ఇవాళే మరో మ్యాచ్ కూడా జరుగనుంది. ట్రినిడాడ్ వేదికగా పపువా న్యూ గినియా.. న్యూజిలాండ్ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. న్యూజిలాండ్, పపువా న్యూ గినియా సూపర్-8కు అర్హత సాధించకపోవడంతో ఈ మ్యాచ్ కూడా నామమాత్రంగా సాగనుంది.కాగా, ఇవాల్టి మ్యాచ్లతో సంబంధం లేకుండానే సూపర్-8 బెర్త్లు ఖరారయ్యాయి. సూపర్-8 గ్రూప్-1లో గ్రూప్-ఏ నుంచి భారత్ (A1).. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా (B1).. గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ (C1).. గ్రూప్-డి నుంచి బంగ్లాదేశ్ (D2) జట్లు ఉన్నాయి.సూపర్-8లో గ్రూప్-1 మ్యాచ్లు..జూన్ 20- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా (బార్బడోస్)జూన్ 20- ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)జూన్ 22- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)జూన్ 22- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (సెయింట్ విన్సెంట్)జూన్ 24- ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా (సెయింట్ లూసియా)జూన్ 24- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ (సెయింట్ విన్సెంట్)సూపర్-8 గ్రూప్ 2లో గ్రూప్-ఏ నుంచి యూఎస్ఏ (A2).. గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ (B2).. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్ (C2).. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా (D1) జట్లు ఉన్నాయి. సూపర్-8లో గ్రూప్-2 మ్యాచ్లు..జూన్ 19- యూఎస్ఏ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)జూన్ 19- ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ (సెయింట్ లూసియా)జూన్ 21- ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా (సెయింట్ లూసియా)జూన్ 21- యూఎస్ఏ వర్సెస్ వెస్టిండీస్ (బార్బడోస్)జూన్ 23- యూఎస్ఏ వర్సెస్ ఇంగ్లండ్ (బార్బడోస్)జూన్ 23- వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)గ్రూప్-1, గ్రూప్-2ల్లో అన్ని మ్యాచ్లు ముగిశాక మొదటి రెండు స్థానాల్లో ఉండే జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి. -
T20 WC: అదరగొట్టిన ఆఫ్గనిస్తాన్.. న్యూజిలాండ్ ఎలిమినేట్
వన్డే ప్రపంచకప్-2023లో అంచనాలకు మించి రాణించిన అఫ్గనిస్తాన్ టీ20 వరల్డ్కప్-2024లోనూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. పపువా న్యుగినియాతో మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది సూపర్-8కు అర్హత సాధించింది. ఇక ఈ మ్యాచ్ ఫలితంతో న్యూజిలాండ్ ఈ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్ తొమ్మిదో ఎడిషన్లో అఫ్గన్ జట్టు వెస్టిండీస్, ఉగాండా, పపువా న్యూగినియా, న్యూజిలాండ్తో కలిసి గ్రూప్-సిలో ఉంది. View this post on Instagram A post shared by ICC (@icc) ఇక ఆరంభం నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు సాగిన రషీద్ ఖాన్ బృందం.. గ్రూప్ దశలో మూడింట మూడు మ్యాచ్లు గెలిచింది. తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్లో మూడో గెలుపు నమోదు చేసి ఆరు పాయింట్ల(నెట్ రన్రేటు +4.230)తో గ్రూప్-సి టాపర్గా నిలిచింది. ట్రినిడాడ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఫజల్హక్ ఫరూకీ(3/16), నవీన్ ఉల్ హక్(2/4), నూర్ అహ్మద్(1/14) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు కూడా తీసి సత్తా చాటారు. తేలికగా తలవంచని ప్రత్యర్థిఈ క్రమంలో 19.5 ఓవర్లలో 95 పరుగులు చేసిన పీఎన్జీ జట్టు ఆలౌట్ అయింది. అయితే, లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గనిస్తాన్ ముందు అంత తేలికగా తలవంచలేదు. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ డకౌట్ కాగా.. మరో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ 11 పరుగులకే వెనుదిరిగాడు. ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ గులాబిదిన్ నయీబ్(36 బంతుల్లో 49 నాటౌట్) అద్భుతంగా రాణించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మిగతా వాళ్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 13, మహ్మద్ నబీ(23 బంతుల్లో 16 నాటౌట్) ఆచితూచి ఆడారు. View this post on Instagram A post shared by ICC (@icc)ఫలితంగా 15.1 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 101 పరుగులు చేసిన అఫ్గన్ జయభేరి మోగించింది. తద్వారా సూపర్-8 దశకు అర్హత కూడా సాధించింది. ఇక ఇప్పటికే వెస్టిండీస్ గ్రూప్-సి నుంచి సూపర్-8లో అడుగుపెట్టగా.. న్యూజిలాండ్ ఎలిమినేట్ అయింది.చదవండి: T20 World Cup 2024: వరల్డ్కప్ టోర్నీ నుంచి అవుట్.. శ్రీలంకకు ఏమైంది? -
T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన ఉగాండ బౌలర్
43 ఏళ్ల ఉగాండ బౌలర్ ఫ్రాంక్ న్సుబుగా చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అతి తక్కువ ఎనాకమీతో (1.00) పరుగులు సమర్పించుకున్న బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా పపువా న్యూ గినియాతో ఇవాళ (జూన్ 6) జరిగిన మ్యాచ్లో ఫ్రాంక్.. 4 ఓవర్ల స్పెల్లో 4 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అతని స్పెల్లో ఏకంగా 2 మెయిడిన్ ఓవర్లు ఉండటం మరో విశేషం.టీ20 వరల్డ్కప్ టోర్నీల చరిత్రలో అతి తక్కువ ఎకానమీతో 4 ఓవర్ల స్పెల్ పూర్తి చేసిన బౌలర్ల వివరాలు..ఫ్రాంక్ న్సుబుగా (ఉగాండ)- 1.00అన్రిచ్ నోర్జే (సౌతాఫ్రికా)- 1.75అజంత మెండిస్ (శ్రీలంక)- 2.00మహ్మదుల్లా (బంగ్లాదేశ్)- 2.00హసరంగ (శ్రీలంక)- 2.00కాగా, గయానా వేదికగా పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్లో ఉగాండ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఉగాండ.. పీఎన్జీని 77 పరుగులకే (19.1 ఓవర్లలో) కుప్పకూల్చింది. ఉగాండ బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేసి పీఎన్జీ బ్యాటింగ్ లైనప్ను మడత పెట్టారు.ఫ్రాంక్ న్సుబుగా (4-2-4-2), అల్పేశ్ రాంజానీ (4-1-17-2), జుమా మియాగి (4-0-10-2), కోస్మాస్ క్యేవుటా (3.1-0-17-2), కెప్టెన్ మసాబా (4-0-17-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. పీఎన్జీ ఇన్నింగ్స్లో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. వీరిలో హిరి హిరి (15) టాప్ స్కోరర్గా నిలిచాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఉగాండ 26 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమిపాలయ్యేలా కనిపించింది. అయితే రియాజత్ అలీ షా (33), జుమా మియాగి (13) బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి ఉగాండను గెలిపించారు. వీరిద్దరు ఓ మోస్తరుగా రాణించడంతో ఉగాండ 18.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. పీఎన్జీ బౌలర్లలో అలెయ్ నావ్ (4-0-16-2), నార్మన్ వనువా (4-0-19-2), చాడ్ సోపర్ (4-0-13-1), అస్సద్ వలా (2-0-10-1) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టారు. -
T20 World Cup 2024: చిరస్మరణీయం.. తొలి విజయం సాధించిన పసికూన
క్రికెట్ పసికూన, ఆఫ్రికా దేశం ఉగాండ ప్రపంచకప్ టోర్నీల్లో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్లో ఉగాండ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉగాండ ఆటగాళ్లు, అభిమానులు తమ తొలి విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అభిమానుల కేరింతలు, డ్యాన్స్లతో గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియం హోరెత్తిపోయింది. మ్యాచ్ అనంతరం ఉగాండ ఆటగాళ్ల సంబురాలు అంబరాన్ని అంటాయి.Uganda players & fans are dancing & celebrating the victory in Guyana. ❤️- This is the victory of T20I World Cup. pic.twitter.com/vH8uzs4cyf— Johns. (@CricCrazyJohns) June 6, 2024వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఉగాండ.. పీఎన్జీని 77 పరుగులకే (19.1 ఓవర్లలో) కుప్పకూల్చింది. ఉగాండ బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేసి పీఎన్జీ బ్యాటింగ్ లైనప్ను మడత పెట్టారు. THE VICTORY DANCE BY UGANDA. 🇺🇬- Video of the day! (ICC). pic.twitter.com/l9fiVPN79J— Mufaddal Vohra (@mufaddal_vohra) June 6, 202443 ఏళ్ల స్పిన్నర్ ఫ్రాంక్ న్సుబుగా పీఎన్జీ పాలిట సింహ స్వప్నమయ్యాడు. ఫ్రాంక్ 4 ఓవర్లలో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఫ్రాంక్ స్పెల్లో 2 మెయిడిన్ ఓవర్లు ఉండటం విశేషం. ఫ్రాంక్తో పాటు అల్పేశ్ (4-1-17-2), జుమా మియాగి (4-0-10-2), కోస్మాస్ క్యేవుటా (3.1-0-17-2), కెప్టెన్ మసాబా (4-0-17-1) కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. పీఎన్జీ ఇన్నింగ్స్లో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. వీరిలో హిరి హిరి (15) టాప్ స్కోరర్గా నిలిచాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఉగాండ 26 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి దారుణ పరాజయాన్ని మూటగట్టుకునేలా కనిపించింది. అయితే రియాజత్ అలీ షా (33), జుమా మియాగి (13) బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి ఉగాండను గెలిపించారు. వీరిద్దరు ఓ మోస్తరుగా రాణించడంతో ఉగాండ 18.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. రియాజత్, మియాగి మినహా ఉగాండ ఇన్నింగ్స్లో ఎవరూ రెండంకెల స్కోర్ చేయలేదు. పీఎన్జీ బౌలర్లలో అలెయ్ నావ్ (4-0-16-2), నార్మన్ వనువా (4-0-19-2), చాడ్ సోపర్ (4-0-13-1), అస్సద్ వలా (2-0-10-1) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీసి ఉగాండను ఇబ్బంది పెట్టారు. -
వెస్టిండీస్ను భయపెట్టిన పసికూన.. చెమటోడ్చి నెగ్గిన కరేబియన్లు
గయానా: టి20 ప్రపంచకప్కు ఆతిథ్యమిస్తున్న రెండో దేశం వెస్టిండీస్ కూడా టోర్నిలో శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్లో రెండుసార్లు చాంపియన్ విండీస్ ఓటమి అంచుల్లోంచి బయటపడి 5 వికెట్ల తేడాతో పపువా న్యూగినీ జట్టుపై గెలిచి ఊపిరి పీల్చుకుంది. ముందుగా బ్యాటింగ్కు దిగిన పపువా న్యూగినీ నిరీ్ణత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. టాపార్డర్ బ్యాటర్లు టోని వుర (2), అసద్ వాలా (21), లెగా సియాక (1) నిరాశ పరచడంతో 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ దశలో సెసె బావు (43 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. చార్లెస్ అమిని (12)తో ఐదో వికెట్కు 44 పరుగులు జోడించాడు. జట్టు స్కోరు 98 వద్ద ఆరో వికెట్గా సెసె బావు నిష్క్రమించగా, కిప్లిన్ డొరిగా (18 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడటంతో పపువా ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. విండీస్ బౌలర్లలో రసెల్, జోసెఫ్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం వెస్టిండీస్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోస్టన్ చేజ్ (27 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు) విండీస్ను ఒడ్డున పడేసే ఆట ఆడాడు.సులువైన ప్రత్యర్థే అయినా... ఏమంత కష్టం కానీ లక్ష్యమే ఎదురైనా... వెస్టిండీస్ గెలిచేందుకు ఆపసోపాలు పడింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్, పూరన్ ఉన్నంత వరకు 8 ఓవర్లలో విండీస్ 61/1 స్కోరు చేసింది. గెలిచేందుకు 72 బంతుల్లో 76 పరుగులు చేస్తే సరిపోతుంది. కానీ తర్వాతి వరుస ఓవర్లలో పూరన్ (27 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్స్లు), కింగ్ (29 బంతుల్లో 34; 7 ఫోర్లు) అవుటయ్యాక పరిస్థితి మారింది. కెప్టెన్ రొవ్మన్ పావెల్ (15), రూథర్ఫోర్డ్ (2) వికెట్లు పారేసుకోవడంతో సమీకరణం 24 బంతుల్లో 40 పరుగుల వద్ద కష్టంగా కనిపించింది. ఈ దశలో రసెల్ (9 బంతుల్లో 15 నాటౌట్; 1 సిక్స్) వచ్చాక చేజ్ ధాటిగా ఆడాడు. 18వ ఓవర్లో 2 బౌండరీలు, ఓ సిక్స్ బాది 18 పరుగులు పిండుకున్నాడు. మరుసటి ఓవర్లోనూ చేజ్ 2 ఫోర్లు కొట్టడంతో 19వ ఓవర్ ఆఖరి బంతికి లక్ష్యాన్ని చేరుకుంది. -
సూపర్ క్యాచ్.. జడేజాను గుర్తు చేసిన విండీస్ ఆటగాడు! వీడియో
టీ20 వరల్డ్కప్-2024లో భాగంగా గయానా వేదికగా పాపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ ఆటగాడు రోస్టన్ ఛేజ్ సంచలన క్యాచ్తో మెరిశాడు. అద్బుతమైన క్యాచ్తో న్యూ గినియా కెప్టెన్ ఆసద్ వాలాను ఛేజ్ పెవిలియన్కు పంపాడు. న్యూ గినియా ఇన్నింగ్స్ 5 ఓవర్ వేసిన అల్జారీ జోసెఫ్ ఔట్సైడ్ ఆఫ్దిశగా లెంగ్త్ డెలివరీ సంధించాడు. ఆ లెంగ్త్ డెలివరీని ఆసద్ వాలా బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న ఛేజ్ డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్ను అందుకున్నాడు. ఇది చూసిన న్యూ గినియా కెప్టెన్ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను గుర్తు చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా జడేజా కూడా ఈ విధంగానే పాయింట్లో ఎన్నో మెరుపు క్యాచ్లను అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూ గునియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. పీఎన్జీ బ్యాటర్లలో సెసే బౌ(50) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. బౌకు ఇది తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీ కావడం గమనార్హం. ఇక అతడితో పాటు కెప్టెన్ అసద్ వాలా(21), డొరిగా(27) పరుగులతో రాణించారు. 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ పీఎన్జీని వలా, బావు అదుకున్నారు.వీరిద్దరూ విండీస్ బౌలర్లకు అడ్డుగా నిలవడంతో పీఎన్జీ గౌరవప్రదమైన స్కోర్ సాధించగల్గింది. ఇక వెస్టిండీస్ బౌలర్లలో రస్సెల్, జోసెఫ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. హోస్సేన్, షెఫెర్డ్, మోటీ తలా వికెట్ సాధించారు. SCREAMER! 🥵#AlzarriJoseph strikes in his very first over and gets the #PapuaNewGuinea skipper caught at point!📺 | #WIvPNG | LIVE NOW | #T20WorldCupOnStar (Only available in India) pic.twitter.com/g0EaFdHsNb— Star Sports (@StarSportsIndia) June 2, 2024 -
పీఎన్జీ బ్యాటర్ల అద్బుత పోరాటం.. విండీస్ టార్గెట్ ఎంతంటే?
టీ20 వరల్డ్కప్-2024లో భాగంగా గయానా వేదికగా పాపువా న్యూ గినియా, వెస్టిండీస్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూ గునియా పర్వాలేదన్పించింది. పటిష్టమైన కరేబియన్ బౌలింగ్ లైనప్ను ఎదుర్కొన్న న్యూ గునియా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. పీఎన్జీ బ్యాటర్లలో సెసే బౌ(50) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. బౌకు ఇది తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీ కావడం గమనార్హం. ఇక అతడితో పాటు కెప్టెన్ అసద్ వాలా(21), డొరిగా(27) పరుగులతో రాణించారు. 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ పీఎన్జీని వలా, బావు ఆదుకున్నారు. వీరిద్దరూ విండీస్ బౌలర్లకు అడ్డుగా నిలవడంతో పీఎన్జీ గౌరవప్రదమైన స్కోర్ సాధించగల్గింది. ఇక వెస్టిండీస్ బౌలర్లలో రస్సెల్, జోసెఫ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. హోస్సేన్, షెఫెర్డ్, మోటీ తలా వికెట్ సాధించారు. -
T20 World Cup 2024: పసికూనల సమరం.. గట్టెక్కిన నమీబియా
టీ20 వరల్డ్కప్ 2024 వార్మప్ మ్యాచ్ల్లో భాగంగా నిన్న (మే 30) పసికూనల మధ్య సమరం జరిగింది. ట్రినిడాడ్ వేదికగా పపువా న్యూ గినియా, నమీబియా జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో నమీబియా డక్వర్త్ లూయిస్ పద్దతిన 3 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది.తొలుత బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. నమీబియా బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటి గినియాను కట్టడి చేశారు. ట్రంపెల్మన్, వీస్. టంగెని లుంగనమెనీ తలో 2 వికెట్లు పడగొట్టగా..బెర్నాల్డ్ స్కోల్జ్ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి ఓ వికెట్ పడగొట్టాడు. గినియా ఇన్నింగ్స్లో సెసె బౌ (29) టాప్ స్కోరర్గా నిలిచాడు.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా.. తొలుత గినియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో (9/3) ఇబ్బందులు ఎదుర్కొంది. ఇదే సమయంలో మ్యాచ్కు వరుణుడు అడ్డుతగిలాడు. దీంతో అంపైర్లు డక్వర్త్ లూయిస్ పద్దతిన నమీబియాకు 93 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఫ్రైలింక్ (36), జీన్ పియెర్ కొట్జీ (30) బాధ్యతాయుతంగా ఆడటంతో నమీబియా అతి కష్టం మీద 16.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సవరించిన లక్ష్యాన్ని చేరుకుంది. గినియా బౌలర్లలో అస్సద్ వలా, అలెయ్ నావ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. కబువా మొరియా, నార్మన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. నిన్ననే జరగాల్సిన మరో మూడు వార్మప్ మ్యాచ్లు వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయాయి. -
పపువా న్యూ గినియా విపత్తుపై ప్రధాని మోదీ ట్వీట్
న్యూఢిల్లీ: పపువా న్యూగినియాలో ఇటీవల కొండచరియలు విరిగిపడి భారీ విపత్తు సంభవించింది. ఈ విపత్తు కారణంగా 2000 మంది దాకా శిథిలాల కింద కూరుకుపోయారు. ఇంకొన్నివేల మంది నిరాశ్రయులయ్యారు.తాజా దీనిపై ప్రధాని మోదీ ఎక్స్లో స్పందించారు. ‘న్యూగినియాలో జరిగిన దానికి విచారం వ్యక్తం చేస్తున్నా. కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రభావితమైన కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నా.గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. గినియా దేశానికి ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నా’అని ప్రధాని ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. -
పపువా న్యూ గినియా విషాదం..
మెల్బోర్న్: దక్షిణ పసిఫిక్ ద్వీప దేశం పపువా న్యూ గినియా శుక్రవారం కొండచరియలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఎంగా ప్రావిన్స్లోని యంబాలి గ్రామంలో చోటుచేసుకున్న ఘటనలో 670 మంది వరకు చనిపోయి ఉంటారని మొదట ఐరాస విభాగం అంచనా వేసింది. అయితే, మట్టిదిబ్బల కింద రెండు వేలమందికి పైగానే గ్రామస్తులు సజీవ సమాధి అయి ఉంటారని పపువా న్యూ గినియా ప్రభుత్వం లెక్కగట్టింది. ఈ మేరకు ఐరాసకు సమాచారం పంపింది. ఈ విషాద సమయంలో తమను ఆదుకోవాలంటూ అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది. అయితే, ఐరాస వలసల విభాగం మాత్రం నేలమట్టమైన 150 నివాసాలను పరిగణనలోకి తీసుకునే మృతుల సంఖ్య 670గా నిర్ణయించామని, ప్రభుత్వ గణాంకాలపై మాట్లాడబోమని తెలిపింది. మృతుల సంఖ్యను 2 వేలుగా ఏ ప్రాతిపదికన నిర్ణయించారని ప్రధాని జేమ్స్ మరాపేను మీడియా ప్రశ్నించగా ఆయన బదులివ్వలేదు. కాగా, దేశంలో దశాబ్దాలుగా జనగణన జరగలేదు. సైన్యం కాపలా మధ్య.. గ్రామంలోని 200 మీటర్ల ప్రాంతంలో ఉన్న నివాసాలను 6 నుంచి 8 మీటర్ల మేర భారీ రాళ్లు, చెట్లు, మట్టి భూస్థాపితం చేశాయి. స్థానికులే తమ వ్యవసాయ పరికరాలైన పార, గొడ్డలి వంటి వాటితో వాటిని తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను మాత్రమే వెలికి తీయగలిగారు. స్థానిక కాంట్రాక్టర్ పంపించిన బుల్డోజర్తో ఆదివారం నుంచి పని చేయిస్తున్నారు. -
ప్రకృతి విలయతాండవం.. 2,000 మంది మృతి
పాపువా న్యూ గినియాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొండచరియలు విరిగి పడిన ఘటనలో దాదాపు 2000 మంది సజీవ సమాధి అయ్యారని ఆ దేశ నేషనల్ డిజాస్టర్ సెంటర్ పేర్కొంది. ఈ మేరకు ఐరాస ఆఫీసుకు పాపువా న్యూ గినియా అధికారులు సమాచారం ఇచ్చారు.వివరాల ప్రకారం.. పావువా న్యూ గినియాలో కొండ చరియలు విరగిపడ్డాయి. ఈ ప్రమాదంలో దాదాపు రెండు వేల మంది సజీవ సమాధి అయ్యారు. కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 200 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ బీభత్సం సంభవించింది. కొన్ని చోట్ల 8 మీటర్ల ఎత్తున శిథిలాలు కుప్పలుగా పడినట్టు సమాచారం. కాగా, చాలా చోట్ల ఇలా కొండచరియలు విరిగి పడుతుండటంతో మరణాల సంఖ్య పెరుగుతోంది. పెద్ద సైజులో బండరాళ్లు ఉండటంతో మృతదేశాల వెలికితీత కష్టంగా మారింది. More than 2,000 people were buried alive in a massive landslide in Papua New Guinea . pic.twitter.com/avgy49mEPg— Baba Banaras™ (@RealBababanaras) May 27, 2024 ఇక, ఈ ప్రమాద ఘటన కారణంగా 2000 మంది మరణించారని ఆ దేశంలోని నేషనల్ డిజాస్టర్ సెంటర్ నుంచి ఐరాస ఆఫీస్కు సమాచారం వెళ్లింది. ఈ మేరకు సోమవారం ఉదయం లేఖను ఆ కార్యాలయానికి పంపింది. తమ దేశానికి తగు సాయం అందించాలని కోరింది. అలాగే, మిత్రదేశాలు అందించే సాయాన్ని డిజాస్టర్ సెంటర్ ద్వారా సమన్వయం చేసుకొంటామని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. Drone video reveals extent of the damage caused by a landslide in Papua New Guinea, which killed more than 670 people according to the UN.Rescue workers are trying to retrieve bodies from under the mud. pic.twitter.com/SPvUjdeaQF— Al Jazeera English (@AJEnglish) May 26, 2024అయితే, ఎంగా ప్రావిన్స్లోని యంబాలి గ్రామంపై శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మౌంట్ ముంగాల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సందర్భంగా ప్రావిన్స్లో భారీ నష్టం వాటిల్లింది. ఆ ప్రాంతంలో ఉన్న నివాసాలు దాదాపు నేలమట్టమయ్యాయి. కొండచరియల కారణంగా ప్రజా రవాణాకు సైతం తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. -
పపువా న్యూ గినియా విషాదం.. మరణాలు 670కి పైనే..
మెల్బోర్న్: పసిఫిక్ ద్వీప దేశం పపువా న్యూ గినియాలో శుక్రవారం కొండచరియలు విరిగిపడి గ్రామాన్ని నేలమట్టం చేయడం తెల్సిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 670కిపైనే అని ఐరాసకు చెందిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్(ఐవోఎం) ఆదివారం తెలిపింది. ఎంగా ప్రావిన్స్ అధికారులు, బాధిత యంబలి గ్రామస్తులు అందించిన సమాచారాన్ని బట్టి 150కిపైగా ఇళ్లు భూస్థాపితం కాగా వాటిలోని 670 మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు ఐవోఎం అంచనా వేసింది. క్షతగాత్రులు, గల్లంతైన వారి సంఖ్యలో స్పష్టత రాలేదని పేర్కొంది. ఆదివారం ఐదు మృతదేహాలను వెలికి తీసినట్లు స్థానిక అధికారులు చెప్పారు. మట్టి, బండరాళ్లు, చెట్లు మూడు నుంచి నాలుగు ఫుట్బాల్ మైదానాలంత విస్తీర్ణంలో 6 నుంచి 8 మీటర్ల లోతున గ్రామాన్ని భూస్థాపితం చేశాయని, లోపల చిక్కుకున్న వారు బతికి బట్టకట్టేందుకు అవకాశాలు తక్కువని ఐవోఎం అంటోంది. మరోవైపు స్థానిక గిరిజన తెగల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. శనివారం జరిగిన ఘర్షణలో ఎనిమిది మంది చనిపోయారు. దాంతో సహాయక సిబ్బంది, అత్యవసరాలను చేరవేయడానికి ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. -
కొండ చరియల బీభత్సం.. 670 మంది మృతి
పోర్ట్మోర్స్బీ: పపువా న్యూ గినియాలో కొండచరియలు భారీ బీభత్సాన్ని సృష్టించాయి. శుక్రవారం(మే24) సంభవించిన ఈ ప్రకృతి విపత్తులో తొలుత 100 మందికిపైగా మృతి చెంది ఉండొచ్చని భావించారు. అయితే మృతుల సంఖ్య భారీగానే ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి(యూఎన్) తాజాగా అంచనా వేసింది. ఈ విపత్తులో సుమారు 670 మందికిపైగా ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని ‘అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎమ్)’తెలిపింది. గ్రామాలకు గ్రామాలే కొండచరియల కింద కూరుకుపోయినట్లు సమాచారం. మొత్తం 150 ఇళ్లు కొండ చరియల కింద శిథిలమయ్యాయని తేలింది. దీంతో 670 మంది సమాధి అయ్యారని అంచనా వేస్తున్నారు. ప్రాణాలతో బయటపడిన వారిని అధికారులు సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. -
విరిగిపడ్డ కొండచరియలు.. భారీగా ప్రాణనష్టం
పోర్ట్మోర్స్బీ: పపువా న్యూ గినియాలో ప్రకృతి ఆగ్రహించింది. రాజధాని పోర్ట్ మోర్స్బీకి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్గా ప్రావిన్స్లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో పౌరులు గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా అధికారిక మీడియా వెల్లడించింది. తెల్లవారుజామున 3 గంటలకు కొండచరియలు ఒక్కసారిగా విరిగి కింద ఉన్న ఆరు గ్రామాలపై పడ్డాయి. పెద్ద సైజు రాళ్లు పడి గ్రామాల్లోని చాలావరకు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ప్రజలు నిద్రలో ఉన్నపుడు ఇళ్లపై పెద్ద సైజు కొండ రాళ్లు పడటంతో భారీగా ప్రాణనష్టం వాటిల్లింది. ఘటన జరిగిన తర్వాత స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.కొండ రాళ్ల కింద శిథిలాలు భారీగా కూరుకుపోవడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 100కు పైగా మృతదేహాలను వెలికితీశారు. కొండ రాళ్లు విరిగిపడిన గ్రామానికి పోలీసులు, సహాయక బృందాలు ఇంకా చేరుకోలేదని తెలుస్తోంది. మృతుల సంఖ్యపై న్యూగినియా ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
టీ20 వరల్డ్కప్ 2024 కోసం మరో జట్టు ప్రకటన
వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా జూన్ 1 నుంచి ప్రారంభంకాబోయే పురుషుల పొట్టి ప్రపంచకప్ కోసం మరో జట్టును ప్రకటించారు. రెండో సారి ప్రపంచకప్కు అర్హత సాధించిన పపువా న్యూ గినియా ఇవాళ (మే 8) తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యుల ఈ జట్టుకు అస్సద్ వలా కెప్టెన్గా నియమితుడయ్యాడు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ సీజే అమీనీ అస్సద్కు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) ఎంపికయ్యాడు. తూర్పు ఆసియా పసిఫిక్ రీజియనల్ పోటీల ద్వారా వరల్డ్కప్కు అర్హత సాధించిన పపువా న్యూ గినియా 2021లో తొలిసారి ప్రపంచకప్కు క్వాలిఫై అయ్యింది. ఆ ఎడిషన్లో ఈ జట్టు తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. ప్రస్తుతం ఎంపిక చేసిన జట్టులో 10 మంది 2021 ప్రపంచకప్ స్క్వాడ్లో ఉన్నారు. 2024 ప్రపంచకప్లో గినియా జర్నీ జూన్ 2న ప్రారంభమవుతుంది. ఆ రోజు జరిగే మ్యాచ్లో గినియా.. పటిష్టమైన వెస్టిండీస్ను ఢీకొంటుంది. ప్రపంచకప్ గ్రూప్-సిలో ఉన్న గినియా.. గ్రూప్ దశలో వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, ఉగాండ జట్లతో పోటీపడుతుంది.టీ20 ప్రపంచకప్ 2024 కోసం పపువా న్యూ గినియా జట్టు: అస్సద్ వలా (కెప్టెన్), సీజే అమీనీ (వైస్ కెప్టెన్), అలీ నావో, చాడ్ సోపర్, హిలా వరే, హిరి హిరి, జాక్ గార్డనర్, జాన్ కారికో, కబువా వాగి మోరియా, కిప్లింగ్ డోరిగా, లెగా సియాకా, నార్మన్ వనువా, సెమా కమియా, సెసే బావు, టోనీ ఉరాపొట్టి ప్రపంచకప్ కోసం ఇప్పటిదాకా 15 జట్లను ప్రకటించారు. మరో జట్లను ప్రకటించాల్సి ఉంది. జట్ల వివరాలను వెల్లడించిన దేశాలు..భారత్ఇంగ్లండ్ఆస్ట్రేలియాఒమన్సౌతాఫ్రికాన్యూజిలాండ్ఆఫ్ఘనిస్తాన్నేపాల్కెనడావెస్టిండీస్యూఎస్ఏఉగాండస్కాట్లాండ్ఐర్లాండ్పపువా న్యూ గినియాజట్లను ప్రకటించాల్సిన దేశాలు..పాకిస్తాన్నమీబియానెదర్లాండ్స్శ్రీలంకబంగ్లాదేశ్ -
క్రికెట్ ప్రపంచంలో పెను విషాదం.. 33 ఏళ్ల వయసులోనే స్టార్ ఆల్రౌండర్ మృతి
క్రికెట్ ప్రపంచంలో పెను విషాదం చోటు చేసుకుంది. పపువా న్యూ గినియా మహిళా క్రికెటర్ కయా అరువా 33 ఏళ్ల వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లింది. అరువా మృతికి కారణాలు తెలియరాలేదు. అరువా అకాల మరణాన్ని దృవీకరిస్తూ ఐసీసీ ట్వీట్ చేసింది. 2010లో తొలిసారి పపువా న్యూ గినియా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అరువా.. అనతికాలంలోనే స్టార్ ఆల్రౌండర్గా ఎదిగింది. లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్, రైట్ హ్యాండ్ మిడిలార్డర్ బ్యాటర్ అయిన అరువా.. పపువా న్యూ గినియా తరఫున 47 అంతర్జాతీయ టీ20లు ఆడి 341 పరుగులు, 59 వికెట్లు తీసింది. బ్యాట్తో పెద్దగా రాణించని అరువా.. బంతితో చెలరేగింది. అరువా తన స్వల్ప కెరీర్లో 3 సార్లు నాలుగు వికెట్లు, రెండు సార్లు ఐదు వికెట్ల ఘనతలు సాధించింది. Sad news out of Papua New Guinea following the passing of women's international all-rounder Kaia Arua.https://t.co/xOCFTLzIHV — ICC (@ICC) April 4, 2024 ఆమె అత్యుత్తమ గణాంకాలు (5/7) తన జట్టు తరఫున రెండో అత్యుత్తమ గణాంకాలుగా నమోదై ఉన్నాయి. అరువా కొంతకాలం పాటు తన జట్టు సారథ్య బాధ్యతలు కూడా చేపట్టింది. అరువాకు కెప్టెన్సీలో వంద శాతం సక్సెస్ రేట్ ఉంది. ఆమె తన జట్టును 29 అంతర్జాతీయ టీ20ల్లో ముందుండి నడిపించి అన్ని మ్యాచ్ల్లో విజయాలు సొంతం చేసుకుంది. అరువా తన దేశంలో మహిళల క్రికెట్ అభివృద్దికి ఎంతో కృషి చేసింది. తూర్పు ఆసియా పసిఫిక్ మహిళల క్రికెట్లో అరువాకు తిరుగులేని ఆల్రౌండర్గా పేరుంది. -
పపువా న్యూగినియాలో భూకంపం.. 6.9 తీవ్రత నమోదు!
పపువా న్యూ గినియాలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దేశంలోని తూర్పు సెపిక్ ప్రావిన్స్లో 6.9 తీవ్రతతో భారీ భూకంపం చోటుచేసుకుందని, కొంతమేరకు ప్రాణ నష్టం జరిగివుండవచ్చని యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) తెలిపింది. ఇక్కడ మరోసారి భూకంపం వచ్చే అవకాశం ఉందని యూఎస్జీఎస్ హెచ్చరించింది. ఈ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం అంబుంటి ప్రాంతంలో భూకంప ప్రకంపనలు సంభవించాయి. దీని కేంద్రం భూమి కింద 35 కిలోమీటర్ల లోతున ఉంది. దీనికి ముందు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జీఎఫ్జెడ్) తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర పపువా న్యూ గినియాలోని మారుమూల ప్రాంతంలో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 65 కిలోమీటర్ల లోతున ఉంది. ప్రస్తుతానికి సునామీ ముప్పు లేదని అధికారులు తెలిపారు. ఈ విపత్తులో ఎంత ప్రాణనష్టం జరిగిందనే సమాచారం ఇంకా అందలేదు. ఈ భూకంపం కారణంగా ఆస్ట్రేలియాలో సునామీ ప్రమాదం లేదని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ తెలిపింది. కాగా 6.9 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం పెను విపత్తుకు దారితీసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పపువా న్యూ గినియా ప్రాంతం ‘రింగ్ ఆఫ్ ఫైర్’లో ఉంది. ఇక్కడ భూకంపాలు సర్వసాధారణం. గత ఏడాది ఏప్రిల్లో ఇదే ప్రాంతంలో 7.0 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. అప్పుడు ఏడుగురు మృతి చెందారు. -
పపువా న్యూగినీలో అల్లర్లు..
పోర్ట్ మోర్స్బీ: పసిఫిక్ ద్వీప దేశం పపువా న్యూగినీ అల్లర్లతో అట్టుడుకుతోంది. వేతనాల్లో కోతకు నిరసనగా పోలీసులు సమ్మెకు దిగడంతో జనం దుకాణాలు, కార్లకు నిప్పుపెట్టారు. సూపర్మార్కెట్లను దోచుకున్నారు. ఇప్పటికే నిరుద్యోగం, అధిక ధరలు ఆకాశాన్నంటడంతో అసంతృప్తితో జనం రగిలిపోతున్నారు. బుధవారం పోలీ సులు, ఇతర విభాగాల ప్రభుత్వ ఉద్యోగులు పార్లమెంట్ ఎదుట నిరసనకు దిగారు. వేతనాల్లో 50 శాతం వరకు కోతపెట్టడాన్ని నిరసించారు. అయితే, కంప్యూటర్లో పొర పాటు కారణంగానే వేతనంలో కోత పడిన ట్లు ప్రధాని చెప్పారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందని ఆందోళనకారులు పార్లమెంట్ భవనం లోపలికి చొచ్చుకెళ్లారు. ప్రధానమంత్రి కార్యాలయం ఆవరణలోని కారుకు నిప్పుపెట్టారు. గేటును విరగ్గొట్టారు. అనంతరం సాధారణ ప్రజానీకం వారికి తోడైంది. అందరూ కలిసి పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి యథేచ్ఛగా విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణల్లో రాజధానిలో 8 మంది, దేశంలోని రెండో అతిపెద్ద లే నగరంలో ఏడుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. రాజధాని పోర్ట్ మోర్స్బీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అదనంగా బలగాలను రప్పించారు. 14 రోజుల పాటు ఎమర్జెన్సీ అమల్లో ఉంటుందని ప్రధానమంత్రి జేమ్స్ మరపీ ప్రకటించారు. బుధవారం సాయంత్రానికే పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నట్లు ప్రధాని చెప్పారు. సోషల్ మీడియా లో అసత్యాల ప్రచారమే పరిస్థితికి కారణ మని నిందించారు. పోలీసులు లేకపో వడంతో అవకాశవాదులు రెచ్చిపోయారన్నారు. -
టీ20 వరల్డ్కప్ 2024కు కొత్తగా అర్హత సాధించిన మూడు జట్లు ఇవే..!
వచ్చే ఏడాది వెస్టిండీస్, యూఎస్ఏ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న పురుషుల టీ20 వరల్డ్కప్కు కొత్తగా మూడు జట్లు అర్హత సాధించాయి. యూరప్, ఈస్ట్ ఏసియా పసిఫిక్ రీజియన్స్ క్వాలిఫయింగ్ పోటీల ద్వారా ఐర్లాండ్, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్ జట్లు తాజాగా ప్రపంచకప్ బెర్త్లు ఖరారు చేసుకున్నాయి. మొత్తం 20 జట్లు పాల్గొనే మెగా టోర్నీలో పై పేర్కొన్న మూడు దేశాలు 13, 14, 15వ జట్లుగా బరిలోకి దిగుతాయి. టీ20 వరల్డ్కప్ 2024 నిబంధనల ప్రకారం.. తొమ్మిదో ఎడిషన్ ప్రపంచకప్ కోసం ఐసీసీ 12 జట్లకు నేరుగా అర్హత కల్పించింది. ఆతిధ్య దేశ హోదాలో యూఎస్ఏ, వెస్టిండీస్.. గత ఎడిషన్లో టాప్-8లో నిలిచిన జట్లు (డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ పాకిస్తాన్, ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్).. టీ20 ర్యాంకింగ్స్లో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు వరల్డ్కప్కు నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన 8 బెర్తులు వివిధ రీజియన్ల క్వాలిఫయింగ్ పోటీల ద్వారా భర్తీ చేయబడతాయి. తాజాగా ఐర్లాండ్, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్ 13, 14, 15 స్థానాలకు క్వాలిఫై కాగా.. మరో 5 స్థానాల కోసం వివిధ రీజియన్లలో పోటీ నడుస్తుంది. ప్రస్తుతం ఆసియా క్వాలిఫయర్-బి పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో మలేసియా, థాయ్లాండ్, భూటాన్, చైనా, మయన్మార్ వరుస స్థానాల్లో ఉన్నాయి. -
T20 WC: టి20 ప్రపంచకప్-2024కు అర్హత సాధించిన పసికూన
వచ్చే ఏడాది వెస్టిండీస్–అమెరికాలో జరిగే టి20 ప్రపంచకప్కు పపువా న్యూ గినియా అర్హత సాధించింది. ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫయర్స్ నుంచి పపువా న్యూ గినియా జట్టు టి20 వరల్డ్కప్కు అర్హత సాధించిన జట్టుగా నిలిచింది. శుక్రవారం ఎమిని పార్క్ వేదికగా పిలిప్పీన్స్తో జరిగిన మ్యాచ్లో పపువా న్యూ గినియా వంద పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. టోనీ యురా 61, ఆసద్ వాలా 59, చార్ల్స్ అమిని 53 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన పిలిప్పీన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 129 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ డేనియల్ స్మిత్ 34 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. అర్ష్దీప్ శర్మ 22 పరుగులు చేశాడు. పపువా న్యూ గినియా బౌలర్లలో కబువా మోరియా రెండు వికెట్లు తీయగా.. జాన్ కరికో, హిరిహిరి ఒక వికెట్ పడగొట్టారు. ఇప్పటికే ఐర్లాండ్ అర్హత సాధించగా.. తాజాగా పపువా న్యూ గినియా కూడా అర్హత సాధించడంతో టి20 వరల్డ్కప్ అర్హతకు సంబంధించి మరో ఐదు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అందులో ఒకటి అమెరికా క్వాలిఫయర్ నుంచి.. మిగతా నాలుగు బెర్తుల్లో రెండు ఆసియా నుంచి.. మరో రెండు ఆఫ్రికా క్వాలిఫయర్స్ నుంచి వరల్డ్కప్కు అర్హత సాధించనున్నాయి. ICC Men’s #T20WorldCup 2024 bound ✈️🏆 Congratulations, Papua New Guinea! 🙌 pic.twitter.com/Y7jKSU6Hxq — ICC (@ICC) July 28, 2023 చదవండి: Ashes 2023: పాంటింగ్పై ద్రాక్ష పండ్లతో దాడి.. 'వాళ్లను ఊరికే వదలను' -
ఆ దేశంలో వాడుకలో 840 భాషలు.. భారత్లో ఎన్ని భాషలంటే..
ప్రపంచంలోని ప్రతి వ్యక్తి తన ఆలోచనలను ఇతరులకు తెలియజేయాలన్నా.. ఇతరులు చెప్పేవి అర్థం చేసుకోవాలన్నా ‘భాష’ ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా 6,500కు పైగా భాషలు వాడుకలో ఉండగా.. అందులో 840 భాషలు పపువా న్యూ గినియా అనే చిన్న దేశంలో వాడుకలో ఉన్నట్లు వెల్లడయ్యింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక భాషలు వాడుకలో ఉన్న దేశంగా పపువా న్యూ గినియా రికార్డులకెక్కింది. ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల మధ్యలో 4,62,840 కి.మీ విస్తీర్ణంలో ఉన్న ఈ దేశ జనాభా 94 లక్షలే. కానీ ఇప్పటికీ అక్కడి ప్రజలు 840 భాషల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ ఇంగ్లిష్ అధికార భాష కాగా.. హిరిమోటు, పీఎన్జీ సింగ్, టోక్ పిసిన్ తదితర భాషలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇక ఇండోనేసియా 710 భాషలతో రెండో స్థానంలో నిలిచింది. నైజీరియా 524 భాషలతో మూడో స్థానంలో, భారత్ 453 భాషలతో 4వ స్థానంలో నిలిచాయి. ఇక, 337 భాషలతో అమెరికా ఐదో స్థానంలో, 317 భాషలతో ఆస్ట్రేలియా ఆరో స్థానం ఉండగా, 307 భాషలతో చైనా ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఉత్తర కొరియా ప్రజలు.. కొరియన్ తప్ప ఇతర భాషలను ఉపయోగించరు.ఆ తర్వాత వాటికన్ సిటీలో రెండు, ఐస్ల్యాండ్లో రెండు, దక్షిణ కొరియాలో 5 భాషలే వాడకలో ఉన్నాయి. అలాగే అత్యధిక దేశాల్లో ఇంగ్లిష్ భాషను ఉపయోగిస్తున్నట్లు వెల్లడైంది. 67 దేశాల్లో ఇంగ్లిష్, 29 దేశాల్లో ఫ్రెంచ్, 27 దేశాల్లో అరబిక్, 21 దేశాల్లో స్పానిష్, 10 దేశాల్లో పోర్చుగీస్, ఆరు దేశాల్లో జర్మన్, నాలుగు దేశాల్లో రష్యన్ భాష వాడుకలో ఉంది. ఇది కూడా చదవండి: హలో.. ఆస్ట్రోనాట్..! -
భారత ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
సువా: భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విదేశీ గడ్డపై అరుదైన గౌరవం దక్కింది. ఫసిఫిక్ ద్వీప దేశం ఫిజీ తమ దేశ అత్యున్నత పురస్కారం ‘ది కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ’ని ప్రధాని మోదీకి అందజేసింది. ప్రపంచ నాయకత్వ లక్షణాలకుగానూ ఆయనకు ఈ పురస్కారం అందజేస్తున్నట్లు ఫిజీ ప్రకటించింది. తమ దేశ పౌరుడు కాని వ్యక్తికి ఈ పురస్కారం అందించడం అత్యంత అరుదని ఈ సందర్భంగా ఫిజీ ప్రకటించుకుంది. ఫిజీ ప్రధాని సిటివేని లిగమామడ రబుక నుంచి ఆ మెడల్ను భారత ప్రధాని మోదీ అందుకున్నారు. భారత్కు దక్కిన పెద్ద గౌరవమని ఈ సందర్భంగా భారత ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఇదిలా ఉంటే.. గతంలోనూ చాలా దేశాలు ప్రధాని మోదీకి తమ దేశ అత్యున్నత పురస్కారాలు అందజేశాయి. PM @narendramodi has been conferred the highest honour of Fiji, the Companion of the Order of Fiji. It was presented to him by PM @slrabuka. pic.twitter.com/XojxUIKLNm — PMO India (@PMOIndia) May 22, 2023 ఇదిలా ఉంటే. పాపువా గినియా తరపు నుంచి కూడా ప్రధాని మోదీ ఓ గౌరవాన్ని అందుకున్నారు. కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లోగోహును పాపువా న్యూ గినియా గవర్నర్ జనరల్ సర్ బాబ్ దాడే.. భారత ప్రధాని మోదీకి అందించారు. Papua New Guinea has conferred the Companion of the Order of Logohu on PM @narendramodi. It was presented to him by Papua New Guinea Governor General Sir Bob Dadae. pic.twitter.com/0Xki0ibW8D — PMO India (@PMOIndia) May 22, 2023 జీ-7 సదస్సు కోసం ప్రత్యేక అతిథిగా జపాన్(హిరోషిమా) వెళ్లిన ప్రధాని మోదీ.. అక్కడ ప్రపంచ దేశల అధినేతలతో భేటీ అయ్యారు. ఆపై అటు నుంచి అటే ఫసిఫిక్ ద్వీప దేశాల్లో పర్యటిస్తున్నారాయన. ఇదీ చదవండి: ఐరాసను సంస్కరించాల్సిందే! -
మోదీకి పాదాభివందనం చేసిన ఆ దేశ ప్రధాని..
-
మోదీకి పాదాభివందనం చేసిన ఆ దేశ ప్రధాని
ఫసిఫిక్ ద్వీప దేశం పాపువా న్యూగినియాలో భారత ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆ దేశ ప్రధానమంత్రి జేమ్స్ మరాపే.. మోదీని ఆలింగనం చేసుకుంటూ.. ఆయన పాదాలను తాకుతూ స్వాగతించారు. వాస్తవానికి పాపువా న్యూగినియాలో సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత దేశంలోకి వచ్చే ఏ నాయకుడికి ఉత్సవ స్వాగతం ఇవ్వదు. కానీ మోదీ కోసం ఆ సెంటిమెంట్ను పక్కనపెట్టారు. అక్కడి కాలమాన ప్రకారం ఆదివారం రాత్రి 10 గంటలకు చేరకున్న ప్రధాని మోదీకి మాత్రం మినహయింపు ఇచ్చింది. అంతేగాదు పసిఫిక్ ద్వీప దేశాన్ని సందర్శించిన మొదటి భారత ప్రధాని అయిన మోదీకి న్యూగినియా ప్రధానిచే విశేష స్వాగతం లభించింది. ప్రధాని మోదీ ఇతర ప్రముఖులను కలిసేందుకు వెళ్లేముందు కూడా మరాపే మోదీని మరోసారి ఆలింగనం చేసుకున్నారు. ఈ మేరకు మోదీ ట్వీట్టర్ వేదికగా..నేను పాపువా న్యూగినియా చేరుకున్నాను. విమానాశ్రయంలో నన్ను స్వాగతించినందుకు ప్రధాని జేమ్స్ మరాప్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు స్వాగతం పలికేందుకు ఆయన చేసిన ప్రత్యేక అభివాదాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. నా పర్యటన సందర్భంగా ఈ దేశంతో భారత్ సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి నేనెంతగానో ఎదురు చూస్తున్నాను అని మోదీ ట్వీట్ చేశారు. న్యూగినియాలో మోదీకి 19 తుపాకులు గౌరవ వందనం, లాంఛనప్రాయం స్వాగతం గార్డ్ ఆఫ్ హానర్ తోసహా ప్రధాని జేమ్స్ మరాపే చేసిన ప్రత్యేక అభివాదాన్ని స్వీకరించినట్లు విదేశాంగ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ఇదిలా ఉండగా, ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ (ఎఫ్ఐపిఐసి-FIPIC) మూడో శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చేందుకు ఆదివారం న్యూగినియా చేరుకున్నారు మోదీకి. సోమవారం ఈ శిఖరాగ్ర సమావేశాంలో నరేంద్ర మోదీ, జేమ్స్ మరాపే ఆతిధ్యం ఇవ్వనున్నారు. ఈ సమావేశంలో జేమ్స్ మరాపేతో ద్వైపాక్షిక చర్చలు జరపడం తోపాటు పాపువా న్యూగినియా గవర్నర్ జనరల్ బాబ్ దాడేతో భేటీ కానున్నారు మోదీ. అదీగాక సోమవారం నాటి చర్చల్లో వాతావరణ మార్పులు, అభివృద్ధిపైన ఎక్కువగా దృష్టిసారించనున్నట్లు సమాచారం. సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇలాంటి శిఖరాగ్ర సమావేశానికి భారత్ ఆతిథ్యమిచ్చింది. కాగా, అంతకుమునుపే మోదీ ఈ శిఖరాగ్ర సమావేశానికి హజరయ్యేందుకు 14 పసిఫిక్ ద్వీప దేశాలు(పీఐసీ) ఆహ్వానాన్ని అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే. 2014లో మోదీ ఫిజి పర్యటన సందర్భంగా ప్రారంభించిన ఎఫ్ఐపీఐసీ సదస్సులో మొత్తం 14 దేశాల నాయకులు పాల్గొంటారు. (చదవండి: జీ 7 సదస్సులో.. మోదీని ఆటోగ్రాఫ్ అడిగిన జో బైడెన్!) -
పసిఫిక్ ద్వీపదేశంలో భారీ భూకంపం
పోర్ట్ మోర్స్బీ: తరచూ భూకంపాల బారిన పడే ఫసిఫిక్ ద్వీపదేశం.. పపువా న్యూ గినియా Papua New Guinea మరోసారి భారీ భూకంపంతో వణికిపోయింది. భారత కాలమానం ప్రకారం.. ఈ వేకువ ఝామున 4 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఇది శక్తివంతమైన భూకంపమే అయినా.. ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు స్థానిక విపత్తుల విభాగం. అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం.. తీర ప్రాంత పట్టణమైన వెవాక్ నుంచి 97 కిలోమీటర్ల దూరంలో చంబ్రీ లేక్ కేంద్రంగా భారీ భూకంపం సంభవించింది. దాదాపు 62 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 7.0గా నమోదైంది. ఈ ప్రాంతం.. ఇండోనేషియా సరిహద్దుకు తూర్పున 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మొత్తని నేల స్వభావం వల్ల.. భూకంపం సంభవించిన ప్రాంతంలో నష్టం భారీగానే కలిగే అవకాశముందని అమెరికా జియోలాజికల్ సర్వే అభిప్రాయపడింది. అయితే.. సునామీ సంకేతాలు లేకపోవడం వల్లే హెచ్చరిక జారీ చేయలేదని అధికారులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే.. తరచూ భూకంపాలతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. భూకంప కేంద్రానికి 250 కిలోమీటర్ల దూరంలోని హైలాండ్ ప్రావిన్స్లోనూ ప్రకంపనల ప్రభావం కనిపించింది. సుమారు 45 సెకండ్లపాటు భారీగా భూమి కంపించిందని స్థానికుడొకరు చెప్తున్నాడు. ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ దేశాల్లో ఒకటిగా ఉన్న పపువా న్యూ గినియా.. బయోడైవర్సిటీకి ఫేమస్. అలాగే అక్కడ కొండ ప్రాంతాలు అధికం. భూకంపాలు సంభవించిన సమయంలో కొండచరియలు విరిగి పడడం ద్వారా భారీగా నష్టం చేస్తుంటుంది. తద్వారా పేదరికంలో ఉన్న దేశం పరిస్థితి.. నానాటికీ మరింతగా దిగజారిపోతోంది. కిందటి ఏడాది సెప్లెంబర్లో.. 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపం 21 మంది బలి తీసుకుంది. ఇక 2018లో సంభవించిన భూకంపం ఏకంగా 200 మందిని పొట్టనబెట్టుకుంది. వీళ్లలో కొండచరియల కింద నలిగి మరణించిన వాళ్లే అధికం. -
పసికూనల మధ్య పరుగుల వరద.. అనుభవమే గెలిచింది
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ క్వాలిఫయర్స్లో భాగంగా నమీబియా, పపువా న్యూ గినియాల మధ్య జరిగిన మ్యాచ్లో పరుగుల వరద పారింది. పేరుకు పసికూనలైనప్పటికి ఆటలో మాత్రం పోటాపోటీని ప్రదర్శించారు. అయితే పపువా కంటే ఎప్పుడో క్రికెట్లో అడుగుపెట్టిన నమీబియానే 48 పరుగులతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. కెప్టెన్ గెర్హార్ ఎరాస్మస్ (113 బంతుల్లో 125 పరుగులు), నికో డేవిన్(79 బంతుల్లో 90 పరుగులు), లోప్టీ ఈటన్(59 బంతుల్లో 61 పరుగులు) రాణించారు. పపువా న్యూ గినియా బౌలర్లలో సెమో కామియా ఐదు వికెట్లతో రాణించగా.. కాబువా మోరియా రెండు వికెట్లు తీశాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పపువా న్యూ గినియా 46.2 ఓవర్లలో 333 పరుగులకు ఆలౌటైంది. ఆరంభం నుంచి దూకుడుగానే ఆడిన పపువా న్యూ గినియా 282/4తో పటిష్టంగా కనిపించినప్పటికి చివర్లో ఒత్తికి లోనై వికెట్లు చేజార్చుకుంది. చార్ల్స్ అమిని(75 బంతుల్లో 109 పరుగులు, 8 ఫోర్లు, 8 సిక్సర్లు) వీరవిహారం సరిపోలేదు. సీస్ బహు(44 బంతుల్లో 54 పరుగులు), కెప్టెన్ అసద్ వాలా(61 బంతుల్లో 57 పరుగులు), కిప్లిన్ డొరిగా(47 పరుగులు) ఆకట్టుకున్నారు. నమీబియా బౌలర్లలో బెర్నాడ్ స్కొల్ట్జ్, రూబెన్ ట్రంపెల్మన్ చెరో మూడు వికెట్లు తీయగా.. గెర్హాడ్ ఎరాస్మస్ రెండు వికెట్లు పడగొట్టాడు. సెంచరీతో పాటు మూడు వికెట్లు తీసి ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచిన గెర్హాడ్ ఎరాస్మస్ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. An all-round show from Gerhard Erasmus gives Namibia a win against PNG in a high-scoring game 🙌 Watch the @cricketworldcup Qualifier Play-off LIVE and for FREE on https://t.co/vphAWWBUVe (in select regions) 📺 📝 https://t.co/5KxcH6LbW5 pic.twitter.com/6cj4yP2QNs — ICC Cricket World Cup (@cricketworldcup) March 30, 2023 -
ఇండోనేషియా పాపువా గినియా దీవులలో 3 కిలోల బరువున్న అరటిపండు
-
140 ఏళ్ల తర్వాత కన్పించిన అరుదైన పక్షి.. ఫొటో వైరల్..
అత్యంత అరుదైన బ్లాక్ నేప్డ్ పీసాంట్ పీజియన్ పక్షి(నెమలిలా కన్పించే పావురం) 140 ఏళ్ల తర్వాత కన్పించింది. శాస్త్రవేత్తలు దీన్ని తిరిగి కనిపెట్టేందుకు తీవ్రంగా శ్రమించారు. ద్వీపకల్ప దేశం పపువా న్యూగినియాలో స్థానికులను వివరాలు అడిగి నెలరోజుల పాటు అడవిలో తిరిగి కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు వారి శ్రమకు ఫలితం దక్కింది. శాస్త్రవేత్తలు ఏర్పాటు చేసిన కెమెరాల్లో ఈ పక్షి దృశ్యాలు రికార్డయ్యాయి. బ్లాక్ నెప్డ్ పీసాంట్ పీజియన్ను ఇప్పటికే అంతరించిపోయిన జాతిగా ప్రకటించారు. ఇది పపువా న్యూ గినియా అడవిలో మాత్రమే ఇంకా అత్యంత అరుదుగా కన్పిస్తోంది. 10 ఏళ్లుగా కన్పించని, ఇంకా అంతరించిపోని పక్షులను కనుగొనే కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నంలో ఈ నెమలి పావురం కన్పించింది. ఇది గొప్ప విజయంగా భావిస్తున్నట్లు వారు తెలిపారు. ఇలా కన్పించని అరుదైన పక్షులు మొత్తం 150 ఉన్నట్లు చెప్పారు. ఈ పక్షిని చూశామని స్థానికులు చెప్పడంతో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. చదవండి: ఆరు నెలల తర్వాత చైనాలో తొలి కరోనా మరణం -
వన్డేల్లో సరికొత్త రికార్డు.. 6 సిక్సర్లతో ఫాస్టెస్ట్ ఫిఫ్టి నమోదు
Michael Leask: ఐసీసీ అసోసియేట్ దేశాల క్రికెట్లో సరికొత్త రికార్డు నమోదైంది. వన్డే ప్రపంచకప్ 2023 అర్హత పోటీల్లో భాగంగా స్కాట్లాండ్, పపువా న్యూ గినియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో స్కాట్లాండ్ ఆటగాడు మైఖేల్ లీస్క్ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఐసీసీ అసోసియేట్ దేశాలకు వన్డే క్రికెట్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ఇన్నింగ్స్లో 6 సిక్సర్లు బాదిన లీస్క్.. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి 2 పరుగులు సాధించి ఈ ఘనతను సాధించాడు. Final ball of the innings, and two needed for the fastest Associate ODI fifty 💥Scotland's Michael Leask gets it done in 18 balls 👏Catch all the @cricketworldcup League 2 action live and FREE on https://t.co/CPDKNxoJ9v 📺 pic.twitter.com/qLmRaJTnNg— ICC (@ICC) April 14, 2022 లీస్క్ ఏడో స్థానంలో బరిలోకి దిగి ఈ ఫీట్ను సాధించడం విశేషం. లీస్క్ సాధించిన రికార్డును ఐసీసీ తమ అధికారిక ట్విటర్లో పేర్కొంది. కాగా, అంతర్జాతీయ వన్డేల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, మిస్టర్ డిగ్రీస్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. ఏబీడీ 2015లో వెస్టిండీస్పై కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. ఏడేళ్లు పూర్తైనా నేటికీ ఆ రికార్డు ఏబీడి పేరిటే పదిలంగా ఉంది. ఇదిలా ఉంటే, పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్లో స్కాట్లాండ్ 123 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేయగా, ఛేదనలో స్కాటిష్ బౌలర్ గావిన్ మెయిన్ (5/52), హమ్జా తాహిర్ (3/27)ల ధాటికి పపువా న్యూ గినియా 36.2 ఓవర్లలో 164 పరుగులకే చాపచుట్టేసింది. పపువా న్యూ గినియా ఇన్నింగ్స్లో టోనీ ఉరా (47) టాప్ స్కోరర్గా నిలువగా.. స్కాట్లాండ్ ఇన్నింగ్స్లో కెప్టెన్ కొయెట్జర్ (74), బెర్రింగ్టన్ (56), లీస్క్ (50 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. చదవండి: Odean Smith: ఓ మ్యాచ్లో విలన్గా, రెండు మ్యాచ్ల్లో హీరోగా..! -
వారెవ్వా షకీబ్.. ఇలాంటి ఆల్రౌండర్ ఒక్కడున్నా చాలు
Shakib Al Hasan T20 WC 2021.. బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ తానెంత గొప్ప ఆల్రౌండర్ అనేది మరోసారి చూపించాడు. టి20 ప్రపంచకప్ 2021లో పపువా న్యూ గినియాతో జరిగిన గ్రూఫ్-బి క్వాలిఫయర్ మ్యాచ్లో షకీబ్ మరోసారి ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. ముందుగా బ్యాటింగ్లో బంగ్లాదేశ్ భారీ స్కోరు చేయడంలో షకీబ్ కీలకపాత్ర పోషించాడు. 37 బంతుల్లో 47 పరుగులు చేసిన షకీబ్ ఇన్నింగ్స్లో 3 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఆ తర్వాత బౌలింగ్లోనూ ఇరగదీశాడు. (4-0-9-4) ఇవీ షకీబ్ గణాంకాలు. చదవండి: T20 WC 2021: జట్టులో బెస్ట్ ఫీల్డర్గా గుర్తింపు.. స్టన్నింగ్ క్యాచ్కు షకీబ్ ఫిదా పసికూన పపువాపై విజయం సాధించినప్పటికి.. సూపర్ 12కు అర్హత సాధించాలంటే బంగ్లాకు భారీ విజయం అవసరం ఉంది. అందుకే సరైన సమయంలో షకీబ్ తనలోని ఆల్రౌండర్ను నిద్రలేపాడు. ప్రస్తుతం షకీబ్ ఐసీసీ టి20 ఆల్రౌండర్స్ ర్యాంకింగ్స్లో తొలి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక షకీబ్ ప్రదర్శనపై సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. '' వారెవ్వా ఇలాంటి ఆల్రౌండర్ ఒక్కడున్నా చాలు.. ఒంటిచేత్తో బంగ్లాను సూపర్ 12 దశకు చేర్చాడు... షకీబ్ నిజంగా గ్రేట్.. నెంబర్వన్ ఆల్రౌండర్ అనే పదానికి సరైన నిర్వచనం షకీబ్ అల్ హసన్'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: Squid Game Challenge: స్క్విడ్ గేమ్ ఛాలెంజ్లో నెగ్గిన 'హిట్మ్యాన్' T20 WC 2021 IND Vs PAK: ఆ మూడు స్థానాలు పెద్ద తలనొప్పి -
జట్టులో బెస్ట్ ఫీల్డర్గా గుర్తింపు.. స్టన్నింగ్ క్యాచ్కు షకీబ్ ఫిదా
Charles Amini Stunning Catch In BAN Vs PNG.. టి20 ప్రపంచకప్ 2021లో అరంగేట్రం చేసిన పపువా న్యూ గినియా ఒక్క మ్యాచ్లోనూ గెలవకపోయినప్పటికి ఒమన్ అభిమానులను మాత్రం అలరిస్తుంది. తాజాగా బంగ్లాదేశ్, పపువా మధ్య జరుగుతున్న గ్రూఫ్-బి క్వాలిఫయర్ మ్యాచ్లో పపువా ఫీల్డర్ చార్లెస్ అమిని సూపర్ క్యాచ్తో అభిమానుల మనసు గెలుచుకున్నాడు. అందులోనూ షకీబ్ అల్ హసన్ లాంటి స్టార్ ఆల్రౌండర్ క్యాచ్ అందుకుంటే ఆ ఫీల్డర్ ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పపువా జట్టులో చార్లెస్ అమిని బెస్ట్ ఫీల్డర్గా గుర్తింపు పొందాడు. ఈ మ్యాచ్లో 46 పరుగులు చేసిన షకీబ్ ఇన్నింగ్స్ 14వ ఓవర్ నాలుగో బంతిని లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. చదవండి: T20 WC 2021: మెంటార్గా పని ప్రారంభించిన ధోని.. వీడియో వైరల్ అయితే అక్కడే ఉన్న చార్లెస్ అమిని ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. అంతే అర్థసెంచరీ లేకుండానే షకీబ్ కథ ముగిసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్లో బంగ్లాదేశ్ భారీ విజయం దిశగా సాగుతుంది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పపువా న్యూ గినియా 13 ఓవర్లు ముగిసేసరికి ఏడు వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మహ్మదుల్లా, షకీబ్ మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. చదవండి: T20 WC 2021 IND Vs PAK: ఆ మూడు స్థానాలు పెద్ద తలనొప్పి View this post on Instagram A post shared by ICC (@icc) pic.twitter.com/KhbiXQ5edS — jennifer (@jennife74834570) October 21, 2021 -
BAN Vs PNG: బంగ్లాకు భారీ విజయం.. సూపర్ 12కు అర్హత!
బంగ్లాకు భారీ విజయం.. సూపర్ 12కు అర్హత! పపువా న్యూ గినియాతో జరిగిన గ్రూఫ్-బి క్వాలిఫయర్ మ్యాచ్లో బంగ్లాదేశ్ 84 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పపువా 19.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌట్ అయింది. భారీ విజయం దక్కించుకున్న బంగ్లాదేశ్ గ్రూఫ్-బి నుంచి సూపర్ 12 దశకు అర్హత సాధించింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటింగ్లో కెప్టెన్ మహ్మదుల్లా( 50, 28 బంతులు; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), షకీబ్ 46 పరుగులతో రాణించారు. అయితే ఒమన్పై స్కాట్లాండ్ విజయం అందుకుంటే బంగ్లా నేరుగా సూపర్ 12కు వెళుతుంది. అలా కాకుండా ఒమన్ గెలిస్తే మాత్రం ఇరు జట్ల మధ్య రన్రేట్ కీలకం కానుంది. బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో పపువా న్యూ గినియా ఓటమి దిశగా పయనిస్తోంది. 18 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. కిప్లిన్ డోరిగా 36, డామియెన్ రావు 1 పరుగులతో ఆడుతున్నారు. ఆరో వికెట్ కోల్పోయిన పపువా.. 10 ఓవర్లలో 28/6 పపువా న్యూ గినియా దారుణ ఆటతీరు కనబరుస్తుంది. 10 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్ల దాటికి పసికూన పపువా పరుగులు చేయలేక నానా అవస్థలు పడుతుంది. 17 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన పపువా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో పపువా 6 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 17 పరుగులు చేసింది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పపువా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తుంది. బంగ్లా భారీ స్కోరు.. పపువా టార్గెట్ 182 పపువా న్యూ గినియాతో జరుగతున్న మ్యాచ్లో బంగ్లాదేశ్ భారీస్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటింగ్లో కెప్టెన్ మహ్మదుల్లా( 50, 28 బంతులు; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), షకీబ్ 46 పరుగులతో రాణించారు. 10 ఓవర్లలో బంగ్లా.. 71/2 బంగ్లాదేశ్ 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. షకీబ్ అల్ హసన్ 34, ముష్ఫీకర్ రహీమ్ 5 పరుగుతో ఆడుతున్నారు. అంతకముందు ఓపెనర్ లిటన్ దాస్(29) రూపంలో బంగ్లాదేశ్ రెండో వికెట్ కోల్పోయింది. అసద్వాలా వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్ మొదటి బంతికి లిటన్ దాస్ సీసే బసుకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రెండో వికెట్ కోల్పోయిన బంగ్లా.. 54/2 ఓపెనర్ లిటన్ దాస్(29) రూపంలో బంగ్లాదేశ్ రెండో వికెట్ కోల్పోయింది. అసద్వాలా వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్ మొదటి బంతికి లిటన్ దాస్ సీసే బసుకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 8 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. షకీబ్ అల్ హసన్ 20, ముష్ఫీకర్ రహీమ్ 2 పరుగుతో ఆడుతున్నారు. 5 ఓవర్లలో బంగ్లా 37/1 5 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. లిట్టన్ దాస్ 20, షకీబ్ అల్ హసన్ 14 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు తొలి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ మహ్మద్ నయీమ్ డకౌట్గా వెనుదిరిగాడు. సున్నాకే తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ పపువా న్యూ గినియాతో జరుగుతున్న మ్యాచ్లో బంగ్లాదేశ్ ఖౠతా తెరవకుండానే తొలి వికెట్ను కోల్పోయింది. తొలి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ మహ్మాద్ నయీమ్ కబువా మోరియా బౌలింగ్లో డకౌట్గా వెనుదిరిగాడు. అల్ అమెరత్: టి20 ప్రపంచకప్ 2021లో గ్రూఫ్ బి క్వాలిఫయర్లో భాగంగా బంగ్లాదేశ్, పపువా న్యూ గినియా మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. స్లాట్కాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో ఓడిన బంగ్లాదేశ్ ఒమన్తో జరిగిన రెండో మ్యాచ్లో గెలిచి మళ్లీ ఫామ్లోకి వచ్చింది. పపువాపై విజయం సాధించి సూపర్ 12 దశకు అర్హత సాధించాలని ఉవ్విళ్లూరుతుంది. ఒకవేళ పపువా చేతిలో ఓడిపోతే మాత్రం ఒమన్ సూపర్ 12 దశకు అర్హత సాధిస్తుంది. పపువా న్యూ గినియా: లెగా సియాకా, అస్సద్ వాలా (కెప్టెన్), చార్లెస్ అమిని, సెసే బౌ, సైమన్ అటాయ్, హిరి హిరి, నార్మన్ వనువా, కిప్లిన్ డోరిగా (వికెట్ కీపర్), చాడ్ సోపర్, కబువా మోరియా, డామియన్ రావు బంగ్లాదేశ్ : మహ్మద్ నయీమ్, లిటన్ దాస్, మహేది హసన్, షకీబ్ అల్ హసన్, నూరుల్ హసన్ (వికెట్ కీపర్), అఫీఫ్ హొస్సేన్, మహ్మదుల్లా (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్, మహ్మద్ సైఫుద్దీన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహమాన్ -
T20 WC 2021: స్కాట్లాండ్ తరపున తొలి బ్యాటర్గా రికార్డు
T20 WC 2021 Richie Berrington.. స్కాట్లాండ్ బ్యాటర్ రిచీ బెర్రింగ్టన్ అరుదైన ఘనత అందుకున్నాడు. టి20 ప్రపంచకప్లో స్కాట్లాండ్ తరపున అర్థ సెంచరీ మార్క్ అందుకున్న తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. పపువా న్యూ గినియాతో జరుగుతున్న గ్రూఫ్-బి క్వాలిఫయర్ మ్యాచ్లో రిచీ బెర్రింగ్టన్ ఈ ఘనతను అందుకున్నాడు. కాగా ఈ మ్యాచ్లో 49 బంతుల్లో 70 పరుగులు చేసిన రిచీ ఇన్నింగ్స్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. చదవండి: T20 WC 2021: ఆఖరి ఓవర్లో నలుగురు ఔట్.. బౌలర్కు దక్కని హ్యాట్రిక్ ఇక పపువా న్యూ గినియాతో జరిగిన గ్రూఫ్ బి క్వాలిఫయర్ మ్యాచ్లో స్కాట్లాండ్ 17 పరుగులతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో స్కాట్లాండ్ క్వాలిఫయర్ పోటీల్లో వరుసగా రెండో విజయాన్ని అందుకొని సూపర్ 12 దశ అర్హతకు మరింత దగ్గరైంది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పపువా న్యూ గినియా 20 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌట్ అయింది. నార్మన్ వనూహ 47 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. స్కాట్లాండ్ బౌలర్లలో జోష్ డేవీ 4 వికెట్లతో సత్తా చాటాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. Richie Berrington is the first Scotland batsman to score a fifty in the T20 World Cups.#T20WorldCup #Scotland #PapuaNewGuinea #SCOvPNG #RichieBerrington pic.twitter.com/Iq76fPEUQD — CricTracker (@Cricketracker) October 19, 2021 -
T20 WC 2021: ఆఖరి ఓవర్లో నలుగురు ఔట్.. బౌలర్కు దక్కని హ్యాట్రిక్
T20 World Cup 2021.. టి20 ప్రపంచకప్ క్వాలిఫయర్ పోటీల్లో భాగంగా పపువా న్యూ గినియా, స్కాట్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో స్కాట్లాండ్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో హై డ్రామా నెలకొంది. ఆఖరి ఓవర్లో నలుగురు బ్యాటర్స్ వెనుదిరగడం విశేషం. అయితే బౌలర్కు మాత్రం హ్యాట్రిక్ దక్కలేదు. విషయంలోకి వెళితే.. కాబువా మోరియా వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ రెండో బంతికి తొలుత గ్రీవీస్ ఔటయ్యాడు. ఆ తర్వాత నాలుగో బంతికి లీస్క్ రనౌట్ కాగా.. తర్వాతి బంతికి డేవీ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఇక ఆఖరి బంతికి మార్క్వాట్ క్లీన్బౌల్డ్ కాగా.. ఆఖరి ఓవర్లో నాలుగు వికెట్లు పడ్డప్పటికీ మధ్యలో ఒక రనౌట్ ఉండడంతో బౌలర్కు హ్యాట్రిక్ మిస్సయింది. చదవండి: T20 WC IND Vs PAK: 'మౌకా.. మౌకా'.. కింగ్ కోహ్లి.. బాద్షా బాబర్ ఇక మ్యాచ్లో స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. 26 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన స్కాట్లాండ్ ఇన్నింగ్స్ను మాథ్యూ క్రాస్(45), రిచీ బెరింగ్టన(70) పరుగులతో నిలబెట్టారు. అయితే ఆ తర్వాత వచ్చిన బ్యాటర్స్ పెద్దగా రాణించలేకపోయారు. చదవండి: T20 World Cup 2021: 2 ప్రపంచకప్లలో 2 వేర్వేరు దేశాలు.. చరిత్ర సృష్టించిన నమీబియా క్రికెటర్ -
T20 World Cup 2021: స్కాట్లాండ్కు వరుసగా రెండో విజయం
స్కాట్లాండ్కు వరుసగా రెండో విజయం పపువా న్యూ గినియాతో జరిగిన గ్రూఫ్ బి క్వాలిఫయర్ మ్యాచ్లో స్కాట్లాండ్ 17 పరుగులతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో స్కాట్లాండ్ క్వాలిఫయర్ పోటీల్లో వరుసగా రెండో విజయాన్ని అందుకొని సూపర్ 12 దశ అర్హతకు మరింత దగ్గరైంది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పపువా న్యూ గినియా 20 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌట్ అయింది. నార్మన్ వనూహ 47 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. స్కాట్లాండ్ బౌలర్లలో జోష్ డేవీ 4 వికెట్లతో సత్తా చాటాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. పపువా టార్గెట్ 166.. 17 ఓవర్లలో 124/7 17 ఓవర్ల ఆట ముగిసేసరికి పపువా న్యూ గినియా 7 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. నోర్మన్ వానుహా 43 పరుగులతో ఆడుతున్నాడు. అంతకముందు 18 పరుగులు చేసిన కిప్లిన్ డొర్జియా స్టంప్ అవుట్గా వెనుదిరిగాడు. ఇక ఇన్నింగ్స్ 12వ ఓవర్లో 24 పరుగులు చేసిన సేసి బహు క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. పపువా టార్గెట్ 166.. 10 ఓవర్లలో 61/5 10 ఓవర్ల ఆట ముగిసేసరికి పపువా న్యూ గినియా 5 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. సీసే బహు 23, నోర్మన్ వానుహా 4 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పపువా న్యూ గినియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. 5 ఓవర్ల ఆటముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. అంతకముందు ఇన్నింగ్స్ రెండో ఓవర్ మూడో బంతికి 2 పరుగులు చేసి ఓపెనర్ టోనీ ఉరా ఔటవ్వగా.. ఇన్నింగ్స్ 4వ ఓవర్ మూడో బంతికి మరో ఓపెనర్ లీగా సైకా 9 పరుగులు చేసి వీల్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 20 ఓవర్లలో స్కాట్లాండ్ 165/9.. పపువా టార్గెట్ 166 టి20 ప్రపంచకప్ 2021 క్వాలిఫయర్ పోటీల్లో భాగంగా గ్రూఫ్ బిలో పపువా న్యూ గినియాతో జరుగుతున్న మ్యాచ్లో స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. 26 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన స్కాట్లాండ్ ఇన్నింగ్స్ను మాథ్యూ క్రాస్(45), రిచీ బెరింగ్టన(70) పరుగులతో నిలబెట్టారు. అయితే ఆ తర్వాత వచ్చిన బ్యాటర్స్ పెద్దగా రాణించలేకపోయారు. ఇక ఆఖరి ఓవర్లో స్కాట్లాండ్ నాలుగు వికెట్లు కోల్పోవడం విశేషం. పపువా న్యూ గినియాతో జరుగుతున్న మ్యాచ్లో స్కాట్లాండ్ మూడో వికెట్ కోల్పోయింది. 45 పరుగులు చేసిన మాథ్యూ క్రాస్ సిమోన్ అతాయ్ బౌలింగ్లో చార్లెస్ అమినికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.అయితే ఓపెనర్లిద్దరు వెనుదిరిగిన తర్వాత మాథ్యూ క్రాస్, రిచీ బెరింగ్టన్(48*) ఇన్నింగ్స్ నడిపించారు. మూడో వికెట్కు 88 పరుగులు జోడించారు. ప్రస్తుతం స్కాట్లాండ్ 16 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. 10 ఓవర్లలో స్కాట్లాండ్ 67/2 10 ఓవర్ల ఆట ముగిసేసరికి స్కాట్లాండ్ 2 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. మాథ్యూ క్రాస్ 18, రిచీ బెర్రింగ్టన్ 24 పరుగులతో ఆడుతున్నారు. రెండు వికెట్లు కోల్పోయిన స్కాట్లాండ్.. 5 ఓవర్లలో 33/2 పపువా న్యూ గినియాతో జరుగుతున్న మ్యాచ్లో స్కాట్లాండ్ రెండు వికెట్లు కోల్పోయింది. 5 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది. తొలుత 6 పరుగులు చేసిన కెప్టెన్ కోట్జెర్ పెవిలియన్ చేరగా.. తర్వాతి ఓవర్లో మరో ఓపెనర్ జార్జ్ మున్సీ 15 పరుగులు చేసి వెనుదిరిగాడు. అల్ అమెరాత్: టి20 ప్రపంచకప్-2021 క్వాలిఫయర్స్ పోటీల్లో భాగంగా గ్రూఫ్ బిలో నేడు స్కాట్లాండ్, పపువా న్యూ గినియా మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా టాస్ గెలిచిన స్కాట్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్పై సంచలన విజయం సాధించిన స్కాట్లాండ్ పపువాపై గెలిచి సూపర్ 12 దశకు అర్హత సాధించాలని ఉవ్విళ్లూరుతుంది. పపువా న్యూ గినియా: టోనీ ఉరా, లెగా సియాకా, అస్సద్ వాలా (కెప్టెన్), చార్లెస్ అమిని, సెసే బౌ, సైమన్ అటాయ్, నార్మన్ వనువా, కిప్లిన్ డోరిగా (వికెట్ కీపర్), చాడ్ సోపర్, కబువా మోరియా, నోసైనా పోకానా స్కాట్లాండ్ : జార్జ్ మున్సే, కైల్ కోట్జెర్ (కెప్టెన్), మాథ్యూ క్రాస్ (వికెట్ కీపర్), రిచీ బెర్రింగ్టన్, కాలమ్ మాక్లీడ్, మైఖేల్ లీస్క్, క్రిస్ గ్రీవ్స్, మార్క్ వాట్, జోష్ డేవి, బ్రాడ్లీ వీల్, అలాస్డైర్ ఎవాన్స్ -
T20 World Cup 2021: తొలి వికెట్, తొలి హాఫ్ సెంచరీ.. ఎవరిదో తెలుసా?!
T20 World Cup 2021 Match 1 Interesting Facts: క్రికెట్ ప్రేమికులకు మజాను అందించేందుకు పొట్టి ప్రపంచకప్ టోర్నీ మొదలైపోయింది. ఆదివారం(అక్టోబరు 17) ఒమన్ వేదికగా టీ20 వరల్డ్కప్-2021 తొలి మ్యాచ్ జరిగింది. క్వాలిఫైయర్స్లో భాగంగా(రౌండ్ 1) గ్రూపు-బిలోని ఒమన్- పపువా న్యూగినియా మధ్య మ్యాచ్తో టోర్నీ ఆరంభమైంది. మెగా ఈవెంట్లోని మొదటి మ్యాచ్కు సంబంధించిన ఆసక్తికర విశేషాలు.. టీ20 వరల్డ్కప్-2021: ►టాస్ గెలిచిన జట్టు- ఒమన్ ►తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు- పపువా న్యూగినియా ►తొలి వికెట్- బిలాల్ ఖాన్(ఒమన్)- టోనీ ఉరాను అవుట్ చేశాడు ►తొలి అర్ధ సెంచరీ- అసద్ వాలా(పపువా కెప్టెన్) ►తొలి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్- జీషన్ మక్సూద్(ఒమన్ సారథి) 4/20 in four overs 👏 Zeeshan Maqsood, take a bow 🙇#T20WorldCup | #OMNvPNG | https://t.co/dYPcIueHIP pic.twitter.com/Y3LidFsqdl — T20 World Cup (@T20WorldCup) October 17, 2021 ►తొలి బౌండరీ- చార్లెస్ అమిని(పపువా న్యూగినియా) ►తొలి సిక్సర్-చార్లెస్ అమిని(పపువా న్యూగినియా) What a shot to hit the first six of the ICC Men's #T20WorldCup 💥 Charles Amini, you beauty 👏https://t.co/SoC9rvdqTu — T20 World Cup (@T20WorldCup) October 17, 2021 ►తొలి రనౌట్- చార్లెస్ అమిని(పపువా న్యూగినియా) ►తొలి విజయం సాధించిన జట్టు- ఒమన్ ►అత్యధిక వికెట్లు తీసిన బౌలర్- జీషన్ మక్సూద్(4/20) ►అత్యధిక పరుగులు- జతీందర్ సింగ్(73 నాటౌట్), 7 ఫోర్లు, 4 సిక్సర్లు) Jatinder Singh brings up an explosive half-century 💪#T20WorldCup | #OMNvPNG | https://t.co/dYPcIueHIP pic.twitter.com/ekRVqdiTzz — T20 World Cup (@T20WorldCup) October 17, 2021 A brilliant knock by Aaqib Ilyas as he raises his bat for a fifty ✨#T20WorldCup | #OMNvPNG | https://t.co/dYPcIueHIP pic.twitter.com/Iq1IkSbe5p — T20 World Cup (@T20WorldCup) October 17, 2021 ►పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగిన ఆటగాళ్లు- టోనీ ఉరా(0), లెగా సియాకా(0)(పపువా) ►తొలిసారిగా టీ20 వరల్డ్కప్ టోర్నీకి అర్హత సాధించిన పపువాపై 10 వికెట్ల తేడాతో ఒమన్ విజయం. తుది జట్లు: పపువా న్యూగినియా: టోనీ ఉరా, అసద్ వాలా(కెప్టెన్), చార్లెస్ అమిని, లెగా సియాకా, నార్మన్ వనువా, సెసె బా, సిమన్ అటాయి, కిప్లిన డొరిగా(వికెట్ కీపర్), నొసైనా పొకానా, డామిన్ రవూ, కబువా మోరియా. ఒమన్: జతీందర్ సింగ్, ఖవార్ అలీ, ఆకిబ్ ఇలియాస్, జీషన్ మక్సూద్(కెప్టెన్), నసీం ఖుషి(వికెట్ కీపర్), కశ్యప్ ప్రజాపతి, మహ్మద్ నదీం, అయాన్ ఖాన్, సందీప్ గౌడ్, కలీముల్లా, బిలాల్ ఖాన్ The first wicket of the ICC Men's #T20WorldCup 2021 belonged to Bilal Khan 🔥https://t.co/nA12nCeZkj — T20 World Cup (@T20WorldCup) October 17, 2021 -
T20 WC: కల నెరవేరింది... భావోద్వేగానికి గురైన ఆటగాళ్లు...
PNG cricketers, support staff break down; ప్రపంచ వేదికపై మెరిసే అద్భుత క్షణాల కోసం ఎదురుచూసిన ఆ జట్టుకు ఎట్టకేలకు అవకాశం లభించింది... ఏళ్ల నాటి కల నేటితో నెరవేరింది. అందుకే మెగా టోర్నీలో తమ జాతీయ గీతం వినిపించగానే భావోద్వేగంతో అందరి కళ్లు చెమర్చాయి. క్రికెట్ పండుగ ఐసీసీ టీ20 వరల్డ్కప్ టోర్నీ సందర్భంగా... ఈ ఈవెంట్కు తొలిసారిగా అర్హత సాధించిన పపువా న్యూగినియా జట్టు, సిబ్బంది గురించే ఈ ప్రస్తావన. గ్రూపు-బీలో ఉన్న పపువా న్యూగినియా.. ఆదివారం మొదలైన పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ టోర్నీలో ఆతిథ్య ఒమన్తో మ్యాచ్ ఆడుతోంది. ఈ క్రమంలో తొలుత పపువా జాతీయ గీతాన్ని ప్లే చేశారు. దీంతో... ఆటగాళ్లు, ఇతర సిబ్బంది తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. కాగా ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఒమన్... పపువాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో పపువా న్యూగినియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. కెప్టెన్ అసద్ వాలా(56) టోర్నీలో మొదటి అర్ధ శతకం సాధించడం విశేషం. చదవండి: T20 World Cup 2021 : ఒమన్ జట్టులో హైదరాబాదీ క్రికెటర్.. -
T20 World Cup 2021 : ఒమన్ జట్టులో హైదరాబాదీ క్రికెటర్..
Hyderabad Born Cricketer Sandeep Goud Playing For Oman Cricket Team: టీ20 ప్రపంచకప్-2021కు అర్హత సాధించిన 8 క్వాలిఫయర్స్ జట్లలో ఒకటైన ఒమన్ జట్టులో హైదరాబాద్ బార్న్ క్రికెటర్ చోటు దక్కించుకున్నాడు. నగరంలోని కవాడిగూడకు చెందిన 29 ఏళ్ల శ్రీమంతుల సందీప్ గౌడ్.. 2016లో ఉద్యోగ రిత్యా ఒమన్కు వెళ్లి అక్కడే సెటిల్ అయ్యాడు. ఈ క్రమంలో అక్కడి దేశవాళీ మ్యాచ్ల్లో సత్తా చాటి 2019 ఫిబ్రవరిలో ఒమన్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. బౌలింగ్ ఆల్రౌండర్గా గుర్తింపు తెచ్చుకున్న సందీప్ గౌడ్.. ఇప్పటివరకు 19 వన్డేలు, 15 టీ20లు ఆడాడు. సందీప్ 2005-08 మధ్యలో హైదరాబాద్ అండర్-15, 19 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇదిలా ఉంటే, ఒమన్-పపువా న్యూ గినియా జట్ల మధ్య ఇవాళ ప్రారంభమైన టీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్లో సందీప్ ఒమన్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. చదవండి: 17 ఏళ్ల తర్వాత పాక్లో పర్యటించనున్న టీమిండియా..! -
T20 WC Oman Vs PNG: 10 వికెట్ల తేడాతో ఒమన్ ఘన విజయం
T20 World Cup 2021 Oman vs Papua New Guinea: టీ20 వరల్డ్కప్-2021 టోర్నీలోని ఆరంభ మ్యాచ్లో ఒమన్ విజయం సాధించింది. మెగా ఈవెంట్కు తొలిసారి అర్హత సాధించిన పపువా న్యూగినియాపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు అకిబ్ ఇలియాస్ (50), జితేందర్ సింగ్(73) అద్భుత ఇన్నింగ్స్తో జట్టును విజయతీరాలకు చేర్చారు. ప్రత్యర్థి జట్టు నడ్డి విరిచి వరుస ఓవర్లలో వికెట్లు తీసిన ఒమన్ కెప్టెన్ జీషన్ మక్సూద్(4)ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ►స్కోర్లు: పపువా న్యూగినియా129/9 (20) ఒమన్ 131/0 (13.4) ►ఒమన్ ఓపెనర్లు అర్ధ సెంచరీ దిశగా కొనసాగుతున్నారు. అకిబ్ ఇలియాస్(42), జితేందర్ సింగ్(42) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి ఒమన్ స్కోరు: 88-0. నిలకడగా ఆడుతున్న ఓపెనర్లు ►పపువా న్యూ గినియా విధించిన 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒమన్ ఓపెనర్లు అకిబ్ ఇలియాస్, జితేందర్ సింగ్ మెరుగ్గా ఆడుతున్నారు. ఈ క్రమంలో 5 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేయగలిగింది. A brilliant knock by Aaqib Ilyas as he raises his bat for a fifty ✨#T20WorldCup | #OMNvPNG | https://t.co/dYPcIueHIP pic.twitter.com/Iq1IkSbe5p — T20 World Cup (@T20WorldCup) October 17, 2021 ఒమన్ టార్గెట్ 130 ►టీ20 వరల్డ్కప్-2021 తొలి మ్యాచ్లో ఒమన్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన పపువా న్యూగినియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. ఓపెనర్లు టోని ఉరా, లెగా సియాకా పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినా కెప్టెన్ అసద్ వాలా, చార్లెస్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ప్రపంచ వేదికపై తొలిసారిగా ఆడే అవకాశం దక్కించుకున్న జట్టు కెప్టెన్ అసద్ (56) అర్ధ సెంచరీతో మెరిశాడు. పపువా ఇన్నింగ్స్లో అతడిదే టాప్ స్కోర్. ►పపువా వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోతోంది. కెప్టెన్ అసద్(56) అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన నార్మన్ వనువా(1), ఆ వెంటనే సెసె బా(13)ను ఒమన్ కెప్టెన్ జీషన్ బౌలింగ్లో వెనుదిరిగారు. ఆ తర్వాత కిప్లిన్ డోరిగాను కూడా జీషన్ పెవిలియన్కు చేర్చాడు. దీంతో 16 ఓవర్లలో 113 పరుగులు చేసిన పపువా 7 వికెట్లు కోల్పోయింది. ►కొరకాని కొయ్యగా తయారైన అసద్ వాలాను కలీముల్లా పెవిలియన్కు పంపాడు. అసద్ షాట్ ఆడే క్రమంలో జితేందర్ సింగ్ అద్భుత క్యాచ్ అందుకోవడంతో అతడి ఇన్నింగ్స్కు తెరపడింది. ఇక ప్రత్యర్థి జట్టు కెప్టెన్ను అవుట్ చేసిన తర్వాత ఒమన్ ప్లేయర్ జితేందర్... టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ స్టైల్లో సెలబ్రేట్ చేసుకోవడం విశేషం. ప్రస్తుతం ►పపువా కెప్టెన్ అసద్ వాలా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఒమన్ సారథి జీషన్ బౌలింగ్లో సిక్సర్ బాది ఈ టోర్నీలో మొదటి అర్ధ శతకాన్ని తన పేరిట లిఖించుకున్నాడు. తొలిసారి ఈ మెగా ఈవెంట్లో ఆడే అర్హత సాధించిన పపువా న్యూ గినియాకు మధుర జ్ఞాపకాన్ని మిగిల్చాడు. ►నాలుగు ఫోర్లు, సిక్సర్ బాది 37 పరుగులతో జోరు మీదున్న పపువా బ్యాటర్ అమినీ రనౌట్గా వెనుదిరిగాడు. ఒమన్ బౌలర్ మహ్మద్ నదీం బౌలింగ్లో అసద్ వాలాతో సమన్వయ లోపం కారణంగా వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో పపువా మూడో వికెట కోల్పోయింది. ప్రస్తుతం అసద్ వాలా, సెసె బా క్రీజులో ఉన్నారు. ►ఆరంభంలోనే రెండు వికెట్లు పడ్డా పపువా బ్యాటర్లు అసద్ వాలా, చార్లెస్ అమిని వరుస షాట్లతో అలరిస్తున్నారు. అసద్ 26, అమిని 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. ►ఆతిథ్య ఒమన్ జట్టుకు శుభారంభం లభించింది. తొలి ఓవర్లోనే ఒమన్ బౌలర్ బిలాల్ ఖాన్ వికెట్ పడగొట్టాడు. పపువా ఓపెనర్ టోనీ ఉరాను బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ లెగా సియాకాను కలీముల్లా పెవిలియన్కు పంపాడు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే పపువా రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ అసద్ వాలా, చార్లెస్ అమిని క్రీజులో ఉన్నారు. Updates: పపువా న్యూగినియా జాతీయ గీతాలాపన అనంతరం... ఆతిథ్య ఒమన్ గీతాలాపన. తుది జట్లు: పపువా న్యూగినియా: టోనీ ఉరా, అసద్ వాలా(కెప్టెన్), చార్లెస్ అమిని, లెగా సియాకా, నార్మన్ వనువా, సెసె బా, సిమన్ అటాయి, కిప్లిన డొరిగా(వికెట్ కీపర్), నొసైనా పొకానా, డామిన్ రవూ, కబువా మోరియా. ఒమన్: జితేందర్ సింగ్, ఖవార్ అలీ, ఆకిబ్ ఇలియాస్, జీషన్ మక్సూద్(కెప్టెన్), నసీం ఖుషి(వికెట్ కీపర్), కశ్యప్ ప్రజాపతి, మహ్మద్ నదీం, అయాన్ ఖాన్, సందీప్ గౌడ్, కలీముల్లా, బిలాల్ ఖాన్ మస్కట్: మరో మహా క్రికెట్ సంగ్రామానికి తెర లేచింది. ఐదేళ్ల విరామం తర్వాత ఒమన్ వేదికగా పొట్టి ఫార్మాట్ క్రికెట్ ప్రపంచకప్ టోర్నీ ఆరంభమైంది. గ్రూప్- బీలోని ఆతిథ్య ఒమన్- పపువా న్యూగినియా మధ్య తొలి మ్యాచ్ మొదలుకానుంది. టాస్ గెలిచిన ఒమన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. -
అశ్లీల నృత్యం.. అందాల కిరీటం వెనక్కి
పోర్టు మోర్స్బే: దేశంలో కానీ, సమాజంలో కానీ ఏదైనా విశిష్ట పురస్కారం, అవార్డు వంటివి పొందిన వ్యక్తులు తమ ప్రవర్తన పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. సమాజానికి ఆదర్శంగా నిలవాలి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదు నా ఇష్టం వచ్చినట్లే ఉంటాను అంటే ఈ అందాల సుందరికి పట్టిన గతే పడుతుంది. అందాల పోటీలో కిరీటం సాధించిన ఓ మహిళ అశ్లీల నృత్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలయ్యింది. దాంతో నెటిజనులు సదరు మహిళ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అసలు నీలాంటి దానికి ఇంతటి గౌరవం ఎలా లభించింది’’ అంటూ విమర్శించారు. ‘‘ఆ కిరీటం ధరించడానికి నీవు అనర్హురాలివి’’ అని ట్రోల్ చేశారు. ఈ దుమారం కాస్త పెద్దది కావడంతో షో నిర్వహకులు ఆమె వద్ద నుంచి కిరీటం వెనక్కి తీసుకున్నారు. ఆ వివరాలు.. లూసి మైనో అనే మహిళ(25) 2019లో మిస్ పాపువా న్యూగినియాగా ఎన్నికైంది. ఈ క్రమంలో ఆమె కొద్ది రోజుల క్రితం తన టిక్టాక్ అకౌంట్లో ఓ డ్యాన్స్ వీడియోని షేర్ చేసింది. చాలా అశ్లీలంగా ఉన్న ఈ వీడియో పట్ల నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విపరీతంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. దాంతో మిస్ పసిఫిక్ ఐస్ల్యాండ్స్ పీజంట్ పీఎన్జీ కమిటీ లూసి మైనోకు ప్రదానం చేసిన కిరీటాన్ని వెనక్కి తీసుకుంది. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. ‘‘మా ప్రధాన ఉద్దేశం మహిళా సాధికారిత. మా వేదికది చాలా ప్రత్యేకమైన శైలి. సాంస్కృతిక వారసత్వం, సాంప్రదాయ విలువలు ద్వారా మా దేశం, ఇక్కడి ప్రజల గురించి మిగతా లోకానికి తెలియజేస్తాం. ఇక మేం నిర్వహించే అందాల పోటీల ద్వారా స్వీయ విలువ, సమగ్రత, సామాజిక సేవ, విద్య వంటి అంశాలను ప్రచారం చేస్తాం’’ అని తెలిపారు. ‘‘ఇంత విలువైన అవార్డు సొంతం చేసుకున్న లూసి మైనో ఇలాంటి అశ్లీల డ్యాన్స్ వీడియోని షేర్ చేయడం మమ్మల్ని షాక్కు గురి చేసింది. రోల్మోడల్గా నిలవాల్సిన వ్యక్తి ఇలా ప్రవర్తించడం సరికాదు. అందుకే ఆమెకు ప్రధానం చేసిన కిరీటాన్ని వెనక్కి తీసుకున్నాం’’ అని తెలిపారు. ఇదే పని ఓ మగాడు చేస్తే మేం నవ్వుకునే వాళ్లం. కానీ లూసీ మైనో ఇలా చేయడం మమ్మల్ని నిరాశకు గురి చేసింది అన్నారు. చదవండి: షాకింగ్: అందాల పోటీ విజేతకు వేదిక మీదే ఘోర అవమానం -
7.3 తీవత్రతో భూకంపం, సునామీ హెచ్చరిక
పోర్టు మోర్స్బే: పాపువా న్యూ గినియా ఈశాన్యంలో ఉన్న వావు తీర ప్రాంతంతో సునామీ సంభవించవచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు యూఎస్ పసిఫిక్ సునామీ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం 12:50 గంటలకు అక్కడ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్పై దీని తీవ్రత 7.3 గా నమోదయ్యింది. సునామీ హెచ్చరిక జారీ చేసిన గంట తరువాత ఈ భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. వావు పట్టణం బంగారు మైనింగ్కు ప్రసిద్ధి. ఈ పట్టణంలో 5,000 మంది జనాభా నివసిస్తున్నారు. భూకంపం అనేది అక్కడ సర్వసాధారణమైన విషయమని అక్కడున్నవారు చెబుతున్నారు. చదవండి: భూకంపంలోనూ నడిచే బుల్లెట్ ట్రైన్! -
‘శవాలు కొట్టుకుపోతున్నా ఏం చేయలేకపోయాం’
వెల్లింగ్టన్: దాదాపు నెలరోజుల పాటు పసిఫిక్ మహా సముద్రంలో కొట్టుమిట్టాడిన నలుగురు వ్యక్తులు సురక్షితంగా బయటపడినట్లు స్థానిక మీడియా తెలిపింది. కార్టెరెట్ ఐలాండ్లో క్రిస్మస్ వేడుకలు జరుపుకొనేందుకు మొత్తం 12 మంది వెళ్లగా అందులో ఎనిమిది మంది మృత్యువాత పడినట్లు బుధవారం పేర్కొంది. వివరాలు... పాపువా న్యూ గినియాలోని బౌగన్విల్లే ప్రావిన్స్కు చెందిన ఓ బృందం డిసెంబరు 22న కార్టెరెట్ ఐలాండ్కు వెళ్లారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడగా.. ఏడుగురు మునిగిపోయారు. ఓ చిన్నపాపతో పాటు మరో నలుగురు బోటును గట్టిగా పట్టుకుని వేలాడుతూ.. అందులోని నీళ్లు తొలగించి.. ప్రాణాలతో బయటపడ్డారు. అయితే సరైన ఆహారం లేకపోవడంతో చిన్నపాప మరణించగా.. ఇద్దరు వ్యక్తులు, ఓ మహిళ, పన్నెండేళ్ల బాలిక మాత్రమే మిగిలారు. ఈ క్రమంలో వీరంతా సముద్ర తీరంలో దొరికిన కొబ్బరికాయలు తింటూ.. వర్షపు నీరు తాగుతూ ప్రాణాలు నిలబెట్టుకున్నారు. ఆఖరికి చేపల వేటకు బయల్దేరిన ఓ సమూహం వీరిని గుర్తించి సాయం అందించడంతో సముద్రం నుంచి బయటపడ్డారు. ఈ విషయం గురించి బాధితుడు డొమినిక్ స్టాలీ మాట్లాడుతూ... ‘‘ఎంతో సంతోషంగా బయల్దేరాం. కానీ మా ప్రయాణం విషాదంగా ముగిసింది. బోటు మునిగిపోయినపుడు మృతదేహాలను ఎలా తీసుకురావాలో.. వాటిని ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే అవి కొట్టుకుపోతున్నా పట్టించుకోలేదు. చనిపోయిన వారిలో ఓ జంట కూడా ఉంది. వారి చిన్నారిని కొన్నాళ్లపాటు రక్షించగలిగాం గానీ తర్వాత తను చనిపోయింది. ఎన్నో పడవలు మమ్మల్ని దాటుకుని వెళ్లాయి. కానీ ఎవరూ మమ్మల్ని గుర్తించలేదు. ఆఖరికి వేటకు వచ్చిన కొంతమంది జనవరి 23న మమ్మల్ని బయటకు తీసుకువచ్చారు. హోనియారాలో మమ్మల్ని డ్రాప్ చేయగా.. సమాచారం అందుకున్న అధికారులు పాపువా న్యూ గినియాకు తీసుకువెళ్లారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాం’’ అని చెప్పుకొచ్చాడు. కాగా గతంలో కూడా ఓ వ్యక్తి ఇలాగే మెక్సికో పశ్చిమ తీరంలో దాదాపు 13 నెలల పాటు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. పచ్చి చేపలు, పక్షుల మాంసం, తాబేలు రక్తం, తన ద్రవ విసర్జనాలు తాగి ప్రాణాలు నిలుపుకొన్నాడు. తొలుత అతడి గురించి వచ్చిన కథనాలను అందరూ కొట్టిపారేసినా పాలిగ్రాఫ్ పరీక్షలో అతడు చెప్పినవన్నీ నిజాలని తేలాయి. -
19 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినా..
దుబాయ్: వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే వరల్డ్ టీ20కి పపువా న్యూగినియా క్వాలిఫై అయ్యింది. గ్రూప్-ఏలో భాగంగా ఆదివారం కెన్యాతో జరిగిన మ్యాచ్లో పవువా న్యూగినియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కెన్యాను 18.4 ఓవర్లలో 73 పరుగులకే కుప్పకూల్చి 45 పరుగుల తేడాతో చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పవువా న్యూగినియా 19.3 ఓవర్లలో 113 పరుగులు చేసింది. 19 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ పవువాను నార్మన్ వనువా(54) గట్టెక్కించాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు దిగి హాఫ్ సెంచరీతో మెరిశాడు. దాంతో పవువా గౌరవప్రదమైన స్కోరును సాధించింది.ఆపై 114 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన కెన్యా ఏ దశలోనూ ఆకట్టుకోలేదు. స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోతూ చివరకు పరాజయం చెందింది. దాంతో గ్రూప్-ఎలో రన్రేట్ సాయంతో అగ్రస్థానంలో నిలిచిన పవువా వరల్డ్ టీ20కి అర్హత సాధించింది. ఇదే పవుమాకు తొలి వరల్డ్ టీ20 అర్హత. స్కాట్లాండ్-నెదర్లాండ్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ఆధారంగా పవువా క్వాలిఫై ఆశలు ఆధారపడి ఉన్నప్పటికీ ఆ జట్టు విశేషంగా రాణించడంతో నెట్ రన్రేట్ ఆధారంగా వరల్డ్ టీ20లో అడుగుపెట్టడం విశేషం. నెదర్లాండ్స్ 12.3 ఓవర్లలో 130 పరుగుల లక్ష్యాన్ని సాధించినా ఆ జట్టు కంటే పవుమా మెరుగైన్ రన్రేట్తో ముందంజ వేసింది. -
పపువా న్యూగినియాలో భారీ భూకంపం
పోర్ట్ మోర్స్బై : సరిగ్గా ఓ వారం రోజుల గడిచాయో లేదో పపువా న్యూగినియా దేశంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.5గా నమోదైంది. మంగళవారం రాబౌల్ నగరంలో ఈ భూకంపం చోటు చేసుకుంది. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం సునామీ వచ్చే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు కూడా జారీ చేసింది. న్యూ బ్రిటెయిన్ ప్రాంతంలోని పపువా న్యూగినియా దీవిలో తూర్పు రాబౌల్కి 50 కిలో మీటర్ల దూరంలో ఈ భూకంపం కేంద్రీకృతమై ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే విభాగం పేర్కొంది. అయితే, భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని ఆ దేశ అధికార వర్గాలు వెల్లడించాయి. గత మంగళవారం వచ్చిన భూకంప తీవ్రత కన్నా.. ఈ సారి సంభవించిన భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. అలాగే భూకంప ప్రభావానికి సంబంధించి ఇప్పటి వరకు తమకు పూర్తి సమాచారం లేదని, పరిస్థితిని ఇంకా అంచనా వేస్తున్నామని రాబౌల్ పోలీస్ స్టేషన్ కమాండర్ తెలిపారు. -
పపువా న్యూగినియాలో భారీ భూకంపం
పోర్ట్ మోర్స్బై: పపువా న్యూగినియా దేశంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.2గా నమోదైంది. బులాలో నగరానికి 33 కిలోమీటర్లు, రాజధాని పోర్ట్ మోర్స్బైకి 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే విభాగం పేర్కొంది. అయితే, భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని ఆ దేశ అధికార వర్గాలు పేర్కొన్నాయి. అలాగే భూకంప ప్రభావంతో సునామీ వచ్చే అవకాశాలు లేవని తెలిపాయి. భూకంప ప్రభావానికి సంబంధించి ఇప్పటి వరకు తమకు పూర్తి సమాచారం లేదని, పరిస్థితిని ఇంకా అంచనా వేస్తున్నామని బులాలో పోలీస్ స్టేషన్ కమాండర్ లియో కైకాస్ వెల్లడించారు. టేబుల్స్ పైనుంచి వస్తువులు కిందపడటం వంటి చిన్న సంఘటనలు తప్ప పెద్దగా ఎలాంటి నష్టం సంభవించలేదని బులాలో పైన్ లాడ్జి హోటల్ సిబ్బంది చెప్పారని పేర్కొన్నారు. యూఎన్ డేటా ప్రకారం భూకంప కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో దాదాపు 1,10,000 మంది ప్రజలు నివసిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. -
పపువా న్యూగినియాలో భూకంపం
పోర్ట్ మోరెస్బీ : పపువా న్యూగినియాను భూకంపం కుదిపేసింది. రిక్కర్ స్కేల్పై 7.2 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. బులాలో నగరానికి 33 కిలోమీటర్లు, రాజధాని పోర్ట్ మోరెస్బీకి 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొంది. భారీ స్థాయి భూకంపం వచ్చినప్పటికీ పపువా న్యూగినియాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు. భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశాలు లేవని ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ మెట్రోలజీ స్పష్టం చేసింది. -
టోనీ ఉరా వన్ మ్యాన్ షో
హరారే: వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా మంగళవారం ఇక్కడ ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో పపువా న్యూ గునియా ఆటగాడు టోనీ ఉరా వన్ మ్యాన్ షోతో అదరగొట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గునియా 50 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌట్ కాగా, ఓపెనర్ టోనీ ఉరా 151 పరుగులతో దుమ్ములేపాడు. 142 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో చెలరేగి ఆడాడు. ఫలితంగా పపువా న్యూ గునియా గౌరవప్రదమైన స్కోరును సాధించింది. అయితే అంతర్జాతీయ వన్డేల్లో ఒక జట్టు పూర్తిగా ఇన్నింగ్స్ ఆడి చేసిన స్కోరులో అత్యధిక శాతం వ్యక్తిగత పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో టోనీ నాల్గో స్థానంలో నిలిచి కొత్త అధ్యాయం లిఖించాడు. ఈ మ్యాచ్లో టోనీ ఉరా పరుగుల శాతం 64.3 శాతంగా నమోదైంది. అంతకుముందు వివియన్ రిచర్డ్స్ ( 189 నాటౌట్, వెస్టిండీస్, 1984లో ఇంగ్లండ్పై వన్డేలో) 69.5 శాతం పరుగులు సాధించి తొలి స్థానంలో కొనసాగుతుండగా, కపిల్ దేవ్(175 నాటౌట్, భారత్, 1983లో జింబాబ్వేపై వన్డేలో) 65.8 శాతం పరుగులు సాధించి రెండో స్థానంలో ఉన్నాడు. ఇక రోహిత్ శర్మ(264, భారత్, 2014లో శ్రీలంకపై వన్డేలో) 65.3 శాతంతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. -
భారత్ మరో ఘన విజయం
-
మెరిసిన అనుకుల్.. భారత్ ఘన విజయం
భారత యువ ఆటగాళ్లు మరోసారి అదరగొట్టారు. న్యూజిలాండ్లో జరుగుతున్నఅండర్ -19 ప్రపంచకప్లో మరో విజయాన్ని అందుకున్నారు. రెండు రోజుల క్రితం పేస్ బౌలింగ్తో ఆస్ట్రేలియా వెన్ను విరిచిన యువ బౌలర్లు, మరోసారి చెలరేగిపోయారు. క్రికెట్లో పసికూన పాపువా న్యూ గినియాను ఈసారి స్పిన్తో తిప్పేశారు. అటు బంతితో, ఇటు బ్యాట్తో రాణించి వరుసగా రెండో విజయాన్ని అందుకున్నారు. ఫలితంగా పృథ్వీ షా నేతృత్వంలోని యువ జట్టు అండర్ 19 ప్రపంచకప్లో వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. టాస్ గెలిచి భారత్.. పాపువా న్యూ గినియాను ముందుగా బ్యాటింగ్కు ఆహ్వానించింది. భారత బౌలింగ్ ముందు ప్రత్యర్థి జట్టు తేలిపోయింది. ఏదశలోను పోటి ఇవ్వలేక పోయింది. యువ ఆటగాడు, ఆల్రౌండర్ అనుకుల్ రాయ్ మెరవడంతో అతి తక్కువ పరుగులకే చాపచుట్టేసింది. కేవలం 21.5 ఓవర్లలో 64పరుగులకే ఆలౌటైంది. 6.5 ఓవర్లు వేసిన రాయ్ తన బౌలింగ్తో న్యూగినియాకు ముచ్చెమటలు పట్టించాడు. కేవలం 14 పరుగులు ఇచ్చి 5 వికెట్లను తన ఖాతాలోవేసుకున్నాడు. ఇందులో రెండు ఓవర్లు మెయిడెన్లు కూడా ఉన్నాయి. శివం మవి రెండు వికెట్లు పడగొట్టగా, కమలేశ్ నగర్కోటి, అర్షదీప్సింగ్ చెరో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ స్వల్పలక్ష్యాన్ని అలవోకగా చేధించింది. కెప్టెన్ పృథ్వీ షా అర్ద సెంచరీతో చెలరేగాడు. 39 బంతుల్లో 57 పరుగులు చేసి భారత్ను గెలిపించాడు. మరో బ్యాట్మెన్ మంజోత్ కర్లా 9 బంతుల్లో 9 పరుగులు చేసి పృథ్వీ షా కు సహకారం అందించాడు. ఇద్దరు కలిసి విజయానికి కావాల్సిన పరుగులను కేవలం 8 ఓవర్లలోనే బాదేశారు. -
అండర్-19 లో అనుకుల్ రాయ్ సంచలనం
న్యూజిలాండ్లో జరగుతున్న అండర్ -19 ప్రపంచకప్లో భారతయువ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. రెండు రోజుల క్రితం పేస్ బౌలింగ్తో ఆష్ట్రేలియా వెన్ను విరిచిన యువ బౌలర్లు మరోసారి చెలరేగిపోయారు. క్రికెట్లో పసికూన పాపువా న్యూ గినియాను ఈసారి స్పిన్తో తిప్పేశారు. ఆల్ రౌండర్గా ఎదుగుతున్న యువకెరటం అనుకుల్ రాయ్ తన బౌలింగ్తో పాపువా న్యూ గినియా నడ్డి విరిచారు. అండర్ 19 ప్రపంచకప్లో పాపువా న్యూ గినియాతో జరుగుతున్న రెండో మ్యాచ్లో యువ ఆటగాడు అనుకుల్ రాయ్ మెరిశాడు. బ్యాటింగ్లో రాణించే అనుకుల్ రాయ్ ఈసారి బంతితో ప్రత్యర్థి జట్టును కోలుకోలేని దెబ్బకొట్టాడు. రాయ్ దెబ్బకు న్యూగినియా 21.5 ఓవర్లలో 64పరుగులకే చాప చుట్టేసింది. 6.5 ఓవర్లు వేసిన రాయ్ 14 పరుగులు ఇచ్చి 5 వికెట్లను తన ఖాతాలోవేసుకున్నాడు. ఇందులో రెండు ఓవర్లు మెయిడెన్లు కూడా ఉన్నాయి. శివం మవి రెండు వికెట్లు పడగొట్టగా, కమలేశ్ నగర్కోటి, అర్షదీప్సింగ్ చెరో వికెట్ తీశారు. -
అమెరికాలో పైసా ఇవ్వరు
వివిధ దేశాల్లో ప్రసూతి సెలవుల తీరుతెన్నులు మన దేశంలో ప్రసూతి సెలవులను 26 వారాలకు పెంచి 18 లక్షల మంది ఉద్యోగినులకు కేంద్ర ప్రభుత్వం ప్రయోజనం కలిగించింది. బిడ్డల సంరక్షణకు తగినంత సమయం ఇచ్చింది. ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లో ప్రసూతి సెలవులు ఎన్ని వారాలు ఇస్తున్నారు? ఈ సమయంలో ఎంత శాతం వేతనం చెల్లిస్తారనే అంశాలను పరిశీలిస్తే ఆశ్చర్యకర, ఆసక్తికర అంశాలున్నాయి. ప్రపంచానికే పెద్దన్నగా చెప్పుకొనే అమెరికాలో ఈ సెలవులు మరీ దారుణం. అక్కడ 12 వారాలు సెలవు తీసుకోవచ్చుగాని జీతం అసలు రాదు. ఇలా వేతనం లేకుండా ప్రసూతి సెలవులిచ్చే దేశాలు ప్రపంచంలో మూడే ఉన్నాయి.. అవి, అమెరికా, లైబీరియా, పపువా న్యూగినియా. వేతనంతో కూడిన సెలవుల విషయంలో నార్వే తొలి స్థానంలో ఉండగా, పనివేళల్లో వెసులుబాటు, సెలవులను తల్లిదండ్రులు పంచుకొనే సౌలభ్యం తదితరాల్లో స్వీడన్ అగ్రస్థానంలో ఉంది. ⇒ స్వీడన్ లో తల్లిదండ్రులిద్దరికీ కలిపి ఇచ్చే 480 రోజుల సెలవులను బిడ్డకు ఎనిమిదేళ్లు నిండేలోపు ఎప్పుడైనా వాడుకోవచ్చు. పిల్లల సంరక్షణ కోసం పనిగంటలను 25 శాతం తగ్గించుకునే వెసులుబాటూ ఉంది. అయితే ఎన్ని గంటలు పనిచేశామో అంత కాలానికే వేతనం ఇస్తారు. ⇒ ఫ్రాన్స్ లో తల్లి అయిన ఉద్యోగిని ప్రసూతి సెలవుల అనంతరం రెండున్నరేళ్ల వేతనం లేని ఫ్యామిలీ సెలవు తీసుకోవచ్చు. ⇒ తండ్రికి కూడా పిల్లల పెంపకంలో భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతో పురుషులు సెలవు తీసుకోవడాన్ని కొన్ని దేశాలు తప్పనిసరి చేశాయి. ⇒ దత్తత తీసుకున్న దంపతులకు, స్వలింగ దంపతులకు ఫ్రాన్స్ , యూకే, కెనడా, స్వీడన్ లు ప్రసూతి సెలవుల ప్రయోజనాలు కల్పిస్తున్నాయి. -
పపువా న్యూ గునియాలో భూకంపం
టరోన్: పపువా న్యూ గునియా తీర ప్రాంతంలో శనివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైనట్టు అమెరికా భూవిజ్ఞాన పరిశీలన సంస్థ (యూఎస్జీఎస్) వెల్లడించింది. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం లేదు. బోగైన్విల్లె ద్వీపానికి దక్షిణప్రాంతంలో 120 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. సునామీ వచ్చే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. -
భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక
పోర్ట్ మోర్స్బై: పపువా న్యూ గినియా తీర ప్రాంతంలో ఆదివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8గా నమోదైంది. సునామీ వచ్చే అవకాశముందని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం ప్రకటించింది. పన్గున ఐలాండ్లో, బౌగన్విల్లే ఐలాండ్లో కొన్ని ప్రాంతాల్లో న్యూగినియాకు పశ్చిమాన 40 కిలోమీటర్ల దూరంలో భూ ప్రకంపనలు చోటుచేసున్నాయి. పపువా న్యూ గునియా తీరంలో, సోలమన్ ఐలాండ్, నౌరు, కోస్రే, వనౌతు, ఇండోనేషియాలపై ఈ భూకంప ప్రభావం ఉంటుందని అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు చెబుతున్నారు. ఆస్ట్రేలియాకు మాత్రం ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. 95.5 మైళ్లు లోతున సముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. రింగ్ ఆఫ్ ఫైర్ జోన్లో ఈ దీవులు ఉండటంతో తరచుగా ఇక్కడ భూకంపాలు సంభవిస్తాయన్న విషయం తెలిసిందే. జియోలాజికల్ సర్వే సునామీ వార్నింగ్తో న్యూ గినియా అధికారులు అప్రమత్తమయ్యారు. చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. -
పపువా న్యూ గునియాలో భారీ భూకంపం
టరోన్: పపువా న్యూ గునియా తీర ప్రాంతంలో శనివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8గా నమోదైంది. సునామీ వచ్చే అవకాశముందని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. పపువాలోని టరోన్కు తూర్పున 46 కిలో మీటర్ల దూరంలో, 103 కిలో మీటర్ల లోతున సముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. పపువా న్యూ గునియా సమీప ప్రాంతాల్లో సునామీ రావచ్చని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం అప్రమత్తం చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. -
పపువా న్యూగినియాలో భారీ భూకంపం
పపువా న్యూగినియా: పపువా న్యూగినియాలో భారీ భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూ ప్రకంపనలు వ్యాపించాయి. రాబౌల్ ప్రాంతంపై ఈ భూకంపం ప్రకంపం ప్రభావం పడినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు తెలియజేశారు. అయితే, నష్టానికి సంబంధించిన వివారాలు ఇంకా తెలియాల్సి ఉంది. గత మే నెలలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంబంధించి మొత్తం దీవిని వణికించిన విషయం తెలిసిందే. -
పాపువా న్యూగినియా లో భారీ భూకంపం
సిడ్నీ: పాపువా న్యూ గినియాలో మంగళవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఉదయం 5.38 నిమిషాల సమయంలో అడ్మిరాల్టీ ఐ ల్యాండ్స్ కేంద్రంగా 6.3 తీవత్రతో భూకంపం వచ్చినట్లు యూఎస్ శాస్త్రజ్ఞులు తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టాల వివరాలు ఇంకా తెలియరాలేదు. భూకంపం కారణంగా ఎలాంటి సునామీ సంభవించే అవకాశం లేదని హవాయిలోని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ తెలిపింది. అడ్మిరాల్టీ ఐల్యాండ్స్ లో భూకంపాలు సంభవించడం సర్వసాధారణం. ద్వీపం చుట్టూ వున్న దాదాపు 4,000 కిలోమీటర్ల పొడవైన తీరరేఖ కారణంగా టెక్టోనిక్ ప్లేట్ల మధ్య సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. దాంతో ద్వీపంలో భూకంపాలు తరచూ సంభవిస్తుంటాయి. -
కూలిన విమానం : 12 మంది మృతి
పోర్ట్ మారెస్బి : పవువా న్యూగినియాలో తేలికపాటి విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. పవువా న్యూగినియా పశ్చిమ ప్రావిన్స్లోని కింగ్నా ఎయిర్ పోర్టులో సదరు విమానం రన్ వేపై దిగుతున్న క్రమంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఆస్ట్రేలియా వాసి కూడా ఉన్నాడని ఆ దేశ విదేశీ వ్యవహారాలు, వాణిజ్య విభాగం స్పష్టం చేసింది. అతడు పవువా న్యూగినియాకు చెందిన సన్ బర్డ్ ఏవియేషన్లో విధులు నిర్వహిస్తున్నాడని పేర్కొంది.ఈ ప్రమాదానికి ముందు విమానంలోని ఇంజన్ పాడైందని.. ఈ నేపథ్యంలో ఈ విమానం కుప్పకూలిందని స్థానిక మీడియా వెల్లడించింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని పేర్కొంది. ఈ విమాన దుర్ఘటన బుధవారం మధ్యాహ్నం 3.00 గంటలకు చోటు చేసుకుంది. -
70శాతం మహిళలపై అత్యాచారం!
పపువా న్యూగినియా: పపువా న్యూగినియాలో 'లిలి జో' అనే మహిళకు నలుగురు పిల్లలు. ఆమె గత ఏడాది ప్రారంభం నుంచి జైలులో ఉంటోంది. తన ఏడాది కుమారుడు కూడా తనతోపాటే ఉన్నాడు. ఇంతకీ ఆమె ఏదైనా నేరం చేసిందా అంటే అదేంకాదు. మరి నేరం చేయనప్పుడు కావాలని జైలులో.. ఆ చీకటి గదిలో ఎందుకు ఉంటోందని అనుకుంటున్నారా.. అందుకు ప్రధాన కారణం అక్కడ మహిళలకు ఏ మాత్రం భద్రత లేకపోవడమే. ఎక్కడ ఉన్నా తనపై ఏదో ఒకరకమైన దాడి తప్పదని భావించిన జో.. తన ఏడాది కుమారుడితోపాటు జైలు అధికారులను బ్రతిమిలాడుకొని పోర్ట్ మోరెస్బీ అనే జైలులో ఉంటోంది. సాధారణంగా రక్షణకోసం ఎన్నో రకాల మార్గాలు ఉన్నా వాటిపై నమ్మకం లేక ఒక మహిళ ఏకంగా జైలు ఆశ్రయం కోరాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఆ దేశంలో మహిళల దుర్భర స్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పపువా న్యూగినియా పసిఫిక్ తీరాన ఉన్న ఓ చిన్న ద్వీపం. ఆస్ట్రేలియాకు 100 మైళ్ల దూరంలో ఉంది. సాధారణంగానే ఎక్కువ ఎజెన్సీ ప్రాంతాన్ని కలిగి ఉండటంతోపాటు గిరిజన జనాభాను కూడా అధికంగా కలిగిన ఈ దేశం ఇప్పుడు ఓ ముఖ్య విషయం కారణంగా వార్తల్లో నిలుస్తోంది. అదే మహిళలపై అత్యాచారాల ఘటనల అంశంతో.. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 70శాతం మంది మహిళలు తమ జీవిత కాలంలో లైంగిక దాడులకు, భౌతిక దాడులకు గురవుతున్నారని అక్కడి తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. దాదాపు 50శాతం మంది మహిళలు తమ వివాహ సమయానికంటే ముందే ఈ ఆకృత్యాలకు బలవుతున్నారని కూడా ఆ అధ్యయనం వెల్లడించింది. కాగా, వీరిపై ఈ అరాచకాలకు పాల్పడేవారు 40శాతం మంది పురుషులు వివాహం అయినవారేనని కూడా ఆ నివేదిక తెలిపింది. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఈ ద్వీపం గురించి 'ప్రపంచంలోనే ఈ ద్వీపం మహిళలకు అత్యంత అపాయకరమైనది' అని వెల్లడించింది. ఈ ద్వీపంలోని జనాభాలో 70శాతం మంది అంటే దాదాపు 70 లక్షల మంది మహిళలు తమ జీవిత కాలంలో అత్యాచారానికో, శారీరక హింసలకు గురైన వారే ఉన్నారని పేర్కొంది. మహిళలను ఎంత దారుణంగా హింసించేవారంటే అందరూ చూస్తుండగా వివస్త్రను చేసి ఈడ్చి కొడుతుండేవారు. ఇలాంటి దృశ్యాలను చూపించే వీడియోలు, ఫొటోలు ఇప్పటికే కోకొల్లలుగా ఉన్నాయి. మహిళలపై అసలు ఈ ఆకృత్యాలు ఎందుకు జరుగుతున్నాయని పరిశీలిస్తే.. లైంగిక, భౌతిక దాడులకు పాల్పడే పురుషుల నుంచి రక్షించేందుకు ఎలాంటి రక్షణ వ్యవస్థ లేకపోవడం ఒక కారణమైతే, నిరక్షరాస్యత, మౌడ్యం, మూర్ఖత్వం, పురుషత్వ అహంకారం కూడా ఇక్కడ ప్రజ్వరిల్లుతోంది. అంతేకాకుండా నిత్యం పేదరికంతో సతమతమవుతున్న ఈ ద్వీపంలో ఆస్పత్రులకు, వైద్య సేవలకు కావాల్సిన నిధులు అందడం లేదు. అంతేకాకుండా కఠిన చట్టాలు కూడా లేకపోవడం మరొక కారణం. 1971లో ఆ ప్రాంతంలో తీసుకొచ్చిన ఓ చట్టం కూడా అక్కడ మహిళలను వేధించేందుకు అనుకూలంగా ఉంది. -
'పపువా న్యూ గినియాలో భూకంపం'
పపువా న్యూగినియా: పసిపిక్ తీర ప్రాంతం పపువా న్యూగినియాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. రాబౌల్ నగరానికి ఆగ్నేయంగా 169 కిలోమీటర్ల దూరంలో 49 కిలో మీటర్ల లోతులో ఇది సంభవించిందని, ఆ నగరానికి ప్రకంపనలు వ్యాపించాయని చెప్పారు. ఆస్తి, ప్రాణనష్టంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. -
పుపువా న్యూగినియాలో భూకంపం
సిడ్నీ: పుపువా న్యూగినియాలో ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.7గా నమోదు అయిందని యూఎస్ జియోలాజిస్టులు వెల్లడించారు. భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం కానీ లేదని తెలిపారు. పుపువా న్యూగినియా, టారన్ నైరుతి ప్రాంతంలో 58 కిలో మీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం గుర్తించినట్లు చెప్పారు. సునామీ వచ్చే సూచనలు కూడా ఏమీ లేవన్నారు. ఈ మేరకు యూఎస్ జియోలాజిస్టులు తమ వెబ్సైట్లో వెల్లడించారు. -
న్యూగినియాలో మరోసారి భూకంపం
సిడ్నీ: పపువా న్యూగినియాలో మరోసారి భూకంపం సంభవించింది. ఈ భూప్రకంపనల తీవ్రత 7.0గా నమోదు అయ్యింది. దీని ప్రభావంతో అక్కడి సముద్ర తీరం ప్రకంపనలతో వణికిపోయింది. అలలతో పోటెత్తింది. కాగా ఆస్తినష్టం, ప్రాణనష్టంపై ఎలాంటి సమాచారం లేదు. మే 1వ తేదీన కూడా న్యూగినియాలో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. -
న్యూ గినియాలో భారీ భూకంపం
-
న్యూ గినియాలో భారీ భూకంపం
న్యూయార్క్: పపువా న్యూ గినియా తీరంలో మంగళవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.5 గా నమోదైంది. దక్షిణ పసిఫిక్ ద్వీపం న్యూ గినియాలో కొకొపో పట్టణానికి దక్షిణాదిన 139 కిలో మీటర్ల దూరంలో 60 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. భూకంప కేంద్రం నుంచి 300 కిలో మీటర్ల దూరంలో సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సివుంది. -
అండమాన్, పపువా న్యూగినియాల్లో భూకంపాలు
అండమాన్ నికోబార్ దీవుల్లోను, పపువా న్యూగినియాలోను శుక్రవారం భూకంపాలు వచ్చాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదు కాగా, పపువా న్యూగినియాలో 7.1 తీవ్రతతో వచ్చింది. పోర్ట్బ్లెయిర్కు 135 కిలోమీటర్ల ఆగ్నేయ దిశలో అండమాన్ భూకంప కేంద్రం ఉందని తెలిసింది. మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో ఈ భూకంపం వచ్చినట్లు భారత వాతావరణ శాఖ అధికారి ఒకరు చెప్పారు. భూమికి 10 కిలోమీటర్ల లోతున ఇది వచ్చినట్లు తెలిపారు. అయితే, దీనివల్ల ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం సంభవించినట్లు మాత్రం సమాచారం లేదు. ఇక పపువా న్యూగినియాలో 7.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. కొకోపో నగరానికి ఆగ్నేయంగా 110 కిలోమీటర్ల దూరంలో దీని కేంద్రం ఉంది. ఇదే ప్రాంతంలో 6.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే దీనివల్ల సునామీ ముప్పు మాత్రం ఏమీ లేదని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. అలాగే ఆస్తినష్టం, ప్రాణనష్టం కూడా ఏమీ లేవు. -
న్యూగినియాలో భారీ భూకంపం
సిడ్నీ: పాప్వా న్యూగినియాలో భారీ భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో అక్కడి సముద్ర తీరం ప్రకంపనలతో వణికిపోయింది. అలలతో పోటెత్తింది. వెయ్యికిలోమీటర్ల దూరంలో దీని కేంద్రం ఉన్నట్లు గుర్తించామని అమెరికా భూకంప తీవ్రత అంచనా అధికారులు తెలిపారు. సునామీ వచ్చే అవకాశాలు కూడా మెండుగా ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం కారణంగా 65 కిలో మీటర్లలోతునుంచి ప్రకంపనలు వ్యాపించాయని, తీరప్రాంతానికి 54 కిలోమీటర్ల మేర ప్రభావం చూపినట్లు అధికారులు వెల్లడించారు.