ponnavolu sudhakar reddy
-
మీరు ట్రైలర్ చూపిస్తే.. మేం సినిమా చూపిస్తాం
-
Sudhakar Reddy: మీరు ట్రైలర్ చూపిస్తే..మేం సినిమా చూపిస్తాం
-
ఏపీ పోలీసులకి పొన్నవోలు సీరియస్ వార్నింగ్..
-
పోసానికి ఈనెల 26 వరకు రిమాండ్ విధింపు
-
పోసాని లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ
అమరావతి, సాక్షి: నటుడు పోసాని కృష్ణమురళి తరఫున వైఎస్సార్సీపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై మరికాసేపట్లో ఏపీ హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. పోసానిపై ఏపీ సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి (లీగల్ వ్యవహారాలు), మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్వయంగా వాదనలు వినిపించనున్నారు. ఈ పిటిషన్ విచారణ కంటే ముందే.. కర్నూలు జైలు నుంచి సీఐడీ పోలీసులు పోసానిని గుంటూరుకు తరలిస్తుండడం గమనార్హం. పోసానిపై దాఖలైన అన్ని కేసుల్లోనూ కస్టడీ పిటిషన్లను తిరస్కరించిన న్యాయస్థానాలు.. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఊరట ఇచ్చాయి. అంతేకాదు.. పలు జిల్లాలో దాఖలైన కేసులనూ హైకోర్టు క్వాష్ చేసింది. ఈ తరుణంలో ఈ ఉదయం ఆయన కర్నూలు జైలు నుంచి విడుదల అవుతారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా.. ఏపీ సీఐడీ తెర మీదకు వచ్చింది. ఐదు నెలల కిందట దాఖలైన కేసును పట్టుకుని గుంటూరు కోర్టు నుంచి పీటీ వారెంట్ పొందింది. ఈ ఉదయం కర్నూల్ జిల్లా జైలుకు పీటీ వారెంట్తో చేరుకుంది. ఇది పోసానిని బయటకు రాకుండా చేసే కుట్రేనని పేర్కొన్న వైఎస్సార్సీపీ.. హైకోర్టులో సదరు పీటీ వారెంట్ను సవాల్ చేసింది. -
పోసానికి 14 రోజుల రిమాండ్
సాక్షి, రాయచోటి/రైల్వేకోడూరు అర్బన్/రాజంపేట రూరల్ : సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళికి అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. గురువారం రాత్రి 9 గంటలకు పోలీసులు కృష్ణ మురళిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. పదేళ్ల క్రితం నంది అవార్డును తిరస్కరిస్తూ పోసాని చేసిన వ్యాఖ్యలపై స్థానిక జనసేన నేత ఫిర్యాదు మేరకు ఆయనపై అక్రమ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోసాని తరఫున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లను ప్రస్తావిస్తూ, ఈ సెక్షన్లు ఆయనకు వర్తించవని వివరించారు. సంబంధం లేని సెక్షన్లతో పాటు అనవసర సెక్షన్లు పెట్టారని వాదించారు. ప్రభుత్వ న్యాయవాదులు కూడా ఈ కేసుకు సంబం«ధించి తమ వాదనలు వినిపించారు. దాదాపు 9.30 గంటలకు ప్రారంభమైన వాదనలు తెల్లవారుజాము వరకు కొనసాగాయి. ఈ పరిణామాలపై కోర్టు బయట పోసాని అభిమానులతోపాటు వైఎస్సార్సీపీ నేతల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఇరుపక్షాల వాదనలు ఆలకించిన మెజిస్ట్రేట్ సాయితేజ్.. తెల్లవారుజామున పోసానికి 14 రోజుల రిమాండును విధించారు. అనంతరం పోసానిని రైల్వేకోడూరు సీఐ పి.వెంకటేశ్వర్లు, ఓబులవారిపల్లి ఎస్ఐ పి.మహేష్నాయుడులు తమ సిబ్బందితో ఉదయం 7.52 గంటలకు నేరుగా రాజంపేట సబ్ జైలు వద్దకు తీసుకొచ్చారు. జైలులో ఆయనకు 2261 నంబరు కేటాయించారు. ఇదే సమయంలో జిల్లా జైళ్ల శాఖ ఉప అధికారి హుస్సేన్రెడ్డి ఈ జైల్ను సందర్శించారు. న్యాయ పోరాటం చేస్తాం : పొన్నవోలుపోసానికి రిమాండు విధించిన అనంతరం కోర్టు నుంచి బయటికి వచ్చిన పొన్నవోలు మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అన్నివేళలా అందుబాటులో ఉంటామని చెప్పారు. అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలన్నారు. ఆయన వెంట మాజీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర నేత జల్లా సుదర్శన్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ నాగిరెడ్డి తదితరులు ఉన్నారు.బెయిల్ కోసం దరఖాస్తుపోసాని కృష్ణ మురళీకు బెయిల్ కోసం రైల్వేకోడూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయవాది నాజ్జాల మధు పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో సోమవారం వాదనలు వినిపించనున్నారు. రైల్వేకోడూరు రూరల్ సీఐ వెంకటేశ్వర్లు, ఓబులవారిపల్లి ఎస్ఐ మహేష్లు పోసాని విచారణ నిమిత్తం కస్టడీ కోసం కోర్టులో పిటిషన్ వేశారు. ఇదిలా ఉండగా పోసాని కృష్ణ మురళి ఆరోగ్యం క్షీణించిందని ఆయన స్నేహితులు లింగంగుట్ల సల్మాన్రాజ్, షేక్ నాగూర్ బాషా ఆందోళన వ్యక్తం చేశారు. రాజంపేట సబ్ జైల్లో శుక్రవారం ములాఖత్ సమయంలో వారు పోసానిని కలిశారు. అనంతరం సబ్ జైల్ వద్ద మీడియాతో మాట్లాడుతూ గంటల కొద్దీ ప్రయాణం చేయటం వల్ల పోసాని అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు. రెండు రోజులుగా విశ్రాంతి లేకపోవడంతో ఆరోగ్యం మరింత క్షీణించిందన్నారు. పోసాని కడుపు నొప్పి, విరేచనాలతో బాధ పడుతున్నారని తెలిపారు. తాము టాబ్లెట్లు ఇవ్వబోగా.. తమ డాక్టర్ ఉన్నారని జైలర్ అభ్యంతరం తెలిపారన్నారు.పోసానిపై 111 సెక్షన్ తొలగింపురాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై అక్రమంగా 15కు పైగా కేసులు బనాయించారని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు పాటూరు భరత్కుమార్రెడ్డి తెలిపారు. పోసాని మీద 111, ఆర్/డబ్ల్యూ3(5) ఆఫ్ బీఎన్ఎస్, 196, 35(2), ఐటీ 67 యాక్ట్–2023 ప్రకారం అక్రమ కేసులు బనాయించారని చెప్పారు. ఈ రిమాండ్ అక్రమమని, దీనికి ఈ సెక్షన్లు ఏ మాత్రం వర్తించవని కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. సుదీర్ఘ వాదనల అనంతరం కోర్టు డిఫెన్స్ వాదనలతో ఏకీభవించి 111 బీఎన్ఎస్ అనేది తీవ్రమైన సెక్షన్ అని భావించి, అది ఈ కేసులో వర్తించదని తొలగించిందని తెలిపారు. 111 సెక్షన్ మినహా మిగిలిన సెక్షన్లు అన్నీ బెయిలబుల్ అఫెన్స్ మాత్రమేనన్నారు. ఈ కేసులే కాకుండా ఇంకా చాలా కేసులు ఉండటం వల్ల కోర్టు రిమాండ్ విధించిందన్నారు. -
ప్రశ్నించే గొంతులను అణచివేయడమే చంద్రబాబు సర్కార్ లక్ష్యం
-
పోసాని కేసులో ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్: పొన్నవోలు
సాక్షి, అన్నమయ్య జిల్లా: ‘పోసాని కృష్ణమురళి కేసులో ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్.. సెక్షన్లు 111, 67 వర్తించవని రైల్వే కోడూరు కోర్టు చెప్పింది.. అయినప్పటికీ పోసానికి రిమాండ్ విధించటం సరికాదు‘‘ అని మాజీ ఏఏజీ, సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులకు రిమాండ్ విధించకూడదు. కోర్టు ధిక్కారణ కింది హైకోర్టు లో కేసు వేస్తాం’’ అని పొన్నవోలు పేర్కొన్నారు.‘‘పోసాని కృష్ణమురళి పై రాష్ట్ర వ్యాప్తంగా 16 కేసులు నమోదు చేశారు. ప్రశ్నించే గొంతులను అణచివేయటమే చంద్రబాబు సర్కార్ లక్ష్యం. వైఎస్ జగన్ ఆదేశాలతో న్యాయ పోరాటం కొనసాగిస్తాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ధైర్యం గా ఉండాలి’’ అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు.కాగా, పోసాని కృష్ణమురళికి న్యాయస్థానం మార్చి 13 వరకు (14 రోజులు) రిమాండ్ విధించింది. పోసానిని రాజంపేట సబ్జైలుకు తరలించారు. పోసాని తరపున పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. బీఎస్ఎన్ 111 యాక్ట్నమోదు చేయడంపై పొన్నవోలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్డనైజ్డ్ క్రైమ్స్ చేసే వారికి మాత్రమే వర్తిస్తుందని పొన్నవోలు వాదించారు.రాత్రి 9 గంటల నుంచి కోర్టులోనే పోసాని కృష్ణమురళి ఉన్నారు. రాత్రి 9.20 గంటలకు కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. రాత్రి నుంచి సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. సుమారు 8 గంటల పాటు ఇరుపక్షాల మధ్య వాదనలు సాగాయి. ఉదయం 5 గంటల వరకు వాదనలు సాగాయి. అంతకు ముందు ఓబువారి పల్లె పీఎస్లో 9 గంటల పాటు పోసాని విచారణ సాగింది. ఎస్పీ విద్యాసాగర్ పోసానిని స్వయంగా విచారించారు.ఇదీ చదవండి: కూటమి సర్కార్ వికటాట్టహాసంరెడ్బుక్ రాజ్యాంగమే పరమావధిగా బరితెగింపురెడ్బుక్ రాజ్యాంగమే పరమావధిగా రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం బరితెగించింది. సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై కక్ష సాధించడం కోసం నిబంధనలకు తిలోదకాలు వదిలింది. తమను అడిగే వారే లేరని, ఎవరైనా ప్రశ్నిస్తే అంతు చూసేదాకా వదలమన్నట్లు వ్యవహరిస్తోంది. పోలీసులను అడ్డం పెట్టుకుని కక్ష సాధింపుకు పాల్పడుతోంది. ఎప్పుడో పదేళ్ల కిందట నంది అవార్డును తిరస్కరిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడెవరో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం.ఈ క్రమంలో బుధవారం రాత్రి 8.45 గంటలకు హైదరాబాద్ గచ్చి»ౌలిలోని ఆయన నివాసంలోకి అన్నమయ్య జిల్లా సంబేపల్లె ఎస్ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలోని పోలీసు బృందం అక్రమంగా చొచ్చుకెళ్లి, అదుపులోకి తీసుకున్నది మొదలు.. గురువారం మధ్యాహ్నం సుమారు 12 గంటల వరకు ఎక్కడెక్కడో తిప్పుతూ భయభ్రాంతులకు గురి చేసింది. 15 గంటల తర్వాత ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్కు తీసుకొచ్చింది. అప్పటి వరకు ఆయన్ను ఎక్కడ ఉంచారో, ఎవరి వద్దకు తీసుకెళ్లారో బయటకు పొక్కకుండా సస్పెన్స్ కొనసాగించింది.జనసేన పార్టీ నేత జోగినేని మణి చేసిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్లో పోసానిపై క్రైం నంబరు 65/2025, అండర్ 196, 353(2), 111 ఆర్/డబ్ల్యూ 3(5) ఆఫ్ ది బీఎన్ఎస్ యాక్టు–2023 కింద కేసు నమోదైతే సంబేపల్లె ఎస్ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో బృందాన్ని పంపడం సందేహాలకు తావిస్తోంది. మహా శివరాత్రి పండుగ రోజు అని కూడా చూడకుండా పైశాచికంగా వ్యవహరించారు.ఎన్నికల అనంతరం రాజకీయాలకు స్వస్తి చెప్పి, ఏ పార్టీతో సంబంధం లేకుండా కొనసాగుతున్నానని చెప్పినప్పటికీ వినకుండా, అదే రోజు రాత్రికి రాత్రే జిల్లాకు తీసుకు వచ్చిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. పైగా నోటీసులో 27వ తేదీ వేసి, 26వ తేదీన అదుపులోకి తీసుకోవడం పట్ల న్యాయవాద వర్గాలు విస్తుపోతున్నాయి. -
Ponnavolu Sudhakar Reddy: పోసానిపై 111 సెక్షన్ కేసు దుర్మార్గం..
-
‘పోరాడేందుకు వైఎస్ జగన్ స్ఫూర్తినిచ్చారు’
ఢిల్లీ: టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్, దేవినేని అవినాష్ సహా 24 మందికి సుప్రీంకోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఈరోజు(మంగళవారం) విచారణలో భాగంగా పలువురు వైఎస్సార్ సీపీ నాయకులకు ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది. విచారణ జరిపిన జస్టిస్ సుధాంశు దులియా ధర్మాసనం.. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.అనంతరం వైఎస్సార్ సీపీ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ తన కార్యకర్తలని, నాయకుల్ని కాపాడుకుంటున్నారు. టీడీపీ గెలిచిన నాటి నుంచి ఫ్రధాన ప్రతిపక్షానికి చెందిన నాయకులను వెంటాడి వేటాడి హింసిస్తున్నారు. మూడేళ్ల క్రితం జరిగిన దాడి.. ఇప్పుడు కొత్త కేసులు పెట్టి 128 మందిని ముద్దాయిలను చేసి హింసిస్తున్నారు. టిడిపి కార్యాలయం, చంద్రబాబు నివాసం పై దాడి కేసుల్లో సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ప్రతి ఒక్కరిని కాపాడుకుంటాం, ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదు. దేవినేని అవినాష్, జోగి రమేష్ లతో పాటు పలువురికి ముందస్తు బెయిల్ వచ్చింది. మన కార్యకర్తలు, నాయకులు కోసం పోరాడాలని వైఎస్ జగన్ ఆదేశించారు. పోరాడేందుకు వైఎస్ జగన్ స్ఫూర్తినిచ్చారు. ఇందుకు ప్రతీ వైఎస్సార్సీపీ కార్యకర్త, నాయకులు గర్వించాలి. ఎవరికి బెయిల్ రాకుండా, ప్రభుత్వం తరఫున న్యాయవాదులు చివరి వరకు ప్రయత్నం చేశారు. పోలీసుల విచారణకు మా నాయకులు హాజరై సహకరిస్తారు’ అని పొన్నవోలు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ నేతలకు ఊరట -
వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ పై పొన్నవోలు కామెంట్స్..
-
తాడిపత్రిలో ఇంత దారుణమా..
-
మార్గదర్శి కేసులను నీరుగారుస్తున్నారు: పొన్నవోలు
-
‘మార్గదర్శి’ కేసులు నీరుగారుస్తున్నారు: పొన్నవోలు సుధాకర్రెడ్డి
సాక్షి,హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ విచ్చిన్నం జరుగుతోందని, ప్రభుత్వమే రాజ్య హింసకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ పొన్నవోలు సుధాకర్రెడ్డి విమర్శించారు. ఈ మేరకు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో పొన్నవోలు శనివారం(ఫిబ్రవరి15) మీడియాతో మాట్లాడారు. ‘ఆంధ్ర ప్రదేశ్ను రావణ కాష్టంలా ప్రభుత్వం మారుస్తోంది.వైఎస్సార్సీపీ సానుభూతి పరుల ఆస్తులను ధ్వంసం చేశారు.ప్రజలపై దాడులు చేస్తే నో పోలీస్ అన్నట్లుగా ఉంది. మాచర్లలో దాడులు చేస్తే ఊళ్ళు కాలి చేసి పోతున్నారు .వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకుంటున్నారు. పోలీసులే మేం ఏమీ చేయలేమంటున్నారు.మీడియా ముసుగులో మాఫియాలా తయారవుతున్నారు.ఏపీలో ఏడు నెలలుగా ప్రాథమిక హక్కులు ఎక్కడ పోయాయి. ఆంధ్ర ప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కాదు.. ప్రభుత్వమే దాడులు చేస్తోంది.దాడులపై కమిషన్ను అపాయింట్ చేయాలి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేనిని కక్ష పూరితంగా కేసులో ఇరికించారు .2023లో సత్య వర్ధన్ను విచారిస్తే కులం పరంగా నన్ను తిట్టలేదు అని కోర్టులోనే చెప్పాడు. విశాఖలో బందువుల ఇంట్లో ఉంటే సత్య వర్ధన్ తమ్ముడిని బలవంతంగా రప్పించి అతని వద్ద తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారు. ప్రభుత్వం చట్టాలను అవహేళన చేస్తోంది. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యేను నియోజక వర్గంలో కాలు పెడితే చంపేస్తాం అని పబ్లిక్గా ఓ ఎమ్మెల్యే కామెంట్ చేస్తే చర్యలేవి.మాజీ ఎమ్మెల్యేకే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి’అని పొన్నవోలు ప్రశ్నించారు.మార్గదర్శి కేసులను చంద్రబాబు ప్రభుత్వం నీరుగారుస్తోంది..రాష్ట్రంలోనే అతిపెద్ద ఆర్థికనేరానికి పాల్పడిన 'మార్గదర్శి చిట్స్, మార్గదర్శి ఫైనాన్షియల్స్' కేసులను చంద్రబాబు ప్రభుత్వం నీరుగారుస్తోందని పొన్నవోలు ఆరోపించారు. ఈనాడు సంస్థలకు చెందిన మీడియా మాఫియా అండ కోసం చంద్రబాబు ప్రభుత్వం ఈ ఆర్థిక నేరాల నుంచి మార్గదర్శికి విముక్తి కల్పించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోందన్నారు. 2006 లోనే దాదాపు రూ.2610 కోట్ల రూపాయలను మార్గదర్శి సంస్థ ప్రజల నుంచి చట్ట వ్యతిరేకంగా డిపాజిట్ల రూపంలో సేకరించిందన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ధారించిన కేసు నుంచి మార్గదర్శిని బయటపడేసేందుకు చంద్రబాబు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారన్నారు.‘ఈనాడు పత్రిక వ్యవస్థాపకుడు చెరుకూరి రామోజీరావుకు మార్గదర్శి చిట్ ఫండ్స్, మార్గదర్శి ఫైనాన్షియల్స్ అనే రెండు సంస్థలు ఉన్నాయి. వీటి ద్వారా ఆనాడు రామోజీరావు ప్రజల నుంచి రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్దంగా, చట్ట వ్యతిరేకంగా వేల కోట్ల రూపాయలు డిపాజిట్ల రూపంలో సేకరించారు. ఈ విషయాన్ని అప్పటి పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ బయటపెట్టారు. రామోజీరావు పాల్పడిన ఈ ఆర్థిక నేరంపై ప్రజల నుంచి ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంక్ కు అందిన ఫిర్యాదుల నేపథ్యంలో వీటిపై కేసులు నమోదయ్యాయి. 2006 లెక్కల ప్రకారం రామోజీరావు తన మార్గదర్శి సంస్థల ద్వారా 2.75 లక్షల మంది నుంచి రూ.2610 కోట్ల రూపాయలను డిపాజిట్లుగా సేకరించారు. రిజర్వ్ బ్యాంక్ 1984 చట్టం ప్రకారం బ్యాంకులు మాత్రమే డిపాజిట్లు సేకరించాలి. ఇతర ఏ సంస్థలు సేకరించినా అది నేరం. పత్రికను నడుపుతూ ఆర్థిక నేరాల గురించి నిత్యం పత్రికల్లో కథనాలు రాయించే రామోజీరావు తాను అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తున్న విషయం తెలిసే చట్టాలను ఉల్లంఘించారు. తన చేతిలో మీడియా ఉంది, తనను ఎవరూ ప్రశ్నించలేరు, ఎవరైనా తన అక్రమాలను ప్రశ్నిస్తే వారిపై తన మీడియా మాఫియాను ప్రయోగిస్తాననే ధీమాతో రామోజీరావు వ్యవహరించారు. మార్గదర్శి సంస్థలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దీనిపై విచారణకు సీఐడీని ఆదేశిస్తూ 2006లో జీఓలు 800, 801 జారీ చేశారు. తరువాత సిఐడీ అధికారులు విచారణ జరిపి రామోజీ ఆర్థిక నేరాలపై కోర్టుకు చార్జిషీట్ సమర్పించారు. తరువాత ప్రభుత్వాలు మారడం, తిరిగి రామోజీరావు తన మీడియా మాఫియాతో పాలకులను ప్రభావితం చేసే స్థాయిలో తన ఆర్థిక నేరాల నుంచి బయటపడేందుకు పావులు కదిపారు.రాష్ట్ర విభజన తరువాత 31.12.2018 నాడు ఏపీ ఉమ్మడి హైకోర్ట్ ఆఖరి పనిదినం రోజున రామోజీ ఆర్థిక నేరాలకు సంబంధించిన మార్గదర్శి కేసులో ఫిర్యాదుదారికి నోటీసులు లేకుండా, ఎటువంటి వాదనలు వినకుండా, రిజర్వ్ బ్యాంక్, ఏపీ ప్రభుత్వాన్ని పార్టీ చేయకుండా గుట్టుచప్పుడు కాకుండా కేసును రామోజీరావు క్వాష్ చేయించుకోవడం జరిగింది. ఈ విషయం కాస్త ఆలస్యంగా తెలుసుకున్న ఫిర్యాదుదారు ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్ట్ కు వెళ్ళి క్వాష్ పిటీషన్ ను కొట్టేయించారు. తిరిగి ఈ కేసును విచారించాలని తెలంగాణ కోర్ట్ ను సుప్రీంకోర్ట్ ఆదేశించింది. విచారణలో ఉన్న ఈ కేసులో రామోజీరావు కుమారుడు చెరుకూరి కిరణ్ తానే హిందూ అవిభక్త కుటుంబానికి కర్తను అని ఇంప్లీడ్ పిటీషన్ వేశారు. ఇటీవల రామోజీరావు చనిపోయాడు కాబట్టి కేసును కొట్టేయాలని రామోజీరావు తరుఫు న్యాయవాదులు తాజాగా కోర్ట్ లో కొత్త వాదనను తీసుకువచ్చారు. దీనిపై ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం నుంచి సీఐడీ కనీసం అప్పీల్ కూడా చేయకుండా మార్గదర్శి కేసు కొట్టేసేందుకు సహకరిస్తున్నారు. అంటే గత అయిదేళ్ల పాటు వైయస్ జగన్ ప్రభుత్వంపై నిత్యం ఈనాడు పత్రికను అడ్డం పెట్టుకని దుష్ర్పచారం చేయించినందుకు గానూ చంద్రబాబు ఈనాడు సంస్థలకు చెందిన మార్గదర్శికి అనుకూలంగా క్విడ్ ప్రో కో కింద సహకరిస్తున్నాడు’అని పొన్నవోలు ఆరోపించారు.మార్గదర్శి సంస్థలో అనేక ఆర్థిక అక్రమాలు..‘మార్గదర్శి చిట్స్ లో జిల్లాలో సేకరించిన అమౌంట్లు హెడ్ ఆఫీస్ కు పంపడం చిట్స్ చట్టం ప్రకారం నేరం. జిల్లాల్లో సేకరించిన డబ్బులో కొందరు మధ్యలో చిట్స్ నిలిపివేస్తే, వాటిని మార్గదర్శి ఖాతాలో వేసుకుని, వారి ఆస్తులుగా చూపించారు. మార్గదర్శి బ్యాలెన్స్ షీట్ లో ఆస్తులు, అప్పులను సక్రమంగా చూపలేదు. ప్రజల సొమ్మును అక్రమంగా తీసుకుని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులుగా పెట్టారు. రూ.2610 కోట్లు డిపాజిట్లుగా చూపి, దానిలో 1300 కోట్లు నష్టాలుగా చూపించారు. ప్రజల డబ్బు చీటీల రూపంలో తమ వద్ద పెడితే, దానిని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టి సగానికి పైగా నష్టాలు వచ్చినట్లు చూపారు. ఇవ్వన్నీ సీఐడీ విచారణలో కూడా వెలుగుచూశాయి. వైయస్ఆర్ ప్రభుత్వంలో రంగాచారి కమిటీని నియమించింది. దీనిని ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివ్వకుండా అడ్డుకున్నారు. మార్గదర్శిపై విచారణ జరిపిన సీఐడీ అధికారులపై వ్యక్తిగత దాడిగా ఈనాడు పత్రికలో బుదరచల్లే రాతలు రాస్తూ వారిని భయపెడుతున్నారు. సీఎం చంద్రబాబు అండతో వారికి పోస్టింగ్ లు ఇవ్వకపోవడం, బదిలీలు చేయించడం చేస్తున్నారు. ఈనాడు గ్రూప్ కు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలపై పార్లమెంట్లో ప్రశ్నించిన వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కుటుంబంపై ఈనాడు పత్రిక దుర్మార్గమైన తప్పుడు రాతలతో వేధిస్తోంది. జేజే రెడ్డి మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభకుల్లో ఒకరైతే, ఆయనను శంకగిరి మాన్యాలు పట్టించి, వారి ఆస్తులు గుంజుకుని, దేశం నుంచి పరారయ్యేలా చేశారు. మీడియా మాఫియాగా చీకటి వ్యాపారాలకు పాల్పడుతూ, అధికార తెలుగుదేశం పార్టీతో అంటకాగుతూ, ప్రజల్లో తమకు వ్యతికులపై విషప్రచారానికి దిగుతున్నారు. ప్రభుత్వాలు తమ చెప్పుచేతల్లో ఉంటాయని, మేం తలుచుకుంటే ఏ ప్రభుత్వాన్ని అయినా గద్దె దించుతామనే అహంకారంతో ఉన్నారు’ అని పొన్నవోలు విమర్శించారు. -
Ponnavolu: పోలీసులపై సెక్షన్ 163, 166
-
వారిపై సెక్షన్ 111 వర్తించదు: పొన్నవోలు
-
సోషల్ మీడియా యాక్టివిస్టులపై సెక్షన్ 111 వర్తించదు: పొన్నవోలు
సాక్షి, ఢిల్లీ: ఏపీలో వైఎస్సార్సీపీ శ్రేణులను కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వేధిస్తోందన్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి (లీగల్ వ్యవహారాలు) పొన్నవోలు సుధాకర్. వైఎస్సార్సీపీ శ్రేణులపై పోలీసులు సంబంధంలేని సెక్షన్లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై పెట్టిన 111 సెక్షన్ వర్తించదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియా కార్యకర్తలకు ఈరోజు శుభదినం. ప్రతీ కార్యకర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశించారు. సజ్జల భార్గవ రెడ్డి మీద పిటిషన్ వేశాం. నెల రోజుల నుంచి ఏపీలో ఫ్యాసిస్ట్ ప్రభుత్వ కోరల్లో చిక్కుకుని సోషల్ మీడియా కార్యకర్తలు నలిగిపోతున్నారు.జూలై 1, 2024కు ముందు జరిగిన ఘటనలకు సెక్షన్ 111 వర్తించదు. ఈ సెక్షన్ 111ను టీడీపీ దుర్వినియోగం చేసింది. సెక్షన్ 111 పెట్టాలంటే ముద్దాయిపై రెండు ఛార్జ్షీట్లు ఉండాలి. అలా కాకుండా రెండు ఛార్జ్ షీట్లు లేకుండానే సెక్షన్ 111 పెడుతున్నారు. ఇది టీడీపీ ప్రభుత్వం ఫ్యాసిస్ట్ ప్రభుత్వం చేసిన పని. సోషల్ మీడియా కార్యకర్తలు ఈ చట్టం కిందకి రారు. కొన్ని వేల మందిపై అక్రమంగా కేసులు పెట్టారు. సజ్జల భార్గవకు అరెస్టు నుంచి రెండు వారాల రక్షణ కల్పించారు. ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకునే అవకాశం సుప్రీంకోర్టు ఇచ్చింది. ఘోరమైన నేరాలకు పాల్పడే వారికి ఇది 111 వర్తింపజేయాలని శాసన కర్తల ఉద్దేశం. ఈ ఉద్దేశాలకు వ్యతిరేకంగా అక్రమ కేసులు పెడుతున్నారు. ఒకే ఘటనపై మల్టిపుల్ ఎఫ్ఐఆర్లు పెట్టొద్దని గతంలోనే సుప్రీంకోర్టు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. సుప్రీంతీర్పు ఉల్లంఘిస్తే అధికారులు కూడా శిక్షకు అర్హులే అంటూ కామెంట్స్ చేశారు. -
పోలీసులపై పొన్నవోలు ఫైర్
-
ఏపీలో అరాచక పాలన నడుస్తోంది : పొన్నవోలు
-
‘‘న్యాయదేవత మీద ఒట్టు.. ఎమర్జెన్సీ టైంలోనూ ఇంత ఆరాచకం నడవలేదు’’
గుంటూరు, సాక్షి: ఏపీలో కూటమి ప్రభుత్వం వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని, ప్రభుత్వ దమనకాండను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి (లీగల్ వ్యవహారాలు) పొన్నవోలు సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు సోషల్ మీడియా వ్యవస్థను నాశనం చేశారని మండిపడ్డారు. సుధారాణి దంపతుల అరెస్టుపైనా ప్రభుత్వాన్ని నిలదీసిన పొన్నవోలు.. వాళ్లు ఏమైనా ఉగ్రవాదులా? అని ప్రశ్నించారు. న్యాయదేవత మీద ఒట్టేసి చెబుతున్నా.. ఏపీలో దుర్మార్గపు పాలన కొనసాగుతోంది. ఎమర్జెన్సీ సమయంలోనూ ఇంత అరాచకం నడవలేదని అన్నారాయన. -
చట్టవ్యతిరేకంగా పనిచేసిన ఏ పోలీసునూ వదిలేది లేదు
-
‘ఎన్ని కేసులు పెట్టినా భయపడం.. ప్రతి కార్యకర్తనూ కాపాడుకుంటాం’
సాక్షి, విజయవాడ: సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు కొనసాగుతున్నాయి. పెండ్యాల గ్రామంలో వాట్సప్ గ్రూపులోని 170 మందికి ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రూపులో చర్చించుకుంటున్నారంటూ కేసులు నమోదు చేస్తున్నారు. పీఎస్కి పిలిపించి కంచికచర్ల పోలీసులు రోజూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నట్లు సమాచారం. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన బాధితులకు లీగల్ సెల్ అండగా నిలిచింది.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, వందల మంది సోషల్ మీడియా కార్యకర్తలపై కక్షకట్టి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఏ కార్యకర్త మీద అక్రమంగా నిర్బంధించినా పార్టీ కేంద్ర కార్యాలయం వెంటనే స్పందిస్తుందన్నారు. బాధితులు పార్టీ దృష్టికి తీసుకు రావటానికి టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయాలని.. అక్రమ కేసులు వేసిన పోలీసులపై తీవ్ర చర్యలు తీసుకునేలా పార్టీ చూసుకుంటుందన్నారు.పూర్తి న్యాయ సహకారం పార్టీనే అందిస్తుందని.. జైహింద్ అన్న వైఎస్సార్సీపీ కార్యకర్తని నందిగామలో ఎమ్మెల్యే ఇంటికి తీసుకు వెళ్ళి మోకాళ్ల మీద కూర్చో పెట్టారని.. ఇదేనా ప్రజాస్వామ్యం?. చట్టవ్యతిరేకంగా పనిచేసిన ఏ పోలీసునూ వదిలేది లేదు. ప్రతి కార్యకర్తనూ కాపాడుకుంటాం’’ అని పొన్నవోలు తెలిపారు.అరాచకాలను ప్రశ్నిస్తే.. అక్రమ కేసులా: అంబటి రాంబాబుగుంటూరు: వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో కలిసి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, నగర అధ్యక్షుడు వనమా వజ్రబాబు.. నగరంపాలెం, అరండల్పేట పోలీస్ స్టేషన్కు వెళ్లారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు పోలీసులు అరెస్ట్ చేసిన ఇంటూరి రవి కిరణ్, మేకా వెంకటరామిరెడ్డిని పరామర్శించారు.అనంతరం మీడియాతో అంబటి రాంబాబు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్నారు. గత ప్రభుత్వంలో పోస్టులు పెట్టారని ఇప్పుడు రవికిరణ్ని, వెంకటరామిరెడ్డిని అరెస్టు చేయడం దారుణమన్నారు. సోషల్ మీడియా కేసుల్లో 41 నోటీస్ ఇవ్వాలని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయన్నారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతినిధులపై కూడా టీడీపీ నేతలు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులపై లోకేష్ పవన్ కల్యాణ్ పోలీసులపైన ఒత్తిడి తెచ్చి కేసులు పెట్టిస్తున్నారని.. ఎన్ని కేసులు పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు భయపడరన్నారు. పథకాలు ఎందుకు అమలు చేయలేదని సోషల్ మీడియాలో అడిగినా కూడా కేసులు పెడుతున్నారని అంబటి మండిపడ్డారు.మా మహిళా నాయకురాలు విడదల రజినిపై దారుణంగా అసభ్యకరంగా టీడీపీ నాయకులు పోస్టులు పెట్టారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై ఇంతవరకు డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై పోస్టులు పెడితే పోలీసులు ఆనందమా?. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తే ఇబ్బంది పడతారు. డీజీపీ పొలిటికల్ విమర్శలు మానుకోవాలి. డీజీపీకి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదు చేసినా న్యాయం జరుగుతుందనే నమ్మకం మాకు లేదు’’ అని అంబటి రాంబాబు చెప్పారు. -
కేసులు నీరుగార్చే కుట్ర
ఈ కేసులకు సంబంధించి సీఎం చంద్రబాబు ఎదుట ప్రదర్శించేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎలా రూపొందించాలో దర్యాప్తు అధికారులకు కొందరు సీనియర్ ఉన్నతాధికారులు నిర్దేశించారు. ప్రధాన నిందితుడికి తనపై ఉన్న కేసులకు సంబంధించిన దర్యాప్తు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం దేశంలో ఇదే తొలిసారి. ఆ కేసులను ఎప్పటిలోగా నీరుగార్చాలో దర్యాప్తు అధికారులకు గడువు కూడా విధించారు.ఇప్పటికే స్కిల్ స్కామ్లో దర్యాప్తును ముమ్మరం చేసిన ఈడీ.. చంద్రబాబుతోపాటు ఆయన మంత్రివర్గ సహచరుల పాత్రపై దర్యాప్తు మొదలు పెట్టాల్సి ఉంది. ఈ కీలక తరుణంలో ఈ కేసులకు సంబంధించిన కీలక రికార్డులు చంద్రబాబుతోపాటు ఇతర నిందితులకు అందుబాటులో ఉన్నాయి. దాంతో రికార్డులను తారుమారు చేసే అవకాశం ఉంది. – ఆధారాలు, న్యాయపరమైన అంశాలతో డీజీపీకి పొన్నవోలు లేఖ ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ప్రస్తుత ప్రభుత్వంలో నలుగురు మంత్రులు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వారిపై అవినీతి నిరోధక చట్టం కింద దర్యాప్తునకు అనుమతించాలని గవర్నర్ను కోరే ప్రతిపాదన పెండింగ్లో ఉంది. ఆ ప్రతిపాదనను మంత్రివర్గం అజెండాలో చేర్చే సాహసం అధికారులు చేయగలరా? అలాంటప్పుడు వారి అవినీతిపై దర్యాప్తు ఎలా ముందుకు సాగుతుంది?– ఆధారాలు, న్యాయపరమైన అంశాలతో డీజీపీకి పొన్నవోలు లేఖసాక్షి, అమరావతి: ‘ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న అవినీతి కేసులను నీరుగార్చేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో యథేచ్ఛగా సాగించిన కుంభకోణాలపై నమోదైన ఏడు కేసుల నుంచి ఆయన పేరు తొలగించేందుకు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు..’ అని మాజీ అదనపు అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి... డీజీపీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు దృష్టికి తెచ్చారు. ‘ప్రభుత్వ ఒత్తిడితో ప్రస్తుత పోలీస్, సీఐడీ ఉన్నతాధికారులు ఆ కేసుల విచారణలో న్యాయస్థానానికి సహాయ నిరాకరణ చేస్తున్నారు. చార్జ్షీట్లను న్యాయస్థానానికి పునఃసమర్పించకుండా ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతున్నారు. తద్వారా కేసుల దర్యాప్తు సాగకుండా అడ్డుకుంటున్నారు’ అని వెల్లడించారు. ‘చంద్రబాబుపై అవినీతి కేసులకు సంబంధించి దర్యాప్తు అధికారులను వేధిస్తున్నారు. అప్పటి సీఐడీ అదనపు డీజీ సంజయ్, సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇన్చార్జ్ కె.రఘురామ్రెడ్డిని హఠాత్తుగా బదిలీ చేసి ఎక్కడా పోస్టింగులు ఇవ్వకుండా జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు నిందితులుగా ఉన్న ఈ కేసుల విచారణను సీబీఐకి అప్పగించాలని అభ్యర్థిస్తూ ఓ సామాజిక కార్యకర్త హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని కూడా పొన్నవోలు తన లేఖలో ప్రస్తావించారు. ఈ మేరకు డీజీపీకి ఆయన లేఖ రాశారు. కేసుల దర్యాప్తులో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ న్యాయస్థానానికి పూర్తిగా సహకరించాలని... దర్యాప్తు అధికారులకు రక్షణగా నిలవాలని అందులో డీజీపీని కోరారు. పూర్తి ఆధారాలతో, న్యాయపరమైన అంశాలను ఉటంకిస్తూ డీజీపీకి రాసిన లేఖలో ప్రధానాంశాలు ఇవీ..చంద్రబాబు పేరు తొలగించే కుట్ర.. ఉన్నతాధికారులకు బెదిరింపులురాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కేసు సహా దర్యాప్తులో ఉన్న ఏడు కేసుల్లో నిందితుల జాబితా నుంచి ప్రధాన నిందితుడు చంద్రబాబు పేరు తొలగించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది. అందుకోసం సీఐడీ, పోలీసు ఉన్నతాధికారులను తీవ్రంగా ఒత్తిడి చేస్తోంది. ఆ కేసుల తుది దర్యాప్తు నివేదికను న్యాయస్థానానికి సమర్పించే ముందు నిందితుల జాబితా నుంచి చంద్రబాబు పేరు తొలగించాల్సిందేనని దర్యాప్తు అధికారులను ఒత్తిడి చేస్తూ బెదిరిస్తోంది. దర్యాప్తు నివేదికలను తారుమారు చేయాల్సిందేనని అధికారులను వేధిస్తున్నారు. తద్వారా ప్రధాన నిందితుడైన చంద్రబాబును ఈ కేసుల నుంచి సులువుగా బయటపడేయవచ్చన్నది అసలు ఉద్దేశం. సాక్షులుగా న్యాయస్థానం ఎదుట 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇచ్చిన అధికారులపై ఈ కేసులను నెట్టేయాలని కుట్ర పన్నింది.చార్జిషీట్లను తొక్కిపెట్టారుచంద్రబాబుపై ఉన్న కేసులను నీరుగార్చేందుకు ప్రభుత్వం మరో కుట్రకు పాల్పడింది. స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్రోడ్ అలైన్మెంట్, ఫైబర్ నెట్, అసైన్డ్ భూముల కుంభకోణం కేసులకు సంబంధించిన చార్జిషీట్లను సీఐడీ గతంలోనే న్యాయస్థానానికి సమర్పించింది. దీనిపై కొంత వివరణ కోరుతూ న్యాయస్థానం వాటిని ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య సీఐడీకి పంపింది. అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఆ అంశాలకు సంబంధించి కేస్ స్టడీలతో వివరాలను సీఐడీ అధికారులకు నివేదించారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత ఆ కేసులను నీరుగార్చేలా సీఐడీపై ఒత్తిడి చేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే. ఆ చార్జ్షీట్లను ఈ రోజు వరకూ న్యాయస్థానానికి సమర్పించలేదు. ఆ కేసుల దర్యాప్తును పూర్తి చేసేందుకు ఎలాంటి ప్రయత్నం కూడా చేయడం లేదు. టీడీపీ ప్రధాన కార్యాలయానికి నిధులుఏడు కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన నిధులు అక్రమ మార్గంలో టీడీపీ ప్రధాన కార్యాలయానికి చెందిన బ్యాంకు ఖాతాలకు చేరాయని సీఐడీ అధికారులు ఇప్పటికే ఆధారాలతో సహా గుర్తించారు. కానీ ఆ కేసుల దర్యాప్తునకు టీడీపీ ప్రధాన కార్యాలయం సహకరించడం లేదని సీఐడీ న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. అంటే ఈ కేసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోందన్నది సుస్పష్టం. ప్రస్తుతం చంద్రబాబు సీఎంగా ఉండటంతో ఆ కేసుల దర్యాప్తు ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారు. దర్యాప్తు అధికారులను వేధిస్తున్నారుఆ ఏడు కేసుల దర్యాప్తు వేర్వేరు దశల్లో ఉంది. ఆ కేసులను దర్యాప్తు చేస్తున్న సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కార్యాలయాన్ని 2024 జూన్ నుంచి ఆగస్టు 14 వరకు మూసివేశారు. డీజీపీ ఆదేశాలతో సిట్ అధికారులు ఆ కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆ కేసులను దర్యాప్తు చేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారులు అదనపు డీజీ (సీఐడీ) ఎన్.సంజయ్, సిట్ ఇన్చార్జ్గా ఉన్న ఐజీ కె.రఘురామ్రెడ్డిని హఠాత్తుగా బదిలీ చేశారు. వారికి ఎక్కడా పోస్టింగులు ఇవ్వకుండా, జీతాలు చెల్లించకుండా ప్రభుత్వం వేధిస్తోంది. నిందితులుగా చంద్రబాబు, మంత్రులు.. అందుకే కేసులు నీరుగార్చే కుట్రఈ ఏడు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. సాధారణ పరిపాలన శాఖ, శాంతి–భద్రతల శాఖలను స్వయంగా నిర్వహిస్తున్న ఆయన ఈ కేసుల దర్యాప్తును నియంత్రిస్తున్నారు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల పనితీరుపై వార్షిక నివేదికలను ఆమోదించే స్థానంలో ఆయనే ఉన్నారు. దాంతో నాలుగు చార్జ్షీట్లపై న్యాయస్థానం కోరిన వివరణలను ఐపీఎస్ అధికారులు సమర్పించలేకపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబే కాకుండా ఇతర నిందితులు కూడా ఈ కేసుల సాక్షులను ప్రభావితం చేసే కీలక స్థానాల్లో ఉన్నారు. ఈ కేసుల్లో ఫిర్యాదుదారులు, సాక్షులపై వేధింపులు కొనసాగుతున్నాయి. చంద్రబాబు, మరో నలుగురు మంత్రులు ఈ ఏడు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. అందుకే అవినీతి నిరోధక చట్టం కింద దర్యాప్తునకు గవర్నర్ అనుమతి కోరడం లేదు. కక్ష సాధింపు చర్యలకు తార్కాణం.. ఫిర్యాదు చేశారనే మధుసూదన్రెడ్డిపై వేధింపులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత కక్షపూరితంగా అధికారులను వేధిస్తున్నారో చెప్పేందుకు ఐఆర్ఏఎస్ అధికారి ఎం. మధుసూదన్రెడ్డి ఉదంతమే తార్కాణం. టీడీపీ హయాంలో చోటు చేసుకున్న ఫైబర్నెట్ కుంభకోణంపై సంస్థ ఎండీ హోదాలో ఆయన సీఐడీకి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ప్రధాన నిందితుడిగా సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ పిటిషన్ పెండింగ్లో ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు దీన్ని దృష్టిలో పెట్టుకుని కక్షపూరితంగా ఎం.మధుసూదన్రెడ్డిని సస్పెండ్ చేయించారు. డిప్యుటేషన్ పూర్తయి ఆయన తన మాతృశాఖకు వెళ్లడానికి మూడు రోజుల ముందు సస్పెండ్ చేయడం గమనార్హం. దీనిపై ఆయన పరిపాలన ట్రిబ్యునల్ను ఆశ్రయించగా సస్పెన్షన్పై స్టే విధించింది. ఈ కేసుల దర్యాప్తు అధికారులకు ప్రస్తుత ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వకుండా, జీతాలు చెల్లించకుండా వేధిస్తోంది. గవర్నర్ అనుమతి ప్రక్రియకు మోకాలడ్డుఈ కేసులో నిందితులపై అవినీతి నిరోధక చట్టం కింద విచారణకు గవర్నర్ అనుమతి కోరే ప్రక్రియను గతంలో డీజీపీ, సీఐడీ అదనపు డీజీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి చేపట్టారు. కానీ ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉండగా మరో నలుగురు మంత్రులుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ అనుమతి కోరే ప్రక్రియను ప్రస్తుత సీఐడీ అదనపు డీజీ, డీజీపీ కొనసాగిస్తారనే నమ్మకం లేదు. గవర్నర్ అనుమతి కోరే ప్రతిపాదనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంత్రివర్గం ముందు ఉంచాలి. కానీ ముఖ్యమంత్రి నియంత్రణలో విధులు నిర్వర్తించే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ ప్రతిపాదనను మంత్రివర్గం పరిశీలనకు తెస్తారనే నమ్మకం లేదు. మళ్లీ అదే పదవుల్లో నిందితులు.. కీలక రికార్డుల తారుమారుకు అవకాశంగతంలో టీడీపీ ప్రభుత్వంలో సీఆర్డీఏ చైర్మన్గా ఉన్న చంద్రబాబు, వైస్ చైర్మన్ పి.నారాయణ అసైన్డ్ భూములు, ఇన్నర్రింగ్ రోడ్డు కుంభకోణాలకు పాల్పడ్డారు. ప్రస్తుతం వారిద్దరూ మళ్లీ అదే పదవుల్లో ఉన్నారు. ఆ కేసుల్లో న్యాయస్థానం ఎదుట సీఆర్పీసీ 164 కింద సాక్ష్యం ఇచ్చిన అధికారులు ప్రస్తుతం చంద్రబాబు, నారాయణ నియంత్రణలో ఉన్నారు. ఈ కేసుల్లో మరికొందరు సాక్షులను విచారించాల్సి ఉంది. మరోవైపు ఈ కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్, చార్జ్షీట్లు, రిమాండ్ రిపోర్టులు, కొల్లగొట్టిన భూములకు సంబంధించిన కీలక రికార్డులన్నీ చంద్రబాబు, నారాయణకు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఈ కేసుల్లో సాక్షులను బెదిరించేందుకు, రికార్డులను తారుమారు చేసేందుకు వారిద్దరికీ పూర్తి అవకాశం ఉంది. ఈడీ దర్యాప్తు భయంతో..మనీ లాండరింగ్కు కూడా పాల్పడిన ఈ కేసుల వివరాలను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి గతంలోనే సీఐడీ నివేదించింది. స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ ఇప్పటివరకు పరిమిత స్థాయిలో దర్యాప్తు నిర్వహించింది. స్కిల్ స్కామ్ కేసులో షెల్ కంపెనీ డిజైన్టెక్కు చెందిన ఆస్తులను జప్తు చేయడంతోపాటు నలుగురు నిందితులను అరెస్ట్ కూడా చేసింది. స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ దాఖలు చేసిన చార్జ్షీట్ను ఈడీకి సమర్పించింది. ఆ కేసులో ప్రధాన నిందితుడు చంద్రబాబు బ్యాంకు ఖాతాల్లో భారీగా నిధులు డిపాజిట్ అయినట్లు సీఐడీ గుర్తించింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో కొందరు బ్యాంకు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా కేవైసీ వివరాలు తీసుకోకుండానే నోట్ల మార్పిడి చేసినట్లు కూడా ఆధారాలు సేకరించింది. ఆ వివరాలతో పాటు స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణం, అసైన్డ్ భూముల కుంభకోణం కేసులకు సంబంధించి న్యాయస్థానంలో సమర్పించిన చార్జ్షీట్లను ఈడీకి ఇప్పటికే సీఐడీ సమర్పించింది. వాటి ఆధారంగా చంద్రబాబుతోపాటు ఇతర ప్రధాన నిందితులపై ఈడీ ఇంకా దర్యాప్తు మొదలు పెట్టాల్సి ఉంది. దీంతో ఈ కేసులను నీరుగార్చేందుకు ప్రభుత్వం సీఐడీపై ఒత్తిడి తెస్తోంది. దర్యాప్తు అధికారులకు రక్షణగా ఉండండి.. నిష్పక్షపాత విచారణకు సహకరించండిఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సీఎం చంద్రబాబుతోపాటు మరో నలుగురు మంత్రులు నిందితులుగా ఉన్న ఆ ఏడు కేసుల దర్యాప్తు సమగ్రంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత డీజీపీపై ఉంది. ఆ కేసుల్లో దర్యాప్తు అధికారులపై ఎలాంటి వేధింపులకు పాల్పడకుండా, బలవంతపు చర్యలు తీసుకోకుండా వారికి డీజీపీ రక్షణ కవచంలా నిలవాలి. తమ అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ నిందితులకు కొమ్ముకాయడం అంటే నేరానికి పాల్పడినట్టేనని వేరే గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ఈ కేసులకు సంబంధించి వాస్తవాలను న్యాయస్థానానికి సమర్పించాల్సిన బాధ్యత డీజీపీపై ఉంది. కేసుల విచారణలో న్యాయస్థానానికి డీజీపీ పూర్తిగా సహకరించాలి.బాబు బరితెగింపు బెయిల్ నిబంధనల ఉల్లంఘన స్కిల్ స్కామ్తోసహా తనపై ఉన్న అవినీతి కేసుల దర్యాప్తును ప్రభావితం చేస్తున్న సీఎం చంద్రబాబు న్యాయస్థానం ఆదేశాలను నిర్భీతిగా ఉల్లంఘిస్తున్నారు. స్కిల్స్కామ్ కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టమైన షరతులు విధించింది. ఈ కేసుకు సంబంధించిన అంశాలను మీడియా ఎదుటగానీ మరెక్కడాగానీ మాట్లాడకూడదని స్పష్టం చేసింది. అనంతరం పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు కూడా షరతులు విధించింది. అయితే చంద్రబాబు తాను న్యాయస్థానాలకు అతీతమన్నట్టు వ్యవహరిస్తూ కేసు దర్యాప్తును ప్రభావితం చేసే రీతిలో వ్యవహరిస్తుండటం విస్మయపరుస్తోంది. తాజాగా ‘ఆహా’లో నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న ‘అన్ స్టాపబుల్’ షోలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రోమోను మంగళవారం విడుదల చేశారు. అందులో స్కిల్ స్కామ్ కేసు గురించి చంద్రబాబు పలు అంశాలను ప్రస్తావించడం గమనార్హం. తనను అకారణంగా అరెస్ట్ చేశారని.. తాను ఏ తప్పూ చేయలేదని వ్యాఖ్యలు చేశారు. కేసు ఇంకా విచారణలో ఉండగానే తనకు తానే తీర్పు ఇచ్చేశారు! తద్వారా స్కిల్ స్కామ్ కేసు గురించి మాట్లాడవద్దన్న న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించారు. అంతేకాదు.. తాను ఎవరినీ విడిచిపెట్టబోనంటూ దర్యాప్తు అధికారులను బెదిరించే రీతిలో చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.కేసుల్లో నిందితుల వివరాలు⇒ నారా చంద్రబాబు (ముఖ్యమంత్రి): ఏడు కేసుల్లో నిందితుడు⇒ పొంగూరు నారాయణ (మున్సిపల్ శాఖ మంత్రి): ఇన్నర్రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం, అసైన్డ్ భూముల కుంభకోణం కేసుల్లో నిందితుడు⇒ నారా లోకేశ్ (విద్యా శాఖ మంత్రి): ఇన్నర్రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం కేసులో నిందితుడు⇒ కె.అచ్చెన్నాయుడు (వ్యవసాయ శాఖ మంత్రి): స్కిల్ స్కామ్ కేసులో నిందితుడు⇒ కొల్లు రవీంద్ర (ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి): మద్యం కుంభకోణం కేసులో నిందితుడు -
విచారణకు సజ్జల పోలీసుల ఓవరాక్షన్ పై పొన్నవోలు ఫైర్
-
బాబు కొంపముంచిన లోకేష్
-
లడ్డులో జంతువు కొవ్వు?..
-
కల్తీ నెయ్యి లడ్డూలు భక్తులు తిన్నారా? లేదా ? పొన్నవోలు ఫుల్ క్లారిటీ..
-
శ్రీవారి లడ్డూ వివాదంలో నిజానిజాలు తెలియాలి: న్యాయవాది పొన్నవోలు
న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు అయ్యాయి. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, ఆ వ్యాఖ్యలపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అదే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించేలా ఆదేశివ్వాలని కోరుతూ వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిల్ వేశారు.ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. లడ్డూ అంశంపై జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు వెలికి తీయాలని అన్నారు. చంద్రబాబు వేసిన సిట్తో నిజాలు బయటకు వచ్చే అవకాశం లేదన్నారు. యానిమల్ ఫ్యాట్ ఉందని చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో ఆయన కింద పనిచేసే ఏజెన్సీలు అవే చెప్పే అవకాశం ఉందన్నారు. దీనిపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో ఫుడ్ టెక్నాలజీ ఎక్స్పర్ట్స్తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఇది శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు సంబంధించిన విషయం కనుక సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని చెప్పారు. ఏఆర్ ఫుడ్స్ సప్లై చేసిన 10 ట్యాంకులలో నాలుగు ట్యాంకులు నాసిరకంగా ఉన్నాయని, ఈ నాలుగు ట్యాంకులలో వనస్పతి ఉందని మొదట టీటీడీ ఈవో చెప్పారని అన్నారు. ట్యాంకులు ముందుగానే ఒక సర్టిఫికెట్తో తిరుమలకు వస్తాయని, ఆ వచ్చిన ట్యాంకులను టీటీడీ 3 పరీక్షలు నిర్వహిస్తుందని తెలిపారు.చదవండి: లడ్డూ వివాదం.. తిరుమలలో ప్రమాణానికి భూమన సిద్ధం‘ఆ పరీక్షల్లో సఫలమైన తర్వాతే ఆ టాంకర్ల నెయ్యిని ప్రసాదాలకు ఉపయోగిస్తారు. టెస్టుల్లో ఫెయిల్ అయితే వాటిని వెనక్కి పంపిస్తారు. కల్తీ జరిగిందని నిర్ధారించే ల్యాబ్స్ లేవని ఈవో చెప్పడం దుర్మార్గం. 2014-19 వరకు పరీక్ష కేంద్రాలకు హెడ్గా ఉన్న శర్మిస్ట.. టీటీడీకి కల్తీ పరీక్షలు చేసే సామర్థ్యం ఉందని వెల్లడించారు. మే 15న మొదటి ట్యాంక్ పంపించారు. అప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం లేదు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. నాసిరకం నాలుగు ట్యాంకర్ల నెయ్యి వెనక్కి పంపారు. అటువంటి సమయంలో లడ్డూలలో కల్తీ ఎలా జరిగిందని చెప్పారు.భక్తుల మనోభావాలు గాయపరిస్తే మీకు ఒరిగేదేమిటి. రాజకీయ లాభం కోసం దేవుడిని కూడా ఉపయోగించడం సిగ్గుచేటు. రిజెక్ట్ చేసిన నాలుగు ట్యాంకర్లలో ఎస్ వాల్యూ తక్కువగా ఉందని ఈవో చెప్పారు. 2019 నుంచి ఆగస్టు 2023 వరకు వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నారు. వై వి సుబ్బారెడ్డి హయంలో ఈ టెండర్లను పిలవలేదు. ఏఆర్ ఫుడ్స్ అసలు బిడ్డరే కాదు. భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో ఏఆర్ ఫు డ్స్కు ఆర్డర్ ఇవ్వలేదు. సప్లై జరగలేదు. టీడీపీ ప్రభుత్వం హయాంలోనే ఆర్డరు, సప్లై జరిగింది. ఎస్ వాల్యూ తగ్గిందని టీటీడీ ఈఓ నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్ చేశారు. 319 రూపాయల కేజీ నెయ్యిలో 1, 450 రూపాయల యానిమల్ ఫ్యాట్ ఎలా కలుపుతారు? రాగి బిందెలో బంగారం కలుపుతారా ?కానీ రాజకీయ దురుద్దేశంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. శ్రీవారి భక్తులను మోసం చేస్తున్నారు.పంది కొవ్వు కలిపారని చెప్పడం అబద్ధం -
తిరుమల లడ్డుపై బాబు వ్యాఖ్యలకు పొన్నవోలు కౌంటర్
-
ఎస్ఆర్సీ నివేదికను సవాల్ చేసుకోండి
సాక్షి, అమరావతి: ప్రాణహాని లేదంటూ సెక్యూరిటీ రివ్యూ కమిటీ (ఎస్ఆర్సీ) ఇచ్చిన నివేదికను సవాల్ చేసుకోవాలని మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డికి హైకోర్టు స్పష్టం చేసింది. ఎస్ఆర్సీ నివేదికను సుధాకర్రెడ్డికి అందజేయాలని హోంశాఖను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. అప్పటి వరకు ఆయనకు భద్రతను కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఇందుకు అయ్యే వ్యయాన్ని సుధాకర్రెడ్డే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో కేసులు వాదించానన్న కక్షతో తనకున్న భద్రతను ఉపసంహరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని, తన భద్రతను కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పొన్నవోలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.రాంసింగ్ వ్యాజ్యంపై విచారణ వాయిదా12న తుది విచారణ జరుపుతామన్న హైకోర్టుసాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్పటి సీబీఐ దర్యాప్తు అధికారి రాంసింగ్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ ఈనెల 12కి హైకోర్టు వాయిదా వేసింది. ఆ రోజున ఈ వ్యాజ్యంపై తుది విచారణ జరుపుతామని తేల్చి చెప్పింది. వివేకా హత్య కేసును తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను, అలాగే ఫిర్యాదుదారు గజ్జల ఉదయ్కుమార్రెడ్డి బెయిల్ నిరాకరిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మెమో రూపంలో కోర్టు ముందుంచేందుకు రాంసింగ్కు అనుమతినిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వివేకా హత్య కేసులో తప్పుడు సాక్ష్యం ఇవ్వాలంటూ అప్పటి దర్యాప్తు అధికారి రాంసింగ్ తనను బెదిరిస్తున్నారంటూ గజ్జల ఉదయ్ ఫిర్యాదు అనంతరం పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ 2022 ఫిబ్రవరి 23న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే. తాజాగా గురువారం రాంసింగ్ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. ఆయన తరఫున కేంద్ర ప్రభుత్వ న్యాయవాది జూపూడి యజ్ఞదత్ వాదనలు వినిపిస్తూ, సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులను మెమో రూపంలో కోర్టు ముందుంచుతామన్నారు. ఈ సమయంలో ఫిర్యాదుదారు ఉదయ్ తరఫు సీనియర్ న్యాయవాది ప్రద్యుమ్న కుమార్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఈ కేసులోలాగే మరో వ్యక్తిని కూడా రాంసింగ్ బెదిరిస్తే కోర్టు రాంసింగ్పై కేసు నమోదుకు ఆదేశాలిచ్చిందన్నారు. ఆ కేసును కొట్టేయాలని రాంసింగ్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు ఇప్పటికే కొట్టేసిందన్నారు. అదే రీతిలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని కూడా కొట్టేయాలని ఆయన కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను వాయిదా వేశారు. -
జగన్ పై రఘురామ పెట్టిన కేసు.. ఆధారాలతో పొన్నవోలు కౌంటర్
-
ఎవరి సంతోషం కోసం మూడేళ్లకు అక్రమ కేసు?
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పక్కా పన్నాగంతో తప్పుడు కేసు నమోదు చేశారని మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, వ్యక్తిగత ద్వేషంతోనే రఘురామకృష్ణరాజు అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. అరెస్ట్ చేసిన తరువాత ఆయన్ను కస్టడీలో వేధించినట్లు చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు.ఆయన అరెస్ట్ విషయంలో, ఆ తరువాత కూడా సీఐడీ అధికారులు నిబంధనల మేరకే వ్యవహరించారని స్పష్టం చేశారు. ఎవరి సంతోషం కోసమో మూడేళ్ల తర్వాత తప్పుడు కేసు నమోదు చేసి పోలీసులు ఓ సాంప్రదాయానికి తెర తీశారని చెప్పారు. ఈ చర్యకు భవిష్యత్తులో వారే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరినో సంతోషపెట్టడం.. మరెవరినో ఇబ్బంది పెట్టడం కోసమే 2021 మే 14న అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజుపై కేసు నమోదు కాగా ఆయన్ను హైదరాబాద్లో అరెస్ట్ చేసి సంబంధిత జ్యూరిస్ డిక్షన్ పరిధిలోని గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారని పొన్నవోలు చెప్పారు. ‘పోలీస్ కస్టడీలో తనను టార్చర్ చేశారంటూ రఘురామకృష్ణరాజు విచిత్రంగా మూడేళ్ల తర్వాత.. గత నెల 11న గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈనెల 11న కేసు నమోదు చేశారు. ఆ ఫిర్యాదుపై నెల రోజుల తరవాత పోలీసులు స్పందించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో పాటు కొందరు పోలీస్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి 307 సెక్షన్ కింద కేసు పెట్టారు. ఎవరినో సంతోషపెట్టడం, మరెవరినో ఇబ్బంది పెట్టడం కోసమే ఈ కేసు నమోదు చేసినట్లు స్పష్టమవుతోంది’ అని పేర్కొన్నారు. వాంగ్మూలం ఒకటి.. ఫిర్యాదు మరొకటి 2021లో రఘురామకృష్ణరాజును గుంటూరు కోర్టులో హాజరు పర్చినప్పుడు ఆయన చెప్పిన మాటలకు, ఇప్పుడు ఫిర్యాదులో చేసిన ఆరోపణలకు ఏమాత్రం పొంతన లేదు. ముఖానికి రుమాలు కట్టుకున్న గుర్తు తెలియని వ్యక్తులు పోలీసు కస్టడీలో తనను టార్చర్ చేశారని నాడు మేజిస్ట్రేట్ ఎదుట ఆయన వాంగ్మూలం ఇచ్చారు. కానీ గత నెలలో చేసిన ఫిర్యాదులో మాత్రం విచిత్రంగా పోలీసు ఉన్నతాధికారుల పేర్లు చెప్పారు. సీనియర్ ఐపీఎస్ అధికారులు సునీల్, సీతారామాంజనేయుల పేర్లు ప్రస్తావించారు. తనను హింసిస్తున్న వీడియోను వైఎస్ జగన్ చూశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంతకన్నా తప్పుడు కేసు ఉండదు మూడేళ్ల తర్వాత ఫిర్యాదు చేస్తే.. అందులో ప్రస్తావించిన వారందరిపైనా ఇప్పుడు కేసు నమోదు చేయడం పూర్తిగా అసమంజసం. అసలు ఈ కేసులో వైఎస్ జగన్ ఎలా నిందితుడు అవుతారు? ఇంతకన్నా తప్పుడు కేసు మరొకటి ఉండదు. కేవలం దురుద్దే«శం, ద్వేషంతో రఘురామరాజు ఫిర్యాదు చేస్తే పోలీసులు అత్యుత్సాహంగా స్పందించారు. నాడు మెజి్రస్టేట్ ఎదుట రఘురామ చెప్పిందేమిటి? మూడేళ్ల తర్వాత ఫిర్యాదు చేయడం ఏమిటి? అని పోలీసులు కనీసం ఆలోచించరా? టార్చర్ చేయనేలేదు రఘురామరాజును నాడు సీఐడీ కస్టడీలో ఏమాత్రం టార్చర్ చేయలేదు. ఆయన కోరడంతో కోర్టు ఆదేశాల మేరకు వైద్య బృందం పరీక్షించి రఘురామ శరీరంపై ఎలాంటి గాయాలు లేవని నివేదిక ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో జైలు నుంచి విడుదల అయిన తరువాత రఘురామరాజు ఒక్కరే తన సొంత వాహనంలో హైదరాబాద్లోని ఆర్మీ ఆస్పత్రికి వెళ్లారు. పోలీసుల సూచనను బేఖాతర్ చేస్తూ అలా వెళ్లిన రఘురామరాజు ఆర్మీ ఆస్పత్రిలో తన శరీరంపై గాయాలు చూపారు. దాన్నిబట్టి ఆయన ప్రయాణంలో ఏం జరిగి ఉంటుందన్నది అందరూ అర్థం చేసుకోవాలి. ముందే కల గన్నారా? రఘురామరాజు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి వైఎస్ జగన్ను, డాక్టర్ను కూడా ముద్దాయిలుగా చేర్చడం సరికాదు. పాలించే వ్యక్తి మారితే చట్టం మారుతుందా? ఆ వ్యక్తికి వంత పాడుతుందా? అసలు చట్టం, న్యాయం, ప్రాథమిక సూత్రాలు ఏం చెబుతున్నాయో పట్టించుకోరా? 77 రోజుల తర్వాత సాక్షులను విచారించడమే సరికాదని సుప్రీంకోర్టు గతంలో చెప్పిన విషయం తెలియదా? అలాంటప్పుడు మూడేళ్ల తర్వాత విచారిస్తే ఏం జరుగుతుంది? రఘురామ గత నెల 11న ఈ – మెయిల్ ద్వారా గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేస్తే అంతకు ఒక రోజు ముందే అంటే జూన్ 10వ తేదీనే పోలీసులు లీగల్ ఒపీనియన్ ఎలా పొందారో చెప్పాలి. రఘురామ ఫిర్యాదు చేస్తారని పోలీసులు ముందుగానే కల గన్నారా? చట్టపరంగానే ఎదుర్కొంటాం ఈ తప్పుడు కేసును చట్టపరంగా, న్యాయపరంగా ఎదుర్కొంటాం. ఈ కేసు విషయంలో పోలీసులు వ్యవహరించిన విధానం సరికాదు. ఇదో సంప్రదాయంగా మారితే భవిష్యత్తులో పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోతుంది. ఈ పరిణామం ప్రజాస్వామ్య వ్యవస్ధకే కళంకం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుపై గత ప్రభుత్వ హయాంలో కేసు నమోదు చేయలేదు. 2015లోనే టీడీపీ హయాంలోనే డైరెక్టర్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఆ కేసు నమోదు చేసింది. -
జగన్పై ద్వేషంతోనే ఈ తప్పుడు కేసు: పొన్నవోలు
గుంటూరు,సాక్షి: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఒక ప్లాన్ ప్రకారమే తప్పుడు కేసు నమోదు చేశారని, దీని వెనుక పెద్ద కుట్రే ఉందని మాజీ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ మండిపడ్డారు. రఘురామ రాజు ఆరోపణలపై, కేసును పోలీసులు స్వీకరించిన పరిణామాలపై పొన్నవోలు శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు.‘‘మాజీ సీఎం వైఎస్ జగన్ తోపాటు మరికొందరు అధికారులపై టీడీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టింది. కేవలం దురుద్దేశంతో, రాజకీయ కక్షతోనే ఈ కేసు పెట్టారు. వ్యక్తిగత ద్వేషంతోనే రఘురామ కృష్ణంరాజు ఈ పని చేశారు. అరెస్ట్ చేశాక తనని కస్టడీలో వేధించినట్లు ఆయన ఫిర్యాదు చేశారు. కానీ, అయన్ని అరెస్టు చేసిన విషయంలో ఎలాంటి తప్పు జరగలేదు. తనపై మాస్క్ పెట్టుకున్న గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్టు రఘురామ మెజిస్ట్రేట్కు ఇచ్చిన వాంగ్మూలంలో స్వయంగా చెప్పారు. ఇప్పుడేమో కేసులో ఏకంగా మాజీ సీఎం జగన్ పేరు రాశారు. కేవలం జగన్ పై రఘరామ ద్వేషం పెంచుకుని మూడేళ్ల తర్వాత ఈ కేసు పెట్టారు. అధికారులు పీవీ సునీల్, సీతారాంజనేయులు తనపై దాడి చేస్తే అప్పట్లోనే కోర్టులో ఎందుకు చెప్పలేదు?. .. డాక్టర్లు కూడా రఘురామ ఒంటిపై కొట్డిన గాయాలు లేవని చెప్పారు. అయినాసరే అత్యంత దారుణంగా ఇప్పుడు తప్పుడు కేసు పెట్టారు. రఘురామ జూన్ 11వ తేదీన ఫిర్యాదు చేస్తే.. 10వ తేదీనే పోలీసులు ఎలా లీగల్ ఒపీనియన్ కి రాశారు?. ఒక ప్లాన్ ప్రకారం తప్పుడు కేసు నమోదు చేయటానికి చేసిన కుట్ర అనటానికి ఇంకేం నిదర్శనం కావాలి? అని పొన్నవోలు అన్నారు. పైగా.. ఒక కేసులో 77 రోజుల తర్వాత ఇచ్చిన సాక్ష్యాన్నే చెల్లదని సుప్రీంకోర్టు చెప్పిందని, మరి మూడేళ్ల తర్వాత రఘురామ కేసులో జగన్, ఇతర అధికారులపై ఎలా కేసు నమోదు చేస్తారు? అని పొన్నవోలు నిలదీశారు. రాష్ట్రంలో అత్యంత దారుణంగా హత్యలు జరిగినా పోలీసులు కేసు నమోదు చేయని పరిస్థితి చూస్తున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారాయన.ఎవర్నో ఇబ్బందులు పెట్టాలన్న కక్ష్యతోనే ఇలాంటి తప్పుడు కేసు పెట్టారని, ఇలాంటి తప్పుడు ఒరవడినే అవలంభిస్తే రాబోయే రోజుల్లో కర్మ ఫలితం అనుభవించాల్సి వస్తుందని అన్నారాయన. ‘‘రెడ్ బుక్ రాసుకుని అధికారాన్ని విచ్ఛిన్నం చేయాలని చూడవద్దు. అదే జరిగితే అధికారులు ఎవరూ సరిగా ఉద్యోగం చేయలేరు. కాబట్టి ఇలాంటి తప్పుడు కేసులు మానుకోవాలి అని పొన్నవోలు హితవు పలికారు. -
అధికారం ఉందని చట్టాన్ని పట్టించుకొరా.. సంచలన నిజాలు బయటపెట్టిన పొన్నవోలు
-
Big Question: పచ్చి అబద్దాలు.. కోర్టు ఆర్డర్ బయటపెట్టిన మాజీ ఏఏజీ పొన్నవోలు
-
కోర్టు ఆదేశాలు తుంగలో తొక్కేస్తారా?
సాక్షి, హైదరాబాద్ : తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీయే అధికారులు కూల్చి వేయడం చట్ట విరుద్ధమని, హైకోర్టు ఉత్తర్వులున్నా లెక్క చేయకుండా వ్యవహరించారని మాజీ అడిషనల్ అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను ఖాతరు చేయని దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. శనివారం ఆయన హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. ‘అధికారంలోకి రావడంతోనే టీడీపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యహరిస్తోంది.గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు కార్యాలయాలు కట్టుకునేందుకు 2016లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే 340 జీవో తెచ్చారు. దీని ప్రకారం 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో ఎకరం వెయ్యి రూపాయల చొప్పున చాలా జిల్లాల్లో పార్టీ కార్యాలయాల కోసం భూములు పొందారు. పాలకులు మారిపోయినా చట్టం మాత్రం మారదు. అదే చట్ట ప్రకారం కేంద్ర కార్యాలయ నిర్మాణం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2 ఎకరాలు తీసుకుంది.భవన నిర్మాణానికి అనుమతి కోసం దరఖాస్తు చేశాం. ఈ ప్రభుత్వం రావడంతోనే మాకు ప్రొవిజినల్ ఆర్డర్ జారీ చేశారు. నోటీసుపై 10వ తేదీ అని ఉన్నా, మాకు ఇచ్చింది మాత్రం 15వ తేదీ. దీనిపై హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేసి ఉపశమన ఆదేశాలు పొందాం. చట్ట ప్రకారమే ముందుకు సాగాలని న్యాయస్థానం సీఆరీ్డయేను ఆదేశించింది. న్యాయ వ్యవస్థ అంటే లెక్కలేనితనంతో ఆ ఆదేశాలను తుంగలో తొక్కారు’ అని మండిపడ్డారు. ప్రజావేదికతో సంబంధం లేదు ప్రజా వేదికతో కొందరు పోలుస్తుండటం సరికాదని.. దానికి, దీనికి సంబంధం లేదని పొన్నవోలు తెలిపారు. ‘నదీ పరివాహక ప్రాంతంలో ఎలాంటి నిర్మాణం చేపట్టడానికి వీల్లేదు. అలా ఎవరు చేసినా అది పూర్తి చట్ట వ్యతిరేకం. అలా చేస్తే ప్రజలు ముంపు సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే.. చట్ట ప్రకారం నాటి ప్రభుత్వం ముందుకు వెళ్లింది. అంతే తప్ప అందులో కక్ష పూరితం లేదు.వైఎస్సార్సీపీకి ప్రభుత్వం ఇచ్చిన భూమిలో నిర్మాణం చేసుకోవడం చట్ట వ్యతిరేకం కాదు. ఈ వివాదం ఇప్పుడు అధికారులకు, కోర్టుకు మధ్య అన్న విధంగా మారింది. అధికారంలో ఉండగా వైఎస్సార్సీపీ ఏ ఒక్క అధికారిని ప్రభావితం చేయలేదు. టీడీపీ కట్టుకున్న పార్టీ కార్యాలయాలను కూల్చలేదు. వారు పొందిన స్థలాలను వెనక్కు తీసుకోలేదు. ఐదేళ్లు హూందాగా వ్యవహరించింది. సామాన్యుడు నిర్మాణం కోసం ఎలా అనుమతి పొందుతాడో అలాగే వైఎస్సార్సీపీ ముందుకు వెళ్లింది. ఏదేమైనా చట్ట విరుద్ధంగా కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కిన అధికారుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకునేలా పోరాడతాం’ అని వివరించారు.సీఆర్డీయే ప్రకటనలో అంశాలు వాస్తవం కాదు తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి సంబంధించి ఈనెల 1వ తేదీనే కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చామంటూ సీఆరీ్డయే పేరుతో ఒక ప్రకటన సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోందన్న విషయం మా దృష్టికి వచ్చిందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. అయితే ఇందులోని అంశాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు. సీఆరీ్డయే ప్రొవిజనల్ ఆర్డర్పై ఈనెల జూన్ 10వ తేదీ వేసి, మాకు జూన్ 15వ తేదీన ఇచ్చారు. నిన్న (శుక్రవారం) కోర్టులో దీనిపైనే వాదోపవాదాలు జరిగాయన్నారు. చట్టాన్ని ఫాలో అవ్వాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, ఇందుకు సంబంధించిన పత్రాలను మీ ముందు (మీడియా) ఉంచుతున్నామన్నారు.కూల్చి వేయము అని కోర్టుకు చెప్పి..విచారణ సందర్భంగా న్యాయస్థానంలో వాదనలు వినిపిస్తూ ఎలాంటి కూల్చివేతలు చేపట్టబోమని అధికారులు చెప్పారని పొన్నవోలు తెలిపారు. చట్ట ప్రకారమే వ్యవహరిస్తామని చెప్పారన్నారు. రాత్రికి రాత్రే జేసీబీలు తీసుకొచ్చి కూల్చివేత చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సూర్యోదయానికి ముందు.. సూర్యాస్థమయానికి తర్వాత ఎలాంటి కూల్చివేత కార్యక్రమాలు చేపట్టవద్దని హైకోర్టు ఫుల్ బెంచ్ ప్రభుత్వాలకు గతంలోనే తేల్చి చెప్పింది. కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చేంత వరకు కూల్చి వేయడానికి వీల్లేదు. కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అవతలి వారి వాదనలు వినాల్సి ఉంటుంది.అందుకు 15 రోజుల సమయం ఉంటుంది. అయినా ప్రభుత్వం ముందుకు వెళితే.. బాధితులు ట్రిబ్యునల్కు కూడా వెళ్లవచ్చు. ట్రిబ్యునల్లో మాకు వ్యతిరేకంగా తీర్పు వస్తే.. అప్పుడు ల్యాండ్ వ్యాల్యూపై 20 శాతం ఫైన్ స్వీకరించాలి. అట్లా పర్మిషన్ తీసుకోకుండా కడితే శిక్షార్హులు. కూల్చి వేత అనేది ఆఖరి అస్త్రం. అది కూడా ట్రిబ్యునల్ తీర్పు తర్వాతే. ప్రొవిజినల్ ఆర్డర్ మీద కూల్చి వేయడం చట్ట వ్యతిరేకం. ఇది చట్ట ప్రకారం పాటించాలి్సన విధానం. కానీ, ఇలాంటివేవీ పాటించ లేదు. ఈ కేసులో న్యాయవాదిగా ఉన్న నేనే కోర్టు ఆదేశాలను సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్కు మెయిల్ ద్వారా, వాట్సాప్ ద్వారా పంపించా. సీఆర్డీఏ చర్య కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. వారిపై సివిల్తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరతాం’ అని వెల్లడించారు. -
టీడీపీ దమనకాండ.. హైకోర్టు ఆదేశాలంటే లెక్కలేదా?: పొన్నవోలు
సాక్షి, హైదరాబాద్: చట్టాన్ని లెక్క చేయకుండా ఏపీలో ప్రభుత్వం పనిచేస్తుందని.. హైకోర్టు ఆదేశాలను ఖాతరు చేయకుండా వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని కూల్చేశారని మాజీ ఏఏజీ, సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన హైదరాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గుర్తింపు పొందిన పార్టీలకు ఆఫీస్లు కట్టుకోవడానికి చంద్రబాబే 340 జీవో తీసుకొచ్చారన్నారు. పాలకులు మారొచ్చు.. కానీ చట్టం మారదు. న్యాయవ్యవస్థ ఆదేశాలను తుంగలో తొక్కారని పొన్నవోలు సుధాకర్ రెడ్డి ధ్వజమెత్తారు.‘‘తెలుగుదేశం పార్టీ 340 ప్రకారం ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలకు భూములు తీసుకుంది. ఎకరాకు వెయ్యి రూపాలకే తెలుగుదేశం భూములు పొందింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం అదే ప్రకారం రెండు ఎకరాలు చట్టపరంగా తీసుకుంది. పర్మిషన్ తీసుకోలేదని ఏడురోజుల్లో తొలగించాలని ప్రొవిజనల్ నోటీస్ ఇచ్చారు. మేము సవాల్ చేస్తూ.. లంచ్ మోషన్ వేశాం. కూల్చేస్తున్నారని కోర్టుకు చెప్పాం. డ్యూ ప్రాసెస్ ఫాలో అవుతామని చట్టానికి లోబడి పనిచేస్తామని కోర్టుకు తెలిపారు. కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చేంతవరకు కూల్చకూడదని చట్టం చెబుతుంది.’’ అని పొన్నవోలు తెలిపారు.‘‘చట్టం 115 సీఆర్డీఏ యాక్ట్ కింద వివరణ అడగాలి, వివరణ కూడా ఇచ్చాము. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూల్చివేతలు చేపట్టారు. కోర్టు ఆదేశాల విషయం సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్కు మెయిల్, వాట్సప్ ద్వారా తెలిపాం’’ అని పొన్నవోలు వివరించారు. -
వీడియో చూపించి షర్మిల బండారం బయటపెట్టిన పొన్నవోలు
-
వైఎస్సార్ పేరును కాంగ్రెస్సే ఇరికించింది
సాక్షి, అమరావతి: పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుతో తలదించుకుంటుందని అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి మండిపడ్డారు. కుట్రపూరితంగా వైఎస్సార్ పేరును కేసుల్లో కాంగ్రెస్ పార్టీ ఇరికించిందని ఆరోపించారు. ఇదే విషయాన్ని ఎన్నోసార్లు షర్మిల సైతం చెప్పారన్నారు. తాను ఇరికించానని ఆమె నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు. లేకుంటే షర్మిల దేనికి సిద్ధమో చెప్పాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మంగళవారం పొన్నవోలు సుధాకర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. మహానేత వైఎస్సార్ను కాంగ్రెస్ పార్టీ దోషిగా చిత్రీకరించే కుట్రలను అడ్డుకునేందుకు తాను న్యాయపరంగా పోరాటం చేశానన్నారు. కానీ, షర్మిల మాత్రం వైఎస్సార్ మరణానంతరం ఆ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసిన కాంగ్రెస్ పంచన చేరి తనపై దు్రష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా గతంలో కాంగ్రెస్ పార్టీకి మహానేత వైఎస్సార్ పేరును ఉచ్ఛరించే అర్హత లేదన్న షర్మిల వ్యాఖ్యలను వీడియోలను ప్రదర్శించి పొన్నవోలు వినిపించారు. వైఎస్సార్పై కేసులు పెట్టింది కాంగ్రెస్ అన్న షర్మిల.. ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు. నాతో ఎవరూ కేసులు వేయించలేదు.. కాంగ్రెస్ నేత శంకర్రావు వైఎస్సార్ పేరును అత్యంత దారుణంగా చిత్రీకరిస్తూ కోర్టుకు లేఖలు రాశారని పొన్నవోలు సుధాకర్ రెడ్డి గుర్తు చేశారు. వ్యక్తిగత రాజకీయ స్వార్థం కోసం తాను మాటలు మార్చట్లేదన్నారు. ‘వైఎస్సార్ పేరును కేసుల్లో ఇరికిస్తుంటే అన్యాయమని స్పందించాను. అంతేగానీ నాతో ఎవరూ కేసులు వేయించలేదు. ఆ సంగతి తెలుసుకొని షర్మిల మాట్లాడాలి. 2011 డిసెంబర్లో నేను కేసు వేసే నాటికి కనీసం వైఎస్ జగన్ను చూడలేదు.. నాకు ఆయనతో పరిచయం లేదు. ఆనాడు వైఎస్సార్పై చంద్రబాబు, టీడీపీ నేతలు రాష్ట్రపతికి లేఖ రాసిన మాట వాస్తవం కాదా? ఇలాంటి కేసుల్లో సంతకాలు చేసిన మంత్రులు, సంబంధిత అధికారులు బాధ్యులు అవుతారు. కానీ వైఎస్సార్, వైఎస్ జగన్ ఎలా బాధ్యులు అవుతారు. ఈ వాస్తవం కోర్టుకు వివరించే ప్రయత్నం చేశాను’ అని పొన్నవోలు వివరించారు. రాజధానిలో చంద్రబాబు భూదోపిడీ, వందల కోట్ల విలువైన సదావర్తి భూముల దోపిడీ, తెలంగాణలో ఓటుకు కోట్లు, స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లోనూ తాను పోరాటం చేశానన్నారు. బాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను చేసిన పోరాటం చూసి సీఎం జగన్ ఏఏజీగా అవకాశం కల్పించారన్నారు. క్విడ్ ప్రోకో అంటే వైఎస్సార్పై ఫిర్యాదు ఇచ్చిన శంకర్ రావుకు మంత్రి పదవి ఇవ్వడం కాదా అని నిలదీశారు. తన ఊపిరి ఉన్నంత వరకు చంద్రబాబు అక్రమాలపై పోరాటం చేస్తానన్నారు. షర్మిల చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తనపై, సీఎం జగన్పై ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. కొంత మంది పకోడిగాళ్లు షర్మిల భుజం మీద తుపాకీ పెట్టి తనను కాలుస్తున్నారని మండిపడ్డారు. అలాగే తన భుజం మీద తుపాకీ పెట్టి సీఎం జగన్ను కాల్చాలని చూస్తున్నారని.. ఈ విషయం షర్మిల తెలుసుకోవాలన్నారు. -
షర్మిల అబద్ధాలు ఆధారాలతో బయటపెట్టిన పొన్నవోలు
-
చెల్లెమ్మా..ఇక చాలమ్మ
-
షర్మిల నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు: పొన్నవోలు
-
షర్మిల అలవోకగా అబద్దం చెప్పారు: ఏఏజీ పొన్నవోలు
సాక్షి, విజయవాడ: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ లబ్ధి కోసం తనపై అసత్య ఆరోపణలు చేశారన్నారు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. షర్మిల పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ఆమె మాట్లాడారని విమర్శించారు. ఈ మేరకు తనపై షర్మిల చేసిన ఆరోపణలపై పొన్నవోలు స్పందిస్తూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు వల్లే వైఎస్సానాడే వైఎస్సార్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చారని గుర్తు చేశారు. వైఎస్సార్పై ఆరోపణలు చేస్తూ శంకర్రావు హైకోర్టుకు లేఖ రాశారని ప్రస్తావించారు. దీనిపై హైకోర్టు విచారణకు ఆదేశించిందని తెలిపారు. టీడీపీ నేతల ఎర్రన్నాయుడు ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యారని పేర్కొన్నారు. 2011 ఆగస్టు 17న వైఎస్ రాజశేఖర్రెడ్డి, జగన్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చారని తెలిపారు. వైఎస్సార్ను ఆనాడే ముద్దాయిని చేసింది నిజం కాదా.. అని ప్రశ్నించారు. వైఎస్సార్పై కేసులు పెడుతుంటే చూడలేక..‘మహానుభావుడైన వైఎస్సార్ మీద ఆరోపణలు చేస్తుంటే. అన్యాయంగా కేసులలో ఇరికిస్తుంటే అన్యాయమని భావించాను. అందుకే కేసులు వేశాను. అంతేగానీ నాతో ఎవరూ కేసులు వేయించలేదు. ఆ సంగతి తెలుసుకొని షర్మిల మాట్లాడాలి. 2011 డిసెంబరులో నేను కేసు వేసే నాటికి కనీసం జగన్ను చూడనేలేదు. వైఎస్ఆర్ మీద కాంగ్రెస్ కేసు పెట్టటం భరించలేక నేను కేసు వేశాను. అప్పటి జీవోలకు, జగన్కు ఏం సంబంధం ఉంది?చదవండి: FactCheck: ఉన్మత్త రాతల రామోజీకి పూనకాలు లోడింగ్!వాస్తవాలు తెలుసుకోవాలి..వైఎస్సార్ను అన్యాయంగా కేసులో ఇరికించారనే బాధతో నేను బయటకు వచ్చాను. ఆయన మీద కేసు పెట్టటం అన్యాయమని నేను వాదించాను. వేరే 14 మందిని బాధ్యలుగా చేయాలని మాత్రమే కేసు వేశాను. ఆ కాపీలను పంపిస్తా, షర్మిల చదువుకుంటే వాస్తవాలు తెలుస్తాయి. ఆమె చెప్పినట్టు నేనే వైఎస్సార్ మీద కేసు వేస్తే ఏ శిక్షకైనా సిద్ధమే. సీబీఐ, కాంగ్రెస్ కలిసే వైఎస్ఆర్ను ఇరికించారు. ఇది నేను నిరూపించటానికి సిద్ధం. వైఎస్సార్ను వేధించిన వారికి ఎదురొడ్డి నేను పోరాటం చేశా. అలాంటి నన్ను అభినందించాల్సిందిపోయి నాపై ఆరోపణలు చేయటం ఏంటి?.నాకు ఇచ్చే గౌరవం ఇదేనా..షర్మిల అలవోకగా అబద్దాలు చెబుతున్నారు. చంద్రబాబు మాట్లాడిన మాటలు, భాషనే షర్మిల మాట్లాడారు. మీ రాజకీయాలు ఎలాగైనా చేసుకోండి, కానీ నాపేరు ప్రస్తావించవద్దు. ఈ దుర్మార్గపు క్రీడలో తనను లాగడం దారుణం. మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా? మీ రాజకీయ యుద్ధం కోసం నన్ను లాగడమేంటి?’ అంటూ ఏఏజీ పొన్నవోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మీకు తెలిసి కూడా అబద్ధం ఎలా చెబుతున్నారు షర్మిలమ్మ
-
చంద్రబాబు స్కిల్ స్కాం కేసులో లాయర్ పొన్నవోలు సంచలన నిజాలు
-
సుప్రీం తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : స్కిల్ డెవలప్మెంట్ కేసులో రూ.371 కోట్లు ప్రజల సొమ్మును పక్కదారి పట్టించి స్వాహా చేసిన కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చంద్రబాబునాయుడుకు చెంపపెట్టులాంటిదని రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి చెప్పారు. ఆయన బుధవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజాధనాన్ని దోచిన కేసులో ప్రభుత్వం చట్టపరంగా ముందుకెళితే రాజకీయ కక్ష సాధింపులంటూ కొంతమంది నాయకులు, పచ్చ మీడియా ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. ఇన్ని రోజులూ వారు ప్రభుత్వంపై చల్లిన బురద సుప్రీంకోర్టు తీర్పుతో కొట్టుకు పోయిందని తెలిపారు. పూణేలోని కేంద్ర సంస్థలు, స్కిల్లర్ అనే సంస్థ లావాదేవీలను సీబీఐ అధికారులు పరిశీలిస్తుండగా చంద్రబాబు ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం బయటకు వచ్చిందని చెప్పారు. పూణేలోని అనేక సంస్థలకు వందల కోట్లు నిధులు వస్తున్నాయని సీబీఐ పరిశీలనలో తేలిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ఎంవోయూలో మార్పులు చేసి రూ.371 కోట్లు ఇతర సంస్థలకు మళ్ళించి, వాటి ద్వారా నిధులను స్వాహా చేశారన్నారు. ఈ విషయంపై 2018 జూన్ 6న సీబీఐ విచారణకు ఆదేశించిందని చెప్పారు. జీవో ప్రకారం సీమెన్స్ 90 శాతం నిధులు ఇవ్వలేదని అప్పటి ఆర్థిక శాఖ అధికారులు చంద్రబాబుకు చెప్పినా, ఆయనకున్న విస్తృత అధికారాలతో ఆమోదించారని, ఆ తర్వాత నిధుల స్వాహా జరిగిందని అన్నారు. ఈ కుంభకోణంపై చట్ట ప్రకారమే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. ఇది రాజకీయ కక్షతో పెట్టిన కేసు కాదని, ఈ కేసులో విచారణ, అరెస్టు, రిమాండ్ అన్నీ సక్రమంగానే జరిగాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. కోర్టు విచారణను కొనసాగించాలని చెప్పిందని తెలిపారు. ఎఫ్ఐఆర్ని రద్దు చేయాలని చంద్రబాబు కోరినా సుప్రీంకోర్టు అంగీకరించలేదని చెప్పారు. ఈ కేసు వాదనలు వినిపిస్తున్న తనను ప్రచార మాధ్యమాల ద్వారా దారుణంగా దూషించారని, ఇది సబబు కాదని అన్నారు. గౌరవనీయ కోర్టులు, న్యాయమూర్తులపై కూడా దుష్ప్రచారం చేశారన్నారు. మహిళా న్యాయమూర్తిని కూడా దూషించారన్నారు. న్యాయమూర్తులపై డీబేట్లు పెట్టి మానసికంగా హింసించారన్నారు. భార్య అనారోగ్యం కారణంగా రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ శెలవు పెడితే, ప్రభుత్వం ఆయన్ని బెదిరించి శెలవు పెట్టించిందని ప్రచారం చేయడం సిగ్గు చేటన్నారు. ఈ కేసులో సాక్ష్యాధారాలిచి్చన ఐఏఎస్ అధికారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఇంత ప్రచారం చేసే వ్యక్తులు రూ.371 కోట్లు సక్రమంగా విడుదల చేశామని ఎక్కడా చెప్పడంలేదన్నారు. అరెస్టు సక్రమం కాదంటున్నారే తప్ప అవినీతి జరగలేదని చెప్పడం లేదని చెప్పారు. ప్రభుత్వం చంద్రబాబు పట్ల గౌరవంతోనే వ్యవహరించింది చంద్రబాబు అరెస్టు, రిమాండ్ సమయంలో ప్రభుత్వం ఆయన పట్ల సహృదయంతో, గౌరవంతో వ్యవహరించిందని తెలిపారు. బాబును అరెస్టు చేయడానికి డీఐజీ స్థాయి అధికారిని ప్రభుత్వం పంపిందని, ఒక వ్యక్తిని అరెస్టు చేయడానికి ఇంత పెద్ద స్థాయి అధికారిని పంపడం దేశంలో మొట్టమొదటిసారి అని చెప్పారు. రోడ్డుపై ప్రయాణం ఇబ్బందికరంగా ఉంటుందని భావించిన ప్రభుత్వం హెలికాఫ్టర్ సౌకర్యం కల్పించిందన్నారు. జైలు మాన్యువల్ను కాదని చంద్రబాబుకు అవసరమైన సదుపాయాలు కల్పించిందన్నారు. బాబు కోసం జైల్లో బ్లాక్లను శుభ్రం చేసి, ఏసీలు ఏర్పాటు చేసిందని చెప్పారు. దేశంలో ఎందరో సీఎంలు, ప్రముఖ నాయకులు జైలుకు వెళ్లారని, ఎవరికీ ఇవ్వని సకల సౌకర్యాలు చంద్రబాబుకు ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. ఇలా సకల సౌకర్యాలు కల్పించడం కక్ష సాధింపు అవుతుందా అని ప్రశ్నించారు. చంద్రబాబు మెడికల్ బెయిల్ పొందిన తర్వాత ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లి బెయిల్ క్యాన్సిల్ చేయాలని కోరలేదని, ఆయన పట్ల ప్రభుత్వం రాగద్వేషాలకు పోలేదనడానికి, సహృదయంతో వ్యవహరించిందని అనడానికి ఈ ఒక్క విషయం చాలని తెలిపారు. -
రాజకీయ కక్షతో పెట్టిన కేసు కాదని కోర్టు చెప్పింది: పొన్నవోలు
సాక్షి, నెల్లూరు: స్కిల్ స్కామ్లో టీడీపీ అధినేత చంద్రబాబు దొరికిపోయిన దొంగ అని అన్నారు అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. చంద్రబాబు పట్ల కక్ష సాధింపు లేదు కాబట్టే జైలులో ఆయనకు అన్ని సౌకర్యాలు కల్పించినట్టు స్పష్టం చేశారు. ఇదే సమయంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు సంబంధించి కీలక వివరాలను వెల్లడించారు. తాజాగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు కొన్ని విషయాలు తెలియాలి. ప్రభుత్వం తరపున కోర్టులో నేను వాదనలు వినిపించాను. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని కొందరు అంటున్నారు. జీవో నెంబర్-4లో స్పష్టంగా చెప్పడం జరిగింది. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు వ్యవహారంలో నిబంధనలు పాటించలేదు. జీవో ప్రకారం జరగడం లేదని అప్పటి అధికారులు చెప్పినా ప్రభుత్వ పెద్దలు వినలేదు. అప్పట్లో ఆర్థిక శాఖ అభ్యంతరం తెలిపినా చంద్రబాబు ముందుకు సాగారు. ఎల్లో మీడియా విశ్వప్రయత్నం.. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ విషయాన్ని ముందుగా చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం చట్ట పరంగానే విచారణ చేసింది. ప్రజాధనం కాపాడాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు సాగింది. టీడీపీ హయాంలో చంద్రబాబు ప్రభుత్వ ఖజానాను లూటీ చేశారు. స్కిల్ స్కామ్ పేరుతో రూ.371కోట్లను చంద్రబాబు కాజేశారు. రాజకీయ కక్ష అనే మంత్రజాలంతో పాపాన్ని కడిగేసుకోవాలని టీడీపీ నేతలు, ఆ వర్గం మీడియా విశ్వ ప్రయత్నం చేసింది. ఇది రాజకీయ కక్షతో పెట్టిన కేసు కాదని సుప్రీంకోర్టే చెప్పింది. ఎఫ్ఐఆర్ క్వాష్ చేసే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. నేను గల్లీ నుంచి వెళ్లి కమిట్మెంట్తో వాదనలు.. చంద్రబాబు వయసుకు గౌరవం ఇచ్చి జైలులో సకల సౌకర్యాలను ప్రభుత్వం కల్పించింది. చంద్రబాబు పట్ల చాలా గౌరవంగా వ్యవహరించాము. జైలు మన్యువల్లో లేనివి కూడా చంద్రబాబుకు అందించాము. చంద్రబాబుకు అన్ని సదుపాయాలు కల్పించినా కొందరు అనవసర వ్యాఖ్యలు చేశారు. జైలులో చంద్రబాబుకు ఏసీ సౌకర్యం కూడా కల్పించాము. ఆయనకు అన్ని సదుపాయాలు కల్పించినా కక్ష సాధింపు చర్య ఎలా అవుతుంది. చంద్రబాబు అరెస్టు సక్రమమే అని న్యాయస్థానం తెలిపింది. కోర్టుల్లో వ్యతిరేక తీర్పు వస్తే వ్యవస్థల్ని మేనేజ్ చేశారని కొందరు ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. నేను గల్లీ నుంచి వెళ్లి కమిట్మెంట్తో వాదించాను. కొందరు ఢిల్లీ నుంచి వచ్చారు అంటూ కామెంట్స్ చేశారు. -
చంద్రబాబు అరెస్ట్ కక్షసాధింపు అంటూ అసత్య ప్రచారం చేశారు
-
చంద్రబాబు అరెస్ట్ గురించి పొన్నవోలు సుధాకర్ రెడ్డి కామెంట్స్
-
ద్విసభ్య ధర్మాసనంలో భిన్న తీర్పులు
-
బాబు, ఎల్లో మీడియా గోబెల్స్ ప్రచారానికి తెరపడింది: పొన్నవోలు
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు ఎలాంటి ఊరట దక్కలేదు. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులు వెలువరిచింది. ఈ క్రమంలో సుప్రీం తీర్పులపై అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తీర్పు అనంతరం పొన్నవోలు మీడియాతో మాట్లాడుతూ..‘సుప్రీంకోర్టు ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం. ఈ కేసు నుంచి చంద్రబాబు నాయుడు బయటపడేందుకు సాంకేతిక కోణాలు వెతికినా లాభం లేకపోయింది. సుప్రీంకోర్టులో ఈరోజు పరిణామాలను స్వాగతిస్తున్నాం. చంద్రబాబు పెట్టుకున్న పిటిషన్ను సుప్రీంకోర్టు ఎక్కడా అనుమతించలేదు. కేసు విషయంలో నన్నే అరెస్ట్ చేస్తారా? అంటూ ఊగిపోయారు. రాజకీయ కక్ష అంటూ చంద్రబాబు చేసిన వాదనను సుప్రీంకోర్టు తీసిపుచ్చింది. నేరం బయటపడేసరికి గవర్నర్ అనుమతి అంటూ సాంకేతిక కోణాలు వెతికారు. కొన్ని అబద్దాలను ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని చంద్రబాబు ప్రచారం చేయించారు. ఇన్నాళ్లు చేసిన విష ప్రచారం తప్పని తేలిపోయింది. సుప్రీంకోర్టు తీర్పుతో చంద్రబాబు తీరు తేటతెల్లమయింది. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నానికి సుప్రీంకోర్టు తీర్పుతో అడ్డుకట్ట పడింది. బాబు గోబెల్స్ ప్రచారానికి, ఎల్లో మీడియా అసత్యాలకు తెరపడింది అంటూ కామెంట్స్ చేశారు. తీర్పు ఎలా వెలువరించారంటే.. తీర్పులో 17-ఏ వర్తింపుపై ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలు వెల్లడించారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు అవినీతి నిరోధక శాఖలోని సెక్షన్ 17-ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధబోస్ తీర్పు ఇవ్వగా.. 17-ఏ వర్తించదని జస్టిస్ బేలా ఎం.త్రివేది తీర్పు ప్రకటించారు. ముందుగా జస్టిస్ బోస్ తీర్పు చదువుతూ.. "ఈ కేసులో 17ఏ వర్తిస్తుంది. చంద్రబాబు కేసులో విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సింది. గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్ట్కు వర్తింపజేయరాదు. అయినా చంద్రబాబుకు విధించిన రిమాండ్ ఆర్డర్ను కొట్టేయలేం. అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ ఆర్డర్ నిర్వీర్యం కాదు." అని జస్టిస్ బోసు తీర్పు ఇచ్చారు. జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఈ తీర్పుతో విభేదించారు. ‘‘ఈ కేసులో చంద్రబాబుకు 17-ఏ వర్తించదు. 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్ చేయలేం. 2018లో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించినది మాత్రమే. అవినీతి నిరోధక చట్టానికి 17ఏను ముడిపెట్టలేం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి 17ఏ రక్షణగా ఉండకూడదు. అవినీతి నిరోధక చట్టంలో ఇచ్చిన మినహాయింపు కేవలం ఉద్యోగులు కక్ష్యసాధింపుకు గురి కావద్దని మాత్రమే’’ అని జస్టిస్ త్రివేది తీర్పు ఇచ్చారు. ఇది కూడా చదవండి: బాబు రిమాండ్ సబబే.. కేసు కొట్టేయలేం -
చంద్రబాబుకు సుప్రీం కోర్ట్ నోటీసులపై పొన్నవోలు కామెంట్స్
-
చంద్రబాబు బెయిల్ పై పొన్నవోలు కామెంట్స్
-
సుప్రీంకోర్టులో సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
-
దోచేసిన డబ్బును హవాలా మార్గంలో మళ్లించారు
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు తదితరులు లూటీ చేసిన డబ్బు మొత్తాన్ని హవాలా మార్గంలో మళ్లించారని సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ తనకు సంబంధించిన చెన్నప్ప అనే వ్యక్తి ద్వారా రూ. 10 నోట్లను వినియోగించి కావాల్సిన చోటుకు హవాలా మార్గంలో నిధులను మళ్లించారని తెలిపారు. దర్యాప్తులో భాగంగా వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా జరిగిన వారి చాటింగ్ వివరాలను ఆయన కోర్టుకు వివరించారు.నిధులు మళ్లింపు, డబ్బు జమకు వారి మధ్య కోడ్ భాషలో సంభాషణలు జరిగాయని తెలిపారు. సీమెన్స్ ప్రతినిధి మాథ్యూ థామస్ అసలు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుతో తమకు ఏ మాత్రం సంబంధం లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు వాంగ్మూలం ఇచ్చారని ఆయన కోర్టుకు వివరించారు. 90 శాతం పెట్టుబడి పెట్టాల్సిన సీమెన్స్ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టక ముందే చంద్రబాబు ప్రభుత్వం రూ. 270 కోట్లను ముందుగానే విడుదల చేసేసిందని, ఈ విషయంలో ప్రతీ దశలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిధులను విడుదల చేయాలని కోరగానే, ఆ నిధులను విడుదల చేసినట్లు అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ తన నోట్ఫైల్లో పేర్కొన్నారని, ఇదంతా కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోద్బలంతోనే జరిగిందని సుధాకర్రెడ్డి కోర్టుకు వివరించారు. టీడీపీ ఖాతాల్లోకి నిధులు స్కిల్ కుంభకోణం నిధుల్లో కొంత భాగం అంతిమంగా తెలుగుదేశం పార్టీ బ్యాంకు ఖాతాల్లో చేరాయని, ఇందుకు సంబంధించిన వివరాలను సీఐడీ కోరితే ఆ పార్టీ వర్గాలు ఇవ్వడం లేదని ఏఏజీ కోర్టుకు తెలిపారు. సీఐడీ ఇచ్చిన నోటీసులను ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. స్కిల్ కుంభకోణంపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి నిధుల దుర్వినియోగాన్ని ధ్రువీకరించిన శరత్ అసోసియేట్స్పై ఈ కేసులో నిందితుడైన వికాస్ ఖన్వీల్కర్తో చార్టెడ్ అకౌంటెంట్స్ ఇండియా వద్ద ఫిర్యాదు చేయించారన్నారు. ఇలా చేయించడం ద్వారా ఈ కేసులో కీలక సాక్షి అయిన శరత్ అసోసియేట్స్ను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాక చంద్రబాబు అరెస్ట్ తర్వాత దర్యాప్తుకు విఘాతం కలిగేలా సుమన్ బోస్, ఖన్వీల్కర్లు మీడియా సమావేశాలు నిర్వహించారన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయవద్దని.. ఆ పిటిషన్ కొట్టివేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. గుండె జబ్బన్నారు.. ఈసీజీలో అలాంటిదేమీ లేదు కంటికి శస్త్ర చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిల్పై బయట ఉన్న చంద్రబాబు స్కిల్ కుంభకోణంలో సహనిందితుల ద్వారా సాక్షులను పరోక్షంగా ప్రభావితం చేస్తున్నారని ఏఏజీ తెలిపారు. తమ పార్టీ నేతల ద్వారా విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేయడం, స్టేట్మెంట్లు ఇప్పించడం, పోలీసులపై కేసులు పెట్టించడం వంటివి చేస్తున్నారని వివరించారు. బెయిల్ పొందేందుకు వీలుగా తప్పుడు మెడికల్ రిపోర్ట్ను కోర్టు ముందుంచారని ఆయన తెలిపారు. తాజా మెడికల్ రిపోర్టులో చంద్రబాబు ‘హైపర్ట్రోపిక్ కార్టియోపతి విత్ ఇర్రెగ్యులర్ హార్ట్ రిథమ్’తో బాధపడుతున్నట్లు పేర్కొన్నారని.. ఇది శుద్ధ అబద్ధమని, ఆ వ్యాధితో బాధపడేవారికి వైద్యులు ఐసీడీ అనే పరికరాన్ని అమరుస్తారని తెలిపారు. ఇదేమీ అసాధారణ వ్యాధి కాదన్నారు. ఆ జబ్బు ప్రభావం ఈసీజీ ద్వారా తెలుస్తుందని, అయితే చంద్రబాబు ఈసీజీలో అలాంటిది ఏమీ లేదని ఆయన వివరించారు. కేవలం బెయిల్ కోసం ఈ మెడికల్ రిపోర్టును సృష్టించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ వైద్యుల బృందం పర్యవేక్షణలో వైద్య పరీక్షలు చేయించుకునేలా చంద్రబాబును ఆదేశించాలని కోరారు. చంద్రబాబును ఢిల్లీ ఎయిమ్స్కు తీసుకెళ్లేందుకు సైతం తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తనకు కావాల్సిన చోట చికిత్స పొందేందుకు చంద్రబాబుకు అనుమతినివ్వడం ద్వారా ఈ కోర్టు ఓ ప్రతికూల అభిప్రాయాన్ని కలిగించిందని, రాజమండ్రి జైలులో ప్రస్తుతం 2 వేల మంది ఖైదీలు ఉన్నారని, వారంతా కూడా కోర్టుకొచ్చి తమకూ అలాంటి అవకాశం ఇవ్వాలని కోరే ప్రమాదం ఉందన్నారు. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించేలా వైద్య నివేదికలు వాస్తవానికి మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో హైకోర్టు పలు షరతులు విధించిందని, చంద్రబాబు వైద్య నివేదికలను రాజమండ్రి జైలు సూపరింటెండెంట్కు సీల్డ్ కవర్లో ఇవ్వాలని వైద్యులను ఆదేశించిందని ఏఏజీ తెలిపారు. అయితే వైద్యులు నేరుగా చంద్రబాబుకే ఆ నివేదికలు ఇచ్చారని, ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని చెప్పారు. హైదరాబాద్లో కూడా చంద్రబాబు కోర్టు షరతులను ఉల్లంఘించారన్నారు. ఇందుకు సంబంధించి తెలంగాణ పోలీసులు కేసు కూడా నమోదు చేశారని తెలిపారు. తీర్పు రిజర్వు సీఐడీ వాదనలకు చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు. నిధుల మళ్లింపుతో చంద్రబాబునాయుడుకు సంబంధం లేదన్నారు. రాజకీయ ప్రతీకారంలో భాగంగానే చంద్రబాబు అరెస్ట్ జరిగిందన్నారు. ఆయన షరతులను ఉల్లంఘించలేదని తెలిపారు. ఆయనకు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు తీర్పును రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంలో సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న సుధాకర్రెడ్డి రెండో రోజూ గురువారం తన వాదనలను కొనసాగించారు. కీలక సాక్షులు దర్యాప్తునకు ఏ మాత్రం సహకరించడం లేదు.. స్కిల్ కుంభకోణంలో సీఐడీ పలు కీలక విషయాలను హైకోర్టు ముందుంచింది. కుంభకోణంలో నిధులను షెల్ కంపెనీల ద్వారా ఎలా మళ్లించారు.. వాటిని తిరిగి టీడీపీ బ్యాంకు ఖాతాల్లోకి ఎలా తీసుకొచ్చారు.. డీమానిటైజేషన్ సమయంలో డబ్బును ఎలా మార్పిడి చేశారు.. తదితర వివరాలను సీఐడీ లిఖితపూర్వకంగా కోర్టు ముందుంచింది. ఈమేర అదనపు కౌంటర్ను కోర్టులో దాఖలు చేసింది. 2014 జూన్ 1 నుంచి 2018 జూన్ వరకు మొత్తం రూ. 65.86 కోట్లు టీడీపికి చెందిన నాలుగు బ్యాంకు ఖాతాల్లోకి చేరాయని సీఐడీ వివరించింది. అంతేకాక 2016 నవంబర్, 2017 జనవరి మధ్య మొత్తం నగదు డిపాజిట్లన్నీ కూడా రూ. 500, రూ. 1,000 నోట్ల ద్వారా మాత్రమే జరిగిన విషయాన్ని దర్యాప్తులో గుర్తించామని సీఐడీ తెలిపింది. డీమానిటైజేషన్ను నవంబర్ 8న ప్రకటించారని, అందువల్ల ఈ రూ. 500, రూ. 1,000 జమ లావాదేవీలన్నీ కూడా అత్యంత అనుమానాస్పదంగా ఉన్నాయంది. తెలుగుదేశం పార్టీ బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన వారి వివరాలేవీ సరిగా లేవని, కేవైసీ నిబంధనలు అసలు పాటించలేదని సీఐడీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఈ డిపాజిట్లకు సంబంధించిన వివరాలను సమర్పించేందుకు తెలుగుదేశం పార్టీ ఎంత మాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదని, తామిచ్చిన నోటీసులకు సైతం సరైన రీతిలో స్పందించడం లేదని వివరించింది. చంద్రబాబు ప్రభావితం చేస్తున్న కారణంగా కీలక సాక్షులు దర్యాప్తునకు ఏ మాత్రం సహకరించడం లేదని తెలిపింది. ఈ కుంభకోణంలో కీలక వ్యక్తులు పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని విదేశాలకు పారిపోయారని సీఐడీ తన అదనపు కౌంటర్లో హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. -
రఘురామరాజు ఇంప్లీడ్ పిటిషన్పై తక్షణ విచారణ అవసరం లేదు
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించిన వాస్తవాలను ప్రజలకు తెలిపేందుకు అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో తనను కూడా ప్రతివాదిగా చేర్చుకుని తన వాదనలు వినాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ విషయంలో హైకోర్టు సానుకూలంగా స్పందించలేదు. ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందని రఘురామకృష్ణరాజును ప్రశ్నించింది. పిటిషనర్ వంటి రాజకీయ నాయకుడు దాఖలు చేసిన ఈ ఇంప్లీడ్ పిటిషన్ను అనుమతిస్తే ఈ వ్యవహారం రాజకీయరంగు పులుముకుంటుందని వ్యాఖ్యానించింది. ఈ ఇంప్లీడ్ పిటిషన్ విషయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఇదే సమయంలో ఏఏజీ సుధాకర్రెడ్డి, సీఐడీ చీఫ్ సంజయ్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వివరాలను తర్జుమా చేసి తమ ముందు ఉంచకపోవడంపై పిటిషనర్ను హైకోర్టు నిలదీసింది. ఏఏజీ, సీఐడీ చీఫ్ ఏ నిబంధనలు ఉల్లంఘించారో, వారిపై ఏం చర్యలు కోరుతున్నారో చెప్పాలంది. నిబంధనల ప్రకారం వారిని తొలగించడమో, సస్పెండ్ చేయడమో చేయాలని పిటిషనర్ న్యాయవాది గిరిబాబు తెలిపారు. చంద్రబాబు కేసు వివరాలను వారు బహిర్గతం చేశారని, ఇది ఎంతమాత్రం సరికాదని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. స్కిల్ కుంభకోణం కేసు లేదా ఇతర ఏ కేసుకు సంబంధించిన సమాచారాన్ని కూడా బహిర్గతం చేయకుండా, ఎలాంటి సమావేశాలు నిర్వహించకుండా అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి, సీఐడీ చీఫ్ సంజయ్లను ఆదేశించాలని కోరుతూ ఏపీ యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్ అధ్యక్షుడు ఎన్.సత్యనారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంలో తనను కూడా ప్రతివాదిగా చేర్చుకోవాలంటూ రఘురామకృష్ణరాజు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై బుధవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి ప్రజా సంక్షేమం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పలు విధానపరమైన నిర్ణయాలను ప్రశ్నిస్తూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై విచారణ నుంచి న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు తప్పుకున్నారు. దీంతో జస్టిస్ రఘునందన్రావు సభ్యుడిగా లేని బెంచ్ ముందు ఈ వ్యాజ్యాన్ని ఉంచాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
బాబుకు అనారోగ్యం సాకు మాత్రమే
సాక్షి, అమరావతి: కంటి శస్త్ర చికిత్స కోసం తాత్కాలిక బెయిల్ పొందిన మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హైకోర్టు విధించిన బెయిల్ షరతులను అప్పుడే ఉల్లంఘించడం మొదలు పెట్టారని సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. అనారోగ్యం సాకుతో బయటకు వచ్చిన చంద్రబాబు ఆ వెంటనే రాజకీయ ర్యాలీ ప్రారంభించారని, జైలు బయటే మీడియాతో కూడా మాట్లాడారని తెలిపారు. హైకోర్టు చంద్రబాబుకు పలు షరతులతో మంగళవారం తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. వీటికి అదనంగా మరిన్ని షరతులు విధించాలంటూ సీఐడీ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. చంద్రబాబు మీడియాతో మాట్లాడటం, ర్యాలీల్లో పాల్గొనడం, కేసు గురించి మాట్లాడటం, ఇంటర్వ్యూలు ఇవ్వడం వంటివి చేయడానికి వీల్లేదంటూ ఆదేశించింది. సీఐడీ అనుబంధ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు బుధవారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఏఏజీ సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసి కూడా చంద్రబాబు వాటికి విరుద్ధంగా వ్యవహరించారన్నారు. తాము అదనపు షరతులు విధించాలని ఎందుకు మొత్తుకుంటున్నామో దీనినిబట్టి అర్థం చేసుకోవాలని కోర్టును కోరారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ చంద్రబాబు చేపట్టిన కార్యక్రమాలతో కూడిన పెన్డ్రైవ్ను కోర్టుకు సమర్పించి, దానిని పరిశీలించాలని కోరారు. చంద్రబాబు కోర్టు షరతులకు లోబడి వ్యవహరిస్తున్నారో లేదో పర్యవేక్షించేందుకు ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులను ఆయన వెంట ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆ అధికారులు చంద్రబాబు స్వేచ్ఛకు ఏ రకంగానూ భంగం కలగనివ్వబోరని, ఇది తాము ఇస్తున్న హామీ అని నివేదించారు. మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లో కోర్టు ఎలాంటి షరతులు విధించినా వాటికి కట్టుబడి ఉంటామని చంద్రబాబు తెలిపారని సుధాకర్రెడ్డి గుర్తు చేశారు. ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు జోక్యం చేసుకుంటూ.. మీ వద్ద ఇంటెలిజెన్స్ ఉందిగా.. దాని సాయంతో చంద్రబాబుపై నిఘా పెట్టొచ్చుగా అని వ్యాఖ్యానించారు. నిఘా వేరు, ఓ వ్యక్తి వెంట వెళ్లడం వేరని, నిఘా అనేది వ్యక్తికి తెలియకుండా చేసేదని సుధాకర్రెడ్డి వివరించారు. అనంతరం చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. సీఐడీ కోరుతున్న అదనపు షరతులు దర్యాప్తు కోసం కాదని, ఇతర కారణాలున్నాయని అన్నారు. సీఐడీ కోరుతున్న షరతులు చంద్రబాబు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉన్నాయని తెలిపారు. దర్యాప్తు ప్రభావితం కాకుండా ఉండేందుకే బెయిల్ మంజూరు సమయంలో న్యాయస్థానాలు షరతులు విధిస్తాయన్నారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చినా కోర్టు షరతులను ఉల్లంఘించలేదని, ర్యాలీలో పాల్గొనలేదన్నారు. ఆయనకు మద్దతు, సంఘీభావం తెలిపేందుకు ఆయన వద్దకే ప్రజలు వచ్చారన్నారు. న్యాయస్థానం షరతులను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దును కోరే స్వేచ్ఛ సీఐడీకి ఉందని, అందువల్ల సీఐడీ కోరుతున్న విధంగా షరతులు విధించాల్సిన అవసరం లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు అదనపు షరతుల విషయంలో శుక్రవారం తన నిర్ణయాన్ని వెలువరిస్తానని తెలిపారు. -
బాబుకు మళ్లీ భంగపాటు
సాక్షి, అమరావతి :చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. సిŠక్ల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధుల కుంభకోణం కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం తిరస్కరించింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను బెదిరించి దర్యాప్తును ప్రభావితం చేస్తారనే సీఐడీ వాదనతో న్యాయస్థానం ఏకీభవించిన ఏసీబీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. సర్వత్రా తీవ్ర ఆసక్తి కలిగించిన ఈ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. ఈ కేసులో చంద్రబాబు గత నెల 10 నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు.. ఆయన బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను సీఐడీ తీవ్రంగా వ్యతిరేకించింది. వాడీవేడిగా వాదనలు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టులో వరుసగా మూడ్రోజులపాటు ఇరుపక్షాల న్యాయవాదులు వాడీవేడిగా వాదనలు వినిపించారు. చంద్రబాబు తరఫున ఢిల్లీ నుంచి వచ్చిన సీనియర్ న్యాయవాది ప్రమోద్కుమార్ దూబే వాదనలు వినపిస్తూ బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అలాగే, సీఐడీ తరపున వాదనలు వినిపించిన ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ మంజూరు చేయవద్దని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ విదేశాలకు పరారైన విషయాన్ని పొన్నవోలు ప్రస్తావించారు. గతంలో న్యాయస్థానం ఎదుట 164 సీఆర్పీసీ వాంగ్మూలం ఇచ్చిన ఆర్థిక శాఖ రిటైర్డ్ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ ఇటీవల అందుకు విరుద్ధంగా పలు టీవీ చానళ్లలో మాట్లాడడాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చంద్రబాబు బెదిరింపులు, ఒత్తిడితోనే వారిద్దరూ పరారయ్యారని, పీవీ రమేశ్ మాట మార్చారని చెప్పారు. ఈ నేపథ్యంలో.. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తే ఇతర సాక్షులను కూడా బెదిరించి దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశాలున్నాయని పొన్నవోలు వివరించారు. ఇరుపక్షాల వాదనలను విని తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి.. బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరిస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ మేరకు 44 పేజీల తీర్పును వెలువరించారు. పీటీ వారెంట్లపై విచారణ వాయిదా.. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్నెట్ కేసుల్లో చంద్రబాబును అరెస్టుచేసి విచారించేందుకు పీటీ వారెంట్లను అనుమతించాలన్న సీఐడీ పిటిషన్లపై విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో సోమవారం వాడీవేడిగా వాదనలు సాగాయి. పీటీ వారెంట్లపై రైట్ టు ఆడియన్స్ పిటిషన్ వేశాం కాబట్టి తమ వాదనలు వినాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు పట్టుబట్టారు. దీనిపై సీఐడీ తరపు న్యాయవాది వివేకానంద అభ్యంతరం వ్యక్తంచేశారు. పీటీ వారెంట్లపై న్యాయస్థానం ఆదేశాలు సరిపోతాయన్నారు. ఈ అంశంపై న్యాయమూర్తి లేవనెత్తిన సందేహాలకు సీఐడీ తరపు న్యాయవాది సమాధానాలు ఇస్తుండగా.. చంద్రబాబు తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తంచేస్తూ సీఐడీ న్యాయవాదులు న్యాయస్థానాన్ని శాసిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై న్యాయమూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. న్యాయస్థానాన్ని ఎవరూ శాసించలేరని స్పష్టంచేస్తూ చంద్రబాబు న్యాయవాదులు తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు. ఇలా అయితే ఈ కేసులను విచారించలేనని.. స్పెషల్ కోర్టుకో వేరే వారికో బదిలీ చేయాలని రిజిస్ట్రీకి చెబుతానన్నారు. దీంతో చంద్రబాబు తరపు న్యాయవాదులు వెనక్కి తగ్గారు. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలకు అవకాశం ఇచ్చేందుకు కేసు విచారణను న్యాయమూర్తి మంగళవారానికి వాయిదా వేశారు. మళ్లీ కస్టడీకి నిరాకరణ.. మరోవైపు.. చంద్రబాబును మరోసారి విచారించేందుకు కస్టడీకి అనుమతించాలన్న సీఐడీ పిటిషన్ను కూడా న్యాయమూర్తి తిరస్కరించారు. గతంలో ఇచ్చిన రెండు రోజుల కస్టడీలో విచారణకు సహకరించలేదు కాబట్టి ఆయన్ని మరోసారి విచారించేందుకు మూడ్రోజుల కస్టడీకి అనుమతించాలని సీఐడీ కోరింది. జ్యుడీషియల్ కస్టడీ 15 రోజుల గడువు ముగిసినందున మరోసారి కస్టడీకి ఇవ్వొద్దని చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం చంద్రబాబును కస్టడీకి అప్పగించాలన్న పిటిషన్ను తిరస్కరించింది. -
చంద్రబాబు కుట్రపూరిత నేరానికి పాల్పడ్డారు: ఏఏజీ పొన్నవోలు
-
ఆడిటర్ వెంకటేశ్వర్లు కీలక పాత్ర...సంచలన నిజాలు బయటపెట్టిన ఏఏజీ పొన్నవోలు..!
-
టీడీపీకి.. స్కిల్ కార్పొరేషన్కు ఒక్కరే అడిటర్
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానంలో వాదనలు ముగిశాయి. గత రెండు రోజులుగా ఇరపక్షాలు సుదీర్ఘ వాదనలు వినిపించగా.. ఇవాళ(శుక్రవారం) అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి తుది వాదనలు వినిపించారు. అయితే వాదనల సమయంలో ఇవాళ కూడా కొన్ని సంచలన విషయాల్ని బయటపెట్టారాయన. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. స్కిల్ స్కామ్లో టీడీపీ ఖాతాలోకి మళ్లిన నిధుల వ్యవహారాన్ని నిన్న వాదనల సందర్భంగా డాక్యుమెంట్లతో సహా బయటపెట్టిన ఏఏజీ సుధాకర్రెడ్డి.. మూడవ రోజు వాదనలోనూ సంచలనాలు వెలుగులోకి తెచ్చారు. టీడీపీకి.. స్కిల్ స్కామ్లో ఆడిటర్గా పని చేసిన వ్యక్తి ఒక్కరేనని.. ఆయన్ని విచారిస్తే కేసులో చాలా విషయాలు బయటకు వస్తాయని కోర్టుకు తెలియజేశారు ఏఏజీ పొన్నవోలు. ఈ కేసులో టీడీపీ అడిటర్ వెంకటేశ్వర్లుని విచారించాల్సి ఉంది. ఈ నెల 10వ తేదీన సీఐడీ విచారణకి రావాలని ఆయనకి నోటీసులిచ్చాం. ఆడిటర్ వెంకటేశ్వర్లే స్కిల్ కార్పోరేషన్కి ఆడిటర్ గా పనిచేశారు. ఈ రెండింటికీ ఒక్కరే ఆడిటర్ కావడంతో నిధులు దారి మల్లింపు వ్యవహారం బయటపడకుండా మేనేజ్ చేశారు. తద్వారా చంద్రబాబు కుట్రపూరిత నేరానికి పాల్పడ్డారు. పైగా సీఎం హోదాని చంద్రబాబు అడ్డు పెట్టుకుని షెల్ కంపెనీల ద్వారా టీడీపీ ఖాతాకి నిధులు మళ్లించారు. జీవో నెంబర్ 4 ని అడ్డం పెట్టుకుని నిధులు దిగమింగారు. కాబట్టి.. చంద్రబాబుకి ఈ కేసులో సెక్షన్ 409 వర్తిస్తుంది అని పొన్నవోలు కోర్టులో వాదించారు. ఈ దశలో చంద్రబాబుకి బెయిల్ ఇవ్వొద్దని.. ఆయన్ని మరింత విచారించాల్సిన అవసరం ఉందని, మరీ ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలపై చంద్రబాబును విచారించాల్సి ఉందని ఏఏజీ పొన్నవోలు ఏసీబీ కోర్టుకు తెలియజేశారు. చంద్రబాబు ఆదాయపన్ను వివరాలు కూడా తీసుకుంటున్నామని చెప్పారాయన. చంద్రబాబు సహకరించలేదు బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిసిన తర్వాత.. చంద్రబాబు కస్టడీ పిటీషన్పై ఏఏజీ పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు వినిపించారు. స్కిల్ కుంభకోణం కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది. చంద్రబాబు గత రెండు రోజులకస్టడీలో సీఐడీకి సహకరించలేదు. సెంట్రల్ జైలులోనే చంద్రబాబుని మరోసారి విచారించడానికి అవకాశమివ్వండి. [di చంద్రబాబుని కనీసం మూడు రోజుల కస్టడీకి ఇవ్వండి. చంద్రబాబుని విచారణ చేస్తేనే కొంతవరకైనా నిజం బయటకి వస్తుంది అని కోర్టును కోరారాయన. ఇక బ్యాంకర్ల నుంచి వివరాలు సేకరించారన్న చంద్రబాబు లాయర్ల ఆరోపణలపై ఏఏజీ పొన్నవోలు స్పందించారు. చంద్రబాబు ఎన్నికల కమిషన్కు సమర్పించిన ఐటీ రిటర్స్ని మాత్రమే డౌన్ లోడ్ చేశాం. బ్యాంకర్ల నుంచి ఎక్కడా తీసుకోలేదని స్పష్టత ఇచ్చారాయన. -
‘స్కిల్ స్కామ్’ సూత్రధారి, లబ్ధిదారు చంద్రబాబే
సాక్షి, అమరావతి : టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.371 కోట్లు కొల్లగొట్టిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే ప్రధాన సూత్రధారి, లబ్ధిదారు అనేందుకు ఆధారాలను సీఐడీ ఒక్కొక్కటిగా కోర్టు ముందుంచుతోంది. ఈ కుంభకోణంలో కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరిన బ్యాంకు స్టేట్మెంట్లు, రికార్డులను సీఐడీ తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి గురువారం ఏసీబీ న్యాయస్థానం ముందుంచారు. ఈ కుంభకోణం ప్రధాన సూత్రధారి, లబ్ధిదారు చంద్రబాబేనని ఏఏజీ స్పష్టంచేశారు. దారి మళ్లించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకే చేరాయని చెప్పారు. అందులో రూ.27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయని చెబుతూ ఆ రికార్డులను న్యాయస్థానానికి సమర్పించారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న ప్రస్తుత తరుణంలో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయకూడదని న్యాయస్థానాన్ని కోరారు. ఈ కుంభకోణం కేసులో అరెస్టయి రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను విజయవాడ ఏసీబీ న్యాయస్థానం వరుసగా రెండో రోజు గురువారం విచారించింది. సీఐడీ తరపున ఏఏజీ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ కుంభకోణం ద్వారా అక్రమంగా తరలించిన నిధుల్లో రూ.27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాల్లోకి చేరడం సాధారణ విషయం కాదని చెప్పారు. ఈ అంశంపై విచారించేందుకు టీడీపీ ఆడిటర్ను ఈ నెల 10న సీఐడీ విచారణకు పిలిచిందని తెలిపారు. ఈ కుంభకోణంలో మిగిలిన నిధులు కూడా షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు ఎలా చేరాయో వివరించారు. ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే నిధులు విడుదల చేశారని చెప్పారు. నిధుల విడుదలకు అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి సునీత లిఖితపూర్వకంగా తెలిపిన అభ్యంతరాలను న్యాయస్థానానికి సమర్పించారు. ఈ కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు కీలక దశలో ఉందన్నారు. ఈ తరుణంలో చంద్రబాబుకు బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరించి కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశాలున్నాయని తెలిపారు. నిధుల తరలింపులో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ను సీఐడీ విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇవ్వగానే ఆయన పరారైన విషయాన్ని మరోసారి న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు దారి మళ్లాయని గతంలో 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇచ్చిన అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ ఇటీవల అందుకు భిన్నంగా వ్యాఖ్యలు చేస్తున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేస్తున్నారనడానికి ఇవన్నీ ఉదాహరణలని చెప్పారు. దర్యాప్తు సక్రమంగా సాగి మొత్తం కుట్రను వెలికితీసే వరకూ చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. రెండు రోజుల కస్టడీలో విచారణకు చంద్రబాబు సహకరించలేదని, అందువల్ల ఆయన్ని మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతించాలని కోరారు. చంద్రబాబు తరపున ఢిల్లీ నుంచి వచ్చిన న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపిస్తూ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఒప్పందంతో అప్పటి సీఎం చంద్రబాబు పాత్ర ముగిసిందని, ఆ తరువాత జరిగే అవినీతి, అక్రమాలతో ఆయనకు సంబంధం లేదని అన్నారు. సాంకేతికంగా ఈ ప్రాజెక్టుతో చంద్రబాబుకు సంబంధం లేదన్నారు. సీఎం హోదాలోనే చంద్రబాబు నిధుల మంజూరుకు అనుమతించారని చెప్పారు. కాబట్టి చంద్రబాబును మరోసారి కస్టడీకి ఇవ్వొద్దని, బెయిల్ మంజూరు చేయాలని కోరారు. చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఇరువర్గాల వాదనలను శుక్రవారం కూడా వింటామని ఏసీబీ న్యాయస్థానం తెలిపింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. -
ఈ నెల 19 వరకు చంద్రబాబుకు రిమాండ్ పొడిగింపు
-
స్కిల్ స్కాం కేసులో కీలక డాక్యుమెంట్ల సమర్పణ
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు విచారణలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయవాడ అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం(ACB Court)లో దర్యాప్తు సంస్థ తరపున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి కీలక ఆధారాలను సమర్పించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో బాబు పాత్రపై ఆధారాలు ఉన్నాయని ఏఏజీ వెల్లడించారు. నైపుణ్య శిక్షణ పేరుతో 370 కోట్ల నిధులను దిగమింగారు. ఏ రకంగా డొల్ల కంపెనీల నుంచి ఈ నిధులు నేరుగా టీడీపీ ఖాతాలోకి వచ్చాయన్న దానిపై ఏఏజీ ఆధారాలను కోర్టుకు సమర్పించారు. రూ.27 కోట్లు మళ్లించిన బ్యాంకు ఖాతాల డాక్యుమెంట్లను ACB కోర్టుకు సమర్పించారు. దీనికి సంబంధించిన ఆడిటర్ను విచారణకు పిలిచామని, ఈ నెల 10 న విచారణకు ఆడిటర్ వస్తానన్నారని ఏఏజీ తెలిపారు. డొల్ల కంపెనీలను సృష్టించి హవాలా రూపంలో నిధులు దిగమింగిన వైనాన్ని ఏఏజీ పొన్నవోలు వివరించారు. చదవండి: పవన్ కల్యాణ్ను బీజేపీనే వద్దనుకుందా? -
స్కిల్ స్కామ్ లో బాబు పాత్రపై ఆధారాలున్నాయి: పొన్నవోలు
-
దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారు.. సాక్షులను బెదిరిస్తున్నారు
సాక్షి, విజయవాడ: ‘స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసు కీలక దశలో ఉంది. రూ.371 కోట్లు కొల్లగొట్టిన ఈ సామాజిక, ఆర్థిక కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా తానై చంద్రబాబు వ్యవహరించారు. ఈ కేసులో ఇప్పటికే ఆయన సాక్షులను బెదిరిస్తున్నారు. ఈ తరుణంలో ఆయన బెయిల్పై బయటకొస్తే మిగిలిన సాక్షులను బెదిరించి కేసు దర్యాప్తును ప్రభావితంచేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను తిరస్కరించాలని కోరుతున్నా’.. అని రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి న్యాయస్థానాన్ని కోరారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు బెయిల్ పిటిషన్ను విజయవాడ ఏసీబీ న్యాయస్థానం బుధవారం విచారించింది. ఈ సందర్భంగా అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తూ చంద్రబాబుకు బెయిల్ పిటిషన్ను తిరస్కరించేందుకు ఉన్న బలమైన కారణాలను న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ కుంభకోణంలో చంద్రబాబు పాత్ర సుస్పష్టమన్నారు. జీఓ జారీ, అందుకు విరుద్ధంగా ఒప్పందం కుదుర్చుకోవడం, అధికారుల నియామకం, ఆర్థిక శాఖ అధికారుల అభ్యంతరాలను తోసిపుచ్చుతూ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిధుల విడుదల.. ఇలా అన్ని దశల్లోనూ చంద్రబాబే ప్రధాన పాత్ర పోషించారని చెప్పారు. అందుకు 13 నోట్ఫైళ్లపై చంద్రబాబు సంతకాలు చేయడమే నిదర్శనమన్నారు. జీఓ నంబర్ 4 కంటే ముందే ఒప్పందం కుదుర్చుకున్నారని.. కానీ, ఆ ఒప్పందాన్ని జీఓలో ఎందుకు ప్రస్తావించలేదన్నది ఈ కేసులో కీలకమన్నారు. ఆర్థిక శాఖ అధికారులు లేవనెత్తిన అభ్యంతరాలను చంద్రబాబు దురుద్దేశపూరితంగానే తన విచక్షణాధికారాలు (వీటో)తో తోసిపుచ్చారని న్యాయస్థానానికి వివరించారు. బాబు బెదిరింపులపై ఆధారాలున్నాయి.. అంతేకాదు.. తాను చెప్పినట్లు చేయకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని.. వారిని పదవుల నుంచి తొలగిస్తానని ఆనాడు సీఎంహోదాలో చంద్రబాబు అధికారులను బెదిరించినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని కూడా పొన్నవోలు న్యాయస్థానానికి వివరించారు. స్కిల్ కుంభకోణం ఏమీ ఫిక్షన్ కథ కాదని, ప్రభుత్వ నిధులు కొల్లగొట్టిన అవినీతి వ్యవహారమని చెప్పారు. ఆ మేరకు సమగ్ర దర్యాప్తు ద్వారా సీఐడీ గుర్తించి నివేదించిన ఆధారాలను పరిశీలించాలని న్యాయస్థానాన్ని కోరారు. షెల్ కంపెనీలు, నకిలీ ఇన్వాయిస్ల ద్వారా పన్ను ఎగవేతను 2017లోనే జీఎస్టీ అధికారులు గుర్తించారన్నారు. ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థల దర్యాప్తులో ఉండగానే 2018లో 17వ సవరణ చేశారనే విషయాన్ని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి ఈ కేసులో చంద్రబాబుకు 17ఏ వర్తించదన్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే వారిద్దరు పరార్.. ఇక నిధులను అక్రమంగా తరలించడంలో కీలక వ్యక్తులైన చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని దేశం విడిచి పరారైన ఉదంతాన్ని ప్రస్తావించారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని వారిని సీఐడీ నోటీసులు ఇవ్వగానే దేశం విడిచిపెట్టి పోవడం తీవ్రమైన పరిణామమన్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే వారిద్దరూ పరారయ్యారని చెప్పారు. పెండ్యాల శ్రీనివాస్ పాస్పోర్ట్ను సీజ్ చేసేలా న్యాయస్థానం ఆదేశించాలని కోరారు. ఇక ఈ కేసులో గతంలో 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇచ్చిన అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ ప్రస్తుతం అందుకు భిన్నంగా మీడియా చానళ్లలో చర్చల్లో మాట్లాడుతుండటం వెనుక చంద్రబాబు ఒత్తిడి ఉందన్నారు. కాబట్టి ఈ తరుణంలో చంద్రబాబుకు బెయిల్ ఇస్తే ఆయన తన రాజకీయ పలుకుబడితో సాక్షులను బెదిరించి కేసు దర్యాప్తును పక్కదారి పట్టించే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయన్నారు. కాబట్టి ఈ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ను తిరస్కరించాలని న్యాయస్థానాన్ని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి కోరారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశంలేదు : దూబే అంతకుముందు.. ఈ కేసులో ముద్దాయి చంద్రబాబు తరపున ఢిల్లీ నుంచి వచ్చిన న్యాయవాది ప్రమోద్కుమార్ దూబే వాదనలు వినిపిస్తూ.. ఆర్థిక శాఖ అధికారులు గుజరాత్ వెళ్లి అధ్యయనం చేసి ఎలాంటి అభ్యంతరాలు తెలపలేదన్నారు. ఈ ప్రాజెక్టు విలువను నిర్ణయించిన కాస్ట్ వేల్యూయేషన్ కమిటీలో చంద్రబాబు లేరన్నారు. ఆ కమిటీలో సభ్యుడిగా ఉన్న భాస్కరరావు ప్రస్తుతం బెయిల్పై ఉన్నారని చెప్పారు. కేబినెట్ నిర్ణయం మేరకు చేసుకున్న ఒప్పందంలో చంద్రబాబును తప్పుబట్టడానికి లేదన్నారు. సాక్షులను ప్రభావితం చేయడంగానీ, ఆధారాలను ధ్వంసం చేయడంగానీ పరారయ్యే అవకాశంగానీ లేనందున చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. అనంతరం.. చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణను న్యాయస్థానం గురువారానికి వాయిదా వేసింది. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆయనకు పీటీ వారంట్ జారీచేయాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లపై కూడా న్యాయస్థానం గురువారం విచారించే అవకాశాలున్నాయి. వాదనలపై వక్రీకరణలా!? ఏబీఎన్, టీవీ–5పై ఏఏజీ పొన్నవోలు ఆగ్రహం మరోవైపు.. న్యాయస్థానంలో జరిగిన వాదనలను వక్రీకరిస్తూ ఏబీఎన్, టీవీ–5 చానళ్లు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి మండిపడ్డారు. ఆ రెండు చానళ్లు తనను లొంగదీసుకోవాలని చూస్తున్నాయని.. అది సాధ్యం కాకపోవడంతో తనపై బురద జల్లుతున్నాయని ఆయన విమర్శించారు. విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ప్రాంగణంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసు విచారణ సమయంలో న్యాయస్థానం తనపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు ఏబీఎన్, టీవీ–5 చానళ్లు దుష్ప్రచారం చేశాయని విమర్శించారు. అత్యంత కీలకమైన ఈ కేసులో ప్రభుత్వం తరఫున తాను బుధవారం మధ్యాహ్నం 2.30గంటల నుంచి 5గంటల వరకు వినిపించిన వాదనను న్యాయస్థానం ఓపిగ్గా విందన్నారు. ఆ సమయంలో న్యాయస్థానం తనపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని.. నిరూపించలేకపోతే ఏం చేస్తారని ఏబీఎన్, టీవీ–5 చానళ్లకు పొన్నవోలు సవాల్ విసిరారు. ఆ రెండు చానళ్లు టీవీ చర్చల్లో తనను తిట్టిస్తున్నా సహించానని కానీ, ఏకంగా న్యాయస్థానంలో వాదనలను వక్రీకరించడాన్ని మాత్రం ఉపేక్షించేది లేదన్నారు. ఈ విషయాన్ని గురువారం విచారణ సమయంలో న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఆ రెండు చానళ్లకు ధైర్యం ఉంటే గురువారం న్యాయస్థానం విచారణ సమయంలో రావాలని సవాల్ విసిరారు. -
ఏబీఎన్, టీవీ-5పై పొన్నవోలు తీవ్ర ఆగ్రహం
సాక్షి, విజయవాడ: ఏబీఎన్, టీవీ-5 తీరుపై ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీఎన్, టీవీ-5లో కోర్టు వాదనలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘‘ఏబీఎన్, టీవీ-5 దిగజారి ప్రవర్తిస్తున్నాయి. ఏబీఎన్, టీవీ-5 దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నాయి. పచ్చి అబద్ధాలను ప్రసారం చేస్తున్నారు. కోర్టు నా వాదనలకు అడ్డుపడినట్టు ప్రసారం చేశారు. కోర్టు నన్ను తిట్టినట్టుగా ప్రచారం చేస్తున్నారు. బుట్టలో వేసుకో.. పడకపోతే బురద చల్లు.. ఇదే విధానాలతో ఏబీఎన్,టీవీ-5 ఛానెళ్లు నడుస్తున్నాయి. నాపై ఇష్టమొచ్చినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారాలకు నేను భయపడే ప్రసక్తే లేదు’’ అని పొన్నవోలు పేర్కొన్నారు. ‘‘2:30 నుంచి 5 గంటల వరకు వాదనలు వినిపించాను. బయటకు వచ్చేసరికి ఎల్లో మీడియా నాపై దుష్ప్రచారం చేసింది. ఏదో జరిగిపోతోందని ప్రచారం చేస్తున్నారు. రేపు న్యాయమూర్తిని అడుగుతాను. కోర్టు నన్ను మందలించి ఉంటే ఏ శిక్ష కైనా సిద్ధం. నాపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. డిబేట్లలో నీచంగా తిట్టిస్తున్నారు. న్యాయమూర్తి నేను చెప్పిన వాదనలను ఓపికగా విన్నారు. నేను రాష్ట్రం తరపున బాధ్యత నిర్వర్తిస్తున్నారు. అన్నింటికీ సిద్ధపడే వచ్చాను’’ అని పొన్నవోలు సుధాకర్రెడ్డి స్పష్టం చేశారు. చదవండి: పవన్ మాటల వెనుక ఆంతర్యం ఏమిటో? -
బెయిల్ పిటిషన్ వేసి... వాదనలకు సిద్దం కావడం లేదు ఎందుకు..?
-
బాబు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో ముగిసిన వాదనలు
సాక్షి, అమరావతి: యుద్ధభేరి పేరుతో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల సందర్శన సందర్భంగా అన్నమయ్య జిల్లా అంగళ్లు నుంచి చిత్తూరు జిల్లా పుంగనూరు వరకు టీడీపీ శ్రేణులు ఇటీవల సాగించిన విధ్వంసంపై నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు మంగళవారం ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్రెడ్డి తీర్పును రిజర్వ్ చేశారు. పోలీసుల తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అసలు ఈ బెయిల్ పిటిషన్కు విచారణార్హతే లేదన్నారు. మరో కేసులో అరెస్టయినందున ఈ కేసులో కూడా అరెస్టయినట్లు భావించడానికి వీల్లేదన్నారు. పలు కేసులు ఒకే పోలీస్టేషన్లో నమోదై, వాటిని ఒకే అధికారి దర్యాప్తు చేస్తుంటే అప్పుడు డీమ్డ్ (అన్నీ కేసుల్లో అరెస్ట్ అయినట్లు) అరెస్ట్ వస్తుందని, వేర్వేరు కేసులు, వేర్వేరు దర్యాప్తు అధికారులున్నప్పుడు అది డీమ్డ్ అరెస్ట్ కిందకు రాదని స్పష్టంచేశారు. డీమ్డ్ అరెస్ట్ అయితే పీటీ వారెంట్తో పనేముంటుందని ప్రశ్నించారు. చట్ట ప్రకారమే పీటీ వారెంట్ దాఖలు చేశామన్నారు. అసలు చంద్రబాబు ప్రోద్బలంతోనే అంగళ్లు ఘటన జరిగిందన్నారు. అంగళ్లు వద్ద మొదలైన టీడీపీ శ్రేణుల విధ్వంసం చిత్తూరు జిల్లా పుంగనూరు వరకు కొనసాగిందని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేతగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన చంద్రబాబే దగ్గరుండి శ్రేణులను రెచ్చగొట్టారని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలను పరిశీలించాలని కోర్టును కోరారు. మారణహోమం సృష్టించడం ద్వారా శాంతిభద్రతల సమస్య లేవనెత్తాలన్నదే చంద్రబాబు వ్యూహమన్నారు. అంతిమంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్ర పన్నారని తెలిపారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు బెయిల్ పిటిషన్ను కొట్టేయాలని ఆయన కోరారు. అంతకు ముందు చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ మరో కేసులో అరెస్టయి జైలులో ఉన్నందున, ఈ కేసులో కూడా అరెస్టయినట్లు భావించాల్సి ఉంటుందన్నారు. అందుకే బెయిల్ పిటిషన్ వేశామని తెలిపారు. అధికార పార్టీ నేతలు చంద్రబాబు కాన్వాయ్పై రాళ్లు రువ్వారని, ఆ దాడి నుంచి ఆయన్ని వ్యక్తిగత భద్రతా సిబ్బంది రక్షించారని తెలిపారు. ఘటన జరిగిన నాలుగు రోజుల తరువాత ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే పలువురికి హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరైందని చెప్పారు. -
స్కిల్ కుంభకోణం బాబు ఆలోచనల నుంచే
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మాజీ సీఎం చంద్రబాబు నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లో వాదనలు ముగిశాయి. దాదాపు మూడున్నర గంటల పాటు వాదనలు విన్న ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం దీనిపై గురువారం తీర్పు వెలువరిస్తామని ప్రకటించింది. అంతకు ముందు సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ చంద్రబాబు ఆలోచనల నుంచే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం పుట్టిందని కోర్టుకు నివేదించారు. దీనికి సంబంధించిన ప్రతి విషయం ఆయనకు తెలుసని, ఈ కుంభకోణంలో అంతిమ లబ్దిదారులు చంద్రబాబుతో పాటు ఆయనకు సంబంధించిన వ్యక్తులేనని నివేదించారు. తమ వద్ద ఉన్న ఆధారాలను దగ్గర పెట్టుకుని చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంత పెద్ద కుంభకోణంలో 24 గంటల్లో దర్యాప్తు పూర్తి చేయడం సాధ్యం కాదన్నారు. చంద్రబాబును తాము (సీఐడీ) విచారిస్తే ఆయనకు వ చ్చిన నష్టం ఏమీ ఉండదని, అదే తాము విచారించకుంటే దర్యాప్తునకు తీరని నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. పోలీసు కస్టడీకి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి కాబట్టే చంద్రబాబు పోలీసు కస్టడీని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. నిందితుడు కోర్టును అలా చేయడానికి వీల్లేదు, ఇలా చేయడానికి వీల్లేదని శాసించలేడన్నారు. నిందితుడు ముందు న్యాయం మోకరిల్లరాదని, ఒకవేళ అలా జరిగితే వ్యవస్థ కుప్పకూలినట్లేనన్నారు. విచారణలో మౌనంగా ఉండే హక్కు నిందితుడికి ఉందని, అయితే విచారణకు సహకరించాల్సిన బాధ్యత కూడా నిందితుడిపై ఉందని కోర్టుకు నివేదించారు. ఈ కుంభకోణాన్ని రాజకీయ కారణాలతో వెలికి తీసినట్లు చంద్రబాబు న్యాయవాదులు చెబుతున్నారని, వాస్తవానికి దీన్ని పుణె జీఎస్టీ అధికారులు వెలికి తీశారని తెలిపారు. ఈ కుంభకోణానికి సంబంధించిన వివరాలను జీఎస్టీ అధికారులు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం (టీడీపీ సర్కారు) దృష్టికి తెచ్చారని, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎలా దారి మళ్లించారో వివరించారని చెప్పారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నామమాత్రపు చర్యలతో జీఎస్టీ అధికారులు ఇచ్చిన సమాచారాన్ని తొక్కిపెట్టిందని తెలిపారు. ఆ తరువాత షెల్ కంపెనీల గుట్టు రట్టు కావడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి వాటితో సంబంధం ఉన్న వారందరికీ నోటీసులు జారీ చేశాయని చెప్పారు. ఐటీ శాఖ నోటీసులు ఇవ్వగానే చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన ఇద్దరు వ్యక్తులు విదేశాలకు పారిపోయారని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రజాధనంతో ముడిపడి ఉన్న ఇలాంటి కేసును రాజకీయ ప్రేరేపితం, కక్ష సాధింపు అనడం దారుణమన్నారు. చంద్రబాబు పాత్రకు సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు ఒకటిన్నర సంవత్సరం పట్టిందని, దీన్ని బట్టి ఎంత పకడ్బందీగా ఈ కుంభకోణానికి వ్యూహరచన చేశారో అర్థం చేసుకోవాలని కోర్టును కోరారు. చంద్రబాబును విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని అభ్యర్థించారు. ఇప్పుడు కస్టడీ కోరడం ఏమిటి? చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ లూథ్రా, సిద్దార్థ అగర్వాల్ వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే అన్ని ఆధారాలు సేకరించామని, వాటి ఆధారంగా చంద్రబాబును జ్యుడీషియల్ రిమాండ్కు పంపాలని సీఐడీ మొదటి రోజే కోర్టును కోరిందని పేర్కొన్నారు. అన్ని ఆధారాలు సేకరించినప్పుడు ఇప్పుడు తిరిగి పోలీసు కస్టడీకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఏముందన్నారు. స్కిల్ కేసులో 2021లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, 2023లో చంద్రబాబును అరెస్ట్ చేసిందని, ఇంత కాలం సీఐడీ ఏం చేస్తున్నట్లని ప్రశ్నించారు. వారి అలసత్వానికి చంద్రబాబును కస్టడీకి కోరడానికి వీల్లేదన్నారు. 45 ఏళ్లుగా చంద్రబాబు కాపాడుకుంటూ వచ్చిన ప్రతిష్టను కాలరాసేందుకే సీఐడీ ఆయన్ను కస్టడీకి ఇవ్వాలని కోరుతోందన్నారు. సిట్ కార్యాలయంలో చంద్రబాబును విచారిస్తున్న సమయంలో దర్యాప్తు అధికారులు ఆ వివరాలను మీడియాకు లీక్ చేశారని తెలిపారు. చంద్రబాబు ఎమ్మెల్యే కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ కేసు మొత్తం ఎంపీ, ఎమ్మెల్యేల కేసులను విచారించే ప్రత్యేక కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కేసును విచారించే పరిధి ఏసీబీ కోర్టుకు లేదన్నారు. పరిధి లేకుంటే ఎందుకీ పిటిషన్లు? దీనికి సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ సుధాకర్రెడ్డి, స్పెషల్ పీపీ వివేకానంద తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేల కేసులను విచారించే ప్రత్యేక కోర్టులు.. ప్రజా ప్రతినిధులు నిందితులుగా ఉన్న కేసుల్లో చార్జిషీట్ దాఖలైన తరువాత ట్రయల్ మొదలు పెట్టి విచారణ కొనసాగించేందుకు మాత్రమే ఉద్దేశించినవన్నారు. రిమాండ్ విషయంలో ఆ కోర్టులు జోక్యం చేసుకోలేవన్నారు. ఒకవేళ ఏసీబీ కోర్టుకు విచారణ పరిధి లేదని భావిస్తే ఆ విషయాన్ని మొదటే చెప్పి ఉండాల్సిందన్నారు. ఏసీబీ కోర్టుకు విచారణ పరిధి లేకుంటే హౌస్ రిమాండ్, బెయిల్, మధ్యంతర బెయిల్ ఇలా ఇన్ని పిటిషన్లు ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించారు. ఒకవైపు పరిధి లేదంటూనే మరో వైపు ఇన్ని పిటిషన్లు వేయడం చంద్రబాబు తీరును తెలియచేస్తోందన్నారు. మేం సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు.. ఏసీబీ కోర్టు కేసు విచారణ మొదలు కాగానే సీఐడీ కస్టడీ పిటిషన్లో చంద్రబాబు దాఖలు చేసిన కౌంటర్ను పరిశీలించింది. అందులో కోర్టును శంకించేలా పేర్కొన్న అంశాలపై అభ్యంతరం తెలిపింది. చంద్రబాబు న్యాయవాదుల తీరుతో ఒకింత మనస్తాపం చెందిన కోర్టు.. ఈ కేసును తాము విచారించడంపై మీకేమైనా అభ్యంతరం ఉందా? అంటూ సీఐడీ న్యాయవాదులను ప్రశ్నించింది. నిబంధనల ప్రకారం విచారణ జరుపుతున్న నేపథ్యంలో తమకు అభ్యంతరం లేదని సీఐడీ న్యాయవాదులు చెప్పారు. ఇదే ప్రశ్నను చంద్రబాబు తరఫు న్యాయవాదులను కోర్టు అడిగినప్పటికీ వారు మౌనంగా ఉన్నారు. అయినప్పటికీ కోర్టు మరోసారి అడగటంతో.. తాము సర్టిఫై చేయాల్సిన అవసరం లేదంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఒకింత తీవ్ర స్వరంతో బదులిచ్చారు. దీంతో కోర్టు విచారణను ప్రారంభించింది. ఆ దృశ్యాలతో మాకేం సంబంధం లేదు.. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణ దృశ్యాలు మీడియాలో రావడంపై ప్రశ్నించింది. ఆ దృశ్యాలను తాము లీక్ చేశామంటున్న చంద్రబాబు న్యాయవాదులు అందుకు ఆధారాలుంటే చూపాలని సీఐడీ స్పెషల్ పీపీ వివేకానంద కోరారు. ఆ దృశ్యాలు మీడియాలో ఎలా వచ్చాయో, వాటిని ఎవరు చిత్రీకరించారో తమకు తెలియదన్నారు. విచారణ రోజు చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు, సహాయకులు కూడా కలిశారని కోర్టు దృష్టికి తెచ్చారు. -
చంద్రబాబును అన్ని ఆధారాలతో సీఐడీ అరెస్ట్ చేసింది: ఏఏజీ
-
అవినీతి కేసులో బాబును జైలుకు పంపిన వ్యక్తి పొన్నవోలు: న్యాయవాదులు
-
కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు దోచుకున్నారు: ఏఏజీ
-
కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు దోచుకున్నారు: ఏఏజీ
-
‘స్కిల్’ స్కామ్ కేసు: ప్రజాధనాన్ని లూటీ చేశారు
సాక్షి, అమరావతి: ప్రజాధనం దుర్వినియోగం అధికార విధుల్లో ఎంతమాత్రం భాగం కాదని, అందువల్ల స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మాజీ సీఎం చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. చంద్రబాబు స్వలాభాపేక్షతో, ఉద్దేశపూర్వకంగా రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, రంజిత్ కుమార్, అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి హైకోర్టుకు మంగళవారం నివేదించారు. ఇదంతా అప్పటి సీఎం చంద్రబాబుకు తెలిసే, ఆయన సమక్షంలోనే జరిగిందన్నారు. ప్రభుత్వ ఖజానాకు రూ.371 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కుంభకోణంలో చంద్రబాబు పాత్రకు సంబంధించి పూర్తి ఆధారాలను సేకరించేందుకు సీఐడీకి ఇంత సమయం పట్టిందని, చిన్న ఛాన్స్ కూడా తీసుకోలేదని, పక్కా ఆధారాలున్నాయని నిర్ధారించుకున్న తరువాతనే చంద్రబాబు అరెస్ట్ వరకు వెళ్లామన్నారు. గుజరాత్లో ఇదే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలకు రూ.కోటి చెల్లించగా, మన రాష్ట్రంలో మాత్రం అవే కేంద్రాలకు రూ.వందల కోట్లు చెల్లించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసు రాజకీయ ప్రేరితమంటూ చంద్రబాబు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని కోర్టుకు వివరించారు. నిజాయతీతో పనిచేసే అధికారులు, ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులను రాజకీయ కక్ష సాధింపుల నుంచి కాపాడేందుకే అవినీతి నిరోధక చట్టంలో 17ఏను చేర్చారే కానీ, నిర్భీతితో పట్ట పగలే ప్రజాధనాన్ని లూటీ చేసిన చంద్రబాబు వంటి వారి కోసం కాదన్నారు. ప్రజాధనానికి ధర్మకర్తగా, రక్షకుడిగా వ్యవహరించాల్సిన వ్యక్తి భక్షకుడిగా మారి రూ.వందల కోట్లను దారి మళ్లించేశారన్నారు. ఇది పూర్తిగా అనధికారిక విధుల కిందకే వస్తుందని, అందువల్ల చంద్రబాబుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ఎంత మాత్రం వర్తించదని స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని, ఈ దశలో దర్యాప్తునకు ఆటంకం కలిగించేలా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని కోర్టును అభ్యర్థించారు. ఈ కేసులో ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సైతం దర్యాప్తు చేపట్టాయని నివేదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా విచారణ నిమిత్తం చంద్రబాబును తమ కస్టడీకి అప్పగించాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లో కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులను సోమవారం వరకు ఒత్తిడి చేయవద్దంటూ ఏసీబీ కోర్టును ఆదేశిస్తూ గత వారం ఇచ్చిన ఉత్తర్వులను న్యాయమూర్తి పొడిగించలేదు. సుదీర్ఘంగా వాదనలు.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్టయిన మాజీ సీఎం చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్లో భాగంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ చంద్రబాబు గత మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు ఆధారంగా విజయవాడ ఏసీబీ కోర్టు తనకు రిమాండ్ విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సైతం కొట్టేయాలని ఆయన తన పిటిషన్లో కోరారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టులో మధ్యాహ్నం 12.05 గంటలకు మొదలైన వాదనలు సాయంత్రం 5.20 వరకు నిరాటంకంగా కొనసాగాయి. వాదనల సమయంలో కోర్టు హాలు కిక్కిరిసిపోయింది. చంద్రబాబు తరఫున దేశంలోనే అత్యంత ఖరీదైన సీనియర్ న్యాయవాదిగా పేరున్న హరీష్ సాల్వే, టీడీపీ తరఫున ప్రతి కేసును వాదించే మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. లండన్లో ఉంటున్న హరీష్ సాల్వే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన వాదనలను వినిపించారు. ఈ సందర్భంగా అర్ణబ్ గోస్వామి కేసును కూడా ప్రస్తావించారు. 2024లో ఎన్నికలు రాబోతున్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు. ప్రభుత్వం తన కౌంటర్ను చివరి నిమిషంలో తమకు అందచేసిందని, ముందే అందచేసి ఉండాల్సిందని సాల్వే పేర్కొనగా, సీఐడీ తరఫు సీనియర్ న్యాయవాది రంజిత్కుమార్ జోక్యం చేసుకుని ఇది కూడా కక్షపూరిత రాజకీయంలో భాగమేనంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు మనుషులు విదేశాలకు పారిపోయారు.. ఐటీ శాఖ అధికారులు చంద్రబాబుకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులకు నోటీసులు ఇవ్వగానే ఒకరు దుబాయ్కి, మరొకరు వాషింగ్టన్కు పారిపోయారని సీఐడీ తరఫున న్యాయవాదులు తెలిపారు. డిజైన్ టెక్ కంపెనీ రూ.200 కోట్లు దారి మళ్లించినట్లు ఫోరెన్సిక్ ఆడిట్లో బహిర్గతమైందన్నారు. పలు కీలక డాక్యుమెంట్లను మాయం చేశారని, వాటన్నింటినీ కూడా వెతికే పనిలో దర్యాప్తు అధికారులుఉన్నారని తెలిపారు. ముగ్గురి వాదనలు పూర్తి కాగానే దీనిపై సాల్వే, లూథ్రా తిరుగు సమాధానం ఇచ్చారు. అనంతరం న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఈ వ్యవహారంలో ఏం చెప్పాలనుకున్నా, ఇప్పుడే చెప్పాలని, ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం లేదని, ప్రధాన వ్యాజ్యంపైనే నిర్ణయం వెలువరిస్తానని తేల్చి చెప్పారు. ఇరుపక్షాలు వాదనలు పూర్తి చేయడంతో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. 10 రోజుల్లోనే కొట్టేయాలంటున్నారు సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ, రంజిత్ కుమార్, పొన్నవోలు సుధాకర్రెడ్డిలు వాదనలు వినిపిస్తూ స్కాం జరిగిన తీరును వివరించారు. స్కిల్ కుంభకోణంలో దర్యాప్తు కొనసాగుతోందని, పలువురిని విచారించాల్సి ఉందని, మరి కొందరిని అరెస్ట్ చేయాల్సి ఉందని తెలిపారు. దర్యాప్తు దశలో కేసును కొట్టేయడానికి వీల్లేదని, ఈ విషయంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పునిచ్చిందంటూ నిహారికా కేసులో సుప్రీంకోర్టు తీర్పును చదివి వినిపించారు. సెప్టెంబర్ 7న చంద్రబాబును నిందితుడిగా చేర్చారని, 9న అరెస్ట్ చేశారని, 12న ఆయన తనపై కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. చంద్రబాబుపై కేసు నమోదు చేసి కేవలం 10 రోజులే అయిందన్నారు. తాము కౌంటర్ ఇప్పుడే ఇచ్చామని చంద్రబాబు న్యాయవాదులు చెబుతున్నారని, వాస్తవానికి 900 పేజీల అదనపు డాక్యమెంట్లను వారు ఇప్పుడే తమకు అందచేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రజాధనాన్ని లూటీ చేసిన వారికి అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ అసలు వర్తించదన్నారు. కేసు నమోదు చేసింది 2021లో కావొచ్చు, కానీ కథ నడిచింది మొత్తం 2014, ఆ తరువాతేనని కోర్టుకు నివేదించారు. 2018కి ముందే ఈ కుంభకోణం వ్యవహారంలో సీఐడీ ప్రాథమిక దర్యాప్తు జరిపిందని వివరించారు. రికార్డులను తారుమారు చేయడం, ప్రజాధనాన్ని కొల్లగొట్టడం పబ్లిక్ డ్యూటీ కిందకు రానే రాదన్నారు. అప్పటి ప్రభుత్వ పెద్ద ఆలోచనల నుంచే ఈ కుంభకోణం మొదలైందని రోహత్గీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఐశాఖ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయన్నారు. డ్యాం కట్టాం, వరదల వల్ల అది కొట్టుకుపోయింది.. మా తప్పేమీ లేదని చెప్పేంత చిన్న వ్యవహారం కాదని కోర్టుకు నివేదించారు. ఈ కుంభకోణం వెనుక లోతైన కుట్ర ఉందన్నారు. ప్రజాధనాన్ని లూటీ చేసిన పెద్దలు, దానిని దారి మళ్లించేందుకు పలు షెల్ కంపెనీలను సృష్టించారని, ఇందుకు పక్కా ఆధారాలున్నాయంటూ కోర్టు ముందుంచారు. కేసు డైరీని సైతం కోర్టుకు సమర్పించి కీలక ఆధారాలను నివేదించారు. అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే హైకోర్టు సీఆర్సీసీ సెక్షన్ 482 కింద తనకున్న అధికారాన్ని ఉపయోగించగలదన్నారు. ప్రాథమిక దశలో దర్యాప్తును కొనసాగించకుండా పోలీసులను నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేయడానికి వీల్లేదని తెలిపారు. దర్యాప్తు ప్రాథమిక దశలో కోర్టులు ఆరోపణల పూర్వాపరాల్లోకి వెళ్లడానికి వీల్లేదన్నారు. దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ను దాఖలు చేసేందుకు పోలీసులకు అనుమతినివ్వాలని కోరారు. ఈ కేసు రాజకీయ ప్రేరేపితం అని చెబుతున్నారని, అదే నిజమైతే 2021లోనే చంద్రబాబును నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేసే వారమన్నారు. ఈ కుంభకోణంలో చంద్రబాబు పాత్రకు సంబంధించి ఆధారాలు లభించాయి కాబట్టే ఇప్పుడు అరెస్ట్ చేశామన్నారు. స్కిల్ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ముందే రూ.300 కోట్లకు పైగా మొత్తాన్ని ప్రైవేటు కంపెనీల పేరు మీద మళ్లించేశారు, అదే ఇక్కడ కీలక విషయమని కోర్టుకు వివరించారు. ఒప్పందంలో భాగమైన రెండు ప్రైవేటు కంపెనీలు కలిసి మూడో కంపెనీని తెరపైకి తెచ్చి, ఆరు షెల్ కంపెనీలను సృష్టించి నిధులను మళ్లించేశాయన్నారు. ఇదంతా కూడా చంద్రబాబుకు తెలిసే జరిగిందని వివరించారు. నిధుల చెల్లింపునకు ఆయనే అనుమతినిచ్చారని తెలిపారు. ఇదంతా తాము చెబుతున్నది కాదని, కాగితాలే అందుకు సాక్ష్యమన్నారు. కార్పొరేషన్ను ప్రతివాదిగా చేర్చాల్సిందే.. ఈ కుంభకోణంపై ఫిర్యాదు చేసిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్డీసీ)ను ప్రతివాదిగా చేర్చకుండానే పిటిషన్ దాఖలు చేశారని న్యాయవాది సన్నపురెడ్డి వివేక్ చంద్రశేఖర్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ కేసులో కె.అజయ్రెడ్డిని ప్రతివాదిగా చేర్చారని, ఆయనకు ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఎలాంటి సంబంధం లేదని గట్టిగా చెప్పారు. అందువల్ల కార్పొరేషన్ను ప్రతివాదిగా చేర్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ఈ విషయాన్ని ముందే చెప్పి ఉండాల్సిందని పేర్కొన్నారు. -
స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఖజానా ఖాళీ
-
స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఖజానాను దోచేశారు
-
దోపిడీలో బాబు, వికాస్ ఖన్వేల్కర్ కోర్టులో లూథ్రా వాదనలు.. పొన్నవోలు సుధాకర్ రెడ్డి షాకింగ్ నిజాలు..
-
ఇది 100 శాతం ఫ్రాడ్.. తేల్చేసిన సీమెన్స్ కంపెనీ
-
తిరిగి తిరిగి హైదరాబాద్కు.. 5thలేయర్లో షాకింగ్ నిజాలు..
-
బేసిక్ లా తెలియని వారే అలా మాట్లాడతారు: ఏఏజీ పొన్నవోలు
సాక్షి, విజయవాడ: చంద్రబాబును అరెస్ట్ చేసిన 24 గంటల్లోనే కోర్టులో ప్రవేశపెట్టామని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు హౌజ్ కస్టడీ పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. తీర్పు అనంతరం ఏఏజీ పొన్నవోలు.. మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు రిమాండ్పై ఆయన తరపు న్యాయ వాదులు తీవ్రమైన వాదనలు వినిపించారు. సీఆర్.పీఎస్ చట్టంలో రెండు కస్టడీ పిటిషన్లే ఉన్నాయి. ఒకటి పోలీస్ కస్టడీ, రెండవది జ్యుడీషియల్ కస్టడీ. హౌస్ కస్టడీ పిటిషన్ అనేది లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. ‘‘రాజమండ్రి సెంట్రలో జైలులో భద్రత లేదని వారి ఆరోపణ. చంద్రబాబు జైల్లో ఉన్న ప్రాంతం ఒక కోటలా మారింది. ప్రత్యేకంగా ఒక బ్యారెక్స్ను కేటాయించారు. 24x7 గంటలూ సీసీ కెమెరాల నిఘా, వైద్యులు అందుబాటులో ఉన్నారు. చంద్రబాబు భద్రత ప్రభుత్వం తన బాధ్యతగా తీసుకుంది. సెంట్రల్ జైల్ అంటేనే పటిష్టమైన భద్రతా ప్రదేశం. ప్రైవేట్ గృహంలో ఉంటేనే భద్రత ఉండదు.. అక్కడ ఏదైనా జరగొచ్చు. అదే జైల్లో ఉంటే ఎలాంటి భద్రతా పరమైన సమస్యా ఉండదు. జైల్లో ఫలానాది లేదని చెప్పమనండి.. ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తుంది. ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేదనే వాదన సరైనది కాదు. బేసిక్ లా తెలియని వారు.. చట్టంపై అవగాహన లేని వారు చెప్పే మాటలే ఇవి’’ అని ఏఏజీ పేర్కొన్నారు. ‘‘ఎంక్వైరీలో పేరు ఉందా లేదా అనేదే ముఖ్యం. తనను ఉదయం 6 గంటలకే అరెస్ట్ చేశారని చంద్రబాబే కోర్టులో అంగీకరించారు. చంద్రబాబు ఇటీవల పోలీసులకు వర్క్ ఫ్రమ్ హోం ఇస్తానన్నారు. ఇప్పుడు తన అరెస్ట్ కేసులో హౌస్ కస్టడీ పిటిషన్ కోరడం ద్వారా ఖైదీలకు ‘‘వర్క్ ఫ్రమ్ హోం’’ అనే మెసేజ్ను ఇచ్చినట్లుంది. చంద్రబాబును ఐదురోజుల పాటు కస్టడీకి కోరుతూ పిటిషన్ వేశాం. రేపు(బుధవారం) చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ వేసే అవకాశం ఉంది’’ అని ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి అన్నారు. చదవండి: ‘హౌస్ అరెస్ట్లో ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత?’ -
చంద్రబాబు పూర్తి భద్రతలో ఉన్నారని ఏఏజీ వెల్లడి
-
జైలులో ఖైదీలు ఉండక.. స్వామీలు ఉంటారా?: సాక్షితో AAG
-
చంద్రబాబు అధికారులను బెదిరించి డబ్బులు విడుదల చేయించారు..
-
ఎన్ఎస్జీ ప్రొటెక్షన్ కంటే కూడా ఎక్కువ సెక్యూరిటీ కల్పించాం: పొన్నవోలు
-
‘అసలు డీపీఆర్ లేకుండా ప్రాజెక్ట్ ఫండ్స్ ఇచ్చారు’
సాక్షి, విజయవాడ: గత ప్రభుత్వ పెద్దలే స్కిల్ డెవలప్స్కామ్కు తెరలేపారని సీఐడీ తరఫు న్యాయవాది పొన్నవోలు స్పష్టం చేశారు. ఎలాంటి చర్చ లేకుండా ఎంఓయూ కుదుర్చుకుని ఈ కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. అసలు డీపీఆర్ లేకుండా ప్రాజెక్ట్ ఫండ్స్ ఇవ్వాలని ఆదేశించారన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనన్నారు ఏఏజీ పొన్నవోలు. చంద్రబాబు హౌజ్ అరెస్ట్ పిటిషన్పై విచారణను రేపటికి(మంగళవారం) ఏసీబీ కోర్టు వాయిదా వేసిన అనంతరం పొన్నవోలు మీడియాతో మాట్లాడారు. ‘రాజమండ్రి జైలువద్ద చంద్రబాబుకు భారీ భద్రత ప్రభుత్వమే కల్పించింది. ఎన్ఎస్జీ ప్రొటెక్షన్ కంటే ఎక్కువ సెక్యూరిటీ కల్పించాం. 24 గంటలు వైద్యులు కూడా అందుబాటులో ఉంటారు. సీఆర్పీసీ చట్టంలో అసలు హౌజ్ అరెస్టు అనేది లేదు. ప్రజల సొమ్మును దోపిడీ చేసి షెల్ కంపెనీలకు మళ్లించారు. స్కాం ఎలా జరిగిందో నోట్ ఫైల్స్ ద్వారా తెలుస్తోంది. రూ. 371 కోట్ల రాష్ట్ర ఖజానా దోపిడీకి గురైంది’ అని తెలిపారు. చదవండి: Khaidi No 7691 : జైల్లో బావ - సీట్లో బాలయ్య చంద్రబాబు హౌజ్ అరెస్టుపై విచారణ రేపటికి వాయిదా -
చంద్రబాబు అరెస్ట్ గురించి అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి..!
-
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా టీడీపీ, పెత్తందారులు అడ్డుకున్నారు: పొన్నవోలు
-
ప్రజాధనం దోపిడీకే తెరపైకి ‘సీమెన్స్’
సాక్షి, అమరావతి: ప్రజాధనాన్ని కొల్లగొట్టాలన్న ముందస్తు పథకంలో భాగంగానే గత సర్కారు పెద్దలు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండియా లిమిటెడ్ను తెరపైకి తెచ్చారని సీఐడీ తరఫున రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ప్రాజెక్టు వ్యయాన్ని రూ.3,356 కోట్లకు కృత్రిమంగా పెంచారని, ఇందులో సీమెన్స్ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్ ప్రసాద్ కీలక పాత్ర పోషించారని నివేదించారు. ఇలా పెంచిన మొత్తాన్ని పెద్దల అండతో దారి మళ్లించేందుకు భారీ కుట్రకు తెర తీశారని తెలిపారు. అందులో భాగంగానే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్–సీమెన్స్ మధ్య ఒప్పందం కుదరగానే యూపీలో ఐఏఎస్ అధికారిగా ఉన్న భాస్కర్ ప్రసాద్ భార్య ఊర్మిళను ఇంటర్ కేడర్ డిప్యుటేషన్పై తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ సీఈవోగా నియమించారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇదో భారీ కుంభకోణమని, ఇంత తీవ్రమైన కేసులో మేస్ట్రేస్టేట్ చాలా యాంత్రికంగా భాస్కర్ ప్రసాద్ రిమాండ్ను తిరస్కరించారని తెలిపారు. కింది కోర్టులో ఏం జరుగుతోందో తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. భాస్కర్ ప్రసాద్పై ఐపీసీ సెక్షన్లు 409, 120 (బీ) కింద సీఐడీ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే మేస్ట్రేస్టేట్ విస్మయకరంగా రిమాండ్ సమయంలోనే మినీ ట్రయల్ నిర్వహించి సెక్షన్ 409 వర్తించదని తేల్చడంతోపాటు భాస్కర్ ప్రసాద్ రిమాండ్ను తిరస్కరించారని వివరించారు. ఏ సెక్షన్ వర్తిస్తుంది? ఏ సెక్షన్ వర్తించదు? అనే అంశాలను దర్యాప్తు పూర్తై చార్జిషీట్ దాఖలు చేసిన తరువాత చేపట్టే తుది విచారణలో తేల్చాలే కానీ రిమాండ్ సమయంలో కాదన్నారు. రాష్ట్రంలోని కింది కోర్టుల్లో రిమాండ్ సమయంలోనే ఫలానా సెక్షన్ వర్తించదంటూ రిమాండ్ను తిరస్కరించే ట్రెండ్ నడుస్తోందని, దీనిపై హైకోర్టు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన సమయం వచ్చిందని సుధాకర్రెడ్డి నివేదించారు. ఈ కుంభకోణం వెనుక దాగిన పెద్దల పాత్ర బహిర్గతం కావాలంటే భాస్కర్ ప్రసాద్ను కస్టడీలోకి తీసుకుని విచారించడం సీఐడీకి అనివార్యమన్నారు. సీఐడీ తరఫున వాదనలు ముగియడంతో భాస్కర్ ప్రసాద్ తరఫు న్యాయవాది వీఆర్ మాచవరం వాదనల నిమిత్తం తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా పడింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బీఎస్.భానుమతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
విద్యార్థుల జీవితాలతో నారాయణ ఆడుకున్నారు: ఏజీ పొన్నవోలు
సాక్షి, అమరావతి: పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ చేయడం ద్వారా నారాయణ విద్యా సంస్థ, దాని అధిపతి, మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఎంతో మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఇలాంటి వారి పట్ల న్యాయస్థానం మెతక వైఖరి అవలంబించకూడదని అన్నారు. తీవ్ర నేరానికి పాల్పడిన నారాయణకు రిమాండ్ తిరస్కరించి, బెయిల్ మంజూరు చేయడం ద్వారా మేజి్రస్టేట్ తప్పు చేశారని, పరిధి దాటి వ్యవహరించారని, మినీ ట్రయల్ నిర్వహించారని తెలిపారు. ఇది ఎంతమాత్రం సమర్థనీయం కాదని అన్నారు. సెషన్స్ కోర్టు ఉత్తర్వుల్లో ఈ కోర్టు జోక్యం చేసుకుంటే, మేజిస్ట్రేట్ల తప్పులను సమర్థించినట్లవుతుందని తెలిపారు. అందువల్ల మేజిస్ట్రేట్ ఇచ్చిన బెయిల్ను రద్దు చేస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ నారాయణ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను కొట్టేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు తీర్పును రిజర్వ్ చేశారు. నారాయణ ఈ నెల 30వ తేదీలోపు లొంగిపోవాలంటూ సెషన్స్ కోర్టు నిర్దేశించిన గడువును తీర్పు వెలువరించేంత వరకు పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. చదవండి: (ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టు షాక్) మేజి్రస్టేట్ కోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేస్తూ చిత్తూరు సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పొంగూరు నారాయణ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు మంగళవారం మరోసారి విచారణ జరిపారు. ఏఏజీ సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. నారాయణకు బెయిల్ రద్దు ఉత్తర్వులు తాత్కాలికమైనవి కావని, మధ్యంతర ఉత్తర్వులని వివరించారు. అందువల్ల వాటిపై రివిజన్ పిటిషన్ దాఖలు చేయాలే తప్ప, క్వాష్ పిటిషన్ కాదని అన్నారు. ఈ సందర్భంగా చట్ట నిబంధనలను, పలు తీర్పులను వివరించారు. నిబంధనల ప్రకారమే బెయిల్ మంజూరు చేయాలి తప్ప, ఫలానా సెక్షన్ వర్తించదని రిమాండ్ సమయంలో మినీ ట్రయల్ నిర్వహించడానికి వీల్లేదని, ప్రస్తుత కేసులో మేజి్రస్టేట్ ఇలాంటి ట్రయల్ నిర్వహించారని, దీనిపైనే తమ ప్రధాన అభ్యంతరమని తెలిపారు. ప్రశ్నపత్నం లీకేజీ వెనుక ఉన్న కుట్రను ఛేదించాలని, అందుకు నారాయణను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన బాధ్యత దర్యాప్తు అధికారులపై ఉందన్నారు. మేజిస్ట్రేట్ ఉత్తర్వుల వల్ల దర్యాప్తునకు విఘాతం కలిగిందన్నారు. విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న వ్యవహారమైనందువల్ల నారాయణ చర్యలను తేలిగ్గా తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. నారాయణ తరపు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. -
‘స్థాయి లేని వ్యక్తులు సీఎంను విమర్శించడం ఫ్యాషన్ అయ్యింది’
విజయవాడ: కొలీజియం నిర్ణయాలతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదని ఆంధ్రప్రదేశ్ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి స్పష్టం చేశారు. కొలీజియం నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని, రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమేనన్నారు. న్యాయ వ్యవస్థలో కుల ప్రస్తావన రావడం దురదృష్టకరమన్నారు. న్యాయ వ్యవస్థపై దాడి మంచిది కాదని శుక్రవారం మీడియాతో మాట్లాడిన పొన్నవోలు తెలిపారు. ‘ స్థాయి లేని వ్యక్తులు సీఎంను విమర్శించడం ఫ్యాషన్ అయ్యింది. ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి జడ్జిల బదిలీతో సంబంధమేంటి?,కొలీజియం అనేది స్వతంత్ర ప్రతిపత్తి వ్యవస్థ. న్యాయ వ్యవస్థపై నమ్మకం లేనివారే ఆందోళన చేశారు’ అని అన్నారు. ఇదిలా ఉంచితే, తాము హైకోర్టు విధుల బహిష్కరణకు పిలుపు ఇవ్వలేదని ఏపీ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ తెలిపింది. న్యాయవాదులు సమ్మె చేయడం, విధులు బహిష్కరించకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. విధులు బహిష్కరిస్తూ కొంతమంది చేసిన తీర్మానంతో అసోసియేషన్కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. -
న్యాయవ్యవస్థలో కుల ప్రస్తావన దురదృష్టకరం : ఏపీ అడిషనల్ ఏజీ పొన్నవోలు
-
AP: రాజధాని వారిది మాత్రమేనట
సాక్షి, అమరావతి: ఎక్కడైనా రాజధాని ప్రాంతం ప్రజలందరిదీ అవుతుందని, అయితే రాజధాని ప్రాంతంలో ఉండే రైతులు అమరావతి తమది మాత్రమేనంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు నివేదించింది. రాజధానిలో తాము మాత్రమే ఉండాలని, బయట వ్యక్తులెవరూ రాజధానిలో ఉండకూడదన్నట్లు మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి కోర్టుకు తెలిపారు. రాజధాని ప్రాంతంలో ఇతరులెవరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదంటూ పిటిషన్లు దాఖలు చేయడం ద్వారానే వారి వైఖరి ఏమిటో చెప్పకనే చెప్పారన్నారు. అందరిదీ కానప్పుడు అసలు అది రాజధాని ఎలా అవుతుందన్నారు. రాజధానిలో ఇతర ప్రాంతాలకు చెందిన వారికి సైతం ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలుగా సీఆర్డీఏ చట్టానికి సవరణలు చేశామని, దీనికి గవర్నర్ సైతం ఆమోదం తెలిపారన్నారు. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాల కేటాయింపును సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలన్నీ నిరర్థకం అవుతాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వాదనలు విన్న న్యాయస్థానం చట్ట సవరణకు సంబంధించి ప్రతిని మెమో రూపంలో తమ ముందుంచాలని అదనపు ఏజీని ఆదేశించింది. మానవ ధర్మాన్ని అనుసరించి తమకు న్యాయం చేయాలని రైతుల తరఫు న్యాయవాదులు కోరగా, న్యాయబద్ధత ఆధారంగానే కోర్టు వ్యవహరిస్తుందని పొన్నవోలు సుధాకర్రెడ్డి గట్టిగా బదులిచ్చారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ తాము రాజ్యాంగ ధర్మం ప్రకారమే నడుచుకుంటామని పేర్కొంటూ తదుపరి విచారణను నవంబర్ 9కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలో పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్ల స్థలాల కేటాయింపు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 2020లో జారీ చేసిన జీవో 107ను సవాలు చేస్తూ అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన అప్పటి సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం జీవో 107 అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ వ్యాజ్యాలపై అత్యవసర విచారణ జరపాలని ధర్మాసనాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో ఈ వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఉన్నం మురళీధరరావు, ఎస్.ప్రణతి, కారుమంచి ఇంద్రనీల్బాబు వాదనలు వినిపిస్తూ రాజధాని కోసం ఇచ్చిన భూములను ఇతరులకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించడం చట్ట విరుద్ధమన్నారు. హైకోర్టు స్టే ఉత్తర్వులు అమల్లో ఉండగానే ఇళ్ల స్థలాల మంజూరు చేసే దిశగా చట్ట సవరణ చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ చర్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయన్నారు. ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ రాజధాని ప్రాంతంలో ఇతరులకు సైతం ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా చట్ట సవరణ చేశామన్నారు. చట్ట సవరణ ప్రతిని కోర్టు ముందుంచేందుకు గడువు కోరగా ధర్మాసనం అందుకు అంగీకరిస్తూ విచారణను వాయిదా వేసింది. -
వార్షికాదాయం రూ.18 వేలు..1,605 ఎకరాల్లో మైనింగ్
సాక్షి, అమరావతి: వార్షికాదాయం రూ.18 వేలు కూడా లేని వ్యక్తులు సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామంటూ 1,605 ఎకరాల్లో లైమ్స్టోన్ లీజు పొందారని, వీరంతా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్రెడ్డి బినామీలని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. త్రిశూల్ సిమెంట్స్ పేరుతో లీజుకు దరఖాస్తు చేసుకున్న వారంతా దివాకర్రెడ్డి వద్ద పనిచేసే తెల్లరేషన్ కార్డుదారులు, గ్యాస్ కనెక్షన్ లేనివారు, డ్రైవర్లు, క్లీనర్లు, ఇతర కార్మికులేనని తెలిపింది. 2019కి ముందు టీడీపీ హయాంలో జేసీ దివాకర్రెడ్డి, ఆయన అనుచరుల హవా సాగిందని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి తెలిపారు. గడువు లోగా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోవడమే కాకుండా కేటాయించిన భూముల్లో తవ్వేసి ఖనిజాన్ని ఇతరులకు విక్రయించారని చెప్పారు. త్రిశూల్ అంటే జేసీ దివాకర్రెడ్డి దృష్టిలో మోసం, అధికార దుర్వినియోగం, అవినీతి అని పేర్కొన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ స్థాపిస్తామంటూ గత ప్రభుత్వ హయాంలో ఎప్పటికప్పుడు కాలపరిమితి, అనుమతులు పొడిగించుకుంటూ వచ్చారని కోర్టు దృష్టికి తెచ్చారు. సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుండా ఖనిజ తవ్వకాలు చేపట్టి అమ్ముకున్నందుకు 13.91 లక్షల మెట్రిక్ టన్నులకు నిబంధనల ప్రకారం రూ.100.24 కోట్ల పెనాల్టీ చెల్లించాలని డిమాండ్ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. అధికారులు నిబంధనల ప్రకారమే వ్యవహరించారని స్పష్టం చేశారు. వాదనలు విన్న హైకోర్టు ఈ వ్యవహారంలో తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనుమతిస్తేనే తవ్వకాలు చేపట్టాం... అనంతపురం జిల్లా యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామంలో లైమ్స్టోన్ లీజు పొందిన త్రిశూల్ సిమెంట్స్ పరిమితికి మించి ఖనిజం తవ్వి రవాణా చేయడంపై రూ.100.24 కోట్ల పెనాల్టీ చెల్లించాలని అధికారులు 2020 మే 7న డిమాండ్ నోటీసు ఇచ్చారు. దీన్ని కొట్టేయాలని కోరుతూ ఆ కంపెనీ మేనేజింగ్ పార్ట్నర్ షేక్ హుస్సేన్ బాషా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ న్యాయవాది శివరాజు శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ త్రిశూల్ సిమెంట్స్ 2011లోనే రద్దైందని, ప్రస్తుతం అది మనుగడలో లేదన్నారు. అధికారులు అనుమతినిస్తేనే ఖనిజ తవ్వకాలు చేపట్టామన్నారు. జాతి సంపదను దోచేశారు... త్రిశూల్ సిమెంట్స్ అక్రమాలపై మొదటి నుంచి పోరాటం చేస్తున్న తాడిపత్రికి చెందిన ఇంప్లీడ్ పిటిషనర్ మురళీప్రసాద్రెడ్డి న్యాయవాది పీఎస్ రాజశేఖర్ వాదనలు వినిపిస్తూ త్రిశూల్ అక్రమాల పై తాము దాఖలుచేసిన పిల్పై హైకోర్టు ధర్మాస నం ఉత్తర్వులు జారీచేశాకే ప్రభుత్వం లీజును రద్దు చేసిందన్నారు. లక్షల టన్నుల లైమ్స్టోన్ తవ్వి జాతి సంపదను దోచుకున్నారని తెలిపారు. గతంలో అదే ప్రాంతంలో లీజు పొందిన కంపెనీలు భూ ఉపరితలంలో ఉన్న కొండలను తవ్వితే త్రిశూల్ మాత్రం భూమి లోపలి ఖనిజాలను తరలించిందని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి నివేదిం చారు. కంపెనీ రద్దైందని చెబుతూనే ఆ కంపెనీ పేరుమీదే ఇన్నాళ్లూ గడువు పొడిగించుకుంటూ వచ్చారన్నారు. ఈ వ్యవహారాన్ని ధర్మాసనానికి పంపాలా? తానే విచారించాలా? అనే అంశంపై నిర్ణయం తీసుకుంటానని పేర్కొంటూ తదుపరి విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు. -
వారు ప్రభుత్వాన్ని నడపాలని ప్రయత్నిస్తున్నారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొన్ని పత్రికలు, టీవీ చానల్స్ ప్రభుత్వాన్ని నడపాలని ప్రయత్నిస్తున్నాయని అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. వాటి కథనాలనే కొందరు శాసనాలుగా భావిస్తున్నారని తెలిపారు. తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికపై దాఖలు చేసిన వ్యాజ్యంలో పిటిషనర్లు కూడా అలాగే భావిస్తున్నారన్నారు. ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదని, ప్రాథమిక దశలోనే కొట్టేయాలని కోరారు. ఎన్నిక ప్రజాస్వామ్య, న్యాయబద్ధంగానే జరిగిందని వివరించారు. ఎన్నికపై అభ్యంతరం ఉంటే ఏం చేయాలో చట్టం చెబుతోందని, దాని ప్రకారం వారు సహకార ట్రిబ్యునల్ను ఆశ్రయించాలని తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ ఎన్నికపై సహకార శాఖ రిజిస్ట్రార్ చేత విచారణ జరిపించాలని పిటిషనర్లు కోరగా, న్యాయస్థానం సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందనరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు ఎన్నికను రద్దు చేసి, రీపోలింగ్ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీకి చెందిన కె.రజనీకాంత్నాయుడు, మరో 11 మంది దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందనరావు బుధవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. టౌన్ బ్యాంక్ ఎన్నిక అప్రజాస్వామికంగా జరిగిందన్నారు. నకిలీ కార్డులు సృష్టించి ఓట్లు వేయించారని, ఎమ్మెల్యేలు స్వయంగా పర్యవేక్షించారని తెలిపారు. ఇందుకు సంబంధించి ఫొటోలను చూపారు. ఎన్నికను రద్దు చేయాలని కోరారు. వారిని ప్రజలు ఎల్లో మీడియాగా పిలుస్తుంటారు.. ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కొన్ని పత్రికలు, టీవీ చానళ్లను ప్రజలు ఎల్లో మీడియాగా పిలుస్తారని, తాను మాత్రం వాటికి ఏ రంగునూ ఆపాదించనని, అయితే వారికి ఓ నిర్దిష్ట రంగంటూ ఉందని చెప్పారు. కొందరు యాంకర్ల గురించి ప్రస్తావించారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. వ్యక్తుల పేర్లు అవసరం లేదని, వారిని మీడియా అంటే సరిపోతుందని అన్నారు. అనంతరం సుధాకర్రెడ్డి వాదనలు కొనసాగిస్తూ.. మెట్లపై నుంచి పడిపోతున్న వ్యక్తిని పోలీసులు లేపుతుంటే, దాన్ని ఓటు కోసం లోనికి పంపాలంటూ కాళ్లు పట్టుకున్నట్లు పిటిషనర్లు చిత్రీకరించడం సిగ్గుచేటన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు గతంలో వన భోజనాల సమయంలో తీసుకున్న ఫోటోను ఎన్నికకు ముడిపెట్టడం కోర్టును తప్పుదోవ పట్టించడమేన్నారు. ఎన్నికపై అభ్యంతరం ఉంటే వారు సహకార చట్ట నిబంధనల ప్రకారం ట్రిబ్యునల్కు వెళ్లాలన్నారు. నేరుగా హైకోర్టుకు రాకూడదని చెప్పారు. -
నారాయణకు నోటీసులు.. అడిషనల్ ఏజీ వాదనలతో ఏకీభవించిన కోర్టు
-
నారాయణ బెయిల్ రద్దు చేయాలంటూ చిత్తూరు కోర్టులో పిటిషన్
-
నారాయణకు నోటీసులు.. అడిషనల్ ఏజీ వాదనలతో ఏకీభవించిన కోర్టు
సాక్షి, చిత్తూరు: మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు చేయాలంటూ చిత్తూరు కోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం తరపున అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ వ్యవహారం లో ఈ నెల 10న నారాయణ అరెస్టయిన విషయం తెలిసిందే. 11వ తేదీ తెల్లవారుజామున నారాయణకు చిత్తూరు నాల్గవ అదనపు జడ్జి బెయిలు మంజూరు చేశారు. టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ వ్యవహారంలో నారాయణ కుట్ర ఉందని, బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. చదవండి: నారాయణ ‘లీక్స్’.. వెలుగులోకి నివ్వెరపోయే విషయాలు.. నారాయణకు నోటీసులు.. నారాయణ బెయిల్ రద్దు పిటిషన్పై చిత్తూరు కోర్టు మధ్యాహ్నం విచారణ జరిపింది. అడిషనల్ ఏజీ పొన్నవోలు వాదనలతో కోర్టు ఏకీభవించింది. నారాయణకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న కేసుపై వాదనలు జరగనున్నాయి. -
‘పిల్’లతో సంక్షేమాన్ని అడ్డుకుంటున్నారు
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా పేద ప్రజలకు పెద్దఎత్తున నివాస వసతి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. కానీ, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ‘పిల్’ల పేరుతో కొందరు అడ్డుకుంటున్నారని వివరించారు. భూములిచ్చిన వారికి, తీసుకుంటున్న వారికి లేని అభ్యంతరం పిటిషనర్లకు ఎందుకో అర్థంకావడంలేదని.. వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరంలేదన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ఆవ భూముల వ్యవహారంలో జేఎన్టీయూ సాంకేతిక కమిటీ ఇచ్చిన నివేదికను తమ ముందుంచాలని అదనపు ఏజీని ఆదేశించింది. తదుపరి విచారణను 25కి వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. పేదలకు భూములు ఇవ్వొద్దంటూ పిల్.. తూర్పు గోదావరి జిల్లా.. కోరుకొండ, రాజానగరం మండలాల్లో ఉన్న ఆవ భూములను ఇళ్ల స్థలాల కోసం కేటాయించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించడంతో పాటు, ఆ భూముల విషయంలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఎ.శ్రీనివాసరావు 2020లో హైకోర్టులో ‘పిల్’ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన అప్పటి సీజే నేతృత్వంలోని ధర్మాసనం, ఆవ భూములను కేటాయించవద్దని 2020లో మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఇదే అంశంపై మరిన్ని వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటన్నింటిపై సీజే జస్టిస్ పీకే మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ వాదనలు వినిపిస్తూ, 2013 భూసేకరణ చట్టం ప్రకారం, పరిహారం చెల్లించిన తరువాతే భూములు తీసుకున్నామన్నారు. శాస్త్రీయ అధ్యయనం తరువాత ఎకరాకు రూ.45 లక్షల ధరను నిర్ణయించారన్నారు. ఈ మొత్తం ప్రాజెక్టు విలువ రూ.300 కోట్లయితే పిటిషనర్లు విస్మయకరంగా రూ.700 కోట్ల మేర కుంభకోణం జరిగిందని చెబుతున్నారని సుధాకర్రెడ్డి వివరించారు. -
రఘురామను అక్కడికి పంపడమంటే టీడీపీ ఆఫీస్కు పంపినట్టే: ఏఏజీ
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించ పరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తూ, సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును రమేష్ ఆస్పత్రికి పంపడమంటే టీడీపీ ఆఫీస్కు పంపినట్టేనని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. రఘురామను రమేష్ ఆస్పత్రికి తరలించాలని అతని తరఫు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం తిరస్కరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గతంలో రమేష్ ఆస్పత్రిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల 10 మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ప్రస్థావించారు. తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో నడిచే రమేశ్ ఆస్పత్రి యాజమాన్యం, వారు చెప్పిందే నివేదికగా ఇచ్చే అవకాశం ఉందని అనుమానాన్ని వ్యక్తం చేశారు. హైకోర్టు స్వయంగా జీజీహెచ్ బృందాన్ని ఏర్పాటు చేసిందని, ఇందులో ప్రైవేట్ వైద్యులు, సీఆర్పీఎఫ్ భద్రత, కుటుంబ సభ్యులు ఉంటారని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలను హైకోర్టు నిన్న సాయంత్రం 6:40కే వెల్లడించిందని తెలిపారు. హైకోర్టు ఆర్డర్ ఇచ్చాక రఘురామను రమేష్ ఆస్పత్రికి తరలించాలని సీఐడీ కోర్టు ఆదేశాలిచ్చిన విషయాన్ని ఆయన వివరించారు. ఈ అంశాన్ని సీఐడీ కోర్టు దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. హైకోర్టు ఆర్డర్ కాపీ ఇస్తే తమ తీర్పును సవరిస్తామని సీఐడీ కోర్టు తెలిపిన విషయాన్ని ఆయన వెల్లడించారు. చదవండి: ‘రఘురామకృష్ణరాజు ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు’ -
రమేష్ ఆస్పత్రికి పంపడమంటే టీడీపీ ఆఫీస్కు పంపినట్టే: ఏఏజీ
-
పోలీసులు కొట్టారంటూ సాయంత్రం కోర్టులో కట్టుకథ అల్లారు: ఏఏజీ పొన్నవోలు
-
రఘురామ కొత్త నాటకానికి తెరతీశారు: ఏఏజీ పొన్నవోలు
సాక్షి, అమరావతి : ఎంపీ రఘురామకృష్ణరాజు కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. హైకోర్టులో బెయిల్ పిటిషన్ డిస్మిస్ అవ్వగానే కొత్త నాటకానికి తెరతీశారని, పోలీసులు కొట్టారంటూ సాయంత్రం కోర్టులో కట్టుకథ అల్లారని పేర్కొన్నారు. మధ్యాహ్నం రఘురామకృష్ణరాజుకు కుటుంబసభ్యులు భోజనం తీసుకొచ్చారని, అప్పటివరకు కూడా ఆయన మామూలుగానే ఉన్నారని చెప్పారు. రఘురామ ఆరోపణలపై కోర్టు మెడికల్ కమిటీ వేసిందని, రేపు మధ్యాహ్నంలోగా పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని సూచించిందని తెలిపారు. కాగా, ఎంపీ రఘురామకృష్ణరాజును అధికారులు ఈ సాయంత్రం సీబీసీఐడీ స్పెషల్ కోర్టులో హాజరుపర్చారు. సీఐడీ పోలీసులు ఆరో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ ముందు రఘురామను హాజరుపర్చారు. సీఐడీ న్యాయమూర్తి ముందు ఏ1గా ఆయన్ని ప్రవేశపెట్టారు. రిమాండ్ రిపోర్ట్ను న్యాయమూర్తికి అందజేశారు. ఇక్కడ చదవండి: రఘురామకృష్ణరాజుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు -
వాల్తేర్ క్లబ్ భూములు ప్రభుత్వానివే
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలోని వాల్తేర్ క్లబ్ భూములు ప్రభుత్వ భూములని అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. వాల్తేర్ క్లబ్ భూముల వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గత నెల 27న జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ వాల్తేర్ క్లబ్ అధ్యక్షుడు ఫణీంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లంచ్మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరఫున ఏఏజీ సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఆ భూములను క్లబ్ లీజుకు తీసుకుందని, లీజు గడువు ముగిసినా ఖాళీ చేయడం లేదని హైకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆ భూములపై సిట్ దర్యాప్తు ప్రారంభించిందన్నారు. వాస్తవానికి వాల్తేర్ క్లబ్ రఫ్ రెంటల్ పట్టా తీసుకుని, రఫ్ పట్టా మాత్రమే తీసుకున్నట్టు చెబుతోందన్నారు. ఆ రఫ్ పట్టాను సర్వే సెటిల్మెంట్ కమిషనర్ కొట్టేశారని.. దీనిపై ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ కింద క్లబ్ పిటిషన్ వేసుకోవాల్సి ఉండగా ఆ పని చేయలేదన్నారు. పైగా వాల్తేర్ క్లబ్ తనది కాని భూమికి ప్రభుత్వం నుంచి అక్రమంగా పరిహారం కూడా పొందిందని, మరోసారి పరిహారం పొందుతూ అడ్డంగా దొరికిపోయిందని వివరించారు. పరిహారం మొత్తాన్ని వసూలు చేసేందుకు రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్యలు ప్రారంభించామన్నారు. సిట్ కాల పరిమితి ముగిసిందని చెబుతున్నప్పుడు క్లబ్ ప్రతినిధులు సిట్ ముందు హాజరై ఎందుకు వివరణ ఇచ్చారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని క్లబ్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురాకుండా దాచిపెడుతున్నారని వివరించారు. గురు లేదా శుక్రవారానికి వాయిదా వేస్తే పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని సుధాకర్రెడ్డి వివరించారు. న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య స్పందిస్తూ.. సిట్ కాల పరిమితిని పొడిగిస్తూ ఏవైనా ఉత్తర్వులు ఇచ్చారా అని ప్రశ్నించగా.. ప్రస్తుతానికి ఆ సమాచారం తనవద్ద లేదని అదనపు ఏజీ చెప్పారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. సిట్ కాల పరిమితి ముగిసిందని కోర్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చిందని, అందువల్ల ఆ క్లబ్పై వారం పాటు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. దీనిని సుధాకర్రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించగా.. వారం పాటు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ విచారణను గురువారానికి వాయిదా వేశారు. -
ఏ రాష్ట్రం తీసుకోనన్ని చర్యలు తీసుకున్నాం
సాక్షి, అమరావతి: కరోనా నియంత్రణ విషయంలో దేశంలో ఏ రాష్ట్రం తీసుకోనన్ని చర్యలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకరరెడ్డి హైకోర్టుకు నివేదించారు. కరోనా విషయంలో దేశంలో ప్రతీ మిలియన్కు 27,140 పరీక్షలు చేస్తుంటే, రాష్ట్రంలో 64,020 టెస్టులు నిర్వహించామని వివరించారు. గతేడాది మార్చి 9న తొలి కోవిడ్ కేసు నమోదైందని.. అప్పటికి రాష్ట్రంలో టెస్టింగ్ సౌకర్యాల్లేవని, ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నో సౌకర్యాలు ఉన్నాయన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఈ వివరాలన్నింటితో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 2కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్ పేరుతో భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ గుంటూరుకు చెందిన తోట సురేశ్బాబు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బాగ్చీ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. అదనపు ఏజీ సుధాకర్రెడ్డి స్పందిస్తూ, ప్రభుత్వం ఎంత గొప్పగా చేస్తున్నా విమర్శలు తప్పడం లేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ, అలా భావించాల్సిన అవసరంలేదని, మీరు (ప్రభుత్వం), మేం (కోర్టులు) ఉన్నది ప్రజల కోసమేనని, అందరం కలిసి సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. తదుపరి విచారణ నాటికి ఈ వ్యాజ్యం నిరర్థకమవ్వాలని ఆశిస్తున్నామని ధర్మాసనం నవ్వుతూ వ్యాఖ్యానించింది. -
మరణశయ్యపై ఉన్నా.. మొర ఆలకించండి
సాక్షి, అమరావతి: డీఈడీ కాలేజీల్లో ప్రవేశాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడం లేదంటూ యాజమాన్యాలు దాఖలు చేసిన అప్పీళ్లపై తదుపరి విచారణను హైకోర్టు అక్టోబర్ 16వ తేదీకి వాయిదా వేసింది. కాలేజీల తరఫు న్యాయవాదులు గడువు కోరడంతో విచారణను వాయిదా వేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ రాకేష్కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. ఈ సందర్భంగా ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కరోనాతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి చేతికి సెలైన్, ఆక్సీమీటర్ తదితరాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొనడంతో అంతా షాక్కు గురయ్యారు. ► కరోనాతో మరణశయ్యపై ఉన్నానని, బహుశా ఈ కేసే తాను వాదనలు వినిపించే చివరి కేసు కావచ్చని, తన మొర ఆలకించాలంటూ ధర్మాసనాన్ని సుధాకర్రెడ్డి అభ్యర్థించారు. మీ ధర్మాసనం ముందే తాను వాదనలు వినిపించాలనుకుంటున్నానని, బహుశా తనకు మరోసారి అలాంటి అవకాశం వస్తుందో రాదో తెలియదన్నారు. అందువల్ల తన పట్ల దయ చూపాలని వేడుకున్నారు. ► పొన్నవోలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కరోనా తగ్గుముఖంపడుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కరోనా నుంచి కోలుకుంటారని, ఆయన తిరిగి తమ ముందు వాదనలు వినిపిస్తారని ధైర్యం చెప్పింది. పొన్నవోలు ధర్మాసనానికి కృతజ్ఞతలు తెలియచేస్తూ అది నిజం కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. -
పాలన చేస్తోంది ఎవరో తేల్చండి
సాక్షి, అమరావతి: మిషన్ బిల్డ్ ఆంధ్రప్రదేశ్ కోసం ప్రభుత్వం తలపెట్టిన ఆస్తుల వేలాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో హైకోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 12కి వాయిదా వేసింది. ఆలోపు పిటిషనర్లందరూ కూడా తమ తమ వాదనలను సిద్ధంచేసుకుని ఉండాలని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ వ్యాజ్యాల్లో చాలా చిన్న ప్రశ్న ముడిపడి ఉందని.. రాష్ట్రంలో పాలన చేస్తోంది ఎవరో తేల్చేస్తే సరిపోతుందని ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. న్యాయస్థానాలను వేదికలుగా చేసుకుంటూ పిటిషన్లు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేస్తూ సంక్షేమాన్ని అడ్డుకుంటున్న పిటిషనర్లు పాలన చేస్తున్నారా? లేక ప్రజలతో ఎన్నుకోబడిన వారు పాలన చేస్తున్నారా? అన్న విషయం తేల్చాల్సిన అవసరముందని ఆయన వివరించారు. ఈ సమయంలో న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్కుమార్, జస్టిస్ జె. ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. మీరు (ఏఏజీ) మమ్మల్ని (కోర్టును) ఉద్దేశించి మాట్లాడుతున్నారా? పాలన ప్రభుత్వం చేస్తోందా? హైకోర్టు చేస్తోందా? అంటూ ప్రశ్నిస్తున్నారా అంటూ వ్యాఖ్యానించింది. పిటిషనర్లను ఉద్దేశించి మాట్లాడుతున్నానని సుధాకర్రెడ్డి చెప్పారు. దీనిపై పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన నర్రా శ్రీనివాసరావు అభ్యంతరం తెలిపారు. తాను అవాస్తవం ఎంతమాత్రం చెప్పలేదని అదనపు ఏజీ అన్నారు. వాళ్లు ఇతరుల భుజాలపై తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చాలని చూస్తున్నారని సు«ధాకర్రెడ్డి చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, అసలు విషయం పక్కదారి పడుతోందని తెలిపింది. సంక్షేమాన్ని అడ్డుకునేందుకే.. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి స్పందిస్తూ.. గతంలో భూములు విక్రయించినప్పుడు ఈ సమాజ సేవకులంతా ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు. గతంలో నోరెత్తని పిటిషనర్లంతా ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవడానికి న్యాయస్థానానికి వస్తున్నారని తెలిపారు. ఈ విషయాల జోలికి తాము వెళ్లడంలేదని ధర్మాసనం స్పష్టంచేసింది. నర్రా శ్రీనివాసరావు స్పందిస్తూ.. ఎమ్మార్వో కార్యాలయం, శిశు సంక్షేమ శాఖ భూములను కూడా ప్రభుత్వం విక్రయిస్తోందన్నారు. ఏఏజీ సుధాకర్రెడ్డి స్పందిస్తూ.. ప్రభుత్వాన్ని మీరే నడపండి.. సరిపోతుందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తామిక్కడ ఉండేది రాజకీయాలను చర్చించేందుకు కాదని ధర్మాసనం తెలిపింది. సంయమనంతో మాట్లాడాలని సుధాకర్రెడ్డికి సూచించింది. ప్రభుత్వ కౌంటర్ అందని పిటిషనర్లకు దానిని అందజేయాలని సుధాకర్రెడ్డిని ఆదేశించింది. తదుపరి విచారణ నాటికి పిటిషనర్లందరూ తమ వాదనలతో సిద్ధంగా ఉండాలని స్పష్టంచేస్తూ, విచారణను అక్టోబర్ 12కి వాయిదా వేసింది. వేలం ప్రక్రియను కొనసాగించుకోవచ్చునని.. అయితే బిడ్లు మాత్రం ఖరారు చేయవద్దంటూ ఇచ్చిన ఉత్తర్వులను 12 వరకు ధర్మాసనం పొడిగించింది. -
పిల్ ముసుగులో రాజకీయాలు
సాక్షి, అమరావతి: ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) ముసుగు వేసుకుని రాజకీయాలకు న్యాయస్థానాలను వేదికలుగా వాడుకుంటున్నారని అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఇలాంటి రాజకీయ ప్రేరేపిత వ్యాజ్యాలను ఉపేక్షించరాదన్నారు. పిల్ దాఖలు చేసి ప్రభుత్వం నిధులను ఎలా ఖర్చు చేయాలో కూడా నిర్దేశిస్తున్నారంటే, పరిస్థితి ఎక్కడ వరకు వచ్చిందో కోర్టులు గమనించాలని కోరారు. ఇటువంటి వ్యాజ్యాలను అణిచివేయాల్సిన సమయం ఆసన్నమైందని వివరించారు. భూముల విక్రయాలను అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా పొన్నవోలు వాదనలు వినిపించారు. సంక్షేమ పథకాలను విస్తృత స్థాయిలో అమలు చేసేందుకు అవసరమైన నిధులను సమీకరించేందుకు ప్రభుత్వం భూములను విక్రయిస్తుంటే, వాటిని అడ్డుకునేందుకు విజయవాడకు చెందిన కన్నెగంటి హిమబిందు, గుంటూరుకు చెందిన డాక్టర్ మద్దిపాటి శైలజ వ్యాజ్యాలు వేశారని, అసలు ఈ వ్యాజ్యాలు దాఖలు చేసేందుకు వీరికి ఉన్న అర్హత ఏమిటో న్యాయస్థానం విచారించాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ భూముల విక్రయం విషయంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి జస్టిస్ రాకేష్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించిందని, కౌంటర్ దాఖలుకు విచారణను గురువారానికి వాయిదా వేసిందని తెలిపారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, భూముల విక్రయంపై తాజాగా దాఖలైన వ్యాజ్యాలను ఇప్పటికే దాఖలైన వ్యాజ్యంతో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. హిమబిందు, శైలజ వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై ధర్మాసనం విచారణ జరిపింది. శైలజ తరఫున న్యాయవాది డీఎస్ఎన్వీ ప్రసాద్ బాబు, హిమబిందు తరఫున న్యాయవాది బి.నళిన్కుమార్ వాదనలు వినిపించారు. అందరి వాదనలు విన్న జస్టిస్ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం ఇదే అంశంపై జస్టిస్ రాకేష్ కుమార్ నేతృత్వంలో ధర్మాసనం విచారణ జరుపుతున్న నేపథ్యంలో దీనిని కూడా అదే ధర్మాసనం ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఏపీ అడిషనల్ ఏజీగా పొన్ననోలు సుధాకర్
-
ఏపీ అడిషనల్ ఏజీగా పొన్నవోలు నియామకం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అడిషనల్ ఏజీ (అడ్వొకేట్ జనరల్)గా సీనియర్ అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా పొన్నవోలు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నమ్మకాన్ని వమ్ము చేయనని అన్నారు. అడిషనల్ ఏజీగా తనకు బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు పలువురు పొన్నవోలుకు అభినందనలు తెలిపారు. కాగా రాష్ట్ర నూతన అడ్వొకేట్ జనరల్గా సుబ్రహ్మణ్య శ్రీరామ్ బుధవారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. -
ఏపీ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్గా సుబ్రమణ్యం శ్రీరామ్
సాక్షి, అమరావతి: కొత్త ప్రభుత్వం కొలువు తీరనున్న నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా సుబ్రమణ్యం శ్రీరామ్, అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ)గా పొన్నవోలు సుధాకర్రెడ్డి పేర్లు ఖరారైనట్లు తెలిసింది. నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా వీరి పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం పూర్తయిన తరువాత వీరి నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు మేరకు అడ్వొకేట్ జనరల్ను గవర్నర్ నియమిస్తారు. న్యాయవ్యవస్థలో అడ్వొకేట్ జనరల్ పోస్టుకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ పోస్టు రాజ్యాంగబద్ధమైంది. ఏజీ నియామకం పూర్తయిన తరువాత ఆయన సొంత టీంను ఏర్పాటు చేసుకుంటారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు ప్రభుత్వ న్యాయవాదులు, సహాయ ప్రభుత్వ న్యాయవాదులు, వివిధ కార్పొరేషన్లకు స్టాండింగ్ కౌన్సిళ్లుగా వ్యవహరిస్తున్న న్యాయవాదులు తమ తమ పోస్టులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. వీరి స్థానంలో కొత్త అడ్వొకేట్ జనరల్ అవసరాన్ని బట్టి ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదులను నియమించుకుంటారు. జూన్ 3వ తేదీ నుంచి హైకోర్టు వేసవి సెలవులు పూర్తి చేసుకుని తన కార్యకలాపాలను పునఃప్రారంభించనున్న నేపథ్యంలో, కేసుల విచారణ సందర్భంగా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఆ లోపు ప్రభుత్వ న్యాయవాదులు, సహాయ ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్ కౌన్సిళ్ల నియామకాలను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నియామకాల విషయంలో అడ్వొకేట్ జనరల్కు జగన్మోహన్ రెడ్డి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలిసింది. ప్రతిభ ఆధారంగానే నియామకాలు చేపట్టాలని ఏజీకి జగన్మోహన్రెడ్డి దిశా నిర్ధేశం చేసినట్లు సమాచారం. -
వివేకానందరెడ్డి హత్య కేసు చంద్రాబాబు తప్పుదోవ పట్టీసున్నారు
-
ఏపీలో బోగస్ ఓట్లపై హైకోర్టులో వాదనలు
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో బోగస్ ఓట్లపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. 59 లక్షలకు పైగా బోగస్ ఓట్లపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును ఆశ్రయించినట్లు ఆ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ... బోగస్ ఓట్లపై హైకోర్టులో వాదనలు జరిగాయి. బోగస్ ఓట్లపై విచారణ జరుపుతున్నామని ఎలక్షన్ కమిషన్ తరపు న్యాయవాది న్యాయస్థానానికి వివరణ ఇచ్చారు. ఈ నెల 20లోపు బోగస్ ఓట్లను తొలగించడంపై చర్యలు తీసుకుంటామని అధికారులు హైకోర్టు సాక్షిగా హామీ ఇచ్చారు. దీనిపై పూర్తి సమాచారం అందచేస్తామని హైకోర్టుకు వారు విన్నవించారు. ఇక బోగస్ ఓట్లపై నాలుగు దశల్లో మేము ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువచ్చాం. మొదటి దశలో మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. రెండో దశలో హైకోర్టును ఆశ్రయించాం. మూడో దశలో నియోజకవర్గాల వారీగా బోగస్ ఓట్లపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చాం. నాలుగో దశలో ప్రజలను కూడా తమ ఓటుహక్కుపై అవగాహన పెంచి ఓటరు జాబితాలో పేరు ఉందా, లేదా అనేది పరిశీలించుకునేలా అవగాహన కల్పిస్తున్నాం.’ అని తెలిపారు. -
హత్యాయత్నం వెనుకున్న కుట్రను వెలికితీయాలి
-
కుట్రదారులను తప్పించేందుకు యత్నం
విజయవాడ సిటీ: ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో అసలు కుట్రదారులను తప్పించే ప్రయత్నం తీవ్రంగా జరుగుతోందని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్రెడ్డి ఆరోపించారు. ఈ కేసును కేవలం నిందితుడు జనపల్లి శ్రీనివాస్కే పరిమితం చేయాలనే కుట్ర జరుగుతోందన్నారు. ఎన్ఐఏ పరిధిలోని కేసును రాష్ట్ర పరిధిలో విచారణ చేపట్టి నీరుగారుస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో డీజీపీ చేసిన వ్యాఖ్యలు తప్పుడువనే విషయం బుధవారం విశాఖపట్నం సీపీ లడ్డా ప్రెస్మీట్తో వెల్లడైందన్నారు. విజయవాడలోని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాస్ ఒక్కడినే కర్త, కర్మ, క్రియ అని చెప్పే విధంగా విశాఖపట్నం పోలీసు కమిషనర్ లడ్డా ప్రయత్నించారన్నారు. కేసు రిజిస్టర్ చేసే సమయంలో ఐపీసీ సెక్షన్ 120 బి లేకుండా ఈ కేసులో కేవలం సెక్షన్ 307 మాత్రమే ఎందుకు నమోదు చేశారని నిలదీశారు. వైఎస్ జగన్పై హత్యాయత్నం జరిగిన వెంటనే మధ్యాహ్నం 2 గంటలకు డీజీపీ ప్రెస్మీట్ పెట్టి..‘జగన్ అభిమానే దాడి చేశాడని’ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. అది తప్పని మాత్రమే ఈ రోజు లడ్డా చెప్పారన్నారు. ఎన్ఐఏతో ఎందుకు విచారణ చేయించరు? ఎయిర్పోర్టులో ఏ నేరం జరిగినా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) చట్టం పరిధిలోకి వస్తుందన్నారు. ఎన్ఐఏ పరిధిలోకి వచ్చే కేసు ఎందుకు రాష్ట్ర పరిధిలో పెట్టుకున్నారని నిలదీశారు. కేంద్ర పరిధిలో ఉన్న స్థలంలో జరిగిన ఘటనపై సెక్షన్ 61 ఎన్ఏఐ యాక్ట్ 2008 ప్రకారం, అలాగే సివిల్ ఏవియేషన్ యాక్ట్ 1982 సెక్షన్ 3ఏ కింద కేసు నమోదు చేసి దానిని ఎన్ఐఏకి బదిలీ చేయాలన్నారు. పాడేరు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోముపై మావోయిస్టులు దాడి చేసి హత్య చేస్తే వెంటనే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కి బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. వైఎస్ జగన్ కేసును ఎందుకు అప్పగించడం లేదని నిలదీశారు. పై రెండు చట్టాలు డీజీపీకి తెలియవా? లేక కావాలనే తొక్కిపట్టారా? అని ప్రశ్నించారు. విచారణను చంద్రబాబు ప్రభావితం చేశారని, ఈ కేసును ఆలస్యం చేస్తే ఇందులో సాక్ష్యాలు ఆవిరవుతాయని హైకోర్టులో ఫిర్యాదు చేశామన్నారు. ‘జగన్పై ఉన్న కేసుల నుంచి తప్పించుకునేందుకే ప్రధానిని ఆశ్రయించారని, మోదీ తలచుకుంటే జగన్ జైలుకే అని’ కుప్పంలో బుధవారం జరిగిన జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమని చెప్పారు. చంద్రబాబు మీద 27 కేసులు ఇవాల్టికీ స్టే రూపంలో ఉన్నాయంటే...ఆ కేసులు ముందుకు వెళ్లకుండా ఆయన కోర్టును మేనేజ్ చేశారా? అని ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థ అంటే బాబుకు అంత చులకన భావమా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన వ్యాఖ్యలను కోర్టు ధిక్కారం కింద పరిగణించాలన్నారు. వైఎస్ జగన్పై ఉన్న కేసులు గాలి బుడగ లాంటివని, ఎవరి కుట్రతో కేసులు పెట్టారో అందరికీ తెలిసిందేనని సుధాకర్రెడ్డి అన్నారు. -
వైఎస్ జగన్ పీఏ సెల్ నంబర్ స్పూఫింగ్
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యక్తిగత సహాయకుడు కేఎన్నార్ వినియోగిస్తున్న పార్టీ అధికారిక సెల్ఫోన్ నంబర్ స్పూఫింగ్కు గురైంది. ఈ పరిజ్ఞానాన్ని వినియోగించి పలువురికి ఫోన్కాల్స్ చేస్తున్న ఆగంతకులు వైఎస్ జగన్ మాదిరిగా మాట్లాడుతున్నట్లు గుర్తించారు. నేరగాళ్లు కొన్ని వాట్సాప్ నంబర్ల ద్వారా చాటింగ్లోకి కూడా వస్తున్నారు. దాదాపు పక్షం రోజులుగా పలువురు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే లు, మాజీ ఎమ్మెల్యేలతోపాటు వివిధ నియోజకవర్గాలకు చెందిన కన్వీనర్లకు ఇలాంటి ఫోన్ కాల్స్ రావడంతో పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ అంజనీకుమార్కు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న ఆయన కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఆదేశించారు. 15 రోజులుగా నకిలీ కాల్స్.. కేఎన్నార్ వినియోగిస్తున్న సెల్ఫోన్ నంబర్ లోటస్ పాండ్లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం పేరుతో ఉంది. వైఎస్ జగన్ పార్టీ శ్రేణులు, నేతలతో సంప్రదించాలని భావించినప్పుడు కేఎన్నార్ ఈ నంబర్ ద్వారానే వారికి కాల్స్ చేస్తుంటారు. పార్టీకి చెందిన కీలక నేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులతోపాటు వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తల సెల్ఫోన్లలో ఈ నంబర్ ఫీడ్ అయి ఉంది. ఈ నేపథ్యంలో ఈ నంబర్ను సంగ్రహించిన కొందరు దుండగులు సైబర్ నేరానికి పాల్పడ్డారు. ఇంటర్నెట్లో లభించే స్పూఫింగ్ సాఫ్ట్వేర్ ఆధారం గా ఈ నెల 10వ తేదీ నుంచి వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలకు ఫోన్ కాల్స్ చేయడం ప్రారంభించారు. జగన్ మాదిరిగా మాట్లాడుతున్న దుండగులు నిర్ణీత రుసుము తీసుకుని స్పూఫింగ్ సాఫ్ట్వేర్, ఇతర సదుపాయాలను అందించే వెబ్సైట్లు ఇంటర్నెట్లో అనేకం ఉన్నాయి. ఇటీవల డార్క్ వెబ్ ద్వారా కూడా దీన్ని కొనుగోలు చేసే అవకాశం ఏర్పడింది. వాస్తవానికి ఇది ఇంటర్నెట్ ద్వారా చేసే ఫోన్ కాల్. ఈ అప్లికేషన్ను ఇన్స్టాల్ చేసుకుని అందులోకి ఎంటర్ అయిన తరవాత సదరు దుండగుడి ఫోన్ నంబర్తోపాటు ఫోన్కాల్ అందుకోవాల్సిన వ్యక్తిది, ఫోన్ రిసీవ్ చేసుకునేప్పుడు అతడి సెల్ఫోన్లో ఎవరి నంబర్ డిస్ప్లే కావాలో పొందుపరుస్తారు. దుండగుడి నంబర్ నిక్షిప్తమయ్యే సర్వర్ మారుమూల దేశాల్లో ఉండటంతో గుర్తించడం కష్టం. స్పూఫింగ్ సాఫ్ట్వేర్ ద్వారా కాల్స్ చేస్తుండటంతో ఫోన్ అందుకునే వారికి కేఎన్నార్ నంబరు మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఈ నకిలీ ఫోన్ కాల్ను వైఎస్సార్ సీపీ నేతలు అందుకున్న వెంటనే వైఎస్ జగన్ మాదిరిగా దుండగుడు మాట్లాడుతున్నాడు. తాను పాదయాత్రలో ఉన్నానని, మిగిలిన విషయాలు చర్చించేందుకు వేరే వ్యక్తి సంప్రదిస్తారని చెబుతూ ఫోన్ కట్ చేస్తున్నాడు. ఆ వెంటనే రెండో అంకం మొదలవుతుంది. రూ.10 లక్షలు పంపాలంటూ మోసగాళ్ల వల.. దుండగులు +1(507)407–9047 నంబర్ను వినియోగిస్తూ వైఎస్సార్ సీపీ నేతలతో వాట్సాప్ చాటింగ్ చేస్తున్నారు. ఈ అంతర్జాతీయ నంబర్లో ఎంపీ పూనమ్ మహాజన్ డీపీ కనిపిస్తోంది. తాను పూనమ్నని... ఇప్పుడే జగన్మోహన్రెడ్డి మాట్లాడారు కదా!.. అంటూ దుండగులు చాటింగ్ ఆరంభిస్తున్నారు. వైఎస్ జగన్ పాదయాత్రలో బిజీగా ఉన్నారని చెబుతూ వెంటనే రూ.10 లక్షలు విశాఖపట్నం పంపించాలని సైబర్ నేరగాళ్లు సూచిస్తున్నారు. అంతేకాదు... వైఎస్ జగన్ పాదయాత్రలో ఉన్నందున ఆయనకు కాల్ చేసి డిస్ట్రబ్ చేయవద్దని, ఆయనే మీకు కాల్ చేస్తారంటూ కూడా మోసగాళ్లు సూచించడం గమనార్హం. దూషిస్తూ కొందరు నేతలకు హెచ్చరికలు... కొందరు వైఎస్సార్ సీపీ నేతలకు వాట్సాప్, వీఓఐపీ ద్వారా కాల్స్ చేస్తున్న దుండగులు దూషణలకు దిగడంతోపాటు హెచ్చరికలు కూడా చేస్తున్నట్లు గుర్తించారు. ఇలా ఈ నెల 10వతేదీ నుంచి దాదాపు 20 మంది పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలకు నకిలీ ఫోన్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎ.హర్షవర్ధన్రెడ్డి, లీగల్ సెల్ ప్రెసిడెంట్ పి.సుధాకర్రెడ్డిలతో కూడిన బృందం సోమవారం హైదరాబాద్ పోలీసు కమిషనర్కు ఫిర్యాదును అందచేసింది. పార్టీ, వైఎస్ జగన్ ప్రతిష్టను దెబ్బతీయడానికి కొందరు పథకం ప్రకారం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని సుధాకర్రెడ్డి పేర్కొన్నారు. దుండగులు ఏ ప్రాంతంలో ఉన్నా గుర్తించి పట్టుకుంటామని పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. -
వైఎస్ జగన్ పీఏ పేరుతో బెదిరింపు కాల్స్!
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఒక పథకం ప్రకారం ఇలాంటి కుట్రలను అడ్డుకోవడానికి తక్షణం చట్టపరమైన చర్య తీసుకోవాలని ఆ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ ఐటీ సెల్ నాయకుడు ఏ హర్షవర్ధన్ రెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి తదితరులు సోమవారం హైదరాబాద్ అంజనీ కుమార్ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు నాగేశ్వర్ రెడ్డి పేరును ఆయన ఫోన్ నంబరును దుర్వినియోగం చేస్తూ ఆయన పేరుతో పార్టీ నేతలకు ఫోన్లు, మెస్సేజీలు పంపిస్తూ డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన అంజనీ కుమార్ కేసును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు బదిలీ చేశారు. జగన్ పాదయాత్రలో ఉన్నప్పుడు తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు జగన్ పీఏ పేరుతో ఫోన్ కాల్ చేయడమే కాకుండా డబ్బు పంపించాలంటూ వాట్సాప్ మెసేజీ కూడా పంపించారని, ఈ రకంగా పలువురు నేతలకు మెసేజీలు వెళ్లాయని వారు పేర్కొన్నారు. ఈ రకంగా దాదాపు 15 మంది నేతలకు బెదిరింపు కాల్స్ వెళ్లాయని సుధాకర్ రెడ్డి మీడియాకు తెలిపారు. రాజకీయంగా వైఎస్ జగన్ కు ప్రజల నుంచి పెరుగుతున్న మద్దతును చూసి తట్టుకోలేక, ఇలాంటి దుష్ర్పచారానికి ఒడిగడుతున్నారని ఆయన విమర్శించారు. లోటస్పాండ్ పేరిట ఆగంతకుడి నెంబర్ రిజిస్టర్ అయ్యిందని, అందుకే హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నేతలతో పాటు ఢిల్లీలోని కొందరి ప్రముఖులకు ఫోన్ కాల్స్, మెస్సేజ్లు చేస్తున్నాడని, ఈ ఆగంతకులను పట్టుకుని చర్యలు తీసుకోవాలని సీపీని కోరినట్లు ఆయన తెలిపారు. -
ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో సోమవారం హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఎయిర్పోర్టులో దాడి జరిగితే రాష్ట్ర పోలీసులు ఎందుకు విచారణ చేపట్టారని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు ఎందుకు అప్పగించలేదని నిలదీసింది. ఈ కేసును ఎన్ఐఏకు ఎందుకు బదిలీ చేయలేదో చెప్పాలని, పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ ధాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసును ఏపీ పోలీసుల పరిధి నుంచి ఎన్ఐఏకు బదిలీ చేసేలా ఆదేశించాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిల్పై హైకోర్టు ఈరోజు వాదనలు ఆలకించింది. ఆయన తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసి కావాలనే ఏపీ ప్రభుత్వం విచారణను తమ పరిధిలో సాగిస్తుందని కోర్టుకు తెలిపారు. ఎన్ఐఏ యాక్ట్ సెక్షన్ 6 ప్రకారం ఎయిర్ పోర్ట్ లేదా, ఎయిర్ క్రాఫ్ట్ లో అఫెన్స్ జరిగితే విచారణ ఎన్ఐఏ పరిధిలోకి వస్తుందన్నారు. అన్ లా ఫుల్ అగనెస్ట్ సేఫ్టీ ఆఫ్ సివిల్ ఎవియేషన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 3(ఏ)కింద కేసు నమోదు చేయాలని, తమ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఏపీ ప్రభుత్వాకి గట్టిగా అక్షింతలు వేసిందని ‘సాక్షి’తో పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం రెండు చట్టాలను తొక్కిపెట్టినట్టు సాక్ష్యాధారాలతో కోర్టు ముందుంచామని వెల్లడించారు. విచారణను తమ పరిధిలోనే ఉంచుకుని నాటకాలు ఆడుతోందని, దీనికి కచ్చితంగా జవాబు చెప్పాల్సివుంటుందన్నారు. కేసు దర్యాప్తు కచ్చితంగా ఎన్ఐఏ పరిధిలోకి వెళుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
‘పోలీసు యంత్రాంగం టీడీపీకి తొత్తుగా మారిపోయింది’
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలన హిట్లర్ పాలనను తలపిస్తోందని వైఎస్సార్సీపీ నేతలు మహ్మద్ ఇక్బాల్, పొన్నవోలు సుధాకర్ రెడ్డిలు విమర్శించారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. పోలీస్ యంత్రాంగం టీడీపీకి తొత్తుగా మారిపోయిందని మండిపడ్డారు. చట్ట బద్ధంగా వ్యవహరించాల్సిన పోలీసులు.. టీడీపీ ఆదేశాల మేరకు పనిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తూ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెడుతున్నారన్నారు. అసలు సంబంధం లేని పనులతో అమాయకులను వేధిస్తున్నారని, రాజ్యాంగం ఇచ్చిన భావ స్వేచ్ఛను పోలీసులు ఆటంకం కల్గించవద్దని వారు విన్నవించారు. సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో టీడీపీ నేతల చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే థర్డ్ పార్టీకి విచారణను అప్పగించాలని డిమాండ్ చేశారు. -
హత్యాయత్నం చంద్రబాబు కుట్రే
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర ఉందని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో అసలు సూత్రధారులు బయటకు రాకుండా, కుట్రకోణాన్ని చేర్చకుండా కేవలం నిందితుడు శ్రీనివాస్కే విచారణను పరిమితం చేసి, ముగించాలని చూస్తున్నారని విమర్శించారు. జగన్పై జరిగిన హత్యాయత్నం కేసు విచారణ పక్కదోవ పడుతున్న నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ రూపొందించిన అభియోగపత్రాన్ని పొన్నవోలు సుధాకర్రెడ్డి బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతోనే అభియోగపత్రం విడుదల చేస్తున్నామన్నారు. చంద్రబాబు ద్వారా నియమితులైన పోలీసుల ఆధ్వర్యంలో కేసు విచారణ సక్రమంగా సాగడం లేదని చెప్పారు. ఈ కేసును కేవలం ఐపీసీ సెక్షన్ 307కే పరిమితం చేశారని, కుట్రకోణానికి సంబంధించిన సెక్షన్లను చేర్చలేదని తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే సీఎం, మంత్రులు, డీజీపీ మాట్లాడారంటే హత్యాయత్నం గురించి వారికి ముందే తెలిసినట్లుగా ఉందన్నారు. నిందితుడు శ్రీనివాస్ వీఐపీ లాంజ్ వరకు కత్తిని ఎలా తీసుకెళ్లగలిగాడు? ఎవరి సహకారంతో తీసుకెళ్లాడో తేల్చాలని డిమాండ్ చేశారు. జగన్పై జరిగిన యత్యాయత్నం గురించి సీఎం చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేశారని, ఆయన మాటలను చూస్తే హత్యాయత్నం తప్పిపోయిందనే అక్కసు వెళ్లగక్కినట్లుగా ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అభియోగపత్రంలోని కీలకాంశాలు.. ‘‘జగన్పై జరిగిన హత్యాయత్నం వెనుక దాగి ఉన్న కుట్ర కోణంపై విచారణ జరగడం లేదు. సెక్షన్ 120(బి) ప్రకారం హత్యకు యత్నించిన వ్యక్తితోపాటు తెరవెనుక సూత్రధారులు, పాత్రధారులపైనా తప్పనిసరిగా విచారణ జరగాలని నిరూపిస్తున్న అంశాలను వైఎస్సార్సీపీ ప్రజల ముందు ఉంచుతోంది. - జగన్పై హత్యాయత్నానికి ఉపయోగించిన కత్తి రెండంచెల భద్రతా వలయాన్ని దాటుకుని ఎయిర్పోర్టులోకి ఎలా ప్రవేశించింది? - శ్రీనివాస్ సొంత చిన్నాన్న ఠాణేలంక గ్రామానికి ఉప సర్పంచి. ఆయన టీడీపీ సానుభూతిపరుడు. ఠాణేలంక గ్రామంలో శ్రీనివాస్ కుటుంబానికి 2 ఇళ్ల నిర్మాణానికి అక్కడి జన్మభూమి కమిటీ ఆమోదం తెలిపింది. శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఏ పార్టీ అభిమానులో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఏనాడూ వైయస్సార్సీపీ అభిమానులు కాదు. ఠాణేలంక ప్రజలంతా ఈ విషయం చెబుతున్నారు. - జగన్పై హత్యాయత్నం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి, మంత్రులు, రాష్ట్ర డీజీపీ చేసిన ప్రకటనలు పలు సందేహాలకు తావిస్తున్నాయి. - ఆ కత్తిపోటు కరోటిడ్ ఆర్టరీకి(మెడలో కీలక రక్తనాళం) తగిలి ఉంటే జగన్ ప్రాణాలు పోయేవన్న నిజాన్ని ఎందుకు దాస్తున్నారు? - తనకు ప్రాణహాని ఉందని నిందితుడు చెప్పాడు. ఇది నిజంగా చంద్రబాబు పన్నిన పన్నాగం కాకపోతే, టీడీపీ ప్రభుత్వం దీని వెనుక లేకపోతే నిందితుడి ప్రాణాలు తీయాల్సిన అవసరం ఎవరికుంది? - ఐపీసీలోని 120(బి) ప్రకారం నేరం చేసిన వ్యక్తితోపాటు, నేరానికి పన్నిన కుట్రపైనా విచారణ జరిగితేనే ఈ అంశాలన్నింటికీ సమాధానాలు లభిస్తాయి’’ -
‘అధికారంలోకి రాగానే కేసు రీఇన్వెస్టిగేషన్ చేయిస్తాం’
హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో కుట్రను దర్యాప్తు సంస్థ ఎక్కడా బహిర్గతం చేయలేదని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్లోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సుధాకర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. విశాఖపట్నం ఎయిర్పోర్టులో శ్రీనివాస్ ఎవరి సహాయంతో లోపలికి కత్తి తెచ్చాడని ప్రశ్నించారు. ఈ హత్యాయత్నం వెనక ఉన్న సూత్రధారులు ఎవరు అంటే ప్రభుత్వ పెద్దలేనని అర్ధమవుతోందని వ్యాఖ్యానించారు. కేసులో కీలక నిందితుడు హర్షవర్ధన్ చౌదరీకి చెందిన ఫ్యూజన్ రెస్టారెంట్ను నారా లోకేషే ప్రారంభించారని గుర్తు చేశారు. హత్యాయత్నం జరిగిన 4 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందని తెలిపారు. ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టకముందే డీజీపీ, మంత్రులు, చంద్రబాబు స్పందించారంటే ముమ్మాటికీ కుట్రే జరిగిందని స్పష్టమవుతోందన్నారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే ముందే డీజీపీ ఎలా మాట్లాడారని ప్రశ్నించారు. హత్యాయత్నం గురించి ముందు నిర్ణయించుకున్న ప్రకారం రియాక్ట్ అయ్యారని తెలిపారు. పోలీసుల వైఖరిపై తాము చార్జిషీట్ రిలీజ్ చేస్తున్నామని వెల్లడించారు. శ్రీనివాస్ వైఎస్సార్సీపీ కార్యకర్త అయితే జగన్, వైఎస్సార్ గురించి ఎందుకు రాస్తాడని అనుమానం లేవనెత్తారు. శ్రీనివాజ్ జేబులో లెటర్ ఉంది అని విచారణ జరగక ముందే డీజీపీ ఎలా చెప్పగలిగారని సందేహం వ్యక్తం చేశారు. హత్యాయత్నం కేసులో గాయం లేకపోయినా హత్యాయత్నమే అవుతుందని వ్యాఖ్యానించారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసులో కీలక నిందితుడు శ్రీనివాస్ని అంతమొందించే కుట్ర జరుగుతోందని, నిందితుడికి ఏమైనా జరిగితే చంద్రబాబు నాయుడిదే బాధ్యతని అన్నారు. అసలు కుట్రదారుల్ని బయటికి రాకుండా చేస్తున్న ప్రయత్నమే టీడీపీ చేస్తున్న దుష్ప్రచారమని అన్నారు. తాము విడుదల చేస్తున్న ఛార్జ్షీట్ కాదనే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని సవాల్ విసిరారు. తాము అధికారంలోకి రాగానే కేసును రీఇన్వెస్టిగేషన్ చేయిస్తామని, పాత్రధారులు, సూత్రధారులని శిక్షిస్తామని చెప్పారు. -
చంద్రబాబు తప్పించుకోలేరు
-
చంద్రబాబు తప్పించుకోలేరు
న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసు నుంచి టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పించుకోలేరని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు. ఈ కేసులో తమకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పారు. ఓటుకు కోట్లు కేసులో సుప్రీం కోర్టు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. వీలైనంత త్వరగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, ఈ కేసును సమగ్రంగా విచారిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. అనంతరం పొన్నవోలు మీడియాతో మాట్లాడుతూ.. కేసు తీవ్రతను సుప్రీం కోర్టు గుర్తించిందని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. విచారణ సమయంలో కోర్టుకు వివరాలన్నీ సమర్పిస్తామని చెప్పారు. చంద్రబాబు నిర్దోషి అయితే విచారణకు ఎందుకు భయపడుతున్నారని పొన్నవోలు ప్రశ్నించారు. గతంలో 18 కేసుల్లో విచారణను చంద్రబాబు అడ్డుకున్నారని, ఈ కేసులో మాత్రం దొరుకుతారని చెప్పారు. అవినీతి నిరోధక చట్టం కింద ఎవరయినా కేసు వేయవచ్చన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని, తప్పు చేస్తే చంద్రబాబుకు శిక్ష పడాల్సిందేనని అన్నారు. బ్రీఫ్డ్ మీ అన్న గొంతు చంద్రబాబుదేనని తేలిందని, ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించామని తెలిపారు. తప్పుచేసిన వాళ్లు ఒకటి, రెండు సార్లు తప్పించుకోవచ్చని, ప్రతిసారీ తప్పించుకోలేరని పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. -
భయంతోనే చంద్రబాబు ఈ కోర్టుకొచ్చారు
► హైకోర్టులో పిటిషన్ వేసే హక్కు ఆయనకే లేదు ► ఆర్కే తరఫు న్యాయవాది పొన్నవోలు వాదనలు ► చంద్రబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని కోర్టుకు నివేదన ► ‘ఓటుకు కోట్లు’ కేసు విచారణ వచ్చే సోమవారానికి వాయిదా సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో తనను ఎక్కడ నిందితునిగా చేరుస్తారోననే ఊహాజనితమైన భయంతోనే ఏపీ సీఎం చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించి దర్యా ప్తుపై స్టే ఉత్తర్వులు పొందారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్న వోలు సుధాకర్రెడ్డి న్యాయస్థానానికి నివేదిం చారు. ఊహాజనితంగా ఏదో జరగబోతుందని ఊహించి వచ్చేవారిని కాపా డేందుకు ఈ కోర్టు లేదన్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో చంద్రబాబు పాత్రకు సంబం దించి ఏసీబీ నుంచి ప్రత్యేక కోర్టు నివేదిక కోరిందని, ఈ దశలో ఆయనకు హైకోర్టును ఆశ్రరుుంచే అధికారం(లోకోస్టాండీ) లేదని స్పష్టం చేశారు. ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు తమకు లోకోస్టాండీ లేదని చంద్రబాబు తరఫు న్యాయవాది చేసిన వాదన సరికాదని, ఊహాజనితంగా హైకోర్టు ను ఆశ్రయించేందుకు చంద్రబాబుకే లోకో స్టాండీ లేదని పొన్నవోలు తెలిపారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో చంద్రబాబును నిందితునిగా చేరుస్తూ మరో ఎఫ్ఐఆర్ జారీచేస్తే అప్పుడా యన ఈ కోర్టును ఆశ్రయించవచ్చన్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో చంద్రబాబు పాత్రపై స్పష్టమైన ఆధారాలున్నా ఆ దిశగా ఏసీబీ దర్యాప్తు చేయట్లేదంటూ వైఎస్సార్సీపీ ఎమ్మె ల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించగా...ఆ దిశగా దర్యాప్తు చేయాలని ఆ కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల్ని సవాల్ చేస్తూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించగా.. దర్యాప్తును నిలిపివేస్తూ కోర్టు మధ్యం తర ఉత్తర్వులు(స్టే) జారీచేసింది. వీటిని సవాల్ చేస్తూ రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా...ఈ వ్యవహారంపై 4వారాల్లో విచారణను పూర్తిచేయాలని హైకోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ సునీల్చౌద రి బుధవారం మరోసారి విచారణ జరిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలి.. ‘‘ఓటుకు కోట్లు ఇచ్చి కొనేందుకు ప్రయత్నించడం అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందని పీవీ నరసింహారావు కేసులో సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఎంపీల కొనుగోలుకు ప్రయత్నించినందుకు పీవీసహా ఇతరులకు ప్రత్యేక కోర్టు జైలుశిక్ష కూడా విధించింది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 12 ప్రకారం అవినీతిని ప్రోత్సహించిన వారిని నిందితునిగా చేరుస్తారు. తీసుకున్న వారిని వదిలేస్తారు. ఇక్కడా చంద్రబాబుపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలి’’ అని పొన్నవోలు కోర్టుకు నివేదించారు. దర్యాప్తు చేస్తున్న కేసుల్లోనూ ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేయవచ్చన్నారు. ఓటుకు కోట్లు కేసులో అన్ని ఆధారాలున్నా ఏడాదిన్నర గడిచినా చంద్రబా బును నిందితునిగా చేర్చకపోవడం తోనే తాము ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశామని తెలిపారు. నేర విచారణ చట్టంలోని సెక్షన్లు 156(3), 210 కింద దర్యాప్తు సంస్థ నుంచి నివేదిక కోరే అధికారం ప్రత్యేక కోర్టుకుంద న్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకకోర్టు 156(3) సెక్షన్ కింద ఏసీబీ నుంచి నివేదిక కోరిందన్నారు. అయితే సెక్షన్ 210 కింద ఆదేశాలివ్వాలని మీరు కోరినా న్యాయమూర్తి అనాలోచితంగా 156(3) కింద ఆదేశాలిచ్చా రని, దీన్నెలా సమర్థించుకుంటారని న్యాయ మూర్తి ప్రశ్నించారు. అయితే సెక్షన్ను తప్పుగా కోట్చేస్తూ ఆదేశాలిచ్చినంత మాత్రా న అవి చెల్లకుండా పోవని పొన్నవోలు తెలిపారు. అవసరమనుకుంటే హైకోర్టు తమ పిటిషన్ను కింద కోర్టుకు తిప్పిపంపి సరైన సెక్షన్ కింద ఉత్తర్వులివ్వాలని ఆదేశించవచ్చ న్నారు. ఈ మేరకు రోజా కేసులో జస్టిస్ దిలీప్ బొసాలేతోపాటు పలు కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని ప్రస్తావించా రు. అవినీతి కేసుల్లో దర్యాప్తును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వరాదం టూ సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను కోర్టు ముందుంచారు. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు ఏసీబీ తరఫు న్యాయవాది రవికిరణ్ గడువుకోరడంతో విచారణను సోమవారానికి వాయిదా వేశారు. కాగా, ఈ కేసులో తనను ఇంప్లీడ్ చేసి తన వాదనలూ వినాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ వేసిన పిటిషన్ను ప్రధాన పిటిషన్కు జతచేస్తానని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ పిటిషన్ విచారణార్హతపై మంగళవారం వాదనలు వినిపించాలని ఉండవల్లికి సూచించారు. -
'నిజం బయటపడుతుందని బాబు భయం'
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రపై విచారణ జరపాలని ఏసీబీ కోర్టు ఆదేశించిందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. విచారణను ఎదుర్కొని తన నిజాయితీని రుజువు చేసుకోవాల్సిన చంద్రబాబు.. విచారణ ఆపాలంటూ హైకోర్టును ఆశ్రయించారని విమర్శించారు. విచారణ జరిగితే తన నిజస్వరూపం బయటపడుతుందని చంద్రబాబు భయపడుతున్నారని అన్నారు. కేసులో పసలేదన్న చంద్రబాబు హైకోర్టును ఎందుకు ఆశ్రయించారు? అంటూ సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు నిజంగా నిప్పు అయితే విచారణను ఎదుర్కొని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని ఆర్కే తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి అన్నారు. -
గుండెలపై తుపాకీ ఎక్కుపెడితే భయపడం
-
గుండెలపై తుపాకీ ఎక్కుపెడితే భయపడం: ఎమ్మెల్యే ఆర్కే
హైదరాబాద్: ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతులకు వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి భరోసా ఇచ్చారు. భూసేకరణ పేరుతో రైతుల గుండెలపై తుపాకీ ఎక్కుపెట్టినంత మాత్రానా భయపడేదిలేదన్నారు. భూసేకరణ చట్టాన్ని కోర్టులో సవాల్ చేస్తామని వైఎస్ఆర్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు. ఎట్టి పరిస్థితులలో ఈ చట్టం అమలులోకి రాకుండా అడ్డుకుంటామన్నారు. -
కారును పోలీసులే తీసుకెళ్లారు: శేషయ్య
న్యాయవాది కిడ్నాప్నకు వాడిన కారు యజమాని శేషయ్య సాక్షి, నెల్లూరు: నెల్లూరు జెడ్పీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో జరుగుతున్న అధికార దుర్వినియోగంపై కోర్టుకెక్కిన న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డిని కిడ్నాప్ చేసే ప్రయత్నంలో వినియోగించిన కారును పోలీసులు తీసుకెళ్లినట్లు దాని యజమాని పబ్బు శేషయ్య ధ్రువీకరించారు. అయితే ‘సాక్షి’ నుంచి వచ్చినట్లు చెప్పగానే లేదు లేదు.. తన స్నేహితులు తీసుకెళ్లారని మాట మార్చారు. ఎవరా స్నేహితులు? అనే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఆయన నిరాకరించారు. కారు అక్కడ నిలబెట్టి ఉండగా, న్యాయవాదికి చెందినవారు అనవసర రాద్ధాంతం చేశారని వ్యాఖ్యానించారు. న్యాయవాది సుధాకర్రెడ్డిని మంగళవారం హైదరాబాద్లో కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఇందుకు ఉపయోగించిన ఏపీ26-ఎపి9559 కారు నెల్లూరులోని శ్రీనివాస అగ్రహారానికి చెందిన పబ్బు శేషయ్యది. ఆయన రాజరాజేశ్వరి ట్రావెల్స్ను నడుపుతున్నారు. ట్రావెల్స్ ద్వారా కారును నడుపుతున్నా, దానికి టూరిస్టు పర్మిట్ లేదు. సొంత కారుగానే చెప్పుకుంటూ అద్దెకు తిప్పుతున్నాడు. దీన్ని ఆసరాగా తీసుకున్న పోలీసులు కారును బాడుగకు తీసుకున్నట్లు తెలిసింది. కారును హైదరాబాద్కు తీసుకెళ్లి పొన్నవోలు సుధాకర్రెడ్డిని కిడ్నాప్నకు ప్రయత్నించారు. -
పొన్నవోలు కిడ్నాప్ యత్నంపై బార్ అసోసియేషన్ ఖండన
హైదరాబాద్: హైకోర్టు బార్ అసోసియేషన్ బుధవారం మధ్యాహ్నం అత్యవసర భేటీ అయింది. ఈ భేటిలో లాయర్ పొన్నవోలు సుధాకర్రెడ్డి కిడ్నాప్ యత్నాన్ని ఖండిస్తూ హైకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది. పొన్నవోలు సుధాకర్రెడ్డి కిడ్నాప్ యత్నంపై తెలంగాణ, ఏపీ డీజీపీలకు ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు చేస్తామని హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గిరిధరరావు మీడియాకు తెలిపారు. నెల్లూరు జిల్లా పరిషత్ ఎన్నికల్లో జరిగిన అరాచకాలను హైకోర్టుకు విన్నవించిన న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డిని కిడ్నాప్యత్నం జరిగింది. దీనిపై ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఎన్నిక నిర్వహణకు కోర్టు ప్రత్యేక పరిశీలకుడిని నియమించాలని, ఎన్నికలు సజావుగా జరపాలని ఆదేశాలు పొందిన నేపథ్యంలో కిడ్నాప్ కు కొందరు ప్రయత్నించారు. ఈ నెల 5న జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ గొడవలు సృష్టించి, ఎన్నికలను వాయి దా వేయించిన విషయం తెలిసిందే. ఈ కేసును ప్రజాహిత వ్యాజ్యంగా దాఖలు చేసిన న్యాయవాది సుధాకర్రెడ్డిని మంగళవారం హైదరాబాద్లో కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసినట్లు తెలిసింది.