Primary health centers
-
జీవో 85ను రద్దు చేయండి
సాక్షి, అమరావతి/గుంటూరు మెడికల్: వైద్య విద్య పీజీ కోర్సుల్లో ఇన్సర్వీస్ కోటా కుదింపునకు సంబంధించిన జీవో నంబర్ 85ను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్సీల) వైద్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వానికి ఏపీ పీహెచ్సీ వైద్యుల సంఘం లేఖ రాసింది. ‘నిర్దేశిత పరీక్షకు కేవలం 20 రోజుల ముందు ప్రభుత్వం ఇన్సరీ్వస్ కోటాను కుదిస్తూ నిర్ణయం తీసుకుని జీవో 85ను జారీ చేసింది.దీంతో మాకు న్యాయపరమైన మార్గం చూసుకునే అవకాశం లేకుండాపోయింది. జీవో 85పై మేము జూలై 23న వైద్య శాఖ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం సమరి్పంచాం. ఆ తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, మంత్రి లోకేశ్లకు వినతిపత్రాలు సమర్పించాం. గత 50 రోజులుగా మా బాధను చెబుతూనే ఉన్నాం. అయినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. ఇక దిక్కుతోచని స్థితిలో ఆందోళన బాటపట్టాం. జీవో 85 రద్దు చేసి.. ఇప్పటికే గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సేవలందిస్తున్న వైద్యులకు మరిన్ని పీజీ సీట్లు ఇవ్వడం వల్ల మొత్తం ఆరోగ్య వ్యవస్థ బలోపేతం అవుతుంది. మా డిమాండ్లు అన్నింటినీ వెంటనే పరిష్కరించండి’ అని ప్రభుత్వాన్ని పీహెచ్సీ వైద్యుల సంఘం డిమాండ్ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్సీల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు శనివారం కూడా తమ నిరసన కొనసాగించారు. పీజీలో ఇన్ సర్వీస్ కోటాను కుదించడాన్ని ఖండిస్తూ జీవో నంబర్ 85ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు డీఎంహెచ్వో కార్యాలయం ఎదుట వైద్యులు తమ నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. -
వంద రోజుల్లో వైద్యులను రోడ్డుపై నిలబెట్టారు
సాక్షి, అమరావతి/తిరుపతి తుడా: వంద రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం వైద్యులను రోడ్ల మీదకు లాగిందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) వైద్యులు మండిపడ్డారు. వంద రోజుల్లో గొప్ప కార్యక్రమాలు చేశామని ప్రకటనలు చేసుకుంటున్న ఈ ప్రభుత్వం కోవిడ్లో ప్రాణాలకు తెగించి సేవలు అందించిన వైద్యులను అవమానాలకు గురిచేస్తోందన్నారు. గత ప్రభుత్వంలో పెద్దఎత్తున వైద్యులను నియమించి, పీహెచ్సీలను బలోపేతం చేస్తే ఈ ప్రభుత్వం వైద్యులపై వేధింపులకు దిగుతోందన్నారు. వైద్య విద్యలో ఇన్సర్వీస్ కోటా కుదింపునకు సంబంధించిన జీవో 85కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా డీఎంహెచ్వో కార్యాలయాల ముందు వైద్యులు శుక్రవారం శాంతియుత నిరసనలు చేపట్టారు. విజయవాడలో నిరసన కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో వైద్యులందరు తమ జిల్లాలకు గురువారం వెళ్లిపోయినట్లు పీహెచ్సీ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ యూనస్మీర్ ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే సోమవారం ఛలో విజయవాడ 2.0 కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు చర్చలు నిర్వహించిన్పటికీ తమ డిమాండ్లు నెరవేరలేదని, మళ్లీ చర్చలకు పిలిచి, డిమాండ్లను నెరవేర్చే వరకూ విజయవాడలో నిరసన తెలుపుతామన్నారు. శుక్రవారం ఉదయం నుంచి డీఎంహెచ్వో కార్యాలయాల ముందు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వైద్యులపై కేసులు పెడతామని డీఎంహెచ్వోలు బెదిరించారని చెప్పారు. అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా శనివారం కూడా డీఎంహెచ్వోల కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైద్యులందరూ కలిసి వేధింపులకు పాల్పడిన డీఎంహెచ్వోల కార్యాలయాల ముందు పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని తేల్చి చెప్పారు.సమస్యలు పరిష్కరించే వరకు నిరసనప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం దారుణమని ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారుల సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చత్రప్రకాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద డాక్టర్లు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కారంఅయ్యే వరకు శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తామన్నారు. -
Fact Check: కళ్లు తెరిచి చూడు రామోజీ..
సాక్షి, అమరావతి: చింతకాయను ఎంత చితక్కొట్టినా.. ఉల్లిపాయను ఎంత ఉడకబెట్టినా వాటి సహజ లక్షణం కోల్పోవు. ఈనాడు రామోజీరావు తీరు కూడా అంతే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్పైనా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైనా ఆయన నిత్యం వెళ్లగక్కుతున్న అక్కసు, చేస్తున్న విషప్రచారంపై ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా ఆయనలో మార్పులేదు.. రాదు. ఎందుకంటే.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలపై ఆయన పనిగట్టుకుని.. కళ్లు మూసుకుని చెప్పిన అబద్ధాలే చెప్పి రాసిన అబద్ధాలే రాస్తున్నారు కాబట్టి. తాజాగా.. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై ఆయన గుండెలు బాదుకున్న తీరు జగన్పై రామోజీకున్న అక్కసును మరోసారి చాటిచెప్పింది. రాష్ట్రంలో వంద శాతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీలు) 24/7 పనిచేస్తున్నాయని స్వయంగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రశంసలు కురిపించినా రామోజీకి వినిపించదు. నాడు–నేడు కార్యక్రమంలో కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా పీహెచ్సీలు రూపాంతరం చెందాయి. ఈ క్రమంలో దేశంలోనే అత్యధిక పీహెచ్సీలకు నేషనల్ క్వాలిటీ అసూ్యరెన్స్ సర్టిఫికేషన్తో ఏపీ అగ్రస్థానంలో ఉంది. అయినా, ఆయన విషపుత్రిక ఈనాడుకు అది కనిపించదు. ఎందుకంటే ఆయన లెక్కలు, ఎక్కాలు వేరే. సీఎం జగన్ ప్రభుత్వం మీద విషం చిమ్మడమే ఆయన జెండా.. ఎజెండా. అందుకే ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ వైద్య రంగం ఎంత మెరుగుపడినా ఆయనకు పట్టదు. నిజానికి.. గత టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో పీహెచ్సీలంటే నరకానికి నకళ్లు అన్నట్లుగా ఉండేవి. ఒక్క పీహెచ్సీలే కాదు.. బోధనాస్పత్రుల వరకూ అన్ని ఆస్పత్రులది అదే దుస్థితి. అయినా, అప్పట్లో రామోజీరావుకు, ఈనాడుకు అంతా పచ్చగా కనిపించేది. ఆ తర్వాత సీఎంగా వైఎస్ జగన్ పగ్గాలు చేపట్టాక.. ప్రజారోగ్యం పట్ల చిత్తశుద్ధితో ఆయన ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమం అమలు, 53 వేలకు పైగా పోస్టుల భర్తీ, ఇతర విప్లవాత్మక చర్యలతో ప్రభుత్వ వైద్య రంగం రూపురేఖలను సమూలంగా మార్చినప్పటికీ ‘పచ్చ’కామెర్లతో రామోజీరావు కంటికి ఇవేమీ కనిపించడంలేదు. అందుకే ‘వైద్య రంగం బలోపేతమా.. ఎక్కడ?’ అంటూ ఈనాడులో మంగళవారం చేతికొచ్చింది రాసిపారేశారు. పీహెచ్సీల్లో అరకొర సేవలతో రోగుల వెతలు అంటూ ప్రభుత్వంపై ఇష్టానుసారం బురదజల్లారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వైద్యరంగంపై అసలు వాస్తవాలు ఏమిటంటే.. సిబ్బంది, వనరులు ఉండటం బలోపేతం కాదా? టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పీహెచ్సీల్లో ఒకేఒక్క వైద్యుడు ఉండేవాడు. అతను సెలవుపై వెళ్తే ఇక వైద్యసేవల సంగతి దేవుడెరుగు. మందులు, వైద్య పరీక్షల గురించి అయితే చెప్పక్కర్లేదు. ఎందుకంటే.. పీహెచ్సీల్లో వైద్య పరీక్షల పేరిట ప్రజాధనాన్ని టీడీపీ పెద్దలు లూటీచేసిన విషయం జగమెరిగిన సత్యం. అప్పట్లో పీహెచ్సీ భవనాలు బూత్బంగ్లాలను తలపించేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక గ్రామీణ స్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలకు పెద్దపీట వేసింది. ఈ క్రమంలో.. రాష్ట్రంలోని 1,145 పీహెచ్సీల్లో ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్లతో కలిపి ప్రతిచోట 14 మందిని నియమించారు. వీటిల్లో రూ.664.96 కోట్లతో నాడు–నేడు పనులను చేపట్టారు. 922 పీహెచ్సీలకు మరమ్మతులు పూర్తయ్యాయి. ఇక మరికొన్ని పీహెచ్సీలకు కొత్త భవనాల నిర్మాణం వచ్చే నవంబర్ నెలాఖరు నాటికి పూర్తికానున్నాయి. అంతేకాక.. ప్రతి మండలానికి రెండు పీహెచ్సీలు లేదా ఒక పీహెచ్సీ/ఒక సీహెచ్సీ ఉండేలా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నూతనంగా 88 పీహెచ్సీలు, 63 కో–లోకేటేడ్ పీహెచ్సీలు ప్రారంభించారు. నూతన పీహెచ్సీలకు ప్రభుత్వం కొత్త భవనాలను నిర్మిస్తోంది. నాడు–నేడులో భాగంగా అన్ని వసతులతో పీహెచ్సీ భవనాలను తీర్చిదిద్దారు. అంతేకాక.. మానవ వనరుల కొరతకు తావులేకుండా ఎప్పటి ఖాళీలను అప్పుడే ప్రభుత్వం భర్తీచేస్తోంది. ప్రతి పీహెచ్సీలో 172 రకాల మందులు, 67 పరీక్షలు నిర్వహించడానికి వీలుగా వైద్య పరికరాలను సమకూర్చడంతో పాటు, పరీక్షలు చేయడానికి అవసరమయ్యే రసాయనాలను ఎప్పటికప్పుడు సరఫరా చేస్తున్నారు. ఈ చర్యలన్నీ గమనించినా, పీహెచ్సీల్లో వచ్చిన మార్పులు చూసినా రాష్ట్రంలో ప్రాథమిక వైద్యం బలోపేతం అయిందని ఎవరైనా అంగీకరిస్తారు ఒక్క రామోజీ తప్ప. ఎందుకంటే జగన్ అన్నా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్నా ఆయన ఉదరం నిత్యాగ్నిహోత్రంలా ఎప్పుడూ రగిలిపోతూ ఉంటుంది కాబట్టి. 24/7 సేవలపై దిగజారుడు రాతలు.. వంద శాతం పీహెచ్సీలను 24/7 నడుపుతున్న కొద్ది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని కేంద్ర ఆరోగ్య శాఖ పలుమార్లు తన నివేదికల్లో కొనియాడింది. అయినాసరే.. ఇవేమీ తనకు పట్టవనుకున్న రామోజీ 24 గంటల సేవలు అంతంత మాత్రమేనని దిగజారుడు రాతలు రాశారు. పీహెచ్సీలు 24/7 పనిచేసేలా వైద్య, ఆరోగ్య శాఖ పర్యవేక్షణ కొనసాగిస్తోంది. రాత్రి సమయంలో స్టాఫ్ నర్సు సహాయంగా, ఒక లాస్ట్ గ్రేడ్ కేడర్ సిబ్బందిని/ఎఫ్ఎన్ఓను ఉంచడం ద్వారా సేవలు అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే.. ► కర్నూల్ జిల్లా ఆస్పిరి పీహెచ్సీలో 15 రకాల పరీక్షలు మాత్రమే చేస్తున్నారని ఈనాడులో ఆరోపించారు. అయితే, ఈ పీహెచ్సీలో నిర్ధేశించిన అన్ని రకాల మందులు, వ్యాధి నిర్ధారణ పరీక్షల సదుపాయాలున్నాయి. ► విజయనగరం జిల్లా రామభద్రపురం పీహెచ్సీలో ఓపీ, ఇతర సేవలు పడిపోయాయి. ప్రజలు ఇతర ప్రభుత్వాస్పత్రులకు వెళ్తున్నట్టు ఆరోపించారు. అయితే, ఈ పీహెచ్సీలో నెలనెలా సుమారుగా 1,500–1,800 ఓపీలు నమోదవుతున్నాయి. పీహెచ్సీ పరిధిలోని గ్రామాలకు ఫ్యామిలీ డాక్టర్లు నెలలో రెండుసార్లు సందర్శించి అక్కడే ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నారు. 10–20కి.మీ పరిధిలో మూడు సామాజిక ఆసుపత్రులు అందుబాటులో ఉండటంతో ప్రజలు అత్యవసర సేవల కోసం ఆయా ఆస్పత్రులకు వెళ్తున్నారు. 2019 నుంచి వైద్య రంగం బలోపేతానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు.. ► నాలుగేళ్లలో దాదాపు 53 వేలకు పైగా వైద్య పోస్టుల భర్తీ. ఎప్పటి ఖాళీలకు అప్పుడే యుద్ధప్రాతిపదికన నియామకం. ఇందుకోసమే ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు. ► రూ.16,800 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు, వివిధ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతోపాటు నాడు–నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రుల బలోపేతం. ► గ్రామాల్లో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్లు.. 12 రకాల వైద్యసేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్లలోనే ప్రజలకు వైద్యసేవలు. ► దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు. నెలకు రెండుసార్లు గ్రామాలకు పీహెచ్సీ వైద్యులు. ► టీడీపీ హయాంలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీ బలోపేతం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు 1,059 నుంచి ఏకంగా 3,257కి పెంపు. 40 లక్షల మందికి ఉచిత వైద్యం కోసం రూ.8 వేల కోట్ల వ్యయం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆసరాతో విశ్రాంతి సమయంలో జీవన భృతి చెల్లింపు. ఇలా ఇప్పటివరకూ 17.25 లక్షల మందికి రూ.1,074.69 కోట్లు అందించిన ప్రభుత్వం. ► 108 (768 వాహనాలు), 104 (936) వాహనాలతో వైద్యసేవలు బలోపేతం. మరో 500 తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలతో కలిపి మొత్తం 2,204 వాహనాలతో ప్రజలకు ఉచిత వైద్యసేవలు. ఈ విధంగా మరే ప్రభుత్వంలోనూ లేవు. టీడీపీ హయాంలో కేవలం 108 అంబులెన్స్లు 531 మాత్రమే ఉండగా ఇందులో 336 మాత్రమే మనుగడలో ఉండేవి. ► ప్రభుత్వాస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలు కలిగిన మందులు ఉచితంగా అందించేలా ప్రభుత్వం చర్యలు. -
ముంగిటకే వైద్యం
అంబేడ్కర్ కోనసీమ జిల్లా పసర్లపూడిలంక గ్రామానికి చెందిన పెదమల్లు సత్య రామానందం పక్షవాతం బాధితుడు. నెలకు ఒకసారి ఆస్పత్రికి వెళ్లి పరీక్షలతోపాటు మందులు కొనాల్సి రావడం, వ్యయ ప్రయాసలు ఆ నిరుపేద కుటుంబానికి పెనుభారంగా పరిణమించాయి. ఫ్యామిలీ డాక్టర్ విధానం ట్రయల్ రన్ ప్రారంభమయ్యాక వైద్యుడితోపాటు సిబ్బంది తమ ఇంటికే వచ్చి పరీక్షలు చేసి ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారని ఆయన భార్య సత్యవతి తెలిపింది. పేదలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానం గ్రామీణ ప్రాంతాలకు ఎంతో ఉప యోగపడుతోందని కృతజ్ఞతలు వ్యక్తం చేసింది. సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్ విధానం ట్రయల్ రన్ రికార్డులు సృష్టిస్తోంది. మూడు నెలల వ్యవధిలో 27 లక్షల మందికి పైగా గ్రామీణ ప్రజలకు ఫ్యామిలీ డాక్టర్ ఉచితంగా వైద్య సేవలు అందచేయడం గమనార్హం. గత ఏడాది అక్టోబర్ 21వ తేదీన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ట్రయల్ రన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. 104 వాహనంతో పాటు డాక్టర్, వైద్య సిబ్బంది విలేజ్ క్లినిక్స్ను సందర్శించి గ్రామాల్లోనే సేవలందిస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉచితంగా గ్రామాల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించి మందులు కూడా అందచేస్తుండటంపై హర్షం వ్యక్తమవుతోంది. పక్షవాతం, నరాల బలహీనతతో నడవలేని వారి ఇళ్లకు స్వయంగా డాక్టర్లు, వైద్య సిబ్బంది వెళ్లి పరీక్షలు నిర్వహించి మందులు ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఆస్పత్రుల్లో చికిత్స పొంది ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్న వారిని కలుసుకుని ఆరోగ్య వివరాలను వాకబు చేస్తున్నారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్లో మందులు, ర్యాపిడ్ కిట్లు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లను ప్రభుత్వం నియమించింది. 67 రకాల మందులతో పాటు 14 రకాల ర్యాపిడ్ కిట్లను వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్లో అందుబాటులో ఉంచారు. ప్రత్యేక యాప్ ద్వారా ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్ రన్ అమలవుతున్న విధానాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 12.70 లక్షల మందికి పరీక్షలు చేసి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. జీవనశైలి జబ్బులతో పాటు ఇతర వ్యాధులను గుర్తించేందుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 30 సంవత్సరాలు పైబడిన 92 శాతం మందికి స్క్రీనింగ్ పూర్తైంది. మిగతా 8 శాతం మందికి కూడా స్క్రీనింగ్ నిర్వహించేలా ఏఎన్ఎంలు, మిడ్లెవల్ హెల్త్ ప్రొవైడర్లకు అదనపు డయాగ్నస్టిక్ కిట్లు సమకూరుస్తున్నారు. -
వైద్య పథకాల అమలుపై కేంద్ర బృందం సంతృప్తి
మచిలీపట్నం: కృష్ణా జిల్లాలో కేంద్ర వైద్యబృందం ఆదివారం పర్యటించింది. ఐదు రోజులపాటు జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆస్పత్రులు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్లను ఈ బృందంలోని సభ్యులు సందర్శించనున్నారు. మచిలీపట్నంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని సందర్శించిన బృందం ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలు, ఆరోగ్యశ్రీ అమలు, రోగులకు కల్పించిన సౌకర్యాలను పూర్తిస్థాయిలో పరిశీలించారు. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా మంజూరైన నిధులతో అమలు చేస్తున్న పథకాలు రోగులకు ఎలా అందుతున్నాయనేది తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ ఇందిరాదేవి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జయకుమార్ కేంద్ర వైద్యబృందానికి ఇక్కడ అమలు చేస్తున్న కార్యక్రమాలపై వివరించారు. అంతకుముందు మచిలీపట్నంలోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో కేంద్ర బృందానికి డీఎంహెచ్వో డాక్టర్ గీతాబాయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఈ బృందంలో డాక్టర్ త్రిపాఠి షిండే, డాక్టర్ ఆసీమా భట్నాగర్, డాక్టర్ రష్మీ వాద్వా, డాక్టర్ అనికేట్ చౌదరి, శ్రీ శుభోధ్ జైస్వాల్, ప్రీతీ ఉపాధ్యాయ, అభిషేక్ దదిచ్ ఉన్నారు. వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర కమిషనరేట్ నుంచి డాక్టర్ దేవి, డాక్టర్ శిరీష, డాక్టర్ రమాదేవి, డాక్టర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
పీహెచ్సీల్లో ఆరోగ్యశ్రీ
వికారాబాద్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ (పీహెచ్సీలు) ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రజారోగ్య శాఖ డైరెక్ట ర్ శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 53 రకాల సేవ లు అందించేలా ఏర్పాట్లు చేస్తోందన్నారు. శుక్రవా రం వికారాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ముందుగా ధారూరు, రామయ్యగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. తర్వాత మద్గు ల్ చిట్టెంపల్లి డీపీఆర్సీ భవనంలో వైద్యులు, వైద్యారోగ్య శాఖ పర్యవేక్షణ అధికారులతో సమావేశమై ఆస్పత్రుల పనితీరుపై సమీక్షించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్యశ్రీ కింద ఇక్కడ చేరే ప్రతి రోగి తరఫున పీహెచ్సీకి ప్రభుత్వం రూ.2,100 చెల్లిస్తుం దన్నారు. ఇందులో 35 శాతం డబ్బును పీహెచ్సీలో విధులు నిర్వర్తించే వైద్యులు, సిబ్బందికి ప్రోత్సాహకంగా ఇస్తుందని, మిగిలిన 65 శాతం నిధులను ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి వినియోగించుకోవచ్చని చెప్పారు. దీంతో పీహెచ్సీలు నిధుల కొరతను అధిగమించి బలోపేతం అవుతాయన్నారు. వైద్యుల వాహనాలకు జీపీఆర్ఎస్: క్షేత్రస్థాయి లో పీహెచ్సీలను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని శ్రీనివాసరావు చెప్పారు. 750 ఎం బీబీఎస్ వైద్యుల నియామకానికి త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనుందని తెలిపారు. పీహెచ్సీల్లో చేసే ప్రతి సాధారణ కాన్పుకు ప్రభుత్వం రూ.3 వేలు అందజేస్తుందని, ఈ మొత్తం వైద్యులు, సిబ్బందికి ఇన్సెంటివ్ రూపంలో చెల్లిస్తుందన్నారు. దీంతో వైద్యుల్లో ఉత్సాహం పెరిగి నాణ్యమైన సేవలు అం దుతాయన్నారు. వైద్యులు స్థానికంగా ఉండేలా స్పష్టమైన ఆదేశాలు ఇస్తామన్నారు. స్థానికంగా ఉంటున్నారా..? లేదా నగరానికి వెళ్లి వస్తున్నారా..? అనే వివరాలు తెలుసుకునేందుకు వైద్యుల వాహనాలకు జీపీఆర్ఎస్ అమరుస్తామని చెప్పారు. జిల్లా నుంచి రాష్ట్రస్థాయి వరకు వైద్యులు, సిబ్బంది పని తీరును పర్యవేక్షించేలా ప్రతి పీహెచ్సీలో 3 సీసీ కెమెరాలు అమరుస్తామని తెలిపారు. ఏడాదిలో ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు మెడికల్ ఆఫీసర్లకు వెహికల్ అలవెన్స్ ఇవ్వనున్నట్టు చెప్పారు. గడిచిన మూడు నెలలుగా రాష్ట్రంలో కోవిడ్ బాగా తగ్గిందని శ్రీనివాసరావు తెలిపారు. రోజుకు 40 లోపు కేసులే నమోదవుతున్నాయని చెప్పారు. -
దేశంలో వైద్య ‘అవ్యవస్థ’
న్యూఢిల్లీ: దేశ జనాభాలో 70 శాతానికి నేటికీ మౌలిక వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో లేవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘చాలా ఊళ్లలో డాక్టర్లుండరు. వాళ్లుంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రముండదు. రెండూ ఉంటే సరైన సదుపాయాలుండవు. ఇదీ మన దేశంలో ఆరోగ్య సేవల పరిస్థితి!’’ అన్నారు. సమస్య పరిష్కారానికి తక్షణం చర్యలు చేపట్టాలని కేంద్రానికి సూచించారు. ‘‘వైద్య సదుపాయాలను పెంపొందించాలి. పరిశోధనలకు ఊతమివ్వాలి. అవసరమైతే స్వచ్ఛంద సంస్థలతో పాటు కార్పొరేట్లను కూడా భాగస్వాములను చేయాలి. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద గ్రామీణ ప్రాంతాల్లో అవి వైద్య సదుపాయాలు అందించేలా చూడాలి. వైద్య వ్యవస్థ మెరుగుకు ఓ రోడ్ మ్యాప్ తప్పనిసరి’’ అన్నారు. దేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒక మహిళ రొమ్ము క్యాన్సర్ బారిన పడుతోందంటూ పలు గణాంకాలు వివరించారు. కుటుంబ, సమాజ, దేశ సంక్షేమంలో కీలక పాత్ర పోషించే మహిళలు రెగ్యులర్గా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమన్నారు. ‘‘భార్య విలువైనా, తల్లి విలువైనా వారు లేకుండా పోయాకే అనుభవానికి వస్తుంది. మా అమ్మ 80 ఏట కన్నుమూసింది. అయినా ఈనాటికీ అమ్మను మర్చిపోలేకపోతున్నా’’ అన్నారు. ఇల్లాలి ప్రాధాన్యతను ప్రతి కుటుంబమూ గుర్తించాలని సూచించారు. శనివారం ఇక్కడ డాక్టర్ కల్నల్ సీఎస్పంత్; డాక్టర్ వనితా కపూర్ రాసిన పుస్తక విడుదల కార్యక్రమంలో జస్టిస్ రమణ మాట్లాడారు. నిజాయితీగా కష్టపడి పని చేసే డాక్టర్లపై హింస, దాడులు పెరుగుతున్నాయన్నారు. వారిపై తప్పుడు కేసులు పెట్టే ధోరణి ప్రబలుతోందంటూ ఆందోళన వెలిబుచ్చారు. తన కూతురూ డాక్టరే కావడంతో వైద్యుల సమస్యలపై తనకు అవగాహన ఉందని చెప్పారు. ‘‘రోగుల క్షేమం కోసం నిరంతరాయంగా చెమటోడ్చే వైద్యుల స్ఫూర్తిని అభినందిస్తున్నా. వైద్యులంటే మన మిత్రులు, కౌన్సెలర్లు, దిశానిర్దేశకులు. సమాజంలో, ప్రజల సమస్యల పరిష్కారంలో వారిది చురుకైన పాత్ర కావాలి. వారు పని చేసేందుకు మరింత మెరుగైన, సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన అవసరముంది’’ అని ఆయన అన్నారు. -
వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్లో 12 రకాల సేవలు
సాక్షి, అమరావతి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు గ్రామంలోనే వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రతి 2,500 జనాభాకు ఒక వైఎస్సార్ విలేజ్ క్లినిక్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో చిన్న చిన్న జబ్బులకు కూడా 10 కిలోమీటర్ల దూరంలో ఉండే పీహెచ్సీకి వెళ్లాల్సిన అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 1,032 విలేజ్ క్లినిక్లు ఉన్నాయి. వీటిలో పని చేయడానికి బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లను నియమిస్తున్నారు. ఈ క్లినిక్లో 12 రకాల వైద్య సేవలు అందించడంతో పాటు 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 65 రకాల మందులతో పాటు 67 రకాల బేసిక్ మెడికిల్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉంటుంది. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా విలేజ్ క్లినిక్లకు పక్కా భవనాల నిర్మాణం, ఉన్న భవనాల మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.1,692 కోట్లు ఖర్చు చేస్తోంది. విలేజ్ క్లినిక్ నుంచి టెలీ మెడిసిన్ సేవలు సైతం అందుబాటులో ఉంటాయి. సేవలు ఇవీ.. ► గర్భిణులు, చిన్నారుల సంరక్షణకు అవసరమైన వైద్య సేవలు ► నవజాత శిశు ఆరోగ్య సంరక్షణ సేవలు ► బాల్యం, కౌమార దశ ఆరోగ్య సంరక్షణ సేవలు ► కుటుంబ నియంత్రణ, గర్భ నిరోధక సేవలు, ఇతర పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ సేవలు ► అంటు వ్యాధుల నిర్వహణ.. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు ► తీవ్రమైన సాధారణ అనారోగ్యాలు, చిన్న జబ్బులకు జనరల్ అవుట్ పేషెంట్ కేర్ ► అసాంక్రమిక వ్యాధుల స్క్రీనింగ్, నివారణ, నియంత్రణ, నిర్వహణ ► సాధారణ ఆఫ్తాల్మిక్ (కంటి సమస్యలు), ఈఎన్టీ సమస్యల కోసం జాగ్రత్తలు ► ప్రాథమిక నోటి ఆరోగ్య సంరక్షణ ► వృద్ధాప్య వ్యాధులకు చికిత్స, ఉపశమన ఆరోగ్య సంరక్షణ సేవలు ► కాలిన గాయాలకు, ప్రమాదాల్లో గాయపడిన (ట్రామా) వారికి అత్యవసర వైద్య సేవలు ► మానసిక ఆరోగ్య వ్యాధుల స్క్రీనింగ్, ప్రాథమిక నిర్వహణ, అనారోగ్య సమస్యలను జయించడం, మానసిక ప్రశాంతత కోసం రోగులకు యోగాపై అవగాహన కల్పిస్తారు. -
‘సాక్షి’ పరిశీలన: డాక్టర్ సారు.. ఉంటలేడు!
తన కూతురికి తానే వైద్యం చేసుకుంటున్న పరిస్థితి నిర్మల్ జిల్లా పెంబి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనిది. ఉదయం 9.30గంటలైనా అక్కడ వైద్య సిబ్బంది లేకపోవడంతో రోడ్డు ప్రమాదంలో గాయపడిన కూతురికి తండ్రే డ్రెస్సింగ్ చేసుకున్నారు. 9.45 గంటలకు ల్యాబ్ టెక్నీషియన్ రాగా, పది గంటలకు ఫార్మసిస్టు వచ్చారు. వైద్యుడు, స్టాఫ్నర్సు శిక్షణకు వెళ్లడంతో రోగులకు ఇబ్బందులు తప్పలేదు. ఇదే మండలం పస్పుల గ్రామానికి చెందిన బాలిక రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స కోసం రాగా, సిబ్బంది లేకపోవడంతో తండ్రే మందు పూసి కట్టుకట్టాడు. ►కోయిలకొండ మండలానికి చెందిన అంబటిదాస్చౌహన్ భార్య ఊట్కూర్ మండలం రాంరెడ్డిగూడెంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. మంగళవారం మధ్యాహ్నం భార్యాబిడ్డలను చూసి మహబూబ్నగర్కు వస్తున్న క్రమంలో గోప్లాపూర్ సమీపంలోని రహదారిపై అంబటిదాస్ బైక్ను లారీ ఢీకొట్టింది. ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం దేవరకద్ర పీహెచ్సీకి తెచ్చారు. అక్కడ డాక్టర్ సెలవులో ఉండటంతో సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు. పది నిమిషాలపాటు బాధితుడిని ఆటోలో ఎండలోనే ఉంచారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ భగవంత్ రెడ్డి బాధితుడిని 108 అంబులెన్స్లో జిల్లా ఆస్పత్రికి పంపించారు. గాయాలపాలైన అతడిని అంబులెన్స్లో ఎక్కించే సమయంలో సిబ్బంది కనీసం ప్రథమ చికిత్స కూడా చేయకుండా కేవలం రెండు ఇంజెక్షన్లు ఇచ్చి పంపించారు. అంబటిదాస్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్కు తరలించారు. ►పెద్దపల్లి జిల్లాకు చెందిన ఈయన పేరు మహ్మద్ అలీ. ఈ నెల 20న రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. తీవ్రమైన రక్తస్రావంతో కరీంనగర్లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. అక్కడున్న నర్సులు రక్తం తుడిచి కుట్లు కుట్టి సూదిమందు ఇచ్చారు. వారే మందులు ఇచ్చారే కానీ డాక్టర్ ఎవరూ రాలేదు. ఉదయం 11 గంటల తర్వాత గానీ డాక్టర్ వచ్చిన పాపాన పోలేదని ఆయన కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. సాక్షి, నెట్వర్క్/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) మొదలు ఏరియా, జిల్లా, బోధనాసుపత్రుల వరకు ఇదే తంతు. డాక్టర్లు హాజరుకాకపోవడం, వచ్చినా సకాలంలో రాకపోవడంతో అవస్థలు పడుతున్నామని రోగులు వాపోతున్నారు. కొందరు వైద్యులు సొంతంగా ప్రైవేట్ క్లినిక్లు పెట్టుకోగా, మరికొందరు ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేస్తూ ప్రభుత్వ వైద్య సేవల పట్ల నిర్లక్ష్యం చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుస్తీ చేసిందని వస్తే బాగుచేసే వారే ఉండ టం లేదంటున్నారు. కొందరు డాక్టర్లయితే హైదరాబాద్లోనే ఉంటూ నిజామాబాద్, మెదక్, మహ బూబ్నగర్, నల్లగొండ జిల్లాలకు వెళ్లి వస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో వైద్యులు విధులకు హాజరయ్యే తీరుపై ‘సాక్షి’మంగళవారం జరిపిన పరిశీలనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వారానికి ఒకట్రెండు రోజులు వైద్య ఆరోగ్యశాఖ వర్గాల లెక్కల ప్రకారం వారానికి రెండ్రోజులు మాత్రమే విధులకు హాజరయ్యే డాక్టర్లు దాదాపు 50% మంది ఉంటారు. మరీ ముఖ్యంగా పీహెచ్సీలకు వెళ్లే డాక్టర్లయితే వారానికి ఒకసారి వెళ్లేవారే ఎక్కువ. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు గగనమయ్యాయని బాధితులు వాపోతున్నారు. సర్కారు వైద్యంపై నమ్మకం లేకుండా పోతోందని అంటున్నారు. వైద్యులు ఎప్పుడొస్తారో... ఎప్పుడు వెళ్తారో తెలియక చాలామంది సర్కారు ఆసుపత్రులకు రావడానికి జంకుతున్నారు. వైద్యాధికారుల హాజరును పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ పరికరాలు చాలాచోట్ల పనిచేయడంలేదు. కొన్నిచోట్ల వైద్య సిబ్బందే వాటిని పనిచేయకుండా చేసినట్లు సమాచారం. వీరి విధులను పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు ఇటీవల ఆస్పత్రులను విజిట్ చేసిన దాఖలాల్లేవు. అదీగాక విధులకు ఎగనామం పెడుతున్న వైద్యులపై కనీస చర్యల్లేవని అంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో... కరీంనగర్ జిల్లా ఆçస్పత్రితోపాటు హుజూరాబాద్, జమ్మికుంట ఏరియా ఆస్పత్రులు, 18 పీహెచ్సీలు, 6 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఎక్కడా కూడా వైద్యులు సకాలంలో రావట్లేదు. వైద్యులు 11 గంటలకు వచ్చి ఒంటి గంటకే వెళ్లిపోతున్నారు. ►కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపీ గదుల్లో కూర్చొని రోగులను చూడాల్సి ఉన్నా అమలుకావడం లేదు. సీనియర్ డాక్టర్లు కేవలం ఇన్పేషంట్గా చేరిన వారినే పరీక్షించి వెళ్లడం పరిపాటిగా మారింది. కొందరు వైద్యులైతే వారంలో రెండు మూడు రోజులు మాత్రమే హాజరై. రిజిస్టరులో వారం రోజులు హాజరైనట్లు సంతకాలు చేస్తున్నారు. ►పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలోని పీహెచ్సీలో ఉదయం 9 గంటల నుంచే వైద్యసేవలు అందించాల్సి ఉండగా, వైద్యులు 10.30 గంటలకు చేరుకున్నారు. ఉదయం 9.30 గంటలకు కేవలం ఫార్మసిస్టు, ఎన్సీడీ, ఒక్క స్టాఫ్ నర్స్ మాత్రమే ఉన్నారు. జిల్లాలో ఉన్న దాదాపు అన్ని పీహెచ్సీల్లో ఇదే దుస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో... ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు సామాజిక ఆసుపత్రుల్లో వైద్యులు కొరత ఉంది. పని చేస్తున్న వారు సైతం సమయానికి రావడం లేదు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో గిరిజన ప్రాంతాల్లో పని చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఉన్నవారితోనే నెట్టుకొస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా... సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో మొత్తం 93 ప్రభుత్వాస్పత్రులు ఉన్నాయి. ఇందులో 3 జిల్లా కేంద్ర ఆస్పత్రులు, మిగతావి పీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులు, అర్బన్ పీహెచ్సీ, సీహెచ్సీలున్నాయి. ‘సాక్షి’ బృందం 66 ఆస్పత్రులను విజిట్ చేసింది. వైద్యులు సమయానికి విధులకు రాకపోవడంతో పేదలకు వైద్యం అందట్లేదు. నర్సులు, కింది స్థాయి సిబ్బంది మందుబిళ్లలు ఇచ్చి పంపుతున్నారు. ►సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియాస్పత్రిలో బయోమెట్రిక్ ఏళ్లుగా పనిచేయడంలేదు. దీంతో పనిచేసే వారు ఎప్పుడు వస్తున్నారో... ఎప్పుడు వెళ్తున్నారో అడిగే నాథుడే లేరు. ►సంగారెడ్డి జిల్లాలోని మారుమూల మండలం పుల్కల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఉదయం 11 దాటినా వైద్యులెవరూ రాకపోవడంతో రోగులు తీవ్ర నిరాశతో తిరిగి వెనుదిరిగారు. ఒక్క నర్సే విధులకు హాజరయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లా... వరంగల్ జిల్లా నెక్కొండ పీహెచ్సీకి వైద్యాధికారితోపాటు ఇతర సిబ్బంది వరంగల్ నుంచి రోజూ కృష్ణా ఎక్స్ప్రెస్లో వచ్చి వెళ్తుంటారు. వీరు 9 గంటలకు రావాల్సి ఉండగా రైలు రాకపోకలతో వారు వచ్చే సమయం 10 దాటుతుంది. అందుకే రోగులూ పది దాటాకే వస్తున్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు విధులకు వచ్చారు. ►వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వచ్చే రోగులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీ చికిత్స అందిస్తుంటారు. మంగళవారం ఉదయం 9 గంటలకు రావాల్సిన వైద్యులు అర్ధగంట ఆలస్యంగా వచ్చారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ విధులకు హాజరు కాలేదు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా... మహబూబ్నగర్ జిల్లాలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఆస్పత్రుల్లో మినహాయిస్తే ఇతరచోట్ల ఎక్కడా వైద్య సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. జనరల్ ఆస్పత్రిలో సీనియర్లు ఆలస్యంగా వచ్చి.. త్వరగా వెళ్లిపోతున్నారు. దీంతో హౌస్సర్జన్లపైనే భారం పడుతోంది. ►వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో పలు పీహెచ్సీల్లో బయోమెట్రిక్ పనిచేయడం లేదు. ఖమ్మం జిల్లాలో.. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రిలో న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాలకు చెందిన డాక్టర్లు ఉదయం 11 గంటల వరకు కూడా రాలేదు. దీంతో చాలామంది రోగులు గంటల తరబడి వేచిచూసి వెనుదిరిగారు. మధ్యాహ్నం 12కు కూడా తాళం వేసి ఉన్న కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పీహెచ్సీ ఇన్ పేషెంట్ వార్డు ►సత్తుపల్లి ఏరియా ప్రభుత్వాస్పత్రిలో 21 మంది వైద్యులకు 9 మంది విధుల్లో ఉన్నారు. మిగతా 12 మంది చాలాకాలంగా గైర్హాజరవుతున్నారు. వైద్యులు, సిబ్బంది బయోమెట్రిక్ మిషన్ను వాడట్లేదు. జాతీయ రహదారిపై నిత్యం రోడ్డు ప్రమాదాల్లో గాయపడే వారు చికిత్స కోసం వస్తే అక్కడ ఆర్థోపెడిక్ డాక్టర్ ఉండడంలేదు. ఆయన దీర్ఘకాలిక సెలవులో వెళ్లడంతో ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీయాల్సి వస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో.. నల్లగొండ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్ప త్రిలో కొందరు ఆలస్యంగా వస్తున్నారు. మెడికల్ కళాశాలకు చెందిన ప్రొఫెసర్లు, అసోసి యేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో కొందరు ఆలస్యంగా వస్తున్నారు. రామన్న పేటలో ఉదయం 10:30కు కూడా సిబ్బంది లేక ఖాళీగా గైనకాలజీ క్లినిక్ ►తుంగతుర్తిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో 10:30 గంటల వరకు కూడా ఎక్స్రే గదికి తాళం తీయలేదు. సూర్యా పేట జనరల్ ఆస్పత్రిలోని ఆర్థోపెడిక్ విభాగం, జనరల్ మెడిసిన్ వైద్యులు ఉదయం 8 గంటలకు రావాల్సి ఉండగా 10.30 గంటల తర్వాత వచ్చారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలోని గైనకాలజిస్టు వైద్యులు ఏ ఒక్కరూ ఉదయం 11 వరకు అందుబాటులో లేరు. దీంతో గర్భిణులు గంటల తరబడి ఎదురు చూశారు. ►సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు పీహెచ్సీలో డాక్టర్ మధ్యాహ్నం 12 గంటలకు వచ్చారు. ఆస్పత్రిలో బయోమెట్రిక్ పనిచేయడంలేదు. డాక్టర్లు ఆలస్యంగా వస్తున్నారు నేను ఉదయం 9 గంటలకు పెద్దాసుపత్రికి వచ్చాను. జ్వరం బాగా వచ్చింది. తొందరగా చూపించుకొని వెళ్దామంటే డాక్టర్ 11.30కు వచ్చారు. టెస్టులు రాసిస్తే, చేసుకొని వచ్చే సరికి డాక్టర్ వెళ్లిపోయాడు. 1.30 గంటలకు కొత్త డాక్టర్ పరీక్షల చిట్టి చూసి మందులు రాశారు. – లక్ష్మీ, కరీంనగర్ ఎప్పుడొచ్చినా సారు ఉంటలేడు నేను గర్భవతిని. కడుపులో నొప్పి అనిపిస్తే ఉదయం 9.30 గంటలకు పిట్టబొంగరంలోని దావఖానకు అచ్చిన. అచ్చినప్పటి నుంచి డాక్టర్ సారు లేడు. పది దాటినంక ఒక్కొక్కరు వచ్చారు. అయినా సారు రాలేదు. నొప్పి భరించలేక లోపలికి వెళ్లి సిస్టరమ్మకు చెబితే మందులిచ్చింది. ఇక్కడికి ఎప్పుడు వచ్చిన డాక్టర్ కనిపించడు. దీంతో ఇబ్బందులు తప్పడం లేదు. – కినక శశిక, పిట్టబొంగరం, ఇంద్రవెల్లి మండలం, ఆదిలాబాద్ జిల్లా -
19 రాష్ట్రాలకు రూ. 8 వేల కోట్ల నిధులు విడుదల
న్యూఢిల్లీ: ఆరోగ్య విభాగం 19 రాష్ట్రాల్లో స్థానిక సంస్థలకు నిధులను విడుదల చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్య మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు నిధులు వినియోగించనున్నారు. వీటికి సంబంధించి మొత్తం రూ.8,453.92 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కు రూ. 488 కోట్లు విడుదల చేశారు. తెలంగాణ సహా 9 రాష్ట్రాల నుంచి ఇంకా ప్రతిపాదనలు అందలేదు. అయితే ప్రతిపాదనలు అందిన తర్వాత ఆ రాష్ట్రాలకు కూడా నిధుల విడుదల చేయనున్నారు. చదవండి: (సజ్జనార్ దెబ్బకు దిగొచ్చిన ర్యాపిడో..) -
ఆరోగ్యసేవల అనుసంధానం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆరోగ్యశాఖలో సమగ్ర ఆరోగ్య వ్యవస్థ (ఇంటిగ్రేటెడ్ హెల్త్ సిస్టం) రూపుదిద్దుకుంటోంది. వైద్యసేవల్ని అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల రోగికి సంబంధించిన సమాచారం పక్కాగా ఒకే చోట లభిస్తుంది. తద్వారా రోగులకు మెరుగైన వైద్యసేవలు అందుతాయి. తొలిదశలో ఈనెలాఖరు నాటికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 104 సర్వీసులను అనుసంధానం చేయనున్నారు. ఈ మూడు సర్వీసుల్లో ఎక్కడకు వెళ్లినా రోగి పూర్తి సమాచారం ఉంటుంది. 104 వాహనాల్లో రక్తనమూనాలు పరిశీలించిన వివరాలు సైతం దీన్లో నమోదు చేస్తారు. ఉదాహరణకు 104 వాహనంలో సేవలు పొందాక ఆరోగ్యశ్రీ ద్వారా ఆస్పత్రిలో చికిత్స పొందాల్సి ఉంటుంది. అప్పుడు రోగికి ఇచ్చిన ప్రత్యేక కోడ్ను క్లిక్ చేయగానే, నెట్వర్క్ ఆస్పత్రిలో సైతం గతంలో బీపీ ఉందా, షుగర్ ఉందా, ఏ తేదీల్లో చూపించుకున్నారు.. ఇలా మొత్తం సమాచారం వెల్లడవుతుంది. ప్రస్తుతం దేశంలో మొట్టమొదటిసారి మన రాష్ట్రంలోనే ఈ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. 1,149 పీహెచ్సీలు, 104 వాహనాలు 676 ప్రస్తుతం రాష్ట్రంలో 1,149 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. 104 వాహనాలు 676 సేవలందిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ పరిధిలో 800కు పైగా నెట్వర్క్ ఆస్పత్రులున్నాయి. ఈ మూడు సర్వీసులను కలిపి రోగుల డేటాను ఒకే వేదికపై ఉంచుతారు. ఇప్పటికే క్యూ ఆర్ కోడ్తో కూడిన ఆరోగ్యశ్రీ కార్డులో గానీ, లేదా ప్రత్యేక కోడ్ నంబరు ఇవ్వడం ద్వారా గానీ సమాచారం తెలుసుకోవచ్చు. వాహనంలో చికిత్సలు పొందినా, పీహెచ్సీలో వైద్యం పొందినా.. ఈరెండూ కాకుండా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్లినా రోగి గతంలో తీసుకున్న చికిత్సల వివరాలన్నీ వస్తాయి. దీనివల్ల రోగి పూర్వాపరాలు తెలుసుకోవడంతో పాటు తక్షణమే చికిత్స చేయడానికి వీలుంటుంది. బ్లడ్గ్రూపు వివరాలు కూడా ఉంటాయి కాబట్టి అత్యవసర సమయాల్లో ఆలస్యం జరగకుండా ఉంటుంది. ఈ మూడు సర్వీసులను అనుసంధానించే ప్రక్రియను ఈనెలాఖరు నాటికి పూర్తి చేయాలని కుటుంబ సంక్షేమశాఖ భావిస్తోంది. తర్వాత మిగిలినవన్నీ.. ఈ మూడు సర్వీసులు అనుసంధానం అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10,051 వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు, 195 సామాజిక ఆరోగ్య కేంద్రాలను వీటికి లింక్ చేస్తారు. తరువాత ఏరియా ఆస్పత్రుల వరకు అనుసంధానం చేస్తారు. దీంతో రాష్ట్రంలో ఒక పేషెంటు ఏ ఆస్పత్రికి వెళ్లినా అతడి సమస్త సమాచారం ఒక కోడ్ నంబరు క్లిక్ చేస్తే వస్తుంది. ఇలా సమాచారం అందుబాటులో ఉండటం వల్ల రోగికి తక్షణమే వైద్యం అందించడంతో పాటు సరైన వైద్యం అందించే వెసులుబాటు ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. త్వరలో ఇంటిగ్రేటెడ్ సేవలు ఈనెలాఖరుకల్లా ఆరోగ్యశ్రీ, పీహెచ్సీలు, 104 సర్వీసుల అనుసంధాన ప్రక్రియ పూర్తవుతుంది. క్రమంగా మిగతా ఆస్పత్రులనూ ఒకే గొడుగు కిందకు తెస్తాం. దీనివల్ల రోగులకు ఉపయోగమే కాదు, వైద్యులకు కూడా చికిత్సలు సులభతరమవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే చికిత్స అనంతరం ఇంటివద్దకే వెళ్లి మందులు అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా సేవలను ఉన్నతీకరిస్తున్నాం. – కాటమనేని భాస్కర్,కమిషనర్, కుటుంబ సంక్షేమశాఖ -
రాష్ట్రానికి 20 వేలకు పైగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు
సాక్షి అమరావతి: థర్డ్ వేవ్ వచ్చినా దానిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోంది. పీహెచ్సీల స్థాయి నుంచే ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటి వరకూ రాష్ట్రానికి 20 వేలకు పైగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు చేరుకున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొన్ని చోట్ల వాటి పనితీరును పర్యవేక్షించారు కూడా. వీటితో పాటు కీలక పాత్ర పోషించే డి టైప్ సిలిండర్లను కొనుగోలు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రానికి 27,311 డి టైప్ సిలిండర్లు చేరుకున్నాయి. మెడికల్ గ్యాస్ పైప్లైన్ల ఏర్పాట్లు సాగుతున్నాయి.146 ఆస్పత్రులకు 6,151 ఆక్సిజన్ బెడ్లకు అవసరమైన పైప్లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో మూడు ఆస్పత్రులకు సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్) కింద ప్రైవేటు సంస్థలు చేయూతనిస్తుండగా, 143 ఆస్పత్రులకు రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తోంది. ఇవి కాకుండా ఆక్సిజన్ సరఫరాకు శాశ్వత ప్రాతిపదికన పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇవి పూర్తయితే భవిష్యత్తులో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్లతో అవసరం ఉండదు. -
థర్డ్వేవ్కు ఇలా సిద్ధం కండి!
సాక్షి, అమరావతి: కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే ముగుస్తున్న తరుణంలో.. మూడో వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇటీవల అన్ని రాష్ట్రాలకు మరోసారి సూచనలిచ్చింది. రాష్ట్రాల్లో జిల్లా స్థాయి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకూ అవసరమయ్యే మౌలిక వసతులను, వాటికయ్యే వ్యయం వంటి వాటిని సూచించింది. మొత్తంగా రూ. 8,261.45 కోట్లను కోవిడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లాన్ కింద విడుదల చేస్తున్నట్టు చెప్పింది. రాష్ట్రాలు తమ వాటాగా 40 శాతం, కేంద్రం 60 శాతం వ్యయం భరిస్తుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా టెలీ కన్సల్టెన్సీ సేవలను భారీగా పెంచాలని, రోజుకు 5 లక్షల మందికి సేవలను అందించాలని సూచించింది. ఏర్పాట్లపై కేంద్రం ఏం చెప్పిందంటే..? ► దేశవ్యాప్తంగా 8,800 ఏఎల్ఎస్ (అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్) అంబులెన్సులు ఏర్పాటు చేసుకోవాలి. వీటికి నెలకు రూ.2 లక్షల వరకూ చెల్లించాలి. 9 నెలల వరకు ఈ వాహనాలకు అయ్యే వ్యయం కేంద్రం చెల్లిస్తుంది. ఆ తర్వాత రాష్ట్రాలు చెల్లించాలి. కోవిడ్ పేషెంట్లకే ఈ వాహనాలు ఉపయోగించాలి. ► అన్ని రాష్ట్రాల్లో కలిపి 1,050 లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంక్లకు అనుమతి ఇచ్చాం. ఒక్కో యూనిట్ వ్యయం రూ. 20 లక్షలు అవుతుంది. దీంతో పాటు ఎంజీపీఎస్ (మెడికల్ గ్యాస్ పైప్లైన్ సిస్టం) కూడా రూ.60 లక్షల వ్యయంతో ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. ► రోజుకు దేశవ్యాప్తంగా 5 లక్షల మందికి ఇ–సంజీవని కింద ఔట్పేషెంటు సేవలు అందించాలి. మారుమూల ప్రాంతాల్లో ఎక్కడైతే చికిత్సకు వసతులు లేవో వారికి ఈ సేవలు అందించాలి. ప్రస్తుతం దేశంలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఇ–సంజీవని సేవలు జరుగుతున్నాయి. ► 540 జిల్లాల్లో జిల్లాకొకటి చొప్పున పీడియాట్రిక్ కేర్ యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. ఒక్కో యూనిట్లో 42 పడకలు ఉంటాయి. ఇందులో 12 పడకల ఐసీయూ యూనిట్ కూడా ఉంటుంది. మరో 196 జిల్లాల్లో 32 పడకల పీడియాట్రిక్ కేర్ యూనిట్లు ఉంటాయి. ఇక్కడ 8 పడకల ఐసీయూ వార్డు ఉంటుంది. ► దేశవ్యాప్తంగా 10 లక్షల కోవిడ్ ఐసొలేషన్ పడకలు ఏర్పాటవుతున్నాయి. వీటిలో 20 % కేవలం పీడియాట్రిక్ పడకలే ఉండాలి. ► ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 6 పడకలు, సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్సీ)లో 20 పడకలు ఏర్పాటు చేయాలి. దీంతో పాటు నిర్ధారణ పరీక్షలు కూడా చేయాలి. ఈ కేంద్రాల్లో టెలీ కన్సల్టేషన్ సర్వీసులు ఉండేలా చర్యలు తీసుకోవాలి. సన్నద్ధతలో ఏపీ ముందంజ.. కోవిడ్ థర్డ్ వేవ్ వార్తల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లనూ చేసుకోవడం మొదలుపెట్టింది. శరవేగంగా పనులు జరుగుతున్నాయి. థర్డ్ వేవ్ కోసం కోవిడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లాన్లో భాగంగా ఏపీకి రూ. 696 కోట్ల మేర కేంద్రం అంచనా వేసింది. అందులో 60 శాతం కేంద్రం, 40 % రాష్ట్రం భరించనున్నాయి. రూ. 101.14 కోట్ల వ్యయంతో 14 జిల్లా ఆస్పత్రులు, 11 బోధనాస్పత్రుల్లో పీడియాట్రిక్ కేర్ యూనిట్లను ప్రారంభించనున్నారు. అలాగే రూ. 188.72 కోట్ల వ్యయంతో మరో 28 ఏరియా ఆస్పత్రుల్లో 40 లెక్కన 1,120 ఐసీయూ పడకలు శరవేగంగా ఏర్పాటవుతున్నాయి. రూ. 5 కోట్లతో గుంటూరు లేదా విజయవాడలో చిన్నపిల్లలకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీని ప్రారంభిస్తారు. రూ. 185 కోట్ల ఖర్చుతో 1,145 పీహెచ్సీల్లో, 208 సీహెచ్సీల్లో పడకలు ఏర్పాటు చేస్తున్నారు. కోవిడ్ మేనేజ్మెంట్ నిర్వహణలో భాగంగా 14 చోట్ల 50 పడకలు లేదా 100 పడకల ఫీల్డ్ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తారు. 100 పడకల ఆస్పత్రికి రూ. 7.5 కోట్లు, 50 పడకల ఆస్పత్రికి రూ. 3.5 కోట్లు ఖర్చవుతుంది. రూ. 8.38 కోట్ల వ్యయంతో టెలీమెడిసిన్ను బలోపేతం చేస్తారు. ప్రతి ఆస్పత్రిలో అత్యవసర మందుల బఫర్ స్టాకు కోసం జిల్లాకు రూ.కోటి ఖర్చు చేయనుంది. కోటి ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం రూ.50 కోట్లు కేటాయిస్తారు. కోవిడ్ సేవలకు గానూ 2,089 మంది పీజీ వైద్య విద్యార్థులు, 2,890 మంది ఎంబీబీఎస్ పూర్తిచేసిన వారు, 1,750 మంది ఎంబీబీఎస్ చదువుతున్న వారు, 2వేల మంది నర్సింగ్ విద్యార్థులను 4 నెలల ప్రతిపాదికన నియమిస్తారు. వీరికి వేతనాల కింద రూ.80.12 కోట్లు ఖర్చవుతుందని అంచనా. -
డాక్టర్లపై నిఘా..
సాక్షి, హైదరాబాద్: వైద్య సిబ్బందిపై నిఘా పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది సకాలంలో ఆసుపత్రులకు వెళ్లేలా, రోగు లకు వైద్యం చేసేలా పర్యవేక్షణ చేయాలని భావిస్తోంది. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (యూపీ హెచ్సీ) సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. తద్వారా హైదరాబాద్ నుంచే సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించ డానికి మార్గం ఏర్పడనుంది. వైద్య సిబ్బంది సకాలంలో ఆసుపత్రికి వస్తు న్నారా లేదా అని పర్యవేక్షించి, అవసరమైతే అప్ర మత్తం చేయడానికి వీలు కలగనుంది. ఇవే కీలకం.. రాష్ట్రంలో వెయ్యి పీహెచ్సీలు, యూపీ హెచ్సీలున్నాయి. ప్రజలకు అవసరమైన వ్యాక్సిన్లు వేయడానికి, ఇతర సాధారణ వైద్యం అందజేయడానికి ఇవి ఎంతో కీలకం. దాదాపు ప్రతీ మండలానికో పీహెచ్సీ ఉంటుంది. పెద్ద మండలాలైతే 2 పీహెచ్సీలు ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పీహెచ్సీల్లో వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. సీజనల్ వ్యాధుల కాలంలో పీహెచ్సీలు కీలకపాత్ర పోషిస్తాయి. అంటువ్యాధులు తీవ్రమైన సందర్భంలో తక్షణ మే స్పందించేలా పీహెచ్సీలు వ్యవహరిస్తాయి. ఒక్కో పీహెచ్సీల్లో ఒకరు లేదా ఇద్దరు డాక్టర్లుం టారు. నర్సులు, ఇతర సిబ్బంది ఉంటారు. వైద్యుల గైర్హాజరు.. పీహెచ్సీల్లో పనిచేసే డాక్టర్లు, నర్సులు స్థానికం గా ఉండటం లేదన్న విమర్శలున్నాయి. సమీప పట్టణాల్లో నివాసముంటూ పీహెచ్సీలకు వస్తూ పోతూ ఉంటారు. వారానికి రెండు, మూడు సార్లు మాత్రమే వచ్చేవారు ఎక్కువగా ఉంటా రని వైద్య వర్గాలు చెబుతున్నాయి. కొందరు డాక్ట ర్లయితే దాదాపు రోజుకు వంద కిలోమీటర్లకు పైగా వెళ్లే వారుంటున్నారు. హైదరాబాద్లో ఉం టూ నిజామాబాద్ జిల్లాలోని పీహెచ్సీలకు వెళ్లే వైద్యులూ ఉన్నారని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాల సమాచారం. వీరు పట్టణాల్లో ప్రైవేట్ ప్రాక్టీసు చేస్తుండటంతో పీహెచ్సీలకు రావడంలేదన్న విమర్శలున్నాయి. ఒకవేళ వచ్చినా ఉద యం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకే వెళ్లిపో తున్నారన్న ఫిర్యాదులు గ్రామాల నుంచి ప్రభు త్వానికి అందాయి. అందుకే వారి కదలికలపైనా ఎప్పటికప్పుడు నిఘా పెట్టేందుకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు.. ఇక హైదరాబాద్ కోఠిలోని ప్రజారోగ్య కార్యాల యంలో అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన కమాండ్ కంట్రోల్ రూమ్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడి నుంచే అన్ని పీహెచ్సీలకు అను సంధానం చేశారు. కంట్రోల్ రూంలో భారీ స్క్రీన్ను ఏర్పాటు చేశారు. ఒకేసారి అన్ని పీహెచ్ సీల వైద్యులతో నేరుగా మాట్లాడి అవసరమైన ఆదేశాలివ్వొచ్చు. ఎక్కడైనా అంటు వ్యాధుల వం టివి తీవ్రంగా విజృంభిస్తే ఇక్కడి నుంచే వైద్యు లకు సూచనలిస్తారు. ఆశ వర్కర్లు, ఏఎన్ఎం లతోనూ మాట్లాడే వీలు కల్పించారు. అవసర మైతే జూమ్ మీటింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం పూర్తిస్థాయి కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పా టు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే ప్రజారోగ్య కార్యాలయాన్ని అన్ని రకాల హైటెక్ హంగులతో సిద్ధం చేశారు. నిత్యం వచ్చే విజిట ర్లను డైరెక్టర్ నేరుగా కలవకుండానే బయట నుంచే వీడియోకాల్ ద్వారా మాట్లాడే సదుపా యం ఏర్పాటు చేశారు. కరోనా కాలంలో కార్యా లయం లోపలికి వచ్చి జనం గుమిగూడకుండా ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రజారోగ్య కార్యాలయం ప్రవేశ ద్వారం వద్ద లాకింగ్ సిస్ట మ్ను ఏర్పాటు చేశారు. డైరెక్టర్ ఆదేశాల మేరకే ఎవరినైనా పంపడానికి వీలుంది. -
ప్రతి మండలానికి రెండు పీహెచ్సీలు
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రజలకు ప్రాథమిక వైద్యాన్ని మరింత చేరువ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పెంచి నాణ్యమైన వైద్య సేవలను పల్లె ముంగిటకే తెచ్చేందుకు నిర్ణయించింది. ఇప్పటికే ఆరోగ్య ఉపకేంద్రాలను బలోపేతం చేయడం, గ్రామ సచివాలయాల్లో ఏఎన్ఎంల నియామకం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలానికి రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. గ్రామీణ ప్రజలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలంటే దూరం భారం కాకూడదని, నడిచి వెళ్లేంత సమీపంలోనే ఉండాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పీహెచ్సీల సంఖ్య పెంచితే గ్రామీణులకు మరింత సులువుగా వైద్యసేవలు లభిస్తాయని భావిస్తోంది. ఒక్కో పీహెచ్సీకి రూ.4 కోట్లు వ్యయం ► రాష్ట్రంలో 671 మండలాలు ఉన్నాయి. ► ప్రస్తుతం రాష్ట్రంలో 1,145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ► కొత్తగా మరో 142 పీహెచ్సీలు వస్తాయని అంచనా. ► గిరిజన ప్రాంతాల్లో మండలంలో ఇప్పటికే రెండు పీహెచ్సీలున్నా అవసరాన్ని బట్టి మరింతగా పెంచేందుకు వెసులుబాటు ► తాజా అంచనాల ప్రకారం.. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆరు పీహెచ్సీలు అందుబాటులోకి వస్తాయి. ► ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సుమారు రూ.4 కోట్లు వ్యయమవుతుందని అంచనా. ► వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు రూపొందించి ఆర్థిక శాఖకు పంపాక వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాలు ఉంటాయి. వైద్యులు 24 గంటలూ అందుబాటులో.. ► ఇప్పటికే ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు నర్సులు విధిగా ఉండాలని సర్కార్ నిర్ణయించింది. ► ఉదయం 8 గంటల నుంచి 2 గంటల వరకు ఒకరు, 2 నుంచి రాత్రి 8 గంటల వరకు ఒకరు ఓపీ చూస్తారు. ► రాత్రి 8 గంటల తర్వాత అత్యవసర సేవల్లో భాగంగా ఫోన్ చేస్తే ఆస్పత్రికి వచ్చి వైద్యం అందించాలి. ► ఒక ఫార్మసిస్ట్, ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటారు. ► 104 వాహనం నెలలో ప్రతి పల్లెకూ వెళ్లి ఆ గ్రామాల్లో ఉన్నవారి వైద్యంపై వాకబు చేస్తుంది. -
పీహెచ్సీలు 24 గంటలూ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతం కోసం ఇప్పటికే పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం తాజాగా మరో అడుగు ముందుకేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యానికి వెన్నుదన్నుగా ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నిటినీ ఇకపై 24 గంటలూ పనిచేయించాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల వారు అనారోగ్యంతో ఏ సమయంలో వచ్చినా 24 గంటలూ వైద్యులను అందుబాటులో ఉంచనుంది. ఇప్పటివరకు 24 గంటలూ పనిచేసే పీహెచ్సీలు 520 మాత్రమే ఉండగా.. ఇప్పుడు మరో 625 పీహెచ్సీలను కలిపి మొత్తం 1,145ను 24 గంటలూ పనిచేసేలా మార్చనుంది. కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. సేవలు నిరంతరం అందుబాటులో.. –ప్రస్తుతం చాలా పీహెచ్సీలకు ఒకే డాక్టర్ ఉండగా ఇకపై ప్రతి పీహెచ్సీకి షిప్టులవారీగా ఇద్దరు డాక్టర్లు ఉంటారు. –రోజుకు 12 గంటలపాటు ఔట్పేషెంట్ సేవలు అందుబాటులో ఉంటాయి. –రాత్రి 8 గంటల తర్వాత ఎవరైనా బాధితుడు పీహెచ్సీకి వచ్చి ఫోన్ చేస్తే డాక్టర్ రావాల్సి ఉంటుంది. దీన్నే ఆన్ కాల్ అంటారు. –ప్రతి పీహెచ్సీకి ముగ్గురు స్టాఫ్ నర్సులు ఉంటారు. వీళ్లు మూడు షిఫ్టుల్లో పనిచేస్తారు. –పాముకాటు లేదా కుక్కకాటు వల్ల ఎవరైనా అర్ధరాత్రో, అపరాత్రో ఆస్పత్రికి వచ్చి ఫోన్ చేసినా 10 నిమిషాల్లోనే వైద్యులు రావాల్సి ఉంటుంది. –170 రకాల మందులను ప్రతి పీహెచ్సీలో అందుబాటులో ఉంచుతారు. –దీనివల్ల పేద రోగులకు మందుల ఖర్చులు బాగా తగ్గిపోతాయి. –మండలానికొక అంబులెన్స్ ఉండటం వల్ల రవాణా సౌకర్యం కూడా 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. –ప్రతి పీహెచ్సీకి 104 వాహనం అనుసంధానం చేసి ఉంటుంది. ప్రతి గ్రామానికి ఈ వాహనం వెళ్లి ఉచితంగా మందులు ఇస్తుంది. -
ర్యాపిడ్లో రిపోర్టుల సమస్య
సాక్షి, హైదరాబాద్: ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులకు డిమాండ్ పెరిగింది. హైదరాబాద్లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్సీ), బస్తీ దవాఖానాల్లో మొత్తం 300 చోట్ల ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నారు. రోజుకు 10 వేల వరకు యాంటిజెన్ టెస్టులు చేసేలా ఏర్పాట్లు చేయడంతో కరోనా నిర్ధారణ మరింత అందుబాటులోకి వచ్చింది. అరగంటలోపే ఫలితం వస్తుండటంతో వాటివైపే జనం మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం ఐసీఎంఆర్ నిర్దేశిత లేబొరేటరీల్లో నిర్వహించే ఆర్టీ–పీసీఆర్ పరీక్షల పట్ల బాధితులు విముఖత చూపుతున్నారు. ఆర్టీ–పీసీఆర్ పరీక్ష కోసం ప్రభుత్వ, ప్రైవేటు లేబరేటరీలకు వెళ్లడం, వేచి చూడటం ప్రయాసగా మారింది. నాలుగైదు రోజుల నుంచి వారం వరకు ఫలితం కోసం ఎదురుచూడటం ఇబ్బందిగా మారింది. లక్షణాలు అధికం గా ఉన్నవారికి అన్ని రోజులు వేచిచూడడం వల్ల వైరస్ ముదిరే ప్రమాదముంది. యాంటిజెన్ టెస్టు లు ఇప్పటికే దాదాపు 30 వేల వరకు చేసినట్లు అంచనా. ఈ పరీక్షల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల యాంటిజెన్ కిట్లను తెప్పించిన సంగతి తెలిసిందే. తక్షణం రిపోర్టులు ఇవ్వకపోవడంపై ఫిర్యాదులు యాంటిజెన్ టెస్టులు చేసి తక్షణమే పాజిటివ్ లేదా నెగెటివ్ వచ్చినట్లు చెప్పేస్తున్నారు. కానీ, వెంటనే ఎలాంటి రిపోర్టులు ఇవ్వడంలేదన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఉదాహరణకు నారాయణ అనే ఒక ప్రైవేట్ ఉద్యోగికి తీవ్రమైన కరోనా లక్షణాలున్నాయి. దీంతో సమీపంలోని బస్తీ దవాఖానాలో యాంటిజెన్ టెస్ట్ చేయించుకున్నాడు. అరగంటలోపే ఆయనకు పాజిటివ్ అని చెప్పారు. రిపోర్టు ఇవ్వండని అడిగితే తర్వాత ఫోన్ చేస్తామని, అప్పటికప్పుడు రిపోర్టు ఇవ్వడం కుదరదని చెప్పేశారు. కానీ ఆయనకు తీవ్రమైన లక్షణాలు ఉండటంతో తక్షణం ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి ఉంది. రిపోర్ట్ లేకుంటే ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆసుపత్రులు చేర్చుకునే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో వైద్యాధికారులకు ఫిర్యాదుల వెల్లువెత్తుతున్నాయి. రిపోర్ట్ ఇచ్చేలా కసరత్తు... బస్తీ దవాఖానాలు, యూపీహెచ్సీల్లో పరీక్షలు చేస్తుండటంతో తక్షణమే రిపోర్టు ఇవ్వాలంటే ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఒక ఫార్మాట్ రూపొందించి ప్రింట్ రూపంలో రిపోర్ట్ ఇవ్వాలి. అయితే ఎలా చేయాలన్న దానిపై వైద్య, ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. కాగా, మంగళవారం నుంచే కొన్నిచోట్ల రిపోర్టులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించామని, మిగిలిన చోట్ల త్వరలోనే దీనిని మొదలుపెడతామని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య'మస్తు'
ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో 5,222 మంది వైద్యులున్నారు. కొత్త నోటిఫికేషన్ ద్వారా 2,153 వైద్య పోస్టులు భర్తీ చేయనున్నారు. తద్వారా 41 శాతం మందికిపైగా వైద్యులు అదనంగా రానున్నారు. దీంతో పాటు స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్లు, ల్యాబ్ టెక్నీషియన్లను కూడా నియమిస్తారు. తాజా నోటిఫికేషన్కు జూన్ 28వతేదీ నాటికి 6 వేల మందికిపైగా వైద్యులు దరఖాస్తు చేసుకున్నట్లు తేలింది. యువ వైద్యులకు మంచి అవకాశం.. ‘నేను ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తి చేశా. కోవిడ్ నేపథ్యంలో ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నా. కొత్త నోటిఫికేషన్లో సివిల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నా. నాలాంటి యువ వైద్యులకు ఇది మంచి అవకాశం’ –డా.నమ్రత అన్నపురెడ్డి, గుంటూరు సాక్షి, అమరావతి: ఏళ్ల తరబడి వైద్య పోస్టుల నియామకాలు చేపట్టకపోవడంతో అస్తవ్యస్థంగా మారిన ప్రభుత్వాసుపత్రుల దుస్థితి ఇక తొలగిపోనుంది. ఒకే ఒక్క నోటిఫికేషన్ ద్వారా తొమ్మిది వేలకుపైగా వైద్య పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడంతో ఆరోగ్యశాఖకు అదనపు బలం చేకూరనుంది. గత ప్రభుత్వాలు నియామకాలను భారంగా భావించడంతో ప్రభుత్వాస్పత్రులు నిర్వీర్యమయ్యాయి. గాయమై వెళితే కనీసం దూది, సూది ఉంటాయో లేదో కూడా తెలియని దురవస్థ దాపురించింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యానికి డబ్బుల్లేక, ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం అందక సామాన్యుడి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎక్కడ చూసినా వైద్యులు, మందుల కొరతతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు దయనీయంగా కనిపించేవి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేయడంతో ఇదంతా ఇక గతంగా మిగలనుంది. రాష్ట్రంలోని 1,175 పీహెచ్సీలు ఇకపై 24 గంటలూ పనిచేయనున్నాయి. ఇద్దరు డాక్టర్లతో పాటు స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్లు వీటిల్లో అందుబాటులో ఉంటారు. ఒకే ఒక్క నియామకం ద్వారా 9,712 వైద్య పోస్టులు భర్తీ చేస్తుండటం నలభై ఏళ్లలో ఎప్పుడూ జరగలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది ఆస్పత్రుల్లో మానవ వనరుల అభివృద్ధి, రోగుల భరోసాకు సూచికగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిద్వారా గ్రామాల నుంచి పెద్ద పట్టణాల వరకు వైద్యుల కొరత తీరనుంది. యువ వైద్యులు, అనుభవజ్ఞులతో రెండు నెలల్లో ప్రభుత్వాసుపత్రులు కొత్తకళ సంతరించుకోనున్నాయి. ఇక 24 గంటలూ ‘ఆరోగ్యం’ రాష్ట్రంలో 1,175 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలుండగా ప్రస్తుతం సగం పీహెచ్సీల్లో ఒకే ఒక డాక్టరు ఉన్నారు. వైద్యుడు సెలవుపై వెళితే ఇక స్టాఫ్ నర్సే దిక్కు. అర్ధరాత్రి వేళ పాముకాటుతోనే, గాయాలపాలై పీహెచ్సీకి వెళితే తాళాలు వేసి కనిపించేవి. ఇకపై ఇలా ఉండదు. ప్రతి పీహెచ్సీకి ఇద్దరు డాక్టర్లు ఉంటారు. రాష్ట్రంలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలూ 24 గంటలు పనిచేస్తాయి. ఒక్కో పీహెచ్సీకి రోజుకు సగటున 100 మంది ఔట్ పేషెంటు సేవల కోసం వస్తుంటారు. అంటే రోజుకు లక్ష మందికిపైగా పీహెచ్సీలకు వస్తారు. కొత్తగా డాక్టర్లు, ఫార్మసిస్ట్లు, స్టాఫ్ నర్సులను నియమిస్తే 24 గంటలూ ఆస్పత్రులు పనిచేయడంతో సామాన్యులకు ఎప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా ఇబ్బంది ఉండదు. 70 సీహెచ్సీలకు నలుగురు చొప్పున.. రాష్ట్రవ్యాప్తంగా 192 సీహెచ్సీ (సామాజిక ఆరోగ్యకేంద్రాలు)లు ఉన్నాయి. వీటిలో గైనకాలజిస్ట్, అనస్థీషియా పీడియాట్రిక్స్ వైద్యులు బృందం ఉంటుంది. ప్రసవాలు ఎక్కువగా జరుగుతున్న 70 సీహెచ్సీలను గుర్తించి ఒక్కో కేంద్రానికి నలుగురు గైనకాలజిస్ట్లను నియమిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా కాన్పు గదులను తీర్చిదిద్దుతున్నారు. మిగతా సీహెచ్సీలలో సైతం గైనకాలజీ, అనస్థీషియా, పీడియాట్రిక్ వైద్యుల బృందం ఉండేలా చర్యలు తీసుకుంటారు. స్పెషాలిటీ సేవలు విస్తృతం.. ప్రస్తుతం 11 బోధనాసుపత్రులు, అనుబంధ వైద్యకళాశాలలున్నాయి. ఈ ఆస్పత్రుల్లో ప్రధానంగా రెసిడెంట్ పీజీలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. తాజాగా చేపడుతున్న నియామకాల్లో 737 మంది వీరే ఉన్నారు. 32 స్పెషాలిటీలకు సంబంధించి వైద్యులు కొత్తగా చేరతారు. దీంతో లక్షలాదిమంది రోగులకు స్పెషాలిటీ సేవలు మరింత చేరువవుతాయి. గ్రామాల నుంచే మెరుగైన వైద్యం పీహెచ్సీల స్థాయిలోనే వ్యాధిని గుర్తించడం, వైద్యం చేయడం వల్ల జబ్బులను త్వరగా గుర్తించవచ్చు. బాధితులకు కూడా ఆర్థికంగా, శారీరకంగా ఉపశమనం లభిస్తుంది. గ్రామీణ వైద్యం బలోపేతం అయ్యేందుకు వైద్యుల భర్తీ ఎంతో ఉపయోగపడుతుంది. ఇది చాలా పెద్ద నోటిఫికేషన్ ప్రక్రియ. –డా.కె.ఎస్.జవహర్రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, వైద్య ఆరోగ్యశాఖ ఇన్ని పోస్టులంటే నమ్మలేకున్నాం.. ఒకే నోటిఫికేషన్ ద్వారా ఇన్ని పోస్టులంటే నమ్మలేకపోతున్నాం. డీ ఫార్మసీ పూర్తిచేసి ఐదేళ్లయింది. మెడికల్ షాప్ పెట్టుకున్నా. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగంలో చేరాలనుకుంటున్నా. ప్రభుత్వ సర్వీసులో పనిచేయాలన్నది నా కల. – సునీల్ కుమార్రెడ్డి, ఫార్మసిస్ట్, కమలాపురం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నాం.. నాలాంటి వారు ఎన్నో రోజుల నుంచి డాక్టర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ సర్వీసులో చేసి పని చేసేందుకు ఎంతోమంది ఉవ్విళ్లూరుతున్నారు. నేను ఇప్పటికే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేశా. – డా.ఎం.మోహన్కుమార్, తిరుపతి మూడు రకాలుగా మేలు వైద్య నియామకాలు చేపట్టడం వల్ల మూడు ప్రధాన ఉపయోగాలు ఉంటాయి. పేషెంట్ కేర్ గణనీయంగా పెరుగుతుంది. వైద్య విద్య మెరుగుపడుతుంది. భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) నిర్ణయించిన మేరకు డెఫిషియన్సీ (లోపాలు) తగ్గించుకోవచ్చు. –డా.కె.బాబ్జీ, ప్రిన్సిపల్, రంగరాయ ప్రభుత్వ వైద్యకళాశాల, కాకినాడ -
ప్రజారోగ్య రంగంలో సమూల మార్పులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్య రంగం పూర్తిస్థాయిలో బలోపేతం కానుంది. సబ్ సెంటర్ల నుంచి మెడికల్ కాలేజీల వరకూ నాడు –నేడు కార్యక్రమాలు, కొత్తవాటి నిర్మాణం కోసం ఏకంగా రూ. 16,200 కోట్లు ఖర్చు చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం జూన్ 15లోగా స్థలాల గుర్తింపు పూర్తి చేయాలని ఆదేశించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఇందుకు సంబంధించి అధికారులతో సమీక్ష చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. (రైతులకు రూ. 33 కోట్ల చెక్కు అందజేసిన చీఫ్ విప్) వైఎస్సార్ హెల్త్ క్లినిక్(సబ్ సెంటర్లు) ప్రతి గ్రామ సచివాలయంలోనూ ఒక విలేజ్ క్లినిక్ ఉండాలని ప్రభుత్వం ఇది వరకే నిర్ణయం తీసుకుంది. కోవిడ్ లాంటి విపత్తులను ఎదుర్కోవాలంటే గ్రామ స్థాయి నుంచి కూడా సబ్ సెంటర్ల రూపంలో 24 గంటల పాటు సేవలందించే వైద్య సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే దాదాపు 10 వేల వైఎస్సార్ క్లినిక్స్ల నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించింది. వీటి కోసం సుమారు రూ.2026 కోట్లు ఖర్చు చేయనుంది. ఇవి కాకుండా ఇప్పటికే 1086 సబ్ సెంటర్లలో నాడు–నేడు ద్వారా అవసరమైన సదుపాయాలను కల్పిస్తుంది. ఇక సబ్ సెంటర్ల నిర్మాణం కోసం ఇప్పటి వరకూ 4 వేల స్థలాలను గుర్తించారు. మరో 6 వేల సబ్సెంటర్లకు స్థలాలను గుర్తించాల్సి ఉంది. జూన్ 15లోగా స్థలాల గుర్తింపు పూర్తి చేయాలని సీఎం జగన్ జగన్ అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు కల్లా సబ్ సెంటర్ల నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. (‘రైతు భరోసా’ను ప్రారంభించిన సీఎం జగన్) కొత్త మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు కాగా రాష్ట్రంలో పాత మెడికల్ కాలేజీలు 11 ఉన్నాయి. వీటితోపాటు అటాచ్డ్ ఇనిస్టిట్యూషన్స్ టు మెడికల్ కాలేజీలు –6. ఇక గిరిజన ప్రాంతాల్లో 7 సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు కొత్తగా రానున్నాయి. వీటన్నింటి కోసం రూ.6100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఇవిగాక 15 కొత్త మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, కడపలో 3 వైద్య సంస్థలు....సూపర్ స్పెషాల్టీ, క్యాన్సర్, ఇన్సిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీ కోసం మొత్తంగా రూ. 6,170 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా. ఈ క్రమంలో ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ ఉండాలని అధికారులను సీఎం జగన్ అధికారులను దేశించారు. కొత్తగా నిర్మించదలచిన మెడికల్ కాలేజీల నిర్మాణ రీతులపై నమూనాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. కొన్ని మార్పులు, చేర్పులు సూచించారు. అదే విధంగా.. నాడు – నేడు కార్యక్రమాల్లో నాణ్యతలో రాజీ పడొద్దని సీఎం జగన్ మరోసారి స్పష్టం చేశారు. నిర్మాణాలు పటిష్టంగా, నాణ్యంగా ఉండాలని ఆదేశించారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లు రాష్ట్రవ్యాప్తంగా 1,138 పీహెచ్సీలు ఉన్నాయి. వీటిలో 149 కొత్త పీహెచ్సీల నిర్మాణం కోసం రూ. 256.99 కోట్లు ఖర్చు చేయనున్నారు. మరో 989 పీహెచ్సీల్లో అభివృద్ధి పనులకోసం రూ. 413.01 కోట్లు ఖర్చుచేయనున్నారు. మొత్తంగా రూ. 671 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ ఆస్పత్రులు 52 ఏరియా ఆస్పత్రుల్లో నాడు నేడు కింద రూ.695 కోట్ల ఖర్చు చేయనున్నారు. 169 కమ్యూనిటీ హెల్త్సెంటర్లలో రూ.541 కోట్లు ఖర్చు చేయనున్నారు. మొత్తంగా రూ.1,236 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. -
పల్లెటూళ్ల నుంచి పట్నానికి స్పెషలిస్ట్ వైద్యులు
సాక్షి, అమరావతి: పీజీ స్పెషలిస్ట్ సర్టిఫికెట్ ఉండి.. ఇప్పటి వరకు పల్లెటూళ్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకే పరిమితమైన స్పెషలిస్ట్ వైద్యులను పట్టణాలు, నగరాల్లోని కోవిడ్ ఆస్పత్రులకు రప్పించేందుకు అధికార వర్గాలు చర్యలు తీసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్సీల్లో పని చేస్తున్న సుమారు 52 మంది స్పెషలిస్ట్ వైద్యులను గుర్తించి కోవిడ్ ఆస్పత్రుల్లో సేవలందించాలని ఆదేశించారు. వీరందరూ తక్షణమే స్టేట్ కోవిడ్ ఆస్పత్రుల్లో రిపోర్ట్ చేయాల్సిందిగా కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఆదేశించారు. మైక్రోబయాలజిస్ట్లు మాత్రం వైరాలజీ ల్యాబొరేటరీల్లో రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చికిత్సకు జనరల్ మెడిసిన్, పల్మనరీ మెడిసిన్ వైద్యుల అవసరం ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం వీరంతా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే పని చేస్తున్నారు. జనరల్ మెడిసిన్, పల్మనాలజీ, అనస్థీషియా, మైక్రోబయాలజీ వంటి ఎంతోమంది వైద్యులు సీనియర్ మెడికల్ ఆఫీసర్లుగానే ఉన్నారు. తాజా నిర్ణయంతో వీరందరికీ స్పెషాలిటీ సేవలందించే అవకాశం లభించింది. -
నేడు పల్స్ పోలియో
సాక్షి, అమరావతి/ఏలూరు టౌన్: రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్ల లోపు వయసున్న చిన్నారులకు ఆదివారం పల్స్ పోలియో చుక్కలు వేయనున్నారు. దీనికోసం కుటుంబ సంక్షేమ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. స్కూళ్లు, కాలేజీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పోలియో చుక్కల కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం తన నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిన్నారులకు పల్స్పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పోలియో చుక్కల మందు కార్యక్రమాన్ని కుటుంబ సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ, పురపాలక, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ, రవాణా, విద్యాశాఖలు సంయుక్తంగా నిర్వహిస్తాయి. రాష్ట్రంలో ఐదేళ్ల వయసులోపు చిన్నారులు 52.27 లక్షల మంది ఉన్నట్టు కుటుంబ సంక్షేమ శాఖ గుర్తించింది. వీళ్లందరికీ విధిగా పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటల నుంచే పోలియో చుక్కల మందు బూత్లలో అందుబాటులో ఉంటుంది. మారుమూల గిరిజన ప్రాంతాల్లో సైతం చిన్నారులకు పోలియో చుక్కలు అందేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒకవేళ ఆదివారం ఎవరైనా చిన్నారులకు వేయించలేని పరిస్థితి ఉంటే ఈనెల 20 నుంచి 22వ తేదీ వరకు ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే 65.75 లక్షల డోస్ల పోలియో చుక్కల మందు రాష్ట్రానికి చేరింది. ఆంధ్రప్రదేశ్లో 2008 జూలైలో పశ్చిమగోదావరి జిల్లాలో పోలియో కేసు నమోదైందని, తర్వాత ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కుటుంబ సంక్షేమ శాఖ ధృవీకరించింది. ప్రతి కాలనీలో, ప్రతి గ్రామంలోనూ పల్స్ పోలియో బూత్ ఉంటుందని, తల్లిదండ్రులు తమ బిడ్డలకు చుక్కలు వేయించడం మరచిపోవద్దని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్తికేయ మిశ్రా కోరారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని, ఆరోగ్యవంతమైన, పోలియోరహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదేళ్లలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. -
జ్వరం మింగిన మాత్రలు 93కోట్లు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో గత 8 నెలల్లో వివిధ రకాల జ్వరాల బాధితులు ఏకంగా 93 కోట్లకు పైగా పారాసెటిమాల్ మాత్రలను వినియోగించారని తేలింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకుని బోధనాస్పత్రుల వరకూ మందుల వినియోగంలో పారాసెటిమాల్ మాత్రలే మొదటి స్థానంలో ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.35 కోట్లని ఈ–ఔషధి గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా కొన్ని చిన్న చిన్న ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి ఈ–ఔషధి సాఫ్ట్వేర్కు వివరాలు అప్లోడ్ కాలేదని, అవి కూడా అందితే పారాసెటిమాల్ మాత్రల వినియోగం సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. పెయిన్ ‘కిల్లర్స్’ నొప్పి నివారిణి (పెయిన్ కిల్లర్) మాత్రలు తరచూ వాడితే పెను ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నా చాలామంది రోగులు పెడచెవిన పెడుతున్నారు. గత 8 నెలల్లో.. 76.26 కోట్ల డైక్లోఫినాక్ 50ఎంజీ మాత్రలను రోగులు వాడారు. మాత్రల వినియోగంలో పారాసెటిమాల్ తర్వాత వీటిది రెండో స్థానం. నెలకు సగటున 9.53 కోట్ల డైక్లోఫినాక్ 50ఎంజీ మాత్రలు వాడుతున్నారని వెల్లడైంది. చిన్న చిన్న నొప్పులకు కూడా ఎక్కువ మంది రోగులు పెయిన్కిల్లర్స్ వాడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహం మాత్రల సంఖ్య 60.38 కోట్లు రాష్ట్రంలో అత్యధికంగా వినియోగించే మందుల్లో రక్తపోటు (బీపీ) మందులు కూడా ఉంటున్నాయి. అస్తవ్యస్త జీవనశైలిలో భాగంగా రక్తపోటు (బీపీ) పెరుగుతున్న నేపథ్యంలో మందుల వాడకం ఎక్కువవుతోంది. గత 8 నెలల్లో 40.28 కోట్ల అటెన్లాల్ 50 ఎంజీ మాత్రలను బీపీ వ్యాధిగ్రస్తులు వాడారు. అదేవిధంగా మధుమేహం (షుగర్)తో బాధపడుతున్నవారు 60.38 కోట్ల మెట్ఫార్మిన్ 500 ఎంజీ మాత్రలను వినియోగించారు. -
ఆస్పత్రి సొసైటీలకు మార్గదర్శకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు మొదలుకుని.. బోధనాస్పత్రుల వరకూ ఆస్పత్రి అభివృద్ధి సొసైటీల నిర్వహణపై ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను విడుదలచేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి డా.కేఎస్ జవహర్రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. నిధుల వినియోగం, నిర్వహణ, మెరుగైన వైద్యసేవలందేలా పర్యవేక్షణ తదితర వాటిని దృష్టిలో ఉంచుకుని మార్గదర్శకాలను జారీచేసినట్టు పేర్కొన్నారు. గతంలో ఇష్టారాజ్యంగా ఈ సొసైటీలకు సభ్యులను నియమించడంతో సకాలంలో సమావేశాలు నిర్వహించలేకపోవడం, సమీక్షలు లేకపోవడం, నిధులు వినియోగం కాకపోవడం వంటివి జరిగాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని సొసైటీలకు కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఆయుష్ ఆస్పత్రులకూ సంబంధిత అధికారులతో కార్యవర్గాలను ఏర్పాటు చేశారు. విధులు.. - రోజూ ఆస్పత్రుల పనితీరుపై పర్యవేక్షణ - నిబంధనల మేరకు రోగులకు వైద్య పరీక్షలు అందుతున్నాయో లేదో పరిశీలన - సిబ్బంది నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు - పీహెచ్సీ స్థాయిలో 3 నెలలకోసారి పనితీరు అంచనా - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల అమలుపై పర్యవేక్షణ - ఆస్పత్రి అభివృద్ధి సొసైటీలో ఉన్న నిధుల వినియోగం, వైద్య పరికరాల అవసరాలు తదితరాల పర్యవేక్షణ - సిటిజన్ చార్టర్ (రోజువారీ అందాల్సిన సేవల జాబితా) అందుబాటులో ఉండేలా చూడటం - ఆస్పత్రులకు విరాళాలిచ్చే దాతలను గుర్తించి ఆస్పత్రులను అభివృద్ధి చేయడం - వివిధ పథకాల నుంచి వచ్చే గ్రాంట్లను సకాలంలో సద్వినియోగమయ్యేలా చూడటం - ఆస్పత్రుల స్థాయిని బట్టి చైర్పర్సన్లకు నిధుల వ్యయం అధికారాలివ్వడం ఆయా ఆస్పత్రుల కార్యవర్గాలు ఇలా.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.. చైర్పర్సన్గా: ఎంపీపీ కన్వీనర్గా: మెడికల్ ఆఫీసర్. మరో నలుగురు సభ్యులు సీహెచ్సీ.. చైర్పర్సన్గా: ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కన్వీనర్గా: ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్. నలుగురు సభ్యులు ఏరియా ఆస్పత్రి చైర్పర్సన్: ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కన్వీనర్: ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రత్యేక ఆహ్వానితులు: మున్సిపల్ కమిషనర్. ఏడుగురు సభ్యులు జిల్లా ఆస్పత్రి చైర్పర్సన్: ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కన్వీనర్: సూపరింటెండెంట్. డీఎంహెచ్వోతో పాటు.. మరో ఏడుగురు సభ్యులు బోధనాస్పత్రి చైర్పర్సన్: కలెక్టర్ కో–చైర్పర్సన్: ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కన్వీనర్: సూపరింటెండెంట్. 9 మంది సభ్యులు మెడికల్ కాలేజీలు చైర్పర్సన్: డీఎంఈ లేదా అకడమిక్ డీఎంఈ కన్వీనర్: సూపరింటెండెంట్. ఇద్దరు సభ్యులు -
మౌలిక వసతులు.. కార్పొరేట్ సొబగులు
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలకు సంబంధించి మౌలిక వసతుల కల్పనకు వీలైనన్ని మార్గాల్లో నిధులు సమకూర్చుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రైవేట్ కంపెనీలు – కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్సార్)లో భాగంగా సామాజిక మౌలిక వసతుల కల్పనకు నిధులను సులభతరంగా సమకూర్చేందుకు వీలుగా ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తోంది. ‘మీ గ్రామాలకు ఏటా ఒకట్రెండుసార్లయినా రండి. మీ ఊళ్లోని పాఠశాల, ఆసుపత్రి అభివృద్ధికి సహకరించండి. మీ ద్వారా జరిగిన పనికి మీ పేర్లే పెడతాం’ అని సీఎం వైఎస్ జగన్ ఇటీవల అమెరికా పర్యటనలో ప్రవాసాంధ్రులకు పిలుపునిచి్చన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద వచ్చే నిధులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ముఖ్యమంత్రి సూచనల మేరకు ప్రత్యేక విధానం కార్యరూపం దాలుస్తోంది. సీఎస్సార్ కింద సమకూర్చిన నిధులను ఖర్చు చేసే తీరు, మౌలిక ప్రాజెక్టుల పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా వెబ్సైట్ రూపొందిస్తున్నారు. దాతలు ఇచ్చే నిధులను నవరత్నాలకు ఉపయోగించడంతో పాటు.. ఆయా కంపెనీలు ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నాయా లేదా అనే విషయాన్ని కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఈ కొత్త విధానం ఉపయుక్తంగా ఉంటుంది. ఈ విధానం ద్వారా ప్రైవేట్ కంపెనీలు, దాతలే మొత్తం ప్రాజెక్టును చేపట్టాల్సిన అవసరం ఉండదు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య తదితర సామాజిక మౌలిక వసతులు ఎక్కడెక్కడ కొరత ఉన్నాయో ప్రభుత్వమే గుర్తించనుంది. ప్రభుత్వం ప్రాధాన్యతగా గుర్తించిన పనుల నుంచి ఏ పనులను చేపట్టాలో ప్రైవేట్ కంపెనీలు, దాతలే నిర్ణయించుకుని అవసరమైన నిధులను అందజేయవచ్చు. ప్రాధాన్యతల మేరకు ప్రభుత్వం గుర్తించిన పనులు – పాఠశాలల్లో తరగతి నిర్మాణం (వ్యయం సుమారు రూ.10 లక్షలు) – తరగతి గదిలో అవసరమైన ఫర్నిచర్ను సమకూర్చడం (వ్యయం సుమారు రూ.లక్ష) – పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగ్వాడీ కేంద్రాల్లో టాయిలెట్స్ నిర్మాణం (వ్యయం సుమారు రూ.1.5 లక్షలు) – ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పూర్తి స్థాయిలో లేబర్ రూమ్ నిర్మాణం – ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పూర్తి స్థాయిలో ఆపరేషన్ థియేటర్ నిర్మాణం – కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో పూర్తి స్థాయిలో పనిచేసే ఎక్స్రే మిషన్ – కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో అప్పుడే పుట్టిన పిల్లల కోసం స్టెబిలైజేషన్ యూనిట్ ఏర్పాటు – కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కోసం క్వార్టర్స్ నిర్మాణం – అంగన్ వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్స్ గదుల నిర్మాణం అంతటా పారదర్శకం మౌలిక వసతుల కల్పనకు ప్రైవేట్ కంపెనీలు లేదా దాతలు పూర్తి పారదర్శకంగా వెబ్ బేస్డ్ సింగిల్ ప్లాట్ ఫాంలో పనులు చేపట్టవచ్చు. వ్యక్తిగత స్థాయిలో కూడా దాతలు ఈ ప్రాజెక్టులను చేపట్టవచ్చు. ప్రైవేట్ కంపెనీలు, దాతలు చేపట్టే పనులు వెబ్సైట్ డ్యాష్ బోర్డులో కనిపిస్తాయి. ప్రాజెక్టుల పనుల పురోగతిని కూడా చూడవచ్చు. నిధుల వినియోగం ఏ విధంగా జరుగుతుందో దాతలు తెలుసుకునేందుకు, వారిలో విశ్వాసం కలిగించేందుకు 13 జిల్లాల కలెక్టర్లు 13 ఎస్క్రో అకౌంట్లను ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా నిధులు ఏ మేరకే వినియోగించారు.. ఇంకా ఎన్ని నిధులు మిగిలాయన్నది తెలుసుకోవచ్చు. పనులు జరిగే తీరును జిల్లా కలెక్టర్లు సమన్వయం చేస్తారు. ఈ పనుల కోసం ప్రత్యేకంగా నిష్ణాతులతో కూడిన విభాగాన్ని ప్రణాళికా శాఖలో ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ లక్ష్యాలు, ఉద్దేశాల బ్రాండ్ను ఈ విభాగం మార్కెట్ చేస్తుంది. దాతలు ఇచ్చిన విరాళాలు సద్వినియోగమయ్యేలా ఈ విభాగం పర్యవేక్షిస్తుంది. అన్ని విధాలా దాతలకు సహకారం అందిస్తుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ప్రైవేట్ కంపెనీలు లేదా దాతలు చేపట్టిన పనులు పూర్తయ్యాక ప్రభుత్వానికి బదిలీ చేస్తారు. ఆ పనులకు ఆయా కంపెనీలు లేదా దాతల పేర్లను పెడతారు. అనంతరం వాటి నిర్వహణ బాధ్యతలను పూర్తిగా ప్రభుత్వమే స్వీకరిస్తుంది. ఇందుకు సంబంధించిన ఫైలు ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉందని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం తెలిపారు. వెబ్ బేస్ట్ ప్రాసెస్ ఇలా.. – ప్రభుత్వమే సామాజిక మౌలిక వసతులను గుర్తించి భౌగోళిక, రంగాల వారీగా ప్రాజెక్టులను డ్యాష్ బోర్డులో డిస్ప్లే చేస్తుంది. – డిస్ప్లే అయిన ప్రాజెక్టుల నుంచి ప్రైవేట్ కంపెనీలు, దాతలు ఏదో ప్రాజెక్టును ఎంపిక చేసుకుని విరాళాలు ఇవ్వొచ్చు. – ఆ విరాళాలు ఎస్క్రో అకౌంట్లకు వెళ్తాయి. పనులు సంబంధిత శాఖకు వెళ్తాయి. – జిల్లా కలెక్టర్ ఆ పనుల పురోగతిని నెల/మూడు నెలలకోసారి సమీక్షిస్తూ అవసరమైన నిధులను విడుదల చేస్తారు. పనుల పురోగతి ఫొటోలను వెబ్సైట్లో ఉంచుతారు. – పనులు పూర్తి కాగానే జిల్లా కలెక్టర్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఆ వెంటనే అవి పూర్తయిన పనుల ప్రాజెక్టుల జాబితాలోకి వెళ్తాయి. ఈ కంపెనీలకు కార్పొరేట్ సామాజిక బాధ్యత.. – 2013 కంపెనీల చట్టం సెక్షన్ 135 కింద ఉన్న కంపెనీలు – రూ.500 కోట్లు లేదా ఆ పై విలువగల కంపెనీలు – రూ.1000 కోట్లు లేదా ఆపై టర్నోవర్ ఉన్న కంపెనీలు – ఆర్థిక సంవత్సరంలో రూ.5 కోట్లు ఆ పైన నికర లాభం కలిగిన కంపెనీలు ఈ కంపెనీలు లాభాల్లో కనీసం రెండు శాతం మేర నిధులను కార్పొరేట్ సామాజిక బాధ్యతకు వెచ్చించాలి. ప్రధానంగా పేదరిక నిర్మూలన, విద్యను ప్రోత్సహించడం, లింగ సమానత్వం, మహిళా సాధికారిత, మాతా శిశు మరణాలు తగ్గించడం, హెచ్ఐవీ.. ఏయిడ్స్ నిర్మూలన, మలేరియా, పర్యావరణ పరిరక్షణ, వృత్తి విద్యా శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాల పెంపు, సామాజిక ప్రాజెక్టులు, సామాజిక ఆర్థికాభివృద్ధి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళల అభివృద్ధికి నిధులు వెచ్చించాలి . -
మండలాల వారీగా ఆస్పత్రులకు మ్యాపింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలో భారీ ఎత్తున సంస్కరణలు చేపట్టిన నేపథ్యంలో మండలాల వారీగా ఆస్పత్రులకు మ్యాపింగ్ నిర్వహించేందుకు ఆరోగ్య శాఖ అధికారులు కసరత్తు మొదలెట్టారు. ప్రతి మండలం పరిధిలో ఎన్ని ఆరోగ్య ఉపకేంద్రాలున్నాయి, ఎన్ని ప్రాథమిక ఆస్పత్రులున్నాయి, ఏరియా ఆస్పత్రులెన్ని, జిల్లా ఆస్పత్రులు, బోధనాస్పత్రులు ఇలా ప్రతి ఆరోగ్య సంస్థను గుర్తించి, వాటికి మ్యాపింగ్ ప్రక్రియ చేపడుతున్నారు. దీనివల్ల ప్రతి ప్రాంతంలోనూ ఆస్పత్రుల స్థితిగతులు తెలుసుకునే వీలుంటుంది. కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 40 వేల మంది ఉంటున్నారు. కొన్ని చోట్ల 20 వేల మందికే ఒక పీహెచ్సీ ఉంది. కొన్ని పీహెచ్సీల్లో రోగుల తాకిడి లేకపోయినా ఇద్దరు చొప్పున మెడికల్ ఆఫీసర్లున్నారు. మరికొన్నింటికి రోగులు వస్తున్నా డాక్టర్లు లేరు. ప్రధానంగా ప్రతి చిన్న ఆస్పత్రి నుంచి పెద్దాస్పత్రి వరకూ సిబ్బంది వివరాలు ఈ మ్యాపింగ్ ప్రక్రియలో వెల్లడి కానున్నాయి. ఇక సంస్కరణలు వేగవంతం రాష్ట్రంలో ఉన్న అన్ని ఆరోగ్య సంస్థల వివరాలు, వాటి పరిధిలో జనాభా, ఆస్పత్రి ఉన్న ప్రాంతం, సిబ్బంది ఇలా అన్నింటినీ కలిపి మ్యాపింగ్ ప్రక్రియలోకి తెస్తారు. త్వరలోనే ఇ–హెల్త్ రికార్డులను రూపొందించనున్న నేపథ్యంలో ఇలా మ్యాపింగ్ చేపడితే ఏ ప్రాంతంలో ఏ జబ్బులు ఎక్కువగా ఉన్నాయి, ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా అంచనాకు వచ్చే అవకాశం ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు ఎక్కడ ఏ ఆస్పత్రి ఉందో, ఆ జిల్లాలో ఎవరు పనిచేస్తున్నారో ఆ జిల్లాలో అధికారులను అడిగి తెలుసుకోవడం, లేదా స్థానికంగా వచ్చిన సమాచారం మేరకే తెలిసేది. ఇకపై అలా కాకుండా మండలాల వారీగా వీటన్నిటినీ మ్యాపింగ్ పేరుతో ఒకే గొడుగు కిందకు తీసుకొస్తే ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వీలవుతుంది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో సంస్కరణల కోసం ఏర్పాటైన నిపుణుల కమిటీ ఈ నెల 30లోగా నివేదిక ఇవ్వనుంది. ఈలోగా మ్యాపింగ్ పూర్తి చేస్తే సంస్కరణలకు సులువుగా ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. క్షేత్రస్థాయిలో ఆస్పత్రుల్లో పరిస్థితులన్నిటినీ మ్యాపింగ్ ప్రక్రియ కిందకు తీసుకొస్తే సంస్కరణలు వేగవంతమవుతాయని అంటున్నారు. -
రాష్ట్రంలో మందుల సంక్షోభం!
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో మందుల కొరత తీవ్రంగా ఉంది. ఏ ఆస్పత్రికి వెళ్లినా అత్యవసర మందులు అందుబాటులో ఉండడంలేదు. దీంతో సామాన్య, పేద రోగులు విలవిల్లాడుతున్నారు. ఓ వైపు 104 వాహనాలు పల్లెలకు వెళ్లకపోవడం, ఇటు ఆస్పత్రులకు వస్తే మందుల్లేవని చెబుతుండడంతో దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న రోగులు బయట కొనుగోలు చేసుకుంటూ ఆర్థికంగా చితికిపోతున్నారు. గుండె, కిడ్నీ, మూర్ఛ రోగులకు ఇవ్వాల్సిన అత్యవసరమైన మందులు సైతం ఏ ఆస్పత్రిలోనూ అందుబాటులో లేవు. కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పారాసెటిమాల్ జ్వరం బిళ్లకు కూడా దిక్కులేని పరిస్థితి. ఇంతటి మందుల కొరత తామెప్పుడూ చూడలేదని, అన్ని ఆస్పత్రుల్లోనూ పరిస్థితి ఇలాగే ఉందని ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న ఫార్మసిస్ట్లు చెబుతున్నారు. కొంతమంది రోగులు ప్రశ్నిస్తుంటే పైనుంచే మందులు రావడంలేదని ఫార్మసిస్ట్లు నచ్చజెబుతున్నారు. డాక్టర్లు చిట్టీలు రాసి బయట తెచ్చుకోవాలని రోగులకు సూచిస్తున్నా సర్కారులో ఎలాంటి చలనంలేదు. స్థానిక కొనుగోళ్లకు మంగళం రాష్ట్రంలో అన్ని ప్రభుత్వాస్పత్రులకూ ఏపీఎంఎస్ఐడీసీ (రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ) మందులను సరఫరా చేస్తుంది. ఇందుకు 2018–19 సంవత్సరానికి రూ.250 కోట్లు కేటాయించారు. ఈ నిధుల నుంచే 1175 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 192 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 31 ఏరియా ఆస్పత్రులు, 8 జిల్లా ఆస్పత్రులు, 11 బోధనాసుపత్రులు, మరో 11 స్పెషాలిటీ ఆస్పత్రులకు మందులు సరఫరా కావాలి. అలాగే, ప్రతి ఆస్పత్రికీ ఏటా మందులకు అయ్యే వ్యయంలో 20 శాతం స్థానికంగా కొనుగోళ్లు (అత్యవసర పరిస్థితుల్లో) చేసుకునేందుకు అనుమతి ఉంది. ఉదాహరణకు గుంటూరు పెద్దాసుపత్రికి ఏడాదికి రూ.7 కోట్లు ఖర్చయితే.. స్థానిక కొనుగోళ్ల కింద రూ.1.40 కోట్లు ఇవ్వాలి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆస్పత్రులకూ అవకాశం ఉంటుంది. కానీ, 18 నెలల నుంచి స్థానిక కొనుగోళ్ల కింద నిధులివ్వకపోవడంతో అన్ని ఆస్పత్రుల్లో కలిపి రూ.140కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. దీంతో సరఫరాదారులు మందులను అందించడంలేదు. సర్జికల్ బకాయిలూ రూ.90 కోట్లు మందులకు మాదిరిగానే శస్త్రచికిత్సల ఉపకరాణలకు కూడా ప్రతి ఆస్పత్రికి స్థానిక కొనుగోళ్లకు బడ్జెట్ కేటాయించాలి. గ్లౌజుల నుంచి సూచర్ (కుట్లకు వాడే దారం) వరకూ అత్యవసర పరిస్థితుల్లో బయట కొనుగోలు చేస్తుంటారు. కానీ, దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వం 28 నెలలుగా డబ్బులివ్వకపోవడంతో సప్లయర్లు వాటి సరఫరాను నిలిపివేశారు. దీంతో సుమారు రూ.90 కోట్ల వరకు వారికి బకాయిలు చెల్లించాల్సి ఉంది. సూదులు, సిరంజిలు, కాటను, బ్యాండేజీ వంటి చిన్నచిన్నవి కొనుగోలు చేసేందుకు కూడా ఆస్పత్రుల వద్ద డబ్బుల్లేవు. కొన్ని ఆస్పత్రుల్లో అయితే పేషెంటును సర్జరీకి తీసుకెళ్లే ముందు ఆపరేషన్కు అవసరమైన వాటిని తెచ్చుకోమని కుటుంబ సభ్యులకు చెబుతున్నారు. అలా తెచ్చిన తర్వాతే శస్త్రచికిత్స మొదలుపెడుతున్నారంటే పరిస్థితి తీవ్రత ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. బడ్జెట్ విషయమై ఏపీఎంఎస్ఐడీసీ ఎండీని అడిగితే తాను చెక్కులు రాసి పంపించానని, ఆర్థిక శాఖలో విడుదల చేయాల్సి ఉందని చెబుతున్నారని ఆస్పత్రుల వైద్యులు చెబుతున్నారు. సరఫరా చెయ్యకపోతే బ్లాక్లిస్టులో.. 18 నెలలుగా నిధులు ఇవ్వకపోయినా సరే మందులు సరఫరా చేయాల్సిందేనని, లేదంటే బ్లాక్లిస్ట్లో పెడతామని అధికారులు తమను బెదిరిస్తున్నట్లు సంస్థలు వాపోతున్నాయి. రూ.140 కోట్ల బకాయిలు చెల్లించకుండా ఇలా బెదిరించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే సరఫరా చేస్తున్న సంస్థలన్నీ అప్పుల్లో కూరుకుపోయాయని, ఏపీకి ఎవరైనా సప్లయ్ చెయ్యడానికి రావాలంటే భయపడి పారిపోతున్నారని సరఫరాదారులు చెబుతున్నారు. మూర్ఛ రోగుల నిరసన గుంటూరు పెద్దాసుపత్రికి ఎపిలెప్సీ (మూర్ఛ) రోగులు నెలవారీ మందులకు నెలనెలా వస్తుంటారు. కానీ, గత కొంతకాలంగా వీరికి మందులు ఇవ్వడంలేదు. దీంతో ఈనెల 26న గుంటూరు ఆస్పత్రికి వచ్చిన పలువురు మూర్ఛ రోగులు ఆందోళనకు దిగారు. మందులు ఎందుకు సరఫరా చేయడంలేదని వైద్యులను నిలదీశారు. గొడవ పెద్దదవుతోందని, ఇది మీడియా కంటపడితే మరింత ఇబ్బంది అని భావించిన ఆస్పత్రి అధికారులు.. బయట నుంచి మందులు కొనుక్కొచ్చి ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన వారికి డాక్టరు లేరని, ఫార్మసిస్ట్ లేడని చెప్పి పంపించేశారు. రాష్ట్రంలోని అనేక ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి. సీఎం సొంత జిల్లాలో ఇదీ పరిస్థితి.. - చిత్తూరు జిల్లా ఆస్పత్రిలో డోంపర్డైన్ 10 ఎంజీ మాత్రలు 38వేలు అవసరమున్నాయని అడిగితే కేవలం పదివేలు మాత్రమే సరఫరా చేశారు. - ఇదే ఆస్పత్రిలో అడ్రినల్ బైటార్ట్రేట్ 1 ఎంజీ ఇంజిక్షన్లు 120 కావాలని అడిగితే ఒక్కటీ సరఫరా చెయ్యలేదు. - అమాక్సిలిన్ క్లావిలిక్ యాసిడ్ ఓరల్ సస్పెన్షన్ మందులు 2వేలు అడిగితే ఒక్కటీ ఇవ్వలేదు. - ఆమ్లొడిపైన్ ఐపీ 5ఎంజీ మందులు 30వేల టాబ్లెట్లు అవసరమని ఇండెంట్ ఇస్తే గడిచిన 10 నెలల్లో కేవలం 10వేలు మాత్రమే సరఫరా చేశారు. - అబ్జార్బబుల్ కాటన్ బ్యాండేజీలు 50 అడిగితే ఒక్కటీ ఇవ్వలేదు. - ఎనలాప్రిల్ మిలెట్ 5ఎంజీ టాబ్లెట్లు వెయ్యి ఇండెంట్ పెడితే ఒక్కటీ ఇవ్వలేదు. -
సీసీ కెమెరాలకు అనారోగ్యం..!
ఉట్నూర్(ఖానాపూర్): ఏజెన్సీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సీసీ కెమెరాలకు అనారోగ్యం పాలయ్యాయి. అధికారులు రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేయడంలో చూపిన శ్రద్ధ వాటి వినియోగంపై లేకపోవడంతో నిధులు వృథాగా అయ్యా యి. పీహెచ్సీల్లో కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా ద్వారా సిబ్బంది రాకపోకలు, పనితీరు, గైర్హాజరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ చర్యలు తీసుకోవడం ద్వారా గిరిజనులకు కొంత మెరుగైన వైద్యం అందించవచ్చనే ఐటీడీఏ ఆశయం నీరుగారుతోంది. ప్రభుత్వం నక్సల్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించి అభివృద్ధిలో భాగంగా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 2012–13లో ప్రభుత్వం ఐటీడీఏ అదీనంలోని గిరిజన ఇంజినీరింగ్ విభాగం ద్వారా గిరిజనులకు పీహెచ్సీల్లో అందుతున్న వైద్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీ లించడం, సిబ్బంది సమయపాలన పాటించేలా చేయడంతోపాటు వారి గైర్హాజరును నివారించడం ద్వారా గిరిజనులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా మెరుగైన వైద్యం అందించాలనే ఆలోచనతో ఉమ్మడి జిల్లా ఏజెన్సీలోని 31 పీహెచ్సీలకు రూ.4.65 లక్షలు కేటాయించారు. ఇందులో ఒక్కో పీహెచ్సీకి రూ.15 వేలు వెచ్చించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతీ పీహెచ్సీకి ద్వారం గుండా రాకపోకలు సాగిస్తున్న వారిని వారిని గుర్తించే విధంగా ఏర్పాట్లు చేశారు. పనులు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు సీసీ కెమెరాల రికార్డింగ్ సిస్టంను కంప్యూటర్లకు అనుసంధానం చేయలేదు. దీంతో దంతన్పల్లి మినహా మిగతా పీహెచ్సీల్లో సీసీ కెమెరాలు అలంకార ప్రాయంగా దర్శనం ఇస్తున్నాయి. ఫలితంగా అధికారుల పట్టింపు లేమితో గిరిజనుల అభివృద్ధికి వెచ్చించిన రూ.4.65 లక్షలు వృథాగా మారాయి. ముందు చూపు లేమి..? పీహెచ్సీల్లో సీసీ కెమెరాల ఏర్పాటులో ముందు చూపు లేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఐఏపీ నిధులు విడుదల కాగానే సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలనే ఆలోచనతో చర్యలు తీసుకున్నారు. కానీ సీసీ కెమెరాలు ఏర్పాటుకు అనువైన పరిస్థితుల్లో ఆయా పీహెచ్సీల్లో ఉన్నాయా లేదా అని ఆలోచించనట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాల ఏర్పాటుకు అవసరమయ్యే కంప్యూటర్లు పూర్తి స్థాయిలో ఉన్నవి లేనిది గుర్తించ లేకపోయారు. 31 పీహెచ్సీల్లో కంప్యూటర్లు ఉన్నా అందులో ఎన్ని ఉపయోగంలో ఉన్నాయనేదీ అధికారులకు పూర్తి స్థాయి సమాచారం లేదు. పలు పీహెచ్సీల్లో టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన కంప్యూటర్లు చాలావరకు పూర్తి స్థాయిలో ఉపయోగంలో లేవని వైద్యాధికారులు అంటున్నారు. పీహెచ్సీల్లో వైద్యుల పని తీరు, సమయ పాలన, సిబ్బంది గైర్హాజరు తదితర అంశాలు ఐటీడీఏ పీవో గాని, ఉన్నత వైద్యాధికారులు వారి కార్యాలయాల నుంచి పరిశీలించాలన్నా ఆన్లైన్ సౌకర్యం కచ్చితంగా ఉండాలి. ఏజెన్సీలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న చాలా పీహెచ్సీలకు ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేని పరిస్థితులు ఉన్నాయి. దీంతో పీహెచ్సీలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా ఉన్నతాధికారులు సిబ్బంది పనితీరును పరిశీలించడానికి అవకాశం లేకుండా పోతోంది. పూర్తి స్థాయిలో ఉపయోగపడని పనులకు అధికారులు లక్షలాది రూపాయలు వెచ్చించడంపై గిరిజనులు మండిపడుతున్నారు. అవే నిధులు గిరిజనుల ఆరోగ్యంపై ఖర్చు చేస్తే గిరిజనులకు మేలు జరిగేదని అంటున్నారు. పూర్తి స్థాయి చర్యలు తీసుకొని పీహెచ్సీల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పని చేసేలా చూడాలని కోరుతున్నారు. -
పీహెచ్సీల్లో డయాగ్నొస్టిక్ సెంటర్లు
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో (సీహెచ్సీ) మరిన్ని ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అందుకోసం అత్యాధునిక వసతులతో డయాగ్నొస్టిక్ సెంటర్లను నెలకొల్పాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూ.37.45 కోట్లు కేటాయించింది. ఆ నిధులను ఆరోగ్య శ్రీ ట్రస్టు నుంచి మంజూరు చేయనుంది. ఒక్కో పీహెచ్సీకి రూ.5 లక్షల చొప్పున కేటాయించనున్నారు. మొత్తంగా 644 పీహెచ్సీలు, 41 సీహెచ్సీల్లో డయాగ్నస్టిక్ సెంటర్లను నెలకొల్పుతారు. పీహెచ్సీల్లో ప్రస్తుతం కొన్ని పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారు. డయాగ్నొస్టిక్ సెంటర్లను నెలకొల్పాక పీహెచ్సీల్లో 20 రకాలు, సీహెచ్సీల్లో 39 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈఎస్ఆర్, బ్లడ్ షుగర్, హెచ్ఐవీ, మలేరియా రాపిడ్, యూరిన్ షుగర్, ప్లేట్లెట్ కౌంట్, డెంగీ రాఫిడ్, వాటర్ క్వాలిటీ తదితర పరీక్షలను పీహెచ్సీల్లో నిర్వహిస్తారు. ఇక సీహెచ్సీల్లో పై వాటితోపాటు ఎక్స్రే, ఎస్ క్రియాటిన్, సీబీసీ, ఈసీజీ, కొలెస్ట్రాల్ తదితర పరీక్షలు నిర్వహిస్తారు. అందుకోసం సెమీ ఆటో ఎనలైజర్, హెమటాలజీ ఎనలైజర్, మైక్రోస్కోప్, సెంట్రిఫ్యూజ్ వంటి పరికరాలను కొనుగోలు చేస్తారు. రిఫ్రిజిరేటర్, బార్కోడ్ ప్రింటర్ అండ్ స్కానర్, కంప్యూటర్ అండ్ ప్రింటర్లను కూడా కొనుగోలు చేస్తారు. 15 మాతా శిశు సంరక్షణ ఆసుపత్రులు రాష్ట్రంలో 15 మాతా శిశు సంరక్షణ ఆసుపత్రులు నెలకొల్పాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఫైలును ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదానికి పంపింది. దాంతోపాటు వివిధ ఆసుపత్రుల్లో పడకల పెంపు ఫైలును కూడా సీఎం ఆమోదానికి పంపింది. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి.. ముఖ్యమంత్రి వద్దకు ఇతర ముఖ్య ఫైళ్లను కూడా తీసుకెళ్లినట్లు సచివాలయ వర్గాలు తెలిపాయి. -
గ్రామీణ వైద్యం.. గాలిలో దీపం
దేశానికి పల్లెలు పట్టుగొమ్మలు. గ్రామీణ ప్రాంతాలు సుభిక్షంగా ఉంటేనే దేశం బాగుంటుంది. అక్కడి ప్రజలే అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతుంటే..వారికి ప్రాథమిక వైద్యం కూడా అందని ద్రాక్షగా మారితే అది సమాజాభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. జిల్లాలోని గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో గ్రామీణ వైద్యం పడకేసింది. నిపుణులైన వైద్యులు లేకపోవడం, ఉన్న వైద్యుల్లోనూ కొందరు విధులకు సరిగా రాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా సాధారణ వ్యాధులకు సైతం పల్లెజనం పట్టణ బాట పడుతున్నారు. కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా ఇందులో 24 గంటలు పనిచేసే పీహెచ్సీలు 40 దాకా ఉన్నాయి. వీటితోపాటు వైద్య విధాన పరిషత్ పరిధిలో 20 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు(సామాజిక ఆరోగ్య కేంద్రాలు) పనిచేస్తున్నాయి. ఆయా కేంద్రాల్లో వైద్యులు, పారామెడికల్ సిబ్బందితో కలిసి 2,125 మంది దాకా పనిచేస్తున్నారు. పీహెచ్సీల్లో ప్రాథమిక వైద్యం, సీహెచ్సీల్లో సాధారణ వ్యాధులతోపాటు ప్రసవాలు, చిన్నపిల్లలకు వచ్చే వ్యాధులకు వైద్యమూ అందించాల్సి ఉంది. గ్రామీణ ప్రజలు ముందుగా ఏదైనా జ్వరం వస్తే సమీపంలోని సబ్సెంటర్ను ఆశ్రయిస్తున్నారు. అక్కడ నర్సులు ఇచ్చే చికిత్సకు వ్యాధి స్పందించకపోతే పీహెచ్సీలకు వెళ్తారు. అక్కడ కూడా ఆరోగ్యం బాగు పడకపోతే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు రెఫర్ చేస్తారు. ఇక్కడ కూడా బాగు కాకపోతే జిల్లా కేంద్రంలోని పెద్దాసుపత్రులకు రోగులను వైద్యులు రెఫర్ చేస్తారు. సమయపాలన పాటించని వైద్యులు సీహెచ్సీలు, పీహెచ్సీల్లో ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు ఉండి చికిత్స అందించాలి. 24 గంటలు పనిచేసే ఆసుపత్రులు, కొన్ని సీహెచ్సీల్లో నిరంతరం వైద్య సిబ్బంది ఉండి ఏ సమయంలోనైనా వచ్చే రోగులకు చికిత్స చేయాలి. ఈ మేరకు ఆయా ఆసుపత్రుల్లో అధికారులు బయోమెట్రిక్ మిషన్ను ఏర్పాటు చేసి హాజరు పరిశీలిస్తున్నారు. దీనిని సీఎం డ్యాష్బోర్డుకు అనుసంధానం చేసి, ఏ రోజు, ఏ సమయంలో ఎంత మంది హాజరయ్యారో రికార్డు చేస్తారు. కానీ జిల్లాలో అ«ధికశాతం ఆసుపత్రుల్లో వైద్యులు సమయపాలన పాటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. జిల్లా కేంద్రం, డివిజన్ కేంద్రాలకు దూరంగా ఉండే పీహెచ్సీలు, సీహెచ్సీల్లో ఈ పరిస్థితి మరీ అధికంగా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆసుపత్రికి వెళితే అధికశాతం వైద్యులు కనిపించడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిపుణులైన వైద్యులు కరువు జిల్లాలోని 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 159 మెడికల్ ఆఫీసర్ పోస్టులుండగా అందులో 76 రెగ్యులర్, 59 కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న వారిలోనూ 8 మంది పీజీ వైద్యవిద్య కోసం వెళ్లగా, వారి స్థానంలో పక్క పీహెచ్సీల్లో పనిచేస్తున్న వైద్యులను డిప్యుటేషన్పై వేస్తున్నారు. ఈ కారణంగా రెండుచోట్లా రోగులకు వైద్యం జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 8 డిప్యూటీ సివిల్ సర్జన్, 50 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 8 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఉన్నాయి. సివిల్ అసిస్టెంట్ సర్జన్ 3, డిప్యూటీ సివిల్ సర్జన్ పోస్టులు ఒకటి మాత్రమే ఖాళీగా ఉన్నాయి. 30 ఏళ్ల క్రితం నాటి జనాభాకు అనుగుణంగా ఉన్న పోస్టులే ఇప్పటికీ ఉండటం, జనాభా పెరగడంతో పాటు ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్యా పెరగడం వల్ల ఉన్న వైద్యులపై అదనపు భారం పడుతోంది. కొన్ని కేంద్రాల్లో వైద్యులు సమయపాలనపాటించకపోవడంతో రోగులు వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. పెద్దాసుపత్రిపైనే పెద్దభారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను బోధనాసుపత్రిగా పరిగణిస్తారు. పీహెచ్సీలు, సీహెచ్సీలు, జిల్లా ఆసుపత్రుల్లో నయం కాని కేసులను మాత్రమే అక్కడి వైద్యులు ఈ ఆసుపత్రికి రెఫర్ చేయాలి. కానీ పలు రకాల కారణాల వల్ల అధిక శాతం రోగులు సాధారణ వ్యాధులకూ ఇదే ఆసుపత్రికి చికిత్స కోసం వస్తున్నారు. ఫలితంగా ఈ ఆసుపత్రిలో ప్రతిరోజూ ఓపీ రోగుల సంఖ్య 2,500ల నుంచి 3 వేలు దాటుతోంది. 1,050 పడకలు మంజూరైతే 1,500లకు పైగా రోగులు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ కారణంగా అదనంగా, అనధికారికంగా 700లకు పైగా పడకలను రోగుల కోసం అధికారులు వేయాల్సి వస్తోంది. మూడింతలు అధికంగా రోగులు వస్తున్నా దానికి అనుగుణంగా ఇక్కడి వైద్యులు, ఉద్యోగులు, పారామెడికల్ సిబ్బంది సంఖ్యను ప్రభుత్వం పెంచడం లేదు. లద్దగిరిలో డాక్టర్లుండరు మా ఊరికి లద్దగిరి ఆసుపత్రి దగ్గరే. అయితే మా ఊరు ఆసుపత్రి పరిధిలోకి రాదని అక్కడి వైద్యులు చెబుతున్నారు. చికిత్స కోసం వెళితే సరిగ్గా చూడరు. ఈ కారణంగా ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నాం. ఊళ్లోనే బాగా చూస్తే మాకు ఇంత దూరం వచ్చి చికిత్స చేయించుకోవాల్సిన అవసరం లేదు. –సురేష్, రేమడూరు మా ఆసుపత్రిలో సరిగ్గా చూడరు మా ఊళ్లో ఉన్న ధర్మాసుపత్రిలో సమయానికి డాక్టర్లుండరు. ఉన్నా మమ్ముల్ని సరిగ్గా చూడరు. నాకు కాళ్లనొప్పులు, ఆయాసం ఉంది. మా ఊళ్లో ఆసుపత్రికి వెళితే మందులు తక్కువగా ఇస్తారు. అందుకే దూరమైనా ఈ పెద్దాసుపత్రికి వస్తున్నా. నెలకోసారి వచ్చి డాక్టర్లకు చూపించుకుంటా. ఇక్కడి డాక్టర్లు నాకు నెలరోజులకు మందులు ఇస్తారు. ఊరి నుంచి ఆసుపత్రికి వచ్చిపోవాలంటే రూ.80 అవుతుంది. – పక్కీరమ్మ, సి.బెళగల్ -
ఏజెన్సీకి మలేరియా.. పట్నానికి డెంగీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మళ్లీ జ్వరాలు విజృంభించాయి. వివిధ జిల్లాల్లో భారీ వర్షాలతో మలేరియా, డెంగీ జ్వరాలు తీవ్రమయ్యాయి. రెండు నెలలుగా డెంగీ జ్వరాలు అంతకంతకూ పెరుగుతున్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖ, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో మలేరియా జ్వరాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు మలేరియా జ్వరాలతో కిటకిటలాడుతున్నాయి. పీహెచ్సీల్లో ప్రతి రోజూ మలేరియా కేసులు నమోదవుతున్నట్టు రంపచోడవరం, మారేడుమిల్లి, శ్రీశైలం తదితర ఐటీడీఏల్లో పనిచేస్తున్న వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో 135 వరకూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా గత నెల రోజుల్లో 2,800కు పైనే మలేరియా కేసులు నమోదయ్యాయి. ఏటా సీజన్ వచ్చేవరకూ ఎవరూ పట్టించుకోరని, తీరా జ్వరాలు మొదలయ్యాక వైద్య బృందాలు వచ్చి హడావిడి చేస్తారని అక్కడి పీహెచ్సీలలో పనిచేసే వైద్యులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందులు లేకపోతే ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ (హెచ్డీఎస్) నుంచి కొనుగోలు చేయాలని చెబుతున్నారని, అయితే దీనివల్ల జాప్యం జరుగుతోందని అంటున్నారు. మలేరియా, డెంగీతోపాటు వర్షాలకు నీరు కలుషితమవడంతో ఎక్కువ మంది చిన్నారులు టైఫాయిడ్, న్యూమోనియా బారినపడుతున్నారని పేర్కొన్నారు. అదుపులోకి రాని డెంగీ పట్టణాల్లో ఇప్పటికీ డెంగీ జ్వరాలు అదుపులోకి రావడం లేదని స్వయానా ప్రజారోగ్య శాఖ చెబుతోంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా మూడు నెలలుగా డెంగీ జ్వరాలు రోజురోజుకూ అధికమవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ప్రకాశం, తూర్పుగోదావరి, అనంతపురం, విశాఖ జిల్లాల్లో గత నెల రోజుల్లో 3 వేలకు పైగా డెంగీ కేసులు నమోదైనట్టు తేలింది. ఒక్క విశాఖçలోనే 900కు పైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. డెంగీబారిన పడ్డ బాధితులు ప్రభుత్వాస్పత్రులకు వెళ్తూ ఉంటే అక్కడి వైద్యులు సరిగా స్పందించడం లేదని, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తేనేమో ప్లేట్లెట్లు తగ్గిపోతున్నాయని రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకూ పిండుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. ముందస్తు చర్యలు లేవు దోమకాటుతో వచ్చే జ్వరాలను ముందస్తు చర్యలు తీసుకుంటే నివారించే అవకాశం ఉంటుంది. కానీ చర్యలు తీసుకోలేదు. ఆరోగ్యశాఖలో మలేరియా విభాగమనేది ప్రత్యేకంగా ఉన్నా అది పడకేసింది. మలాథియాన్, పైరిథ్రిమ్ అనే ద్రావణాలను ప్రతి ఊళ్లో మురికి కాలువలు, నీళ్లు నిల్వ ఉన్న ప్రాంతాలు, డంపింగ్ ప్రాంతాల్లో పిచికారీ చేయాలి. కానీ అలా చేయలేదు. కనీసం పారిశుధ్య చర్యలు కూడా చేపట్టలేదు. దీంతో దోమలు విజృంభించాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంది. అక్కడ గిరిజనులకు ఇవ్వాల్సిన దోమతెరలు అందరికీ అందలేదు. ప్రాణాధార మందులే కరువు పామ్ ఇంజక్షన్ అనేది ఎవరైనా పాయిజన్ (విషం) తీసుకున్నప్పుడు దానికి విరుగుడుగా ఇస్తారు. అట్రోపిన్, అడ్రినల్ ఇంజక్షన్లు సర్జరీ సమయంలో ఇస్తారు. వీటిని లైఫ్ సేవింగ్ డ్రగ్స్గా పేర్కొంటారు. కానీ ఈ రెండు ఇంజక్షన్లు రెండు మాసాలుగా ఏజెన్సీ ఏరియాల్లోని పీహెచ్సీలలో లేవు. పారాసెట్మాల్ ఇంజక్షన్, డైసైక్లోమైన్ తదితర మందులూ లేవు. కళ్లలో వేసుకునే సిప్రోఫ్లాక్సిన్ డ్రాప్స్ లేవు. చిన్నారులకు దగ్గు వస్తే వేసుకోవడానికి ఆంబ్రోక్సిల్ సిరప్ లేదు. చర్యలు తీసుకుంటున్నాం పట్టణాల్లో ఇప్పటికీ డెంగీ కేసులు ఉన్నాయి. ఈ ఏడాది ఎక్కువగా ఉన్న మాట నిజమే. ఇప్పటికే విజయనగరం జిల్లాలో ఎంటమలాజికల్ బృందం పనిచేస్తోంది. ఏజెన్సీ ప్రాంతాలతోపాటు అన్ని ప్రాంతాలకూ మందుల కొరత లేకుండా చూస్తున్నాం. –డా.గీతాప్రసాదిని, అదనపు సంచాలకులు, ప్రజారోగ్య శాఖ దోమకుట్టకుండా చూసుకోవాలి ఇంటి పరిసరాల్లో కొబ్బరి చిప్పలు, టైర్లు, పాత బాటిళ్లు, కప్పులు ఇవన్నీ లేకుండా చూసుకోవడంతోపాటు వాటిలో నీళ్లు నిల్వ లేకుండా చేస్తే దోమలు వృద్ధి చెందవు. ముఖ్యంగా చిన్నారులకు దోమతెరలు వాడాలి. టైఫాయిడ్, న్యూమోనియా జ్వరాలూ ఈ సీజన్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాచి చల్లార్చిన నీళ్లు తాగడం, బాగా ఉడికించిన భోజనం తినడం మంచిది. – డా.వంశీధర్, చిన్నపిల్లల వైద్యులు, రిమ్స్, కడప -
పీహెచ్సీలకు ‘వెలుగు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామీణ వైద్యానికి మంచిరోజులు వచ్చాయి. ఎట్టకేలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)కు మెడికల్ ఆఫీసర్లు/సివిల్ అసిస్టెంట్ సర్జన్లు నియమితులయ్యారు. ఈ మేరకు 510 మందికి సోమవారం ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు నియామక ఉత్తర్వులు ఇచ్చారు. ఏడాది క్రితం ఈ పోస్టుల కు దరఖాస్తులు ఆహ్వానించగా, దాదాపు 5 వేల మందివరకు ఎంబీబీఎస్ డాక్టర్లు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థుల మార్కులు, రిజర్వేషన్లు, రోస్టర్ ప్రక్రియ ఆధారంగా నియామకాలు జరిపారు. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లడంతో భర్తీ ప్రక్రియ ఆగిపోయింది. అయితే కోర్టుకు వెళ్లినవారే కేసును ఉపసంహరించుకోవడంతో 510 మందికి నియామకపు ఉత్తర్వులు ఇచ్చారు. పోస్టింగుల్లో మార్పులుండవ్...: కంటివెలుగు కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలోనే పీహెచ్సీల్లో వైద్యులను ఆగమేఘాల మీద నియమించారు. ప్రభుత్వం వచ్చే నెల 15 నుంచి కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందుకు భారీగా ఏర్పాట్లు చేసింది. మొత్తం పరీక్షలు చేశాక దాదాపు 3 లక్షల మందికి శస్త్రచికిత్సలు అవసరం అవుతాయని అంచనా వేసింది. ఈ శస్త్రచికిత్సల కోసం 114 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, స్వచ్ఛంద సంస్థలను గుర్తించారు. గ్రామాల్లో పీహెచ్సీ యూనిట్గా ఆయా కంటి పరీక్షలు జరుగుతాయి. ఇంతటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే పీహెచ్సీలదే కీలకపాత్ర. అందుకే ప్రభుత్వం కోర్టు కేసును పరిష్కరించి వైద్యుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. నియామక ఉత్తర్వులు అందుకున్న వైద్యులు తమకు ఇష్టమైన చోట అవకాశం కల్పించాలని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావుకు విన్నవించేందుకు సోమవారం పెద్ద ఎత్తున ఆయన కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ప్రస్తుతం వినతలును పరిశీలించడం సాధ్యం కాదని అన్నారు. ‘‘పోస్టింగుల్లో మార్పులు ఉండవు. కంటి వెలుగు కార్యక్రమం ఉన్నందున అభ్యర్థులు తక్షణమే విధుల్లో చేరాలి’’అని విజ్ఞప్తి చేశారు. మరో 41 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు డిప్యూటీ సివిల్ సర్జన్లుగా పదోన్నతులు కల్పించినట్లు తెలిపారు. తద్వారా జిల్లాల్లో డిప్యూటీ డీఎంహెచ్వోల కొరత తీరనుందన్నారు. దీంతో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగనుందని ఆశాభావం వ్యక్తంచేశారు. -
ప్రభుత్వాసుపత్రిలో తల్లడిల్లుతున్న తల్లులు
కొందుర్గు(షాద్నగర్): ‘ఇంటివద్ద, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసవం చేయించుకోకూడదు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవం చేయించుకోండి’అని ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పించామని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకుంటే కేసీఆర్ కిట్తోపాటు, రూ.12 వేలు ప్రోత్సాహకం అందిస్తామని చెబుతుంది. కానీ, చాలా ప్రభుత్వాస్పత్రుల్లో సరిపడా సిబ్బంది లేకపోవడం వల్ల సరైన వైద్య సేవలు అందడం లేదు. ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది.. రంగారెడ్డి జిల్లా కొందుర్గు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ఇక్కడ 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉండాలి. స్టాఫ్నర్స్ అందుబాటులో ఉండి ప్రసూతి చేయాలి. కానీ ప్రస్తుతం ఇక్కడ వైద్యులు లేరు. బూర్గుల పీహెచ్సీ డాక్టర్ సుమంత్ కొందుర్గు పీహెచ్సీకి ఇన్చార్జీగా సేవలందిస్తున్నారు. స్టాఫ్నర్స్లు ఎవరూ లేకపోవడంతో ఏఎన్ఎంలు స్టాఫ్నర్స్లుగా వ్యవహరిస్తూ వైద్య సేవలు అందిస్తున్నారు. కొందుర్గు, జిల్లేడ్చౌదరిగూడ మండలాల్లో దాదాపు 70 గ్రామాలు, 70 వేల పైనే జనాభా ఉన్నారు. అయినా ఈ రెండు మండలాల ప్రజలకు కొందుర్గులో ఒకే ఒక పీహెచ్సీ ఉంది. ఇందులోనూ వైద్యులు, సరిపడా సిబ్బంది లేక రోగులకు సరైన వైద్యసేవలు అందక అవస్థలు పడుతున్నారు. మాతృమూర్తుల నరకయాతన జిల్లేడ్చౌదరిగూడ మండలం ముష్టిపల్లి తండాకు చెందిన లలిత బుధవారం రాత్రి 11 గంటలకు ప్రసవం కోసం కొందుర్గు పీహెచ్సీకి వచ్చింది. ఈ సమయంలో అక్కడ వైద్యులెవరూ లేరు. స్టాఫ్నర్స్ సలోమి ఆమెను ఆసుపత్రిలో చేర్చుకున్నారు. కానీ ఉదయం 7 గంటల వరకు ఆమె ప్రసవించలేదు. అదేవిధంగా గురువారం ఉదయం 5 గంటలకు కొందుర్గు మండలం పర్వతాపూర్ గ్రామానికి చెందిన చాకలి లావణ్య, జిల్లేడ్చౌదరిగూడ మండలం వనంపల్లికి చెందిన పల్లవి ప్రసవం కోసం కొందుర్గు పీహెచ్సీకి వచ్చారు. అప్పటికీ ఆసుపత్రిలో వైద్యులు లేరు. కేవలం స్టాఫ్నర్సే ఉన్నారు. వారికి ప్రాథమిక చికిత్స చేసి ఆమె ఉదయం 7.30 గంటలకు డ్యూటీ నుంచి వెళ్లిపోయింది. పీహెచ్సీలో ఎవరూ లేకపోవడంతో ప్రసవం కాక మాతృమూర్తులు పురిటినొప్పులతో తల్లడిల్లారు. వారి రోదనను పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. ఈ సమయంలో పర్వతాపూర్ గ్రామానికి చెందిన లావణ్యకు పురిటినొప్పులు తీవ్రమయ్యాయి. ఆమె ప్రసవించి మగ శిశువుకు జన్మనిచ్చింది. తనకు సహాయంగా వెంట వచ్చిన గ్రామస్తురాలు లావణ్యకు సహకరించింది. ఇక వనంపల్లికి చెందిన పల్లవికి భరించలేని నొప్పులు రావడంతో స్థానికులు 108 అంబులెన్స్కు ఫోన్ చేసి షాద్నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి పంపించారు. అక్కడ ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ముష్టిపల్లితండాకు చెందిన లలిత ప్రస్తుతం కొందుర్గు పీహెచ్సీలోనే చికిత్స పొందుతోంది. ఇంకా ప్రసవం కాలేదు. విచారణ జరపాలని ఆదేశించిన కలెక్టర్.. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ రఘనందన్రావు దృష్టికి ‘సాక్షి’తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. దీనిపై తక్షణం పూర్తి విచారణ జరిపి తనకు నివేదిక పంపించాలని షాద్నగర్ ఆర్డీవో కృష్ణను ఆదేశించారు. దీంతో కొందుర్గు తహసీల్దార్ ప్రమీలారాణి పీహెచ్సీని సందర్శించి వివరాలు సేకరించి నివేదిక పంపించారు. -
తట్టు నిర్మూలనే ధ్యేయం
- డీఐఓ డాక్టర్ వెంకటరమణ - ఆగష్టు నుంచి మీజిల్స్ రూబెల్లా వ్యాక్సిన్ జూపాడుబంగ్లా: 2020 నాటికి రాష్ట్రంలో తట్టు వ్యాధి నిర్మూలించడమే ధ్యేయంగా పని చేస్తున్నట్లు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు. శనివారం ఆయన మండల పరిధిలోని తంగెడంచ గ్రామంలో వ్యాక్సినైజేషన్ను పరిశీలించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వ్యాక్సిన్ను భద్రపరిచిన విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం ఇస్తున్న మీజిల్స్ స్థానంలో ఆగష్టు నుంచి మీజిల్స్ రూబెల్లా వ్యాక్సిన్ ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. రూబెల్లా అనే వైరస్ గర్భిణీల్లో వ్యాపించి పుట్టబోయే బిడ్డకు అవయవలోపాలు కలిగించడతోపాటు ప్రాణాపాయం సంభవించేలా చేస్తుందన్నారు. దీన్ని నివారించేందుకు వ్యాక్సిన్ ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. గర్భిణిలతోపాటు 9 నెలల చిన్నారుల నుంచి 15 సంవత్సరాల వయసున్న వారికి వ్యాక్సిన్ వేస్తారన్నారు. రాష్ట్రంలో 1.70లక్షల రోగాల్లో సగానికిపైగా ఈ వ్యాక్సిన్ ద్వారా అరికట్టవచ్చన్నారు. చిన్నారులకు ఆగష్టు నుంచి ఓ డోసు వ్యాక్సిన్ ఇస్తామన్నారు. సెప్టెంబర్ నుంచి మీజెల్స్ వ్యాక్సిన్ తొలగిస్తారని తెలిపారు. -
పల్లె వైద్యానికి ప్రాధాన్యం!
⇒ వైద్య, ఆరోగ్యశాఖ బడ్జెట్ రూ.9,686 కోట్లు ⇒ గతేడాది కంటే రూ. 2,244 కోట్లు అధికం ⇒ వైద్య విద్యకు, ఆరోగ్య,కుటుంబ సంక్షేమానికే పెద్దపీట సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖ బడ్జెట్ 2017–18 సంవత్సరానికి రూ. 9,686.71 కోట్లు ఉండే అవకాశం ఉంది. ఈ మేరకు ఆ శాఖ అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపించింది. గతేడాది బడ్జెట్ రూ. 7,442 కోట్లు కాగా... ఈసారి అదనంగా రూ. 2,244 కోట్లు ఉండే అవకాశం ఉంది. ఈసారి బడ్జెట్లో నిర్వహణ పద్దు కింద రూ. 3,941.34 కోట్లు కేటాయించగా... ప్రగతి పద్దు కింద రూ. 5,475.36 కోట్లు కేటాయిస్తారని తెలిసింది. బడ్జెట్లో వైద్య విద్యకు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి పెద్ద పీట వేస్తారు. వైద్య విద్య నిర్వహణ పద్దు కింద రూ. 1,755.73 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ. 1,955.74 కోట్లు కేటాయిస్తారని తెలిసింది. ఇక ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి నిర్వహణ పద్దు కింద రూ. 312 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ. 1,939 కోట్లు కేటాయిస్తారు. ప్రధానంగా వైద్య విద్యపై సర్కారు దృష్టి సారించింది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీ చేపడతారు. పదోన్నతులు కల్పిస్తారు. వైద్య విద్య, పరిశోధనపై సర్కారు దృష్టి సారించింది. బోధనాసుపత్రులను మరింత అభివృద్ధి చేస్తారు. నిమ్స్లో రూ. 150 కోట్లతో నిర్మాణాలు చేపడతారు. ఎంఎన్జేలో రూ. 23 కోట్లతో భవనాలు నిర్మిస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బలోపేతం.. ఆరోగ్య, కుటుంబ సంక్షేమం కోసం కూడా అధికంగా నిధులు కేటాయించ నున్నారు. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో వైద్య రంగాన్ని బలోపేతం చేయాలన్నదే సర్కారు ఉద్దేశం. సర్కారు ఆసుపత్రుల్లో వసతుల కల్పనపై దృష్టి సారిస్తారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి చేయించుకుంటే రూ. 12 వేలు ప్రోత్సా హకం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. అందులో కేంద్రం నుంచి రూ. 6 వేలు వచ్చినా మిగిలిన సొమ్ము కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారు. బేబీ కిట్ల కోసం కూడా ప్రభుత్వం నిధులు కేటాయించనుంది. ఇక తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసుపత్రులను బలోపేతం చేసేందుకు ప్రగతి పద్దు కింద రూ. 652 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ. 380 కోట్లు కేటాయిస్తారని తెలిసింది. ఇక కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి మాత్రం కేవలం రూ. 60 కోట్లే కేటాయిస్తారు. ఆయుష్ కోసం ప్రగతి పద్దు కింద కేవలం రూ. 78 కోట్లే కేటాయించనున్నట్లు తెలిసింది. ఆరోగ్యశ్రీ, ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని మరింత విస్త్రృతం చేసేందుకు కూడా బడ్జెట్లో కేటాయింపులు బాగానే ఉంటాయని చెబుతున్నారు. అయితే హైదరాబాద్ నగరంలో 4 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయిస్తారా? లేదా? అన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వీటి నిర్మాణాలకు రుణం తీసుకునేందుకు వివిధ జాతీయ బ్యాంకులతో వైద్య ఆరోగ్యశాఖ చర్చలు జరుపుతోంది. -
కాన్పులు లేవు!
ప్రభుత్వ ఆస్పత్రుల్లో దారుణం బాగా తగ్గిన ప్రసవాల సంఖ్య పర్యవేక్షణ లేక ప్రజల దూరం ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు జిల్లాల పునర్విభజన అనంతరం వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోకి వచ్చిన 11 పీహెచ్సీల్లో గత ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 153 ప్రసవాలు జరిగాయి. జిల్లాలు ఏర్పాటయ్యాక అదే పీహెచ్సీల్లో గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు అంటే మూడు నెలల కాలంలో కేవలం 62 ప్రసవాలే జరిగాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వరంగల్ : పేదలు, గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్యల పెంచేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించడమే కాకుండా అవసరమైన నిధులు విడుదల చేస్తోంది. ప్రభుత్వ వైద్య సేవలను మెరుగుపరిచేందుకు అవసరమైన వసతులను కల్పిస్తోంది. అంతేకాకుండా జిల్లాల పునర్విభజన తర్వాత క్షేత్రస్థాయిలో వైద్య సేవలపై పర్యవేక్షణ పెరగాలని జిల్లాల అధికారులను ఆదేశిస్తోంది. ఇంత చేస్తున్నా వరంగల్ అర్బన్ జిల్లాలో మాత్రం ప్రభుత్వ ఆకాంక్షలు, ఆదేశాలకు విరుద్ధంగా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. వరంగల్ అర్బన్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య బాగా తగ్గడమే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. చర్యలు లేవు.. ప్రభుత్వ ఆస్పత్రులపై పర్యవేక్షణ పెంచి వైద్యసేవల పరంగా భరోసా కల్పించేందుకు వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. దీంతో ప్రసవాల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే వారి సంఖ్య తగ్గుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవల పరంగా భరోసా కల్పించే పరిస్థితి లేకపోవడంతో పేదలు సైతం ప్రైవేట్ ఆస్పత్రులకే వెళ్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య రంగంపై వేల కోట్లు ఖర్చుపెడుతున్నా పేదలకు ఆసరాగా నిలిచే పరిస్థితి లేకుండా పోతోంది. అప్పట్లో 69,.. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 69 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండేవి. వైశాల్యం పరంగా పెద్దగా ఉండడంతో వైద్యసేవల పర్యవేక్షణ కొంత ఇబ్బంది కలిగించేది. జిల్లాల పునర్విభజన ప్రక్రియలో వరంగల్ జిల్లాను ఐదు జిల్లాలుగా విభజించగా ఉమ్మడి జిల్లాకు వైద్యాధికారిగా వ్యవహరించిన అధికారి వరంగల్ అర్బన్ జిల్లా బాధ్యతలు చేపట్టారు. వరంగల్ నగరంలో ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులు ఉండడంతో.. అర్బన్ జిల్లాలోని 12 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రా(యూహెచ్సీ)ల్లో ప్రసవాలు జరగవు. ఇక జిల్లాలో ఏడు గ్రామీణ మండలాలు ఉండగా వీటిలో 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీలు) ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఈ పీహెచ్సీలు వైద్య సేవలు అందించాలి. ముఖ్యంగా ఈ కేంద్రాల్లో ప్రసవాలు జరిగేలా వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటోంది. జిల్లాలోని గ్రామీణ పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. వరంగల్ అర్బన్ జిల్లా ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు (2016 నవంబర్ – 2017 జనవరి) జిల్లావ్యాప్తంగా పీహెచ్సీల్లో కేవలం 62 ప్రసవాలే జరిగాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి జిల్లాలో పీహెచ్సీల ప్రసవాల సంఖ్యతో పోలిస్తే బాగా తగ్గడం ప్రభుత్వ వైద్య సేవల పరిస్థితిని స్పష్టం చేస్తోంది. కొత్త జిల్లాల ఆవిర్భావంతో జిల్లా పరిధి, విస్తీర్ణం తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో పీహెచ్సీలపై పర్యవేక్షణ పెరగాల్సి ఉండగా అది మాత్రమే జరగడంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రభుత్వాస్పత్రులకు పురిటి నొప్పులు
అరకొర వసతులు.. వైద్యుల కొరత గర్భిణులకు అందని పూర్తి స్థాయి వైద్యం సిబ్బంది లేక కొత్త భవనాలు నిరుపయోగం రామన్నపేట : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 69 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసిబ్బంది కొరత... అరకొర వసతులు పేద గర్భిణులకు శాపంగా మారాయి. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాలు జరుగాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. సౌకర్యాలు ఉన్న చోట నిర్లక్ష్యపు విధులతో సేవలు దూరమవుతుండగా.. మరి కొన్ని ప్రాథమిక కేంద్రాల్లో వైద్యసిబ్బంది కొరతతో అసలే సేవలందడం లేదు. గత సంవత్సరం అప్పటి కలెక్టర్ కరుణ ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు జరుగాలని సీహెచ్సీలను సందర్శించి కావాల్సిన వసతులను కల్పించినప్పటికీ నేటి వరకు కూడా కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు జరుగుతున్న దాఖలాలు లేవు. దీనికి పలు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ల్యాబ్ లేకపోవడం, సిబ్బంది కొరత వెరసి పేద గర్భిణులకు పూర్తి స్థాయిలో వైద్యం అందకకుండాపోతోంది. ప్రసవాలకు దూరంగా పీహెచ్సీలు... ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2016 జనవరి నుంచి అక్టోబర్ వరకు పది నెలల కాలంలో అలంకానిపేట, దామెర, కడిపికొండ, బీజాపూర్, కోమల్ల, మేడపల్లి, నల్లబెల్లి, పర్వతగిరి, వేలేరు, గూడూరు వంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలే జరగులేదు. అలాగే ఈ పది నెలల కాలంలో ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యాపేటలోని ఓ అద్దె భవనాన్ని వీరు బుధవారం పరిశీలించారు. మామునూరులోని విశాలమైన సొంత భవనాల్లో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీని సూర్యాపేటలో ఓ అద్దె భవనంలోకి మార్చుతుండడంపై వెటర్నరీ యూనివర్సిటీలోని సిబ్బంది, విద్యార్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి కంటే మెరుగైన వసతులతో కాలేజీని తీర్చిదిద్దుతారని అనుకుంటే ప్రభుత్వం ఇంకో రకంగా చేస్తోందని అంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏకైక వెటర్నరీ విద్యా సంస్థ తరలిపోతుంటే జిల్లాలోని ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీవేంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం పరిధిలో మామునూరులో వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటైంది. 2011లో ఈ కాలేజీని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత... పీవీ నర్సింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మామునూరులోని పాలిటెక్నిక్ కాలేజీ ఈ యూనివర్సిటీ పరిధిలోనే ఉంది. రెండేళ్ల పాలిటెక్నిక్ కోర్సులో ఒక్కో తరగతిలో 20 మంది చొప్పున విద్యార్థులు ఉంటారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలోని విద్యార్థులకు మామునూరు వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీ అనువుగా ఉంటోంది. అయితే ప్రభుత్వం ఈ కాలేజీని సూర్యాపేటకు తరలిస్తుండడంతో ఈ జిల్లాల్లోని విద్యార్థులకు ఇబ్బందిగా మారనుంది. మామునూరులోని పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలోనే రాష్ట్ర ప్రభుత్వం వెటర్నరీ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 2016–17 సంవత్సరంలోనే ఈ కాలేజీ ప్రారంభమవుతుందని ప్రకటించింది కూడా. వెటర్నరీ డిగ్రీ కాలేజీ ఏర్పాటు సంగతి ఏమోగానీ... ప్రస్తుతం ఉన్న పాలిటెక్నిక్ కాలేజీ సైతం వెళ్లిపోతోంది. డిగ్రీ కాలేజీ ఏర్పాటు విషయం అటకెక్కడంతో మామునూరు ఇక నుంచి విద్యా కేంద్రాలు లేని ప్రదేశంగా మారే పరిస్థితి వస్తోంది. -
పీహెచ్సీలకు జబ్బు
వైద్యులు, సిబ్బంది కొరతతో అందని నాణ్యమైన సేవలు ప్రారంభానికి నోచుకోని మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అప్గ్రేడ్ అయిన పీహెచ్సీల్లో స్టాఫ్ కొరత కొత్త మండలాల్లో ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు విద్యా, వైద్యంపై దృష్టి సారించిన కలెక్టర్ ప్రతిపాదనలు అమలైతే వైద్యం మెరుగుపడినట్లే మహబూబాబాద్ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. ఫలితంగా రోగులకు నాణ్యమైన వైద్యసేవలందడం లేదు. కొత్తగా ప్రారంభించినా పీహెచ్సీల్లో పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఆ కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయి. జిల్లాలో 17 పీహెచ్సీల్లో 35 మంది డాక్టర్లు అవసరం ఉండగా, 12 డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కింది స్థాయి సిబ్బంది 486 మందికిగాను 131 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో మల్యాల, కురవి, మరిపెడ మండలంలోని ఉగ్గంపల్లిలో పీహెచ్సీల నిర్మాణం జరిగి నెలలు గడుస్తున్నా నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. తొర్రూరు పీహెచ్సీ, డోర్నకల్, గార్ల పీహెచ్సీలు, సీహెచ్సీగా అప్గ్రేడ్ చేసినా దానికి తగ్గట్టుగా సిబ్బంది, వైద్యుల భర్తీ జరగలేదు. తొర్రూరు, డోర్నకల్ సీహెచ్సీల్లో అదనపు భవనాల నిర్మాణం కూడా పూర్తి కాలేదు. గార్ల సీహెచ్సీ భవనం పూర్తయినా సిబ్బంది నియామకం జరుగలేదు. పీహెచ్సీలు, సీహెచ్సీల్లో అనేక సమస్యలతో వైద్యులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. గంగారం మండలంలోని కోమట్లగూడెం పీహెచ్సీ, డోర్నకల్ పీహెచ్సీ, కేసముద్రం, మరిపెడ, బలపాల పీహెచ్సీల్లో వైద్యులు లేరు. స్టాఫ్ నర్సులు, సిబ్బందే వైద్య పరీక్షలు నిర్వహించాల్సి వస్తోంది. ఆ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 108 ఏఎన్ఎం సెంటర్లు ఉండగా వాటిలో 56 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హెల్త్ అసిస్టెంట్ పోస్టులు 35 ఖాళీగా ఉన్నాయి. ప్రధానంగా సిబ్బంది, వైద్యులను భర్తీ చేయాలని ప్రతిపాదనలు తయారు చేసి సంబంధిత అధికారులకు పంపామని డీఎంహెచ్ఓ, కార్యాలయం సిబ్బంది తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో ఉన్న సమస్యలపై అన్ని విషయాలను సంబంధిత అధికారులకు తెలియపర్చినట్లు డీఎంఅండ్హెచ్ఓ తెలిపారు. ప్రారంభానికి నోచుకోని పీహెచ్సీలు.. మానుకోట మండలంలోని మల్యాల పీహెచ్సీ, కురవి, మరిపెడ మండలంలోని ఉగ్గంపల్లి పీహెచ్సీల భవనాలు పూర్తయినా నేటికి ప్రారంభానికి నోచుకోలేదు. భవన నిర్మాణాలు జరిగి నెలలు గడుస్తున్నా సిబ్బంది నియామకం జరగకపోవడంతో ఆ భవనాలు నిరుపయోగంగానే ఉన్నాయి. మానుకోట జిల్లాగా ఏర్పాటు కావడంతో త్వరలోనే ఆ పోస్టులు భర్తీ అయి పీహెచ్సీలు ప్రారంభమవుతాయని ఆయా మండలాల ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. అధికారుల ప్రతిపాదనలు.. ప్రతి మండలానికి పీహెచ్సీ, 104, 108 వాహనాలు ఏర్పాటు చేయాలని, సిబ్బందిని భర్తీ చేయాలని, మెడికల్ అధికారులకు తప్పనిసరిగా వాహనం ఇవ్వాలని, మండలానికి రెండు ఫాగింగ్ మిషన్లు ఏర్పాటు మంజూరు చేయాలని, జిల్లా కేంద్రంలో టీబీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని, పీహెచ్సీల్లో ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్, సీహెచ్సీల్లో ఎక్స్రే, ఏరియా ఆస్పత్రిలో సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు తయారు చేసి అందజేశారు. సిబ్బందిని భర్తీ చేస్తే మెరుగైన వైద్య సేవలు పీహెచ్సీలు, సీహెచ్సీల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బందిని భర్తీ చేస్తే ఇంకా మెరుగైన వైద్యం అందుతుంది. డెలివరీలు ఎక్కువగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్వహించేలా ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అనవసరమైన ఆపరేషన్లు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేయించుకోవద్దు. అనవసరంగా జరిగే ఆపరేషన్లను నివారించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్నిరకాల పరీక్షలు జరుగుతున్నాయి. గర్భిణుల కోసం ప్రభుత్వం జనని, శిశు సంరక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. - డీఎంహెచ్ఓ శ్రీరామ్ -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరగాలి
గ్రామస్తుల్ అవగాహన పెంచితేనే ఇది సాధ్యం {పతీ రోజు పీహెచ్సీల వివరాలు పంపించాలి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వరంగల్ రూరల్ : ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచేలా వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించడం ద్వారా తల్లీ, బిడ్డలు క్షేమంగా ఉంటారనే అంశంపై గ్రామస్తుల్లో అవగాహన కల్పించడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. హన్మకొండలోని కలెక్టరేట్ నుంచి ఆయన జిల్లాలోని పీహెచ్సీల వైద్యులు, ఏఎన్ఎంలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశావర్కర్లతో వీడియో కాన్ఫరెన్స ద్వారా మాట్లాడారు. వరంగల్ రూరల్ జిల్లాలో 17 పీహెచ్సీలు ఉండగా ఇందులో ఆరింట్లో ఇరవై నాలుగు గంటల సేవలు అందించేవి ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలపై ప్రజల్లో నమ్మకం కల్పించాలని సూచించారు. ఒక్కో ఏఎన్ఎం నెలకు రెండు నుంచి మూడు ప్రసూతి కేసులు తీసుకురావాలన్నారు. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్(ఎన్ఆర్హెచ్ఎం) నిబంధనల ప్రకారం నెలకు పది ప్రసవాలు కావాల్సి ఉన్నా ఒక్కో ఆస్పత్రిలో కనీసం ఐదు ప్రసవాలైనా చేయాలని ఆదేశించారు. అలాగే, ఇక నుంచి పీహెచ్సీల వారీగా ప్రసవాల కేసుల వివరాలను తనకు పంపించాలని స్పష్టం చేశారు. సౌకర్యాలు సమకూర్చుకోవాలి ఆస్పత్రుల్లో పూర్తిస్థారుు మౌళిక సదుపాయాలు సమకూర్చుకోవాలని కలెక్టర్ సూచించారు. పడకలు, స్ట్రెచర్లు, బెడ్ షీట్లు, విద్యుత్ సౌకర్యం, తాగునీరు, మరుగుదొడ్లలో రన్నింగ్ వాటర్ ఉండేలా చూడడంతో పాటు ఆవరణలో పచ్చదనం వెల్లివిరిసేలా మొక్కలు పెంచాలన్నారు. ఇందుకోసం ఆస్పత్రి అభివృద్ధి నిధులు వినియోగించుకోవచ్చని తెలిపారు. అలాగే, మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఇంకా వైద్యులు, సిబ్బంది సక్రమంగా విధులకు హాజరుకావాలని ఆదేశించారు. తల్లీబిడ్డలు దోమల బారిన పడకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. దోమల నివారణలో భాగంగా ఆస్పత్రుల్లోని పాడైపోరుున పరికరాలు, ఫర్నీచర్ను వేలం వేయాలని కలెక్టర్ పాటిల్ సూచించారు. కాగా, హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న వారికి మంచి వైద్యం అందించాలని, వచ్చే నెల 1న ఎరుుడ్స డే ఉన్నందున మండల స్థారుులో ర్యాలీలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై దృష్టి సారించాలి : డీఎంహెచ్ఓ సీజనల్ వ్యాధులను అరికట్టడంపై వైద్యులు, సిబ్బంది దృష్టి సారించాలని డీఎంహెచ్ఓ అశోక్ ఆనంద్ సూచించారు. స్వైన్ఫ్లూ, జ్వరాలతో బాధపడేవారిని గుర్తించి వైద్యసేవలు అందించాలన్నారు. జనవరిలో నిర్వహించే పల్స్ పోలియో విజయవంతానికి ఇప్పటి నుంచే 0-5 ఏళ్ల లోపు పిల్లల వివరాలు సేకరించాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్సలో డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ అనురాధ, హెచ్ఈఎం కె.విద్యాసాగర్, ఆర్ఎంఓలు పాల్గొన్నారు. -
ఏపీలో కొత్తగా 14 పీహెచ్సీలు
హైదరాబాద్: జాతీయ ఆరోగ్యమిషన్ (ఎన్హెచ్ఎం) నిధులతో ఏపీలో మరో 14 కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రజారోగ్యశాఖ పరిపాలనా అనుమతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఇందులో దొడ్డిపట్ల, అత్తిలి (పశ్చిమగోదావరి), కరప (తూర్పు గోదావరి), తాడిమర్రి, నార్పల, ముదిగుబ్బ (అనంతపురం), ముదినేపల్లి, రుద్రపాక, కల్లేటికోట, ఇందుపల్లి (కృష్ణా), అమృతలూరు, మాచవరం (గుంటూరు), గర్బామ్ (విజయనగరం), కురుచేడు (ప్రకాశం) జిల్లాలు ఉన్నాయి. ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రూ.1.18 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ప్రస్తుతం రాష్ట్రంలో 1075 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. కొత్తగా రానున్న 14 పీహెచ్సీలతో ఈ సంఖ్య 1089 కి చేరనుంది. ఈ పీహెచ్సీలకు పూర్తిస్థాయిలో కేంద్రం నుంచే నిధులు రానున్నాయి. -
పట్టణ పేదలకు.. ముంగిట్లో వైద్యం
♦ జిల్లాలో కొత్తగా 12 యూపీహెచ్సీలు ♦ పట్టణ ప్రాంతాల్లో త్వరలో ప్రారంభం ♦ కాంట్రాక్టు పద్ధతిలో పోస్టుల భర్తీ కలెక్టర్ వద్దకు చేరిన ఫైలు జిల్లాలో ఉచిత వైద్య సేవలు మరింత విస్తరించనున్నాయి. సంపూర్ణ ఆరోగ్యం ప్రతి వ్యక్తి హక్కు అనే నినాదంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు ప్రారంభించాయి. ఈక్రమంలో వైద్యసేవలను మరింత ఎక్కువ మందికి అందించాలనే ఉద్దేశంతో.. రాష్ర్ట ప్రభుత్వం జిల్లాకు కొత్తగా 12 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంజూరు చేసింది. ఇప్పటికే 48 ప్రాథమిక ఆరోగ్య కే ంద్రాలు కొనసాగుతుండగా.. తాజాగా పన్నెండు ఆస్పత్రులు ఏర్పాటు కావడంతో జిల్లాలో వీటి సంఖ్య 60కి పెరగనుంది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా కొత్త ఆస్పత్రులు ఇక్కడే.. మన్సూరాబాద్ (సరూర్నగర్), మల్లాపూర్ (ఉప్పల్), వెంకట్రెడ్డినగర్ (ఉప్పల్), వినాయక్నగర్ (మల్కాజిగిరి), షాపూర్నగర్ (కుత్బుల్లాపూర్), పర్వత్నగర్ (బాలానగర్), హఫీజ్పేట్ (శేరిలింగంపల్లి), కుత్బుల్లాపూర్ (కుత్బుల్లాపూర్), మైలార్దేవ్పల్లి (రాజేంద్రనగర్), శివరాంపల్లి (రాజేంద్రనగర్), హసన్నగర్ (రాజేంద్రనగర్), ఏకలవ్యనగర్ (మల్కాజిగిరి). సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాకు కొత్తగా మంజూరైన ఆస్పత్రులన్నీ పట్టణ ప్రాంతాల్లోనే ఏర్పాటు కానున్నాయి. జనాభా ప్రాతిపదికన పట్టణాల్లో వైద్యశాలల సంఖ్య తక్కువుంది. మూడు ప్రాంతీయ ఆస్పత్రులతోపాటు జీహెచ్ఎంసీ పరిధిలో ఏడు పట్టణ ఆరోగ్య కేంద్రాలున్నాయి. అయితే వీటిలో పార్ట్టైమ్ వైద్యులతో నిర్వహించేలా నిబంధనలున్నాయి. దీంతో తక్కువ వేతనానికి పట్టణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులు కరువవడంతో అవన్నీ మూతపడే దశకొచ్చాయి. తాజాగా ఈ ఏడు పట్టణ ఆరోగ్య కేంద్రాల(యూహెచ్సీ)ను పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్సీ)గా అప్గ్రే డ్ చేసింది. అంతేకాకుండా మరో ఐదు చోట్ల వీటిని మంజూరు చేసి పూర్తిస్థాయి సిబ్బందిని నియమించాలని ఆదేశించింది. కొత్తగా మంజూరైన యూపీహెచ్సీల్లో ఒక మెడికల్ ఆఫీస ర్, ఫార్మసిస్టు, స్టాఫ్ నర్సు, అకౌం టెంట్ ఉంటారు. ఈ కేంద్రాలు నిరంతరంగా పనిచేయాల్సి ఉంటుంది. త్వరలో పోస్టు భర్తీ..: కొత్తగా ఏర్పాటుకానున్న యూపీహెచ్సీలకు సం బంధించి మొత్తంగా 48 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఈ మేరకు జిల్లా వై ద్య, ఆరోగ్య శాఖ నోటుఫైలు తయా రు చేసింది. తొలుత వీటిని కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇందు కు సంబంధించిన ఫైలును ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖ కలెక్టర్కు అందజేసింది. ఫైలుకు ఆమోదం వచ్చిన వెం టనే జిల్లాస్థాయిలో ప్రత్యేకంగా నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు ‘సాక్షి’తో పేర్కొ న్నాయి. -
బయోమెట్రిక్ తప్పనిసరి
డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ అనంతపురం మెడికల్ : జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అని డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ అన్నారు. ప్రతి క్లస్టర్ ఆఫీసర్ పీహెచ్సీలను తనిఖీ చేసి హాజరును పరిశీలించాలన్నారు. తన చాంబర్లో బుధవారం డిప్యూటీ డీఎంహెచ్ఓలు, ప్రోగ్రాం ఆఫీసర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రతి ఆస్పత్రిలో రోగులకు అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచాలన్నారు. ఫార్మసిస్టులు తా ము ఇచ్చిన మందుల వివరాలు కంప్యూటర్లో నమోదు చేయాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వడదెబ్బ, మృతుల వివరాలను ప్రతి రోజూ పంపాలన్నారు. వైద్యాధికారులు, సూపర్వైజర్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, వడదెబ్బ మృతులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎన్హెచ్ఎం డీపీఎం డాక్టర్ అనిల్కుమార్, డీసీటీఓ డాక్టర్ సుధీర్బాబు తదితరులు పాల్గొన్నారు. -
వైద్యులకు వేతనాల్లేవ్ !
కాంట్రాక్టు వైద్యులకు 9 నెలలుగా అందని వేతనాలు చెప్పుకోలేక ప్రత్యామ్నాయం చూసుకుంటున్న డాక్టర్లు పట్టించుకోని ప్రభుత్వం తిరుపతి: జిల్లాలోని వివిధ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు వైద్యాధికారులకు గత తొమ్మిది నెలలుగా జీతాలు అందలేదు. 2014లో జిల్లాలోని 40 పీహెచ్సీల్లో డాక్టర్ల కొరత ఉండటాన్ని గుర్తించిన ప్రభుత్వం రెండు విడతలుగా కాంట్రాక్టు పద్ధతిలో 40 వుందిని నియుమించింది. 2014 డిసెంబర్లో మొదటి విడతలో 32 వుంది వైద్యాధికారులను నియమించింది. 8 వుందికి 2015 జూన్లో పీహెచ్సీ వైద్యులకు జీతాలు కరువు రెండో విడతలో పోస్టింగ్ ఇచ్చింది. డాక్టర్లకు ప్రతి నెలా జీతం ఇవ్వనున్నట్లు నియామక ఉత్తర్వుల్లో పేర్కొంది. గ్రామీణ ప్రజలకు సేవచేసే అవకాశం దక్కిందనే ఆశలో వైద్యులు ప్రభుత్వ వైద్యాధికారులుగా విధుల్లో చేరారు. మొదటి విడతలో చేరిన 32 వుందికి డిసెంబర్ 2014 నుండి మే 2015 వరకు ఆరు నెలల జీతం జనవరి 2016లో విడుదల చేశారు. మే 2015 కు సంబంధించిన ఒకనెల జీతం ఫిబ్రవరి 2016లో ప్రభుత్వం డాక్టర్ల ఖాతాల్లో జవుచేసింది. ఆ తరువాత గత తొమ్మిది నెలలకు సంబంధించి కాట్రాక్టు వైద్యాధికారులకు జీతాలు విడుదల చేయులేదు. ఇక 2015 జూలైలో రెండో విడతలో నియుమించిన 8 వుంది వైద్యాధికారులకు ఇప్పటివరకు కనీసం ఒక్క రూపారుు కూడా అందలేదు. ఈ సవుస్యతో మొదటి విడతలో చేరిన 32 వుందిలో 14 వుంది వైద్యులు తవు దారి చూసుకుని వెళ్లిపోయారు. ప్రస్తుతం వారిలో కేవలం 18 వుంది వూత్రమే మిగిలారు. అలాగే రెండో విడతలో చేరిన 8 వుందిలో ప్రస్తుతం ఏడుగురు వూత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రజాసేవకు వస్తే అవవూనిస్తారా? లక్షల రూపాయలు ఖర్చుచేసి చదువుకుని గ్రామీణ ప్రజలకు సేవ చేయూలనే ఉద్దేశంతో ప్రభుత్వ వైద్యాధికారులుగా విధుల్లో చేరితే తవుకు నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా అవవూనిస్తున్నారని వైద్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే ప్రభుత్వం తవును పొవ్మునలేక పొగపెట్టేలా ఉందని వారు వాపోతున్నారు. ఇప్పటికే 40 వుందిలో 15 వుంది వెళ్లిపోయూరని, పరిస్థితి ఇలాగే కొనసాగిస్తే వురికొంతవుంది వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకారుులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నియామక ఉత్తర్వుల్లో ఇచ్చిన మేరకు ప్రతినెలా జీతాల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టు వైద్యులు కోరుతున్నారు. త్వరలో సమస్య పరిష్కారం కాంట్రాక్టు వైద్యుల జీతాల సమస్యను పబ్లిక్ హెల్త్ డెరైక్టర్ డాక్టర్ అరుణకుమారి దృష్టికి తీసుకెళ్లాను. ఆమె ఆదేశాల మేరకు ప్రతిపాదనలు పంపాను. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుంది. డాక్టర్లకు జీతాలు అందుతాయి. - డాక్టర్ కోటీశ్వరి, జిల్లా వైద్యశాఖ అధికారి, చిత్తూరు. -
మహిళలకు ఉచిత ఆల్ట్రాస్కానింగ్ పరీక్షలు
శాసనమండలిలో మంత్రి కామినేని ప్రకటన సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మహిళలకు ఉచిత ఆల్ట్రా స్కానింగ్ పరీక్షల సౌకర్యం అందుబాటు తీసుకురాబోతున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు మంగళవారం శాసన మండలిలో ప్రకటించారు. నెల రోజుల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ప్రభుత్వ వైద్య ఆరోగ్య పాలసీపై చేపట్టిన స్వల్పకాలిక చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. గ్రామాల్లో సబ్సెంటర్లు- అంగన్వాడీ కేంద్రాల కలిసి పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎక్కువ ప్రసవాలు జరుగుతున్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. చిత్తూరు ఆసుపత్రిని అపోలో సంస్థకు అప్పగించినప్పటికీ, వారు రోగుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయడానికి అనుమతి లేదన్నారు. మిగిలిన ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రక్రియను ఆపేశామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తూ ప్రైవేటు క్లీనిక్లు నడుపుతున్న డాక్టర్లు 600 మందిని గుర్తించి తొలి హెచ్చరికగా వారందరి జీతాల నుంచి మూడు ఇంక్రిమెంట్లు చొప్పున కోత పెట్టినట్లు మంత్రి తెలిపారు. -
భౌబోయ్
♦ గ్రామసింహాల స్వైరవిహారం ♦ తీవ్రమవుతున్న బెడద ♦ ఆస్పత్రులకు పెరుగుతున్న కుక్కకాటు కేసులు ♦ హడలిపోతున్న జనం సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో 48 ప్రా థమిక ఆరోగ్య కేంద్రాలు, 11 సివిల్ ఆస్పత్రులున్నాయి. తాండూరు జిల్లా ఆస్పత్రి, కొండాపూర్, వనస్థలిపురం ప్రాంతీయ ఆస్పత్రుల్లో కుక్కకాటు కేసులను పరిశీలిస్తారు. జిల్లాలో ఏడాదిలో ఇప్పటివరకు ఏకంగా 5,200 కేసులు నమోదైనట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇవి ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదైన కేసులు మాత్రమే. ఇవి కాకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కేసులు నమోదవుతున్నప్పటికీ వైద్య, ఆరోగ్య శాఖ ఈ గణాంకాలను పరిగణలోకి తీసుకోవడం లేదు. కుక్కకాటుతో కలిగే ఇన్ఫెక్షన్తో జిల్లాలో ఇప్పటివరకు 38 మంది మృత్యువాత పడ్డారు. బడ్జెట్ సాకుగా చూపుతూ.. కుక్కకాటుకు సంబంధించి ఏఆర్వీని ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తుంది. ఆస్పత్రిస్థాయిలో ప్రత్యేకంగా నిధులను సైతం కేటాయిస్తుంది. జిల్లాలో పలు గ్రామీణ ప్రాంత ఆస్పత్రుల్లో ఏఆర్వీ అందుబాటులో లేదు. అత్యవసర చికిత్స కింద ఏఆర్వీ అందుబాటులో పెట్టాల్సిందిగా వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేస్తున్నప్పటికీ.. జిల్లా వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్లో దాదాపు 5,500 యూనిట్ల ఏఆర్వీ స్టాకు ఉన్నప్పటికీ.. పలువురు మెడికల్ ఆఫీసర్లు వీటిని తీసుకెళ్లకపోవడంతో సీడీఎస్లో స్టాకు మూలుగుతోంది. బెంబేలెత్తిస్తున్న వీధి కుక్కలు తాండూరు రూరల్: వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. అడ్డువచ్చినవారినల్లా మీదపడి రక్కేస్తున్నాయి. గుంపులుగా చేరి ఒంటరిగా ఉన్న చిన్నారులపై దాడులు చేస్తున్నాయి. వీటి బారినపడిన ఎంతోమంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జనవరిలో జిల్లా ఆస్పత్రిలోని అత్యవసర విభాగంలో 80 కేసులు, ఫిబ్రవరి 18వ తేదీ వరకు 43 కేసులు నమోదైనట్లు సిబ్బంది తెలిపారు. ఇక ఓపీలో జనవరిలో 100 నుంచి 200 వరకు, ఫిబ్రవరిలో ఇప్పటి వరకు 70 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉం దో అర్థం చేసుకోవచ్చు. డివిజన్ నుంచి జిల్లా ఆస్పత్రికి నిత్యం పదుల సంఖ్యలో కుక్కకాటు బాధితులు వస్తున్నారు. పట్టణంలో 1000 నుంచి 1500 వరకు కుక్కలున్నట్లు అంచనా. ప్రజల నుంచి రోజూ ఫిర్యాదులు వస్తున్నాయని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ప్రాణపాయం నుంచి బయటపడి.. యాలాల మండలం గొరెపల్లికి చెందిన బుట్ల నర్సప్ప, నర్సమ్మ దంపతులు. వారం రోజుల క్రితం నర్సమ్మ కుమారుడు నవీన్కుమార్ (5)ను తీసుకొని వారి పొలంలో వరినాట్లు వేసేందుకు వెళ్లింది. బాలుడు పొలం గట్టుమీద ఆ డుకుంటుండంగా ఓ వీధికుక్క దాడిచేసింది. తల్లి తేరుకునేలోపే బాలుడి చెం పభాగంలో తీవ్ర గాయాం చేసి ఉడాయించింది. వెంటనే తల్లిదండ్రులు బాలుడిని తీసుకొని తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన వైద్యులు వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్లోని ఫీవర్ ఆస్పత్రికి రిఫర్ చేశా రు. బాలుడి తల్లిదండ్రులు హైదరాబా ద్ తీసుకెళ్లి వైద్యం చేయించుకున్నారు. అందుబాటులో వ్యాక్సిన్... జిల్లా ఆస్పత్రిలో యాంటీరేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. కుక్కకాటు తర్వాత ప్రథమ చికిత్సలో భాగంగా సబ్బుతో పది నిమిషాల వరకు గాయం వద్ద కడగాలి. ఆ తర్వాత ఆస్పత్రికి తీసుకురావాలి. 3 నుంచి 5 డోసుల వరకు వ్యాక్సిన్ ఇప్పించాలి. మెదడు పైభాగంతో పాటు ముఖం, చేతులకు పెద్ద కాట్లు ఉంటే ఇమినోగ్లోబిన్ వ్యాక్సిన్ ఇప్పించాలి. ఈ వ్యాక్సిన్ తెలంగాణలో ఒక్క ఫీవర్ ఆస్పత్రిలోనే దొరుకుతుంది. - భాగ్యశేఖర్, సూరింటిండెంట్, జిల్లా ఆస్పత్రి పాదచారులకు దడ తాండూరు: గ్రామసింహాల బెడదతో పట్టణవాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల పట్టణంలోని పలు ప్రాంతాల్లో శునకాల సమస్యతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో పాదచారులపై దాడికి పాల్పడుతున్నాయి. గాయపడ్డ వారు పట్టణంలోని జిల్లా ఆస్పత్రితోపాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. పట్టణంలోని పాత తాండూరు, పాత, కొత్త కూరగాయల మార్కెట్, యశోధనగర్, రహమత్నగర్ తదితర ప్రాంతాల్లో శునకాల బెడద తీవ్రంగా ఉందని ఆయా ప్రాంతాల నుంచి మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ ప్రాంతాల్లో మాంసం వ్యర్థాలను తింటున్న కుక్కలు స్థానికులపై దాడికి దిగుతున్నాయని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువస్తున్నారు. ఈనేపథ్యంలో మున్సిపల్ శానిటేషన్ విభాగం అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు. కుక్కలకు మత్తు ఇంజెక్షన్లు ఇస్తూ వాటిని పట్టణానికి దూరంగా వదిలేస్తున్నట్టు మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ తెలిపారు. మాంసం వ్యర్థాలు రోడ్ల పక్కన పడేయరాదని దుకాణదారులకు సూచించినట్టు చెప్పారు. కుక్కల దాడిలో గాయపడ్డ వారికి చికిత్స అందించేందుకు యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని జిల్లా ఆస్పత్రి డ్రగ్స్ స్టోర్ ఇన్చార్జి మహేష్ తెలిపారు. అందుబాటులో లేని వ్యాక్సిన్ ఘట్కేసర్: మండలంలోని నారపల్లి ప్రాథమిక ఆస్పత్రిలో యాంటీ రేబీస్ వ్యాక్సిన్ (ఏఆర్వీ) 15రోజులుగా అందుబాటులో లేదు. వాక్సిన్ నిమిత్తం వచ్చిన వారిని మండల కేంద్రంలోని వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రికి పంపుతున్నారు. వాక్సిన్లు లేని విషయం స్థానిక వైద్యులు జిల్లా అధికారులకు సమాచారమిచ్చారు. గత పదినెలల్లో 132 వ్యాక్సిన్లు అందజేసినట్లు తెలిపారు. మండలకేంద్రానికి వెళ్లడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సమయం, డబ్బు వృథా అవుతోందన్నారు. బయటికి వెళ్లాలంటే భయమే.. ఇబ్రహీంపట్నం : పట్నం నగర పంచాయతీ పరిధిలో ఎటు చూసినా వీధి కుక్కలు స్వైర వి హారం చేస్తున్నాయి. ప్రతి కౌన్సిల్ సమావేశం లో కుక్కల బెడదపై చర్చ వస్తుండడమేగాని సమస్య పరిష్కారానికి మాత్రం నోచుకోవడం లేదు. రోజుకు రెండు నుంచి మూడు కేసులు, నె లకు 60 నుంచి 70 మంది కుక్కకాటుకు గురై ఆ స్పత్రికి వస్తున్నట్లు ప్రభుత్వ వైద్యాధికారులు తెలిపారు. మరీ ఎక్కుగా గాట్లు పడిన బాధితులను నగరంలోని నారాయణగూడ ఐపీఎం, ఫీవర్ ఆస్పత్రులకు పంపుతున్నారు. ఇబ్రహీంపట్నానికి చెందిన సాయిలు ఇటీవల కుక్కకాటు బారినపడ్డాడు. రాత్రివేళ ఇంటికి భయంతో వెళ్లాల్సి వస్తోందని వాపోయాడు. కుక్కలు ఎటు నుంచి వచ్చి దాడిచేస్తాయోనని బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోందంటున్నాడు. సత్వర చికిత్స.. కుక్కకాటుకు గురైన వారికి చికిత్స అందించేందుకు మందులు అందుబాటులో ఉన్నాయి. ముఖం, మెడపై కుక్క కరిస్తే దాని ప్రభావం మెదడుపై పడకుండా సత్వర చికిత్స కోసం నగరంలోని నారాయణగూడ, ఫీవర్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నాం. - డాక్టర్ శ్రీనివాస్, డిప్యూటీ సివిల్ సర్జన్ మేడ్చల్లో తీవ్రమవుతున్న బెడద మేడ్చల్: వీధి కుక్కల బెడద పట్టణంలో రోజురోజుకూ తీవ్రమవుతోంది. పట్టణంలోని కింది బస్తీ, వీకర్సెక్షన్, ఉవూనగర్, ఆర్టీసీ కాలనీ, చంద్రనగర్, సూర్యనగర్, బాలాజీనగర్ కాలనీల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. చిన్నపిల్లలు, వుహిళలు, వృద్ధులు వీధుల్లోకి రావాలంటేనే హడలిపోతున్నారు. కాలనీల్లో చి న్నపిల్లలను ఒంటరిగా వదిలిపెట్టాలన్నా, కొత్తవారు కాలనీ లకు రావాలన్నా జంకుతున్నారు. రెండు నెలల క్రితం ఉవూనగర్లో ఇంటికి వెళ్తున్న తల్లీబిడ్డలను కరిచాయి. వుూడు నెలల క్రితం జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలకు చెం దిన ఓ బాలుడు కుక్కకాటు బారిన పడ్డాడు. పట్టణ పరిధిలో రోజుకు కనీసం మూడు వరకు కుక్కకాటు కేసులు నమోదవుతున్నారుు. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉండడంతో తక్షణ చికిత్స లభిస్తోంది. ఎక్కడ చూసినా అంతే.. ఏ వీధిలోకెళ్లినా కుక్కలు గుంపులుగా కనిపిస్తున్నా యి. రాత్రివేళ వెంటబడి త రువుుతున్నారుు. కాలనీల్లో ఇళ్ల వుుందు ఆడుకుంటున్న చిన్నపిల్లలను కరుస్తున్నాయి. -ఆకుల ప్రభాకర్, మేడ్చల్ పరిష్కరిస్తాం.. పట్టణంలో కుక్కల బెడద ఉందని దృష్టికి వచ్చింది. సవుస్యను పరిష్కరించడానికి జీహెచ్ఎంసీ అధికారులతో వూట్లాడాం. వారి స హకారంతో వారం రోజుల్లో వాటి బెడదను నివారిస్తాం. -రామిరెడ్డి, మేడ్చల్ నగరపంచాయుతీ కమిషనర్ -
సర్కార్ సొమ్ము.. ప్రైవేట్ సోకు
సాక్షి, హైదరాబాద్: పీహెచ్సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడమేకాకుండా వాటికి ప్రభుత్వం సొమ్ము ధారాదత్తం చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, మరో రెండు పట్టణ ఆరోగ్య కేంద్రాలను ‘ఈ-వైద్య’ అనే సంస్థ చేతిలో పెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇది ప్రైవేటీకరణ కాదని, కేవలం స్వచ్ఛంద సంస్థలకే ఇస్తున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెబుతున్నా సిబ్బంది నమ్మడంలేదు. పీహెచ్సీని ప్రైవేట్ సంస్థకు అప్పగించాక ప్రభుత్వం సంబంధిత సంస్థకు ప్రారంభంలో ఏకమొత్తంగా రూ. 8 లక్షల చొప్పున కట్టబెట్టాలని యోచిస్తోంది. ఆ సొమ్ముకు లెక్కాపత్రాలుండవు. ఈ నిధులతో రిసెప్షన్ కౌంటర్, అందమైన బోర్డుల ఏర్పాటు, పీహెచ్సీని ఆధునీకరణ వంటివి చేస్తారు. ఒక రిసెప్షనిస్టును కూడా నియమించే అవకాశం ఉంది. ఇదిగాక నెలవారీ మందులు, నిర్వహణ ఖర్చుల కింద రూ.4.65 లక్షలు ప్రైవేటు సంస్థకు కట్టబెడతార ని తెలిసింది. ఆ సంస్థ నియమించే వైద్యులు, పారామెడికల్, ఇతర సిబ్బంది వేతనాలను ఇందులోంచి ఇస్తారని అంటున్నారు. ప్రజల నుంచి కనీస రుసుం కూడా వసూలు చేసే అవకాశముందని పేర్కొంటున్నారు. ఇతర వైద్యసేవలపై ప్రభావం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రోజువారీ వైద్యసేవలకే పరిమితం కాకుండా వ్యాక్సినేషన్లు, ఇతర వైద్య సేవలను చేపడుతుంటాయి. ప్రైవేటీకరణ చేస్తే ఆ సేవలపైనా ప్రభావం పడుతుందని, ఆ సేవలకు కూడా అదనంగా సొమ్ము వసూలు చేసే ప్రమాదముందని పీహెచ్సీ సిబ్బంది అంటున్నారు. ఇప్పటికే పీహెచ్సీల్లో పనిచేసే ప్రభుత్వ డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిని తొలగించి ప్రైవేటు సంస్థ సొంత నియామకాలు చేపట్టే అవకాశముందని ఉద్యోగులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పీహెచ్సీల్లో సిబ్బంది రెండింతలు
♦ తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి ♦ త్వరలో సమగ్ర నూతన వైద్య విధానం ఆవిష్కరణ ♦ నేడు మంత్రివర్గ ఉపసంఘం మొదటి భేటీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వైద్య ఆరోగ్యరంగాన్ని మరింత పరిపుష్టం చేయాలని సర్కారు యోచిస్తోంది. అందుకోసం సమగ్ర వైద్య విధానాన్ని రూపకల్పన చేసే పనిలో నిమగ్నమైంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) మొదలు జిల్లాస్థాయిలోని ప్రభుత్వ ఆసుపత్రుల వరకు అన్నింటినీ సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా సర్కారు అడుగులు వేస్తోంది. పారిశుద్ధ్యం, అధునాతన వైద్య పరికరాల ఏర్పాటు, అదనపు వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది సహా అన్నింటినీ కల్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ వైద్యాన్ని కల్పించాలన్న కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యరంగంపై ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అధ్యక్షతన మరో ఇద్దరు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఉపసంఘం మొదటి సమావేశం గురువారం జరగనుంది. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు వైద్యరంగంపై వాస్తవ పరిస్థితిని ఉపసంఘం సభ్యులకు వివరిస్తారు. ఆ తర్వాత మూడు నాలుగుసార్లు సమావేశం నిర్వహించి నివేదిక తయారుచేస్తారు. ఆ నివేదికను ముఖ్యమంత్రికి సమర్పిస్తారు. ఇదీ సర్కారు ఆలోచన.. ప్రతీ జిల్లాలో వెయ్యి పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని సర్కారు ఆలోచన. 20 వేల నుంచి 25 వేల జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలని, ప్రతీ నియోజకవర్గంలో వంద గ్రామాలకు ఉపయోగపడేలా ఏరియా ఆసుపత్రి ఉండాలనేది ఉద్దేశం. రెవెన్యూ జిల్లాల ప్రాతిపదికన కాకుం డా భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ఆరోగ్య జిల్లాలను ఏర్పాటు చేయాలని కూడా యోచిస్తున్నారు. పీహెచ్సీలను 30 పడకల ఆసుపత్రులుగా, ఏరియా ఆసుపత్రులను 100 పడకల ఆసుపత్రులుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ ఆసుపత్రులను రెండు వేల పడకల ఆసుపత్రులుగా అభివృద్ధి చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి వైద్యులు, ఇతర సిబ్బంది ఎందుకు ముందుకు రావడం లేదో పరిశీలి స్తారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకం ఇచ్చే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. 104, 108 సేవలు కూడా ప్రభుత్వ వైద్యంతో కలిసే ఉండాలనేది స ర్కారు ఆలోచన. ప్రభు త్వ వైద్యాన్నంతా ఒకే గొడుగు కిందకు తీసుకురావాల్సిన అవసరాన్ని సర్కారు గుర్తించింది. మొత్తంగా వైద్య ఆరోగ్య శాఖను ప్రక్షాళన చేయాలని సీఎం ఆలోచన. ఈ విషయంలో మంత్రివర్గ ఉపసంఘం లోతుగా అధ్యయనం చేస్తుంది. కింది స్థాయి వరకు ఐసీయూ యూనిట్లు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ వైద్యం కునారిల్లింది. వైద్యులు లేక... ఉన్నవారు రాక... మందులు అందుబాటులో లేక ప్రజలు సాధారణ వెద్యానికి దూరమయ్యారు. ఈ నేపథ్యంలో పీహెచ్సీల్లో సిబ్బందిని రెండింతలు చేసే అంశంపై సర్కారు ఒక అంచనా వేసింది. ప్రస్తుతం తెలంగాణలో పీహెచ్సీల్లో 8,937 మంది వైద్య సిబ్బందికి గాను... 6,658 మందే పనిచేస్తున్నారు. 2,279 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని నింపినా మరో 2,088 మంది వైద్య సిబ్బంది కావాలి. ప్రభుత్వం నూతన వైద్య విధానాన్ని ఆవిష్కరించి అందుకనుగుణంగా తీర్చిదిద్దాలంటే ఆ సంఖ్య సరిపోదు. ఇప్పుడున్న వైద్య సిబ్బందికి తోడు మరో 7,221 మంది అవసరమవుతారని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేసింది. అలాగే కిందిస్థాయి వరకు ఐసీయూ యూనిట్లను ఏర్పాటు చేయాలనేది సర్కారు ఉద్దేశం. ఈ విధంగా చేసినప్పుడే ప్రభుత్వం తాను అనుకున్న స్థాయిలో వైద్యాన్ని ప్రజల చెంతకు తీసుకెళ్లగలదు. -
‘ప్రాథమిక’మే ప్రథమం!
ఇదీ ఏడు చేపల కథే. కాకపోతే ఇవన్నీ రాజకుమారులు వేటాడేసి.. ఎండలో పెట్టిన చిన్న చేపలు కావు. దేన్నయినా అమాంతం మింగేసే షార్క్లు! ప్రైవేటు వైద్య కళాశాలల నుంచి మొదలుపెడితే... ప్రభుత్వాసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ఫార్మా కంపెనీలు, నియంత్రణ వ్యవస్థలు, బీమా కంపెనీలూ అన్నీ షార్క్లే. తినటానికి అలవాటుపడ్డవే. ఎండకపోవటానికి చిన్నచేపలు సాకులు చెబితే.. ఇవి మాత్రం మా నోటి దగ్గరకు వస్తే తినకుండా వదిలిపెడతామా? అని ఎదురు ప్రశ్నిస్తాయి. మరి వీటి రోగం కుదిరేదెలా? వాణిజ్య కేంద్రాలుగా మారిపోయిన వైద్యాలయాల్ని మార్చటమెలా? ఈ వైద్య విధ్వంసాన్ని ఆపటమెలా? ఐదు రోజులుగా ఈ విషయమై ‘సాక్షి’ ప్రచురిస్తున్న కథనాలకు వచ్చిన స్పందన అనూహ్యం. పలువురు తమకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ఆసుపత్రుల ధనదాహాన్ని కళ్లకు కట్టారు. కొందరు సూచనలూ చేశారు. స్థలాభావం వల్ల అన్నిటినీ ప్రచురించటం అసాధ్యం. అందుకే అత్యధికుల సూచనల ఉమ్మడి సారాంశం ప్రచురిస్తున్నాం. - సాక్షి ప్రత్యేక బృందం * ‘వైద్య విధ్వంసం’కు ఇదే ప్రథమ చికిత్స * ‘సాక్షి’ వరుస కథనాలకు విశేష స్పందన * అన్ని వర్గాల నుంచి సూచనల వెల్లువ పీహెచ్సీలే కీలకం ఈ విధ్వంసానికి ప్రథమ చికిత్స చేయాలంటే తొలుత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్ని పటిష్టం చేయాలన్నది నిష్ఠుర సత్యం. దగ్గర్లో చక్కని వసతులు, వైద్యుడు అందుబాటులో ఉంటే చాలా సమస్యలు అక్కడే పరిష్కారమైపోతాయి. కానీ ఇపుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్ని చూస్తే... ఎక్కడా కనీస మందులు కూడా అందుబాటులో ఉండడం లేదు. వైద్యుడు అందుబాటులో ఉండటమూ కష్టమే. ఇక పరికరాల ఊసెత్తకపోతేనే మంచిది. అందుకే ఏ చిన్న జ్వరం, దగ్గు, జలుబుకైనా పెద్దాసుపత్రికో, డబ్బులుంటే ప్రైవేటు ఆసుపత్రికో పరుగెత్తాల్సిన దుస్థితి. దీనికితోడు ఇటీవల బాగా పెరిగినజాఢ్యం ఏమిటంటే నేరుగా స్పెషలిస్టుల్ని సంప్రతించటం. చిన్నచిన్న నొప్పులొచ్చినా, ఒంట్లో నలతగా ఉన్నా మొద ట సంప్రతించాల్సింది జనరల్ ఫిజీషియన్నే. కొన్ని జ్వరాలు, చిన్నచిన్న నలతలు వచ్చి నిర్ణీత కాలంలో తగ్గిపోతాయి. ఇది గ్రహించేది ఫిజీషియన్ మాత్రమే. అప్పటికీ తగ్గకుంటే సదరు ఫిజీషియనే ఏ స్పెషలిస్ట్ను సంప్రతించాలో రిఫర్ చేస్తాడు. కానీ చెయ్యి నొప్పి వస్తోందంటే నేరుగా ఆర్థోపెడిక్నో, న్యూరాలజిస్ట్నో, ఛాతీలో కాస్తా నొప్పిగా అనిపిస్తే నేరుగా కార్డియాక్ విభాగానికి వెళ్లడం చేస్తున్నారు. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఫిజీషియన్ను సంప్రతించినప్పుడు... తనకు పెట్టిన టార్గెట్ మేరకు ఆ ఫిజీషియన్ వారిని అవసరం లేకపోయినా స్పెషలిస్ట్ల దగ్గరకు పంపిస్తున్న సందర్భాలూ లేకపోలేదు. కాకపోతే ఇలా జరిగేది తక్కువసార్లు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పటిష్టంగా ఉంటే... అక్కడి ఫిజీషియన్ల చేతుల్లోనే చాలా సమస్యలు పరిష్కారమవుతాయన్నది చాలామంది వ్యక్తంచేసిన అభిప్రాయం. అందరికీ బీమా ధీమా ఉండాలి... ఇప్పుడు ఆరోగ్య శ్రీ కింద... ప్రభుత్వ హెల్త్ కార్డుల కింద బీమా పొందినవారు... ప్రైవేటు బీమా కంపెనీల నుంచి నేరుగా బీమా తీసుకున్నవారు... తాము ఉద్యోగం చేసే ఆఫీసుల ద్వారా బీమా పొందినవారు.. ఇలా అందరినీ కలిపినా ఇంకా చాలామంది బీమా లేనివారు ఉంటున్నారు. ఇలా కాకుండా ప్రభుత్వమే నామమాత్రపు ప్రీమియంతో ప్రజలందరికీ సామాజిక బీమాను తప్పనిసరి చేయాలన్నది మరో సూచన. డబ్బున్నవారు, లేనివారు, ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ ఈ బీమా పరిధిలో ఉండేలా ప్రభుత్వమే చొరవచూపాలి. అప్పుడు ప్రతి ఒక్కరికీ తనకేం జరిగినా బీమా ఉందనే భరోసా ఉంటుంది. ప్రభుత్వం తరఫున చికిత్స అందుతుందనే నమ్మకం ఉంటుంది. ఈ బీమా సరిపోదనుకునే వారు, కాస్త స్థితిమంతులు వేరే బీమా చేయించుకోవచ్చు. అలా చేస్తే ఈ సామాజిక బీమాలో క్లెయిముల సంఖ్య తక్కువే ఉంటుంది. ఫలితంగా బీమా కంపెనీలు తిరస్కరించటం, ఆసుపత్రులు కూడా అనుచిత విధానాలకు పాల్పడటం వంటివి కూడా తక్కువే ఉంటాయి. డాక్టర్లు అందరిలాంటి వారేనా? డాక్టర్లూ అందరిలాంటి వారేనని, ఇక్కడ కూడా మిగతా రంగాల మాదిరిగా కొందరు తప్పులు చేయొచ్చని, అవినీతికి పాల్పడే అవకాశం ఉందని కొందరు వైద్యులు వ్యక్తం చేసిన అభిప్రాయంతో సామాన్యులు ఏకీభవించలేదు. ‘‘ఒక ఐటీ ఉద్యోగితో డాక్టర్లను పోల్చలేం. ఎందుకంటే ఐటీ ఉద్యోగి పడే కష్టం ఎక్కడో జీడీపీలో కనిపిస్తుంది. కానీ డాక్టరు కష్టం రోగుల మొహాల్లో కనిపిస్తుంది. ఒక వ్యక్తి తన శరీరాన్ని కోయటానికి ఎవరికైనా అనుమతిస్తాడంటే... అది డాక్టరుకే. అలాంటి డాక్టరు తప్పు చేస్తే ప్రాణాలు పోతాయి’’ అనేది మెజారిటీ మాట! వైద్యుడి హిస్టరీ కనిపించదేం? మనం డాక్టర్ల దగ్గరకు వెళ్లేటపుడు వారినో, వీరినో అడిగో లేదా వారికున్న మంచిపేరు చూసో వెళ్తుంటాం. కానీ వాస్తవంగా ఆ డాక్టరు అప్పటిదాకా చేసిన ఆపరేషన్లెన్ని? అందులో విజయవంతమైనవెన్ని? పేషెంట్లు సదరు డాక్టరు విషయంలో ఏం చెప్పారు? ఇలాంటి హిస్టరీ ఎక్కడా కనిపించదు. ఏ ఆసుపత్రీ చెప్పదు కూడా. రూ.100 పెట్టి సినిమా చూసినప్పుడో, ఓ రెస్టారెంట్లో భోజనం చేసేటప్పుడో అది బాగుందో లేదో తెలుసుకునే అవకాశం ఉన్నపుడు... తన ప్రాణాన్ని అప్పగించే రోగికి తనకు వైద్యం చేసే వైద్యుడి వృత్తిగత చరిత్ర తెలియజేస్తే తప్పా? ఇందుకు రోగుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవటం, దాన్ని నిజాయితీగా ప్రదర్శించటం వంటివి ఆసుపత్రులు చేసి తీరాలన్నది పలువురి లేఖల్లో వ్యక్తమైంది. ఇక ఎన్నికల ముందు అన్ని అంశాలనూ చర్చించే రాజకీయ పార్టీలు... వైద్యంపై తమ విధానాన్ని ప్రకటించాలన్నది మరికొందరి భావన. వాణిజ్య శక్తులపై గట్టి నియంత్రణ! మొత్తంగా వైద్యంపై పటిష్ఠమైన నియంత్రణ ఉండాలని అందరూ ముక్తకంఠంతో చెప్పారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న నియంత్రణ వ్యవస్థలది ఏనుగులు స్వైర విహారం చేస్తుంటే.. ఎలుకల కోసం నిఘా వేసే స్థాయి. రాష్ర్టంలో ప్రైవేటు ఆస్పత్రుల ఏర్పాటు, నిర్వహణ కోసం 2007లో ఏపీ అలోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ను తెచ్చినా... ఇది కేవలం ఆస్పత్రుల ఏర్పాటు, లెసైన్సులు, రెన్యువల్ వంటి అంశాలకే పరిమితమవుతోంది. బాధిత రోగులకు అన్యాయం జరిగినప్పుడు ఆయా ప్రైవేటు ఆస్పత్రులపై ఏ చర్యలు తీసుకోవాలన్నది ఏ చట్టంలోనూ లేదు. అలోపతిక్ ఆస్పత్రులను మాత్రమే కవర్ చేసే ఈ చట్టం పరిధిలో... ఐదుగురు సభ్యులతో కూడిన రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలున్నా వీటికెలాంటి అధికారాలూ లేవు. ఇక ఆసుపత్రులపై ఫిర్యాదుల్ని చూసేది జిల్లా వైద్యాధికారి. అప్పిలేట్ అథారిటీ అధికారిగా వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఉంటున్నారు. ప్రతి ఆసుపత్రీ... ఏ చికిత్సకు ఎంత రేటు వసూలు చేస్తున్నారో తెలుగు, ఇంగ్లిషు భాషల్లో నోటీసు బోర్డులో విధిగా చూపించాలన్నది ఈ చట్టం పెట్టిన నియమం. కానీ దీన్ని పాటిస్తున్న ఆసుపత్రులు ఒక్కటీ ఉండదు. ఒకవేళ దీనిపై జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేసినా... దిగ్గజాల్లాంటి కార్పొరేట్ ఆస్పత్రులపై ఆయన చర్యలు తీసుకుంటారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న! పరిహారం ఉండాలి.. నిషేధించాలి.. ‘కాసు’పత్రుల నియంత్రణకు జిల్లా స్థాయిల్లో బలమైన నియంత్రణ వ్యవస్థలుండాలని, ఒకవేళ వాటివల్ల జరిగిన పొరపాటు రుజువైతే సదరు ఆసుపత్రి భారీ పరిహారాలు చెల్లించటంతో పాటు మళ్లీ సేవ లందించకుండా నిషేధించాలనేది కొందరి సూచన. ఇటీవల దిల్సుఖ్నగర్లో జరిగిన సంఘటన చూస్తే... వైద్యుడి నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణం పోయింది. అది వైద్యుడి నిర్లక్ష్యమేనని తేల్చిన రాష్ట్ర వైద్య మండలి... తనను మందలించి వదిలిపెట్టింది. కానీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అప్పీ లు చేస్తే... అది ఆ డాక్టరును కొన్నాళ్లు వైద్యం చేయకుండా నిషేధించింది. ఇలా మందలించి వదిలిపెట్టే స్థాయిలో శిక్షలుంటే ఏ డాక్టరు భయపడతాడన్నది సమాధానం లేని ప్రశ్నే. ఈ పోరు కొనసాగిద్దాం.. ‘వైద్య విధ్వంసం’పై ఈ-మెయిల్స్, లేఖల రూపంలో అసంఖ్యాకంగా స్పందించిన పాఠకులందరికీ ధన్యవాదాలు. స్థలాభావం వల్ల కొన్నిటినే ఇక్కడ ప్రచురించినా... మిగిలిన వాటిని కూడా సందర్భానుసారం ప్రచురించే ప్రయత్నం చేస్తాం. మా దృష్టికి వచ్చిన సమస్యలు, పరిష్కారాల సూచనలతో తగు వినతిపత్రాన్ని కూడా ప్రభుత్వ యంత్రాంగానికి అందజేస్తాం. వైద్యానికి సంబంధించి ఏ సంఘటననైనా, ఏ అభిప్రాయాన్నయినా sakshihealth15@gmail.com ద్వారా మీరు ఎప్పుడైనా మా దృష్టికి తేవొచ్చు. వాటిని తగు వేదికపై ప్రస్తావిస్తాం. - ఎడిటర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణం ప్రభుత్వ ఆసుపత్రులను నిర్లక్ష్యం చేయటం ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణం. ప్రతి మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రిని నిర్మించాలి. ఆసుపత్రిలో అన్ని రకాల పరికరాలు, రోగికి కావాల్సిన సౌకర్యాలను అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వ వైద్యులు 24 గంటలూ అందుబాటులో ఉండేలా వారికి సమీపంలోనే క్వార్టర్స్ ఏర్పాటు చేయాలి. ప్రైవేటు ఆసుపత్రులలో జరిపే ప్రతి టెస్ట్కూ ప్రభుత్వమే ఫీజు నిర్ణయించాలి. - బి.శివప్రసాదం, పరకాల(వరంగల్) హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి చేయాలి హెల్త్ ఇన్సూరెన్స్ను ప్రభుత్వం తప్పనిసరి చేయాలి. ఉచితంగా కాకున్నా ప్రజలు- ప్రభుత్వం కలిసి 50-50 భాగస్వామ్యంతో దీన్ని కొనసాగించాలి. అప్పుడు సామాన్యులకు వైద్యమనేది భారం కాకుండా ఉంటుంది. - రమేష్, ఖమ్మం ప్రజారోగ్య సంరక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలి ‘వైద్య విధ్వంసం’పై సాక్షి పత్రికలో వస్తున్న వరుస కథనాలు అక్షర సత్యాలు. ప్రస్తుతం కార్పొరేట్ రంగంలోని వైద్యం గురించి చెప్పుకోవడం.. గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకున్న చందంగా ఉంటుంది. అది బాధాకరమైనా సత్యం! కార్పొరేట్ ఆసుపత్రుల్లో సమర్థులైన వైద్యులతో అధునాతన చికిత్స అందుతుందని భావిస్తాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ‘ఆరోగ్యశ్రీ’ పథకం.. ప్రతి ఒక్కరినీ అలాంటి చికిత్సకు అర్హుడిగా చేయడానికి వేసిన ఒక అడుగు. అయితే ఆ పథకాన్ని దుర్వినియోగం చేసి కొన్ని ఆసుపత్రులు తమ లాభార్జనకు వాడుకున్నాయనే విమర్శల్లో వాస్తవం లేకపోలేదు. ఈ పథకాన్ని లోపాలు లేకుండా అమలు చేయాలి. ప్రభుత్వం వివిధ స్థాయిల్లో పౌరసమాజ కమిటీలను నియమించాలి. నైతిక వర్తనతో ఉండే రిటైరైన ఉద్యోగులు, విశ్రాంత విద్యావంతులను, చదువుకున్న గృహిణులు, కొంత సమయం వెచ్చించగలిగే యువతీయువకులను అందులో భాగం చేయాలి. వీళ్లతో ‘ప్రజారోగ్య సంరక్షణ కమిటీ’లు ఏర్పాటు చేసి, వాటికి కొంత సాధికారిత కల్పిస్తే ఆరోగ్యశ్రీ పథకం సక్రమంగా అమలవుతుంది. - డాక్టర్ ఏపీ విఠల్, ప్రజావైద్యశాల వ్యవస్థాపకులు, సూర్యాపేట, నల్లగొండ జిల్లా అత్యవసర చికిత్స చేసే వైద్యులు ఎక్కడ? కోట్లు పెట్టి ఆసుపత్రులు పెట్టేవారు.. అత్యవసర సమయాల్లో చేసే చికిత్సలను పట్టించుకోవడం లేదు. ఉదాహరణకు కొన్ని సందర్భాల్లో ఊపిరి ఆగిపోయినప్పుడు.. రోగి ఊపిరితిత్తుల్లోనికి రెండు నిమిషాల్లోనే గొట్టం (ఎండోట్రాకియల్ ట్యూబ్) వేయగలిగే డాక్టర్ చాలా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండడం లేదు. డ్యూటీ నర్సుకు గానీ, డ్యూటీ డాక్టరుకు గానీ, స్పెషలిస్టు డాక్టర్లకుగానీ ఈ చికిత్స విధానాన్ని నేర్పరెందుకు? అన్ని ఆసుపత్రులు ఈ ట్యూబ్ను అమర్చగల నిపుణులనూ, ట్యూబ్నూ అందుబాటులో ఉంచుకోవాలి. ఏ వైద్య విధానానికి సంబంధించిన కోర్సు అయినా.. అది పూర్తయ్యేనాటికి ‘బేసిక్ లైఫ్ సపోర్టు’ (బీఎల్ఎస్), అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్టు (ఏసీఎల్ఎస్) అంశాలపై తర్ఫీదు ఇవ్వాలి. రోగులు సైతం.. అత్యవసర చికిత్స అందించగల నిపుణులు అందుబాటులో ఉన్నారా లేదా అని ఆసుపత్రుల యాజమాన్యాలను అడగాలి. - డాక్టర్ బ్రహ్మారెడ్డి, సూపరింటెండెంట్, ప్రజావైద్యశాల, జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపక సభ్యుడు, కర్నూలు అవి నిరూపితమయ్యే తప్పులు కావు అనవసరంగా పరీక్షలు రాయడం, రోగిని పిండుకోవడం వంటివి చెప్పుకోవడానికేగానీ వాటిని నిరూపించలేరు. ఆ టెస్టు ఎందుకు చేశారని అడిగితే... ‘ఆ పరీక్ష ద్వారా నే జబ్బు కనుక్కోవచ్చని అనుకున్నా’ అని వైద్యుడు అంటా డు. ఇది తప్పు అని చెప్పలేం. అయినా ప్రొసీజర్ ప్రొటోకాల్, స్టాండర్డ్ ట్రీట్మెంట్ గైడ్లైన్స్ వంటివి అమలు చేయకపోవడంతో ప్రశ్నించలేక పోతున్నాం. రోగి అవగాహన పెంచుకుని డాక్టరును ఎంపిక చేసుకోవాలి. అయినా హోటళ్లకు, హాస్పిటల్లకూ పెద్దగా తేడా ఉందని నేననుకోవడం లేదు. - డా.కె.వెంకటేష్, అదనపు వైద్య విద్యా సంచాలకులు, ఎంసీఐ మాజీ సభ్యుడు టార్గెట్లు ఉంటే నమ్మకమైన వైద్యం దొరకదు ప్రైవేటు ఆస్పత్రుల్లో స్టెంట్లు, ఇంప్లాంట్స్ వంటివాటితో రోగిని పీల్చేస్తున్నారు. ఇక్కడే రోగులు ఎక్కువగా నష్టపోతున్నారు. ప్రభుత్వాలు వీటిపై తక్షణమే వ్యయ నియంత్రణ (కాస్ట్ రెగ్యులేటరీ) చేయాలి. కార్పొరేట్ ఆస్పత్రులు విధించే బిజినెస్ టార్గెట్లతో రోగికి-వైద్యుడికి మధ్య నమ్మకమైన వైద్యం సాగడం సాధ్యం కాని పని. - డా.కె.రమేశ్రెడ్డి, పీడియాట్రిక్ ప్రొఫెసర్, ఎంసీఐ ఎథిక్స్ కమిటీ మాజీ సభ్యుడు -
‘స్వైన్ఫ్లూ’పై అప్రమత్తం
చిత్తూరు (అర్బన్): విశాఖపట్టణం, తెలంగాణ ప్రాంతాల్లో స్వైన్ఫ్లూ ప్రబలడంతో జిల్లా వైద్యశాఖ అప్రమత్తమయ్యింది. స్వైన్ఫ్లూ వ్యాధి లక్షణాలు కనిపించినా, ఎవరికైనా వ్యాధి సోకినా సరైన చికిత్స చేయించడానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని ఆరు ఆస్పత్రుల్లో ప్రత్యేక ఐసొలేటెడ్ వార్డులను ఏర్పాటుచేసింది. చిత్తూరు ప్రభుత్వాస్పత్రి, కుప్పం, మదనపల్లె, పలమనేరు, నగరి ఏరియా ఆస్పత్రులు, పీలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అధికారులు ఐసొలేటెడ్ వార్డులను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో చిన్నపిల్లల వైద్య నిపుణులతో పాటు అందుబాటులో ఉన్న ఫిజీషియన్, అనస్తీషియా వైద్యులు ఉండాల్సిందిగా డీసీహెచ్ఎస్ సరళమ్మ, డీఎంఅండ్హెచ్వో కోటీశ్వరి ఆదేశాలు జారీచేశారు. మరోవైపు స్వైన్ఫ్లూ వ్యాధి లక్షణాలతో ఎవరైనా బాధపడుతుంటే వెంటనే వారిని సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించి, వ్యాధి నిర్ధారణ కోసం నిపుణుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి కలెక్టర్ ఆదేశాలతో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ను ఏర్పాటుచేశారు. ఇందులో తిరుపతి వైద్య కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు శ్రీధర్, శంకర్రెడ్డి, జనార్దన్రాజు, కిరీటీని నియమించారు. అవసరమైన చోట ఈ బృందం పర్యటించి స్వైన్ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్న వారిని పరిశీలిం చి వారి అభిప్రాయాలను తెలియచేస్తుంది. అలాగే రోగ నిర్ధారణ పరీక్షలు చేసే ప్రైవేటు ఆస్పత్రులకు సైతం ఆంక్షలు విధించారు. రోగి నుంచి సేకరించే స్వాబ్ను రెండు నమూనాలు సేకరించాలని జిల్లా వైద్యశాఖ సర్క్యులర్ జారీ చేసింది. స్వాబ్లో ఒక దాన్ని ప్రైవేటు ఆస్పత్రులే పరిక్షీంచుకోవచ్చు. మరోదాన్ని హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసెన్ (ఐపీఎం)కు పంపాలని సర్కులర్లో పేర్కొంది. అక్కడ స్వైన్ఫ్లూ నిర్ధారణ పరీక్షలు చేసి వ్యాధి సోకితే సమాచారాన్ని జిల్లా వైద్యశాఖ అధికారులకు తెలియచేస్తారు. అందుబాటులో మాత్రలు ఇక ఈ వ్యాధి సోకితే అందించే ప్రధాన మాత్రలు టామీఫ్లూ. ఇప్పటికే జిల్లాలో 1700 మాత్రల వరకు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం వర్షాల సీజన్ కావడంతో ఒకవేళ స్వైన్ఫ్లూ విజృంభిస్తే మాత్రల కొరత లేకుండా చూసుకోవడానికి అదనంగా 2 వేల టామీఫ్లూ మాత్రలు కావాలని వైద్యశాఖ అధికారులు రాష్ట్ర కమిషనరుకు లేఖ రాశారు. ముందు జాగ్రత్త అవసరం స్వైన్ఫ్లూపై వైద్యారోగ్యశాఖ అప్రమత్తంగా ఉంది. అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నాం. ప్రజలు సైతం విడవని జలుబు, దగ్గు, ముక్కులోంచి ద్రవం కారుతూనే ఉంటే ఆలస్యం చేయకుండా సమీపంలోని ప్రభుత్వాస్పత్రులకెళ్లాలి. నిత్యం చేతులు శుభ్రం చేసుకోవడం, రద్దీగా ఉన్న ప్రాంతాలకు యాత్రలకు వెళ్లకపోవడం మంచిది. వైద్యుల్ని అందుబాటులో ఉంచి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. - డాక్టర్ కోటీశ్వరి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి -
వైద్యం ‘పోస్టు’పోన్!
వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీల భర్తీపై సర్కారు శీతకన్ను ఉద్యోగ నియామక ప్రకటనలో పోస్టుల ఊసే లేదు సిబ్బంది లేమితో అవస్థలు పడుతున్న ఆస్పత్రులు హైదరాబాద్: రాష్ట్రంలోని ఆస్పత్రులకు సమగ్ర చికిత్స చేసి ఆధునిక హంగులతో మరింత విస్తరిస్తామన్న సర్కారు.. ఆచరణలో మాత్రం ఆ వైపు ఒక్క అడుగు కూడా వేయడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో 15 వేల పోస్టులు ఖాళీగా ఉన్నా... ఇటీవల విడుదల చేసిన ఉద్యోగ నియామక ప్రకటనలో ఒక్కటంటే ఒక్క పోస్టు కూడా ఈ శాఖకు సంబంధించినది లేకపోవడం గమనార్హం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 30 పడకల ఆస్పత్రులుగా, ఏరియా ఆస్పత్రులను 100 పడకలుగా, జిల్లా ఆస్పత్రులను సూపర్ స్పెషాలిటీలుగా... ఉస్మానియాలో 2,500 పడకలతో కూడిన 24 అంతస్తులతో రెండు భారీ టవర్ల ఆసుపత్రిగా... గాంధీ, నిలోఫర్ ఆసుపత్రులను రెండు వేల పడకలుగా అభివృద్ధి చేస్తామని ఏప్రిల్లో జరిగిన వైద్య ఆరోగ్యశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా ప్రకటించారు. అలాగే ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి సిబ్బంది, పరికరాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కానీ ఘనమైన ఈ లక్ష్యాల సాధనకు కీలకమైన వైద్య ఉద్యోగ ఖాళీల భర్తీపై మాత్రం శీతకన్ను వేశారు. కీలకమైన వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీ లేకుండా ప్రజలకు మేలైన వైద్యం ఎలా అందించగలరని చర్చ జరుగుతోంది. 15 వేలకు పైగా ఖాళీలు: వైద్య ఆరోగ్యశాఖలో వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టులు భారీగా ఖాళీలున్నాయి. దీంతో రోగులకు వైద్యసేవలు అరకొరగానే అందుతున్నాయి. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో రోజుకు 2 వేల మందికిపైగా రోగులు ఓపీలో చికిత్స పొందుతుంటారు. రోజూ 250 మంది వరకు ఆస్పత్రుల్లో చేరుతుంటారు. రోజూ 200 మంది వరకు ఆపరేషన్లు జరుగుతుంటాయి. సరైన సిబ్బంది లేక ఆపరేషన్ కోసం వారాల తరబడి రోగులు వేచి ఉండే పరిస్థితి ఏర్పడుతోంది. ఇక ఎంఆర్ఐ, సీటీస్కాన్, ఆల్ట్రాసౌండ్ తదితర పరీక్షల కోసమైతే నెలల తరబడి వేచి ఉండాల్సిందే. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కొరత వల్లే ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. పీహెచ్సీల్లో కనీసం ఇద్దరు వైద్యులుండాల్సి ఉండగా... ఒక్కరితోనే నెట్టుకొస్తున్నారు. 24 గంటల వైద్య సేవలు సిబ్బంది లేక కునారిల్లుతున్నాయి. నిమ్స్లో 172 వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అక్కడ నర్సింగ్ పోస్టులు 158 ఖాళీలున్నాయి. 116 పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్య విధాన పరిషత్లో 385 వైద్యులు, నర్సింగ్ 429, పారామెడికల్ 765 ఖాళీలున్నాయి. ప్రజారోగ్యంలో 298 వైద్యులు, నర్సింగ్ 205, పారామెడికల్లో 765 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్య విద్యలో 426 వైద్యులు, 324 నర్సింగ్, 784 పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవిగాక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, జాతీయ ఆరోగ్య మిషన్ కింద కూడా ఖాళీలున్నాయి. మొత్తంగా 15,727 ఖాళీలున్నట్లు అప్పట్లో సీఎం సమీక్ష సందర్భంగా అధికారులు వెల్లడించారు. వైద్య ఆరోగ్యశాఖలో వేల పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకుండా రోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని తెలంగాణ నర్సింగ్, పారామెడికల్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీను నాయక్ విమర్శించారు. తక్షణమే పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగ ఖాళీలు కేటగిరి ఖాళీలు వైద్యులు 1,983 నర్సింగ్ 1,494 పారామెడికల్ 8,614 ఇతరులు 3,636 మొత్తం 15,727 -
మందుల డోర్ డెలివరీ..!
సాక్షి, హైదరాబాద్ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీలు) మొదలుకుని బోధనాసుపత్రుల వరకూ మందుల సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టనుంది. ఇకపై పోస్ట్ ఆఫీసుల ద్వారా వీటికి మందులను డోర్ డెలివరీ చేయనుంది. ఈ మేరకు పోస్టల్ విభాగంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తపాలా విభాగం ప్రతి జిల్లాకు మందులు సరఫరా చేసేందుకు ఓ రవాణా వాహనాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ప్రతి ఆస్పత్రికీ నెలలో ఒకటి లేదా రెండుసార్లు ఆ వాహనం వెళ్లి.. ఉన్నతాధికారులిచ్చిన ఇండెంట్ ప్రకారం మందులను అందజేస్తుంది. వెంటనే సంబంధిత ఆస్పత్రి అధికారితో మందులు చేరినట్టుగా సంతకం తీసుకుంటుంది. ప్రతీ జిల్లాకు మందులను సరఫరా చేసినందుకు పోస్టల్ విభాగానికి తెలంగాణ రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్ఎంఎస్ఐడీసీ) నెలకు రూ.లక్ష చెల్లిస్తుంది. అంటే రాష్ట్రం లో మందుల సరఫరా చేసినందుకు నెలకు రూ.10 లక్షలు చెల్లిస్తారు. ఆ ప్రకారం ఏడాదికి రూ.1.20 కోట్లతో ప్రతి ఆస్పత్రికీ పోస్టల్ విభాగం మందులను డోర్ డెలివరీ చేస్తుంది. పడిగాపులు నివారించేందుకే.. రాష్ట్రంలో 700 వరకూ పీహెచ్సీలు.. 130 వరకూ ఏరియా ఆస్పత్రులు.. పెద్ద సంఖ్యలో కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు(సీహెచ్సీ).. 15 బోధనాసుపత్రులు ఉన్నాయి. ఇన్ని ఆస్పత్రులకు మందుల సరఫరా ఒక యజ్ఞంలా సాగేది. అయితే ఏ సరఫరాదారుడు ఏ మందును ఎప్పుడు సరఫరా చేస్తాడో తెలియని పరిస్థితి. మందులను కంపెనీల నుంచి సకాలంలో కొనుగోలు చేసినా సరైన రవాణా విధానం లేకపోవడంతో ఆస్పత్రుల్లో పరిస్థితి ఘోరంగా ఉండేది. టెండర్ నిబంధనల ప్రకారం 60 రోజుల్లోగా సరఫరాదారుడు టీఎస్ఎంఎస్ఐడీసీ పరిధిలో ఉన్న సెంట్రల్ మెడిసిన్ స్టోర్లకు మందులు సరఫరా చేయాలి. కానీ అలా జరగడం లేదు. ప్రతీ పీహెచ్సీ లేదా సీహెచ్సీకీ చెందిన ఫార్మసిస్ట్ జిల్లా కేంద్రంలోని సెంట్రల్ మెడిసిన్ స్టోర్కు వెళ్లి, అద్దెకు వాహనం తీసుకుని మందులు తెచ్చేవారు. మందులు తేవడంలో జాప్యమైతే రోగుల్ని వెనక్కి పంపేవారు. తాజానిర్ణయంతో మందుల రవాణాలో జాప్యం ఉండదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. -
అభివృద్ధికి సహకరించాలి
- మల్కాజిగిరి ఏసీపీ రవిచంద్రన్రెడ్డి ఘట్కేసర్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మల్కాజిగిరి ఏసీపీ రవిచంద్రన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కొర్రెములలో మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సైబరాబాద్ పోలీసులు దత్తత తీసుకొనేందుకు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. అనంతరం ఆరోగ్య కేంద్రం వద్ద స్వచ్ఛభారత్ నిర్వహించారు. అక్కడ చెత్తను తొలగించి గుంతల్లో మట్టి పోశారు. గ్రామాన్ని శుభ్రంగా ఉంచుతామనే ప్రతిజ్ఞ అందరితో ఆయన చేయించారు. కార్యక్రమంలో సీఐ రవీందర్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గ్యార లక్ష్మయ్య, ఎస్ఐలు వీరభద్రం, రాజు, బుర్రరాజు,ఏఎస్ఐలు ప్రభాకర్రెడ్డి, సర్పంచ్ బైరగాని నాగరాజ్, ఉపసర్పంచ్ నాగార్జున, మాజీ సర్పంచ్ పసుమాల కృష్ణ, వార్డు సభ్యులు భాస్కర్,నాయకులు తరిణే మహేంద్రాచారి, శ్రీహనుమాన్ రమేష్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు మునికుంట్ల సంతోష్ ఇతర యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
పీహెచ్సీ పరికరాల కొనుగోళ్లు వాయిదా
ఇప్పటికీ రాని బ్లడ్బ్యాంకు యంత్రాలు ఈడీపై తీవ్రమవుతున్న ఆరోపణలు బదిలీ అయినా కదలని అధికారి టీఎస్ఎంఎస్ఐడీసీలో రోజుకో లీల సాక్షి, హైదరాబాద్: తీవ్ర అవినీతి ఆరోపణలతో రూ.200 కోట్ల విలువైన వైద్య పరికరాల కొనుగోళ్లు వాయిదాపడి నెలరోజులైనా కాకముందే మరో వివాదానికి తెరలేచింది. తెలంగాణ వ్యాప్తంగా 55 ప్రాథమిక ఆరోగ్య కేంద్రా(పీహెచ్సీ)ల్లో రూ.20 కోట్లతో పరికరాల కొనుగోళ్లకు ఆర్డరు ఇచ్చారు. అయితే తమకు నచ్చిన కంపెనీలకే రిపోర్టు ఇవ్వమన్నారని... అలా అయితే కమిటీ సభ్యులుగా తామెందుకు రావాలని... వారి మనుషులనే తెచ్చుకుంటే సరిపోదా అంటూ కమిటీ సభ్యులు మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో పరికరాల కొనుగోళ్లు వాయిదాపడ్డాయి. అసలే పీహెచ్సీల్లో కనీస వసతులు లేక అల్లాడుతోంటే, మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థలో ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటం వివాదాలకు తావిస్తోంది. రక్తనిధి యంత్రాల పరిస్థితీ అంతే... ఇటీవలే రూ.9 కోట్లతో రక్తనిధి కేంద్రాలకు అవసరమైన యంత్రాలకు టెండరు పిలిచారు. అయితే ఒక కంపెనీకి టెండరు కట్టబెట్టాలని తీవ్రంగా ప్రయత్నించారు. అయితే తాము అనుకున్న కంపెనీ రాకపోవడంతో వచ్చిన కంపెనీకి ఇప్పటికీ ఆర్డరు ఇవ్వలేదు. దీంతో డెంగీ తదితర రోగాలు వచ్చినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్లేట్లెట్స్ తదితర కణాలను వేరుచేసే యంత్రాలు లేక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. మరోవైపు, తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ)కి సరఫరా అయ్యే మందులు, యాంటీబయాటిక్స్, కాటన్, బ్యాండేజీ తదితర కొన్నిరకాలు ఔషధ నియంత్రణ శాఖ నాసిరకం అని తేల్చినా ఆ సంస్థ అధికారులు ఓకే చెబుతున్నారు. తాజాగా రోలర్ బ్యాండేజీపై ఓ కంపెనీకి సంబంధించి డ్రగ్ కంట్రోల్ విభాగం రెండు ఉత్పత్తులను నాసిరకంగా తేల్చింది. అయినా అనాలసిస్ విభాగంలో పనిచేసే ఓ ఫార్మసిస్ట్ వీటినే కొనసాగిస్తూనే ఉన్నారు. పలువురు సరఫరాదారులు అనాలసిస్ విభాగంలో పనిచేస్తున్న వారికి మామూళ్లివ్వడమే కారణమనే ఆరోపణలున్నాయి. మామూళ్ల వ్యవహారం... ప్రస్తుతం టీఎస్ఎంఎస్ఐడీసీలో ఎండీలేరు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్చందానే ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే జీఎం కూడా లేరు. ప్రస్తుతం రెవెన్యూ శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (ఈడీ) మాత్రమే ఉన్నారు. ఆయన చెప్పిందే వేదంగా నడుస్తోంది. గత ఆరు నెలల్లో ఆయనపై తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో నెల కిందట బదిలీ చేశారు. ఆయన స్థానంలో పద్మారావు అనే మరో రెవెన్యూ అధికారిని బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. అయితే ఆ ఉత్తర్వులు బేఖాతర్ అయ్యాయి. ప్రస్తుత ఈడీ తన బదిలీని ఆపుకొని అదే పోస్టులో దర్జాగా కొనసాగుతున్నారు. సరఫరాదారుల నుంచి మామూళ్లు తీసుకుని ఉన్నతాధికారులకు ఇవ్వడం వల్లే ఇక్కడ ఉండగలుగుతున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. సివిల్ పనులు, మందులు, పరికరాల కొనుగోలు ఇలా 1,000 కోట్ల వరకూ జరిగే ఈ వ్యవహారాలకు ఎండీ లేకపోవడంతో పర్యవేక్షణ కొరవడి ఘోరంగా తయారైంది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఈ విభాగం పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. -
పోస్ట్... పుస్తకాలొచ్చాయ్
బడులకు బుక్స్ బట్వాడా చేయనున్న తపాలాశాఖ తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనకు యోచన లాజిస్టిక్ విభాగాన్ని పటిష్టం చేసుకునే దిశగా ముందుకు బట్వాడాపై ఆంధ్రప్రదేశ్తో త్వరలో ఒప్పందం సాక్షి, హైదరాబాద్: ఆదరణ కోల్పోతున్న తపాలాశాఖ మనుగడ కోసం సరికొత్త ఆలోచనలతో ముందుకుసాగుతోంది. ఉత్తరాల బట్వాడా ప్రధాన విధిగా ఉన్నప్పటికీ... దాన్నే అట్టిపెట్టుకుని ఉంటే క్రమంగా ప్రజలకు దూరం కావటం తథ్యంగా మారటంతో ఇతర రంగాల్లోకి అడుగుపెడుతోంది. కొంతకాలం కిందట లాజిస్టిక్ రంగంలోకి అడుగుపెట్టిన తపాలాశాఖ ఇప్పుడు మెల్లగా దాన్నే ప్రధాన విధిగా చేసుకుంటోంది. ఈ క్రమంలో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలను సరఫరా చేసేందుకు ముందుకొచ్చింది. ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ముద్రణాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు వాటిని తరలించేందుకు నిర్ణయించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకోబోతోంది. తొలుత ఏపీ ప్రభుత్వం ముందు ప్రతిపాదన పెట్టింది. దీనికి సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వానికి కూడా ప్రతిపాదన అందజేయాలని భావిస్తోంది. యూనిఫామ్.. మందుల తరహాలో... ప్రస్తుతం తపాలాశాఖ ప్రత్యేకంగా లాజిస్టిక్స్ విభాగాన్ని ప్రారంభించింది. దీనికి విడిగా వాహనాలు సమకూర్చుకుంది. ప్రైవేటు సరుకు రవాణా సంస్థల్లాగా అవకాశం ఉన్న అన్నిరకాల వస్తువులను తరలించేందుకు చకచకా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ కోవలో ప్రభుత్వ విభాగాలకు సరుకు రవాణా చేసిపెట్టే అనుబంధ సంస్థగా ఎదిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పదమూడు జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫామ్స్ను సరఫరా చేసింది. ఆప్కోతో ఉన్న అవగాహన మేరకు ఆ సంస్థ రూపొందించిన యూనిఫామ్స్ను స్కూళ్లకు తరలించింది. ఇప్పుడు పాఠ్యపుస్తకాల తరలింపుపై దృష్టి సారించింది. మరోవైపు గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మందులను సరఫరా చేసే ఆర్డర్నూ అమలు చేస్తోంది. నిరంతర మందుల సరఫరా పేరుతో ఏపీ పరిధిలో దాన్ని కొనసాగిస్తున్న తపాలాశాఖ త్వరలో తెలంగాణ ప్రభుత్వంతో కూడా ఒప్పందం చేసుకోబోతోంది. ఈ క్రమంలో వచ్చే విద్యాసంవత్సరంలో పాఠ్యపుస్తకాల తరలింపు బాధ్యత కూడా తపాలాశాఖకు దక్కే అవకాశం కనిపిస్తోంది. -
ఆస్పత్రులా.. చెత్తకుండీలా?
అధ్వానంగా ప్రభుత్వ ఆస్పత్రులు వైద్యుల్లేరు.. సిబ్బంది కరువు పనిచేయని పరికరాలు.. మందులకూ కటకట సరిపోని పడకలు.. ఒకే బెడ్పై ఇద్దరు ముగ్గురికి చికిత్స పేరుకే పెద్దాసుపత్రులు.. కానీ నిండా అసౌకర్యాలే.. డాక్టర్లు ఉండరు.. పారామెడికల్ సిబ్బంది కనిపించరు.. మందులు అందుబాటులో ఉండవు.. కాలం చెల్లిన వైద్య పరికరాలు.. చివరకు బెడ్లూ సరిపోవు. కొన్నిచోట్ల ఒక్కో మంచంపై ఇద్దరిని పడుకోబెడితే, మరికొన్ని ఆస్పత్రుల్లో నేలపైనే ఉంచాల్సిన పరిస్థితి. పడకలపై బెడ్షీట్లు ఉండవు.. ఉన్నా దుర్వాసన వస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల దుస్థితిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. - సాక్షి నెట్వర్క్ నిండా లోపాలే.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులకు జబ్బు చేసింది. జిల్లా కేంద్రాల్లోని తొమ్మిది ప్రధాన ఆసుపత్రులకు తోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. డాక్టర్లు, సిబ్బంది కొరత, వసతుల లేమి కారణంగా రోగుల అవస్థలు వర్ణణాతీతమే. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారికి.. ఉన్న రోగాలు పోయే మాటేమోగాని.. కొత్త రోగాలు వస్తాయేమోనని ఆందోళన చెందుతున్నారు. ఏళ్ల క్రితం నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో బిక్కుబిక్కుమంటూ చికిత్స పొందుతున్నారు. చెత్తాచెదారం, దుర్గంధభరితంగా ఉన్న ఆసుపత్రుల ఆవరణలోనే రోగులు కాలం వెళ్లదీస్తున్నారు. విలువైన పరికరాలు కూడా మరమ్మతులకు నోచుకోక మూలనపడ్డాయి. జిల్లా ఆసుపత్రుల నుంచి వచ్చే విజ్ఞప్తులను రాష్ట్రస్థాయిలో అధికారులు పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. ఆరోగ్యానికి కొరత.. ఆదిలాబాద్ రిమ్స్లో సరైన సంఖ్యలో వైద్యులు లేరు. పరికరాల కొరత, పారిశుధ్యలోపం, అరకొర వసతులు రోగుల పాలిట శాపంగా మారాయి. రిమ్స్కు మొత్తం 155 వైద్య పోస్టులు మంజూరైతే ఇందులో 45 మంది మాత్రమే ఉన్నారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి ప్రత్యేక చికిత్స అందించే ట్రామాకేర్ సెంటర్ ప్రారంభానికి నోచుకోలేదు. రిమ్స్కు రోజుకు వెయ్యి మందికిపైగా రోగులు వస్తుంటారు. పడకలు సరిపోక ఒకే బెడ్పై ఇద్దరేసి రోగులను పడుకోబెడుతున్నారు. ఇక ఆస్పత్రి ఆవరణ అంతా చెత్తా చెదారమే. ఇక కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 350 పడకల పెద్దాసుపత్రికి ఈ జిల్లాతోపాటు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని రోగులు కూడా వస్తుంటారు. ఇంత కీలకమైన ఆస్పత్రిలో సరైన సంఖ్యలో వైద్యులులేరు. 50 మంది వైద్యులు ఉండాల్సిన చోట 31 మందే ఉన్నారు. ఇక స్పెషలిస్టుల కొరత మరింతగా వేధిస్తోంది. ఐదుగురు గైనకాలజిస్టులు అవసరం ఉండగా రెండు ఖాళీలున్నాయి. పిల్లల డాక్టర్లు ఐదుగురికిగాను ఇద్దరే ఉన్నారు. ఈఎన్టీ డాక్టర్లు ఇద్దరికి గాను ఒక్కరే, ఆర్థోపెడిక్ ఇద్దరికి గాను ఒక్కరే ఉన్నారు. పారామెడికల్ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. నిర్లక్ష్యానికి చిరునామా.. మహబూబ్నగర్ జిల్లాలోని చాలా ప్రభుత్వాసుపత్రులు.. పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆధునిక పరికరాలున్నా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా సద్వినియోగం కావడం లేదు. జిల్లాలోని 90 శాతం పీహెచ్సీల్లో ఆపరేషన్లు నిర్వహించడంలేదు. జిల్లా ఆసుపత్రిలో 12 మంది సివిల్ సర్జన్స్, ఒక డిప్యూటీ సివిల్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఆస్పత్రిలో పరిశుభ్రత మచ్చుకు కూడా కానరాదు. మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని జిల్లా ఆసుపత్రి.. పేరుకే పెద్దాసుపత్రి. వ్యర్థాలన్నీ ఆసుపత్రి ఆవరణలో పేరుకుపోయి దుర్వాసన వస్తున్నా పట్టించుకునే వారు లేరు. నల్లగొండ జిల్లాలోని ఆస్పత్రుల్లో నిండా సమస్యలే. జిల్లా కేంద్రంలోని పెద్దాసుపత్రిలో కాలం చెల్లిన ఎక్స్రే, ఈసీజీ, ఇతర పరీక్షల యంత్రాలతో ఇబ్బందిగా మారింది. ఈ ఆస్పత్రికి వస్తున్న రోగులకు సరిపడా పడకలు అందుబాటులో లేవు. ఇక రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో డ్రైనేజీ పైప్లైన్ లీకవుతూ దుర్గంధం వెదజల్లుతోంది. సూర్యాపేట ఆస్పత్రిలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. ఇక రంగారెడ్డి జిల్లాలో తాండూరులోని ఆసుపత్రిని అసౌకర్యాలు పట్టిపీడిస్తున్నాయి. ప్రసూతి వార్డులో కిటికీలకు తలపులు లేని కారణంగా అడ్డంగా దుస్తులు కట్టారు. ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. వైద్యం చేసేదెవరు? నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 223 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెన్షియల్ వైద్యులు ఉండాలి. కానీ 62 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. దీంతో రోగులకు అత్యవసర వైద్యం అందడం లేదు. కొత్తగా వైద్యకళాశాల ఏర్పడినా పోస్టుల భర్తీ నేటి వరకు చేయలేదు. పారామెడికల్ సిబ్బంది అయితే అన్ని పోస్టులు కలిపి 609 వరకు ఖాళీగా ఉన్నాయి. ఇక వరంగల్ జిల్లాలో వెయ్యి పడకల సామర్థ్యం కలిగిన ఎంజీఎం బోధనాసుపత్రికి సూపర్ స్పెషాలిటీ హోదా కల్పించి రెండేళ్లవుతున్నా ఆ మేరకు సౌకర్యాలు లేవు. చాలా వైద్య పరికరాలు పనికిరాని స్థితికి చేరుకున్నా పట్టించుకోవడం లేదు. ఇక మహబూబాబాద్ చుట్టు పక్కల ఉన్న గిరిజనులకు అక్కడి ఏరియా ఆస్పత్రే పెద్దదిక్కు. కానీ ఇక్కడ సిబ్బంది కొరతతోపాటు మౌలిక సదుపాయాలకూ దిక్కులేదు. -
స్వైన్ఫ్లూ కేసులు 61
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో స్వైన్ఫ్లూ బాధితుల సంఖ్య మరింత పెరిగింది. శుక్రవారం నాటికి 61 మంది స్వైన్ఫ్లూ భారిన పడినట్లు అధికారులు నిర్ధారించారు. వీరికి వివిధ స్థాయిల్లో చికిత్స అందిస్తున్నప్పటికీ.. ఇప్పటికే నలుగురు మృతి చెందారు. వ్యాధి నివారణ చర్యలకు ఉపక్రమించిన జిల్లా యంత్రాంగం.. ప్రధాన ఆస్పత్రుల్లో మందులను అందుబాటులో ఉంచింది. 2,450 ఒసెల్టామీవిర్ 75ఎంజీ, 52 ఒసెల్టామీవిర్ ఎంఎల్లను క్షేత్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ, జిల్లా ఆస్పత్రులకు పంపిణీ చేశారు. 90వేల వాల్పోస్టర్లు, కరపత్రాలతో స్వైన్ఫ్లూపై విస్తృతంగా చైతన్యం కల్పిస్తున్నట్లు జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
ఇక్కడ ఆపరేషన్లు చేయలేం..
ములుగు ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిస్సహాయత సౌకర్యాలున్నా జీఎంహెచ్, ఎంజీఎం ఆస్పత్రులకు రెఫర్ డీజీఓ స్థాయి వైద్యురాలు ఉన్నా అందని వైద్యం 108లో జరుగుతున్న ప్రసవాలు ములుగు : గర్భిణీలకు మెరుగైన సేవలందించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం జరిగేలా చూడాలని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఇస్తున్న ఆదేశాలు బుట్టదాఖలవుతున్నారుు. ప్రసవంలో చిన్నపాటి ఇబ్బంది ఉన్నా మనకు రిస్క్ ఎందుకులే.. అనే భావనతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ప్రసవాల కేసులను ఎంజీఎం, జీఎంహెచ్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. డీజీఓ స్థాయి వైద్యాధికారిణి అందుబాటులో ఉన్నా గర్భిణీలకు సరైన వైద్యం, భరోసా అందడం లేదు. నవంబర్, డిసెంబర్లో ఆస్పత్రి పరిధిలోని ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల నుంచి సుమారు 50 మంది గర్భిణీలను 108లో జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ కేసులు కేవలం 108 రికార్డుల్లో నమోదైనవి మాత్రమే. సొంత వాహనాల్లో తరలించినవారి సంఖ్య మరో 20 నుంచి 30 వరకు ఉండొచ్చు. డాక్టర్లున్నా.. ఆపరేషన్లు సున్నా.. నాలుగు నెలల క్రితం సామాజిక ఆస్పత్రిలో గైనకాలజిస్టు లేకపోవడంతో గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంత్రి చొరవతో ప్రస్తుతం డీజీఓను నియమించారు. అంతేగాక ఆస్పత్రిలో గర్భిణీలకు తప్ప ని పరిస్థితుల్లో ఆపరేషన్ నిర్వహించేందుకు ఆనస్థిషియూ డాక్టర్ కూడా అందుబాటులో ఉన్నారు. అరుునా ప్రసవం చేయడానికి డాక్టర్లు వెనకడుగు వేస్తున్నారు. గర్భిణీలను ప్రసవం కోసం వెయిటింగ్లో ఉంచుతున్న వైద్యులు ఏ చిన్న ఇబ్బంది అనిపించినా జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు. ఇక్కడ సీరియస్.. అక్కడ సిజేరియన్ లేకుండానే ప్రసవం.. అరుుతే ఇక్కడి వైద్యులు రిస్క్ కేసులుగా పరిగణించి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రులకు రెఫర్ చేస్తుంటే తీరా అక్కడికి వెళ్లాక అక్కడ సాధారణ ప్రసవాలు జరుగుతుండడం విశేషం. ప్రసవంలో చిన్నపాటి ఇబ్బందులను హైరిస్క్గా పరిగణించి బాధిత కుటుంబ సభ్యులను భయాందోళనలకు గురిచేస్తున్నారనే ఆరోపణలున్నారుు. గత మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు గర్భిణీలు 108లోనే ప్రసవించారు. గురువారం ఉదయం మండంలోని జంగాలపల్లికి చెందిన ములకలపల్లి రమ్య(23) పురిటి నొప్పులతో ములుగు ఆస్పతికి వచ్చింది. ఆమెను పరిశీలించిన వైద్యులు రిస్క్ కేసని చెప్పారు. దీంతో ఆమెను మధ్యాహ్నం 108లో వరంగల్కు తరలిస్తుండగా మార్గమధ్యలో ఆత్మకూరు శివారులో ప్రసవించింది. అలాగే జంగాలపల్లికి చెందిన ఎండీ షాజహాన్సుల్తానా(27) శుక్రవారం సాయంత్రం నొప్పులతో ఆస్పత్రికి చేరుకుంది. ఆమెను పరీక్షించిన వైద్యులు హన్మకొండలో ని జీఎంహెచ్కు రెఫర్ చేశారు. కుటుంబ సభ్యులు 108లో హన్మకొండకు తరలిస్తుండగా పందికుంట స్టేజీ సమీపంలో అంబులెన్స్లోనే అర్ధరాత్రి ప్రసవించింది. దీంతో ఆమెను తిరిగి ములుగు ఆస్పత్రికి తరలించారు. ఈ రెండు కేసుల్లో పైలట్ రాజేష్, సిబ్బంది బాలాజీ అందించిన వైద్యాన్ని కూడా వైద్యులు అందించలేకపోవడం గమనార్హం. సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ వైద్యులు.. ములుగు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల తీరుతో ప్రజలు వైద్యం కోసం మండల కేంద్రంలో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఖర్చరుునా ఫరవా లేదని, ఇబ్బందులు లేకుండా ప్రసవం జరిగితే అంతేచాలని గర్భిణీల కుటుంబ సభ్యులు అంటున్నారు. ఎండీ బదరోద్దీన్, షాజామాన్ సుల్తానా సోదరుడు, ములుగు మా అక్కకు పురిటి నొప్పులు రావడంతో గురువారం సాయంత్రం 7 గంటలకు ఆస్పత్రికి తీసుకెళ్లాం. వైద్యులు చెకప్ చేసి వెయిటింగ్లో ఉంచారు. రాత్రి 12 గంటల సమయంలో బిడ్డ గర్భంలో ల్యాట్రిన్ పోయిందని చెప్పారు. దీంతో హుటాహుటిన 108లో జీఎంహెచ్కు తరలించాం. పందికుంట దగ్గర నొప్పులు ఎక్కువ కావడంతో 108 సిబ్బంది బాలాజీ, రాజేష్ సుఖప్రసవం జరిగేలా చేశారు. ప్రసవం ఇబ్బందని చెప్పడంతో కుటుంబ సభ్యులమంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాం. ఆస్పత్రిలో వైద్యులు నిర్లక్ష్యంగా ఉన్నారు. -
వైద్యం పూజ్యం
నెల్లూరు (వైద్యం): జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఏళ్ల తరబడి ఖాళీ పోస్టులను భర్తీ చేయలేదు. దీంతో పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రతి ఏటా భారీగా నిధులు విడుదలవుతున్నాయి. కాని వాటిని సద్వినియోగం చేయడంలో వైద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా పీహెచ్సీలన్నీ సమస్యలతో విలవిలలాడుతున్నాయి. ఉదాహరణకు ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరం పీహెచ్సీలో కొన్ని నెలలుగా వైద్యులు లేరు. ఇటీవల ఆ ఆస్పత్రి ఫార్మసిస్ట్ దగదర్తికి బదిలీ అయ్యారు. కనీసం ల్యాబ్ టెక్నీషియన్ కూడా లేకపోవడం వైద్యశాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టకు నిదర్శనమని చెప్పవచ్చు. ఈ ఆస్పత్రికి నిత్యం 70 మందికి పైగా ఔట్పేషంట్లు వస్తుంటారు. వీరికి ఏఎన్ఎమ్లే వైద్యసేవలు అందించడం గమనార్హం. జిల్లాలో మొత్తం 74 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 14 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, మూడు ఏరియా ఆస్పత్రులు, రెండు పీపీ యూనిట్లు, 17 క్లస్టర్లు ఉన్నాయి. పోస్ట్లు అవసరం పని చేస్తున్నవారు ఖాళీలు వైద్యులు 172 151 21 స్టాఫ్ నర్సులు 135 99 36 ఏఎన్ఎమ్ 477 325 152 కాంట్రాక్ట్ఏఎన్ఎం 477 394 83 ఫార్మాసిస్ట్లు 66 42 24 ల్యాబ్ టెక్నీషియన్ 62 15 47 -
అరకొరే!
పీహెచ్సీల్లో అందని వైద్య సేవలు పాలమూరు :ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రభుత్వాలు ఊదరగొడుతున్నా పేదలకు అరకొర వైద్యం అందుతోంది. జిల్లా వ్యాప్తంగా అధికశాతం పీహెచ్సీలకు నిర్లక్ష్యం జబ్బు పట్టుకొంది. దీంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తోంది. సోమవారం జిల్లా వ్యాప్తంగా ఆయా పీహెసీల పరిధిలో ‘సాక్షి’ బృందం ఏక కాలంలో జరిపిన విజిట్లో పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలోని 87 పీహెచ్సీలుండగా 40 కేంద్రాల్లోని వైద్యులు సకాలంలో విధులకు హాజరు కాలేదు. పీహెచ్సీల పరిధిలోని సబ్సెంటర్లకు వెళ్లామంటూ సదరు వైద్యులు చెప్పుకొస్తున్నారు. సబ్ సెంటర్లకు వెళ్తున్న కారణంగానే పీహెచ్సీలకు ఆలస్యంగా వస్తున్నామని, నిర్ణీత సమయానికి ముందుగానే వెళ్తున్నామని పలువురు వైద్యులు చెబుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని సిబ్బంది తమ విధులు సక్రమంగా నిర్వహించకపోవడంతో పేదలు ఇబ్బంది పడాల్సివస్తోంది. జిల్లాలో 20కిపైగా పీహెచ్సీలకు ఇన్చార్జ్ వైద్యులు ఉన్నారు. 35కు పైగా ఏఎన్ఎం పోస్టులు ఖాళీలున్నాయి. పీహెచ్సీల్లో వైద్యులు, సిబ్బంది కూడా పనివేళలు సక్రమంగా పాటించడం లేదు. ఉదయం 10 నుంచి 11గంటల మధ్య పీహెచ్సీకి చేరుకుని మధ్యాహ్నం 2గంటల కల్లా వైద్యులు ఇంటిదారి పడుతున్నారు. జిల్లాలోని కేవలం 8 పీహెచ్సీల్లోనే మౌలిక సదుపాయాలున్నాయి. 6 పడకలున్న పీహెచ్సీలు 25 మాత్రమే ఉన్నాయి. జిల్లాలోని అధిక శాతం పీహెచ్సీల పరిధిలో వైద్యులు స్థానికంగా నివాసం ఉండడం లేదు. అన్ని పీహెచ్సీల్లోనూ బీపీ చెకింగ్ మిషన్లున్నా.. అక్కడికి వచ్చే రోగులకు బీపీ చెకప్ చేయడంపై వైద్యులు, సిబ్బంది తగిన దృష్టి నిలపడంలేదు. ఉపయోగంలో లేని పరికరాలు పీహెచ్సీల్లో మౌలిక వసతుల కల్పనకోసం ప్రభుత్వం పలు పరికరాలను ఏర్పాటు చేసినప్పటికీ అక్కడి సిబ్బంది సరైన జాగ్రత్త తీసుకోకపోవడంతో అవి నిరుపయోగంగా మారుతున్నాయి. ఇంజక్షన్లు భద్రపరచుకునేందుకు, ఇతర అవసరాల కోసం పీహెచ్సీల్లో ఫ్రిజ్లను ఏర్పాటు చేసినప్పటికీ వాటి నిర్వహణ సరిగా లేదు. అంతే కాకుండా గర్భిణీలు వస్తే తూకం చూసేందుకు ఏర్పాటు చేసిన మిషన్లు కూడా చాలాచోట్ల ఉపయోగంలో లేవు. పీహెసీల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేందుకు తగిన పరికరాలున్నప్పటికీ అక్కడ ఆపరేషన్లు నిర్వహించడం లేదు. దీంతో జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రితోపాటు, డివిజన్ కేంద్రాల్లోని సివిల్ ఆసుపత్రులకు కు.ని ఆపరేషన్లు చేయించుకునేందుకు రోగులు ఆసక్తి చూపుతున్నారు. ఆస్పత్రుల్లో ఇలా..! అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. అన్ని కేంద్రాల్లో వైద్యాధికారులు ఉన్నా సమయానుకూలంగా పీహెచ్సీలకు రాకపోవడం కనిపించింది. అలంపూర్, వనపర్తి, నాగర్కర్నూల్, గద్వాల, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోనూ ఆయా పీహెచ్సీల్లో ఆపరేషన్ థియేటర్లు నిరుపయోగంగా మారాయి. కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని బొంరాస్పేట, దౌల్తాబాద్, మద్దూరు. గుండుమాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. షాద్నగర్ నియోజకవర్గంలోని పీహెచ్సీలకు చెందిన కొందరు వెద్యులు, ఏఎన్ఎంలు స్థానికంగా ఉండకపోవడంతో డాక్టర్ల కోసం రోగులు గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. దేవరకద్ర పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు ఉన్నట్లు రికార్డుల్లో ఉన్నప్పటికీ ఓ వైద్యుడు డిప్యూటేషన్తో జిల్లా టీబీ ఆసుపత్రికి వెళ్లారు. మరో వైద్యుడు విధులకు రాక పోవడం వల్ల సరెండర్ చేశారు. దీంతో ఇక్కడ వైద్యుల్లేకుండా పోయారు. అడ్డాకుల పీహెచ్సీ వైద్యురాలు సకాలంలో రానందువల్ల రోగులకు వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందడం లేదు. జడ్చర్ల పరిధిలోని గంగాపూర్ పీహెచ్సీలో రెగ్యులర్ డాక్టర్ లేక పోవడంతో ఇన్చార్జి డాక్టర్తో అరకొరగా సేవలు అందుతున్నాయి. నవాబుపేట పీహెచ్సీలో డాక్టర్ అందుబాటులో లేక ల్యాబ్ అసిస్టెంట్ డాక్టర్ అవ తారమెత్తి రోగులకు పరీక్షలు చేసి మందులను ఇవ్వాల్సిన దుస్ధితి నెలకొంది. మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల పరిధిలోని పీెహ చ్సీల్లో వైద్యసేవలు సరిగా లేక రోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. కల్వకుర్తి, తలకొండపల్లి, మాడ్గుల పీహెచ్సీల పరిధిలో మౌలిక వసతుల్లేక రోగులకు అవస్థ ఏర్పడింది. దీనికితోడు సిబ్బంది కొరత, ఉన్న వైద్యులు, సిబ్బంది కూడా సకాలంలో పీహెచ్సీకి రాకపోవడంతో వైద్య సేవలు మృగ్యమయ్యాయి. ఆస్పత్రుల్లో ఖాళీలు విభాగం ఉండాల్సింది ఉన్నది ఖాళీలు వైద్యులు 124 105 19 ఏఎన్ఎంలు 261 226 35 ఇతర సిబ్బంది 174 156 18 మొత్తం పీహెచ్సీలు 87 -
పీహెచ్సీలకు ఫీవర్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు వైద్యం అందని ద్రాక్షగా మారింది. కోట్ల రూపాయల మందులు జిల్లాకు వస్తున్నా రోగి నోట్లోకి మాత్రం ఒక్క మాత్ర పోవడం గగనంగా మారింది. జిల్లాలో మందుల కొరత లేదని వాదించే అధికారులు రోగులు ఏది అడిగితే అది రాలేదని చెబుతుండటం గమనార్హం. గత రెండు నెలలుగా జిల్లాలో విషజ్వరాలు, మలేరియా, డెంగీ విజృంభిస్తున్నా వైద్య ఆరోగ్యశాఖ పీహెచ్సీల్లో కనీస వైద్య సౌకర్యాలను కల్పించలేకపోతోంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా రోగులకు అందుతున్న సేవలపై ‘సాక్షి’ బృందం సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరిశీలన జరిపింది. కొన్ని చోట్ల వైద్యుల నిర్లక్ష్యం, మరికొన్ని చోట్ల మౌలిక సదుపాయాల కొరత వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని అనేక ఆస్పత్రుల్లో సిబ్బంది, వైద్యులు సమయపాలన పాటించటం లేదని వెల్లడైంది. 11 దాటితే కానీ ఆస్పత్రికి రాని సిబ్బంది సాయంత్రం మూడు గంటలు కాకముందే జిల్లా కేంద్రానికి, నియోజకవర్గ కేంద్రాలకు పయనం అవుతున్నారు. అందని మందులు జిల్లాలో 69 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 11 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఒక్కో పీహెచ్సీకి ఒక వైద్యాధికారి ఉండాలి. జిల్లాలో కేవలం నాలుగు పీహెచ్సీలకు మాత్రమే వైద్యాధికారులు లేరని, మం దుల కొరత లేదని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. డీఎంహెచ్ఓ ద్వారా పీహెచ్సీలకు 123 రకాల మందులు, 68 సర్జికల్ ఐటమ్స్ పం పిణీ చేస్తున్నారు. పీహెచ్సీలలో మాత్రం ఈ మందులు అందుబాటులో ఉండటం లేదు. సర్వరోగ నివారిణి తరహాలో ఎవరికి ఏ జబ్బు చేసినా వాంతులు, విరేచనాలు, జ్వరం, జలు బు వీటిలో ఏదైనా.. వ్యాధి లక్షణంతో పనిలేకుండా వారికి అందుబాటులో ఉన్నవే పంపిణీ చేస్తున్నారని వివిధ ప్రాంతాల్లో రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం సూదిమందు వేయమని ప్రాధేయపడినా అదీ సాధ్యం కాదని తిప్పి పంపుతున్నట్లు చెబుతున్నారు. ఏజెన్సీలో ఏదీ సమయపాలన ఏజెన్సీలోని పీహెచ్సీల్లో వైద్యులు సమయపాలన పాటించడం లేదు. ఉదయం 9 గంటలకే పీహెచ్సీలు తెరవాల్సి ఉండగా 10 గంటలైనా తలుపులు తెరిచే వారే లేరు. కుక్కునూరు మండలంలోని రాజీవ్నగర్ ఆస్పత్రిలో 12 గంటలే పీహెచ్సీ తెరిచి ఉంటుంది. పీహెచ్సీలో ఒకే ఒక వైద్యుడు ఉండటంతో రాత్రివేళల్లో ల్యాబ్ టెక్నిషియన్ వైద్యుడి అవతారం ఎత్తుతున్నారు. ఇద్దరు వైద్యులు భద్రాచలం నుంచి నిత్యం ప్రయాణం చేయడంతో పేదలకు వైద్యం సరిగా అందడం లేదు. తల్లాడ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వైద్యునితో పాటు సిబ్బంది సమయపాలన పాటించకపోవటం వలన రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రి ప్రాంగణం అపరిశుభ్రంగా ఉండటంతో ముక్కులు మూసుకొని వెళ్లాల్సి వస్తోంది. నేలకొండపల్లి పీహెచ్సీలో కూడా ఉదయం 10 గంటల వరకు కూడా వైద్యులు అడ్రస్ లేరు. అశ్వాపురంలో శిథిలావస్థలో ఉన్న బెడ్స్పైనే రోగులకు వైద్యం చేస్తున్నారు. మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు సకాలంలో రావడంలేదు. గదులు సరిపోవడం లేదు. ఇరుకు గదుల్లో వైద్యులు, రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సరిపడా పడకలు లేవు.. ఉన్న పడకలు వేయడానికి గదులు లేవు. మణుగూరు, గుండాల మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అంబులెన్స్ లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. గుండాల పీహెచ్సీలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. పినపాక వైద్యశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు డాక్టర్లు, ఇతర సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ వైద్యశాలలకు రోగుల సంఖ్య పెరిగినా అందుకు తగిన విధంగా వసతులు కల్పించకపోవడంతో అనేక మంది ప్రైవేటు వైద్యశాలలకు వెళ్లాల్సి వస్తోంది. ఆర్ఎంపీలే దిక్కు.. భద్రాచలం ఏజెన్సీలోని గ్రామాల్లో ఆర్ఎంపీలే రోగులకు పెద్దదిక్కుగా మారుతున్నారు. చర్ల మండలంలోని సత్యనారాయణపురం ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు, సిబ్బంది శిథిలమైన భవనాల కిందే విధులు నిర్వహిస్తున్నారు. ఈ వైద్యశాల పరిధిలో సుమారు 40కు పైగా గ్రామాలకు చెందిన ప్రజలు వైద్యసేవలు పొందుతున్నారు. ఈ వైద్యశాలకు ఇటీవల ప్రభుత్వం పక్కా భవనాన్ని నిర్మించినా దాన్ని ప్రారంభించలేదు. ఈ పీహెచ్సీలో రోగులకు బెడ్లు లేవు. వాజేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ముగ్గురు డాక్టర్లకు గాను కేవలం ఒక్కరు మాత్రమే పని చేస్తున్నారు. దుమ్ముగూడెం మండలం పర్ణశాల పీహెచ్సీ సిబ్బంది స్థానికంగా ఉండటం లేదు. వీరంతా భద్రాచలం నుంచి ప్రతి రోజు విధులకు హాజరవుతుండటంతో రోగులకు సకాలంలో అందుబాటులో ఉండటం లేదు. ఆసుపత్రికి వస్తున్న రోగులు తిరిగి వెళ్తున్నారు. పాల్వంచ మండల పరిధిలోని ఉల్వనూరు గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆపరేషన్ థియేటర్ ఉన్నా ప్రయోజనం లేకుండా పోయిందని రోగులు వాపోతున్నారు. గతంలో 24 గంటలు వైద్య పరీక్షలు నిర్వహించే ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం 12 గంటలు మాత్రమే వైద్య సేవలు అందిస్తున్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం లేదు. జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అత్యవసర వైద్యసేవల నిమిత్తం వచ్చిన రోగులను ప్రాణాపాయస్థితి నుంచి రక్షించేందుకు ఆక్సిజన్ అందుబాటులో ఉంచాల్సి ఉంది. కానీ ఉన్న రెండు సిలిండర్లలో ఆక్సిజన్ లేదు. ఇల్లెందు వైద్యశాలలో ఇన్వర్టర్ బ్యాటరీలు పనిచేయటం లేదు. రాత్రివేళల్లో కరెంటు పోతే అంధకారంలోనే రోగులకు వైద్యం చేయాల్సి వస్తోంది. -
‘ప్రాథమిక ఆరోగ్యం’ విలవిల
సిబ్బంది లేక.. రోగుల అవస్థలు భర్తీకాని 325 వైద్య ఖాళీలు పీహెచ్సీల నుంచి బోధనాస్పత్రులకు వెళ్లిన 125 మంది వైద్యులు హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ), వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బందిలేక రోగులు నానా తిప్పలు పడుతున్నారు. వైద్య విద్యా సంచాలకుల పరిధిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఇన్ సర్వీస్ అభ్యర్థులను బోధనాసుపత్రులకు రావాలని నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి సుమారు 125 మందికి పైగా స్పెషలిస్ట్ వైద్యులు డీఎంఈ ఆస్పత్రులకు వెళ్లారు. అంతకుముందే 200కు పైగా వైద్యుల(ఎంబీబీఎస్) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 325 పోస్టులు ఖాళీలు ఉన్నట్టు ఆరోగ్య సంచాలకుల లెక్కల్లో తేలింది. అసలే 200 మందికి పైగా స్పెషలిస్ట్ వైద్యులు లేక అల్లాడుతున్న ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో ఉన్న వైద్యుల్లో 125 మంది బోధనాస్పత్రులకు వెళ్లడం మరింతగా ఇబ్బందిగా మారింది. 120 సీహెచ్సీలకు.. 13 సీహెచ్సీల్లోనే వైద్యులు రాష్ట్రంలో డెరైక్టర్ ఆఫ్ హెల్త్(ఆరోగ్య సంచాలకులు) పరిధిలో 120 సామాజిక ఆరోగ్య కేంద్రాలు(సీహెచ్సీ) ఉన్నాయి. ఇవి ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల గర్భిణులకు ప్రసవ కేంద్రాలుగా ఉండాలి. ప్రతి ఆస్పత్రిలోనూ అనస్థీషియా, పీడియాట్రిక్, గైనకాలజీ వైద్యుల బృందం ఉండాలి. కానీ 120 సీహెచ్సీలకు పదమూడింటిలోనే ముగ్గురు వైద్యుల బృందం ఉన్నట్టు తేలింది. మిగతా 107 సీహెచ్సీల్లో వైద్యుల కొరత ఉంది. సుమారు 20 సీహెచ్సీల్లో ముగ్గురు వైద్యులూ లేనివి ఉన్నాయి. ఇక్కడ కేవలం ఎంబీబీఎస్ వైద్యులే ఉంటున్నారు. నవంబర్లో నోటిఫికేషన్!: అక్టోబర్ 10లోగా సాధారణ బదిలీల ప్రక్రియ ముగుస్తుందని, ఆ తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. మొత్తం 400కుపైగా వైద్య పోస్టులకు నవంబర్లో నోటిఫికేషన్ ఇస్తామని పేర్కొన్నాయి. -
మింగేస్తున్నారు!
నిజామాబాద్ అర్బన్ : ఆసుపత్రి అభివృద్ధి సంఘం నిధులు పక్కదారి పడుతున్నాయి. సౌకర్యాల ఏర్పాటుకు, పరికరాల కొనుగోలుకు వినియోగించుకోవాల్సిన ఈ నిధులను కొందరు అధికారులు తప్పుడు బిల్లులతో తమ జేబులలోకి పంపుతున్నారు. అసలే ఆరోగ్య కేంద్రాలలో రోగుల సంఖ్య తక్కువ. నిధుల ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. అధికారులు మాత్రం ఖర్చు పేరిట నిధులను మింగేస్తున్నారు. దీంతో ఏటా లక్షలాది రూపాయలు దుర్వినియోగమవుతున్నాయి. ఇదీ పరిస్థితి జిల్లాలో 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మూడు ఏరియా ఆసుపత్రులు, ఒక జిల్లా ఆసుపత్రి, మూడు కమ్యూనిటీ ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్ర సర్కారు ఏటా ఆసుపత్రి అభివృద్ధి సంఘాలకు నిధులను విడుదల చేస్తుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 1.75 లక్షలు, ఏరియా, కమ్యూనిటీ ఆస్పత్రులకు రూ.రెండు లక్షలు, జిల్లా ఆసుపత్రికి రూ. ఐదు లక్షల చొప్పున నిధులు వస్తాయి. ఆసుపత్రి భవనం నిర్వహణ, రంగులు వేయడం, పిచ్చిమొక్కలు తొలగించడ ం, అభివృద్ధి పనులు చేపట్టడం, ఆపరేషన్ థియేటర్కు పనిముట్లు, ఇతర సౌకర్యాలకు ఈ నిధులను వినియోగించాల్సి ఉంటుంది. ఆసుపత్రి అభివృద్ధి సంఘాలకు ఎస్ పీహెచ్ఓలు కన్వీనర్లుగా ఉంటారు. వీరు మెడికల్ ఆఫీసర్, ఇతర సభ్యులతో చర్చించి నిధులను ఖర్చు చేయాలి. కానీ ఎక్కడ కూడా ఇలా జరుగడం లేదు. మెడికల్ ఆ ఫీసర్లు తూతూ మాత్రంగంగానే సంతకాల సేకరించి నిధులు వినియోగిస్తున్నారు. పాత బిల్లులను తాజాగా చూపెడుతూ వాటిని దుర్వినియోగం చేస్తున్నారు. పాత బిల్లులే ఎల్లారెడ్డి డివిజన్లోని నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మూడేళ్ల నుంచీ ఒకే రకం బిల్లులు సమర్పించినట్టు సమాచారం. మోర్తాడ్ పరిధిలోని ఓ ఆరోగ్య కేంద్ర ంలోనూ ఇదే వ్యవహరం కొనసాగుతోందని అంటున్నారు. బాన్సువాడ పరిధిలోని ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొరం వేసినట్లు మూడుసార్లు అదే బిల్లు పెడుతూ రూ. లక్ష 30 వేలు కాజేశారని తెలిసింది. డిచ్పల్లి పరిధిలోని మొక్కల పెంపకం పేరిట రెండేళ్లుగా 1.75 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు బిల్లులు సమర్పించారు. వా స్తవానికి మొక్కల పెంపకం అనేది అక్కడ లేనేలేదు. ఇలా ఆయా పీహెచ్సీలలో తప్పుడు బిల్లులతో నిధులను కాజేస్తున్నారు. ప్రతి సంవత్సరం జరిగే ఆడిట్కు భారీ మొత్తంలో ముడుపులు చెల్లిస్తూ తప్పించుకుంటున్నారు. ఓ అధికారికి రూ. 25 వేలు, మండల స్థాయి అధికారికి రూ. 15 వేలు, కార్యాలయ సూపరిడెంట్కు రూ. 10 వే ల రూపాయల చొప్పున పంచుతున్నట్టు తెలిసింది. అధికారి శుభకార్యానికి అభివృద్ధి నిధులు ఇటీవలే ఓ అధికారి తన ఇంటిలో శుభకార్యం నిర్వహించారు. ఇందుకోసం వైద్యుల నుంచి రూ. 20 వేల చొప్పున ఖర్చుల నిమిత్తం వసూలు చేశారని సమాచారం. ఓ సూపరిడెంట్ మధ్యవర్తిగా ఉండి ఈ వ్యవహారం నడిపించారని తెలిసింది. ఆసుపత్రి అభివృద్ధి నిధులు ఉన్నాయి కదా.. పాత బిల్లులనే తిరగేసి డబ్బులను అందిం చాలంటూ చెప్పుకచ్చారు. ఓ సీనియర్ వైద్యాధికారి డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో ఆయనను ఇన్చార్జి పదవి నుంచి తప్పించారు. ముందే డబ్బులు ఇచ్చిన ఓ వైద్యుడికి జిల్లా కేంద్రంలో డిప్యూటేషన్ ఇచ్చారని అంటున్నారు. డబ్బులు ఇవ్వని వైద్యాధికారులకు తనిఖీల పేరిట ఆందోళన కలిగించిన అంశాలే ఎక్కువగా ఉన్నా యి. సమగ్రంగా విచారణ జరిపితే అసలు నిధుల దుర్వినియోగం బయటపడే అవకాశం ఉంది. -
డెంగీ పంజా
ఉట్నూర్ : జిల్లా వ్యాప్తంగా 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ) ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాయి. మూడు నెలల కాలంలో పెంబి, మందమర్రి, భీమిని, లింగాపూర్, ఇంద్రవెల్లి, కడెం, బెల్లంపల్లి, అడ, లక్ష్మణచాంద, వెలుమలబోబ్బారం, సారంగాపూర్, ఉట్నూర్ పీహెచ్సీల పరిధిలోని 23 సబ్సెంటర్లు, 56 గ్రామాల్లో వైద్య పరీక్షలు జరిగాయి. 940 మందికి పరీక్షలు నిర్వహించగా 300మందికి పైగా అనుమానాస్పద కేసులు, 45 డెంగీ కేసులు అధికారికంగా నమోదయ్యాయి. జిల్లాలో సరైన వైద్యం అందక ప్రజలు పొరుగు ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. రోజూ జిల్లా నుంచి పదుల సంఖ్యలో డెంగీ బాధితులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కరీంనగర్, నిజామాబాద్, యావత్మాల్ వంటి ప్రాంతాలకు పోతున్నారు. అధికార యంత్రాంగం ప్రభుత్వానికి డెంగీ కేసుల సంఖ్య తక్కువ చేసి చూపిస్తుందనే ఆరోపణలు వెళ్లువెత్తున్నాయి. అధికారులు పదుల సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నా వెలుగులోకి రాని కేసులు వందల సంఖ్యలో ఉంటాయని సంబంధిత అధికారులు చర్చించుకోవడం గమనార్హం. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు డెంగీ సోకిన మామూలు జ్వరంలా భావిస్తూ పీహెచ్సీల్లో చికిత్స తీసుకుని ఇంటిముఖం పడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రెండు ప్రాంతాల్లోనే డెంగీ నిర్ధారణ కిట్స్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో డెంగీ కారక దోమల వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. డెంగీ వ్యాధిని నిర్ధారణ చెసే పరీక్ష కేంద్రాలు జిల్లాలో కేవలం రిమ్స్, మంచిర్యాల ఏరియా ఆస్పత్రుల్లోనే ఉన్నాయి. దీంతో స్థానికంగా వైద్యులు డెంగీ అని నిర్ధారణ చేయడమే ఆలస్యం చికిత్స కోసం కరీంనగర్ వంటి పట్టణాలకు తరలి పోతున్నారు. కాగా, ఏజెన్సీలో గిరిజనుల పరిస్థితి దయనీయంగా మారింది. అడవిబిడ్డలు డెంగీ నిర్దారణ అవుతున్నా రిమ్స్, మంచిర్యాల వంటి దూర ప్రాంతాలకు వెళ్లి వ్యాధి నిర్దారణ చేసుకునేంత స్థోమత లేక పోవడంతో పీహెచ్సీ, గ్రామాల్లోకి వచ్చే ఆర్ఎంపీలతో వైద్యం చేయించుకుని ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. గిరిజనుల సౌకర్యం కోసం డెంగీ నిర్దారణ కిట్స్ ఉట్నూర్ కేంద్రంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని గిరిజన సంఘాల నాయకులు, గిరిజనులు కోరుతున్నారు. అధికారులు మాత్రం డెంగీ నిర్దారణ కిట్స్ ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అని పేర్కొంటున్నారు. లోపిస్తున్న పారిశుధ్యం గ్రామాల్లో పారిశుధ్యం లోపిస్తుండటంతో పట్టించుకునే వారు కానరావడం లేదు. గ్రామ పంచాయతీలకు 13వ ఆర్థిక సంఘం, ఎస్ఎఫ్సీ నిధులు విడుదలైనా సదరు సర్పంచ్లు పూర్తిస్థాయిలో పారిశుధ్య నివారణకు ఖర్చుచేయడం లేదు. ఇంకా, పారిశుధ్య నివారణకు సబ్సెంటర్లకు వచ్చే అన్టైడ్, గ్రామ పంచాయతీలకు వచ్చే శానిటేషన్ నిధుల్లో ఎన్ఆర్హెచ్ఎం భారీ కోత పెట్టడంతో గ్రామాల్లో పారిశుధ్యం, క్లోరినేషన్ పట్టించుకునే వారు లేకుండా పోయారు. దోమల నివారణకు గ్రామాల్లో మొదటి విడతలో భాగంగా దాదాపు రూ.12.50 లక్షలతో ఐఆర్ఎస్ స్ప్రే చేయించామని అధికారులు చెబుతున్నారు. 866 గ్రామ పంచాయతీల్లో రూ.21.06 లక్షల వ్యయంతో 1,056 లీటర్ల బెటైక్ స్ప్రే చేయిస్తున్నామని అధికారులు చెబుతున్నా మారుమూల ప్రాంతాల్లో కానరావడం లేదు. ఫలితంగా గ్రామాల్లో దోమల వ్యాప్తి వేగంగా విస్తరిస్తూండటంతో డెంగీ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి దోమల నివారణకు చర్యలు తీసుకుని, బాధితులకు సరైన చికిత్స అందించాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తలు పాటిస్తే సరి.. వైరస్ వల్ల సోకే ఈ వ్యాధి ఏడిస్ రకం దోమకాటు వల్ల వ్యాపిస్తుంది. ఈ దోమలు పగలు, రాత్రి కుడుతాయి. చిన్నగా, నల్లగా ఉండే ఈ దోమలపై తెల్లని మచ్చలుంటాయి. ఈ దోమలు మురుగులో జీవించలేవు. ఇళ్లలోని ఖాళీ కుండీలు, నీటితొట్టెలు, తాగేసిన కొబ్బరి బొండాలు, వాడని వాహనాల టైర్లలో నిలిచే నీటిలో మాత్రమే పెరుగుతాయి. ఇళ్లతోపాటు పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చూసుకోవడం ద్వారా డెంగీ బారిన పడకుండా ఉండవచ్చు. లక్షణాలు.. డెంగీ జ్వరం, డెంగీ హెమరేజ్, డెంగీ షాక్ సిండ్రోమ్ లక్షణాలు కల్గించే ఈ వ్యాధి హఠాత్తుగా వచ్చే తీవ్రమైన జ్వరంతో మొదలవుతుంది. కాళ్లు కదిలించలేని పరిస్థితి ఉంటుంది. ఎముకలు, కండరాలలో భరించలేని నొప్పి, శరీరంపై పొక్కులు వస్తాయి. వాంతులు, వికారం, రక్తంతో కూడిన మలవిసర్జన, బరువు వేగంగా తగ్గడం వంటివి వ్యాధి ప్రధాన లక్షణాలు. దీంతో రోగి శరీరంలో ప్లేట్లెట్స్ పడిపోయి ప్రాణాలు కోల్పోతాడు. సకాలంలో వైద్యుడిని ఆశ్రయించి చికిత్స పొందాలి. వ్యాధి తగ్గే వరకు ఆస్పత్రిలో ప్లేట్లెట్స్ ఎక్కించుకోవాలి. అశ్రద్ధ చేస్తే ప్రాణాంతకంగా మారుతోంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంగీ నివారణ అంటే... దోమలనుంచి రక్షించు కోవడమనే విషయం గుర్తుంచుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలి. సాధ్యమైనంత వరకు శరీరాన్ని పూర్తిగా కప్పేసే దుస్తులు వాడటం అవసరం. దోమతెరలు వాడాలి. ఇంటి కిటికీలు, తలుపులకు జాలీలు బిగించుకోవాలి. ఇంటి లోపల, బయట నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలి. నీటి తొట్టెలను వారం రోజులకు ఒక సారి ఖాళీ చేసి, శుభ్రం చేసి మళ్లీ నింపుకోవాలి. తాగి వదిలేసిన కొబ్బరి బొండాలు, పాత టైర్లు, ఖాళీ డబ్బాలు, పనికి రాని వస్తువులు ఇంటితోపాటు పరిసరాల్లో లేకుండా చేసుకోవాలి. ఎయిర్ కూలర్, ఎయిర్ కండీషనరు, ఫ్లవర్వాజ్, ఫిష్ అక్వెరియాల్లో తరుచూ నీటిని మార్చాలి. వాటర్ ట్యాంక్ల మూతలను వేసి ఉంచాలి. ఇళ్లలో, పరిసర ప్రాంతాల్లో దోమల నివారణ మందులు చల్లించుకోవాలి. లార్వాలను నివారించడానికి కాల్వల్లో గంబ్యూసియా చేపలను వదలాలి. -
రోగాల దాడి
నిజామాబాద్ అర్బన్: ఈ ఏడాది సీజనల్ వ్యాధుల ప్రభా వం తీవ్రంగా ఉంది. గత రెండు నెలల నుంచి రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వారం రోజులుగా వైరల్ ఫీవర్ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ మార్పులతోనే జ్వరపీడితులు పెరుగుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. అపరిశుభ్రత, దోమల బెడద ప్రజలను వ్యాధిగ్రస్తులను చేస్తున్నాయి. తగు చర్యలు తీసుకోవడంలో వైద్యశాఖ పూర్తిగా విఫలమమవుతోంది. ఇదీ పరిస్థితి జిల్లాలో 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 375 ఆరోగ్య ఉపకేంద్రాలు, మూ డు ఏరియా ఆసుపత్రులు ఉన్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా వీటిలో వైద్య సేవలు పొందుతారు. ఈ ఏడాది సీజనల్ వ్యాధుల నమోదు వేగంగా పెరుగుతోంది. మలేరియా కేసులు ఎక్కువగా నమోదువుతున్నా యి. గత ఏడాది రెండు నెలలలో 33 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 46 కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ అర్బన్, బాల్కొండ మండలం సరి హద్దు ప్రాంతంలో దీని ప్రభావం అధికంగా ఉంది. దోమల బెడదతో జ్వరా లు అధికంగా ప్రబలుతున్నాయి. డయేరియా కేసులు 44 నమోదయ్యాయి. అతిసార 114, కలుషిత ఆహారం 18 కేసులు నమోదయ్యాయి. డెంగీ అధికంగా ప్రభావం చూపుతుంది. గత ఏడాది ఆరు కేసులు నమోదు కాగా, ప్ర స్తుతం 14 కేసులు నమోదయ్యాయి. ఎడపల్లి గురుకులం విద్యార్థులు సుమారు 50మంది జ్వరంతో బాధపడుతున్నారు. సదాశివనగర్ మండలం గొకుల్తండాలో సుమారు 30మంది వరకు అతిసార వ్యాధి బారిన పడ్డారు. చిన్నారులు కూడా జ్వర పీడితులు, న్యూమోనియా బాధితులతో ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులు నిండిపోతున్నాయి. రోజుకు 200 నుంచి 300 మంది వరకు రోగులు ఆసుపత్రులకు వస్తున్నారు. జిల్లా కేంద్రంలోని చిన్నపిల్లల ఆసుపత్రులలో సుమారు 40 నుంచి 50 వరకు చిన్నారులు జ్వరాలతో చేరుతున్నారు. జిల్లా ఆసుపత్రిలో ఔట్ పేషెంట్ల సంఖ్య 320 నుంచి 380 వరకు పెరిగింది. అధికారులేం చేస్తున్నారో! వ్యాధులను నియంత్రించడంలో వైద్య ఆరోగ్యశాఖ విఫలమవుతోంది. ముం దస్తుగానే ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఆయా మండలాలకు ఇన్చార్జిల ను నియమించాల్సి ఉంటుంది. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కలిగించాల్సి ఉంటుంది. మందులను అందుబాటులో ఉంచి, పంచాయతీ రాజ్, గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి సమన్వయంతో పని చేయాల్సి ఉంటుంది. కానీ, వీరు నేటి వరకు సమావేశాలు నిర్వహించ లేదు. గ్రామాలు, పట్టణాలు, నగరంలో పారిశుధ్య పనులు కూడా సక్రమంగా సా గడం లేదు. వైద్య సేవలను పరిశీలించాల్సిన జిల్లా అధికారి, క్లస్టర్ అధికారు లు కార్యాలయానికే పరిమితమవుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సమావేశాల పేరిట తరచూ హైదరాబాద్కు వెళ్లడం, అందుబాటులో ఉ న్నప్పుడు జిల్లా కేంద్రంలో సమావేశాలలో పాల్గొనడంతో ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవల తీరు ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా జిల్లా సరిహద్దు ప్రాంతాలలో పరిస్థితి దారుణంగా ఉంది. అధికారులు మాత్రం వ్యాధులకు సంబంధించిన వివరాలను, పరిస్థితులను తెలియజేసేందుకు నిరాకరిస్తున్నారు. జిల్లా వైద్యాధికారి గోవింద్వాగ్మారే వివరణ కోరగా స్పందించ లేదు. -
అంబులెన్సులు వద్దట.. ఆటోలే ముద్దట..
ఉట్నూర్ : ఏజెన్సీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు ఐటీడీఏ పీవో ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. ఏజెన్సీలో వ్యాధుల సీజన్ ప్రారంభం అవ్వడంతో ప్రభుత్వం పీహెచ్సీలకు అద్దె ప్రాతిపదికన అంబులెన్సుల ఏర్పాటుకు ఐటీడీఏ ద్వారా చర్యలు చేపట్టింది. దీనిపై ఇన్చార్జి పీవో ప్రశాంత్ పాటిల్ ప్రత్యేక దృష్టి సారించి ఆయా వైద్యాధికారులు పీహెచ్సీలకు ట్రాక్స్ లేదా మాక్స్లాంటి అంబులెన్సులను అద్దె ప్రాతిపదికన సమకూర్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఏజెన్సీలోని 27 పీహెచ్సీలకు రూ.5.78 లక్షలు జూలై 26న పీహెచ్సీల ఖాతాల్లో జమ చేశారు. అయినా.. సదరు వైద్యాధికారులు మారుమూల ప్రాంతాలకు అంబులెన్సులు వెళ్లలేవు అనే సాకుతో ఆటోలనే అద్దె ప్రాతిపదికన వినియోగిస్తామని మెలిక పెడుతున్నారు. ఫలితంగా గిరిజన గ్రామాల నుంచి వ్యాధిగ్రస్తులను, జ్వరపీడితులను తరలించేందుకు అంబులెన్సులు లేక గిరిజనులకు ఎండ్లబండ్లే దిక్కవుతున్నాయి. అంబులెన్సులు ఎత్తివేసి అద్దె అంబులెన్సులకు నిధులు.. 1999లో ఐటీడీఏ పరిధిలోని పీహెచ్సీల్లో గిరిజనులకు అత్యవసర వైద్యం అందించడానికి ఏన్ఎస్ఏఫ్డీసీ (నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబల్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ద్వారా ఏజెన్సీ పీహెచ్సీలకు ఉన్న అంబులెన్సులను ప్రభుత్వం గత అక్టోబర్ నెలలో రద్దు చేసింది. అదే సమయంలో వైద్యశాఖ ప్రత్యామ్నాయంగా ఏజెన్సీలోని 31 పీహెచ్సీల పరిధిలో గిరిజన గ్రామాల నుంచి పీహెచ్సీలకు గిరిజనులను తరలించడానికి అద్దె ప్రాతిపాదికన అంబులెన్సుల ఏర్పాటుకు రూ.80 లక్షలు విడుదల చేసింది. ఈ ఆగస్టు నెల నుంచి మూడు నెలలపాటు ఏజెన్సీలో వ్యాధుల సీజన్. దీంతో వ్యాధులు, జ్వరాల తీవ్రత అంతగా లేని దండేపల్లి, ఈజ్గాం, తాళ్లపేట, మందమర్రి పీహెచ్సీలు మినహా మిగతా వాటికి ఆగస్టు 1 నుంచి అంబులెన్సులు సమకూర్చుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అంకోళి, గిన్నెధరి, సిర్పూర్(యు), జైనూర్, శ్యాంపూర్ పీహెచ్సీలకు ప్రభుత్వ అంబులెన్సు ఉండటంతో వీటికి నెలకు పది వేల చొప్పున, అంబులెన్సులు లేని దంతన్పల్లి, హస్నాపూర్, ఇంద్రవెల్లి, పిట్టబొంగరం, నార్నూర్, జరి, గాదిగూడ, లింగపూర్, కెరమెరి, అడ, వాంకిడి, నే రడిగొండ, ఇచ్చోడ, బజార్హత్నుర్, నర్సాపూర్(టి), గుడిహత్నూర్, భీంపూర్, సైద్పూర్, కాసిపేట, లోన్వెల్లి, తిర్యాణి, రోంపల్లి పీహెచ్సీలకు నెలకు రూ.24 వేల చొప్పున చెల్లించేందుకు సిద్ధమైంది. అయితే.. పీహెచ్సీల వైద్యాధికారులే ట్రాక్స్ లేదా మాక్స్ లాంటి వాహనాలు సమకూర్చుకోవాలని ఆదేశాలు జారీ చేసి జూలై 26న ఆగస్టు నెలకు సంబంధించిన అద్దె రూ.5 లక్షల 78 వేలు ఆయా పీహెచ్సీల ఖాతాల్లో జమ చేశారు. నిధులు జమ అయి నెల గడుస్తున్నా ఇంతవరకు అద్దె అంబులెన్సులు కానరవడం లేదు. అద్దె కక్కుర్తికేనా..? పిట్టబొంగరం పీహెచ్సీ వైద్యాధికారులు మినహా ఇతర పీహెచ్సీల వైద్యాధికారులు అద్దె అంబులెన్సులు ఏర్పాటు చేసుకోలేదు. పైగా మారుమూల గ్రామాలకు అంబులెన్సులు వెళ్లలేవని సమాధానమిస్తున్నారు. అదీకాక రూ.24 వేల అద్దెకు ఎవరూ ముందుకు రావడం లేదని మెలికలు పెడుతున్నారు. దీనికితోడు ఆటోల ద్వారా ఏ ప్రాంతానికైనా వెళ్లొచ్చని ఉచిత సలహాలు సైతం ఇస్తున్నారు. దీనికి పై అధికారులు ససేమిరా అంటున్నారు. 20 రోజులపాటు అంబులెన్సులు గ్రామాల్లో తిప్పి మరో పది రోజులు ఆటోలో వెళ్లాలని సూచిస్తున్నారు. అయినా.. వైద్యాధికారులు పట్టించుకోవడం లేదు. అయితే.. అంబులెన్సులు కాకుండా ఆటోలు అద్దెకు పెట్టుకోవడం ద్వారా గ్రామాల నుంచి రోగులను తరలించడం సాధ్యం కాదు. ఆటోలో ఎలాంటి వైద్య సదుపాయాలు కూడా ఉండవు. దీంతో రోగులకు అత్యవసర వైద్యం అందకుండా పోతుంది. అంబులెన్సులో అయితే.. ఒకేసారి ఇద్దరు లేదా ముగ్గురు రోగులనైనా తరలించొచ్చు. ఇదిలా ఉంటే.. ఆటోలకైతే రూ.24 వేలు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఎంతో కొంత ముట్టజెప్పి మిగతా మొత్తాన్ని జేబులో వేసుకోవచ్చని ఆయా పీహెచ్సీ వైద్యాధికారులు యోచిస్తుండడం గమనార్హం. -
ఇక ఊరూరా వైద్య సేవలు
నిజామాబాద్ అర్బన్ : తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటున్న నిర్ణయాలతో జిల్లాలో ప్రభుత్వ ఆ స్పత్రుల తీరు మరింతగా మెరుగుపడనుంది. ప్రతి పల్లెకు సంపూర్ణ వైద్య సేవలు అందిస్తామని ఇటీవలే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య ప్రకటించారు. ఇం దులో భాగంగానే, జిల్లాలో పెరిగిన జనాభాకు అనుగుణంగా ప్రతి గ్రామానికి ప్రభుత్వ వైద్య సేవలు అందించేందుకు కొత్త విధానాలు అమలులోకి రానున్నాయి. ఇందుకు కావలసిన సౌకర్యాలు సమకూర్చాలని కోరుతూ జిల్లా వైద్య ఆరో గ్యశాఖ అధికారులు ఇటీవలే ఉన్నతాధికారులకు ఓ నివేదికను సమర్పించారు. కొత్తగా మరిన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు ఏర్పాటు చేయాలని, పట్టణ ఆరోగ్య కేంద్రాల స్థాయిని పెంచాలని నివేదించారు. ఇదీ పరిస్థితి జిల్లాలో ఇప్పటికే 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మూడు ఏరియా ఆస్పత్రులు, 377 ఆరోగ్య ఉప కేంద్రాలు,ఆరు కమ్యూనిటీ ఆస్పత్రులు ఉన్నాయి. పెరిగిన జనాభాకు అనుగుణంగా కొత్తగా మరో 25 ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. జిల్లాలో 25.51 లక్షల జనాభా ఉంది. ప్రతి 30 వేల నుంచి 40 వేల జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలి. అదే విషయాన్ని నివేదికలో ప్రస్తావించారు. అదనంగా ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు ఉన్నతాధికారులు కూడా సుముఖంగా ఉన్న ట్లు తెలిసింది. గతంలోనే తొమ్మిది ఆరోగ్య కేంద్రాలను మంజూరు చేశారు. తిర్మన్పల్లి, చౌట్పల్లి, పోచంపాడ్, కిషన్నగర్, గోవింద్పేట, దేవునిపల్లి, పెగడపల్లి, ఏర్గట్ల, పుల్కల్ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు అనుమతి వచ్చిం ది. వీటి ఏర్పాటుకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. ఇవే కాకుండా భీమ్గల్, బాన్సువాడ డివిజన్, ఆర్మూర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి డి విజన్, నిజామాబాద్ రూరల్లో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటు చే యాలని నిర్ణయించారు. ముఖ్యంగా తండాలలో ఆరోగ్య ఉప కేంద్రాలను ఏ ర్పాటు చేయాలని విన్నవించారు. ఇందుకు అనుగుణంగా వై ద్యులు, సిబ్బం దిని అదనంగా నియమించనున్నారు. ఈ ఆస్పత్రులలలో అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులో ఉంచనున్నారు. గర్భిణీలకు మందులు, ప్రసవాని కి సంబంధించి సేవలు, రోగ నిర్ధారణ పరీక్షలు, మందులను అక్కడే అందించాలని నిర్ణయించారు. ఇక్కడ కూడా పట్టణ ఆరోగ్య కేంద్రాల స్థాయిని పెంచాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. వీటిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుగా మార్చనున్నారు. లక్ష వరకు జనాభా ఉన్న ప్రాంతాన్ని ఒక సర్కిల్గా తీసుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించి ఎన్ఆర్హెచ్ఎం సర్వే ప్రకారం విశ్లేషణ జరుగుతోంది. జిల్లాలో పది పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో ఏడు, బోధన్లో రెండు, కామారెడ్డిలో ఒకటి ఉన్నాయి. ఇందులో వైద్యుడు, ఇద్దరు ఏఎన్ఎంలు, కమ్యూనిటీ మొబైల్ ఆఫీసర్, ఇద్దరు అటెం డర్లు, ఒకరు ఫార్మసిస్టు ఉంటారు. స్థాయి పెరిగితే సిబ్బంది సంఖ్య కూడా పెరుగుతుంది. ప్రతి రోగానికి సంబంధించి మందులు, వైద్యసేవలు అందుబాటులో ఉంచుతారు. -
ప్రతి వ్యక్తికీ వైద్యం
ఏజెన్సీలో మందుల కొరత లేకుండా చూడాలి మాత, శిశు మరణాలు అరికట్టాలి ముంపు గ్రామాలకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచాలి ఏజెన్సీలో సర్కారు వైద్యం విస్తరించాలి అధికారులకు డిప్యూటీ సీఎం రాజయ్య ఆదేశం ఐటీడీఏలోని వైద్య, ఆరోగ్యశాఖ, జీసీసీపై సమీక్ష సివిల్ ఆస్పత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల తనిఖీ ఏటూరునాగారం : ఏజెన్సీలోని ప్రతి వ్యక్తికీ సర్కారు వైద్యం అందాలని, అటవీ గ్రామాల్లోని ప్రతి వ్యక్తికి వైద్య సేవలు అందించే విధంగా వైద్య, ఆరోగ్యశాఖ సేవలు విస్తరించాలని డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య అధికారులను ఆదేశించారు. ఏటూరునాగారం మండల కేంద్రంలోని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) కార్యాలయంలో సోమవారం గిరిజన సంక్షేమం, వైద్య, ఆరోగ్యశాఖల అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. ఏజెన్సీలో మాత, శిశు మరణాలు అరికట్టేందుకు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల గోడలపై వైద్యులు, సిబ్బంది పేర్లు, సెల్ నంబర్లు తప్పకుండా రాయాలన్నారు. స్థానికంగా ఉండని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 53 ముంపు గ్రామాలకు ముందస్తుగా మందులు వర్షకాలంలో 53 గ్రామాల ముంపు బాధితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ముందస్తుగానే మందులను నిల్వ ఉంచాలన్నారు. ఐటీడీఏ పరిధిలోని 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులను విడివిడిగా సమస్యలు, సౌకర్యాలు, అందించిన సేవల విషయాలను అడిగి తెలుసుకున్నారు. క్లోరినేషన్, శానిటేషన్, జ్వరాల నిర్మూల కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశామని డీఎంహెచ్ఓ పిల్లి సాంబశివరావు డిప్యూటీ సీఎంకు తెలిపారు. గత ఏడాదిలో జిల్లాలో 10520 పైలేరియా కేసులు నమోదయ్యూనని చెప్పారు. జవహర్ ఆరోగ్య రక్ష పథకంలో భాగంగా 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించామన్నారు. ములుగులో బ్లడ్ బ్యాంక్, ట్రామా కేర్ సెంటర్, ఇంకా 15 సబ్సెంటర్లు, 10 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటయ్యేవిధంగా చూడాలని ఉప ముఖ్యమంత్రికి విన్నవించారు. తాడ్వాయి మండలం మేడారంలో 30 పడకాల ఆస్పత్రి కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. జీసీసీ ద్వారా మరింత సేవలు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా ముంపు గ్రామాలకు మూడు నెలల పాటు సరిపడే నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచాలని జీసీసీ డీఎం జోగేశ్వర్రావును డిప్యూటీ సీఎం ఆదేశించారు. జీసీసీ ద్వారా పెట్రోల్ బంక్లు, తేనెశుద్ధి, సబ్బు కర్మాగారం, గిరిజన సూపర్ బజార్లు, జనరిక్ మందులు, ఎల్పీజీ గ్యాస్ల గోదాం, మిర్చి కోల్డ్ స్టోరేజ్లను నిర్మిస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని జోగేశ్వర్రావు వివరించారు. ఐటీడీఏ సెక్టార్ అధికారులతో రివ్యూ గిరిజన సంక్షేమం ఇంజినీరింగ్ విభాగంలో ఇప్పటి వరకు ఎన్ని భవనాలు పూర్తయ్యాయి, ఇంకా పూర్తి కావాల్సిన పనులపై ఈఈ వసంత డిప్యూటీ సీఎంకు వివరించారు. ఇంజనీరింగ్ విభాగం నుంచి 29 పథకాల ద్వారా 876 పనులకు గాను 496 పనులు పూర్తి కాగా, 225 పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఈజీఎస్ కింద మారుమూల అటవీ గ్రామాలకు అనుసంధానం చేస్తూ 101 మెటల్ రోడ్లు నిర్మాణాలు పూర్తయ్యాయని, ఐఏపీ కింద 64 సీసీ రోడ్లు పూర్తి చేసినట్లు వసంత పేర్కొన్నారు. మైనర్ ఇరిగేషన్ ద్వారా 68 పనులు చేపట్టగా.. 24 పూర్తి చేశామని, 44 పురోగతిలో ఉన్నాయని మైనర్ ఇరిగేషన్ ఈఈ సుధీర్ వివరించారు. రోడ్డు విస్తరణ ఎప్పుడు? ఏటూరునాగారం నుంచి పస్రా వరకు ఉన్న సింగిలేన్ ఎందుకు విస్తరణ జరగడం లేదని ఎన్హెచ్ ఈఈ సత్యనారాయణను రాజయ్య ప్రశ్నించారు. సమీక్ష సమావేశంలో ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యే చందూలాల్, కలెక్టర్ కిషన్, ఐటీడీఏ పీఓ సుధాకర్రావు, డిపూటీ డీఎంహెచ్ఓ దయానందస్వామి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్కుమార్, జెడ్పీ సీఈఓ ఆంజనేయులు, ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ కృష్ణజ్యోతి, డీఎఫ్ఓ లింగారావు, ములుగు ఆర్డీఓ మోతీలాల్, డిప్యూటీ డెరైక్టర్ సావిత్రి, ఎంపీడీఓ, తహసీల్దార్లు, సీడీపీఓలు, ఐటీడీఏ మేనేజర్ సురేందర్, డీఎస్ఓ సురేష్బాబు పాల్గొన్నారు. ఆస్పత్రుల తనిఖీ అంతకుముందు మంత్రి రాజయ్య ములుగు సివిల్ ఆస్పత్రి, తాడ్వారుు లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలోని వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా కొందరు రోగులను పరీక్షించారు. ఆస్పత్రులలో మాజీ ముఖ్యమంత్రి ఫొటోలు ఉండడం చూసిన రాజయ్య..అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వైద్యం.. అచేతనం
కర్నూలు(హాస్పిటల్), న్యూస్లైన్: గ్రామీణ ప్రాంతాల్లో కనీస వైద్యం కరువు వైంది. వైద్యులు.. సిబ్బంది విధులకు డుమ్మా కొడుతుండటంతో ఆరోగ్య కేంద్రాలు దిష్టిబొమ్మలను తలపిస్తున్నాయి. జ్వరం వచ్చినా ప్రజలు జిల్లా కేంద్రానికి పరుగులు తీయాల్సి వస్తోంది. పర్యవేక్షించాల్సిన అధికారులు జిల్లా కేంద్రానికే పరిమితం అవుతున్నారు. జిల్లాలో 83 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ) ఉండగా.. ఇందులో 24 గంటల పాటు వైద్యసేవలందించే ఆరోగ్య కేంద్రాలు 40 ఉన్నాయి. వీటితో పాటు 16 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు(సీహెచ్సీ) వైద్య సేవలు అందిస్తున్నాయి. 2012లో క్లస్టర్ల వ్యవస్థను తీసుకొచ్చినా ఉపయోగం లేని పరిస్థితి నెలకొంది. పీహెచ్సీలు, సీహెచ్సీలను పర్యవేక్షించేందుకు ప్రతి క్లస్టర్కు ఒక ఎస్పీహెచ్వోను నియమించారు. ప్రస్తుతం ఓర్వకల్లు, ఆత్మకూరు, కోడుమూరు ఎస్పీహెచ్వో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇతర ఎస్పీహెచ్వోలను వాటికి ఇన్చార్జీలుగా నియమించారు. ఎస్పీహెచ్వోలు వారి క్లస్టర్ పరిధిలోని పీహెచ్సీలను పర్యవేక్షించాల్సి ఉన్నా.. అధిక శాతం ఎస్పీహెచ్వోలు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఎస్పీహెచ్వోలతో పాటు ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఆరోగ్య కేంద్రాలను పర్యవేక్షించాల్సి ఉన్నా చుట్టపుచూపుగా విధులకు హాజరవుతున్నారు. సగం మంది వైద్యులు, సిబ్బంది డుమ్మా ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా వైద్యవిద్యను అభ్యసించే ప్రభుత్వ వైద్యులు గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్వహించాల్సి ఉండగా అధిక శాతం వైద్యులు ఉదయం 10 గంటల తర్వాత వచ్చి ఒంటి గంటకే తిరిగి వెళ్తున్నారు. జిల్లాలో 210 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఉండగా 18 ఖాళీగా ఉన్నాయి. 192 మందిలో 28 మంది ఉన్నత విద్య(పీజీ) కోసం వెళ్లారు. వీరి స్థానంలో ఎవరినీ నియమించలేదు. 164 మందిలో సగం మంది వైద్యులు విధులకు డుమ్మా కొడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పీహెచ్సీల్లో పనిచేస్తే పీజీ సీట్లకు రిజర్వేషన్ వస్తుందనే భావనతో చేరుతున్నా విధులు మాత్రం నిర్వర్తించడం లేదు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారింది. సాధారణ జ్వరమొచ్చినా పల్లె నుంచి పట్టణంలోని ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీనికి తోడు ఆసుపత్రుల్లో వసతులు, సౌకర్యాలు, పరికరాల కొరతతో పాటు వైద్య సిబ్బంది, ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పర్యవేక్షణ లేకపోవడంతో ఎవరికి వారు యమునా తీరే చందంగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా సీహెచ్సీలలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. ఒక్కో సీహెచ్సీకి 4 నుంచి 5 పోస్టులు ఉండగా, అక్కడి వైద్యులు వంతుల వారీగా రోజుకొకరు చొప్పున విధులకు హాజరవుతున్నారు. ఏ రోజు సీహెచ్సీకి వెళ్లినా పూర్తి స్థాయిలో వైద్యులు ఉండరన్నది బహిరంగ రహస్యం. పత్తికొండ సీహెచ్సీలో నలుగురు మెడికల్ ఆఫీసర్లు ఉండగా రాత్రి విధుల్లో డెంటల్ డాక్టర్ను నియమించడం విమర్శలకు తావిస్తోంది. కొన్ని చోట్ల రాత్రి వేళల్లో స్టాఫ్నర్సుల సేవలే దిక్కవుతున్నాయి. వైద్యులే విధులకు డుమ్మా కొడుతుండటంతో కింది స్థాయి సిబ్బంది పనితీరు యథారాజా తథాప్రజ అన్నట్లు తయారైంది. వైద్యపరీక్షలూ బరువే... ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలతో పాటు వైద్య పరీక్షలు కూడా అటకెక్కాయి. సాధారణ హెచ్బీ, బ్లడ్షుగర్, బీపీ, మలేరియా శ్యాంపిల్, ఎక్స్రే వంటి సాధారణ పరీక్షలు చేసే వారు కూడా పీహెచ్సీల్లో కరువయ్యారు. కొన్ని పీహెచ్సీల్లో ల్యాబ్ పరికరాలు, ఎక్స్రే యూనిట్లు మూలనపడ్డాయి. ఈ నెపంతో అధిక శాతం కర్నూలు, నంద్యాల, ఆదోని డివిజన్ కేంద్రాల్లో డిప్యూటేషన్పై పనిచేస్తున్నారు. దీంతో వైద్యపరీక్షలు చేయించుకోలేక, వ్యాధి ముదిరి ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యం అందించడ మే కాకుండా వ్యాధులు ప్రబలకుండా చైతన్యపరచాల్సిన బాధ్యత కూడా వైద్య ఆరోగ్యశాఖపై ఉంది. అయితే ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు చేపట్టడంలో ఈ శాఖ పూర్తిగా వెనుకబడింది. ఈ బాధ్యతలను నిర్వర్తించాల్సిన మాస్ మీడియా విభాగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఈ విభాగంలో పనిచేసే ఉద్యోగులు అధిక శాతం డిప్యూటేషన్లపై జిల్లా కేంద్రంలో పనిచేస్తుండటం గమనార్హం. -
పోలియో చుక్కలు 80 శాతం పూర్తి
నారాయణఖేడ్ రూరల్, న్యూస్లైన్ : జిల్లాలో ఇప్పటి వరకు 80 శాతం మంది చిన్నారులకు పల్స్పోలియో చుక్కలు వేయడం పూర్తి అయినట్లు డీఎం అండ్ హెచ్ఓ పద్మ తెలిపారు. ఆదివారం నారాయణఖేడ్కు వచ్చిన సందర్భంగా ఆమె స్థానిక సీహెచ్ఎన్సీని సందర్శిం చారు. ఈ సందర్భంగా ఆమె పల్స్పోలియో మందును పంపిణీని పరిశీలించారు. అనంతరం మాట్లాడారు. జిల్లాలో 3.50 లక్షల మంది చిన్నారులకు, 2,342 బూత్ల ద్వారా, 9,368 సిబ్బందితో పల్స్ పోలియో చుక్కల మందు పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. నారాయణఖేడ్ క్లస్టర్లో 70 శాతం పూర్తయ్యిందన్నారు. 20, 21వ తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి మిగిన శాతాన్ని పూర్తి చేస్తారని ఆమె వివరించారు. ప్రభుత్వాస్పత్రుల్లో 57 శాతం ప్రసవాలు జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో ప్రస్తుతం 57 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని పద్మ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గర్భిణుల నమోదులో మెదక్ జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈనెల 450 ప్రసవాలు జరిగాయని తెలిపారు. పీహెచ్సీలో ప్రసవాలు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మార్పులో భాగంగా జనవరి 24న సిద్దిపేటలో గర్భిణుల కోసం ‘హైరిస్క్ కేర్ సెంటర్’ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని పీహెచ్సీల్లో వైద్యం కోసం 120 మంది వైద్యులు అవసరం ఉండగా ప్రస్తుతం 68 మంది వైద్యులు మాత్రమే ఉన్నారన్నారు. అయినా మెరుగైన సేవలు అందిస్తున్టన్లు వివరించారు. కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ భరత్ సత్యనారాయణ, వేణుగోపాల్, జట్ల భాస్కర్, మాణిక్యం, తదితరులు పాల్గొన్నారు.