Puri
-
‘చిన్న షేర్ల విషయంలో అప్పుడే హెచ్చరించాం’
మధ్య, చిన్నతరహా షేర్ల పతనంపై స్పందించవలసిన అవసరంలేదని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఛైర్పర్సన్ మాధవి పురీ బచ్ తాజాగా పేర్కొన్నారు. ఇటీవల మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు భారీగా పతనమవుతున్న నేపథ్యంలో బచ్ వ్యాఖ్యాలకు ప్రాధాన్యత ఏర్పడింది. అయితే గతేడాది మార్చిలోనే మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ అధిక విలువల్లో ట్రేడవుతున్నట్లు సెబీ హెచ్చరించిందని బచ్ గుర్తు చేశారు.నిజానికి చిన్న షేర్లపై అవసరమైన సందర్భంలో సెబీ ఆందోళన వ్యక్తం చేసినట్లు దేశీ మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్(యాంఫీ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ అంశంపై సెబీ మరోసారి స్పందించవలసిన అవసరం కనిపించడంలేదని స్పష్టం చేశారు. ఇటీవల మధ్య, చిన్నతరహా షేర్ల కౌంటర్లలో నిరవధిక అమ్మకాల కారణంగా కొన్ని షేర్లు 20 శాతానికి మించి పతనమయ్యాయి. ఫలితంగా మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో బేర్ ట్రెండ్ కనిపిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ రెండు విభాగాల్లోనూ షేర్లు అధిక విలువలకు చేరినట్లు 2024 మార్చిలోనే బచ్ ఇన్వెస్టర్లను హెచ్చరించడం గమనార్హం! కాగా.. ఇటీవల ప్రవేశపెట్టిన రూ.250 సిప్ పథకాలను ఫండ్ హౌస్లకు తప్పనిసరి చేయాలన్న ఆలోచనేదీ సెబీకి లేదని బచ్ తెలియజేశారు.వారసత్వ పెట్టుబడుల బదిలీకి ఎంతో కృషితొలి తరం క్యాపిటల్ మార్కెట్ ఇన్వెస్టర్ల పెట్టుబడులను వారి వారసులు పొందడంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ తెలిపారు. వారసులకు పెట్టుబడుల బదిలీని సులభతరం చేసే విషయంలో సెబీ ఎంతో కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఇన్వెస్టర్లు మరణించిన సందర్భాల్లో కొత్త సమస్యలు ఎదురవుతున్నట్టు పేర్కొన్నారు. ‘ఆ తరం ఇప్పుడు అంతరిస్తోంది. వారి వారసులు సెక్యూరిటీలను వారసత్వంగా పొందుతున్నారు. ఈ క్రమంలో 20 ఏళ్ల క్రితం లేనివి కూడా నేడు సమస్యగా మారుతున్నాయి. ఎందుకంటే ఆ పెట్టుబడులు ఎక్కడ ఉన్నాయన్నది వారసులు గుర్తించలేకపోతున్నారు’ అని బుచ్ వివరించారు.ఇదీ చదవండి: జనరల్ బోగీలో ప్రయాణిస్తున్నారా..? నిబంధనలు మార్పు?క్యాపిటల్ మార్కెట్ల పట్ల విశ్వాసంతో పెట్టుబడులు పెట్టిన తొలి తరం వారిని మార్గదర్శకులుగా ఆమె అభివర్ణించారు. ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్ రూపొందించిన యూనిఫైడ్ ఇన్వెస్టర్ యాప్ను ఆవిష్కరించిన అనంతరం ఆమె మాట్లాడారు. ఈ రెండు డిపాజిటరీల పరిధిలో ఒక ఇన్వెస్టర్ పేరిట వివిధ డీమ్యాట్ ఖాతాల్లో ఉన్న అన్ని రకాల హోల్డింగ్స్ను ఇందులో పొందుపరిచారు. ఆ నాటి ఇన్వెస్టర్ల వారసులకు పెట్టుబడుల గుర్తింపు విషయంలో ఇది ఉపయోగకరంగా ఉంటుందని బుచ్ చెప్పారు. -
నౌకా నిర్మాణంలోనూ ఆత్మనిర్భర్
పూరీ: నౌకల తయారీలో 2047కల్లా ఆత్మ నిర్భరత సాధించడంపై నావికాదళం దృష్టి పెట్టాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సూచించారు. నేవీ డే సందర్భంగా బుధవారం ఒడిశాలోని పూరీ సాగర తీరంలో జరిగిన వేడుకల్లో త్రివిధదళాధిపతి హోదాలో ఆమె పాల్గొన్నారు. మహిళా సాధికారతకు నేవీ తన వంతు కృషి చేస్తోందని ప్రశంసించారు. ‘‘ఐదు వేల ఏళ్ల పై చిలుకు ఘన చరిత్ర భారత నావికా రంగం సొంతం. దేశంలో తొలి మహిళా అగ్నివీర్లు నేవీలోనే చేరారు’’ అన్నారు. 15 యుద్ధనౌకలు, 37 వాయుసేన విమానాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఐఎన్ఎస్ జల్సా, మిసైల్, డి్రస్టాయర్ ఐఎన్ఎస్ ఢిల్లీ, ఐఎన్ఎస్ శక్తి, ఐఎన్ఎస్ సూర్య, ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ సతొపురా వంటి ప్రముఖ యుద్ధనౌకలతో పాటు జలాంతర్గాములూ ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. హాక్, సీ–కింగ్, మిగ్29కే వంటి యుద్ధవిమానాలు, చేతక్, ఎంఎస్ 60 హెలికాప్టర్లు, హాక్ విమానాల విన్యాసాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
సాగర వీరుల విన్యాసాలు.. నేవీ డే స్పెషల్ (ఫొటోలు)
-
విలన్గా తాతయ్య... హీరోగా మనవడి ఎంట్రీ.. అది కూడా ఏకంగా టాలీవుడ్లో! (ఫొటోలు)
-
పూరి జగన్నాథుడిని గణనాథుడిగా ఆరాధిస్తారని తెలుసా..!
భారతదేశంలో అత్యం ప్రసిద్ధి గాంచిన పూరీ క్షేత్రంలో జగన్నాథుడిని, బలభద్రుడిని ఏకదంతుడి రూపంలో ముస్తాబు చేసి మరీ పూజలు చేస్తారు. ఈ వేడుకనే ‘హాథీబేష’ (ఏనుగు వేషం) అని పిలుస్తారు. ఇలా ఆషాడ మాసంలో గణపతి రూపంలో ముస్తాబు చేసి మరీ జగన్నాథుడిని పూజిస్తారు. ఈ వేడు జేష్ట పౌర్ణమి రోజున జరగుతుంది. ఇలా పూరీ జగన్నాథుడుని పూజించడానికి కారణం ఉందంటూ.. మంచి ఆసక్తికర గాథ ఒకటి చెబుతుంటారు పండితలు. అదేంటంటే..పూర్వం రోజులలో పూరి రాజు దగ్గరికి గణపతి భక్తుడు అయిన గణపతి బప్ప అనే పండితుడు వచ్చాడు. ఆ సమయంలో పూరిలో జగన్నాథుడిని స్నాన యాత్ర వేడుకకు సిద్ధం చేస్తున్నారు. ఆ వేడుకలో పాల్గొనవల్సిందిగా గణపతి బట్టను రాజు ఆహ్వానిస్తాడు.దానికి ఆయన తాను గణపతిని మాత్రమే పూజిస్తానని, ఆయన తనకు అన్నీ అని చెబుతాడు. అయితే రాజు ఒత్తిడి చేయడంతో అయిష్టపూర్వకంగానే జగన్నాధుడి స్నాన యాత్రకు గణపతి బప్ప రావడం జరగుతుంది. అయితే అక్కడికి వెళ్లేసరికి ఊహకే అందని లీలా వినోదం సృష్టిస్తాడు ఆ దేవాదిదేవుడు జగన్నాథుడు. ఆ పూరీ క్షేతంలోని జగన్నాథుడు, పండితుడి గణపతి బప్ప కంటికి ఏకదంతుడి రూపంలో రూపంలో కనిపిస్తాడు. ఇదేంటి జగన్నాథుడు గణనాథుని రూపంలో కనిపించడం ఏంటని ఆశ్చర్యపోతాడు. ఇది కల మాయా అని గందరగోళానకి లోనవ్వుతాడు. విచిత్రంగా బలభద్రుడు కూడా ఏకందంతుడి రూపంల కనిపించడంతో మరంత విస్తుపోతాడు. అప్పుడు గణపతి బప్పకి తన అజ్ఞానానికి కన్నీరుమున్నీరుగా విలపిస్తాడు. తనకు బుద్ధి చెప్పాలనే ఆ చిలిపి కృష్ణుడు ఇలాంటి మాయ చేశాడని గ్రహిస్తాడు. భగవంతుడు ఏ రూపంలో ఉన్న పరమాత్మ అనేది ఒక్కటే అనే విషయం తెలుసుకుంటాడు. ఆనాటి నుంచే పూరి జనన్నాథుని రథయాత్రకు ముందు అనగా జేష్ట పౌర్ణమి రోజు జరిపే స్నాన యాత్ర సమయంలో ఆలయ పూజరులు జగన్నాథ, బలభద్రుల ముఖాలకు ఏనుగు తొడుగులు ధరింపజేస్తారు.బలరాముడు తెల్ల ఏనుగు రూపంలో, జగన్నాథుడు నల్ల ఏనుగు రూపంలో భక్తులకు కన్నుల పండుగగా దర్శనమిస్తాడు. దీన్ని పూరి దేవాలయా సంప్రదాయంలో హాథిబేష అని పిలుస్థారు. ఇలా పూరీ జగన్నాథుని ఏకదంతుడి రూపంలో ధరిస్తే తమకు మంచి జరగుతుందని భక్తలు ప్రగాఢ నమ్మకం.(చదవండి: సకలకార్యాల సిద్ధికై.. తొలిపూజ మహాగణపతికే!) -
ఫ్లఫ్ఫీ పూరీ.. వెజిటబుల్ కాజు సాగ్ కాంబినేషన్తో.. ఆరోగ్యం!
ఫ్లఫ్ఫీ పూరీ ఇందులోకి వెజిటబుల్ కాజు సాగ్ హెల్దీ కాంబినేషన్. దీనిని ఎలా చేయాలో చూద్దాం.కావలసినవి..గోధుమపిండి– కప్పు;నీరు– పావు కప్పు లేదా అవసరాన్ని బట్టి;చక్కెర – పావు టీ స్పూన్;నెయ్యి– 2 టీ స్పూన్లు;నూనె – వేయించడానికి తగినంత.తయారీ..– నూనె మినహా మిగిలిన పదార్థాలన్నింటినీ ఒక పాత్రలో వేసి పూరీల పిండిని కలిపి మూత పెట్టి పది నిమిషాల సేపు పక్కన పెట్టాలి.– ఈ పిండిని ఎనిమిది భాగలుగా చేసి పూరీలు వత్తి ఫ్లవర్ మౌల్డ్తో వత్తాలి.– బాణలిలో నూనె వేడి చేసి పూరీలను రెండు వైపులా కాల్చి తీస్తే ఫ్లఫ్ఫీ పూరీలు రెడీ.వెజిటబుల్ కాజు సాగ్..కావలసినవి..జీడిపప్పు – 10;పచ్చి కొబ్బరి తురుము– టేబుల్ స్పూన్;కొత్తిమీర తరుగు– టీ స్పూన్;పుదీన ఆకులు– 8;ధనియాల సొడి– పావు టీ స్పూన్;పచ్చిమిర్చి – అర కాయ;ఉడికించిన కూరగాయలు – కప్పు (క్యారట్, బీన్స్, బంగాళదుంప, మొక్కజొన్న, పచ్చి బఠాణీలు కలిపి);అల్లం తరుగు– అర టీ స్పూన్;ఉల్లిపాయ ముక్కలు– 2 టేబుల్ స్పూన్లు;ఉప్పు – పావు టీ స్పూన్ లేదా రుచిని బట్టి;నిమ్మరసం– టీ స్పూన్; నూనె – టీ స్పూన్.తయారీ..కూరగాయ ముక్కలను ఉడికించి పక్కన పెట్టాలి. జీడిపప్పు, కొబ్బరితురుము, కొత్తిమీర, ధనియాల సొడి, అల్లం, పచ్చిమిర్చి కలిపి మెత్తని పేస్ట్ చేయాలి ∙బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు వేయించి అందులో జీడిపప్పుతోపాటు గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు కూరగాయ ముక్కలు, కొద్దిగా నీటిని వేసి ఐదు నిమిషాల సేపు ఉడికిస్తే వెజిటబుల్ కాజు సాగ్ రెడీ.పోషకాలు: పూరీలో... ఫ్యాట్ – 9.8 గ్రాములు, ్రసొటీన్ – 2.3 గ్రాములు, కార్బొహైడ్రేట్లు – 12 గ్రాములు. కర్రీలో... ్రసొటీన్– 4 గ్రాములు, కార్బొహైడ్రేట్లు – 13 గ్రాములు, ఫైబర్– 5 గ్రాములు.– డాక్టర్ కరుణ, న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కోచ్ -
పూరీలో తెరుచుకున్న.. రత్నభండార్
భువనేశ్వర్: అశేష భక్తజనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచి్చంది. ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ స్వామికి శతాబ్దాలుగా రాజులు, భక్తులు కానుకగా సమరి్పంచిన వజ్రాభరణాలు, వెండి, బంగారు నిల్వలను దాదాపు 46 ఏళ్ల తర్వాత తొలిసారిగా తనిఖీచేయనున్నారు. ఆభరణాలను తూకం వేసి, నాణ్యత లెక్కించి, అవసరమైతే మరమ్మతులు చేయనున్నారు. ఆలయంలోని రహస్య ఖజానా గది జీర్ణావస్థకు చేరిన నేపథ్యంలో గదికి మరమ్మతులు చేయనున్నారు. అంతవరకు అపారమైన ఖజానాను జాగ్రత్తగా వేరేచోట భద్రపరచనున్నారు. ప్రభుత్వ కమిటీ సభ్యులు ఆదివారం మధ్యాహ్నం ఆలయానికి చేరుకున్నారు. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు చేసి ఖజానా యజమానులైన విమలా మాత, మహాలక్షీ ఆజ్ఞ తీసుకున్నారు. తర్వాత ఖజానాకు రక్షకుడైన లోకనాథ్ స్వామి అనుమతి తీసుకున్నారు. మధ్యాహ్నం 1.28 గంటలకు ఖజానా గది తలుపులు తెరిచారు. 11 మంది మాత్రమే సంప్రదాయ దుస్తుల్లో గదిలోకి వెళ్లారు. ఆభరణాలను లెక్కించకుండానే సాయంత్రం 5.20కి బయటికి వచ్చారు. తరలింపు మరో రోజున‘‘లోపలి గది తాళాలు తెరుచుకోకపోవడంతో వాటిని పగలగొట్టి తెరిచాం. ఆభరణాలు, విలువైన వస్తువులను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్లోకి తరలించి సీల్ వేశాం. అన్నింటినీ ఒకే రోజు తరలించడం కష్టం. త్వరలో తేదీని నిర్ణయించి తరలింపు మొదలెడతాం. రిపేర్ల తర్వాత ఆభరణాలకు విలువ కట్టే పని మొదలుపెడతాం’ అని ఏఎస్ఐ శాఖ అధికారులు వెల్లడించారు. గదిలోని ఆభరణాలను తరలించేందుకు సిద్ధం చేసిన 4.5 అడుగుల పొడవు, 2.5 అడుగుల వెడల్పు, 2.5 అడుగుల లోతున్న పెద్ద టేకు చెక్కపెట్టెలను గది వద్దకు తెప్పించారు. గదిలో పాములేవీ లేవని తేలింది. -
జగన్నాథ రహస్యం!
లక్షలాది భక్తజనం పాల్గొనే విశ్వవిఖ్యాత రథయాత్రతో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పూరీ జగన్నాథుని ఆలయం మరోమారు పతాక శీర్షికలకెక్కింది. రాజుల నుంచి మొదలుకుని సామాన్యుల దాకా శతాబ్దాలుగా జగన్నాథస్వామికి సమర్పించుకున్న కానుకల చిట్టా గుట్టు వీడబోతోంది. ఆదివారం ఆలయం దిగువన ఉన్న ఆభరణాల నిల్వ గది(రత్న భండార్)ని దాదాపు 40 సంవత్సరాల తర్వాత లెక్కింపు కోసం తెరవబోతున్నారు. విషసర్పాలు ఉండొచ్చన్న వార్తల నేపథ్యంలో అత్యయిక ఔషధాలను సిద్ధంచేసి వైద్యులు, పాములు పట్టే వాళ్లను వెంటబెట్టుకునిమరీ పురావస్తు, ప్రభుత్వ అధికారులు లోనికి వెళ్లబోతున్నారు. జగన్నాథుడికి చెందిన వజ్ర, వైఢూర్యాలు, గోమేధిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణాభరణాలు, వెండి తదితరాల బరువును తూచి, వాటి నాణ్యతను పరిశీలించి వేరే గదిలో సురక్షితంగా భద్రపరచాలని నిర్ణయించారు. చాన్నాళ్ల క్రితం గది తాళం చెవులు పోగొట్టి ఒడిశాలోని బిజూజనతాదళ్ సర్కార్ ఆలయ సంపద సంరక్షణలో విఫలమైందని బీజేపీ అసెంబ్లీ ఎన్నికలవేళ ఆరోపణలు గుప్పించడంతో గది తలుపులు తెరచి సంపదను సరిచూడాలన్న డిమాండ్ మళ్లీ ఊపందుకుంది. అయితే గది తెరవడంపై శనివారం తుది నిర్ణయం తీసుకుంటామని ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ శుక్రవారం చెప్పారు.180 రకాల ఆభరణాలు1978లో గదిని తెరచి ఆభరణాలు, వెండి, బంగారం నిల్వలను లెక్కించి మళ్లీ పొడవాటి చెక్కపెట్టెల్లో భద్రపరిచారు. ఆనాడు అన్నింటినీ లెక్కించడానికి 70 రోజులు పట్టింది. గదిలో 180 రకాలకు చెందిన అమూల్యమైన ఆభరణాలు స్వామివారికి ఉన్నట్లు సమాచారం. స్వచ్ఛమైన పసిడి ఆభరణాలు 74 రకాలున్నాయి. ఒక్కోటి 100 తులాల బరువైన పురాతన ఆభరణాలూ ఉన్నాయి. ‘‘ 1978లో సంపద లెక్కించారు. అయితే జీర్ణావస్థకు చేరిన కొన్ని ఆభరణాల రిపేర్ పనుల కోసం 1985 జూలై 14వ తేదీన గది తెరిచారు. అప్పుడు నేనూ వెళ్లా. 9 అడుగుల పొడవు, 3 అడుగుల ఎత్తు ఉన్న 15 చెక్కపెట్టెల్లో ఆభరణాలను జాగ్రత్తగా భద్రపరిచారు. వెలకట్టలేని ఆభరణాలతోపాటు ఎంతో బంగారం, వెండి నిల్వలు గదిలో దాచారు. పెద్ద సింహాసనం, ఉత్తరభారత భక్తులు జగన్నాథ, బలభద్రులకు సమర్పించిన అరటిపువ్వు ఆకృతి చెవిదిద్దులు ఇలా ఎన్నో విభిన్న ఆభరణాలు అక్కడున్నాయి. తర్వాత గది తలుపులు మూసి రెండు రకాల తాళాలు వేసి సీల్వేశారు. తాళం చెవులను ట్రెజరీ ఆఫీస్ నుంచి వచ్చిన కలెక్టర్కు అందజేశాం’ అని ఆనాటి ఆలయ నిర్వహణ అధికారి రవీంద్ర నారాయణ మిశ్రా రెండేళ్ల క్రితం ఒక టీవీచానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. 12వ శతాబ్దంలో పూరీ ప్రాంత రాజుకు లొంగిపోయిన సామంతరాజుల కిరీటాలు, యుద్ధంలో గెల్చుకున్న విలువైన సొత్తునూ రహస్య గదిలో భద్రపరిచారని తెలుస్తోంది.2018లో మరోసారి ప్రయత్నించి..పురాతన గది శిథిలమై గోడలకు చెమ్మ రావడంతో గది పటిష్టత, ఆభరణాల పరిరక్షణ నిమిత్తం గది తలుపులు తెరవాలని హైకోర్టు ఆదేశాల మేరకు 2018 ఏప్రిల్ 4వ తేదీన 16 మంది సభ్యుల భారత పురావస్తుశాఖ నిపుణుల బృందం గది తెరిచేందుకు వెళ్లింది. అయితే తాళం చెవి అదృశ్యమయిందన్న వార్తల నడుమ వెనుతిరిగింది. అయితే కిటికీ నుంచి చూసి గది గోడలు దెబ్బతిన్నట్లు, పైకప్పు పెచ్చులు ఊడినట్లు నిర్ధారించుకున్నారు. ఈ తతంగం అంతా 40 నిమిషాల్లో ముగిసింది. చీకటిగదిని మళ్లీ 40 ఏళ్ల తర్వాత తెరుస్తున్న నేపథ్యంలో ఈసారైనా అన్ని ఆభరణాలు, బంగారం, వెండి నిల్వలను సరిచూసి శిథిల గదికి బదులు నూతన గదిలో సురక్షితంగా దాచాలని సగటు పూరీ జగన్నాథుని భక్తుడు కోరుకుంటున్నాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంగరంగ వైభవంగా పూరీ జగన్నాథుని రథయాత్ర (ఫోటోలు)
-
Jagannath Rath Yatra 2024: పూరీలో వైభవంగా రథయాత్ర
భువనేశ్వర్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరీలోని జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా మొదలైంది. సాయంత్రం లక్షలాది భక్తుల నినాదాల నడుమ జగన్నాథ ఆలయం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలోని గుండీచా ఆలయం దిశగా భారీ రథాలు ముందుకు సాగాయి. 5.20 గంటలకు రథాలు కదిలాయి. అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మూడు రథాలకు పూజలు చేశారు. ఆమె, ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్, సీఎం మోహన్ చరణ్ మాఝి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జగన్నాథ రథం తాళ్లను లాగి యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. ముందున్న బలభద్రుని ప్రతిష్టించిన 45 అడుగుల ఎత్తైన రథాన్ని దేవీ సుభద్ర, జగన్నాథుని రథాలు అనుసరించాయి. రథయాత్రకు ముందు భక్తుల బృందాలు జగన్నాథుని కీర్తనలను ఆలపిస్తూ ముందుకు సాగారు. రెండు రోజులపాటు సాగే యాత్ర కోసం భారీగా బందోబస్తు చేపట్టారు.సాయంత్రం వేళ బలభద్రుని రథం లాగుతున్న చోట ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దీంతో ఊపిరాడక తొమ్మిది మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తీసుకొచ్చేలోగా ఒడిశాలోని బాలాంగిర్ జిల్లాకు చెందిన లలిత్ బాగార్తి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. భక్తుని మృతి పట్ల సీఎం చరన్ మాఝీ సంతాపం వ్యక్తంచేశారు. అయితే 300 మందిదాకా గాయపడినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. -
పూరీ జగన్నాథుడి రథయాత్రకు సర్వం సిద్ధం.. భారీగా తరలివచ్చిన భక్తులు
Live Updates..🙏జగన్నాథ రథయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్.🙏హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో జగన్నాథ రథయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.🙏ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇస్కాన్ సంస్థ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం అందరిది.. సర్వమతాలకు స్వేచ్ఛ, అవకాశాలను ఇస్తుంది. మా ప్రభుత్వం మత సామరస్యాన్ని పాటిస్తుంది. ఇస్కాన్ సంస్థ ప్రార్ధనలతో రాష్ట్రం సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నా. మానవ సేవే మాధవ సేవ అనే సందేశం అందరికీ చేరేలా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు కూడా పాల్గొన్నారు. 🙏 నేడు ఒడిశాలోని పూరీ జగన్నాథుడి విశ్వప్రసిద్ద రథయాత్ర జరుగనుంది. ఈ వేడుకలను చూసేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు పూరీ చేరుకున్నారు. రథయాత్ర నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు. #WATCH | Odisha: Two-day Lord Jagannath Rath Yatra in Puri to commence today. Along with lakhs of devotees, President Droupadi Murmu will also attend the annual festival. pic.twitter.com/7Q9WYQCJw5— ANI (@ANI) July 7, 2024 🙏ఇంత వరకు భారత రాష్ట్రపతులు ఎవరూ పూరీ రథయాత్రలో పాల్గొనలేదు. తొలిసారి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ ఉత్సవంలో పాల్గొననున్నారు. ఆమె గవర్నర్ రఘుబర్దాస్తో కలిసి సుభద్రమ్మ రథం లాగుతారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొంటారు. రెండురోజుల రథయాత్రలో 15 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. దీన్ని దృష్టిలో ఉంచుకొని పూరీ పట్టణానికి మూడంచెల భద్రత కల్పించారు. #WATCH | Odisha: Security around Lord Jagannath temple in Puri increased ahead of the Rath Yatra which will commence today. pic.twitter.com/ExMFCNfAuu— ANI (@ANI) July 7, 2024 🙏కాగా, నేడు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు శ్రీక్షేత్రంలోని రత్నసింహాసనం వీడి యాత్రగా వెళ్లి పెంచిన తల్లి గుండిచాదేవి మందిరానికి చేరుకోనున్నారు. గర్భగుడిలోని దివ్య(దారు) విగ్రహాలు భక్త జనఘోష మధ్య రథాలపై మూడు కిలోమీటర్లు ప్రయాణించి అమ్మ సన్నిధికి చేరుకుంటాయి. #WATCH | Bhubaneswar: Odisha-based miniature artist L Eswar Rao crafts an eco-friendly chariot in connection with the Jagannath Puri Rath Yatra. (06.07) pic.twitter.com/Hgpxl8Eym2— ANI (@ANI) July 7, 2024 🙏ఇక, ఈసారి రథయాత్రకు ప్రత్యేకత ఉంది. 1971 తర్వాత ఒకేరోజు జగన్నాథుని నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర నిర్వహిస్తున్నారు. మూడు వేడుకలు ఆదివారం ఉండడంతో జగన్నాథుని నందిఘోష్, బలభద్రుని తాళధ్వజ, సుభద్ర దర్పదళన్ రథాలు ఆదివారం సాయంత్రానికి అమ్మ ఆలయానికి చేరుకొనే పరిస్థితి లేదు. #WATCH | Ahmedabad, Gujarat: Union Home Minister Amit Shah along with his wife Sonal Shah at Jagannath Temple. pic.twitter.com/FQ6FeFytyz— ANI (@ANI) July 6, 2024 🙏మరోవైపు.. పూరీ రథయాత్ర నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని జగన్నాథుని ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. గుజరాత్లోని పూరీ ఆలయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
‘రత్న భాండార్’లో ఏముంది? తాళాలు ఏమయ్యాయి?
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా జగన్నాథ ఆలయానికి సంబంధించిన రత్న భాండార్ గురించి ప్రస్తావించారు. ఈ రత్న భాండార్ తాళాలు గత ఆరేళ్లుగా కనిపించడం లేదని, అవి ఏమైపోయాయనేది ఒడిశా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆరోపించారు. ఈ భాండాగారంలో అపారమైన సంపద దాగి ఉందని మోదీ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన దర్యాప్తు నివేదిక బయటపెట్టేందుకు ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోవడం లేదని ప్రశ్నించారు. ఎవరి ప్రయోజనాల కోసమో ఈ విషయాన్ని దాచి ఉంచుతున్నారని మోదీ ఆరోపించారు. మోదీ విమర్శల నేపధ్యంలో ‘రత్న భాండార్’ చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ ‘రత్న భాండార్’లో ఏముంది? పూరీ జగన్నాథ ఆలయంలోని రత్నభాండాగారంలోని అంతులేని శ్రీవారి ఆభరణాలు, బంగారు, వెండి,వజ్ర వైఢూర్యాలు క్షేమంగా ఉన్నాయా? ఖజానాకు సంబంధించిన కీలక తాళం పోయి యాభై ఏళ్లు దాటినా ఇంత వరకు దాన్ని ఎందుకు చేధించలేదు?ఈ విషయంపై ప్రభుత్వం ఎందుకు అనుమానస్పద మౌనాన్ని కొనసాగిస్తోంది? శ్రీవారి నిధి ఉన్న గదిలోంచి బుస బుసలు వినిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అది వేయి పడగల ఆదిశేషునివేనా? అసలు జగన్నాధుని కొలువులో ఏం జరుగుతోంది? దేవుడి ఆస్తులకే మనిషి శఠగోపం పెడుతున్నాడా?అక్కడున్న రహస్యం ఏంటి?అందరినీ కాపాడ్డానికి ఆ దేవుడు ఉన్నాడు. మరి దేవుడి సంపద కాపాడటానికి ఎవరున్నారు? కచ్చితంగా మనిషిని నమ్మడానికి వీల్లేదు. తన సంపదను దేవుడే కాపాడుకోవాలి. ఇదంతా ఎందుకంటే ఒడిషా లోని అత్యంత ప్రాచీనమైన పూరీ జగన్నాథుని దేవాలయంలో అంతులేని శ్రీవారి సంపదలు ఉన్న భాండాగారం గది తాళాల మిస్సింగ్ వ్యవహారం పెద్ద మిస్టరీగా మారింది. తాళాలు ఎలా పోయాయో ప్రభుత్వం చెప్పలేకపోతోంది. ఆలయ కమిటీ ఏమీ తెలీదంటోంది. తాళాలు పోయిన యాభై ఏళ్ల తర్వాత కూడా ఎవ్వరిలోనూ కంగారు లేదు. వాటిని వెతికి పట్టుకోవాలన్న ఆతృత లేదు. పాలకుల వైఖరిని చూసి భక్తులు మండిపడుతున్నారు. దేవ దేవుడి ఆభరణాలు ఉన్నాయా? దిగమింగేశారా? చెప్పండంటూ నినదిస్తున్నారు.దేశంలోని నాలుగు ప్రధాన పుణ్యక్షేత్రాలు బద్రీనాథ్, ద్వారక, రామేశ్వరం, పూరి. ఈ నాలిగింటినీ కలిపి చార్ ధామ్ ఆలయాలుగా పిలుస్తారు. వీటితో పాటు మన దేశంలో అత్యంత ముఖ్యమైన ఆలయాల్లో ఒకటి ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం. 12వ శతాబ్ధంలో రాజా అనంత వర్మ చోడగంగదేవ్ హయాంలో ఆలయ నిర్మాణం మొదలై ఆయన మనవడు అనంగ భీమ్ దేవ్ పాలనలో పూజలు మొదలయ్యాయి. శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముడి చెక్క విగ్రహాలే ఈ ఆలయంలో కొలువు తీరి ఉంటాయి. కృష్ణుని ఆరాధించే వైష్ణవులకు ఇదే అత్యంత పవిత్రమైన క్షేత్రం.దేశం నలుమూలల నుంచి నిత్యం వేలాదిగా భక్తులు ఇక్కడకు తరలి వస్తూ ఉంటారు. జీవితంలో ఒక్కసారి అయినా జగన్నాథుని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు.ఇక్కడ నిత్యం దేవ దేవుడికి 56 రకాల ప్రసాదాలతో నైవేద్యాలు పెడతారు. ఈ ప్రసాదాలన్నీ కూడా మట్టి కుండల్లోనే వండుతారు.ఇక ఏటా జూన్, జులై నెలల్లో జరిగే జగన్నాథ రథ యాత్ర ఎంతో ప్రత్యేకమైనది. ఈ యాత్రలో పాల్గొనేందుకు కోట్లాది మంది ఉత్సాహంగా ఉరకలు వేస్తూ మరీ వస్తారు. జగన్నాథుడు అంటే ఈ ప్రపంచానికి నాయకుడని అర్ధం. అంటే ముల్లోకాలనూ చల్లగా చూసే విష్ణుమూర్తే అని అర్ధం చేసుకోవాలి.ఆధ్యాత్మికంగా ఇంతటి ప్రాముఖ్యత ఉన్న జగన్నాథ ఆలయంలో అర్ధ శతాబ్ధిగా ఓ రహస్యం వెంటాడుతోంది. అది అంతు చిక్కని మిస్టరీగా మారి భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. సమాధానం లేని ప్రశ్నలా అందరినీ వేధిస్తోంది. జగన్నాథుని ఆలయం ఆరంభమైన నాటి నుంచి అంటే 12వ శతాబ్ధం నుండి 18వ శతాబ్ధం వరకు ఈ ప్రాంతాన్ని ఏలిన రాజులు దేవ దేవుడికి విలువైన ఆభరణాలు, బంగారం వెండి వజ్ర వైఢూర్యాలు వంటి ఎన్నో కానుకలను భక్తిగా సమర్పించుకుంటూ వచ్చారు.ఈ సంపదలన్నింటినీ శ్రీక్షేత్రంలోని రత్నభండాగారంలోని మూడో గదిలో దాచారు. ఎప్పుడో 1926లో బ్రిటిష్ పాలకులు ఈ రత్నభాండాగారాన్ని తెరిపించినపుడు అందులో 597కి పైగా రక రకాల ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడి సంపదను వెలగట్టలేమని అప్పటి నిపుణులు ఓ నివేదిక కూడా రూపొందించారు. రత్నాలు, స్వర్ణ కిరీటాలు, ధనుర్బాణాలు, వజ్ర వైఢూర్య, గోమేధిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, పగడాలు లెక్కకు మించి రాశులు రాశులుగా పోసి ఉన్నట్లు గురించారు. రత్నభాండాగారంలోని రహస్యగదిగా పిలుస్తోన్న మూడో గది కింద ఓ సొరంగ మార్గం కూడా ఉందని, దాని ద్వారా వెళ్తే మరిన్ని గదుల్లోకి వెళ్లచ్చని, వాటిలో అంతులేని ధనరాశులు నిక్షిప్తమై ఉండవచ్చని వందేళ్ల క్రితం నాటి నిపుణులు అంచనా వేశారు.అంతా బానే ఉంది కానీ కొన్నేళ్లుగా ఈ రహస్య గదే పెద్ద మిస్టరీగా మారింది. రత్నభాండాగారంలోని మూడో గదికి మూడు తలుపులు ఉంటాయి. ఒక్కో తలుపుకు ఒక్కో తాళం చొప్పున మూడు తాళాలు ఉంటాయి. వీటిలో ఒక తాళంచెవి గజపతి రాజుల వద్ద ఉంటుంది. మరో తాళంచెవి దేవాలయ పాలనాధికారుల వద్ద ఉంటుంది. ఇక మూడో తాళం ఆలయ ప్రధాన అర్చకుడు భండాగార ఇన్ఛార్జ్ దగ్గర ఉంటుంది.ఈ మూడు తాళాలు ఉంటేనే ఆ గది తలుపులను పూర్తిగా తెరవడం కుదరదు. రత్నభాండాగారంలోని మొదటి గదిలో దేవుడికి సంబంధించిన ఆభరణాలు ఉంటాయి. పండగలు, పబ్బాలు వచ్చినపుడు ఈ నగలనే తీసి దేవుడికి అలంకరించి పూజలు చేస్తారు. పూజలు ముగిసిన వెంటనే వీటిని తిరిగి ఈ గదిలో భద్రపరుస్తారు. రెండో గదిలోనూ విలువైన వస్తువులున్నాయి. అయితే మూడో గదిని మాత్రం దశాబ్ధాలుగా తెరవనే లేదు. ఎందుకు తెరవడం లేదో ఎవరికీ అర్దం కావడం లేదు. మొత్తానికి భక్తులు, ప్రజాసంఘాలు పదే పదే అనుమానాలు వ్యక్తం చేసిన తర్వాత తేలిందేంటంటే ఈ మూడు తాళాల్లో ఒక తాళం కనిపించడం లేదని.దేవాలయం ఉండే ప్రాంతానికి సంబంధించిన కలెక్టర్ 2018లో అధికారికంగా రత్నభాండాగారానికి చెందిన మూడో గదికి సంబంధించిన ఒక తాళం పోయిందని అది ఎక్కడికిపోయిందో తెలవడం లేదని ప్రకటించారు. దాంతో ప్రభుత్వంపైనా ఆలయ పాలనా యంత్రాంగం పైనా విమర్శలు వెల్లువెత్తాయి.1964లో చివరి సారి మూడో గదిని తెరిచినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత తాళం కనిపించకపోవడంతో తెరవలేదని అంటున్నారు. దీనిపై విపక్షాలు విరుచుకుపడటంతో కొన్నాళ్ల కింద పాలక పక్ష మంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ దేవ దేవుడి ఆభరణాలు కానీ సంపద కానీ ఎక్కడికీ పోలేదని.. పూచిక పుల్ల కూడా ఎవరూ దోచుకుపోలేదని అన్నీ భద్రంగానే ఉన్నాయని వివరణ ఇచ్చారు.అసలు తాళాలు పోయాయని ప్రకటించిన వెంటనే ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జస్టిస్ రఘువీర్ దాస్ నేతృత్వంలో ఒక విచారణ కమిటీని నియమించారు. తాళాలు పోవడంలో ఎవరి పాత్ర ఉందో తేల్చడంతో పాటు మొత్తం వ్యవహారంలో ఎవరు బాధ్యులో తేల్చాలని ఆయన ఆదేశించారు. రఘువీర్ దాస్ కమిటీ నెలల తరబడి దర్యాప్తు చేసిన తర్వాత 324 పేజీల నివేదికను సమర్పించింది. అయితే ఇంతవరకు ఆ నివేదికను నవీన్ పట్నాయక్ ప్రభుత్వం బయట పెట్టలేదు. ఆ నివేదికలో ఏం ఉందన్నది మిస్టరీగా మారింది. 1985లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఉన్న రెండు తాళాలతో మూడో గదిలో ప్రవేశించడానికి ప్రయత్నం చేశారు.అయితే రెండు తలుపులు తెరవగానే ఆ గదిలోంచి పెద్ద సంఖ్యలో పాములు ఒకేసారి బుసలు కొట్టినట్లు భయానక శబ్ధాలు రావడంతో భయంతో ఆ తలుపులను తిరిగి మూసివేసి వెనక్కి వెళ్లిపోయారని చెబుతారు. ఆలయం నిర్మించిన నాటి నుండి ఇక్కడ పనిచేసే అర్చకులు, సేవకులు, ఇతర సిబ్బంది కూడా వంశపారంపర్యంగా కొన్ని కుటుంబాల వాళ్లే కొనసాగుతున్నారు.ప్రధాన అర్చకులయితే.. ఓ అడుగు ముందుకేసి దేవాలయ రత్నభాండాగారాన్ని తెరిస్తే దేశానికే అరిష్టం అని హెచ్చరిస్తున్నారు.దేవుడి ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా తలుపులు తెరిస్తే అంతా సర్వనాశనం అయిపోతుందని పెను విపత్తులు తరుముకు వస్తాయని వారు బెదిరిస్తున్నారు.జగన్నాధుని భక్తితో కొలిచే వారు మాత్రం తమ దేవుడి సంపద భద్రంగా ఉందో లేదో స్పష్టం చేయాలంటున్నారు. మూడో గది తాళాలు ఎలా పోయాయో ఎవరు కొట్టేశారో ఎందుకు తేల్చడం లేదంటూ వారు నిలదీస్తున్నారు. తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలోనూ నేలమాళిగల్లో అపార ధనరాశులు ఉన్నాయన్న సమాచారంతో కోర్టు ఆదేశాలతో నేలమాళిగలను తెరిచారు. అయితే అందులో ఆరు నేలమాళిగలు ఉండగా అధికారులు కేవలం అయిదు నేలమాళిగలను మాత్రమే తెరిచారు. నిజానికి ఈ ఆరో నేలమాళిగే అన్నింటిలోకీ కీలకమైందని అప్పుడు ప్రచారం చేశారు. ఎందుకంటే మిగతా అయిదు నేలమాళిగలతో పోలిస్తే ఆరో నేలమాళిగ చాలా పెద్దదని ఆలయ సిబ్బంది కూడా చెబుతున్నారు.ఆరో నేలమాళిగ కన్నా చాలా చిన్నవైన ఇతర నేలమాళిగల్లోనే ఒక లక్షా ఇరవై వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయంటే ఆరో నేలమాళిగలో దీనికి ఎన్నో రెట్లు ఎక్కువ ధనరాశులు కచ్చితంగా ఉంటాయన్నది వారి వాదన. అయితే అధికారులు మాత్రం ఆరో నేలమాళిగను ఈ రోజుకీ తెరవలేదు. ఆరో నేలమాళిగ ను మూసి ఉంచిన ఇనుప తలుపులపై నాగసర్పం బొమ్మ ఉంది. ఆ తలుపులను నాగబంధంతో బంధించారని ప్రచారం జరుగుతోంది. ఆ నాగబంధాన్ని ఖాతరు చేయకుండా తలుపులు తెరిస్తే మొత్తం లోకానికే అరిష్టమని దేవుడి ఉగ్రరూపం విలయ రూపంలో విరుచుకుపడి మానవాళిని నాశనం చేసేస్తుందని ఆలయ పూజారులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడే ఏదో మెలిక ఉందనిపిస్తుందంటున్నారు హేతువాదులు.ఒకే దేవుడికి సంబంధించిన ఒకే గుడిలో అయిదు మాళిగల తలుపులు తెరిస్తే ఏమీ కానిది ఆరో మాళిగ తెరిస్తేనే ఏదో అయిపోతుందని అనడంలో అర్ధం ఏముందని వారు నిలదీస్తున్నారు. అయితే భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదన్న సున్నితమైన ఆలోచనతో ఆరో నేలమాళిగ తెరవకూడదని నిర్ణయించేసుకున్నారు.పూరీలోని జగన్నాథుని ఆలయంలోనూ కీలకమైన మూడో గదిలోనే లెక్కకు మించిన ధనరాశులు ఉన్నాయని అంటున్నారు. ఈ ధనరాశులకు కాపలాగా లక్షలాది పాములే ఉఏనేన్నాయా? లేక వేయి పడగల ఆదిశేషుడే విష్ణుమూర్తి సంపదకు కాపలాగా ఉన్నాడా? అన్నది అర్ధం కావడం లేదు. పాముల బుస బుసలు మాత్రం వినిపిస్తున్నాయని అధికారులు అన్నారన్న ప్రచారంలో ఎంత వరకు నిజముంది? వెంటనే ఆ గది తెరిస్తే ప్రళయం వచ్చి అందరూ కొట్టుకుపోతారని పూజారులు హెచ్చరించడం దీనికి కొనసాగింపా? అన్నది తెలియాల్సి ఉంది.అసలు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంది? కొందరు భక్తులు అయితే మూడో గదిలోని విలువైన ఆభరణాలు, సంపదలను రాబందులు తన్నుకుపోయి ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలోని పెద్దల అండదండలు ఉన్నాయి కాబట్టే మూడో గది తాళాల గురించి కానీ రఘువీర్ దాస్ కమిటీ నివేదిక గురించి కానీ ప్రభుత్వం మాట్లాడ్డం లేదని వారంటున్నారు.మూడో గదిని ప్రజల సమక్షంలో తెరిస్తే నిజా నిజాలు బయటకు వస్తాయని ప్రజాసంఘాల నేతలు అంటున్నారు.అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఆరో నేలమాళిగ తరహాలోనే పూరీ జగన్నాథ ఆలయంలోని కీలకమైన ఈ మూడోగది మిస్టరీ కూడా ఎప్పటికీ వీడకపోవచ్చునని కొందరు మేథావులు అంటున్నారు. పాలకులు మాత్రం ఏమీ అనడం లేదు. ఆలయ సిబ్బంది కూడా బెల్లంకొట్టిన రాయిలా మాట్లాడ్డం లేదు. భక్తులు మాత్రం దేవుడికి అపచారం జరిగిందని బాధపడుతున్నారు. అది దేశానికి ఏ మాత్రం మంచిది కాదని ఏ క్షణంలో ఏం ముంచుకు వస్తుందోనని వారు భయపడుతున్నారు. ఇక నిజా నిజాలు వెలికి తీసి దోషులకు శిక్షపడేలా చేయాల్సింది ఆ జగన్నాథుడే. ఆయనే కద జగన్నాటక సూత్రధారి. తన ఆస్తులను ఎవరు కొట్టేశారో పట్టుకుని బోనులో పెట్టాల్సింది దేవుడే ఇక.భక్తుల మనోభావాలను అడ్డుపెట్టుకుని దేవుడి సంపదలు కొల్లగొడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆధ్యాత్మిక వాదులు హెచ్చరిస్తున్నారు. వెలకట్టలేని అపార దేవుడి సంపదకు రక్షణ కల్పించాల్సిన పాలకులు ఘోరంగా విఫలమయ్యారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నిజానిజలేంటో వెలుగులోకి తీసుకురావాలని వారు పట్టుబడుతున్నారు. -
బీజేపీ ఎంపీ అభ్యర్థి సంబీత్ పాత్ర వివాదాస్పద వ్యాఖ్యలు
భువనేశ్వర్: లోక్సభ ఎన్నికల వేళ పార్టీల నేతలు ప్రచారంలో చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. పూరీ జగన్నాథ స్వామిపై పూరీ లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సంబిత్ పాత్ర చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సంబిత్ పాత్ర ఆదివారం పాల్గొన్న ప్రచార ర్యాలీ అనంతం మీడియాతో మాట్లాడుతూ.. పూరీ జగన్నాథ స్వామి ప్రధాని మోదీకి భక్తుడు అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రతిపక్షాలు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండింస్తూ.. విమర్శలు గుప్పించారు.సంబిత్ పాత్ర వ్యాఖ్యలపై ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ స్పందించారు. ‘శ్రీ జగన్నాథ్ మహాప్రభు విశ్వానికినే దేవుడు. అటువంటి దేవుడినే మోదీకి భక్తుడు అనటం భగవంతున్ని కించపర్చడమే.దానిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జగన్నాథ్ స్వామి కోట్లాది మంది భక్తుల విశ్వాసలను కించిపర్చినట్లే’ అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.BJP नेता संबित पात्रा का कहना है कि महाप्रभु भगवान श्री जगन्नाथ नरेंद्र मोदी के भक्त हैं। यह महाप्रभु का घोर अपमान है। इस बयान से करोड़ों भक्तों की आस्था को चोट पहुंची है।मोदी भक्ति में लीन संबित पात्रा को यह पाप नहीं करना चाहिए था। इस घृणित बयान के लिए खुद नरेंद्र मोदी को… pic.twitter.com/di0So3FxCz— Congress (@INCIndia) May 20, 2024 సంబిత్ పాత్ర చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ‘అధికార మత్తులో ఉన్న బీజేపీ.. మన దేవుళ్లను సైతం విడిచిపెట్టడం లేదు. ఇక ప్రజలను మాత్రం ఎలా విడిచిపెడుతుంది. జగన్నాథ్ స్వామిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండింస్తున్నాం. కోట్లాది మంది జగన్నాథ్ స్వామి భక్తులను కించిపర్చినట్లే. జూన్ 4న ప్రజల సంకల్పం ముందు బీజేపీ అహకారం నాశనం అవుతుంది’ అని ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు.విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తటంతో బీజేపీ ఎంపీ అభ్యర్థి సంబిత్ పాత్ర స్పందించారు. ‘నమస్కార్ నవీన్ జీ. ఈ రోజు నరేంద్ర మోదీ రోడ్డు షోకు సంబంధించిన పలు న్యూస్ చానెల్స్తో మాట్లాడాను. ఎక్కడ మాట్లడినా ప్రధాని మోదీ.. శ్రీ జగన్నాథ్ స్వామికి పెద్ద భక్తుడని చెబుతా వస్తున్నా. అదేవిధంగా మోదీ.. జనన్నాథ్ స్వామికి భక్తుడు అనబోయి పొరపాటున వ్యతిరేకార్థంలో మాట్లాడాను. దీనిని పెద్ద విషయం చేయకండి. మనమంతా కొన్ని నోరుజారీ మాట్లాడుతాం’ అని సంబిత్ పాత్ర వివరణ ఇచ్చారు.Naveen Ji Namaskar!I gave number of bytes today to multiple media channels after the massive success of Shri Narendra Modiji’s Road Show in Puri today, everywhere I mentioned that Modi ji is an ardent “Bhakt” of Shri Jagannath Mahaprabhu ..by mistake during one of the bytes I… https://t.co/6Q1Kuj5E6O— Sambit Patra (Modi Ka Parivar) (@sambitswaraj) May 20, 2024 -
సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
పూరీ: ఒడిశా కాంగ్రెస్లో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. తాజాగా పూరీ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ మరో అభ్యర్థిని ప్రకటించింది. జై నారాయణ్ పట్నాయక్ను కాంగ్రెస్ పార్టీ పూరీ నుంచి బరిలోకి దిపింది. కాగా, సుచారితా మొహంతీ టికెట్ తిరస్కరణ కారణంగా ఇక్కడ అభ్యర్థి మార్పు జరిగింది.వివరాల ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ పూరీలో మరో అభ్యర్థిని ఖరారు చేసింది. జై నారాయణ్ పట్నాయక్ను పూరీ అభ్యర్థిగా పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం అర్ధరాత్రి ప్రకటన విడుదల చేశారు. కాగా, మొహంతీ స్థానంలో పట్నాయక్ అభ్యర్థిత్వానికి ఐఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఓకే చేశారు. The Congress President, Shri Mallikarjun Kharge, has approved the candidature of Shri Jay Narayan Patnaik (In place of Smt. Sucharita Mohanty) as party candidate for the ensuing general elections to the Lok Sabha from 17 - Puri Parliamentary Constituency of Odisha. pic.twitter.com/1NkkGH73Y1— INC Sandesh (@INCSandesh) May 5, 2024ఇక, అంతకుముందు.. మాజీ ఎంపీ బ్రజామోహన్ మహంతీ కుమార్తె, మాజీ జర్నలిస్టు అయిన సుచరితా మొహంతీని కాంగ్రెస్ పార్టీ పూరీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే తాను పోటీ చేయనని, టికెట్ను తిరస్కరించారు. తనవద్ద ఉన్న డబ్బును ఖర్చు చేసేశానని, ఆర్థిక సహకారం అందించేందుకు పార్టీ అధిష్ఠానం నిరాకరించిందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తాను పోటీ చేయలేనని ఆమె.. కేసీ వేణుగోపాల్కు లేఖ రాశారు. దీంతో పార్టీ అధినాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది.కాగా, పూరీ లోక్సభ స్థానానికి ఆరో విడుతలో భాగంగా మే 25న పోలింగ్ జరగనుంది. నామినేషన్ల సమర్పణకు మే ఆరో తేదీ వరకు సమయం ఉంది. అందుకే సుచరిత ఇప్పటివరకు తన నామినేషన్ దాఖలు చేయలేదు. -
కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
లోక్సభ ఎన్నికలవేళ కాంగ్రెస్ పార్టీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కొందరు నేతలు పార్టీ మారగా.. మరికొందరు పలు కారణాలతో పోటీ నుంచి వైదోలుగుతున్నారు. తాజాగా ఒడిషా రాష్టంలో పూరీ లోక్భ స్థానంలో బరిలో ఉన్న సుచరిత మొహంతి.. పోటి నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారానికి పార్టీ నుంచి తగిన నిధులు అందకపోవటంతో సుచరిత మొహంతి.. తనకు కేటాయించిన టికెట్ను తిరిగి ఇస్తున్నట్లు తెలియజేశారు. పబ్లిక్ డొనేషన్ డ్రైవ్ చేపట్టి, ఎంత ఖర్చ తగ్గించినా.. తాను ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు.‘నాకు పార్టీ నుంచి రావాల్సిన ఎన్నికల ప్రచార నిధులు నిరాకరించారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలహీన అభ్యర్థులకు టికెట్లు కేటాయించారు. ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, బీజేడీ చాలినంత నిధులు, ధన బలంతో ఉన్నారు. ఇది చాలా కష్టమైన పరిస్థితి. ప్రతిచోట చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. నేను వారిలా పోటీలో ఉండలేను. డబ్బుతో కాకుండా ప్రజలతో ప్రచారం చేయాలనుకున్నా. కానీ, అది కూడా నిధుల కొరతతో సాధ్యపడటం లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా బాధ్యత తీసుకోవటం లేదు’ అని సుచరిత తెలిపారు.కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్కు రాసిన లేఖలో సుచరిత.. పార్టీ ప్రచార నిధుల నిరాకరించటంతో తన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి చాలా ఇబ్బంది అవుతోదని తెలిపారు. ‘‘సాధారణ జర్నలిస్ట్గా పనిచేసిన నేను పదేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చాను. అన్ని రకాలుగా నేను పూరీలో ప్రచారం చేస్తున్నా. నిధుల కోసం పబ్లిక్ డొనేషన్ డ్రైవ్ కూడా చేట్టాను. చాలా వరకు ప్రచార ఖర్చును కూడా తగ్గించాను. కానీ, ప్రచార నిధుల కొరత కారణంగా విజయావకాశాలు ఉన్న పూరీ నియోజకవర్గంలో వెనకబడి ఉన్నాం. పార్టీ నిధులు లేకుండా ప్రచారం కొనసాగించలేకపోవటంపై చింతిస్తున్నా. అందుకే నాకు కేటాయించిన టికెట్ను తిరిగి ఇస్తున్నా’’ అని కేసీ వేణుగోపాల్కు రాసిన లేఖలో వివరించారు. -
Book Fair: వెలుగులు విరజిమ్మనీ
-
ఆ మహిళ గ్యాస్ సేవింగ్ టెక్నిక్కి ఫిదా అవ్వాల్సిందే! ఒకేసారి..
ప్రస్తుతం గ్యాస్ ధరలు మండిపోతున్నాయి. అందుకోసం అని మధ్యతరగతి మహిళలు ఎన్నో పాట్లు పడుతుంటారు. గ్యాస్ ఆదా చేసే ఒక్క చిన్న అవకాశాన్ని కూడా మిస్ చెయ్యరు. అయినా ఇంట్లో అందరికీ కావాల్సినవి అమర్చి పెట్టే క్రమంలో గ్యాస్ ఆదా చేయలేక సతమతమవుతుంటారు మహిళలు. పోనీ కట్టెల పొయ్యి వంటివి ఏమైనా ట్రై చేద్దామా అంటే..అంతా అపార్ట్మెంట్లో నివాసం ఉండే పరిస్థితి. అలాంటప్పుడూ ఇది అస్సలు కుదరదు. కానీ ఇక్కడొక మహిళ గ్యాస్ని ఆదా చేస్తూ ఒకేసారి రెండు వంటకాలు చేసి శభాష్ అనిపించుకుంది. ఆమె ఎలా చేసిందో చూస్తే మాత్రం తప్పక ఆశ్చర్యపోతారు. అబ్బా..! ఇలా కూడా గ్యాస్ ఆదా చేసుకోవచ్చా అనుకుంటారు. ఏం జరిగిందంటే..ఓ మహిళ గ్యాస్ ఆదా చేసేలా వండిన వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది. అందులో ఆ మహిళ పూరీలు, అందులోకి బంగాళదుంప కూర చేయాలనుకుంది. అందుకని ముందుగా ఓ గిన్నేలో బంగాళ దుంపలను ఉడకబెట్టింది. ఆ ఆవిరిపైనే వేడితోనే పూరీలను కూడా చక్కగా ప్రీపేర్ చేసేంది. ఈ ఐడియాని చూసి నెటిజన్లు ఆమెది ఏం తెలివి అంటూ ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. అలా ఎలా అనుకుంటున్నారా..?. ఏం లేదండి ఓ స్టీల్ గిన్నేలో బంగాళ దుంపలు పెట్టింది. దానిపై ఓ మూకిడి పెట్టి నూనె పోసి చక్కగా పూరీలను వేయించింది. ఆ బంగాళ దుంపల ఆవిరిపైనే పూరీలను ప్రీపేర్ చేసేసింది అంతే. ఓహో ఇలా కూడా గ్యాస్ ఆదా చేయొచ్చా..!. ఇంతవరకు మాకు ఇలాంటి ఐడియా రాలేదబ్బా అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసేయండి. View this post on Instagram A post shared by Rekha Sharma (@rekha_sharma.001) (చదవండి: అత్యంత పిన్నవయస్కురాలైన మహిళా పైలట్!) -
పూరీ ఆలయంలోనికి అక్రమంగా బంగ్లాదేశీయులు
ఒడిశాలోని పూరీలో గల జగన్నాథ ఆలయంలోకి అనధికారికంగా తొమ్మిది మంది బంగ్లాదేశీయులు ప్రవేశించారు. వీరిని ఒడిశా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కొందరు బంగ్లాదేశ్ జాతీయులు ఆలయంలోకి వెళ్లడాన్ని తాము చూశామని విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు తమకు చెప్పారని ఒక అధికారి మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై వీహెచ్పీ కార్యకర్తలు సింగ్ద్వార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఆ బంగ్లాదేశ్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. కొందరు హిందూయేతర బంగ్లాదేశీయులు ఆలయంలోకి ప్రవేశించినట్లు తమకు ఫిర్యాదు అందిందని, ఇద్దరు బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకున్నామని, వారిని విచారిస్తున్నామని పూరీ అదనపు పోలీసు సూపరింటెండెంట్ ఎస్పీ సుశీల్ మిశ్రా తెలిపారు. ఆలయ నిబంధనల ప్రకారం హిందువులకు మాత్రమే ఆలయంలోనికి ప్రవేశం ఉంది. ఈ ఆలయంలోనికి హిందువులు కానివారు ప్రవేశిస్తే వారిపై చర్యలు తీసుకుంటారు. అదుపులోకి తీసుకున్న బంగ్లాదేశీయుల పాస్పోర్టులను తనిఖీ చేస్తున్నామని అదనపు పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. విచారణ సమయంలో ఒకరు హిందువని తేలింది. మిగిలిన పాస్పోర్టులపై విచారణ కొనసాగుతోంది. ఆలయ పరిసరాల్లోకి వచ్చిన తొమ్మిది మందిలో నలుగురు ఆలయంలోనికి ప్రవేశించినట్లు విచారణలో తేలింది. -
భారత్, అమెరికా సంబంధాలు.. చపాతి, పూరీలతో పోలిక
వాషింగ్టన్: భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలపై అమెరికా ఉన్నతాధికారి జెఫ్రీ ఆర్ ప్యాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు చపాతీలా చదునుగా లేవని పూరీలా పొంగి చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాయన్నారు. ఇంధనం, భద్రత అంశాల పరంగా భారత్తో తమకున్న సంబంధాలు ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైనవని చెప్పారు. అయితే భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై (ఎఫ్టీఏ)పై ఎలాంటి చర్చలు జరగడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరో దశకు తీసుకెళ్లడంపైనే దృష్టిపెట్టినట్లు తెలిపారు. రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో రెండు దేశాల మధ్య మంచి సంబంధాలున్నట్లు తెలిపారు. అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు భారత్కు చెందిన గ్రీన్ కో కంపెనీతో చర్చలు జరిపిన విషయాన్ని గుర్తు చేశారు. హౌతీల దాడులతో అంతర్జాతీయ సముద్ర రవాణా సమస్యలు ఎదుర్కొంటోందన్నారు. హౌతీల దాడికి గురైన నౌకలను కాపాడేందుకు భారత నేవీ చేసిన కృషి గొప్పదని, ఇది భారత సామరర్థ్యాన్ని తెలియజేస్తోందని కొనియాడారు. #WATCH | On Foreign Trade Agreements between US and India, US Secretary of State for Energy Resources Geoffrey R. Pyatt says, "Nobody today characterises their trade relationship as flat as a 'chapati'. It has become big and puffed up like a big 'puri'... I think we are not… pic.twitter.com/Gf5Tw7o8Ee — ANI (@ANI) February 5, 2024 ఇదీ.. చదవండి.. వెనక్కు తగ్గని హౌతీలు -
పాలక్ మేథీ పూరీ..ఇలా చేస్తే లొట్టలేసుకొని తింటారు
పాలక్ మేథీ పూరీ తయారీకి కావల్సినవి: జీలకర్ర – టేబుల్ స్పూను; సోంపు – టేబుల్ స్పూను; వాము – టీస్పూను; నువ్వులు – టేబుల్ స్పూను; ధనియాల పొడి – టేబుల్ స్పూను; రెండు కప్పులు; శనగపిండి – పావు కప్పు; పసుపు – అరటేబుల్ స్పూను; ఉప్పు – రుచికి సరిపడా; కారం – టేబుల్ స్పూను; నూనె –డీప్ఫ్రైకి సరిపడా పచ్చిమిర్చి – మూడు; అల్లం తరుగు – టీస్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; పాలకూర తరుగు – రెండు కప్పులు; మెంతికూర తరుగు – కప్పు; గోధుమ పిండి –రెండు కప్పులు తయారీ విధానం: జీలకర్ర, సోంపు, నువ్వులు, వాము, ధనియాల పొడి, పచ్చిమిర్చి; అల్లం తరుగు, కరివేపాకుని మిక్సీజార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పాలకూర, మెంతికూర తరుగుని గిన్నెలో వేయాలి. దీనిలోనే గోధుమపిండి, శనగపిండి, కారం, పసుపు, గ్రైండ్ చేసిన మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు, టేబుల్ స్పూను నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా వేడినీళ్లు చల్లుకుంటూ ముద్దలా కలపాలి ∙పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీలా మందంగా వత్తుకోవాలి ∙గుండ్రని గిన్నె లేదా చిన్న గ్లాసుతో పూరీని చిన్న చిన్న చెక్కల్లా కట్ చేయాలి ∙అన్నీ రెడీ అయ్యాక క్రిస్పీగా మారేంత వరకు డీప్ ఫ్రై చేస్తే రుచికరమైన పాలక్ మేథీ పూరీ రెడీ. -
పూరీ రథయాత్ర ప్రారంభం.. భారీగా భక్తుల రాక
భువనేశ్వర్: దేశంలో ప్రఖ్యాత జగన్నాథుని రథయాత్ర ప్రారంభమైంది. ఇక, రథయాత్ర సందర్భంగా పూరీ నగరం భక్తులతో నిండిపోయింది. రథయాత్రలో పాల్గొనేందుకు ఒడిశాతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో శ్రీక్షేత్రం పరిసరాలతో పాటు అక్కడి వీధులన్నీ కిక్కిరిపోతున్నాయి. ‘జై జగన్నాథ’ నినాదాలతో పూరీ నగరం మార్మోగుతోంది. ఇదిలా ఉండగా, మంగళవారం ఉదయం జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల విగ్రహాలను రథాలపై ప్రతిష్ఠించి తరువాత మంగళహారతి చేపట్టారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పూరీ రాజు గజపతి దివ్యసింగ్దేవ్ రథాలపై చెరాపహర (బంగారు చీపురుతో ఊడ్చడం) చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు భక్తులు రథాలను లాగుతారు. సాయంత్రం రథాలు గుండిచా మందిరానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇక, పూరీ రథయాత్రకు పలువరు ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. #WATCH | A large number of devotees gather in Odisha's Puri for the #JagannathRathYatra_2023 pic.twitter.com/CzRrc3hZHI — ANI (@ANI) June 20, 2023 Puri Ratha Yatra,Odisha 🌅🌺🌺🌺🌺👏👏👏🐚🐚🐚🐚🐚🐚 pic.twitter.com/2K6tOzGmCp — SATYAJIT PRADHAN (@Satyaji56683529) June 20, 2023 ఇది కూడా చదవండి: వీడియో: కేదార్నాథ్ ఆలయ గర్భగుడిలో అపచారం.. మహిళ ఓవరాక్షన్.. శివలింగంపై కరెన్సీ నోట్లు.. -
Vande Bharat: వడగళ్లు, పిడుగుపడి దెబ్బతిన్న వందేభారత్
భువనేశ్వర్: దేశంలో అత్యంత వేగంగా పేరున్న సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్ప్రెస్. అయితే ఈ రైలు నాణ్యత విషయంలోనే పలు విమర్శలు వినిపిస్తున్నాయి. తరచూ జరుగుతున్న ప్రమాదాలు అందుకు కారణం. తాజాగా.. వడగండ్ల వానకు, పిడుగుపడి ఓ వందేభారత్ రైలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఒడిషాలో ఈమధ్యే ప్రారంభమైన పూరీ-హౌరా వందేభారత్ ఎక్స్ప్రెస్(22896) ఆదివారం మధ్యాహ్నం ముందు భాగం దెబ్బతింది. భద్రాక్ రైల్వే స్టేషన్కు 30 కిలోమీటర్ల దూరంలో.. పిడుగుపడి డ్రైవర్ క్యాబిన్ విండ్స్క్రీన్, సైడ్ విండోలు పగుళ్లు వచ్చాయి. అయితే ఎవరికీ ఏం కాలేదు. అలాగే వడగండ్ల వాన కురిసి.. పలు కోచ్ల సైడ్ విండోలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇదేకాదు.. ఓవర్హెడ్ ఎలక్ట్రిక్ వైర్ తెగిపోవడంతో వైతరణి రోడ్డు రైల్వే బ్రిడ్జి వద్ద రెండు గంటలపాటు రైలు ఆగిపోయింది. రైలులో పవర్ సప్లై నిలిచిపోవడంతో చాలామంది ప్రయాణికులు.. సామాజిక మాధ్యమాల్లో ఆ ఫొటోలు, వీడియోలు పోస్టు చేసి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక.. ఓ డీజిల్ ఇంజిన్ను పంపించి రైలును అక్కడి నుంచి తరలించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. మరమ్మత్తుల నేపథ్యంలో.. ఇవాళ(సోమవారం) రైలును రద్దు చేశారు. ఒడిషా పూరీ నుంచి పశ్చిమ బెంగాల్ హౌరాను కనెక్ట్ చేస్తూ ఈ రైలును ప్రధాని మోదీ వర్చువల్గా గత గురువారం ప్రారంభించారు. వచ్చే నెల ముగింపు లోపు దేశంలోని అన్ని రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ వందేభారత్ రైళ్లను ప్రారంభించే యోచనలో ఉంది భారత రైల్వేస్. Odisha | Puri-Howrah Vande Bharat Express halted between Dulakhapatna-Manjuri Road Station after the overhead wire was damaged due to thunderstorms and lightning. Purna Chandra Shahu, Station Manager, Bhadrak said, "Front glass and side windows of the driver cabin were damaged… pic.twitter.com/bhuAIGQFiI — ANI (@ANI) May 21, 2023 -
Puri Jagannath Temple: ఆ మూడో గదిలో అంతులేని ధనరాశులున్నాయా?
పూరీ జగన్నాథ ఆలయంలోని రత్నభాండాగారంలోని అంతులేని శ్రీవారి ఆభరణాలు, బంగారు, వెండి,వజ్ర వైఢూర్యాలు క్షేమంగా ఉన్నాయా? ఖజానాకు సంబంధించిన కీలక తాళం పోయి యాభై ఏళ్లు దాటినా ఇంత వరకు దాన్ని ఎందుకు చేధించలేదు?ఈ విషయంపై ప్రభుత్వం ఎందుకు అనుమానస్పద మౌనాన్ని కొనసాగిస్తోంది? శ్రీవారి నిధి ఉన్న గదిలోంచి బుస బుసలు వినిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అది వేయి పడగల ఆదిశేషునివేనా? అసలు జగన్నాధుని కొలువులో ఏం జరుగుతోంది? దేవుడి ఆస్తులకే మనిషి శఠగోపం పెడుతున్నాడా?అక్కడున్న రహస్యం ఏంటి? అందరినీ కాపాడ్డానికి ఆ దేవుడు ఉన్నాడు. మరి దేవుడి సంపద కాపాడటానికి ఎవరున్నారు? కచ్చితంగా మనిషిని నమ్మడానికి వీల్లేదు. తన సంపదను దేవుడే కాపాడుకోవాలి. ఇదంతా ఎందుకంటే ఒడిషా లోని అత్యంత ప్రాచీనమైన పూరీ జగన్నాథుని దేవాలయంలో అంతులేని శ్రీవారి సంపదలు ఉన్న భాండాగారం గది తాళాల మిస్సింగ్ వ్యవహారం పెద్ద మిస్టరీగా మారింది. తాళాలు ఎలా పోయాయో ప్రభుత్వం చెప్పలేకపోతోంది. ఆలయ కమిటీ ఏమీ తెలీదంటోంది. తాళాలు పోయిన యాభై ఏళ్ల తర్వాత కూడా ఎవ్వరిలోనూ కంగారు లేదు. వాటిని వెతికి పట్టుకోవాలన్న ఆతృత లేదు. పాలకుల వైఖరిని చూసి భక్తులు మండిపడుతున్నారు. దేవ దేవుడి ఆభరణాలు ఉన్నాయా? దిగమింగేశారా? చెప్పండంటూ నినదిస్తున్నారు. దేశంలోని నాలుగు ప్రధాన పుణ్యక్షేత్రాలు బద్రీనాథ్, ద్వారక, రామేశ్వరం, పూరి. ఈ నాలిగింటినీ కలిపి చార్ ధామ్ ఆలయాలుగా పిలుస్తారు. వీటితో పాటు మన దేశంలో అత్యంత ముఖ్యమైన ఆలయాల్లో ఒకటి ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం. 12వ శతాబ్ధంలో రాజా అనంత వర్మ చోడగంగదేవ్ హయాంలో ఆలయ నిర్మాణం మొదలై ఆయన మనవడు అనంగ భీమ్ దేవ్ పాలనలో పూజలు మొదలయ్యాయి. శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముడి చెక్క విగ్రహాలే ఈ ఆలయంలో కొలువు తీరి ఉంటాయి. కృష్ణుని ఆరాధించే వైష్ణవులకు ఇదే అత్యంత పవిత్రమైన క్షేత్రం. దేశం నలుమూలల నుంచి నిత్యం వేలాదిగా భక్తులు ఇక్కడకు తరలి వస్తూ ఉంటారు. జీవితంలో ఒక్కసారి అయినా జగన్నాథుని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు.ఇక్కడ నిత్యం దేవ దేవుడికి 56 రకాల ప్రసాదాలతో నైవేద్యాలు పెడతారు. ఈ ప్రసాదాలన్నీ కూడా మట్టి కుండల్లోనే వండుతారు.ఇక ఏటా జూన్, జులై నెలల్లో జరిగే జగన్నాథ రథ యాత్ర ఎంతో ప్రత్యేకమైనది. ఈ యాత్రలో పాల్గొనేందుకు కోట్లాది మంది ఉత్సాహంగా ఉరకలు వేస్తూ మరీ వస్తారు. జగన్నాథుడు అంటే ఈ ప్రపంచానికి నాయకుడని అర్ధం. అంటే ముల్లోకాలనూ చల్లగా చూసే విష్ణుమూర్తే అని అర్ధం చేసుకోవాలి. ఆధ్యాత్మికంగా ఇంతటి ప్రాముఖ్యత ఉన్న జగన్నాథ ఆలయంలో అర్ధ శతాబ్ధిగా ఓ రహస్యం వెంటాడుతోంది. అది అంతు చిక్కని మిస్టరీగా మారి భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. సమాధానం లేని ప్రశ్నలా అందరినీ వేధిస్తోంది. జగన్నాథుని ఆలయం ఆరంభమైన నాటి నుంచి అంటే 12వ శతాబ్ధం నుండి 18వ శతాబ్ధం వరకు ఈ ప్రాంతాన్ని ఏలిన రాజులు దేవ దేవుడికి విలువైన ఆభరణాలు, బంగారం వెండి వజ్ర వైఢూర్యాలు వంటి ఎన్నో కానుకలను భక్తిగా సమర్పించుకుంటూ వచ్చారు. ఈ సంపదలన్నింటినీ శ్రీక్షేత్రంలోని రత్నభండాగారంలోని మూడో గదిలో దాచారు. ఎప్పుడో 1926లో బ్రిటిష్ పాలకులు ఈ రత్నభాండాగారాన్ని తెరిపించినపుడు అందులో 597కి పైగా రక రకాల ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడి సంపదను వెలగట్టలేమని అప్పటి నిపుణులు ఓ నివేదిక కూడా రూపొందించారు. రత్నాలు, స్వర్ణ కిరీటాలు, ధనుర్బాణాలు, వజ్ర వైఢూర్య, గోమేధిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, పగడాలు లెక్కకు మించి రాశులు రాశులుగా పోసి ఉన్నట్లు గురించారు. రత్నభాండాగారంలోని రహస్యగదిగా పిలుస్తోన్న మూడో గది కింద ఓ సొరంగ మార్గం కూడా ఉందని, దాని ద్వారా వెళ్తే మరిన్ని గదుల్లోకి వెళ్లచ్చని, వాటిలో అంతులేని ధనరాశులు నిక్షిప్తమై ఉండవచ్చని వందేళ్ల క్రితం నాటి నిపుణులు అంచనా వేశారు. అంతా బానే ఉంది కానీ కొన్నేళ్లుగా ఈ రహస్య గదే పెద్ద మిస్టరీగా మారింది. రత్నభాండాగారంలోని మూడో గదికి మూడు తలుపులు ఉంటాయి. ఒక్కో తలుపుకు ఒక్కో తాళం చొప్పున మూడు తాళాలు ఉంటాయి. వీటిలో ఒక తాళంచెవి గజపతి రాజుల వద్ద ఉంటుంది. మరో తాళంచెవి దేవాలయ పాలనాధికారుల వద్ద ఉంటుంది. ఇక మూడో తాళం ఆలయ ప్రధాన అర్చకుడు భండాగార ఇన్ఛార్జ్ దగ్గర ఉంటుంది. ఈ మూడు తాళాలు ఉంటేనే ఆ గది తలుపులను పూర్తిగా తెరవడం కుదరదు. రత్నభాండాగారంలోని మొదటి గదిలో దేవుడికి సంబంధించిన ఆభరణాలు ఉంటాయి. పండగలు, పబ్బాలు వచ్చినపుడు ఈ నగలనే తీసి దేవుడికి అలంకరించి పూజలు చేస్తారు. పూజలు ముగిసిన వెంటనే వీటిని తిరిగి ఈ గదిలో భద్రపరుస్తారు. రెండో గదిలోనూ విలువైన వస్తువులున్నాయి. అయితే మూడో గదిని మాత్రం దశాబ్ధాలుగా తెరవనే లేదు. ఎందుకు తెరవడం లేదో ఎవరికీ అర్దం కావడం లేదు. మొత్తానికి భక్తులు, ప్రజాసంఘాలు పదే పదే అనుమానాలు వ్యక్తం చేసిన తర్వాత తేలిందేంటంటే ఈ మూడు తాళాల్లో ఒక తాళం కనిపించడం లేదని. దేవాలయం ఉండే ప్రాంతానికి సంబంధించిన కలెక్టర్ 2018లో అధికారికంగా రత్నభాండాగారానికి చెందిన మూడో గదికి సంబంధించిన ఒక తాళం పోయిందని అది ఎక్కడికిపోయిందో తెలవడం లేదని ప్రకటించారు. దాంతో ప్రభుత్వంపైనా ఆలయ పాలనా యంత్రాంగం పైనా విమర్శలు వెల్లువెత్తాయి.1964లో చివరి సారి మూడో గదిని తెరిచినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత తాళం కనిపించకపోవడంతో తెరవలేదని అంటున్నారు. దీనిపై విపక్షాలు విరుచుకుపడటంతో కొన్నాళ్ల కింద పాలక పక్ష మంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ దేవ దేవుడి ఆభరణాలు కానీ సంపద కానీ ఎక్కడికీ పోలేదని.. పూచిక పుల్ల కూడా ఎవరూ దోచుకుపోలేదని అన్నీ భద్రంగానే ఉన్నాయని వివరణ ఇచ్చారు. అసలు తాళాలు పోయాయని ప్రకటించిన వెంటనే ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జస్టిస్ రఘువీర్ దాస్ నేతృత్వంలో ఒక విచారణ కమిటీని నియమించారు. తాళాలు పోవడంలో ఎవరి పాత్ర ఉందో తేల్చడంతో పాటు మొత్తం వ్యవహారంలో ఎవరు బాధ్యులో తేల్చాలని ఆయన ఆదేశించారు. రఘువీర్ దాస్ కమిటీ నెలల తరబడి దర్యాప్తు చేసిన తర్వాత 324 పేజీల నివేదికను సమర్పించింది. అయితే ఇంతవరకు ఆ నివేదికను నవీన్ పట్నాయక్ ప్రభుత్వం బయట పెట్టలేదు. ఆ నివేదికలో ఏం ఉందన్నది మిస్టరీగా మారింది. 1985లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఉన్న రెండు తాళాలతో మూడో గదిలో ప్రవేశించడానికి ప్రయత్నం చేశారు. అయితే రెండు తలుపులు తెరవగానే ఆ గదిలోంచి పెద్ద సంఖ్యలో పాములు ఒకేసారి బుసలు కొట్టినట్లు భయానక శబ్ధాలు రావడంతో భయంతో ఆ తలుపులను తిరిగి మూసివేసి వెనక్కి వెళ్లిపోయారని చెబుతారు. ఆలయం నిర్మించిన నాటి నుండి ఇక్కడ పనిచేసే అర్చకులు, సేవకులు, ఇతర సిబ్బంది కూడా వంశపారంపర్యంగా కొన్ని కుటుంబాల వాళ్లే కొనసాగుతున్నారు.ప్రధాన అర్చకులయితే.. ఓ అడుగు ముందుకేసి దేవాలయ రత్నభాండాగారాన్ని తెరిస్తే దేశానికే అరిష్టం అని హెచ్చరిస్తున్నారు. దేవుడి ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా తలుపులు తెరిస్తే అంతా సర్వనాశనం అయిపోతుందని పెను విపత్తులు తరుముకు వస్తాయని వారు బెదిరిస్తున్నారు. జగన్నాధుని భక్తితో కొలిచే వారు మాత్రం తమ దేవుడి సంపద భద్రంగా ఉందో లేదో స్పష్టం చేయాలంటున్నారు. మూడో గది తాళాలు ఎలా పోయాయో ఎవరు కొట్టేశారో ఎందుకు తేల్చడం లేదంటూ వారు నిలదీస్తున్నారు. తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలోనూ నేలమాళిగల్లో అపార ధనరాశులు ఉన్నాయన్న సమాచారంతో కోర్టు ఆదేశాలతో నేలమాళిగలను తెరిచారు. అయితే అందులో ఆరు నేలమాళిగలు ఉండగా అధికారులు కేవలం అయిదు నేలమాళిగలను మాత్రమే తెరిచారు. నిజానికి ఈ ఆరో నేలమాళిగే అన్నింటిలోకీ కీలకమైందని అప్పుడు ప్రచారం చేశారు. ఎందుకంటే మిగతా అయిదు నేలమాళిగలతో పోలిస్తే ఆరో నేలమాళిగ చాలా పెద్దదని ఆలయ సిబ్బంది కూడా చెబుతున్నారు. ఆరో నేలమాళిగ కన్నా చాలా చిన్నవైన ఇతర నేలమాళిగల్లోనే ఒక లక్షా ఇరవై వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయంటే ఆరో నేలమాళిగలో దీనికి ఎన్నో రెట్లు ఎక్కువ ధనరాశులు కచ్చితంగా ఉంటాయన్నది వారి వాదన. అయితే అధికారులు మాత్రం ఆరో నేలమాళిగను ఈ రోజుకీ తెరవలేదు. ఆరో నేలమాళిగ ను మూసి ఉంచిన ఇనుప తలుపులపై నాగసర్పం బొమ్మ ఉంది. ఆ తలుపులను నాగబంధంతో బంధించారని ప్రచారం జరుగుతోంది. ఆ నాగబంధాన్ని ఖాతరు చేయకుండా తలుపులు తెరిస్తే మొత్తం లోకానికే అరిష్టమని దేవుడి ఉగ్రరూపం విలయ రూపంలో విరుచుకుపడి మానవాళిని నాశనం చేసేస్తుందని ఆలయ పూజారులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడే ఏదో మెలిక ఉందనిపిస్తుందంటున్నారు హేతువాదులు. ఒకే దేవుడికి సంబంధించిన ఒకే గుడిలో అయిదు మాళిగల తలుపులు తెరిస్తే ఏమీ కానిది ఆరో మాళిగ తెరిస్తేనే ఏదో అయిపోతుందని అనడంలో అర్ధం ఏముందని వారు నిలదీస్తున్నారు. అయితే భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదన్న సున్నితమైన ఆలోచనతో ఆరో నేలమాళిగ తెరవకూడదని నిర్ణయించేసుకున్నారు. పూరీలోని జగన్నాథుని ఆలయంలోనూ కీలకమైన మూడో గదిలోనే లెక్కకు మించిన ధనరాశులు ఉన్నాయని అంటున్నారు. ఈ ధనరాశులకు కాపలాగా లక్షలాది పాములే ఉఏనేన్నాయా? లేక వేయి పడగల ఆదిశేషుడే విష్ణుమూర్తి సంపదకు కాపలాగా ఉన్నాడా? అన్నది అర్ధం కావడం లేదు. పాముల బుస బుసలు మాత్రం వినిపిస్తున్నాయని అధికారులు అన్నారన్న ప్రచారంలో ఎంత వరకు నిజముంది? వెంటనే ఆ గది తెరిస్తే ప్రళయం వచ్చి అందరూ కొట్టుకుపోతారని పూజారులు హెచ్చరించడం దీనికి కొనసాగింపా? అన్నది తెలియాల్సి ఉంది. అసలు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంది? కొందరు భక్తులు అయితే మూడో గదిలోని విలువైన ఆభరణాలు, సంపదలను రాబందులు తన్నుకుపోయి ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలోని పెద్దల అండదండలు ఉన్నాయి కాబట్టే మూడో గది తాళాల గురించి కానీ రఘువీర్ దాస్ కమిటీ నివేదిక గురించి కానీ ప్రభుత్వం మాట్లాడ్డం లేదని వారంటున్నారు.మూడో గదిని ప్రజల సమక్షంలో తెరిస్తే నిజా నిజాలు బయటకు వస్తాయని ప్రజాసంఘాల నేతలు అంటున్నారు. అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఆరో నేలమాళిగ తరహాలోనే పూరీ జగన్నాథ ఆలయంలోని కీలకమైన ఈ మూడోగది మిస్టరీ కూడా ఎప్పటికీ వీడకపోవచ్చునని కొందరు మేథావులు అంటున్నారు. పాలకులు మాత్రం ఏమీ అనడం లేదు. ఆలయ సిబ్బంది కూడా బెల్లంకొట్టిన రాయిలా మాట్లాడ్డం లేదు. భక్తులు మాత్రం దేవుడికి అపచారం జరిగిందని బాధపడుతున్నారు. అది దేశానికి ఏ మాత్రం మంచిది కాదని ఏ క్షణంలో ఏం ముంచుకు వస్తుందోనని వారు భయపడుతున్నారు. ఇక నిజా నిజాలు వెలికి తీసి దోషులకు శిక్షపడేలా చేయాల్సింది ఆ జగన్నాథుడే. ఆయనే కద జగన్నాటక సూత్రధారి. తన ఆస్తులను ఎవరు కొట్టేశారో పట్టుకుని బోనులో పెట్టాల్సింది దేవుడే ఇక. భక్తుల మనోభావాలను అడ్డుపెట్టుకుని దేవుడి సంపదలు కొల్లగొడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆధ్యాత్మిక వాదులు హెచ్చరిస్తున్నారు. వెలకట్టలేని అపార దేవుడి సంపదకు రక్షణ కల్పించాల్సిన పాలకులు ఘోరంగా విఫలమయ్యారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నిజానిజలేంటో వెలుగులోకి తీసుకురావాలని వారు పట్టుబడుతున్నారు. -
దేవుడి సొమ్ము భద్రమేనా?
-
ఒడిశా సీఎం కాన్వాయ్పై కోడిగుడ్ల దాడి
భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాన్వాయ్పై భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు. పూరీ నగరంలోని దర్జీపోఖారీ ఛక్ వద్ద బుధవారం ఈ దాడి జరిగింది. శ్రీ జగన్నాథ్ పరికర్మ ప్రాజెక్టు శంకుస్థాపనకు సీఎం పట్నాయక్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఛేదించుకుని బీజేవైఎం కార్యకర్తలు అత్యంత సమీపం నుంచి సీఎం కాన్యాయ్పైకి కోడిగుడ్లు విసిరారు. ఇవి నేరుగా ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కారు అద్దాలకు తగిలాయి. దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హోంశాఖ సహాయ మంత్రి దిబ్య శంకర్ మిశ్రాను కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజులుగా బీజేపీ నిరసన కార్యక్రమాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు మంత్రుల వాహనాలపై కోడిగుడ్ల దాడులకు పాల్పడింది. మహిళా టీచర్ మమతా మెహర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు గోబింద సాహుతో శంకర్ మిశ్రాకు సంబంధాలున్నాయని బీజేపీ, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కోడిగుడ్ల దాడులు జరుగుతున్నాయి. సీఎం కాన్యాయ్పై కోడిగుడ్ల దాడి చేసింది తామేనని బీజేవైఎం ఒడిశా అధ్యక్షుడు ఇరాసిస్ ఆచార్య తెలిపారు. ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లినా నిరసన తెలుపుతుంటామన్నారు. దిబ్య శంకర్ మిశ్రాను కేబినెట్ నుంచి తొలగించే వరకు ఇదే తరహాలో ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. (చదవండి: పెళ్లి బాజాలతో.. 65 కోళ్లు మృతి!.. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో!!) -
రాత్రి బహిర్భూమికి వెళ్లిన వివాహిత చేతులు కాళ్లను టవల్తో కట్టేసి..
భువనేశ్వర్: దేశంలో ప్రతి రోజు ఏదో ఒకచోట మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరిని వదలం లేదు. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఏదో వైపు నుంచి ప్రమాదాలు ఉప్పెనల పొంచుకొస్తున్నాయి. తాజాగా మరో అఘాయిత్యం వెలుగు చూసింది. రాత్రి పూట కాల కృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లిన వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒడిశాలోని పూరి జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. నిమపరా ప్రాంతంలో శనివారం రాత్రి 22 ఏళ్ల వివాహిత బహిర్భూమికి ఒంటరిగా గ్రామంలోని నది ఒడ్డుకు వెళ్లింది. చదవండి: యూట్యూబర్ మరోసారి అరెస్ట్.. పవిత్ర స్థలంలో వీడియో చిత్రీకరణ అయితే ఆమె ఒంటరిగా వచ్చిందనే విషయన్ని నలుగురు వ్యక్తులు గమనించారు. మహిళ నిర్మానుష్య ప్రదేశంలోకి వెళ్లే వరకు వేచి చూసి ఆపై ఆమె చేతులు కాళ్లను బలవంతంగా టవల్తో కట్టేసి సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఎంతసేపటికీ మహిళ తిరిగి రాకపోవడంతో భర్త, కుటుంబ సభ్యులు వివాహితను వెతకడానికి వెళ్లారు. అదే సమయంలో నదీ ఒడ్డున మహిళ ఏడుస్తూ కనిపించింది. కుటుంబ సభ్యులకు జరిగిన విషయం వివరించగా.. ఆమెను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి నిందితులపై కేసు నమోదు చేశారు. చదవండి: విషాదం: తల్లీకూతుళ్లను కబళించిన మృత్యువు నిందితులు.. బలరాం భోయి, అతని సహచరులు కన్హయి భోయి, బిద్యాధర్, అజిత్ దాస్గా పోలీసులు గుర్తించారు. నలుగురు నిందితులను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో త్వరితగతిన చర్యలు తీసుకుంటామని పూరీ ఎస్పీ కన్వర్ విశాల్ సింగ్ హామీ ఇచ్చారు. నిందితులపై 30 రోజుల్లోగా చార్జిషీట్ను ఫైల్ చేసి కోర్టులో సమర్పిస్తామని పేర్కొన్నారు. -
ఈ దసరా పండగకు ప్రముఖ పుణ్యక్షేత్రం మూసివేత
పూరీ: ప్రముఖ పుణ్యక్షేత్రంగా అలరారుతండే పూరీ జగన్నాథుని ఆలయాన్ని కోవిడ్ -19 దృష్ట్యా కొత్త నిబంధనల కారణంగా తొమ్మిది రోజులు మూసేస్తున్నట్లు అలయ అధికారులు తెలిపారు. ప్రతి ఏటా దసరా సందర్భంగా జగన్నాథుడు 'సున భేష' (బంగారు వస్త్రధారణ)లో దర్శనమిస్తాడు. పైగా ఈ దసరా సమయంలో భక్తుల తాకిడి అధికమవుతుందన్న నేపథ్యంలోనే వారి ఆరోగ్య దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. త్రిమూర్తులు భగవాన్ బలభద్రడు, దేవి సుభద్ర దేవి జగన్నాథుడుని దసరాలో విజయ దశమి పర్వదినం రోజుతో సహా సంవత్సరంలో ఐదుసార్లు 'సునా భేస' (బంగారు వస్త్రధారణతో) అలంకరిస్తారు. (చదవండి: ఎర్ర జెండాలనే ఎందుకు వాడుతున్నారో తెలుసా?) అయితే ఈ ఉత్సవానికి 12వ శతాబ్దకాలం నుంచి ఏటా ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అటువంటి ప్రత్యేకతను సంతరించకున్న ఈ దర్శనం కోసం ఏటా కొన్ని లక్షల మంది భక్తులు ఆర్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే మళ్లీ అక్టోబర్ 20 నుంచి ఆలయం తెరిచి ఉంటుందని, ఈ మేరకు ప్రజలు యథావిధిగా దర్శనం చేసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. అంతేకాదు వచ్చే నెలలో 'దీపావళి' (నవంబర్ 4), 'బడా ఏకాదశి' (నవంబర్ 15) 'కార్తీక పూర్ణిమ' (నవంబర్ 19) వంటి పర్వదినాల్లో కూడా ఆలయానన్ని మూసివేస్తున్నట్లు అధికారులు చెప్పడం గమనార్హం. (చదవండి: మూడో ప్రపంచ యుద్ధం గ్రహాంతరవాసులతోనే అటా!) -
నేడు జగన్నాథుని రథయాత్ర.. వారికి నో ఎంట్రీ
సాక్షి, భువనేశ్వర్/పూరీ: జగన్నాథుని రథయాత్ర ప్రపంచ ప్రఖ్యాతం. జనసంద్రం నడుమ అత్యంత వైభవంగా జరగాల్సిన యాత్ర ఆద్యంతాలు ఈ ఏడాది కరోనా కారణంగా జనసంచారం లేని వీధుల గుండా సోమవారం జరగబోతోంది. శ్రీమందిరం నుంచి గుండిచామందిరం వరకు సాగే ఈ యాత్రలో బొడొదండొ దారి పొడవునా బలభద్ర, సుభద్ర, జగ న్నాథుని రథాలను లాగే గొప్ప కార్యక్రమం చోటుచేసుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో తగిన ఏర్పాట్లను నిర్వాహకులు చేశారు. కోవిడ్ నియంత్రణ చర్యల దృష్ట్యా గతేడాది తరహాలో లాగే ఈసారి కూడా యాత్రకు భక్తులకు ప్రవేశం నిషేధిస్తూ చర్యలు చేపట్టడం గమనార్హం. సింహద్వారం ప్రాంగణంలో శానిటైజ్ చేస్తున్న సిబ్బంది పరిమితమైన సిబ్బంది, సేవాయత్లతో ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలతో యాత్ర నిర్వహిస్తారు. ఇప్పటికే యాత్రలో పాల్గొనే వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అంతకుముందే ఆయా వర్గాల వారికి కోవిడ్ వ్యాక్సిన్ కూడా వేశారు. పోలీస్ సిబ్బంది, సేవాయత్లు మినహాయిస్తే యాత్ర కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు దాదాపు 1000 మంది అధికారులు వరకు అందుబాటులో ఉంటారని పూరీ జిల్లా కలెక్టర్ సమర్థ వర్మ తెలిపారు. సుప్రీంకోర్టు ఆంక్షలకు అనుగుణంగా రథాలను లాగేందుకు సేవాయత్లు, పోలీసులను మాత్రమే నియమించారు. ఈ క్రమంలో ఒక్కోరథం లాగేందుకు గరిష్టంగా 500 మంది ఉంటారని అధికారులు తెలిపారు. యాత్రా స్థలంలో మోహరించిన భద్రతా బలగాలు భద్రత కట్టుదిట్టం.. కరోనా కట్టడిలో భాగంగా యాత్రలో జనసమూహం నివారణకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పూరీ జిల్లా రైల్వేస్టేషన్ని చేరుకునే రైలు సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో పాటు పట్టణంలో కర్ఫ్యూ విధించి, పట్టణ సరిహద్దుల్లో ఇతర ప్రాంతాల వారి రాకపోకలను పూర్తిగా నిషేధించారు. ఈ నెల 13వ తేదీ వరకు కర్ఫ్యూ నిబంధనలు కొనసాగుతాయి. ఇదిలా ఉండగా, రథయాత్ర ఏర్పాట్లను ఆదివారం సమీక్షించిన అదనపు డీజీపీ ఆర్.కె.శర్మ మాట్లాడుతూ పూరీ పట్టణాన్ని 12 జోన్లుగా విభజించి, 65 ప్లాటూన్ల పోలీస్ బలగాలతో భద్రతా చర్యలు చేపట్టామన్నారు. భద్రతా బలగాల్లో 10 మంది అదనపు పోలీస్ సూపరింటెండెంట్లు, 31 మంది డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్లు, 64 మంది ఇన్స్పెక్టర్లు, 222 మంది సహాయ సబ్–ఇన్స్పెక్టర్లు, సబ్–ఇన్స్పెక్టర్లుని నియమించినట్లు పూరీ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కె.వి.సింఘ్ తెలిపారు. నందిఘోష్ రథం వద్దకు ఆజ్ఞామాలను తీసుకువెళ్తున్న దృశ్యం ఆజ్ఞామాలలతో పూజలు.. రథ నిర్మాణ శాల శ్రీమందిరం ఆవరణకు చేర్చిన జగన్నాథ, సుభద్ర, బలభద్రుని రథాలకు మూలవిరాట్ల దగ్గరి నుంచి బాజాభజంత్రీలు, మేళతా ళాలు, ఘంటానాదంతో తీసుకువచ్చిన ఆజ్ఞామాలలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక గోవర్థన పీఠాధిపతి, ఆదిశంకరాచార్యులు స్వామి నిశ్చలానంద సరస్వతికి ఆలయ సంప్రదాయ రీతిలో అధికారిక పిలుపు చేశారు. రథాలపై యాత్రకు ఆసీనులైన మూలవిరాట్లను తొలుత ఆదిశంకరాచార్యులు ప్రత్యక్షంగా దర్శించుకుని, స్వామి తొలి దర్శనం స్వీకరిస్తారు. సూక్ష్మ రథాలు.. సూపర్! జగన్నాథుని రథయాత్ర పురస్కరించుకుని, నగరంలోని శ్రీరామ్నగర్కి చెందిన ప్రముఖ శిల్పి హరగోవింద మహరణ తన కళా నైపుణ్యం ఉపయోగించి, బియ్యం, గోదుమలతో తయారు చేసిన బలభద్ర, సుభద్ర, జగన్నాథుని సూక్ష్మ రథాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రోజుకు మూడు గంటలు చొప్పున కష్టపడగా, వారం రోజుల్లో ఇవి పూర్తయినట్లు సమాచారం. – బరంపురం -
కనులపండువగా పూరీ రథయాత్రకు అంకురార్పణ
భువనేశ్వర్/పూరీ: శ్రీక్షేత్రంలో భంవురి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా గురువారం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుల ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో జరిగిన పూజలను అత్యంత భక్తిశ్రద్ధలతో చేపట్టారు. జగన్నాథుని రథయాత్ర ఘట్టాలను నిర్ణీత కాలంలో ఓ క్రమపద్ధతిలో ముగించడం ఆనవాయితీ కాగా, శ్రీమందిరం రత్నసింహాసనంపై కొలువైన మూలవిరాట్లకు తొలుత పూజలు చేసి, ఆజ్ఞామాలలు సమర్పించారు. అనంతరం 3 రథాలకు వేర్వేరుగా తయారు చేసిన ఆజ్ఞామాలలను రథ నిర్మాణ ప్రాంగణానికి తీసుకువచ్చిన ప్రధానార్చకుల వర్గం ఇరుసు, చక్రాలకు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ పూజల తర్వాత ఇరుసుకు ఇరువైపులా రెండు చక్రాల చొప్పున అమర్చారు. ఈ ప్రక్రియనే భంవురి ఉత్సవంగా పేర్కొంటారు. దీనినే రథయాత్రలో ప్రధాన భాగంగా కూడా భావిస్తారు. స్థానికంగా అయితే దీనిని చొక్కా డేరా నీతిగా వ్యవహరిచంగా, ఏటా దీనిని కనులపండువగా నిర్వహిస్తుండడం విశేషం. కరోనా విజృంభణ వేళ కూడా కోవిడ్–19 నిబంధనలు పాటిస్తూ శ్రీమందిరం ఆచార వ్యవహారాలకు ఏమాత్రం భంగం కలగకుండా ఉత్సవ ఆద్యంతాలు విజయవంతంగా సాగడం గమనార్హం. -
మఠంలో రహస్య గది: బయటపడ్డ వెండి ఇటుకలు
సాక్షి, భువనేశ్వర్/పూరీ: పూరీలోని ఎమ్మార్ మఠం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. సుమారు 11 ఏళ్ల తర్వాత ఈ మఠంలో అత్యంత అమూల్యమైన ప్రాచీన సొత్తు నిక్షిప్తంగా ఉందనే నమ్మకం సర్వత్రా బలపడింది. ఈ మఠానికి గతంలో ఉన్న మహంత ఆధిపత్యం రద్దు చేసి ట్రస్టు బోర్డు ఏర్పాటు చేశారు. ఈ బోర్డు బాధ్యతల స్వీకరణ పురస్కరించుకుని మఠంలో వెలుగు చూస్తున్న సొత్తుపట్ల అంతా అవాక్కవుతున్నారు. అయితే ఈ సొత్తు లోగడ ఖరారు చేసిన జాబితాలో ఉన్నదీ లేనిదీ స్పష్టం కావలసి ఉంది. ట్రస్టు బాధ్యతల స్వీకరణలో భాగంగా శనివారం మఠం 4వ నంబరు గది తెరవడంతో ప్రాచీన కాంస్య ఆవు, దూడ విగ్రహం బయటపడింది. దీంతో పాటు 16 పురాతన కత్తులు, వెండి ఇటుకలు, ఆభరణాలు, వంటపాత్రలు బయటపడ్డాయి. ఆవు దూడ కాంస్య విగ్రహం ఝులన్ జాతర (డోలోత్సవం)లో వినియోగించి ఉంటారని భావిస్తున్నారు. ట్రస్టుకు బాధ్యతలు ఎమ్మార్ మఠం బాధ్యతలు ట్రస్టు బోర్డుకు అప్పగించారు. ఉత్తర పార్శ్వ మఠం మహంత నారాయణ రామానుజ దాస్, జగన్నాథ సంస్కృతి ప్రచారకులు నరేష్ చంద్ర దాస్, సంఘసేవకులు ప్రతిమ మిశ్రా, ప్రముఖ న్యాయవాది బొనొ బిహారి నాయక్, సిటీ డీఎస్పీతో కొత్త ట్రస్టు బోర్డు ఏర్పాటైంది. ఈ బోర్డు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మఠంలో ఒక్కో గది తెరిచి చూడబోతే అమూల్యమైన సంపద, సొత్తు బయటపడుతోంది. ఇంతకు ముందు 2011వ సంవత్సరంలో 522 వెండి ఇటుకలు వెలుగు చూసిన సంఘటన తీవ్ర సంచలనం రేపింది. అది మొదలుకొని మఠంలో అత్యంత అమూల్యమైన రత్నవైడూర్యాలు వగైరా నిక్షిప్త నిధి ఉండి ఉంటుందనే ఊహాగానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రాచీన మఠంగా గుర్తింపు శ్రీ మందిరం పరిసరాల్లో అత్యంత పురాతనమైనదిగా ఎమ్మార్ మఠం పేరొందింది. 12వ శతాబ్దంలో సంత్ రామానుజాచార్య ఆగమనం పురస్కరించుకుని ఎమ్మార్ మఠం నిర్మితమైనట్లు పరిశోధకుల అంచనా. జగన్నాథుని సంస్కృతి సంప్రదాయాలు, నైవేద్యాలు, ప్రసాదాల పరంపరతో ముడిపడిన మఠంగా ప్రాచుర్యం సంతరించుకుంది. శ్రీ మందిరం నలు వైపుల ఆధునికీకరణ పురస్కరించుకుని ఈ మఠం తొలగించేందుకు పూరీ జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. 2019వ సంవత్సరంలో ఈ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రాథమిక తొలగింపు పనుల్లో రహస్య గదుల ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈ గదుల్లో గుప్తనిధి ఉండవచ్చన్న అనుమానాలు బలపడ్డాయి. 1866వ సంవత్సరంలో సంభవించిన కరువు కాటకాల సమయంలో ఈ మఠం ప్రజలకు భోజనాదులు అందజేసి అక్కున చేర్చుకున్నట్లు తెలుస్తోంది. అలాగే వందలాది సంవత్సరాలు ఈ మఠం ఎందరో సాధుసంతువులు, భక్తులు, బీదాబిక్కి ప్రజలకు నిరవధికంగా అన్న సంతర్పణ చేసినట్లు పరిశోధకులు భావిస్తున్నారు. మెజిస్ట్రేట్ సమక్షంలో గాలింపు మెజిస్ట్రేట్, పోలీసుల సమక్షంలో ట్రస్టు బోర్డు సభ్యులు ఈ గాలింపు చర్యలు చేపడుతున్నారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టరు, ట్రస్టు సభ్యుల సమక్షంలో ఎమ్మార్ మఠం సొత్తు జాబితా తయారవుతోంది. ఇప్పటి వరకు 3 గదులు తెరిచి గాలింపు ముగించారు. మరో 50 పైబడి ఇటువంటి గదులు ఉన్నట్లు భావిస్తున్నారు. శనివారం నిర్వహించిన గాలింపులో తొలుత 8, తదుపరి 37 వెండి ఇటుకలు బయటపడినట్లు అనధికారిక సమాచారం. కాంట్రాక్టర్ చేతివాటం మఠంలోని 2 గదుల మరమ్మతు కోసం 2011లో పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో చెక్కపెట్టెల్లో 522 వెండి ఇటుకలు లభించాయి. మరమ్మతు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ ఈ సొత్తును దొంగతనంగా కటక్ నగరంలో విక్రయించడంతో ఢెంకనాల్కు తరలిపోయింది. ఈ సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. ఢెంకనాల్కు చెందిన ఒక వ్యక్తి నుంచి పూరీ సింహద్వారం స్టేషన్ పోలీసులు ఈ వెండి ఇటుకల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మఠం నిర్వాహకుడు మహంత రాజగోపాల్తో పాటు ఆయన అనుచరుల్ని పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు వెండి ఇటుకలను జిల్లా పోలీసు ఆయుధాగారంలో భద్రపరిచారు. చదవండి: జనగామ: బయటపడ్డ లంకె బిందె.. బంగారం, వెండి లభ్యం! -
బారికేడ్లో ఇరుక్కున్న బాలుడు
సాక్షి, భువనేశ్వర్: జగన్నాథుడిని దర్శించుకునేందుకు వచ్చిన ఓ బాలుడు బారికేడ్ల మధ్య ఇరుక్కున్నాడు. కలహండి జిల్లా భవనీపట్నం నుంచి వచ్చిన ఓ కుటుంబం స్వామివారిని దర్శించుకుని ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చారు. చెప్పుల స్టాండ్లో ఉన్న చెప్పులు తీసుకునే క్రమంలో బాలుడు బారికేడ్ ఊచల మధ్య తలదూర్చాడు. తల ఇరుక్కోవడంతో కేకలు వేశాడు. కుటుంబ సభ్యులు బాలుడ్ని బయటకు లాగేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో పోలీసుల, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గ్యాస్ కటర్తో ఊచలను తొలగించి బాలుడిని సురక్షితంగా బయటకు తీయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
తిరుపతి –బిలాస్పూర్, పూరీల మధ్య ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి–బిలాస్ పూర్ ప్రత్యేక రైలు(07481) ఈ నెల 7వ తేదీ నుంచి ప్రతి గురు, ఆదివారాల్లో ఉదయం 10.50 గంటలకు తిరుపతిలో బయలు దేరుతుంది. సాయంత్రం 5.50కి విజయవాడ చేరుకుని, మరుసటి రోజు సాయంత్రం 5.25 గంటలకు బిలాస్పూర్ చేరు కుంటుంది. తిరుగు ప్రయాణంలో (07482) 9వ తేదీ నుంచి ప్రతి మంగళ, శనివారాలలో మధ్యాహ్నం 3.35గంటలకు బిలాస్పూర్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.55కి విజయవాడ చేరుకుని, అదే రోజు రాత్రి 10.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అలాగే తిరుపతి–పూరి మధ్య నడిచే ప్రత్యేక రైలు (07479) 8వ తేదీ నుంచి ప్రతి సోమ, మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో ఉదయం 10.50 గంటలకు తిరుపతిలో బయలుదేరి, సాయంత్రం 5.50కి విజయవాడ చేరుకుని, మరుసటి రోజు మధ్యాహ్నం 2.35 గంటలకు పూరి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (07480) 10వ తేదీ నుంచి ప్రతి సోమ, బుధ, గురు, శుక్ర, ఆదివారాల్లో సాయంత్రం 6.30 గంటలకు పూరిలో బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 11.55కి విజయవాడ చేరుకుని, అదే రోజు రాత్రి 10.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. చదవండి: ప్రైవేటు చేతుల్లోకి విశాఖ స్టీల్ ప్లాంట్ అవ్వా బాగున్నావా! నేనెవరో తెలుసా?.. -
ఆలయంలో బెంబేలెత్తించిన బాబా..
భువనేశ్వర్/పూరీ : జగతినాథుని దర్శనం కోసం భక్తజనం తహతహలాడుతోంది. ఈనెల 23 నుంచి అంచెలంచెలుగా దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా జగన్నాథుని సేవాయత్ వర్గాలకు తొలి దర్శనం అవకాశం కల్పించారు. కట్టుదిట్టమైన తనిఖీలతో స్వామివారి దర్శనం కోసం శ్రీమందిరం లోపలికి భక్తుల్ని అనుమతిస్తున్న తరుణంలో లొంగులి బాబా అకస్మాతుగా దూసుకుపోయిన సంఘటన తీవ్ర సంచలనం రేపింది. స్థానిక లొంగులి మఠంలో బస చేస్తున్న బాబా వైష్ణవ్పురి జగన్నాథుని దర్శనం కోసం బయలుదేరాడు. సింహద్వారం వద్ద భద్రత సిబ్బంది గుర్తింపు కార్డు కోసం నిలదీశారు. అయితే ఆవరణలో ఉన్న పతిత పావనుని విగ్రహాన్ని దర్శిస్తూ.. కాసేపటికే అకస్మాతుగా చేతిలో ఢమరకం మోగించుకుని సింహద్వారం ఆవరణలో భద్రతా సిబ్బంది వలయం ఛేదించుకుని చొరబడ్డాడు. 22 మెట్లు గుండా శ్రీమందిరం గర్భాలయానికి పరుగులు తీశాడు. బాబా వెంట ఆలయం భద్రత దళం జవాన్లు పరుగులు తీసిన బాబా.. స్వామి సన్నిధికి సునాయాశంగా చేరుకున్నాడు. స్వామి దర్శనంతో తన్మయం చెందుతున్న తరుణంలో జవాన్లు అదుపులోకి తీసుకుని బయటకు తరలించారు. ఇతర సేవాయత్ల తరహాలో స్వామి సేవకులుగా తమకు గుర్తింపు జారీ అయినా.. దేవస్థానం పాలక యంత్రాంగం ఈ మేరకు మంజూరు చేయక పోవడంతో తమవర్గం స్వామి సేవలకు దూరం అవుతుందని వాపోయాడు. స్వామి కనులలో కనులు కలిపి దర్శించాలనే తపనతో శ్రీమందిరం లోపలికి చొరబడి మనసారా స్వామిని దర్శించుకున్నట్లు తెలిపాడు. -
అతను బిచ్చగాడు కాదు.. ఇంజనీర్
పూరి : పూరిలోని జగన్నాథ ఆలయం వద్ద సుమారు 51 ఏళ్ల వయసున్న ఒక బిచ్చగానికి , రిక్షావాడికి చిన్నపాటి గొడవ జరిగింది. అంతటితో ఆగకుండా వారిద్దరు రక్తాలు వచ్చేలా కొట్టుకున్నారు. రోడ్డు మీద వెళ్లేవారు చూస్తూ ఉన్నారే తప్ప ఒక్కరు కూడా ఆపడానికి ప్రయత్నించలేదు. ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేసి వారిద్దరిని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. ఇద్దరి మధ్య గొడవకు కారణాన్ని ఫిర్యాదు రూపంలో రాయమని పోలీసులు ఇద్దరిని అడిగారు. రిక్షా అతడికి చదువు రాకపోవడంతో ఫిర్యాదును సరిగా రాయలేకపోయాడు. కానీ విచిత్రంగా పక్కనే ఉన్న బిచ్చగాడు మాత్రం ఫిర్యాదును ఇంగ్లీష్లో రాయడంతో ఆశ్చర్యపోవడం పోలీసులు వంతైంది. అందులోనూ ఆ బిచ్చగాడు రాసిన ఫిర్యాదులో ఒక్క తప్పు కూడా లేకపోవడం విశేషం. దీంతో బిచ్చగాడి గురించి పోలీసులు ఆరా తీయగా అతని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి. అతను బిచ్చగాడు కాదని... ఒక ఇంజనీర్ అని తెలిసింది. వినడానికి అచ్చం సినిమా కథను తలపిస్తున్నా.. ఇది అక్షరాల నిజం. ఒడిశాలోని భువనేశ్వర్కు చెందిన గిరిజా శంకర్ మిశ్రా .. తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. అనాథ ఆశ్రమంలో పెరగుతూ మిశ్రా కష్టపడి బీఎస్సీ గ్రూప్లో డిగ్రీ చదివాడు. ఆ తర్వాత ముంబయి వెళ్లి కొన్ని రోజులు ఉద్యోగం చేశాడు. తర్వాత సీపెట్ నుంచి ప్లాస్టిక్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేసి హైదరాబాద్లోని మిల్టన్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేశాడు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ చేస్తున్న ఉద్యోగాన్ని, హైదరాబాద్ను వదిలి ఒడిశాలోని పూరికి తిరిగి వచ్చి జగన్నాథ ఆలయం దగ్గర బిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నాడని పోలీసులు పేర్కొన్నారు. ఇదే విషయమై గిరిజా శంకర్ మిశ్రాను అడడగా.. ' ఈ విషయం గురించి నేను ఏమి మాట్లాడలేను. నేను బిచ్చగాడిగా మారడానికి నాకు కొన్ని సొంత కారణాలు ఉన్నాయి. నేను ఇంజనీర్గా పని చేసిన మాట నిజమే.. కానీ నాపై అధికారులతో విభేదాలు వచ్చి అక్కడి నుంచి బయటకు వచ్చి ఇలా బిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నానని' తెలిపాడు. అయితే ఎలాంటి కేసు నమోదు చేయొద్దని మిశ్రా పోలీసులను అభ్యర్థించడంతో వారు అందుకు అంగీకరించి ఇద్దరిని వదిలిపెట్టారు. మిశ్రా తన ఉద్యోగాన్ని వదిలేసి బిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నా.. రోజు రాత్రిళ్లు మాత్రం వీధి దీపాల కింద వార్తా పత్రికలను క్రమం తప్పకుండా చదువుతాడని తెలిసింది. -
ప్రపంచంలోనే అతిపెద్ద బీచ్ శుభ్రతా కార్యక్రమం
పూరి: సముద్ర తీర ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి వేలాది మంది ఏకమయ్యారు. ‘మో బీచ్ శుభ్రతా కార్యక్రమం’ పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద తీరప్రాంత శుభ్రతా కార్యక్రమాన్ని ఒడిశాలోని పూరిలో చేపట్టారు. అంతర్జాతీయ తీర ప్రాంత శుభ్రతా కార్యక్రమ దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని శనివారం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తీరప్రాంతాలను శుభ్రంగా ఉంచడం ఎంత ముఖ్యమైనదో అధికారులు వివరించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న తీరం వెంట దాదాపు 10 వేల మందికి పైగా కార్యకర్తలు బీచ్లను శుభ్రం చేశారు. -
వారానికి సరిపడా వెరైటీ పూరీలు..!
సోమవారం పూరీ... మంగళవారం పూరీ... బుధవారం పూరీ...గురువారం పూరీ... శుక్రవారం పూరీ... శనివారం పూరీ...ఆదివారం కూడా పూరీనే...మీ దగ్గర మరో రెండు వారాలుంటే ఇంకో రెండు పూరీలు... మిమ్ము కోరి వస్తున్నాయి మొత్తం తొమ్మిది పూరీలు...మీ బుగ్గలను బూరె బుగ్గలు... కాదు కాదు...పూరీ బుగ్గలను చేసుకోండి. దహీమేథీపూరీ కావలసినవి: గోధుమ పిండి – ఒకటిన్నర కప్పులు; పెరుగు – 2 టేబుల్ స్పూన్లు; అల్లం + పచ్చి మిర్చి ముద్ద – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; మెంతి కూర తరుగు – అర కప్పు; కసూరీ మేథీ – ఒక టేబుల్ స్పూను; నీళ్లు – తగినంత. తయారీ: ∙పైన చెప్పిన పదార్థాలను (నూనె తప్పించి) ఒక పాత్రలో వేసి పూరీ పిండి మాదిరిగా కలుపుకోవాలి ∙అర టేబుల్ స్పూను నూనె వేసి పిండిని మరోమారు కలపాలి ∙మూత పెట్టి, పది నిమిషాల పాటు పక్కన ఉంచాలి ∙పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీలుగా ఒత్తుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఒత్తి ఉంచుకున్న పూరీలను అందులో వేసి దోరగా వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. టొమాటో పూరీ కావలసినవి: గోధుమ పిండి – ఒక కప్పు;టొమాటోలు – 2; తరిగిన పచ్చి మిర్చి – 3; ఉప్పు – తగినంత; ధనియాల పొడి – ఒక టీ స్పూను; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ∙టొమాటోలను శుభ్రంగా కడిగిచిన్న చిన్న ముక్కలు చేయాలి ∙టొమాటో ముక్కలకుపచ్చి మిర్చి తరుగు, తగినన్ని నీళ్లు జత చేసి మిక్సీలో వేసిమెత్తగా చేసి, వడకట్టాలి ∙ఒక పాత్రలో గోధుమ పిండి, ఉప్పు, టొమాటో రసం, ధనియాల పొడి వేసిపూరీ పిండిలా కలపాలి ∙చిన్న చిన్న ఉండలు చేసిపక్కన ఉంచాలి ∙పూరీలా ఒత్తాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఒత్తి ఉంచుకున్న పూరీలను అందులో వేసి దోరగా వేయించిపేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. నమ్కీన్తిల్ పూరీ కావలసినవి: గోధుమ పిండి – ఒక కప్పు; నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – పావు టీ స్పూను; నూనె – ఒక టేబుల్ స్పూను + డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ∙ఒక పాత్రలో గోధుమ పిండి, నువ్వులు, ఉప్పు, కొద్దిగా నూనె వేసి బాగా కలపాలి ∙గోరు వెచ్చని నీళ్లు జత చేసి పూరీ పిండిలా కలుపుకోవాలి ∙చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ∙పూరీలా ఒత్తుకుని పక్కన ఉంచుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఒత్తి ఉంచుకున్న పూరీలను నూనెలో వేసి దోరగా వేయించి టవల్ మీదకు తీసుకోవాలి. తీపిగుమ్మడిపూరీ కావలసినవి: గోధుమ పిండి – 2 కప్పులు; ఇంగువ – పావు టీ స్పూను; తీపి గుమ్మడికాయ తురుము – ఒక కప్పు; బొంబాయి రవ్వ – పావు కప్పు; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; పచ్చి మిర్చి ముద్ద – ఒక టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను; ఉప్పు – తగినంత తయారీ: ఒక పాత్రలో గోధుమ పిండి, తగినంత ఉప్పు, మిరప కారం, పసుపు, ధనియాల పొడి, ఇంగువ, పచ్చి మిర్చి పేస్ట్ వేసి బాగా కలపాలి ∙కొత్తిమీర తరుగు, బొంబాయి రవ్వ, గుమ్మడి కాయ తురుము, కొద్దిగా నూనె జతచేసి మరోమారు కలపాలి ∙తగినన్ని నీళ్లు జతచేసి పూరీ పిండి మాదిరిగా కలిపి, మూత ఉంచి సుమారు గంట సేపు పక్కన ఉంచాలి ∙చేతికి నూనె పూసుకుని పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ∙పూరీలా ఒత్తుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఒక్కో పూరీని అందులో వేసి దోరగా వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙గుమ్మడి గింజలతో అలంకరించి, అందిస్తే రుచిగా ఉంటాయి. బనానా పూరీ కావలసినవి: అరటిపండు గుజ్జు – అర కప్పు; పంచదార – అర కప్పు; బాదం పప్పుల పొడి – 3 టేబుల్ స్పూన్లు; బటర్ – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – చిటికెడు ; ఏలకుల పొడి – పావు టీ స్పూను; గోధుమ పిండి – ముప్పావు కప్పు; మైదా పిండి – ముప్పావు కప్పు; కరిగించిన నెయ్యి – ఒక టేబుల్ స్పూను; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ఒక పాత్రలో అరటి పండు గుజ్జు, పంచదార, బాదం పప్పుల పొడి, బటర్, ఉప్పు, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి ∙గోధుమ పిండి, మైదా పిండి జత చే సి చేతితో మెత్తగా కలిపి మూత పెట్టి, రెండు గంటలపాటు పక్కన ఉంచాలి ∙చేతికి నూనె లేదా నెయ్యి పూసుకుని కలిపి ఉంచుకున్న పిండిని చిన్న చిన్న ఉండలు చేయాలి ∙ఒక్కో ఉండను పూరీలా గుండ్రంగా ఒత్తాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, వేయించి ఉంచుకున్న పూరీలను ఒక్కొక్కటిగా నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. దాల్ పూరీ కావలసినవి: పెసర పప్పు – 100 గ్రా.; మైదా పిండి – అర కిలో; మిరప కారం – ఒక టీ స్పూను; గరం మసాలా పొడి – ఒక టీ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 2; తరిగిన పచ్చి మిర్చి – 2; నెయ్యి – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; ఉల్లి తరుగు – అర కప్పు; ఉప్పు – 2 టీ స్పూన్లు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ∙పెసర పప్పును మూడు గంటల పాటు నానబెట్టాక, నీళ్లు ఒంపేయాలి ∙ఒక పాత్రలో కప్పుడు నీళ్లు, పెసర పప్పు వేసి మూత పెట్టి, స్టౌ మీద ఉంచి ఉడికించి (మరీ మెత్తగా ఉడికించకూడదు) దింపి నీరు ఒంపేయాలి ∙ఒక పెద్ద పాత్రలో పెసర పప్పు, మిరప కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి తరుగు, ఉల్లి తరుగు వేసి కలిపి, మిక్సీలో వేసి మెత్తగా చేసి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙మైదా పిండి జత చేసి పూరీ పిండిలా కలపాలి ∙కొద్దిగా నెయ్యి జత చేసి మరోమారు బాగా కలపాలి ∙చిన్న చిన్న ఉండలు చే సుకోవాలి ∙ఒక్కో ఉండను పూరీలా ఒత్తుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఒత్తి ఉంచుకున్న పూరీలను నూనెలో వేసి, బంగారు రంగులోకి వచ్చేవరకు రెండువైపులా వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. మిరియాలు జీలకర్రపూరీ కావలసినవి: గోధుమ పిండి – ఒక కప్పు; మిరియాల పొడి – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; నెయ్యి – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ∙ఒక పాత్రలో గోధుమ పిండి, మిరియాల పొడి, జీలకర్ర, నెయ్యి, ఉప్పు వేసి బాగా కలపాలి ∙తగినన్ని నీళ్లు జత చేసి పూరీ పిండిలా కలపాలి ∙చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ∙పూరీలుగా ఒత్తి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఒక్కో పూరీని అందులో వేసి దోరగా వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. బీట్రూట్ పూరీ కావలసినవి:బీట్ రూట్ – 1; గోధుమ పిండి – ఒక కప్పు; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; ధనియాల పొడి – పావు టీ స్పూను; జీలకర్ర పొడి – పావు టీ స్పూను; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ∙బీట్ రూట్ పైన చెక్కు తీసి సన్నగా తురమాలి ∙బాణలిలో నూనె వేసి కాగాక బీట్ రూట్ వేసి పచ్చి వాసన పోయే వరకు దోరగా వేయించాలి ∙పాత్రలో గోధుమ పిండి, వేయించిన బీట్ రూట్ తురుము, మిరప కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి ∙తగినన్ని నీళ్లు జత చేసి పూరీ పిండిలా కలుపుకోవాలి ∙చిన్న చిన్న ఉండలు చేసి, పూరీలా ఒత్తి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఒక్కో పూరీని వేసి దోరగా వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. మసాలాపూరీ కావలసినవి: గోధుమ పిండి – ఒక కప్పు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; ఉడికించిన బంగాళదుంపలు – 2; ఉప్పు –తగినంత; జీలకర్ర పొడి – పావు టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; మిరప కారం – ఒక టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; వాము – పావు టీ స్పూను; బొంబాయి రవ్వ – రెండు టీ స్పూన్లు; నీళ్లు – తగినన్ని. తయారీ: ∙ఒక పాత్రలో గోధుమపిండి, ఉప్పు, మిరపకారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, వాము, కొత్తిమీర తరుగు, బొంబాయి రవ్వ వేసి బాగా కలపాలి ∙ఉడికించిన బంగాళదుంపను పిండిలోకి తురమాలి ∙ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి ∙అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు జత చేసి పూరీ పిండి మాదిరిగా కలుపుకోవాలి ∙పైన నూనె వేసి మరోమారు కలిపి మూత ఉంచి, అరగంటసేపు నాననివ్వాలి ∙చేతికి నూనె పూసుకుని, పిండిని ఉండలుగా చేసుకోవాలి ∙పూరీ మాదిరిగా ఒత్తాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఒక్కో పూరీని వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. -
వైభవంగా జగన్నాథుడి రథయాత్ర
పూరి : జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా గురువారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం తొమ్మిది గంటలకు ప్రాతఃకాల ధూపదీపాదులు, మంగళ హారతి ముగించి మూల విరాట్ల తరలింపు (పొహొండి) కార్యక్రమం చేపట్టారు. శ్రీ మందిరం నుంచి స్వామి యాత్ర కోసం ఉవ్విళ్లూరుతున్న రథాలు ఉరకలేసుకుని ముందస్తుగా శ్రీ మందిరం సింహద్వారం ఆవరణకు చేరాయి. రథ నిర్మాణ ప్రాంగణంలో తయారీ ముగించుకుని వస్త్రాలంకరణ, కలశ స్థాపన, చిత్ర లేఖనం వగైరా ఆర్భాటాలతో మూడు రథాలు ఒక దాని వెంబడి మరొకటిగా క్రమంలో స్వామికి స్వాగతం పలికేందుకు ముందస్తుగా సింహదార్వం దగ్గర నిరీక్షించాయి. సుదర్శనుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర, జగన్నాథుని మూల విరాట్లు వరుస క్రమంలో రథాలపైకి చేరిన తర్వాత రథయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర సూర్యాస్తమయం వరకు నిరవధికంగా కొనసాగుతుంది. మరోవైపు జగన్నాథుని రథయాత్రను పురస్కరించుకుని ప్రధాన దేవస్థానం శ్రీ మందిరం పుష్పాలంకరణతో శోభిల్లుతోంది. ఆలయ చరిత్రలో రథయాత్రను పురస్కరించుకుని దేవస్థానం పుష్పాలంకరణతో శోభిల్లడం ఇదే తొలిసారి. యాత్ర నేపథ్యంలో శ్రీ మందిరం, గుండిచా మందిరాలు, ఉప ఆలయాల్ని పూలతో అలంకరిస్తారు. సీసీ టీవీ నిఘా స్వామి రథయాత్రను పురస్కరించుకుని అశేష జన వాహిని తరలి వస్తుంది. రోడ్డు, రైలు రవాణా సంస్థలు యాత్రికుల తరలింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. యాత్రికుల రద్దీ దృష్ట్యా శాంతిభద్రతల నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారు. పూరీ పట్టణం అంతటా పకడ్బందీగా సీసీటీవీ కెమెరా నిఘా కార్యాచరణలో ఉంటుందని రాష్ట్ర డైరెక్టరు జనరల్ ఆఫ్ పోలీసు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ శర్మ తెలిపారు. రైలు, బస్సులు ఇతరేతర వాహనాలు, సముద్ర మార్గం గుండా చొరబాటుదారుల నివారణకు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. రైల్వే ప్లాట్ఫామ్పై జాగిలాల స్క్వాడ్తో బాంబు నిర్వీర్య దళాల్ని రంగంలోకి దింపారు. నలు వైపుల నుంచి తరలి వచ్చే వాహనాలతో అవాంఛనీయ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక నియంత్రణ ఏర్పాటుచేశారు. సాగర తీరం గుండా సంఘ విద్రోహ శక్తులు చొరబడకుండా మెరైన్ పోలీసు దళాల సమన్వయంతో సాగర తీరంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటైంది. -
జన జగన్నాథుని రథయాత్ర
భగవంతుడు భక్తుల నడుమకు వచ్చి అంగరంగ వైభవంగా జరుపుకొనే అరుదైన అపురూపమైన వేడుక రథయాత్ర. ఏడాది పొడవునా గర్భాలయంలో కొలువుండే జగన్నాథుడు ఏడాదికోసారి సోదరీ సోదరులైన సుభద్ర, బలభద్రులతో కలసి రథాలను అధిరోహించి, జనం మధ్యకు వచ్చి జరుపుకొనే అపురూపమైన వేడుక రథయాత్ర. జగన్నాథుడు కొలువుతీరిన పూరీ క్షేత్రంలో రథయాత్ర వేడుకలు నేత్రపర్వంగా జరుగుతాయి. జగన్నాథుని రథయాత్రను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఒడిశాలోని పూరీ పట్టణంలో జరిగే రథయాత్ర ప్రపంచంలోనే అత్యంత భారీస్థాయిలో జరిగే రథయాత్ర జగన్నాథునిదే. అక్షయ తృతీయ నాటితో నాంది జగన్నాథ రథయాత్ర ఏటా ఆషాఢ శుక్ల విదియ రోజున జరుగుతుంది. అయితే, రథయాత్ర వేడుక కోసం సన్నాహాలు మాత్రం వైశాఖ శుక్ల తదియ నాడు జరిగే అక్షయ తృతీయ పర్వదినం నుంచే మొదలవుతాయి. వేసవి తీవ్రత మొదలవడంతో విగ్రహాలకు చందన లేపనాన్ని పూస్తారు. దీనినే ‘గంధలేపన యాత్ర’ అని కూడా అంటారు. అక్షయ తృతీయ రోజున పూరీ క్షేత్రంలో రథాల తయారీ మొదలవుతుంది. పూరీ రాజు నివాసం ఎదుట ఆలయ ప్రధాన కార్యాలయానికి చేరువలో రథాల తయారీ కొనసాగుతుంది. అక్షయ తృతీయ నాటి నుంచి జగన్నాథుని చందనయాత్ర కూడా మొదలవుతుంది. చందనయాత్ర 42 రోజుల పాటు కొనసాగుతుంది. అక్షయ తృతీయనాడు మొదలయ్యే చందనయాత్రను రథయాత్ర వేడుకలకు నాందీ ప్రస్తావనగా చెప్పుకోవచ్చు. చందనయాత్ర ప్రథమార్ధాన్ని ‘బాహొరొ చందనయాత్ర’ (బహిర్ చందనయాత్ర) అంటారు. ఇది అక్షయ తృతీయ మొదలుకొని 21 రోజులు కొనసాగుతుంది. బహిర్ చందనయాత్రలో మదనమోహనుడైన జగన్నాథుడిని శ్రీదేవి భూదేవీ సమేతంగా పూరీ ఆలయ సింహద్వారం నుంచి ఊరేగింపుగా బయటకు తీసుకొచ్చి నరేంద్రతీర్థంలో పడవల్లో ఊరేగిస్తారు. చందనయాత్రలో బయటకు తీసుకొచ్చేవి ఉత్సవ విగ్రహాలు మాత్రమే. శ్రీదేవీ భూదేవీ సమేతుడైన మదనమోహనుడితో పాటు రామ కృష్ణులను, నంద భద్ర అనే వారి ధనుస్సులను, పంచపాండవుల స్వరూపాలుగా భావించే ఐదు శివలింగాలను కూడా నరేంద్రతీర్థంలో పడవల్లో ఊరేగిస్తారు. చందనయాత్ర ద్వితీయార్ధాన్ని ‘భితొరొ చందనయాత్ర’ (అంతర్ చందనయాత్ర) అంటారు. ద్వితీయార్ధంలోని 21 రోజుల్లో కేవలం నాలుగుసార్లు మాత్రమే– అమావాస్య, షష్టి, ఏకాదశి, పౌర్ణమి తిథుల్లో ఉత్సవ విగ్రహాలను బయటకు తీసుకొస్తారు. మిగిలిన రోజుల్లో ఆలయం లోపలే వేడుకలను నిర్వహిస్తారు. జ్యేష్ఠ పౌర్ణమి నాడు జరిగే ‘స్నానయాత్ర’తో చందనయాత్ర వేడుకలు పూర్తవుతాయి. జ్యేష్ఠపౌర్ణమి నాడు ఆలయ పూజారులు మంత్రోక్తంగా జగన్నాథునికి స్నాన వేడుకను నిర్వహిస్తారు. అందుకే జ్యేష్ఠపౌర్ణమిని ‘స్నానపూర్ణిమ’గా వ్యవహరిస్తారు. జగన్నాథుని అభిషేకించడానికి ఆలయంలోని ‘సునా కువొ’ (బంగారు బావి) నుంచి తెచ్చిన 108 కుండల పవిత్ర జలాలను వినియోగిస్తారు. జగన్నాథునికీ తప్పని జ్వరబాధ స్నానపూర్ణిమలో ఏకంగా 108 కుండల నీటిలో జలకాలాడిన జగన్నాథునికి జ్వరం వస్తుంది. ఆనాటి నుంచి రెండువారాల పాటు పూరీ ఆలయంలో భక్తులకు మూలవిరాట్టుల దర్శనం ఉండదు. మూలవిరాట్టుల స్థానంలో సంప్రదాయక ‘పొటొచిత్రొ’ పద్ధతిలో పెద్దవస్త్రంపై చిత్రించిన విగ్రహాల రూపాలనే దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈ రెండువారాల కాలంలో జగన్నాథుని మూలవిరాట్టుకు ఛప్పన్న (యాభై ఆరు) భోగాల నైవేద్యం కూడా నిలిచిపోతుంది. జ్వరపీడితుడైన జగన్నాథునికి ఔషధ మూలికలు, ఆకులు, కషాయాలు, కొన్ని పండ్లను మాత్రమే దైతాపతులు సమర్పిస్తారు. జగన్నాథుని తొలుత ఆరాధించిన గిరిజన రాజు విశ్వవసు కూతురు లలిత, బ్రాహ్మణ పూజారి విద్యాపతిల వారసులే దైతాపతులు. జగన్నాథుని ఆరాధనలో వీరికి విశేష అధికారాలు ఉంటాయి. జ్వరపీడితుడైన జగన్నాథునికి పథ్యపానాలు సమర్పించే ప్రత్యేక అధికారం ఈ దైతాపతులకు మాత్రమే పరిమితం. రథయాత్ర వేడుకలు ముగిసేంత వరకు వీరి ఆధ్వర్యంలోనే జగన్నాథుని పూజాదికాలు జరుగుతాయి. జగన్నాథునికి జ్వరం తగ్గేలోగా రథాల తయారీ, వాటి అలంకరణ పూర్తవుతుంది. స్థలపురాణం పూరీ క్షేత్రాన్ని పురుషోత్తమ క్షేత్రమని, శ్రీక్షేత్రమని, శంఖక్షేత్రమని, నీలాచలమని, నీలాద్రి అని, జగన్నాథపురి అని కూడా అంటారు. ఇక్కడ వెలసిన జగన్నాథుడిని నీలమాధవుడి ఆరాధిస్తారు. గిరిజన రాజు విశ్వవసు నీలమాధవుడిని తొలుత ఆరాధించాడని చెబుతారు. నీలమాధవుని విగ్రహం నీలమణితో తయారై ఉండేదని, అది కాలగర్భంలో కలసిపోయిన కొన్నాళ్లకు ఇంద్రద్యుమ్నుడనే రాజు తనకు కలలో కనిపించిన దారువును (కొయ్యదుంగ) విగ్రహాలుగా తయారు చేయించాలని సంకల్పించి, ఈ పని కోసం ఒక వృద్ధ శిల్పిని నియమించాడు. దారువుతో శిల్పాలను మలచేందుకు అంగీకరించిన వృద్ధ శిల్పి రాజుకు ఒక షరతు విధించాడు. తనకు ప్రత్యేకంగా ఒక గదిని ఇవ్వాలని, పని పూర్తయ్యేంత వరకు తనను ఎవరూ కదిలించరాదని చెప్పాడు. రాజు అంగీకరించాడు. ఎన్నాళ్లయినా, శిల్పి ఉన్న గది తలుపులు తెరుచుకోక పోవడం, కనీసం శిల్పాలు చెక్కుతున్న అలికిడైనా వినిపించకపోవడంతో వృద్ధుడైన శిల్పికి ఏమైనా జరిగి ఉండవచ్చని కీడు శంకించిన రాజు గది తలుపులు తెరిచాడు. మొండెం వరకు మాత్రమే చెక్కిన శిల్పాలు అక్కడలా ఉండగానే, శిల్పి అంతర్ధానమయ్యాడు. రాజు తన పొరపాటుకు దుఃఖించగా, జగన్నాథుడు ప్రత్యక్షమై, ఆ విగ్రహాలను అలాగే ప్రతిష్ఠించమని చెప్పి అదృశ్యమయ్యాడు. రాజు వాటిని అలాగే ప్రతిష్ఠించి, పూజలు చేయడం ప్రారంభించాడు. తర్వాతి కాలంలో ముగ్ధమనోహరమైన ఈ దారు విగ్రహమూర్తులను ఆదిశంకరాచార్యలు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, చైతన్య మహాప్రభు సహా ఎందరో ఆధ్యాత్మిక గురువులు దర్శించుకుని, పూజలు జరిపారు. పూరీక్షేత్రంలో వారి వారి పీఠాలను, మఠాలను కూడా ఏర్పాటు చేసుకుని మరీ జగన్నాథుని సేవించి, తరించారు. ఆదిశంకరాచార్యులు జగన్నాథుని స్తుతిస్తూ జగన్నాథ అష్టకాన్ని రచించారు. ప్రస్తుతం పూరీలో ఉన్న జగన్నాథ ఆలయాన్ని పదో శతాబ్దికి చెందిన తూర్పు గంగవంశపు రాజులు నిర్మించారు. అనంతవర్మ చోడగంగదేవ్ ఆధ్వర్యంలో ఈ ఆలయం ప్రారంభమైంది. గుండిచా మందిరం రథయాత్రలో రాజు కూడా సామాన్యుడే రథయాత్ర నాడు జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలను రథాలపైకి ఎక్కిస్తారు. విగ్రహాలను రథాలపైకి చేర్చే ముందు పూరీ రాజు సామాన్య సేవకుడిలా చీపురు పట్టి, రథాలను శుభ్రం చేస్తారు. రాజు శుభ్రం చేసి వచ్చిన తర్వాత మూడు విగ్రహాలనూ మూడు రథాలపైకి చేరుస్తారు. ఈ తతంగాన్ని ‘పొహాండి’ అంటారు. పూజారుల మంత్రాలు, మేళతాళాల నడుమ విగ్రహాలు రథాలపైకి చేరుకున్న తర్వాత పెద్దసంఖ్యలో భక్తులు వాటికి కట్టిన తాళ్లను పట్టుకుని రథాలను ముందుకు లాగుతారు. పూరీ జగన్నాథ ఆలయం ఎదుట ఉండే ‘బొడొదండొ’ (పెద్దవీధి) మీదుగా మూడు కిలోమీటర్ల దూరంలోని గుండిచా మందిరం వరకు రథయాత్ర సాగుతుంది. జగన్నాథుని రథయాత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన రథయాత్ర. బ్రహ్మపురాణం, పద్మపురాణం, స్కందపురాణం, కపిల సంహిత వంటి ప్రాచీన పురాణగ్రంథాల్లో జగన్నాథుని రథయాత్ర ప్రస్తావన కనిపిస్తుంది. తిరుగు రథయాత్ర మూడు రథాలూ ‘గుండిచా’ మందిరం వద్దకు చేరుకున్నాక, జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలను ఆ మందిరంలో ఆషాఢ శుద్ధ దశమి వరకు కొలువుదీరుస్తారు. ‘గుండిచా’ మందిరంలో జగన్నాథుడు దశావతారాల రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. తోటలో వెలసిన ‘గుండిచా’ మందిరాన్ని జగన్నాథుని ‘వేసవి తోట విడిది’గా పరిగణిస్తారు. జగన్నాథుడు కొలువు తీరిన తొమ్మిదిరోజుల రథయాత్ర వేడుక సమయంలోనే ‘గుండిచా’ మందిరం భక్తులతో కళకళలాడుతుంది. ఏడాదిలో మిగిలిన రోజుల్లో ఇది ఖాళీగా ఉంటుంది. రథయాత్ర మొదలైన ఐదో రోజున గుండిచా మందిరంలో ‘హీరా పంచమి’ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆరోజు జగన్నాథుడు నరసింహావతారంలో దర్శనమిస్తాడు. గుండిచాలో జరిగే వేడుకల్లో ఇది చాలా ప్రధానమైన వేడుక. జగన్నాథుని ప్రధాన ఆలయంలోనికి విదేశీయులను అనుమతించరు. రథయాత్ర వేడుకల్లోను, గుండిచా మందిరంలో కొలువుండే సమయంలోను విదేశీయులను కూడా జగన్నాథుని దర్శనానికి అనుమతిస్తారు. ఆషాఢ శుద్ధ దశమి నాడు గుండిచా మందిరం నుంచి ‘తిరుగు రథయాత్ర’ ప్రారంభమవుతుంది. దీనినే ‘బాహుడా’ అంటారు. మార్గమధ్యంలోని ‘అర్ధాసిని’ (మౌసి మా–పినతల్లి) మందిరం వద్ద ఆగి, అక్కడ నివేదించే మిఠాయిలను జగన్నాథుడు ఆరగిస్తాడు. ‘బాహుడా’ మరుసటి రోజున ఏకాదశి నాడు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు స్వర్ణాలంకారాలతో రథాలపై కొలువుదీరి భక్తులకు నేత్రపర్వం చేస్తారు. దీనినే ‘సునాబేసొ’ (స్వర్ణ వేషధారణ) అంటారు. స్వర్ణవేషధారణలో జగన్నాథ, బలభద్ర, సుభద్రలు చతుర్భుజాలతో, పాదాలతో పరిపూర్ణంగా దర్శనమిస్తారు. ‘మౌసి మా’ మందిరం వద్ద విరామం తర్వాత రథాలు తిరిగి ప్రధాన ఆలయం వైపు ముందుకు సాగుతాయి. చతుర్దశి ఘడియల్లో రాత్రివేళ జగన్నాథుని ఆలయ ప్రవేశ ఉత్సవం జరుగుతుంది. తనను తీసుకుపోకుండా సోదరీ సోదరులతో కలసి రథాలపై ఊరేగి తిరిగి వచ్చిన జగన్నాథునిపై లక్ష్మీదేవి అలకబూనడం, రసగుల్లాలు ఇచ్చి జగన్నాథుడు ఆమెను ప్రసన్నం చేసుకోవడం వంటి వినోదభరితమైన ఘట్టాలను పూజారులు నిర్వహిస్తారు. దాదాపు పక్షంరోజుల పాటు జగన్నాథుడు లేక చిన్నబోయిన పూరీ శ్రీక్షేత్రంలో ఆషాఢ పూర్ణిమ నాటి నుంచి యథాప్రకారం భక్తుల కోలాహలం మొదలవుతుంది. మూడు రథాల విశేషాలు చాలా పుణ్యక్షేత్రాల్లోని మూలవిరాట్టు విగ్రహాలన్నీ శిలా విగ్రహాలు. పూరీక్షేత్రంలోనివి మాత్రం దారు విగ్రహాలు. రథయాత్రలో వీటిని ఊరేగించే మూడు రథాలను కూడా కలపతోనే తయారు చేస్తారు. మూడు రథాలకు నిర్ణీత ప్రమాణాలు ఉన్నాయి. శిల్పులు శాస్త్రప్రామాణికంగా ఈ మూడు రథాలను తయారు చేస్తారు. జగన్నాథుని రథం పేరు ‘నందిఘోష్’, బలభద్రుని రథం ‘తాళధ్వజ’, సుభద్ర రథం ‘దర్పదళన్’. వీటిలో జగన్నాథుని రథం ‘నందిఘోష్’ అన్నింటి కంటే పెద్దగా ఉంటుంది. నందిఘోష్కు 16 చక్రాలు ఉంటాయి. దీని ఎత్తు 44.2 అడుగులు, పొడవు 34.6 అడుగులు, వెడల్పు 34.6 అడుగులు. దీని తయారీకి చిన్నా పెద్దా కలుపుకొని 832 కలప ముక్కలను ఉపయోగిస్తారు. దీనిని ఎరుపు, పసుపు రంగుల వస్త్రాలతో అలంకరిస్తారు. ‘నందిఘోష్’ కావలి దైవం గరుత్మంతుడు, సారథి దారుకుడు. పతాకంపై కొలువుదీరే దైవం ‘త్రైలోక్యమోహిని’. ప్రతీకాత్మకంగా ఈ రథానికి పూన్చిన అశ్వాలు: శంఖ, బలాహక, శ్వేత, హరిదాశ్వాలు, ఈ రథానికి కట్టిన తాడును సర్పజాతికి చెందిన శంఖచూడునిగా భావిస్తారు. బలభద్రుని రథం ‘తాళధ్వజ’ను 14 చక్రాలతో నిర్మిస్తారు. దీని ఎత్తు 43.3 అడుగులు, పొడవు 33 అడుగులు, వెడల్పు 33 అడుగులు. దీని తయారీకి 763 కలప ముక్కలను ఉపయోగిస్తారు. దీనిని ఎరుపు, నీలం ఆకుపచ్చ కలగలసిన రంగుల వస్త్రాలతో అలంకరిస్తారు. ‘తాళధ్వజ’ కావలి దైవం వాసుదేవుడు. సారథి మాతలి. పతాక దైవం ‘ఉన్నని’. ప్రతీకాత్మకంగా ఈ రథానికి పూన్చిన అశ్వాలు: తీవ్ర, ఘోర, దీర్ఘశర్మ, స్వర్ణనాభ. ఈ రథానికి కట్టిన తాడును సర్పజాతికి చెందిన వాసుకిగా భావిస్తారు. సుభద్ర రథం ‘దర్పదళన్’ను 12 చక్రాలతో నిర్మిస్తారు. దీని ఎత్తు 42.3 అడుగులు, పొడవు 31.6 అడుగులు, వెడల్పు 31.6 అడుగులు. దీని తయారీకి 593 కలప ముక్కలను ఉపయోగిస్తారు. ఈ రథాన్ని ఎరుపు, నలుపు రంగుల వస్త్రాలతో అలంకరిస్తారు. ‘దర్పదళన్’ కావలి దైవం జయదుర్గ. సారథి అర్జునుడు. పతాక దైవం నాదాంబిక. ప్రతీకాత్మకంగా దీనికి పూన్చిన అశ్వాలు: రోచిక, మోహిక, జిత, అపరాజిత. దీనికి కట్టిన తాడును సర్పజాతికి చెందిన స్వర్ణచూడునిగా భావిస్తారు. ఛప్పన్న భోగాల నిత్య నైవేద్యాలు ఛప్పన్న భోగాల నిత్య నైవేద్యాలు ఆరగించే జగన్నాథుని వైభోగం వర్ణనాతీతం. పూరీ ఆలయంలోని నైవేద్యాలను సిద్ధం చేసే భోగమంటపం (వంటశాల) ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. జగన్నాథునికి ఛప్పన్న (56) ప్రసాదాలను, రోజుకు ఆరుసార్లు నివేదిస్తారు. జగన్నాథునికి నివేదన పూర్తయిన తర్వాత క్షేత్రపాలిక అయిన విమలాదేవికి నివేదించి, ఆ ప్రసాదాలను ఆలయ ఈశాన్యభాగాన ఉండే ‘ఆనంద బజార్’లో భక్తులకు విక్రయిస్తారు. ప్రసాదాలను వండటానికి ఎప్పటికప్పుడు కొత్త మట్టి కుండలనే ఉపయోగిస్తారు. కట్టెల పొయ్యిలపై వండుతారు. భోగ మంటపానికి చేరువలోని ‘గంగ’, ‘యమున’ అనే రెండు బావుల్లోని నీటిని మాత్రమే వంటకాలకు ఉపయోగిస్తారు. ప్రతిరోజూ ఏకకాలంలో యాభైవేల మందికి సరిపోయేలా ఇక్కడ ప్రసాదాలను తయారు చేస్తారు. పర్వదినాల్లోనైతే లక్షమందికి సరిపోయేలా తయారు చేస్తారు. ఏకకాలంలో లక్షమంది కూర్చుని భోజనం చేయగలిగేంత విశాలమైన భోజనశాల ఇక్కడి ప్రత్యేకత. జగన్నాథునికి నివేదించే ప్రసాదాలను ‘మహాప్రసాదం’గా పరిగణిస్తారు. మహాప్రసాదాన్ని ఆరగిస్తే మనోభీష్టాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. పూరీలో నివేదించే ఛప్పన్న భోగాలేమిటంటే... 1. అన్నం 2. కనికా (బియ్యం, నెయ్యి, పంచదారతో తయారు చేస్తారు) 3. దొహి పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి పెరుగు కలిపి తయారు చేస్తారు) 4. ఒద్దా పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి అల్లం కలుపుతారు) 5. తీపి కిచిడీ (బియ్యం, పెసరపప్పు, నెయ్యి, పంచదారతో చేస్తారు) 6. నేతి అన్నం 7. కిచిడీ 8. మిఠా పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి పంచదార కలుపుతారు) 9. ఒరియా పొఖాళొ (బియ్యం, నెయ్యి, నిమ్మరసం, ఉప్పుతో చేస్తారు) 10. కాజా 11. గొజ్జా (గోధుమపిండి, నెయ్యి, పంచదారతో చేసే మిఠాయి) 12. లడ్డు 13. మగజా లడ్డు (గోధుమపిండితో చేసే లడ్డు) 14. జీరాలడ్డు (గోధుమపిండికి జీలకర్ర చేర్చి తయారు చేసే లడ్డు) 15. వల్లభ (గోధుమపిండితో చేసే ఒక ప్రత్యేక మిఠాయి) 16. ఖురుమా (గోధుమపిండి, పంచదార, ఉప్పుతో చేస్తారు) 17. మొథాపులి (మినుములు, నెయ్యి, పంచదారతో చేస్తారు) 18. కకరా (గోధుమపిండి, కొబ్బరికోరు, పంచదారతో చేస్తారు) 19. మరిచి లడ్డు (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు) 20. లుణి ఖురుమా (గొధుమపిండి, నెయ్యి, ఉప్పుతో చేస్తారు) 21. సువార్ పిఠా (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు) 22. చొడెయి లొడా (గోధుమలు, నెయ్యి, పంచదారతో చేస్తారు) 23. ఝిలి (వరిపిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు) 24. కొంటి (వరిపిండి, నెయ్యితో చేస్తారు) 25. మండా (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు) 26. ఒమాళు (గోధుమపిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు) 27. పూరీ 28. లుచి (వరిపిండి, నెయ్యితో చేస్తారు) 29. బొరా (మినప్పప్పుతో చేసే వడలు) 30. దొహిబొరా (పెరుగు గారెలు) 31. అరిసె 32. త్రిపురి (వరిపిండి, నెయ్యితో చేస్తారు) 33. రొసాపాయిక (గోధుమలతో చేస్తారు) 34. ఖిరి (పాయసం) 35. పాపుడి (పాలమీగడ, పంచదారతో చేస్తారు) 36. కోవా 37. రొసాబొళి (పాలు, పంచదార, గోధుమలతో చేస్తారు) 38. తడియా (తాజా పనీర్, నెయ్యి, పంచదారతో చేస్తారు) 39. ఛెనాఖాయి (తాజా పనీర్, పంచదార, పాలతో చేస్తారు) 40. బపుడి ఖొజా (పాలమీగడ, నెయ్యి, పంచదారతో చేస్తారు) 41. ఖువా మండా (పాలు, గోధుమపిండి, నెయ్యితో చేస్తారు) 42. సొరాపులి (పాలను గంటల తరబడి మరిగించి చేసే మిఠాయి) 43. డల్లి (కందిపప్పుతో చేసే ముద్దపప్పు) 44. ముగొడల్లి (పెసరపప్పు వంటకం) 45. బిరిడల్లి (మినుములతో చేసే పప్పు) 46. ఉరద్ డల్లి (మినప్పప్పు వంటకం) 47. దాల్మా (కందిపప్పు, కాయగూరలు కలిపి చేసే వంటకం) 48. మవుర్ (పప్పులు, కొర్రలతో చేసే వంటకం) 49. బేసొరొ (కలగూర వంటకం) 50. సగొ (తోటకూర వంటకం) 51. పొటొలొ రొసా (పొటల్స్/పర్వల్ కూర) 52. గొటి బైగొణొ (గుత్తివంకాయ కూర) 53. ఖొటా (చింతపండు గుజ్జు, బెల్లంతో చేసే లేహ్యం) 54. రైతా (పెరుగులో కూరగాయల ముక్కలు వేసి చేస్తారు) 55. పిఠా (గోధుమపిండితో చేసే తీపిరొట్టె) 56. బైగని (వంకాయలతో చేసే వంటకం) పూరీ ఆలయ విశేషాలు పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పూరీ జగన్నాథ ఆలయ ప్రాంగణంలో నూట ఇరవై ఉపాలయాలు ఉంటాయి. ఆలయ శిఖరంపై అల్లంత దూరం నుంచే కనిపించే అష్టధాతు సుదర్శనచక్రాన్ని జగన్నాథుని ప్రతిరూపంగా భావిస్తారు. దీనినే ‘నీలచక్రం’ అని, ‘పతితపావన’ అని కూడా అంటారు. దూరం నుంచి ఇది నీలికాంతులతో కనిపిస్తుంది. ఆలయ శిఖరంపైనున్న ఈ సుదర్శన చక్రాన్ని తిలకించినంత మాత్రానే పాపాలను హరించి వేస్తుందని భక్తులు నమ్ముతారు. పూరీ ఆలయానికి తూర్పు వైపున సింహ ద్వారంతో పాటు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశలలో మరో మూడు ప్రవేశ మార్గాలు ఉన్నాయి. పూరీ జగన్నాథుని ఆలయం మీదుగా విమానాలు, పక్షులు ఎగురుతూ వెళ్లడం కనపించదు. ఇదొక అరుదైన విశేషం. సింహద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు వినిపించే సాగరఘోష ఆలయంలోకి అడుగుపెడుతూనే వినిపించడం మానేస్తుంది. ఆలయం నీడ ఏ సమయంలోనూ కనిపించని విధంగా నాటి శిల్పులు దీనిని నిర్మించడం మరో విశేషం. ఎక్కడైనా సముద్రతీరం వద్ద సముద్రం మీదుగా నేలవైపు గాలులు వీస్తాయి. పూరీ తీరంలో మాత్రం సాయంత్రం వేళ పట్టణం మీదుగా గాలులు సముద్రం వైపు వీస్తాయి. పూరీ మహాప్రసాదం ప్రతిరోజూ ఒకే పద్ధతిలో, పరిమాణంలో తయారు చేస్తారు. పర్వదినాల్లో రెట్టింపు పరిమాణంలో చేస్తారు. వచ్చే భక్తుల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉన్నా, ఇంతవరకు అక్కడ తయారైన ప్రసాదం వృథా అయిన దాఖలాలు గాని, భక్తులకు చాలని సందర్భాలు గాని లేవు. -
పూరీపై ‘ఫొని’ పంజా!
సాక్షి నెట్వర్క్/భువనేశ్వర్/పూరీ: ఆంధ్రప్రదేశ్కు ‘ఫొని’ తుపాను ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో దాదాపు పది రోజుల పాటు తుపానుగానే కొనసాగిన ‘ఫొని’ శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఒడిశాలోని పూరీ సమీపంలో ఎట్టకేలకు తీరాన్ని తాకింది. అక్కడే అధిక ప్రభావం చూపించింది. ఆ సమయంలో గంటకు 175–205 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. తుపాను ధాటికి ఒడిశాలో ఎనిమిది మంది మరణించారు. తుపాను తీరాన్ని దాటాక అతితీవ్ర తుపానుగా బలహీనపడి ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తోంది. శుక్రవారం రాత్రికి ఇది ఒడిశాలోని బాలాసోర్కు నైరుతిగా 60 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్లోని మిడ్నాపూర్కు నైరుతి దిశగా 160 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ తీవ్ర తుపానుగా పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించనుంది. తర్వాత మరింతగా బలహీనపడుతూ శనివారం నాటికి బంగ్లాదేశ్లోకి ప్రవేశించి తుపానుగా, వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) శుక్రవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. పూరీ నగరం ఏరియల్ వ్యూ... పెనుగాలులు.. కుండపోత వర్షాలు.. ఫొని తుపాను ప్రభావంతో ఒడిశాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పెనుగాలులు, భారీ వర్షాల ధాటికి వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పలు రహదారులు ధ్వంసమయ్యాయి. వేల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఈ నేపథ్యంలో ఒడిశావ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. మరోవైపు సముద్ర తీరప్రాంతం అల్లకల్లోలంగా మారింది. పూరీ క్షేత్రానికి వచ్చిన పర్యాటకులు వెంటనే నగరం విడిచి వెళ్లాలని అధికారులు చెప్పారు. తుపాను నేపథ్యంలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య ప్రసాద్ పాఢి ఆయా జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే 11 వేల మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు తెలిపారు. మొత్తం 900 సహాయ, పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. రైళ్లు, విమానాలు రద్దు ఒడిశాలో ముందు జాగ్రత్త చర్యగా రైలు, విమాన సర్వీసులను నిలిపివేశారు. కోల్కతా–చెన్నై మార్గంలో ప్రయాణించే 220కి పైగా రైళ్లను శనివారం వరకు రద్దు చేసినట్లు ఈస్టుకోస్టు రైల్వే అధికారులు వెల్లడించారు. భువనేశ్వర్, కోల్కతా విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలపై నిషేధం కొనసాగుతోంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు రైల్వేశాఖ మూడు ప్రత్యేక రైళ్లను కేటాయించింది. ప్రధాన స్టేషన్లలోని స్టాళ్లలో ఆహార పదార్థాలు, తాగునీటిని సిద్ధంగా ఉంచినట్లు ప్రకటించింది. మరో మూడు రోజుల వరకు ఉద్యోగులు సెలవులు పెట్టొద్దని కోరింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్, పర్యాటక క్షేత్రం పూరీ రైల్వేస్టేషన్లు తీవ్ర గాలుల ధాటికి పూర్తిగా దెబ్బతిన్నాయి. పైకప్పులు ఎగిరిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వివిధ ప్రాంతాల్లో 34 సహాయక బృందాలు పునరావాస చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఫొని తుపాను గండం నుంచి బయటపడినా, భారీ వర్షాలు కురవడంతో ఒడిశాలో జన జీవనం స్తంభించిపోయింది. -
దూసుకువచ్చిన ఫొని తుపాను
-
లోక్సభ ఎన్నికల్లో పూరి నుంచి ప్రధాని మోదీ పోటీ!
-
పూరీ బరిలో ప్రధాని మోదీ
భువనేశ్వర్ : ప్రధాని నరేంద్ర మోదీ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒడిషాలోని పూరీ నుంచి బరిలో దిగుతారని ఆ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే ప్రదీప్ పురోహిత్ చెప్పారు. పూరి స్ధానం నుంచి ప్రధాని పోటీ చేసే అవకాశాలు 90 శాతం ఉన్నాయని పురోహిత్ పేర్కొన్నారు. ఒడిషా రాష్ట్ర ప్రజలు ప్రధాని పూరీ లోక్సభ స్ధానం నుంచి పోటీచేయాలని కోరుతున్నారని, మోదీ సైతం పూరీ నుంచి పోటీకి మొగ్గుచూపే అవకాశం ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్నాథ ఆలయం కొలువైన పూరీ నుంచి ప్రధాని మోదీని బరిలో దింపాలని బీజేపీ అగ్రనాయకత్వం యోచిస్తున్నదనే ఊహాగానాల నేపథ్యంలో బీజేపీ నేత చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. 2014 లోక్సభ ఎన్నికల సందర్భంగా మోదీ జగన్నాధుడి ఆశీస్సులతోనే వారణాసి నుంచి విజయం సాధించారని, ఈసారి ఆయన పూరీ నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తారని బీజేపీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఒడిషా ప్రజల పట్ల ప్రేమ కలిగిన ప్రధాని మోదీ ఈ ప్రాంత అభివృద్ధినీ కాంక్షిస్తారని చెప్పుకొచ్చారు. -
పూరీ: కదిలిన జగన్నాథ రథ చక్రాలు
-
సంచలనం: పూరీ నుంచి బరిలో మోదీ!
సాక్షి, భువనేశ్వర్: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీయేతర రాష్ట్రాలపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిసారించారు. అందులో భాగంగా ఓ సం‘చలన’ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఒడిశాలోని పూరీ నుంచి ఆయన పోటీ చేయనున్నారన్న వార్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో రెండు స్థానాల(వడోదర, వారణాసి) నుంచి పోటీ చేసిన మోదీ, వచ్చే ఎన్నికల్లోనూ రెండు స్థానాల్లోనూ పోటీ చేస్తారన్నది, అందులో ఒకటి పూరీ అన్నది ఆ కథనం సారాంశం. ఈ మేరకు ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ విశ్లేషణాత్మక కథనాన్ని ప్రచురించింది. పూరీ నుంచి పోటీ! 2014 సార్వత్రిక ఎన్నికల్లో సొంత రాష్ట్రం గుజరాత్లోని వడోదర, యూపీలోని వారణాసి నియోజకవర్గాలల నుంచి మోదీ పోటీ చేసి రెండు చోట్లా గెలుపొందారు. అయితే అనూహ్యంగా వడోదర స్థానాన్ని వదులుకుని.. వారణాసికే ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకోవటం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇక ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఒడిశాలోని పూరీ నుంచి పోటీ చేయాలన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ ఇప్పటికే క్షేత్ర స్థాయి పనులు ప్రారంభించాయని ఆ కథనం పేర్కొంది. కారణం?... ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ సీట్లతో అధికారం చేజిక్కించుకుని.. ప్రతిపక్షాల నోళ్లు మూయించాలని బీజేపీ భావిస్తోంది. అయితే పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీ అంత బలంగా లేకపోవటం ప్రతికూల అంశంగా మారింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో మొత్తం 105 సీట్లు(లోక్ సభ ఎంపీ సీట్లు) ఉండగా, 2014 ఎన్నికల్లో బీజేపీకి 6 సీట్లను మాత్రమే బీజేపీ గెలుచుకుంది. పశ్చిమ బెంగాల్(42)లో 2, ఒడిశా(21)లో ఒకటి, ఏపీలో 25కి గానూ 2, తెలంగాణలో 17కి గానూ 1 సీట్లు సాధించింది. ఇటీవల బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. కాంగ్రెస్, సీపీఎంలను దాదాపు పక్కకు నెట్టేసి రెండో స్థానానికి పరిమితమైంది. ఒడిశాలో 18 ఏళ్లుగా బీజేడీ అధికారంలో కొనసాగుతూ వస్తోంది. ప్రజల్లో బీజేడీ పట్ల వ్యతిరేకత పెరిగిపోయిందన్న భావనలో ఉన్న బీజేపీ.. గట్టి పోటీ ఇస్తే గెలుపు నల్లేరు మీద నడకే అని భావిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల కోసం ప్రత్యేక వ్యూహంతో జాతీయాధ్యక్షుడు అమిత్ షాను రంగంలోకి దించింది. అందుకే ఈ నాలుగు రాష్ట్రాలపై దృష్టిసారించిన మోదీ.. పూరీ నుంచే పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారంట. మరోవైపు గత ఎన్నికల్లో శివుడి సెంటిమెంట్ కారణంగానే వారణాసిలో ఆయన గెలుపొందారని.. వచ్చే ఎన్నికల్లో విష్ణువు(పూరీ జగన్నాథుడు) సెంటిమెంట్ కూడా వర్కవుట్ అయి తీరుతుందన్న ధీమాలో బీజేపీ ఉంది. మే 26న కటక్(ఒడిశా)లో నిర్వహించే ఓ ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొనబోతున్నారు. ఆ రోజు ఈ అంశంపై స్పష్టత రావొచ్చు. -
భారీ శాంటాక్లాజ్
భువనేశ్వర్ / పూరీ: ప్రపంచంలోనే అతిపెద్దదైన శాంటాక్లాజ్ సైకత శిల్పాన్ని ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ రూపొందించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ‘ప్రపంచ శాంతి’ సందేశంతో ఒడిశాలోని పూరీ సముద్రతీరంలో 25 అడుగుల ఎత్తు, 50 అడుగుల వెడల్పుతో శాంటా ముఖాన్ని తయారుచేశారు. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు కోసం రూపొందించిన ఈ శిల్పం కోసం 600 టన్నుల ఇసుకను వాడినట్లు సుదర్శన్ పట్నాయక్ తెలిపారు. -
స్టూడెంట్ శక్తి
ఏ విద్యార్థికైనా తను చదివే కాలేజ్ దేవాలయం లాంటిది. అలాంటి కాలేజీని కొందరు కబ్జా చేయటానికి ప్రయ త్నిస్తారు. వారి నుంచి కాలేజీని ఏ విధంగా కాపాడుకున్నారనే కథతో తెరకెక్కుతోన్న చిత్రం ‘స్టూడెంట్ పవర్’. కృష్ణ, పూరి జంటగా గూన అప్పారావు దర్శకత్వంలో వి.రాజకుమార్ సమర్పణలో కృష్ణప్రసాద్ నిర్మిస్తు న్నారు. ప్రవీణ్ ఇమ్మడి స్వరపరచిన ఈ చిత్రం పాటలను దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి విడుదల చేశారు. కృష్ణప్రసాద్, అప్పారావు, దర్శకుడు వి. యన్.ఆదిత్య పాల్గొన్నారు. ∙కృష్ణ, కోదండరామిరెడ్డి, గోన అప్పారావు -
పూరి గుడిలో... స్మార్ట్ నిషేధం
సాక్షి, భువనేశ్వర్/పూరీ: ఎట్టకేలకు పూరీ జగన్నాథుని దేవస్థానంలోనికి స్మార్ట్ ఫోన్ల ప్రవేశాన్ని నిషేధించారు. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి ఈ నిషేధం అమలవుతుందని జగన్నాథ మందిరం అథారిటీ ప్రకటించింది. సామాన్య భక్తులు, యాత్రికులతో పాటు అతిరథ మహారథులకు కూడా ఈ నిషేధం వర్తింపజేస్తామని జగన్నాథ మందిరం అథారిటీ సేవల విభాగం పాలన అధికారి ప్రదీప్ దాస్ తెలిపారు. భక్త వర్గంలో స్వామికి నిత్య సేవలు అందజేసే సేవాయత్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు వగైరా వర్గాలకు కూడా స్మార్ట్ ఫోన్ల నిషేధం కట్టుదిట్టంగా అమలుచేస్తామని ప్రకటించారు. సేవాయత్లకు స్వల్ప మినహాయింపు దైనందిన సేవలు కల్పించే సేవాయత్లకు స్వల్ప మినహాయింపు కల్పించారు. కెమెరా సదుపాయం లేని సాధారణ మొబైల్ ఫోన్ను వారికి అనుమతిస్తారు. ఈ సాంకేతిక వ్యవస్థను పరిశీలించి ధ్రువీకరించిన ఫోన్లను మాత్రమే అనుమతిస్తారు. శ్రీ మందిరం ప్రాంగణంలోకి అనుమతించే సాధారణ మొబైల్ ఫోన్లపై నీల చక్ర లోగో ముద్రిస్తారు. శ్రీ మందిరం దేవస్థానం త్వరలో సీయూజీ ఫోన్ వ్యవస్థను ప్రవేశ పెడుతుంది. దేవస్థానం ప్రాంగణంలో సేవాయత్ల కోసం సీయూజీ ఫోన్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తుంది. ఈ కేంద్రాల్లో విక్రయించే మొబైల్ ఫోన్లు ముందు, వెనక నీలచక్ర లోగో స్పష్టంగా కనిపిస్తుంది. తనిఖీ వర్గాలకు ఈ సదుపాయం సహకరిస్తుంది. మొబైల్ ఫోనులో సిమ్ స్థిరంగా ఉంటుంది. కొనుగోలు చేసిన సేవాయత్ లేదా అధికారి పూర్తి వివరాల్ని నమోదు చేస్తారు. ఇలా దేవస్థానం ధ్రువీకరించిన మొబైల్ ఫోన్లు మినహా ఇతర స్మార్ట్ ఫోన్లు గుర్తిస్తే స్వాధీనం చేసుకోవడం తథ్యమని అధికారులు స్పష్టం చేశారు. భద్రతకు ముప్పు రాకూడదని శ్రీ మందిరం దేవస్థానం లోపలి ప్రాంగణాల్లో ఫొటోలు, వీడియో చిత్రీకరణ ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వేదికల్లో విస్తారంగా ప్రసారమైంది. ఈ ప్రసారం తీవ్ర కలకలం రేకెత్తించింది. ఆలయ భద్రతకు ఇటువంటి ప్రసారం ముప్పు తీసుకువస్తుందనే యోచనను శ్రీ మందిరం భద్రతా విభాగం ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో శ్రీ మందిరం దేవస్థానం ప్రాంగణం లోనికి స్మార్ట్ ఫోన్లను అనుమతించరాదని నిర్ణయించారు. -
‘మత్తు’ దిగిపోతోంది?
నీరుగారిపోతున్న డ్రగ్స్ కేసు! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొద్దిరోజులుగా సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు నీరుగారిపోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు, వివిధ రంగాల వారేగాకుండా పెద్ద సంఖ్యలో సినీ ప్రముఖులకు ఈ వ్యవహారంలో భాగస్వామ్యం ఉందని వెల్లడైనా.. చివరికి తూతూమంత్రంగానే ముగించేస్తారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ఒక ప్రముఖ దర్శకుడిని, మరో హీరోను మాత్రమే టార్గెట్గా చేసి విచారణ జరగబోతోందన్న ప్రచారం జరుగుతోంది. డ్రగ్స్ వ్యవహారంలో 19 మంది సినీ ప్రముఖుల పేర్లను గుర్తించిన సిట్.. అందులో పెద్ద చేపలను వదిలేసి, 12 మందికే నోటీసులు జారీ చేసిందని ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందులోనూ ఇద్దరిపై మాత్రమే చట్టపరమైన చర్యలు తీసుకుని.. కేసును పక్కనపెట్టే ప్రయత్నం జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇక ఈ వ్యవహారంలో ముమైత్ఖాన్కు సిట్ నోటీసులు జారీ చేసినా.. కొందరు సినీ పెద్దల ఒత్తిడి మేరకు ఆమెకు మినహాయింపు ఇచ్చినట్టు తెలుస్తోంది. కాగా పూర్తిస్థాయి ఆధారాలు ఉంటేనే సినీ ప్రముఖులెవరినైనా అరెస్టు చేస్తామని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ మంగళవారం వెల్లడించారు. వరుసగా విచారణ డ్రగ్స్ వ్యాపారి కెల్విన్ ఫోన్కాల్ డేటా, విచారణలో అతను చెప్పిన అంశాల ఆధారంగా పలువురు సినీ ప్రముఖులకు ఎక్సైజ్ సిట్ ఇప్పటికే నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వారిని ఈ నెల 19వ తేదీ నుంచి సిట్ విచారించనుంది. 19న పూరీ జగన్నాథ్, 20న ఛార్మి, 21న ముమైత్ ఖాన్, 22న సుబ్బరాజు, 23న శ్యాం కె.నాయుడు, 24న రవితేజ, 25న ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, 26న నవదీప్, 27న తరుణ్, 28న యువ హీరోలు తనీష్, నందు సిట్ ఎదుట హాజరుకావాల్సి ఉంది. ఛార్మి విదేశాల్లోనే.. రెండో రోజున విచారణకు హాజరుకావాల్సిన ఛార్మి విదేశాల్లోనే ఉన్నట్లు సమాచారం. ఐపీసీ నిబంధనల ప్రకారం ఎవరైనా మహిళను విచారించాలంటే... ఆమె కోరిన లేదా ఆమెకు అనుకూలంగా ఉన్న చోటనే విచారించాలి. ఈ లెక్కన సిట్ బృందం ఎలా విచారిస్తుందనే దానిపై స్పష్టత లేదు. ఇక నోటీసులు అందుకున్న మిగతా సినీ ప్రముఖులు కూడా సిట్ విచారణకు హాజరుకావాలా, వద్దా.. హాజరైతే ఎలా వ్యవహరించాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది. ఐపీసీ నిబంధనల ప్రకారం.. తమ న్యాయవాదితో కలసి విచారణకు హాజరుకావచ్చు. దీంతో వారంతా మంచి న్యాయవాదులను వెతికిపట్టుకుని సలహా తీసుకుంటున్నారని, వారితో కలసి విచారణకు హాజరవుతారని సమాచారం. ముమైత్కు మినహాయింపు! బిగ్బాస్ కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో సిట్ ఎదుట హాజరు నుంచి ముమైత్ఖాన్కు మినహాయింపు లభించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఎక్సైజ్ శాఖ ఇచ్చిన నోటీసుల ప్రకారం ఈ నెల 21 ఆమె సిట్ ముందు విచారణకు రావాలి. కానీ ఆమె పుణేలో జరుగుతున్న బిగ్బాస్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆ కార్యక్రమం నిబంధనల ప్రకారం.. 70 రోజుల పాటు బిగ్బాస్ హౌస్ నుంచి బయటికి రాకూడదు. ఒకవేళ ఆమె విచారణకు హాజరుకాకుంటే సిట్ అధికారులు బిగ్బాస్ హౌస్కు వెళ్లి అరెస్టు చేయవచ్చని ప్రచారం జరిగింది. కానీ ఆమెకు విచారణ నుంచి మినహాయింపు లభించినట్లు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. అసలు ఆమె స్థిర నివాసాన్ని గుర్తించి నోటీసులివ్వటంలో ఎౖMð్సజ్ అధికారులు విఫలమయ్యారని కూడా అంటున్నారు. -
పూరీ జగన్నాథ రథయాత్రకు ఉగ్రముప్పు!
పూరీ(ఒడిశా): విశ్వవిఖ్యాత శ్రీ జగన్నాథుని రథయాత్రను ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నారా? పూరీలో దాడులు చేయాలని ప్లాన్ వేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీంతో మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో పూరీ జగన్నాథ రథయాత్రకు భారీ భద్రత కల్పిస్తున్నారు. జల మార్గంలోనూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సముద్ర మార్గంలో ఉగ్రవాదులు చొరబడకుండా నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేశారు. ఇందులో భాగంగానే‘సౌనక్’ పహరా నౌకను పారాదీప్ ఓడరేవులో నిలిపారు. ‘సౌనక్’కు తోడుగా మరో 2 వేగవంతమైన పెట్రోలింగ్ ఓడలు కూడా చేరాయి. పారాదీప్ నుంచి పూరీ వరకు సువిశాల సముద్ర మార్గంలో ఈ ఓడలు భద్రతా వ్యవహారాల్ని పర్యవేక్షిస్తాయి. ఇవీ సౌనక్ ప్రత్యేకతలు.. సౌనక్ పూర్తిగా స్వదేశీ తయారీ ఓడ కావడం విశేషం. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ దీనిని నిర్మించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెల 21వ తేదీన కోస్ట్గార్డ్ వాహినిలో సౌనక్ను చేర్చారు. దీని పొడవు 105 మీటర్లు. 9,100 కిలో వాట్ల శక్తివంతమైన 2 డీజీలు ఇంజిన్లతో సౌనక్ గంటకు 26 నాట్ల వేగంతో దూసుకుపోతుంది. 2 తేలికపాటి హెలికాప్టర్లు, 30 ఎం.ఎం. క్లోజ్ రేంజ్ నావికా తుపాకులు, 5 అత్యాధునిక హై–స్పీడ్ పడవలు అనుక్షణం అందుబాటులో ఉంటాయి. సముద్రంలో తైల కాలుష్యం లేకుండా సౌనక్ పని చేయడం మరో విశేషం. విపత్కర పరిస్థితుల్లో తక్షణ సేవలు అందజేసేందుకు దీనిలో 14 మంది కోస్టు గార్డు అధికారులు, 98 మంది జవాన్లను నియమించారు. సముద్ర ఠాణా పోలీసుల సమన్వయంతో సౌనక్ ఓడ రేవు అనుక్షణం అప్రమత్తంగా సముద్ర మార్గం గుండా ఉగ్రవాదుల చొరబాటుపై నిఘా వేస్తుంది. -
తెలుగునాథుడు
పుణ్య తీర్థం జగన్నాథుడిని దర్శించుకోవడానికి పూరి వెళ్లనక్కరలేదు, తెలుగు గడ్డపై రెండు రాష్ట్రాల్లోనూ జగన్నాథ ఆలయాలున్నాయి. జగమంతనిండిన జగన్నాథుడు. మన తెలుగునాథుడు. జనసమ్మోహనుడు. అందుకే, ఆయనకు జనార్ధనుడన్న పేరు. భక్తజనులతో కలిసి మెలసి ఉండటం అంటే ఆయనకు ఎంతో ఇష్టం. కృష్ణుడి బాల్యం, యవ్వనం... జనసమూహంతోనే కలిసి కనిపిస్తుంది. తన భక్తులను వెతుక్కుంటూ రథయాత్ర చేసే జగన్నాథుడ్ని ఒడిశా రాష్ట్రంలోని పూరిలోనే చూస్తాం. ఆ రథయాత్ర గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. బలభద్ర, సుభద్రా సమేత జగన్నాథుడ్ని కన్నులారా దర్శించాలనుకునేవారికి మన తెలుగు రాష్ట్రాల్లో వెలుగొందుతున్న జగన్నాథుడి ఆలయాలు ఇవి. సిరిపురంలో పూరి విశాఖ నగరం సిరిపురంలో కొలువై ఉన్న సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుడు భక్తులచేత విశేష పూజలందుకుంటున్నాడు. ఒడిశా పూరిలోని జగన్నాథునికి మాదిరిగానే ఇక్కడా రథోత్సవం, పూజలు, సంప్రదాయాలూ జరుగుతాయి. దాదాపు నాలుగున్నర దశాబ్దాల క్రితం ఒడిశా ఉత్కళ్ సాంస్కృతిక సమాజ్ సభ్యులు సమావేశం కావడం కోసం వచ్చిన ఆలోచన జగన్నాథుని ఆలయానికి అంకురార్పణకు దారితీసింది. అప్పట్లో విశాఖలో ఉంటున్న ఒరియా వారి అభ్యర్థన మేరకు దస్పల్లా రాజు ప్రమోద్కుమార్ దేవ్భంజ్ సిరిపురం (ఆకాశవాణి) వద్ద స్థలం ఇచ్చారు. దీంతో ఇక్కడే తమ ఇలవేల్పయిన జగన్నాథుని ఆలయం కట్టారు. పూరి మహారాజు గజపతి దివ్యసింగ్, దస్పల్లా మహారాజు దేవ్భంజ్లు ఆలయంలో విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ ఆలయం చిన్నది కావడం, ఆదరణ పెరగడం వంటి కారణాలతో ఆ పక్కనే జగన్నాథునికి మరో పెద్ద ఆలయం నిర్మించారు. చిన్న గుడిలోని స్వాములను పెద్ద గుడికి తరలించారు. దీంతో ఇప్పుడక్కడ మరెక్కడా లేనివిధంగా ఇద్దరు స్వాములున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో జగన్నాథునితో పాటు లక్ష్మీగణపతి, కమల, విమల శక్తిమాతల గుడులు (పూరిలో మాదిరిగానే) కాశీ విశ్వేశ్వరుని ఆలయాలు కట్టారు. పూరి తరహాలోనే పూజలు ఏటా రథోత్సవానికి ముందు జరిగే అన్ని సంప్రదాయాలనూ ఇక్కడ పాటిస్తారు. ఆశ్చర్యం గొలిపే ఈ ఆచారాలను నిష్టగా అమలు చేస్తారు. జ్యేష్ట పౌర్ణమినాడు (స్నాన పౌర్ణమి) అద్దంలో చూస్తూ జగన్నాథుడికి పంచామృతాలతో స్నానం చేయిస్తారు. దీంతో స్వామికి జలుబు చేసి జ్వరం వస్తుంది. దీంతో స్వామికి తెల్లని పంచెతో ముసుగేస్తారు. ఈ సమయంలో స్వామి భక్తులకు దర్శనం ఇవ్వరు. జ్వరంతో ఉన్న స్వామికి పథ్యంగా శొంఠి, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్కలను పొడి చేసి, తేనెలో కలిపి నైవేద్యంగా పెడతారు. ఇలా నాలుగైదు రోజుల పాటు నివేదించాక జ్వరం తగ్గుముఖం పట్టాక పండ్లు ఆహారంగా ఇస్తారు. ఇలా 15 రోజులకు జలుబు, జ్వరం త గ్గాక స్వామికి వేసిన ముసుగును తొలగిస్తారు. ఈ పక్షం రోజులూ స్వామి అనారోగ్యంగా ఉన్నారని భావించి గంట కూడా మోగించరు. 15 రోజుల తర్వాత స్వామికి రథోత్సవం నిర్వహిస్తారు. ఆలయం నుంచి ఊరేగింపుగా స్వాములను తీసుకెళ్లే ముందు బంగారు చీపురుతో రథాన్ని శుభ్రం చేస్తారు. పూరిలో రాజవంశీయులు, ఇక్కడ దస్పల్లా రాజవంశీయులతో ఈ ప్రక్రియ చేపడ్తారు. అనంతరం రథాన్ని ఊరేగింపుగా బీచ్రోడ్డు అప్పుఘర్ వద్ద ఉన్న గుండిచా మందిరానికి తీసుకెళ్తారు. అక్కడ తొమ్మిది రోజుల పాటు పూజలు చేశాక ఏకాదశినాడు తిరిగి ఆలయానికి ఊరేగిస్తూ రథంపై తీసుకొస్తారు. ఈ రథయాత్రలో వేలాదిగా భక్తులు పాల్గొని రథాన్ని లాగుతారు. ఈ ఏడాది రథోత్సవాన్ని జూలై 6న నిర్వహిస్తున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయానికి ఇలా వెళ్లాలి విశాఖపట్నం నగరం నడిబొడ్డున ఉన్న సిరిపురంలో జగన్నాథుని ఆలయం ఉంది. విశాఖ రావడానికి రైలు, రోడ్డు, విమాన మార్గాలున్నాయి. విమానాశ్రయం నుంచి 15, రైల్వేస్టేషన్కు 3, ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆయా ప్రాంతాల నుంచి ఆటోలు, క్యాబ్లు, బస్సులు అందుబాటులో ఉన్నాయి. - బొల్లం కోటేశ్వరరావు, సాక్షి, విశాఖపట్నం శతాబ్దాల చరిత..! ప్రశాంతంగా సాగే పంచక్రోశ ఉత్తర వాహినియైన గోదావరి నది తీరాన అగస్త్య మహా ముని తపస్సుతో తరించిన తరులు, గిరుల చెంతన రెండవ పూరీగా అలరారుతున్న దక్షిణాది జగన్నాథ స్వామి భక్తుల కొంగుబంగారమై అలరారుతున్నాడు. ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ మండలంలో గల ఈ జగన్నాథుడిని కోరి కొలుచుకునేవారికి కొంగు బంగారమే అవుతుందని భక్తుల నమ్మకం. పట్టణ ప్రజలే కాకుండా ఆలయంలో పూజలు నిర్వహించేందుకు మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్.. పట్టణాల నుంచి భక్తులు తరలి వస్తారు. నాలుగు శతాబ్దాల నుంచి వంశ పారంపర్యంగా అర్చకులు మోహనాచార్యుల కుటుంబ సభ్యులు ఇక్కడ త్రికాల పూజలు నిర్వహిస్తారు. పూరి ఆలయంలో ఉన్నట్టే! ఆలయంలో జగన్నాథస్వామి మూల విగ్రహాలతో పాటు ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. ఇందులో జగన్నాథ స్వామి సుభద్ర, బలరాముడితో కలిసి పూజలు అందుకుంటున్నాడు. అలాగే, వెంకటేశ్వరుడు, అలివేలుమంగ, పద్మావతి విగ్రహాలతో పాటు అల్వాల్, ఆండాల్ విగ్రహాలూ ఈ ఆలయంలో ఉన్నాయి. పూరిలో జరిగే స్వామి రథయాత్ర సందర్భంగా చెన్నూర్ లో అర్చనలు, అభిషేకాలు, భజన కార్యక్రమాలు అంగరంగవైభవంగా జరుగుతాయి. వెయ్యి స్తంభాల గుడిలా...! నాలుగు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం నిర్మాణం వరంగల్లోని వేయి స్తంభాల గుడిని పోలి ఉండటం విశేషం. రాతిస్తంభాలతో నాటి రాజులు ఈ ఆలయాన్ని నిర్మాణాన్ని చేపట్టారు. నాలుగు వందల ఏళ్ల క్రితం కాకతీయుల కాలంలో ఆ ప్రాంత సంస్థానాధీశుడికి జగన్నాథస్వామి స్వప్నంలో కన్పించి ఆగస్త్య మహాముని తపస్సు చేసిన ప్రాంతంలో తనకు పూజలు నిర్వహించాలని కోరారట. ఆ రాజు ఒరిస్సా రాష్ట్రంలోని పూరి పట్టణానికి వెళ్లి.. జగన్నాథ స్వామి విగ్రహాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారని, అనంతరం కొంతకాలానికి ఈ ఆలయాన్ని నిర్మించినట్లు అర్చకులు తెలిపారు. పంచకోసుల పుణ్యం! మంచిర్యాల పట్టణంలో నుంచి చెన్నూర్ 40 కిలోమీటర్ల దూరం. ఆలయం ఎదుట అభినవ పోతన బిరుందాంకితులు వానమామలై వరదాచార్యుల విగ్రహం ఉంది. ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా పట్టణ సమీపంలో గల పంచక్రోశ ఉత్తర వాహిని గోదావరి నదిలో స్నానాలు అచరించి మొక్కులు తీర్చుకుంటారు. పంచ కోసులు ఉత్తర దిశగా గోదావరి నది ప్రవహించడంతో దక్షణ భారతదేశంలో మొట్ట మొదటిదని ఈ నదికి కాశీ అంతటి ప్రాశస్త్యం ఉందని వేదపండితులు పేర్కొంటారు. ఆలయం నుంచి గోదావరి నది రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. రాష్ట్రంలోనే మొట్టమొదటిది పూరీ తర్వాత జగన్నాథాలయం తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిదిగా పేరొందింది. అయితే, ఈ ఆలయ చరిత్ర ఆధారాలు నేటికీ లభించడంలేదు. ఆలయం నిర్మాణం కాకతీయుల కాలంలో జరిగినట్టుగా మాత్రమే తెలుస్తోంది. - అట్టెమ్ మధునయ్య చెన్నూర్, ఆదిలాబాద్ వడలి జగన్నాథుడు పూరి జగన్నాథ స్వామిని దర్శించుకోలేని వాళ్లు.. వడలి జగన్నాథ స్వామిని దర్శించుకోవచ్చు. కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలంలోని ‘వడలి’లో 200 ఏళ్ల క్రితం నిర్మితమైన ఈ దేవాలయం పూరి జగన్నాథస్వామి ఆలయానికి నమూనాలా కనిపిస్తుంది. గర్భాలయంలోని మూలవిరాట్టులను సైతం పూరి నుంచి తీసుకువచ్చి ప్రతిష్టించడం విశేషం. ఈ దేవాలయం ఇక్కడ నిర్మించడానికి దారితీసిన పరిస్థితులు ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రకాశం జిల్లా క ర్లపాలేనికి చెందిన పురుషోత్తమానంద అనే అవ ధూతకి ఓనాడు రాత్రి జగన్నాథస్వామి కలలో కనిపించి, తన ఆలయాన్ని నిర్మించవలసిందిగా చెప్పాడు. దాంతో ఆయన అందుకు అనుకూలంగా ఉండే స్థలాన్ని అన్వేషిస్తూ ప్రయాణించడం మొదలుపెట్టాడు. వడలి ప్రాంతానికి చేరుకున్నాక స్వామి కొలువుదీరి ఉండటానికి అదే అనువైన స్థలమని భావించాడు. వాకబు చేయగా ఆ ప్రాంతం నవాబుదని తెలుసుకున్నాడు. ఈ విషయం గురించి మాట్లాడటానికి ఆయన విజయవాడ వద్ద కృష్ణానదిలో మునిగి, నిజాంనవాబు అంతఃపురంలో ప్రత్యక్షమయ్యాడట. విషయం తెలుసుకున్న నవాబు సంభ్రమాశ్చర్యాలకు లోనై.. వడలిలో సూర్యోదయం నుంచి అస్తమయం వరకు ఎంత దూరం తిరిగితే అంత భూమి ఆలయ నిర్మాణానికి ఇస్తానని ఆ అవధూతకి చెప్పాడట. ఆ అవధూత ఆ సమయంలో 1200 ఎకరాల మేర తిరిగి ఆ స్థలం దేవాలయానికి దక్కేలా చేశాడట. 1765వ సంవత్సరంలో ఒక వైష్ణవ భక్తుడు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రాంతమంతా ఒకప్పుడు దట్టమైన అరణ్యంలా ఉండేదని, బోయలు ఎక్కువ ఉండే ఈ ప్రదేశాన్ని పూర్వం ‘వ్యాధాళి’ అనేవారట. అది కాలక్రమేణా వడాలిగా రూపాంతరం చెందింది అని చెబుతారు. నాటి నుంచి నేటి వరకు ఆలయం దిన దిన ప్రవర్ధమానమవుతూ దక్షిణ పూరీగా భక్తులతో విశేష పూజలందుకుంటోంది. ప్రతి నిత్యం స్వామి వారికి జరిగే కార్యక్రమాలతో పాటు శ్రీ కృష్ణాష్టమి నాడు ఇక్కడ ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. గుడివాడ-బంటుమిల్లి ప్రధాన రహదారికి సమీపంలో గల ఈ పుణ్య క్షేత్రం గన్నవరం ఎయిర్పోర్ట్కి 60 కి.మీ దూరం, గుడివాడ రైల్వే స్టేషన్కి 15 కి.మీ దూరంలో ఉంది. సుందర మనోహరుడు ఈ ఆలయాన్ని సందర్శిస్తే చాలు పూరి జగన్నాథ మందిరాన్ని దర్శించిన అనుభూతే కలుగుతుంది. అచ్చు పూరి ఆలయానికి నమూనాగా ఉండే ఈ దేవాలయం హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం.12లో ఉంది. ఆలయం మొత్తం ఎర్రని రంగులో, ఒడిస్సీ శిల్పకళా చాతర్యంతో అలరారుతుంటుంది. ఎటువైపు చూసినా అబ్బురపరిచే శిఖర భాగం 70 అడుగుల ఎత్తుతో ఆధ్యాత్మికకు అసలు సిసలైన అద్దం పడుతుంది. పరిసరాలు ఎంతో ప్రశాంతంగా, మరెంతో రమణీయంగా ఉండే ఈ ఆలయాన్ని ఒరియా కమ్యూనిటీ వారు 2009లో నిర్మింపజేశారు. అత్యంత సుందర మనోహరంగా కనిపించే ఈ దేవాలయంలో పూరిలో మాదిరిగానే జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రలతో మూల విరాట్టుగా కొలువుదీరి ఉన్నాడు. పూరీలో మాదిరిగానే ఈ ఆలయంలోనూ జగన్నాథుడికి నిత్య పూజలు జరుపుతారు. అలాగే పూరిలో జరిగినట్టు జేష్ట్య, ఆషాఢమాసంలో జరిగే ప్రత్యేక సేవలన్నీ జరుపుతున్నారు. భక్తులు ఈ సేవలలో పాల్గొని ఆనందపారవశ్యం చెందుతారు. రథోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహిస్తారు. శ్రీకృష్ణజన్మాష్టమి, వసంతపూర్ణిమ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో జగన్నాథుడితో పాటు లక్ష్మి, శివ, గణేష, హనుమాన్, నవగ్రహ మూర్తులను దర్శించుకోవచ్చు. నగర సందర్శనలో భాగంగా పూరి ఆలయం దర్శనం కూడా ఒకటిగా ఉండటం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. ఏడాదిలో ఒక్కరోజే..! శ్రీ జగన్నాథ స్వామి తూర్పు గోదావరి జిల్లాలోని దేవి చౌక్లో బలభద్ర, సుభద్ర సమేతుడై కొలువుదీరి ఉన్నాడు. అతి ప్రాచీన ఆలయంగా పేరొందిన ఈ మందిరాన్ని దేశంలోనే 2వ పూరిగా జగన్నాథుడిని భక్తులు కొలుస్తుంటారు. దీప, ధూప, నైవేద్యాలతో స్వామి వారికి నిత్యం పూజలు జరుపుతారు. అయితే, కేవలం తొలి ఏకాదశి రోజున మాత్రమే ఈ దేవాలయాన్ని భక్తుల దర్శనార్ధం తెరిచి ఉంచుతారు. ఈ సందర్భంగా అత్యంత వేడుకగా జరిగే స్వామి వారి పూజలను కనులారా వీక్షించాల్సిందే తప్ప వర్ణించనలవి కాదంటారు భక్తులు. దేదీప్యమానంగా వెలుగొందే జగన్నాథుడు భక్తులకు అభయమిస్తూ విశేషంగా ఆకట్టుకుంటాడు. మిగతా అన్నిరోజులు పూజారులకు మాత్రమే ఈ ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది. 200 ఏళ్లుగా ఇక్కడ స్వామి విశేష పూజలందుకుంటున్న ఈ స్వామి ఆలయాన్ని వైష్ణవభక్తులు నిర్మించారని కథనాలు ఉన్నాయి. రాజమండ్రి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది జగన్నాథ స్వామి దేవాలయం. సమీప బస్ స్టేషన్ రాజమండ్రి. ఇక్కడే రైల్వే స్టేషన్ కూడా ఉంది. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి 13 కిలోమీటర్ల దూరం. ఇక్కడ నుంచి బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉన్నాయి. -
ఏటంతారేటి!
ఏముందండీ అంటానికి?! నార్త్ కోస్టు ఫుడ్డు. గాలి మళ్లక తప్పదు. చప్పరించినా, లొట్టలేసుకున్నా సికెన్ పీసు, పీతల వేపుడు.. ఆవ చేప.. బలేగుంటాయి. ఏతంటారేటి? కోవా పూరీ కావల్సినవి: కోవా - 200 గ్రా.లు మైదా - అర కేజీ డ్రై ఫ్రూట్స్(బాదం, జీడిపప్పు) పొడి - 30 గ్రా.లు యాలకుల పొడి - టీ స్పూన్ నూనె - వేయించడానికి తగినంత బెల్లం - అర కేజీ నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు తయారీ: ఒక గిన్నెలో మైదా వేసి తగినన్ని నీళ్లు పోసి పూరీ పిండిలా కలిపి, పక్కనుంచాలి. మరో గిన్నెలో కోవా, డ్రై ఫ్రూట్స్ పొడి, యాలకులపొడి వేసి బాగా కలిపి పక్కనుంచాలి. మైదా పిండిని చిన్న చిన్న ఉండలు తీసుకొని పూరీలా వత్తి, కోవా మిశ్రమాన్ని దాంట్లో కూరాలి. (కజ్జికాయల మాదిరి చేయాలి). బాణలిలో నూనె కాగాక, అందులో వేసి అన్నివైపులా బాగా వేయించి తీయాలి. మరొక గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి, బెల్లం వేసి కరిగించాలి. ఈ గిన్నెను పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి. పాకం వచ్చాక యాలకుల పొడి వేసి కలపాలి. ముదురు పాకం వచ్చాక వేయించి సిద్ధంగా పెట్టుకున్న కోవా పూరీలను వేసి, కలిపి, తీయాలి. లక్ష్మీ చారు కావల్సినవి: తరవాణి/కలి నీళ్లు (బియ్యం రెండోసారి కడిగిన 2 కప్పుల నీళ్లు ఒక కుండలో పోసి రెండు రోజుల పాటు ఉంచినవి. దీంట్లో అరకప్పు గంజి కూడా కలపాలి) - కప్పు వెల్లుల్లి - 4 రెబ్బలు వెల్లుల్లి ముద్ద - 1 టీ స్పూన్ కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు కరివేపాకు - 3 రెమ్మలు చింతపండు - నిమ్మపండంత. ఉప్పు - తగినంత పచ్చిమిర్చి - 4 (నిలువుగా చీరాలి) పసుపు - 1/2 టీ స్పూన్ మిరియాల పొడి - అర టీ స్పూన్ ఎండుమిర్చి - 2 జీలకర్ర- ఆవాలు - టీ స్పూన్ నూనె - టేబుల్ స్పూన్ తయారీ: మూకుడులో నూనె వేసి, కాగాక ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి+ముద్ద, పసుపు వేసి కలపాలి. చింతపండు రసం, సరిపడా కలి/తరవాణి నీళ్లు పోసి, ఉప్పు వేసి మరిగించాలి. తరువాత మిరియాల పొడి, కొత్తిమీర వేసి దించాలి. ఈ చారు అన్నంలోకి వడ్డించాలి. జీడిపప్పు చికెన్ పలావ్ కావల్సినవి: జీడిపప్పు - 100 గ్రా.లు చికెన్ - 100 గ్రా.లు బియ్యం - 200 గ్రా.లు; కొబ్బరి పాలు - కప్పు ఉప్పు - తగినంత; పచ్చిమిర్చి - 4 అల్లం-వెల్లుల్లి ముద్ద - టీ స్పూన్ గరం మసాలా (యాలకులు, లవంగాలు, సాజీర, అనాసపువ్వు ) - 2 టీ స్పూన్లు ఉల్లిపాయలు - 4 (2 ఉల్లిపాయలను తరిగి, వేయించి పక్కనుంచాలి) నెయ్యి - 2 టీ స్పూన్లు నూనె - 50 గ్రా.లు; బిర్యానీ ఆకు - 2 కొత్తిమీర - చిన్న కట్ట పుదీనా - కప్పు తయారీ: బియ్యం అరగంట సేపు నానబెట్టాలి. ఒక మందంపాటి గిన్నెను పొయ్యిమీద పెట్టి, నూనె వేసి వేడయ్యాక మసాలా దినుసులు కలపాలి. ఉల్లిపాయ తరుగు వేసి వేగాక అల్లం-వెటల్లుల్లి పేస్ట్ కలపాలి. తరువాత చికెన్ ముక్కలు వేసి ఉప్పు, పుదీనా, కొత్తిమీర, జీడిపప్పులు వేసి కాస్తవేగనివ్వాలి. దీంట్లో బియ్యానికి సరిపడా నీళ్లు పోసి కొత్తిమీర, పుదీనా వేసి మరిగించాలి. తరువాత నానబెట్టిన బియ్యం వేసి కలపాలి. అన్నం ఉడికి నీళ్లు తగ్గాక నెయ్యి, ఇంకాస్త కొత్తిమీర వేసి కలపాలి. మంట తగ్గించి అన్నం పూర్తిగా ఉడకనిచ్చి దించాలి. దీనికి ఉలవచారు కాంబినేషన్ రుచిగా ఉంటుంది. స్టఫ్డ్ క్రాబ్స్ కావల్సినవి: పీతలు (బోన్లెస్) - 4 పీత మాంసం - 200 గ్రా.లు జీడిపప్పు - 50 గ్రా.లు అల్లం తరుగు - టీ స్పూన్ వెల్లుల్లి తరుగు - టీ స్పూన్ కొత్తిమీర - చిన్న కట్ట; పచ్చిమిర్చి - 4 గుడ్డు - 1; ఉప్పు - సరిపడా నూనె - వేయించడానికి తగినంత మొక్కజొన్న పిండి - టీ స్పూన్ తయారీ: పీతల డిప్పలను తీసి, లోపలి గుజ్జు భాగాన్ని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. డిప్పలను వేడి నీటితో కడిగి పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో క్రాబ్ మీట్, వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర, గుడ్డు సొన, ఉప్పు, పచ్చిమిర్చి, మొక్కజొన్న పిండి.. అన్నీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పీతల డొప్పల మధ్యలో పెట్టి, మూసి, కాగుతున్న నూనెలో వేసి రెండు వైపులా వేయించాలి. ఏదైనా సాస్తో వడ్డించాలి. సొరకాయ మటన్ పులుసు కావల్సినవి: చింతపండు - 2 నిమ్మకాయల పరిమాణం అంత (కప్పు గుజ్జు తీయాలి); సోరకాయ - సగ భాగం (పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలి) మటన్ - 200 గ్రా.లు; బెంగుళూరు మిర్చి - 100 గ్రా.లు ఉల్లిపాయ - 2 (సన్నగా తరగాలి); కరివేపాకు - 2 రెమ్మలు కొత్తిమీర - చిన్న కట్ట; అల్లం-వెల్లుల్లి ముద్ద - టీ స్పూన్ వెలుల్లి రెబ్బలు - 4 ; కారం - 2 టీ స్పూన్లు నూనె - 3 టేబుల్ స్పూన్లు; గరం మసాలా - అర టీ స్పూన్ పసుపు - అర టీ స్పూన్; ఉప్పు - తగినంత తయారీ: మటన్లో అర టీ స్పూన్ పసుపు వేసి, కొద్దిగా ఉడికించాలి. మందపాటి గిన్నెను స్టౌ మీద పెట్టి నూనె పోసి మిర్చి తరుగు, సొరకాయ ముక్కలు, ఉల్లిపాయతరుగు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, పసుపు వేసి, కలిపి మగ్గనివ్వాలి. తరువాత మటన్ ముక్కలు, చింతపండు పులుసు, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర వేసి కలిపి ఉడికించాలి. ముక్క ఉడికాక దించాలి. బేబీకార్న్ వడలు కావల్సినవి: బేబీ కార్న్ తరుగు - కప్పు మొక్కజొన్న గింజలు - కప్పు (కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి) పచ్చిమిర్చి తరుగు - అర టీ స్పూన్; నూనె - వేయించడానికి తగినంత పుదీనా - చిన్న కట్ట; ఉల్లిపాయలు - 4 (నిలువుగా తరగాలి) ఉప్పు - తగినంత; శనగపిండి - 50 గ్రా.లు బియ్యప్పిండి - 50 గ్రా.లు; అల్లం-వెల్లుల్లి ముక్కలు - అర కప్పు తయారీ: ఒక గిన్నెలో బేబీకార్న్ తరుగు, మొక్కజొన్న గింజల ముద్ద, అల్లం వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి, పుదీన, ఉల్లిపాయ తరుగు, శనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి బాగా కలపాలి. కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. పిండి మిశ్రమాన్ని చిన్న ఉండలు చేసి, చేత్తో అదిమి కాగిన నూనెలో వేసి రెండువైపులా బాగా వేయించి, తీయాలి. ఆవకాయ చేప కావల్సినవి: ఆవకాయ - 3 గరిటెలు; చేపలు (బోన్లెస్) - 200 గ్రా.లు నూనె - వేయించడానికి తగినంత; మైదా - కప్పు; మొక్కజొన్న పిండి - కప్పు ఉప్పు - తగినంత; కారం - టీ స్పూన్; మిరియాల పొడి - టీ స్పూన్ కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు (చిన్న కట్ట); పచ్చిమిర్చి - 4; గుడ్డు - 1 అల్లం-వెల్లుల్లి ముద్దు - టీ స్పూన్; అల్లం-వెల్లుల్లి సన్నగా తరిగిన ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ - 1 (సన్నగా తరగాలి) తయారీ: ముందుగా చేపలను శుభ్రపం చేసి, ఒక గిన్నెలో వేసి అందులో గుడ్డు సొన, ఉప్పు, మిరియాలపొడి, కారం, అల్లం-వెల్లుల్లి ముద్ద, మైదా, మొక్కజొన్న పిండి వేసి బాగా కలపాలి. కడాయిలో నూనె పోసి కాగాక ఈ చేప ముక్కలను పకోడీల మాదిరి వేయించి తీసి పక్కన పెట్టాలి. తరువాత మరో కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి అల్లం-వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవకాయ పచ్చడి వేసి కలపాలి. దీంట్లో వేయించిన చేప ముక్కలను వేసి బాగా కలపాలి. తరువాత కొత్తిమీర వేసి సర్వ్ చేయాలి. అరటి ఆకు కోడి కావల్సినవి: చికెన్ (బోన్లెస్) - 200 గ్రా.లు; అరటి ఆకు - 1 గరం మసాలా - అర టీ స్పూన్; జీలకర్ర పొడి - అర టీ స్పూన్ ఉల్లిపాయ - 1 (సన్నగా తరగాలి); కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు (చిన్న కట్ట) పుదీన - కప్పు (చిన్న కట్ట); కారం - టీ స్పూన్; నూనె - 2 టేబుల్ స్పూన్లు అల్లం-వెల్లుల్లి ముద్ద - టీ స్పూన్; నిమ్మరసం - టీ స్పూన్; ఉప్పు - తగినంత తయారీ: ముందు చికెన్, గరంమసాలా, జీలకర్ర పొడి, కొద్దిగా అల్లం-వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. కడాయిలో నూనె పోసి ఉల్లిపాయ తరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, చికెన్ వేసి ఉడికించాలి. దీంట్లో నిమ్మరసం కలపాలి. తరువాత పుదీనా, కారం, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపాలి. రసం అంతా ఇంకిపోయేంతవరకు ఉంచి శుభ్రపరిచిన అరటి ఆకులోకి తీసి, అన్నివైపులా మడిచి, నిప్పుల మీద కాల్చి, తీయాలి. లేదంటే ఇడ్లీ పాత్రలో పెట్టి ఆవిరి మీద కూడా ఉడికించవచ్చు. మునగాకు పప్పు కావల్సినవి: పెసరపప్పు - 100 గ్రా.లు; కందిపప్పు - 100 గ్రా.లు మునగాకు - కప్పు; ఉప్పు - తగినంత; వెల్లుల్లి రెబ్బలు - 6 జీలకర్ర - టీ స్పూన్; కరివేపాకు - 2 రెమ్మలు; పచ్చిమిర్చి - 4 కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు (చిన్న కట్ట); ఉల్లిపాయల- 1(సన్నగా తరగాలి) చింతపండు రసం - 2 టేబుల్ స్పూన్లు; నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి - 2 పసుపు - అర టీ స్పూన్ ; ధనియాల పొడి - టీ స్పూన్ తయారీ: కుకర్లో పెసరపప్పు, కందిపప్పు వేసి కడిగి, తగినన్ని నీళ్లు పోసి, పసుపు నూనె వేసి ఉడికించి పక్కనుంచాలి. ఒక కడాయిలో నూనె పోసి, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. పసుపు, చింతపండు రసం పోసి, మునగాకు వేయాలి. ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి ఒక పొంగు వచ్చేవరకు ఉడికించి పప్పులో కలపాలి. చివరగా కొత్తిమీర వేసి, మరికాసేపు ఉడికించి దించాలి. వేడి వేడిగా అన్నం, చపాతీలోకి వడ్డించాలి. -
త్రిష పాట వింటారా..
అడపాదడపా సినీ హీరోలు తమ గొంతు సవరించుకుని పాటలు పాడుతుంటారు. ఈ మధ్య కాలంలో అయితే అలాంటి పాటలు చాలానే ఉన్నాయి. సినిమా ప్రమోషన్స్ లో ఆ పాటల వీడియోలు బాగా ఉపయోగపడుతున్నాయి. ఇక ఇప్పుడు హీరోయిన్ల వంతు. తాజాగా నాజూకు అందాల సుందరి త్రిష 'నాయకి' సినిమా కోసం తొలిసారి తెలుగులో ఓ పాట పాడింది. ఎప్పుడెప్పుడు ఆమె గాత్రాన్ని విందామా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం యూ ట్యూబ్ లో ఆ పాట అలరించనుంది. 'నాయకి' కోసం స్వయంగా త్రిష పాడిన పాటను ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్... యూ ట్యూబ్ ద్వారా రిలీజ్ చేశారు. రఘుకుంచె, సాయి కార్తీక్ లు ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. పాటను లాంచ్ చేసినందుకు మురిసిపోతూ 'థాంక్యూ మై ఫ్రెండ్.. బిగ్ బిగ్ బిగ్ హగ్' అంటూ పూరీని ఉద్దేశించి ట్వీట్ చేసింది మన నాయకి. త్రిష గొంతు విన్న పూరీ 'లవ్ యువర్ వాయిస్' అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. మరి మీరూ వినేయండి.. https://t.co/aEXHC1Effd N telugu it is.....❤️ #Nayaki — Trisha Krishnan (@trishtrashers) 11 April 2016 Thank u so much my friend @purijagan for launching my song..Big big biggg hug. pic.twitter.com/ZRisJp5g1d — Trisha Krishnan (@trishtrashers) 11 April 2016 -
కృష్ణాఇష్టమి
శ్రీకృష్ణుడు వాడవాడలా తనకు పెట్టిన కొత్తకొత్త నైవేద్యాలను చూశాడు... అబ్బో! భక్తులు ఎంత మారిపోయారో అని మురిసిపోయాడు... అంతలోనే తన పుట్టినరోజునాడే గురు పూజోత్సవం రావడం గమనించాడు... తన గురువైన సాందీపుల వారిని పూజించాలనుకున్నాడు... ఆయనను సాక్షాత్తు జగద్గురువైన శ్రీకృష్ణుడే అర్చించి, ఆయనకు నేటి వంటలను రుచి చూపాడు... నిత్యవిద్యార్థి అయిన గురువులు సాందీపులవారు శ్రీకృష్ణునితో... కృష్ణా! వెన్నలు, మీగడలు, పాలు, పెరుగు తిని విసిగిపోయావా అన్నాడు... లేదు గురువర్యా! మీకు వెరైటీ రుచులను గురుదక్షిణగా ఇవ్వాలనుకున్నాను... అందుకే ఈ కొత్త వంటలు మీకు రుచి చూపుదామని వచ్చాను... అన్నాడు. గురువులు ఆస్వాదించారు... శిష్యుడు సంబరపడ్డాడు... మరి మీరూ ఆస్వాదించండి... జగద్గురువు తన గురువును ఆదరించినట్లే మీరూ మీ గురువును ఆరాధించండి... కృష్ణం వందే జగద్గురుమ్ అనండి... చుర్మా లడ్డు కావలసినవి: తయారుచేసిన చపాతీలు - 3 (గట్టిగా, ఎండిపోయినవి); బెల్లం పొడి - 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి - టేబుల్ స్పూను; జీడిపప్పులు - 10; కిస్మిస్ - 10; నువ్వులు - టీ స్పూను తయారీ: చపాతీలను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ఒక పాత్రలో బెల్లం పొడి వేసి కొద్దిగా నీళ్లు జత చేసి బెల్లం కరిగించాలి నెయ్యి జత చేసి మరోమారు కలిపి దించేయాలి బెల్లం పాకానికి చపాతీ పొడి జత చేసి బాగా కలపాలి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పైన జీడిపప్పులు, కిస్మిస్లు, నువ్వులు అద్ది అలంకరించి అందించాలి. సాథ్ పడీ పూరీ కావలసినవి: మైదా పిండి - రెండున్నర కప్పులు; ఉప్పు - తగినంత; నూనె - 2 టేబుల్ స్పూన్లు; నీళ్లు - తగినంత ; నూనె - డీప్ ఫ్రైకి సరిపడా; పేస్ట్ కోసం... బియ్యప్పిండి - అర కప్పు; నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు తయారీ: ముందుగా ఒక పాత్రలో మైదా పిండి, ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి తగినన్ని నీళ్లు జత చేస్తూ పరాఠాల పిండిలా కలుపుకుని అరగంట సేపు పక్కన ఉంచాలి మరొక పాత్రలో అర కప్పు బియ్యప్పిండి, రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి పిండిని ముద్దలా చేసుకోవాలి (నీళ్లు పోయకూడదు) మైదాపిండిని పద్నాలుగు సమాన భాగాలుగా చేసి ఒక్కో ఉండను చపాతీలా ఒత్తాలి ముందుగా ఒక చపాతీ మీద బియ్యప్పిండి, నెయ్యి కలిపిన ముద్దను కొద్దిగా పూసి ఆ పైన మరో చపాతీ ఉంచాలి ఈవిధంగా మొత్తం ఏడు చపాతీలను ఒకదాని మీద ఒకటి ఉంచాక ఏడవ చపాతీ మీద కూడా బియ్యప్పిండి ముద్ద పూసి నెమ్మదిగా ఆ ఏడు చపాతీలను రోల్ చేయాలి చాకుతో గుండ్రంగా ముక్కలు కట్ చేయాలి ఒక్కో ముక్కను జాగ్రత్తగా అప్పడాల కర్రతో ఒత్తాలి బాణలిలో నూనె కాగాక వీటిని ఒక్కొక్కటిగా నూనెలో వేసి రెండు వైపులా బంగారు వర్ణం వచ్చేవరకు వేయించి తీసేయాలి. చాకొలేట్ శాండ్విచ్ కావలసినవి: ఆలుగడ్డలు - 2 (ఉడికించి తొక్క తీసి మెత్తగా చేయాలి); నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు; పంచదార - 2 టేబుల్ స్పూన్లు; పాలు - పావు కప్పు; కరిగించిన డార్క్ చాకొలేట్ - 2 టేబుల్ స్పూన్లు. తయారీ: బాణలిలో నెయ్యి వేసి కరిగాక ఆలుగడ్డల ముద్ద వేసి సుమారు పది నిమిషాలు బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి పంచదార, పాలు జత చేసి మరో ఐదు నిమిషాలు ఉడికించి దింపి, ఒక ప్లేట్లోకి తీసుకోవాలిమిశ్రమాన్ని మనకు కావలసిన ఆకారంలో తయారుచేసుకోవాలి ఒక దాని మీద రెండు టీ స్పూన్ల డార్క్ చాకొలేట్ మిశ్రమం వేసి పై మరో ముక్క ఉంచాలి చివరగా చాకొలేట్తో అలంకరించి వేడివేడిగా అందించాలి కస్టర్డ్ పౌడర్ హల్వా కావలసినవి: కస్టర్డ్ పౌడర్ - కప్పు (వెనిలా ఫ్లేవర్); పంచదార - 3 కప్పులు; నీళ్లు - 4 కప్పులు; నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు; జీడిపప్పులు - 15. తయారీ: ఒక ప్లేట్కి నెయ్యి పూసి పక్కన ఉంచాలి బాణలిలో టీ స్పూను నెయ్యి వేసి కాగాక జీడిపప్పులు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి ఒక పాత్రలో కస్టర్డ్ పౌడర్, పంచదార, నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలిపి, ఆ పాత్రను స్టౌ మీద ఉంచి మిశ్రమం చిక్కబడేవరకు ఆపకుండా కలుపుతుండాలి నెయ్యి జత చేసి, మిశ్ర మం జెల్లీలా అయ్యే వరకు కలపాలి జీడిపప్పులు జత చేసి ఒకసారి కలిపి దింపేయాలి నెయ్యి రాసి ఉంచుకున్న ప్లేట్లోకి ఈ మిశ్రమం పోసి సమానంగా పరిచి, ముక్కలుగా కట్ చేయాలి. -
పూరీ జగన్నాథ రథయాత్రకు లక్షలాదిమంది
పూరీ: ఒడిశాలో పూరీ జగన్నాథ రథయాత్ర శనివారం ఘనంగా ప్రారంభమైంది. దీనికి లక్షలాదిమంది భక్తులు హాజరయ్యారు. సాదారణంగా ప్రతి ఏడాది ఈ రథయాత్ర ఆషాడశుక్ల విదియ నాడు ప్రారంభమవుతుంది. అంటే సాధారణంగా జూన్, జూలై నెలల్లో జరుగుతుంది. -
నేడు పూరీజగన్నాథుని రథయాత్ర
-
లోఫర్ షూటింగ్ స్టార్ట్ చేసిన పూరి
-
పూరీ, చార్మీలతో చిట్ ఛాట్ Part- 2
-
పూరీ, చార్మీలతో చిట్ ఛాట్ Part- 1
-
జోరు పెంచిన పూరీ జగన్నాథ్
-
’ఆటోజానీ’గా వస్తున్న చిరు
-
ఐడియా నంబర్ 2 : జ్యూరీమెంబర్-మదన్
-
ఐడియా నంబర్ 1: జ్యూరీమెంబర్- సునీల్కుమార్రెడ్డి
-
మెగా కాంపౌండ్ నుంచి పూరికి పిలుపు
-
నేనే డైరెక్టర్స్ ఛాన్స్ ఇస్తానేమో!
పూరి జగన్నాథ్ డెరైక్టర్స్ హంట్ స్టోరీ: పూరి డెరైక్షన్: మీరే!! 10 డేస్... 10 స్టోరీ ఐడియాస్ 10 మినిట్స్... నిన్నటికి తొమ్మిది స్టోరీ ఐడియాలు చెప్పా. ఇవాళ్టిది పదో ఐడియా, చివరి ఐడియా. వీటిల్లో మీకు నచ్చిన కథకు మీరు స్క్రిప్ట్ రెడీ చేసి చక్కగా డైలాగులు రాసుకుని 10 నిమిషాల లోపు నిడివితో ఒక షార్ట్ ఫిల్మ్ తీయండి. మీ ఇష్టం... ఏ డిజిటల్ కెమెరాతోనైనా తీయొచ్చు. ఏమీ లేకపోతే ఐ ఫోన్తోనైనా తీయొచ్చు. యాక్టర్స్ అంటారా? మీ ఇంట్లో, మీ చుట్టుపక్కల బోలెడంత మంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్లతోనే షూట్ చేయండి. ఏమో..! మీలో ఎవరైనా నాకు నచ్చితే నా బేనర్లో నేనే డెరైక్షన్ ఛాన్స్ ఇస్తానేమో! నెల రోజులు టైం ఇస్తున్నాం. ఫిబ్రవరి 14 వేలంటైన్స్డే మీ ఎంట్రీలకు లాస్ట్ డే. మీరు తీసిన షార్ట్ ఫిల్మ్ని directorsakshi@gmail.comకి పంపించండి. ఒక్కో కథకు ఒక్కో డెరైక్టర్ని ఎంపిక చేస్తాం. అంటే పది కథలకూ పదిమంది దర్శకులు. వీళ్లందరికీ తగిన బహుమతులు ఇస్తాం. వాళ్లు తీసిన షార్ట్ ఫిల్మ్స్ ‘సాక్షి’ ఛానల్లో ప్రసారం చేస్తాం. యూ ట్యూబ్లో పెడతాం. దీంతో మీకు ఎక్స్పీరియెన్స్ వస్తుంది. ఎక్స్పోజర్ వస్తుంది. సినిమా ఇండస్ట్రీ నుంచి అవకాశాలూ రావొచ్చు. అయితే కొన్ని కండిషన్స్... చాలా తక్కువ ఖర్చుతో ఈ షార్ట్ ఫిల్మ్ తీయాలి. అనవసరంగా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకూడదు ఈ షార్ట్ ఫిల్మ్ పేరు చెప్పి మీ ఇంట్లో వాళ్లను డబ్బుల కోసం వేధించకూడదు. అసలు మీ సొంత డబ్బు వాడకూడదు. ఎవరో ఒకర్ని కన్విన్స్ చేసి ఈ షార్ట్ ఫిల్మ్ తీయాలి. పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ కోసమే ఒకరిని కన్విన్స్ చేయలేనివాళ్లు జీవితంలో డెరైక్టర్ ఏమవుతారు? రేపు సినిమా తీయడానికి ఏ నిర్మాతను ఒప్పించగలరు? అర్థమైందిగా.. లాస్ట్ అండ్ ఫైనల్... మీరు తీయబోయే షార్ట్ ఫిల్మ్ఎలా ఉండాలంటే, అది మీ జీవితాన్ని మార్చేసేలా ఉండాలి. గమనిక: నా జీవితం కూడా ఇలా షార్ట్ ఫిల్మ్లతోనే మొదలైంది. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. - పూరి జగన్నాథ్ ప్రెజెంటేషన్: పులగం చిన్నారాయణ పూరి Idea-10 ఈ ప్రపంచంలో ప్రేమ అనేది ఎవర్గ్రీన్. ఎన్ని ఛేంజెస్ వచ్చినా... ఎన్ని ట్రెండ్లు మారినా... లవ్ లవ్వే. దిసీజ్ లాస్ట్ అండ్ ఫైనల్ కాన్సెప్ట్. కొంచెం తమాషాగా తీయాలి. కాన్సెప్ట్ ఏంటంటే - ఓ అందమైన అమ్మాయి. పార్క్లో కూర్చుందో, బస్సులో వెళ్తోందో, లేక షాపింగ్ చేస్తోందో మీ ఇష్టం. సడన్గా ఆమె ముందు ఓ అబ్బాయి ప్రత్యక్షమయ్యాడు. ఓ గులాబీ పువ్వు ఆమె చేతికిచ్చి ఆమె ముందు మోకరిల్లి ‘‘తొలి చూపులోనే మీరు నా హార్ట్ని రాబరీ చేసేశారు. మీరు ఊ.. అంటే మిమ్మల్ని నా లైఫ్ పార్టనర్ని చేసుకుంటా’’ అంటూ ఏవేవో చెప్పాడు. ఆమె మొదట విసుక్కుంది. తర్వాత కసురుకుంది. కానీ అతను ఆమెను వదల్లేదు. తన మనసులోని ప్రేమను కవితల రూపంలో ఆవిష్కరించాడు. ఎట్టకేలకు ఆమె ఓకే అంది. ఇద్దరి మధ్యనా ప్రేమ పరవళ్లు తొక్కింది. దీన్ని షార్ట్ ఫిల్మ్గా తీయండి. అరె... సింపుల్ కాన్సెప్ట్ అనుకుంటున్నారు కదూ! ఇక్కడే ఉంది అసలు ట్విస్టు. ఒకమ్మాయికి ఒకబ్బాయి లవ్ ప్రపోజ్ చేయడాన్ని మూడు రకాలుగా చూపించాలి. అంటే... బ్లాక్ అండ్ వైట్ కాలంలో ఈ లవ్ ప్రపోజల్ ఎలా ఉండేది? ఇప్పుడైతే ఎలా ఉంది? భవిష్యత్తులో ఇంకెలా ప్రపోజ్ చేస్తారు? ఈ మూడు డైమన్షన్స్లో ‘లవ్ ప్రపోజల్’ పై షార్ట్ ఫిల్మ్ తీయండి. (గమనిక: ఏదైనా సినిమా చూసినప్పుడు ఈ మాత్రం సినిమా మనం తీయలేమా అని మీకు అనిపించి ఉండొచ్చు. అలాగే ఎవరిదైనా యాక్టింగ్ చూసి ఈ మాత్రం తొక్కలో యాక్టింగ్ మేం చేయలేమా అన్న భావన మీలో వచ్చి ఉండొచ్చు. అలాగే ఈ కథలు, ఐడియాలు చూసి మీకు అలాంటి ఫీలింగ్సే వస్తాయి. సో... కామెంట్ చేయడం కాదు. మీరు ఏదైనా చూపిస్తే నాకు చూడాలని ఉంది. - మీ పూరి జగన్నాథ్) స్పందించి ముందుకొచ్చినవారు... కెమెరాలిస్తా... ‘‘నాకు సినిమాలంటే చాలా ఇష్టం. నేను వేరే వ్యాపార రంగంలో ఉన్నా కూడా, సినిమాలంటే ఆసక్తి అలాగే ఉంది. నా దగ్గర అత్యాధునిక డిజిటల్ కెమెరాలున్నాయి. లైటింగ్ ఎక్విప్మెంట్ కూడా ఉంది. ఆర్థిక స్తోమతలేని ప్రతిభావంతులు ఈ ఎక్విప్మెంట్ని ఉచితంగా ఉపయోగించుకుని షార్ట్ ఫిల్మ్ తీసుకోవచ్చు. 8106161821 నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి.’’ - వెన్నా ఉమాశంకర్ నిర్మించడానికి నేను రెడీ ‘‘ఇంతకుముందు నేను ‘3జి లవ్’ అనే సినిమా నిర్మించాను. త్వరలో మరో చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాను. నాకు మొదట్నుంచీ షార్ట్ ఫిల్మ్స్ అంటే ఆసక్తి. అందుకే షార్ట్ ఫిలిమ్స్ తీసే వాళ్లను ప్రోత్సహించాలనుకుంటున్నా. అందుకోసం నా తరపున కొన్ని ప్రయత్నాలు చేస్తున్నా. పూరి జగన్నాథ్గారి ఐడియాలకు షార్ట్ ఫిల్మ్స్ తీయాలన్న ‘సాక్షి’ కాంటెస్ట్ చాలా బాగుంది. నిర్మించడానికి నేను రెడీ. కథలతో నన్ను మెప్పిస్తే, ఎంతమందినైనా ఎంకరేజ్ చేస్తాను. నా ఫోన్ నంబర్ 8500234567. సంప్రదించండి.’’ - ప్రతాప్ కొలగట్ల -
కథలు నచ్చితే నేనే ప్రొడ్యూస్ చేస్తా
స్టోరీ: పూరి డెరైక్షన్: మీరే!! 10 డేస్... 10 స్టోరీ ఐడియాస్ 10 మినిట్స్... ఇప్పటికి ఎనిమిది స్టోరీ ఐడియాలు చెప్పా. ఇవాళ్టిది తొమ్మిదో ఐడియా. రేపు చివరి ఐడియా చెప్తా. మొత్తం పది ఐడియాలు. వీటిల్లో మీకు నచ్చిన కథకు మీరు స్క్రిప్ట్ రెడీ చేసి చక్కగా డైలాగులు రాసుకుని 10 నిమిషాల లోపు నిడివితో ఒక షార్ట్ ఫిల్మ్ తీయండి. మీ ఇష్టం... ఏ డిజిటల్ కెమెరాతోనైనా తీయొచ్చు. ఏమీ లేకపోతే ఐ ఫోన్తోనైనా తీయొచ్చు. యాక్టర్స్ అంటారా? మీ ఇంట్లో, మీ చుట్టుపక్కల బోలెడంత మంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్లతోనే షూట్ చేయండి. నెల రోజులు టైం ఇస్తున్నాం. ఫిబ్రవరి 14 వేలంటైన్స్డే మీ ఎంట్రీలకు లాస్ట్ డే. మీరు తీసిన షార్ట్ ఫిల్మ్ని directorsakshi@gmail.comకి పంపించండి. ఒక్కో కథకు ఒక్కో డెరైక్టర్ని ఎంపిక చేస్తాం. అంటే పది కథలకూ పదిమంది దర్శకులు. వీళ్లందరికీ తగిన బహుమతులు ఇస్తాం. వాళ్లు తీసిన షార్ట్ ఫిల్మ్స్ ‘సాక్షి’ ఛానల్లో ప్రసారం చేస్తాం. యూ ట్యూబ్లో పెడతాం. దీంతో మీకు ఎక్స్పీరియెన్స్ వస్తుంది. ఎక్స్పోజర్ వస్తుంది. సినిమా ఇండస్ట్రీ నుంచి అవకాశాలూ రావొచ్చు. ప్రెజెంటేషన్: పులగం చిన్నారాయణ పూరి Idea-9 ఇప్పటి వరకూ కథలు చెప్పాను. ఐడియాలు చెప్పాను. కానీ, ఈసారి నేను నాకు నచ్చిన వేమన పద్యం గురించి చెబుతాను. ఆ పద్యం సారాంశాన్ని ప్రతిబింబిస్తూ ఓ లఘుచిత్రం తీయండి. ఇది మీకు కొత్తగా అనిపిస్తుంది. అలా అనిపించిందంటే మీరు కచ్చితంగా కొత్తగా తీస్తారు. ఇక ఆ పద్యం ఏంటో చూడండి. ‘‘తప్పులెన్నువారు తండోపతండంబు నుర్వి జనులకెల్ల నుండు తప్పు తప్పు లెన్నువారు తమ తప్పు లెరుగరు విశ్వదాభిరామ వినుర వేమ’’ (తప్పులను ఎత్తిచూపేవారు చాలామంది ఉన్నారు. అయితే తప్పులు వెదికేవాళ్లు ఎదుటివాళ్ల తప్పులను చూపినంతగా తమ తప్పులను తెలుసుకోలేరు.) ఇందులో చాలా మంచి మీనింగ్ ఉంది. ఆ భావం తీసుకుని తప్పుల మీద ఓ కథ ఆలోచించి షార్ట్ ఫిల్మ్ తీయండి. కథలు నచ్చితే నేనే ప్రొడ్యూస్ చేస్తా... జగదాంబ ప్రొడక్షన్స్ పతాకంపై నూతన తారాగణంతో ప్రస్తుతం ‘ది బెల్స్’ అనే చిత్రం నిర్మిస్తున్నారు ఎర్రోజు వెంకటచారి. భవిష్యత్తులో మరిన్ని చిత్రాలు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. పూరి జగన్నాధ్, సాక్షి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఆయనకు అమితంగా నచ్చేసింది. ఈ కాంటెస్ట్లో తాను భాగస్వామినవుతానని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా వెంకటచారి మాట్లాడుతూ ‘‘ఈ కాంటెస్ట్ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఇలాంటి పోటీల వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్త దర్శకులు దొరుకుతారు. ఔత్సాహికులు నాకు కథ చెప్పి ఒప్పిస్తే ఆ లఘు చిత్రాన్ని నేనే నిర్మిస్తాను. నాకు నచ్చితే ఎంతమందినైనా ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నాను. ఔత్సాహికులు 94904 42200 అనే ఫోన్ నెంబర్లో సంప్రదించగలరు’’ అని తెలిపారు. ఎర్రోజు వెంకటచారి -
పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్
స్టోరీ: పూరి డైరెక్టర్ : మీరే!! 10 డేస్... 10 స్టోరీ ఐడియాస్ 10 మినిట్స్... ఈ పది రోజుల్లో... నేను చెప్పే పది ఐడియాల్లో ఏ ఐడియా నచ్చినా దాంతో మీరు ఓ షార్ట్ ఫిల్మ్ తీసేయండి. మొత్తం 10 ఐడియాలూ తీస్తానన్నా మాకు ఓకే! నిన్న రెండో కథ చెప్పా. ఇవాళ మూడో కథ. ఇలా మొత్తం పది కథలు చెప్తా. వీటిల్లో మీకు నచ్చిన కథకు మీరు స్క్రిప్ట్ రెడీ చేసి చక్కగా డైలాగులు రాసుకుని 10 నిమిషాల లోపు నిడివితో ఒక షార్ట్ ఫిల్మ్ తీయండి. మీ ఇష్టం... ఏ డిజిటల్ కెమెరాతోనైనా తీయొచ్చు. ఏమీ లేకపోతే ఐ ఫోన్తోనైనా తీయొచ్చు. యాక్టర్స్ అంటారా? మీ ఇంట్లో, మీ చుట్టుపక్కల బోలెడంత మంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్లతోనే షూట్ చేయండి. నెల రోజులు టైం ఇస్తున్నాం. ఫిబ్రవరి 14 వేలంటైన్స్డే మీ ఎంట్రీలకు లాస్ట్ డే. మీరు తీసిన షార్ట్ ఫిల్మ్ని directorsakshi@gmail.com కి పంపించండి. ఒక్కో కథకు ఒక్కో డెరైక్టర్ని ఎంపిక చేస్తాం. అంటే పది కథలకూ పదిమంది దర్శకులు. వీళ్లందరికీ తగిన బహుమతులు ఇస్తాం. వాళ్లు తీసిన షార్ట్ ఫిల్మ్స్ ‘సాక్షి’ ఛానల్లో ప్రసారం చేస్తాం. యూ ట్యూబ్లో పెడతాం. దీంతో మీకు ఎక్స్పీరియెన్స్ వస్తుంది. ఎక్స్పోజర్ వస్తుంది. సినిమా ఇండస్ట్రీ నుంచి అవకాశాలూ రావొచ్చు. ఏమో..! మీలో ఎవరైనా నాకు నచ్చితే ... నా బేనర్లో నేనే డెరైక్షన్ ఛాన్స్ ఇస్తానేమో! అయితే కొన్ని కండిషన్స్... చాలా తక్కువ ఖర్చుతో ఈ షార్ట్ ఫిల్మ్ తీయాలి. అనవసరంగా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకూడదు ఈ షార్ట్ ఫిల్మ్ పేరు చెప్పి మీ ఇంట్లో వాళ్లను డబ్బుల కోసం వేధించకూడదు. అసలు మీ సొంత డబ్బు వాడకూడదు. ఎవరో ఒకర్ని కన్విన్స్ చేసి ఈ షార్ట్ ఫిల్మ్ తీయాలి. పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ కోసమే ఒకరిని కన్విన్స్ చేయలేనివాళ్లు జీవితంలో డెరైక్టర్ కాలేరు. రేపు సినిమా తీయడానికి ఏ నిర్మాతను ఒప్పించగలరు? అర్థమైందిగా.. లాస్ట్ అండ్ ఫైనల్... మీరు తీయబోయే షార్ట్ ఫిల్మ్ ఎలా ఉండాలంటే, అది మీ జీవితాన్ని మార్చేసేలా ఉండాలి. గమనిక: నా జీవితం కూడా ఇలా షార్ట్ ఫిల్మ్లతోనే మొదలైంది. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. - పూరి జగన్నాథ్ పూరి Idea-3 ఈ ప్రపంచంలో మనిషి ఏం లేకపోయినా బతుకుతాడేమో కానీ, సెల్ఫోన్ లేకపోతే క్షణం కూడా ఉండలేడు. అంతలా మన దేహంలో, మనలో ఒక భాగమైపోయింది సెల్ఫోన్. ఇప్పుడు మీరు సెల్ఫోన్ నేపథ్యంలో ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలి. ఓ నిరుద్యోగ యువకుడు చాలా నిరాశగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటాడు. బైకులు, ఆటోలు, కార్లు, బస్సులు... రోడ్డు మీద ఇలా ఏవేవో వెహికిల్స్ పరుగులు తీస్తున్నాయి. అవేవీ పట్టించుకోవడం లేదు అతను. గట్టిగా హారన్ మోగితే ఉలిక్కిపడి వెనక్కు చూశాడు. బైక్ మీద ఓ అందమైన అమ్మాయి. స్వర్గం నుంచి రంభ, ఊర్వశి, మేనక దిగొచ్చారా... లేక బాలీవుడ్ నుంచి ప్రియాంకా చోప్రా, అలియాభట్, దీపికా పదుకొనే వచ్చారా... అన్నంత ఫీలింగ్. ఇతను తన్మయంగా చూస్తూ ఉండగానే, ఆ అమ్మాయి మెరుపు వేగంతో వెళ్లిపోయింది. ఏదో చిన్న అలికిడి. గబగబా ముందుకెళ్లాడు అతను. తీరా చూస్తే - మొబైల్ ఫోన్ పడిపోయి కనిపించింది. అది ఆ అమ్మాయి బ్యాగ్లోంచి జారిపోవడం ఇతనికి స్పష్టంగా కనబడింది. ఫోన్కేమైనా దెబ్బలు తగిలాయా అన్నట్టుగా చూశాడు. ఫోన్ తళతళలాడుతూ చెక్కు చెదరకుండా ఉంది. అది చాలా కాస్ట్లీ ఫోన్. జస్ట్... వన్ వీక్ బ్యాక్ మార్కెట్లోకి లాంచ్ అయిన స్మార్ట్ట్ ఫోన్. అబ్బా... అనుకుంటూ కాసేపు ఆ ఫోన్ను మురిపెంగా చూశాడు. ఇక నుంచీ ఆ ఫోన్ తనదే! తన జేబులోంచి తన ఫోన్ తీసి చూసుకున్నాడు. పాత డొక్కు ఫోన్. ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్కి తప్ప ఇంక దేనికీ పనికి రాదు. ఇలాంటి ఖరీదైన ఫోన్ కొనుక్కోవాలన్నది అతని డ్రీమ్. జాబ్ రావడం లేదు... వస్తే ఫస్ట్ శాలరీతో కొనుక్కోవాలనుకున్నాడు. ఇప్పుడేమో లక్కీగా ఇలా ఫోన్ దొరికింది. దాన్ని భద్రంగా జేబులో పెట్టుకుంటుంటే ఇంకో ఆలోచన వచ్చింది. ఈ ఫోన్ దొరికిందని ఆ అమ్మాయికిస్తే, ఇంప్రెస్ అయ్యి తనతో ఫ్రెండ్షిప్ చేయొచ్చుకదా! సూపర్ ఐడియా అని తనను తానే మెచ్చుకున్నాడా కుర్రాడు. ఈ సెల్ఫోన్ని ఆ అమ్మాయికిచ్చే ప్రాసెస్లో కథ మలుపు తిరిగింది. ఆ మలుపు లవ్కి దారి తీసిందా? కామెడీకి పనికొచ్చిందా? లేక క్రైమ్కి కారకమైందా? ఆ మలుపు మీ ఇష్టం. మొత్తం మీద సెల్ఫోన్ బ్యాక్డ్రాప్తో ఓ షార్ట్ ఫిల్మ్ తీయండి. అది పది నిమిషాల్లోపే ఉండాలి. ఆ షార్ట్ ఫిల్మ్ 2 నిమిషాలు, 5 నిమిషాలు ఉన్నా ఫర్వాలేదు. ఏదైనా మీ ఇష్టం. -ప్రెజెంటేషన్: పులగం చిన్నారాయణ బహుమతులు అందించేవారు.. -
పూరి Idea-1
వాళ్లిద్దరికీ కొత్తగా పెళ్ళయ్యింది. అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగి. అమ్మాయి హౌస్వైఫ్. కొత్త ఇల్లు... కొత్త కాపురం... ఆ రోజు అబ్బాయి ఆఫీసుకు వెళ్ళగానే ఫోన్ మోగింది. ఎవరిదో అపరిచిత గొంతు. ‘‘మీ ఆయన ఇంట్లో లేడు కదా. నన్ను రమ్మంటావా?’’ అంటూ చాలా వల్గర్గా మాట్లాడాడు. ఈ అమ్మాయికి భయం వేసింది. కోపం వచ్చింది. ఎన్నిసార్లు ఫోన్ కట్ చేసినా చేస్తూనే ఉన్నాడు. భర్త ఇంటికొచ్చే వరకూ ఏడుస్తూనే ఉందా అమ్మాయి. అబ్బాయి కంగారుపడి ఏంటని అడిగితే, ఫోన్ సంగతి చెప్పింది. ఏదో రాంగ్ కాల్ అయ్యింటుందిలే అని సర్ది చెప్పాడు. నెక్ట్స్ డే కూడా అలానే జరగడంతో, ఆ అబ్బాయి పోలీస్ కంప్లయింట్ ఇచ్చాడు. ఆ తర్వాత రోజు- అబ్బాయి ఆఫీసుకి బయలుదేరాడు. ఓ అపరిచితుడు ఆ ఇంటిముందే తచ్చట్లాడుతున్నాడు. రోజూ ఫోన్ చేసేది అతనే. ఈసారి ఫోన్ చేయకుండా డెరైక్ట్గా ఇంటికి వెళ్లాడు. ఆ అమ్మాయి కిచెన్లో వంట చేస్తోంది. అతను వెనుకగా వెళ్లి ఆమెపై ఎటాక్ చేశాడు. ఆ అమ్మాయి భయంతో కేకలు పెడుతూ అతన్నుంచి తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసింది. సరిగ్గా అదే సమయంలో ఏదో మరచిపోయి ఇంటికి తిరిగి వస్తున్నాడు అబ్బాయి. ఇక్కడేమో అతని భార్య మీద మానభంగం జరుగుతూ ఉంటుంది. సరిగ్గా అబ్బాయి ఇంటి దగ్గరకొచ్చేసరికి ఓ స్నేహితుడు కనిపిస్తాడు. అతనితో కాసేపు మాట్లాడి ఇంట్లోకి వెళ్లేసరికి చిరిగిన బట్టలతో వాడిపోయిన మల్లెపువ్వులా కనిపిస్తుందా అమ్మాయి. ఇతనికి విషయం అర్థమైంది. రక్తం మరిగింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేద్దామనుకుని, మళ్లీ మానుకుంటాడు. కంప్లయింట్ చేస్తే ఇంటి పరువు బజారున పడుతుందనుకుంటాడు. ఇతను ఎంత ఓదార్చినా, ఆ అమ్మాయి ఏడుస్తూనే ఉంటుంది. అబ్బాయి ఏం మాట్లాడలేదు. అమ్మాయి ఏం మాట్లాడదు. ఇలా కొన్నాళ్లపాటు ఇద్దరి మధ్యలో మౌనం. కొన్నాళ్ల తర్వాత- ఇద్దరూ మార్కెట్కి వెళ్లారు. అక్కడ బ్లాక్కలర్ లెదర్ జాకెట్లో ఉన్న ఓ వ్యక్తిని చూడగానే ఆ అమ్మాయి కోపంతో ఊగిపోయింది. ‘‘వాడే...’’ అంటూ భర్తకు ఏదో చెప్పబోయింది. అతనికి విషయం అర్థమైంది. తన భార్యను రేప్ చేసిన వాణ్ణి అక్కడికక్కడే చంపేయాలనుకున్నాడు. కానీ ఇతనేమీ హీరో కాదు కదా. అందుకే ఆ బ్లాక్ జాకెట్ని వెంబడించాడు. అతనో నిర్మానుష్యమైన సెల్లార్లోకి వెళ్ళగానే, అబ్బాయి ఎటాక్ చేశాడు. పిచ్చి కోపంతో అతని పీక పిసికి చంపేశాడు. ఆ తర్వాత అబ్బాయికి భయం మొదలైంది. అటూ ఇటూ పిచ్చి చూపులూ చూస్తూ ఒక్క పరుగు మీద భార్య దగ్గరకు వచ్చేశాడు. భార్యతో ఏదో చెప్పబోతుంటే, ఆ అమ్మాయి దూరంగా ఇంకో బ్లాక్ జాకెట్ పర్సన్ని చూపించి ‘‘వాడే...’’ అని చెప్పింది. ఈ అబ్బాయి పిచ్చాడిలా అటే చూస్తున్నాడు. అంటే తన భార్య షాక్కి గురై పిచ్చిదైపోయిందని, తాను కంగారులో ఓ నిరపరాధిని చంపేశానని అర్థమైంది. -
పూరి జగన్నాథ్ డెరైక్టర్స్ హంట్
స్టోరీ: పూరి డెరైక్షన్: మీరే!! నేటి నుంచి వరుసగా 10 రోజుల పాటుమీకు రోజుకో కథ చెబుతా. దానికి మీరు స్క్రిప్ట్ రెడీ చేసి చక్కగా డైలాగులు రాసుకుని 10 నిమిషాల లోపు నిడివితో ఒక షార్ట్ ఫిల్మ్ తీయండి. మీ ఇష్టం... ఏ డిజిటల్ కెమెరాతోనైనా తీయొచ్చు. ఏమీ లేకపోతే ఐ ఫోన్తోనైనా తీయొచ్చు. యాక్టర్స్ అంటారా? మీ ఇంట్లో, మీ చుట్టుపక్కల బోలెడంత మంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్లతోనే షూట్ చేయండి. 10 మినిట్స్... ఈ పది రోజుల్లో... నేను చెప్పే పది ఐడియాల్లో ఏ ఐడియా నచ్చినా దాంతో మీరు ఓ షార్ట్ ఫిల్మ్ తీసేయండి. మొత్తం 10 ఐడియాలూ తీస్తానన్నా మాకు ఓకే! ఏమో..! మీలో ఎవరైనా నాకు నచ్చితే నా బేనర్లో నేనే డెరైక్షన్ ఛాన్స్ ఇస్తానేమో! అయితే కొన్ని కండిషన్స్... చాలా తక్కువ ఖర్చుతో ఈ షార్ట్ ఫిల్మ్ తీయాలి. అనవసరంగా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకూడదు ఈ షార్ట్ ఫిల్మ్ పేరు చెప్పి మీ ఇంట్లో వాళ్లను డబ్బుల కోసం వేధించకూడదు. అసలు మీ సొంత డబ్బు వాడకూడదు. ఎవరో ఒకర్ని కన్విన్స్ చేసి ఈ షార్ట్ ఫిల్మ్ తీయాలి. పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ కోసమే ఒకరిని కన్విన్స్ చేయలేనివాళ్లు జీవితంలో డెరైక్టర్ కాలేరు. రేపు సినిమా తీయడానికి ఏ నిర్మాతను ఒప్పించగలరు? అర్థమైందిగా.. లాస్ట్ అండ్ ఫైనల్... మీరు తీయబోయే షార్ట్ ఫిల్మ్ ఎలా ఉండాలంటే, అది మీ జీవితాన్ని మార్చేసేలా ఉండాలి. గమనిక: నా జీవితం కూడా ఇలా షార్ట్ ఫిల్మ్లతోనే మొదలైంది. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. - పూరి జగన్నాథ్ -
గోధూమ్ధామ్
గోధుమపిండి... ఏముందిలే... చపాతీ, పూరీలేగా చేసేది అని చప్పరించేయకండి. అదే పిండికి కొన్ని ఆధరువులు తగిలిస్తే... చపాతీ, పూరీలు సైతం చవులూరించే కొత్త రుచులకు కేంద్రమవుతాయి. గోధుమపిండితోనే స్వీటు, దోసెల లాంటి వెరైటీలూ ఉన్నాయండోయ్! అందుకే, గోధుమలతో ధూమ్ధామ్... ఈ ఆదివారం మీ ఫ్యామిలీలో... బంగాళదుంప - కొత్తిమీర చపాతీ కావలసినవి: గోధుమ పిండి - 2 కప్పులు; బంగాళదుంపలు - 8; కొత్తిమీర - ఒక కట్ట, పచ్చి మిర్చి - 4; ఇంగువ - చిటికెడు, ఉప్పు, నెయ్యి - తగినంత తయారీ: ఒక పాత్రలో గోధుమ పిండి, ఉప్పు, నీళ్లు వేసి చపాతీ పిండిలా కలిపి పక్కన ఉంచాలి. బంగాళదుంపలను ఉడికించి తొక్క తీసి మెత్తగా చిదిమి పక్కన ఉంచాలి కొత్తిమీర , పచ్చి మిర్చి శుభ్రంగా కడిగి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ఒక పాత్రలో బంగాళదుంప మిశ్రమం, కొత్తిమీర మిశ్రమం వేసి, ఇంగువ జత చేసి బాగా కలపాలి చిన్న చిన్న ఉండలుగా చేయాలి ఒక్కో ఉండను గుండ్రంగా ఒత్తి, అందులో బంగాళదుంప మిశ్రమం ఉంచాలి. అంచులు మూసేసి, పిండి కొద్దిగా అద్దుతూ చపాతీలా ఒత్తాలి స్టౌ మీద పాన్ వేడి చేసి, ఒత్తి ఉంచుకున్న చపాతీని వేసి రెండు వైపులా నెయ్యి వేసి బాగా కాల్చి తీసేయాలి వేడివేడిగా వడ్డించాలి. గోధుమ హల్వా కావలసినవి: గోధుమ పిండి - కప్పు; పంచదార - 2 కప్పులు; మిఠాయి రంగు - చిటికెడు (కొద్దిపాటి నీళ్లలో వేసి కలిపి ఉంచాలి); ఏలకుల పొడి - పావు టీ స్పూను; నెయ్యి - తగినంత తయారీ:ఒక పాత్రలో కప్పుడు నీళ్లు, గోధుమ పిండి వేసి కలపాలి వేరొక పాత్రలో పావు కప్పు నీళ్లు, పంచదార వేసి బాగా కలపాలి. స్టౌ మీద ఈ పాత్ర ఉంచి, పంచదార కరిగేవరకు కలపాలి నీళ్లలో కలిపి ఉంచుకున్న గోధుమపిండి, మిఠాయి రంగు, ఏలకుల పొడి, నెయ్యి వేసి అడుగంటకుండా కలపాలి మిశ్రమం బాగా ఉడికిందనిపించాక, స్టౌ కట్టేయాలి పెద్ద పళ్లానికి నెయ్యి రాసి, ఉడికించుకున్న హల్వా పోసి, సమానంగా పరిచి కట్ చేసుకోవాలి. టొమాటో చీజ్ పూరీ కావలసినవి గోధుమపిండి - కప్పు మైదా పిండి - కప్పు టొమాటో రసం - కప్పుకారం - టీ స్పూను చీజ్ తురుము - కప్పు ఉప్పు - తగినంత నూనె - తగినంత తయారీ ఒక పాత్రలో పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి, చపాతీ పిండిలా కలిపి సుమారు అర గంటసేపు నాననివ్వాలి.బాణలిలో నూనె వేసి కాచాలి.పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, పూరీలా ఒత్తి, నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. పేపర్ టవల్ మీదకు తీసుకుని, వెజిటబుల్ సలాడ్తో వేడివేడిగా అందించాలి. కశ్మీరీ చపాతీ కావలసినవి: గోధుమపిండి - కప్పు, సోంపు - అర టీ స్పూను; జీలకర్ర - అర టీ స్పూను, వాము - పావు టీ స్పూను; మిరియాలు - 10, ఇంగువ - పావు టీ స్పూను; పాలు - తగినన్ని, ఉప్పు - తగినంత; నెయ్యి - కొద్దిగా తయారీ: ముందుగా బాణలిలో సోంపు, జీలకర్ర, వాము, మిరియాలను నూనె లేకుండా వేయించి, చల్లార్చి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ఒక పాత్రలో గోధుమపిండి, పొడి చేసి ఉంచుకున్న మసాలా, ఇంగువ, పాలు, ఉప్పు, తగినన్ని నీళ్లు వేసి, చపాతీ పిండిలా కలిపి పక్కన ఉంచాలి స్టౌ మీద పెనం ఉంచి వేడి చేయాలి పిండిని కొద్దిగా తీసుకుని చపాతీలా ఒత్తి, పెనం మీద వేసి రెండువైపులా నేతితో కాల్చి తీయాలి. వేడివేడిగా ఏదైనా కూరతో అందించాలి. -
పొంగేషు పూరీ... గుటకేషు గప్చుప్!
నవ్వింత: మా రాంబాబుగాడు దేన్నైనా బలంగా నమ్మాడంటే చాలు... దాన్ని నిరూపించడం కోసం ఎంతదూరమైనా వెళ్తాడు. అలాంటి వాడు అకస్మాత్తుగా పూరీల మీద పడ్డాడు. వాడు పడితే పడ్డాడు కానీ... మమ్మల్నందర్నీ పడేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అక్కడొచ్చింది ఇబ్బంది. పొద్దున్నే పూరీలు వండే ఇల్లు పూరిల్లట. చక్కటి పూరింట్లో దొరికే పూరీలూ, రుచికరమైన ఆలూఖుర్మా, రమణీప్రియ దూతిక తెచ్చి ఇచ్చు కర్పూరతాంబూలం, రకరకాల పూరీ కూరల రుచులను ఎంచే సరసులూ ఉంటే కవిత్వం ఆటోమేటిగ్గా వస్తుందంటాడు మా అల్లసాని రాంబాబు. వాడి వాదన ఎంతవరకూ వెళ్లిదంటే... ఏదైనా పద్యం తాలూకు చివరిపాదం చెప్పి మొదటి మూడు లైన్లూ నింపడాన్ని పూరించడం అని ఎందుకు అంటారంటే... పూరీలు తినడం వల్ల జ్ఞానం బాగా పెరిగి, తక్షణం ఆ లైన్లను నింపగలుగుతారట! ‘‘ఇది కరెక్ట్ కాదేమోరా?’ అంటే... ‘‘మరి వడ్డెర చండీదాస్ అనుక్షణికం నవల్లో ‘స్నానించడం’ అని రాస్తే దానికి ‘స్నానం చేయడం’ అని అర్థం ఉన్నప్పుడు సిమిలర్గా ఇదెందుకు కాకూడదు?’’ అని ఎదురుప్రశ్న వేశాడు. ‘‘ఒరే... మిద్దె ఉన్న ఇల్లు మిద్దె ఇల్లు, గడ్డితో కప్పువేసే చిన్న గుడిసె పూరిల్లు. అది గుడిసె కాబట్టి పూరి గుడిసె అని కూడ అంటార్రా’’ అంటే వినడే! ఒకవేళ గుడిసెలో పూరీలు చేస్తే దాన్ని పూరి గుడిసె అంటారని వాడు ఒక్కసారి కమిటయ్యాడట. ఇక వాడి మాట వాడే వినడట. ఈ డైలాగ్ కూడా పేరులో పూరీ ఉన్న ఫిల్మ్ డెరైక్టర్ కమ్ రైటర్ పూరీ జగన్నాథ్దట. ‘అలాంటప్పుడు మీ మాట ఎందుకు వినాల’న్నది వాడి వాదన. పూరీల రుచిని ఒకపట్టాన వదులుకోలేని ఎందరో జిహ్వాగ్రేసరులంతా దాన్ని మరవలేక భేల్పూరీ, సేవ్పూరీ, పానీపూరీ అంటూ మరెన్నో విధాలుగా తింటుంటారట. పానీపూరీని ఇతరులతో షేర్ చేసుకోడానికి వీల్లేనందువల్ల, ఒక్కరే గప్చుప్గా గుటుక్కుమనిపిస్తారు కాబట్టే దాన్ని ముద్దుగా ‘గప్చుప్’ అని కూడా అంటారట. అక్కడితో ఆగకుండా ఫక్తు సంస్కృత సూక్తుల తరహాలో అనేక కొటేషన్లూ చెప్పాడు. ‘‘పొంగేషు పూరీ, మింగేషు మిర్చీ, గుటకేషు గప్చుప్, బొక్కేషు బోండా, భోజ్యేషు బజ్జీ, కొరికేషు కోవా, నమిలేషు కిళ్లీ’’ అని... ‘‘వీటన్నింటిలోనూ పూరీలను ముందుగా ఎందుకు పెట్టాననుకుంటున్నావ్? చపాతీ పెనానికి అతక్కుపోతుంది. అదేగానీ... పూరీ మూకుడులో వేయగానే పొంగుకుంటూ పైకి తేలుతుంది. ‘మునిగి మునకలేయకు, అతికి పెనానికి కరుచుకోకు, ముడుచుకోకు, విచ్చుకో... నాలా పైకి తేలు’ అంటూ ఎందరికో స్ఫూర్తినీ, సందేశాన్నీ ఇస్తుంది పూరీ. అందుకే నా శ్లోకంలో ముందుగా దానిపేరే రాశా’’ అన్నాడు వాడు. ‘‘వదిలెయ్ రా... పొడగకపోయినా రుచిలో మార్పేమీ రాదు కదా’’ అన్నా. ‘‘అలాగని గొప్పగొప్పవాళ్లు దాన్ని వదిలేయలేదు కదా. నిజానికి వాళ్లు పూరీని తమ పేరులో పెట్టుకోవడం వల్లే న్యూమరాలజీ ప్రకారం సక్సెసయ్యారట తెలుసా?’’ అన్నాడు. ‘‘ఎవర్రావాళ్లూ?’’ అడిగా. ‘‘ఓంపూరీ, అమ్రీష్పూరీ, పద్మినీ కొల్హాపూరీ లాంటి గ్రేట్ నటులూ, హస్రత్ జైపూరీ లాంటి మహాకవులూ... వీళ్లంతా నిత్యం పూరీని స్మరిస్తూ తమ పేరులో దాన్ని భాగం చేసుకున్నవాళ్లే’’ ‘‘వాళ్ల పేరులో ఉన్నది పూరీ కాదురా... పురి... పురి...’’ అని ఆ మాట సాగకుండా పురిపెట్టి వాడు చక్కగా ఉచ్చరించేలా పురిగొల్పడానికి ప్రయత్నించా. ‘‘కొంతమందికి దీర్ఘాలు తీస్తూ మాట్లాడటం ఇష్టం ఉండదు కాబట్టి వాళ్లూ పూరీతో పాటూ, అక్కడి దీర్ఘాన్ని మింగేశారు. చాలామంది తెలుగు వాళ్లు ఆ పేర్లను పిలిచేప్పుడు ‘పూరీ’ అంటూనే పిలుస్తారు. ఉచ్చారణే నాకు ప్రామాణికం’’ అంటూ మొండికేశాడు. అక్కడితో ఆగకుండా కవిత్వానికీ, పూరీకీ మళ్లీ మరో లింకు పెట్టాడు. అదేంట్రా అంటే... ‘‘ఒకాయన భోజుడి నుంచి ఏదైనా బహుమతి పొందాలని వచ్చాట్ట. భోజరాజు ముఖం చూస్తే చాలు కవిత్వం అలా పొంగుకొచ్చేస్తుందట కదా. అలా కార్యార్థియై వచ్చిన ఆయన భోజుడి ముఖం చూడగానే కవిత్వం మరచి, బాగా ఆకలేసి పలారం అడిగాట్ట. ‘‘టిపినీ దేహి రాజేంద్ర... పూరీ కూర్మా సమన్వితం’’ అని కోరాడట. భోజుడి లెవల్కు సింపుల్గా పూరీ మాత్రమే అడగటమేమిటీ, రాజుగారు ఇవ్వడమేమిటీ అని అతడి బంగారు పాలనలో ఉన్న ప్రజలంతా కలిసి తాము మాట్లాడుకునే భాషకు భోజ-పూరీ అని పేరుపెట్టుకున్నారట. అందుకే ఉత్తరప్రదేశ్లోని పూర్వాంచల ప్రాంతాల్లోనూ, బీహార్ పశ్చిమ ఏరియాల్లోనూ, గయానా, సురినమ్, ఫిజీ, మారిషస్... దేశాల్లోనూ భోజ్పురి భాష మాట్లాడతారట. ఎందుకనీ...భోజుడి పట్ల గౌరవం, పూరీల పట్ల విపరీతమైన ప్రేమ’’ అన్నాడు వాడు. మనమెంత చెప్పినా వీడింతే అనుకొని పూరీలు తినడం పూర్తయ్యాక.. ‘పుర్రెకో వెర్రీ... జిహ్వకో పూరీ’ అంటూ నిట్టూరుస్తూ బయల్దేరాం. - యాసీన్ -
వైభవంగా పూరీ రథయాత్ర
ఊరేగింపులో పాల్గొన్న 10 లక్షల మంది భక్తులు తొలి దర్శనం చేసుకోని పూరీ శంకరాచార్య ప్రశాంతంగా సాగిన తొలిరోజు యాత్ర భువనేశ్వర్/పూరీ(ఒడిశా): ఒడిశాలోని పూరీ లో ఏటా నిర్వహించే ప్రపంచ ప్రఖ్యాత శ్రీ జగన్నాథుని రథయాత్ర ఆదివారం వైభవంగా ప్రారంభమైంది. లక్షలాది మంది భక్తుల ఆధ్యాత్మిక శోభ, కట్టుదిట్టమైన భద్రత మధ్య ఊరేగింపు తొలిరోజు ప్రశాంతంగా సాగింది. దేశ విదేశాలకు చెందిన సుమారు 10 లక్షల మంది భక్తులు రథాలపై ఊరేగుతున్న బలభద్ర, సుభద్ర, శ్రీజగన్నాథుని దర్శనం చేసుకున్నారు. బలభద్ర తాళధ్వజం, సుభద్ర దవుదళ్, శ్రీజగన్నాథుని నందిఘోష్ రథాలు సాయంత్రం సమయానికే గమ్యం చేరాయి. ఉదయం నిర్వహించిన పూజాదుల్లో సుమారు 2 గంటలపాటు జాప్యం చోటుచేసుకుంది. ప్రభుత్వం ఈ ఏడాది భక్తులు రథాలపెకైక్కి దేవతామూర్తులను స్పృశించి దర్శనం చేసుకోవడాన్ని ఆపేయడం, శిష్య బృందం లేకుండా ఒంటరిగానే రథంపైకి ఎక్కి దర్శనం చేసుకోవాలని శ్రీమందిరం అధికారులు పూరీ శంకరాచార్యులకు లేఖ పంపడంతో ఆయన కినుక వహించిన నేపథ్యంలో యాత్ర ఆలస్యంగా మొదలైంది. గోవర్ధనపీఠం శంకరాచార్యులు స్వామి నిశ్చలానంద సరస్వతి రథాలపైకి వెళ్లి దేవుళ్లను దర్శించుకుని రథ ప్రదక్షిణ చేసేందుకు నిరాకరించారు. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, జుయెల్ ఓరాం శంకరాచార్యకు నచ్చజెప్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. శ్రీమందిరం గర్భగుడి నుంచి వరుస క్రమంలో సుదర్శనుడు, బలభద్రుడు, శ్రీజగన్నాథుని విగ్రహాల్ని సింహద్వారం గుండా రథాలపైకి తరలించారు. రథాలపై దేవతామూర్తుల్ని అధిష్టించాక శంకరాచార్యులు తొలి దర్శనం చేసుకోవడం దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఆచారం. దేవుళ్ల తరలింపు తర్వాత రథాలను లాగడం ప్రారంభించారు. రాష్ట్ర గవర్నర్ డాక్టర్ ఎస్.సి. జమీర్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రులు జుయెల్ ఓరాం, ధర్మేంద్ర ప్రధాన్ వంటి ప్రముఖులు యాత్రను ప్రత్యక్షంగా తిలకించారు. ముఖ్యమంత్రి నవీన్, కేంద్ర మంత్రి జుయెల్ ఓరాం జగన్నాథుని నందిఘోష్ రథాన్ని లాగారు. రథాలు గుండిచా మందిరానికి చేరే సమయానికి చీకటి పడడంతో మూల విరాట్లను రథాలపై ఉంచి మిగిలిన సేవలు నిర్వహించారు. సోమవారం ఉదయం పూజలను రథాలపైనే పూర్తి చేసి మూల విరాట్లను గుండిచా మందిరంలోని అడపా మండపంపైకి తరలించనున్నారు. యాత్ర సందర్భంగా అవాంఛనీయ ఘటనలను నివారించేందుకు 7 వేల మంది పోలీసులను ప్రభుత్వం మోహరించింది. సీసీటీవీలు, నిఘా కెమెరాలను ఏర్పాటు చేసింది. కాగా, రథయాత్రను పురస్కరించుకొని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. రథయాత్రలో మోడీ కటౌట్ల ప్రదర్శన అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఏటా కన్నుల పండువగా జరిగే జగన్నాథ రథయాత్రలో సీఎం హోదాలో పాల్గొనే నరేంద్ర మోడీ ఈసారి ప్రధాని కావడం వల్ల పాల్గొనలేకపోయినా ఆయన అభిమానులు మాత్రం ఆ లోటును తీర్చుకున్నారు. మోడీ కటౌట్లను రథయాత్రలో ప్రదర్శించారు. ఓ వ్యక్తికి మోడీ మాస్కును ధరింపజేసి మోడీ తరహాలో హావభావాలను ప్రదర్శింపజేశారు. దీంతో ఈ యాత్రను వీక్షించేందుకు వచ్చిన ప్రజలంతా మోడీ...మోడీ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో మోడీ అత్యధికంగా 12 సార్లు పహింద్ విధి (రథమా ర్గాన్ని బంగారు చీపురుతో శుభ్రపరచడం) నిర్వహించారు. -
పూరీ జగన్నాధ రధయాత్రలు ఏర్పాట్లు
-
‘జగన్నాథుడికి’ కలప కొరత!
పూరి: ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్రకు అవసరమైన కలపకు కొరత ఏర్పడినట్టు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే మూడు రథాలతో కూడిన యాత్రకు దేశం సహా విదేశాల నుంచి యాత్రికులు హాజరవుతున్న విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జూన్ 29న ఈ రథాల తయారీ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ క్రమంలో రథాలను రూపొందించేందుకు ఆలయ వర్గాలు సమాయత్తమయ్యాయి. అయితే, వీటి కోసం వాడే ప్రధాన దుంగలకు కొరత ఏర్పడింది. ఈ అంశంపై చర్చించేందుకు రెవెన్యూ డివిజనల్ కమిషనర్ ఎస్.కె. వశిస్ట్ అధ్యక్షతన అధికారులు గురువారం భేటీ అయ్యారు. సమావేశం అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. రథ చక్రాలను రూపొందించేందుకు కనీసం 42 భారీస్థాయి దుంగలు అవసరం కాగా, ఒడిశా ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 28 దుంగలనే సరఫరా చేసిందన్నారు. ఏటా రూపొందించే రథాల కోసం వెయ్యి పైగా భారీ వృక్షాలను నరికివేయడంపై పర్యావరణ ప్రేమికులు సహా ఉద్యమ కారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
మెరిపిస్తాం..మురిపిస్తాం..
‘న్యూస్లైన్’తో విశాఖ సినీ తేజాల మాటామంతీ విశాఖ నగరానికి సినిమా పరిశ్రమకు అవినాభావ సంబంధం ఉంది. ఈ అందాల తీరం షూటింగ్లకు నుకూలమన్న విషయం తెలిసిందే. అలాగే ఎంతోమంది నటీనటులు, దర్శకులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, విలన్లు, నిర్మాతలు మన నగరం నుండి వెళ్లి తెలుగు చిత్ర పరిశ్రమను సుసంపన్నం చేశారు. వీరిలో కొంతమంది తమ న్యూ ఇయర్ కమిట్మెంట్స్ను ‘న్యూస్లైన్’కు వివరించారు. లవ్ స్టోరీతో వస్తున్నా... నర్సీపట్నం ప్రాంతానికి చెందిన దర్శకుడు పూరి జగన్నాథ్ నితిన్ హీరోగా నటిస్తున్న హార్ట్ ఎటాక్ చిత్రం షూటింగ్లో బిజీబిజీగా ఉన్నారు. ఈ చిత్రం చాలా వరకు పూర్తి కావచ్చింది. మంచి యూత్ ఫుల్ లవ్స్టోరీగా నిలుస్తుందని ఆయన చెప్పారు. జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి నెలలో హార్ట్ ఎటాక్ను విడుదల చేయనున్నామన్నారు. ఇప్పుడాయన బ్యాంకాక్లో షూటింగ్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తన దృష్టి ఈ చిత్రంపైనే ఉందని, మిగతా ప్రాజెక్టుల వివరాలు తర్వాత వెల్లడిస్తానన్నారు. ప్రేక్షకులకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ఈ ఏడాది ఎన్నో చిత్రాలు విజయవంతమై పరిశ్రమలో అందరూ ఆనందంగా ఉండాలని కోరుతున్నానన్నారు. ఈ ఏడాది కూడా విశాఖలో షూటింగ్... ఈ ఏడాది కూడా విశాఖలోనే తన తదుపరి చిత్ర షూటింగ్ జరుగుతుందని ప్రముఖ దర్శకుడు సునీల్కుమార్ రెడ్డి చెప్పారు. ఆయనకు ఈ నగరమంటే సెంటిమెంట్. హీరో, గంగపుత్రులు, రొమాంటిక్ క్రైమ్ కథ.. ఇలా తాను డెరైక్ట్ చేసిన సినిమాలు విశాఖలోనే తీశారు. తన సొంత బ్యానర్ శ్రావ్య ఫిలిమ్స్పై యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిత్రం రూపొందిస్తున్నానని, జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి తొలి వారంలో షూటింగ్ ప్రారంభిస్తానని చెప్పారు. ఇద్దరు పెద్ద హీరోలతో సినిమాలు చేయడానికి చర్చలు సాగుతున్నాయన్నారు. ప్రజలందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెబుతూ సామాజిక దృక్పథంతో సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని కోరారు. మరింత కామెడీ పండిస్తా... విశాఖ నుండి వెళ్లిన కొద్ది కామెడియన్లలో ప్రస్తుత జనరేషన్లో బాగా పాపులర్ అయిన నటుడు సుమన్ శెట్టి. పూర్ణామార్కెట్ ప్రాంతానికి చెందిన ఈ నటుడు కామెడీ పండించడంలో తనదంటూ ఓ ముద్ర వేశాడు. కొత్త సంవత్సరంలో మరి న్ని మంచి చిత్రాల్లో నటిస్తున్నానని, బెస్ట్ కామెడీ పండి స్తానని చెప్పాడు. ఈ ఏడాది ఓ స్త్రీ ప్రేమకధ, రింగ్టోన్, తనీష్ హీరోగా చేస్తున్న తమిళ, తెలుగు చిత్రాలు, వరుణ్ సందేశ్ నటిస్తున్న నాతో వస్తావా చిత్రంలో నటిస్తున్నాడు. ఈ ఏడాది నాకు చాలా ప్రత్యేకం స్టార్ మేకర్ సత్యానంద్ అంటే తెలియని వారుండరు. సుమారు 70మంది హీరోలను, 12మంది క్యారెక్టర్ నటులను, ఎనిమిదిమంది దర్శకులను, ఎందరో టీవీ ఆర్టిస్టులను అందించిన ఘనత ఆయనది. ఈ సంవత్సరం తనకు చాలా ప్రత్యేకమని సత్యానంద్ చెప్పారు. కారణం ఇరవై ఏళ్ల సినీ ప్రస్థానంలో తాను తొలిసారిగా నటిస్తున్న బిల్లారంగ చిత్రం ఈ ఏడాది విడుదలవుతోంది. దర్శకుడు సునీల్కుమార్రెడ్డి తీస్తున్న కొత్త చిత్రంలో కూడా సత్యానంద్ నటించబోతున్నారు. ఈ ఏడాది తన దృష్టి అంతా యాక్టింగ్పైనేనని చెప్పారు. నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, చిరు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ల చిత్రాలు ఈ ఏడాది రిలీజవుతున్నాయి. వీరిద్దరూ సత్యానంద్ స్కూలు నుండి వచ్చిన వారే. ఈ ఏడాది విశాఖ నుండి మరింతమంది చిత్ర పరిశ్రమకు చేరాలని కోరుతున్నానన్నారు. -
పూరి తీరంలో ప్రపంచంలో అతిపెద్ద జీసస్ విగ్రహం
ఒడిశాకు చెందిన ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ మరో అద్భుతం సృష్టించారు. క్రిస్మస్ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద జీసస్ ప్రతిమను రూపొందించారు. పూరి తీరంలో 35x75 అడుగుల ఎత్తులో విగ్రహాన్ని తయారు చేశారు. ఇందుకోసం వెయ్యి టన్నుల రంగుల మిశ్రమంతో కూడిన ఇసుకను వాడారు. పట్నాయక్ 25 మంది శిష్యులతో కలసి మూడు రోజుల్లో తయారు చేశారు. జీసస్ తో పాటు మేరీ మాత, శాంతా క్లాజ్ తో కూడిన విగ్రహం అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ నెల 24 నుంచి జనవరి 1 వరకు జీసస్ ప్రతిమను భక్తుల సందర్శనార్థం ప్రదర్శించనున్నారు. జీసస్ విగ్రహాన్ని సందర్శించేందుకు క్రైస్తవ సోదరులు అమితాసక్తి చూపుతున్నారు. పట్నాయక్ ఇంతకుముందే ఏడు ప్రపంచ రికార్డులు సృష్టించారు. తాజాగా అతిపెద్ద జీసస్ విగ్రహాన్ని గుర్తిస్తున్నట్టుగా లిమ్కా బుక్ రికార్డుల నిర్వాహకుల నుంచి ఆయనకు లేఖ అందింది. -
వర్మ, పూరిలతో సినిమాలు చేయబోతున్నాను
‘‘పోటీకి వెళ్లేటప్పుడు ఎవరైనా గెలవాలనే వెళతాం. కాకపోతే, సినిమా పరిశ్రమలో ప్రతిభతో పాటు అదృష్టం కూడా తోడవ్వాలి. అప్పుడే కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది’’ అంటున్నారు విష్ణు. నేడు ఆయన పుట్టినరోజు. మూడు పదుల వయసులో ఉన్న విష్ణు తనకు మాత్రం ఇది రెండో పుట్టినరోజు అంటున్నారు. దానికి కారణం చెబుతూ - ‘‘నా జీవితం ఇప్పుడే ప్రారంభమైనట్లుగా ఉంది. దానికి కారణం నా ఇద్దరు కూతుళ్లు ఆరియానా, వివియానా నా లైఫ్లోకి వచ్చిన ఈ రెండేళ్లల్లో ఎన్నో మంచి మార్పులు రావడమే. ఇప్పుడిప్పుడే వాళ్లకి మాటలొస్తున్నాయి. అందుకని, ‘హ్యాపీ బర్త్డే నాన్నా’ అంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక, నా జీవితంలోకి వినీ (విరానికా) వచ్చిన తర్వాత చాలా మంచి మలుపులు వచ్చాయి. ఢీ, దేనికైనా రెడీ, దూసుకెళ్తా అంటూ వరుసగా నా సినిమాలు విజయాలు సాధిస్తున్నాయి. గత ఏడాదితో పోల్చితే నా మార్కెట్ బాగా పెరిగింది. కాబట్టి చాలా ఆనందంగా ఉంది’’ అని చెప్పారు విష్ణు. ప్రస్తుతం చేస్తున్న ‘పాండవులు పాండవులు తుమ్మెదా’ గురించి చెబుతూ -‘‘నాన్నగారు, నేను, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్ చేస్తున్న పక్కా మల్టీస్టారర్ మూవీ. అందరూ అనుకుంటున్నట్లు ఇందులో నాన్న, నేను, తమ్ముడు అన్నదమ్ములుగా యాక్ట్ చేయడంలేదు. ఆ ఇద్దరికీ నేను యాంటీగా ఉంటాను. సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని తెలిపారు. రామ్గోపాల్వర్మ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారట? అనే ప్రశ్నకు -‘‘అవును. ‘నీలో మంచి కామెడీ టింజ్ ఉంది. ఒక మాస్ హీరోలో కామెడీ టింజ్ ఉండటం గొప్ప విషయం. నేను దాన్ని కాప్చర్ చేయాలనుకుంటున్నాను’ అని చెప్పారు వర్మగారు. సో... ఓ డిఫరెంట్ మూవీ చేయబోతున్నాం. అలాగే పూరీ జగన్నాథ్గారి దర్శకత్వంలో చేయబోతున్న సినిమా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది’’ అని చెప్పారు. మొదట్లో బొద్దుగా ఉండేవారు కదా... మరి ఎలా స్లిమ్ అయ్యారు? అనడిగితే -‘‘చాలామంది అమెరికా నుంచి కోచ్లను తెప్పించుకుంటారు. కానీ, దిల్సుఖ్నగర్లో సంపత్ అని నాలుగు జిమ్లున్న కోచ్ ఉన్నారు. ఈరోజు నా ఫిజిక్ ఇలా ఉందంటే దానికి కారణం ఆయనే. ఇది 30 శాతమే. ఇంకా మార్పు చూస్తారు’’ అన్నారు. -
ఫైలిన్ దెబ్బకు 'పూరి' మొత్తం ఖాళీ
ఫైలిన్ తుపాన్ ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్, ఒడిషాలోని కోస్తా తీర ప్రాంతంలో ముందు జాగ్రత్త చర్యగా లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒడిషాలోని పవిత్ర పుణ్యక్షేత్రం జగన్నాథస్వామి దేవాలయం ఉన్న పూరి పట్టణాన్ని మొత్తం ఖాలీ చేయించారు. పూరితో పాటు గంజాం, గజపతి, ఖోర్దా, జగత్సింగ్పూర్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లోని దాదాపు నాలుగు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు. యాత్రికులెవరూ పూరి జగన్నాథస్వామి దర్శనానికి వెళ్లరాదంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హోటళ్లను మూయించి వేశారు. తీరం ప్రాంతంలో గంటకు 220 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. తుపాను ఈ రోజు సాయంత్రం తీరం దాటే అవకాశముంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో 70 వేల మందిని ఇతర ప్రాంతాలకు తరలించారు. -
బుజ్జిగాడు Made in AP
-
పూరీలో కుప్పకూలిన రెండస్థుల భవనం
ఒడిశాలోని పూరీ పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున రెండు అంతస్థుల భవనం పేకమేడలా కుప్పకూలిన ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారి బాలికలు కూడా ఉన్నారని చెప్పారు. ఆ ఘటనలో ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారని తెలిపారు. వారిని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు చెప్పారు. ఆ దుర్ఘటనకు సంబంధించిన సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసు ఉన్నతాధికారులు, పురపాలక సంఘం ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఆ భవనంలోని వారంతా నిద్రిస్తుండగా ఆ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. దాదాపు శతాబ్దం క్రితం ఆ భవనం నిర్మించారని భావిస్తున్నట్లు వారు వివరించారు. కుప్పకులిన భవనం యజమానిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని, అలాగే అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వివరించారు. -
పూరీజగన్నాధున్ని దర్శించుకున్న మోడి