quash petition
-
రఘురామ ‘క్వాష్’ విచారణ వాయిదా
న్యూఢిల్లీ, సాక్షి: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ, ఆయన మనుషులు గతంలో ఇంటెలిజెన్స్కు చెందిన ఓ కానిస్టేబుల్పై దాడికి పాల్పడినందుకు కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రఘురామ వేసిన క్వాష్ పిటిషన్పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.శుక్రవారం(ఫిబ్రవరి 14) జస్టిస్ జెకె మహేశ్వరి, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. అయితే బాధితుడు ఫరూక్ భాషా తరఫున వకాలత్ దాఖలు చేయడానికి ఆయన లాయర్ సమయం కోరారు. దీంతో.. అందుకు రెండు వారాల గడువు ఇచ్చింది కోర్టు. అలాగే.. ఈ పిటిషన్పై విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.నరసాపురం ఎంపీగా ఉన్న టైంలో.. విధుల్లో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్ పోలీస్ ఫరూక్ భాషపై రఘురామ, ఆయన తనయుడు భరత్ కలిసి దాడి చేశారనే అభియోగాలు ఉన్నాయి. 2022 జులైలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో.. విధి నిర్వహణలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన కానిస్టేబుల్ ఫరూక్ను బలవంతంగా ఎత్తుకెళ్లి రఘురామ మనుషులు ఆయన నివాసంలోనే చితకబాదారు. ఆపై అనుమానితుడిగా పోలీసులకు అప్పగించారు. అయితే..రఘురామ, ఆయన మనుషులు తనను చిత్రహింసలకు గురి చేశారని ఫరూక్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో జులై 4వ తేదీన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో రఘురామ, ఆయన తనయుడు, రఘురామ పీఏ, సీఆర్పీఎఫ్ సిబ్బంది తదితరులపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో ఊరట కోసం తెలంగాణ హైకోర్టులో రఘురామ క్వాష్ వేయగా చుక్కెదురైంది. ఆ వెంటనే ఆయన సుప్రీంను ఆశ్రయించారు. -
హరీష్రావు క్వాష్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్ రావు క్వాష్ పిటిషన్పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని హరీష్ రావు.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో పిటిషన్పై నేడు విచారణ చేపట్టనున్నారు.కాగా, తన ఫోన్ ట్యాపింగ్ చేశారని చక్రాధర్ గౌడ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఫోన్ ట్యాప్ చేసి హరీశ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలో హరీష్రావు.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.పలుకుబడి ఉన్న నేత కావడంతో హరీశ్ రావు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసులు కోర్టులో అభిప్రాయపడ్డారు. ఆయనను అదుపులోకి తీసుకొని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో అదుపులోకి తీసుకొని విచారించాలని పోలీసుల కౌంటర్ దాఖలు చేశారు. ఈ అభ్యర్థనకు సంబంధించి హైకోర్టు కీలకమైన తీర్పు ఇవ్వనుంది. అవన్నీ అబద్ధారోపణలని, తనకు రాజకీయంగా నష్టం కలిగించేందుకే ఈ కేసు చేశారని హరీశ్ రావు తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఆరోపణల వల్ల తన వ్యక్తిత్వానికి, ప్రజా సేవకు మచ్చ తగలకుండా కోర్టు న్యాయం చేయాలని కోరారు. తన ఫోన్ ట్యాపింగ్కు ఎలాంటి ఆధారాలు లేవని, కేసును కొట్టివేయాలని పిటిషన్లో పేర్కొన్నారు.ఇక, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హారీష్ రావును అరెస్ట్ చేయవద్దని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. క్వాష్ పిటిషన్ కొట్టివేయాలని కోర్టును కోరారు. దీంతో, నేడు మరోసారి క్వాష్ పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టనుంది. హైకోర్టులో జరగనున్న విచారణపై రాష్ట్ర రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఈ కేసులో హైకోర్టు తీసుకునే నిర్ణయం హరీష్ రావు రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది. -
కుదరదు.. 15నే విచారణ చేపడతాం: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, సాక్షి: ఫార్ములా ఈ కార్ రేసు కేసును కొట్టేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ కార్యనిర్వహాక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు(KTR)కు ఊరట దక్కలేదు. పిటిషన్ను తక్షణ విచారణకు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం నిరాకరించింది. ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ.. కేటీఆర్ సుప్రీం కోర్టులో క్వాష్ వేశారు. అయితే ఈ పిటిషన్ను రేపు(శుక్రవారం) విచారణకు స్వీకరించాలని కేటీఆర్ తరఫు న్యాయవాది కోరారు. అయితే.. అందుకు సీజే బెంచ్ నిరాకరించింది. ఈ నెల 15వ తేదీన విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. ఈ కేసులో కేటీఆర్ గనుక సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే వేస్తే తమ వాదనలు కూడా వినాలంటూ ఏసీబీ తరఫున తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇక.. ఏసీబీ కేసును కొట్టేయాలంటూ కేటీఆర్ ఇంతకుముందు హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ ఆయనకు చుక్కెదురైంది. ఏసీబీ దర్యాప్తులో జోక్యం చేసుకోమని పేర్కొంటూ.. ఆయనకు అరెస్ట్ నుంచి రక్షణ సైతం ఇవ్వలేదు. -
సుప్రీంలో న్యాయపోరాటం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని అడ్డు పెట్టుకుని తనపై బురదచల్లేందుకు పెట్టిన అక్రమ కేసులపై పోరాడేందుకు రాజ్యాంగం, చట్టపరంగా ఉన్న హక్కు లను ఉపయోగించుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ తాను దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. అక్కడ న్యాయపోరాటం కొనసాగుతుందన్నారు.మరోవైపు 9న జరిగే ఏసీబీ విచారణకు తన న్యాయవాదులతో పాటు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బుధవారం హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. హైకోర్టు నుంచి ఉపశమనం దొరికితే ఏసీబీతో పాటు ఈ నెల 16న ఈడీ విచారణకు కూడా హాజరవుతానని ప్రకటించారు. మంగళవారం రాత్రి కేటీఆర్ బంజారాహిల్స్లోని నందినగర్ నివాసంలో పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. లొట్టపీసు కేసులో శునకానందం ‘చట్టంపై గౌరవంతో ఏసీబీ విచారణకు సోమవారం న్యాయవాదితో కలిసి వెళ్లి 45 నిమిషాలు ఎదురుచూశా. లగచర్ల కేసులో పట్నం నరేందర్రెడ్డి ఇవ్వని స్టేట్మెంట్ను కూడా ఇచ్చినట్లుగా మీడియాకు లీకులు ఇచ్చారు. దీనిని దృష్టిలో పెట్టుకుని న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలని కోరుకుంటే నా హక్కులకు భంగం వాటిల్లేలా చేశారు. న్యాయవాదుల సమక్షంలోనే ఏసీబీ విచారణ జరగాలని కోరుతూ హైకోర్టుకు వెళ్తున్నా. ఏసీబీ తప్పుడు ఎఫ్ఐఆర్ను రద్దు చేయమంటూ నేను వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేస్తే నాకు ఉరిశిక్ష వేసినట్లుగా కాంగ్రెస్ నాయకులు చంకలు గుద్దుకుంటున్నారు. బ్రోకర్లు, దొంగలకు అవినీతే కన్పిస్తుంది ఫార్ములా–ఈ వ్యవహారంలో అసెంబ్లీ సమావేశాల్లో చర్చ పెట్టకుండా సీఎం పారిపోయాడు. రేవంత్.. మొగోడైతే తన జూబ్లీహిల్స్ ప్యాలెస్లో ప్రత్యక్ష చర్చ పెట్టాలి. అవినీతిపరులు, రూ.50 లక్షల సంచులతో దొరికిన బ్రోకర్లు, దొంగలకు ప్రతి పనిలో అవినీతి కనిపిస్తుంది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా నా మీద లొట్టపీసు కేసు పెట్టి చిట్టినాయుడు పైశాచిక, శునకానందం పొందుతున్నాడు. సీఎం నోట వచ్చేది వేదవాక్కులు, సీఎం ఆఫీసు నుంచి వచ్చే లీకులు సూక్తులు కాదు. దుర్మార్గుల నుంచి చట్టపరమైన రక్షణ కోరితే కాంగ్రెస్ నేతలు ఆగమవుతున్నారు. కొందరు మంత్రులు న్యాయమూర్తుల తరహాలో శిక్షలు వేస్తున్నారు..’అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను అణాపైసా అవినీతికి పాల్పడలేదు ‘ఫార్ములా –ఈ రేస్లో అణాపైసా అవినీతి జరగలేదు. నేను అణాపైసా అవినీతికి పాల్పడలేదు. హైకోర్టు విచారణకు మాత్రమే అనుమతించింది, కుంభకోణం అని ఎక్కడా చెప్పలేదు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్, మేఘా ఇంజనీరింగ్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పేరిట రూ.4,600 కోట్లు పనులు పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి మేఘా సంస్థ ఎలక్టొరల్ బాండ్లు ఇవ్వడం క్విడ్ ప్రోకో కిందకు వస్తుందా లేదా మంత్రి పొంగులేటి చెప్పాలి.మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్కు నీటి తరలింపు, మూసీ సుందరీకరణ పనులు కూడా మేఘా సంస్థకు ఇస్తున్నట్లు సమాచారం వ చ్చిoది. ఓ కాంట్రాక్టర్ మంత్రి, ఓ బ్రోకర్ ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ రక్షణ కవచంగా నిలుస్తోందని విమర్శించారు. కేటీఆర్ నివాసానికి పార్టీ నేతలు కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, గంగుల కమలాకర్, శ్రీనివాస్గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ కవిత కూడా అక్కడికి చేరుకుని పార్టీ నేతలతో మాట్లాడారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ గుప్తా నేతృత్వంలోని బీఆర్ఎస్ లీగల్ టీమ్తో కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 35 పేజీల కోర్టు తీర్పును లీగల్టీమ్ అధ్యయనం చేయడంతో పాటు హైకోర్టులో కేటీఆర్ తరఫున వాదించిన సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ దవేతో ఫోన్లో చర్చించారు. ఏసీబీ, ఈడీ తాజా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని న్యాయవాదులు సూచించినట్లు సమాచారం. ఇంతకంటే బలంగా తిరిగి వస్తా: కేటీఆర్ ‘నా మాటలు గుర్తు పెట్టుకోండి.. ఈ ఎదురుదెబ్బ నుంచి ఇంతకంటే బలంగా తిరిగి వస్తా. మీ అబద్ధాలు నన్ను పడగొట్టలేవు. మీ విమర్శలు నా స్థాయిని తగ్గించలేవు. నా లక్ష్యాన్ని మీ చర్యలు అడ్డుకోలేవు. మీ అరుపులు, పెడ»ొబ్బలు నా గొంతు నొక్కలేవు. నేటి అడ్డంకులే రేపటి విజయానికి బాటలు వేస్తాయి. నిజం ఎప్పటికైనా గెలిచి తీరుతుంది. ప్రపంచమంతా త్వరలో దీనిని చూసి తీరుతుంది. మన న్యాయ వ్యవస్థపై నాకు అచంచల విశ్వాసం ఉంది. సత్యం కోసం నా పోరాటం కొనసాగుతుంది..’అని కేటీఆర్ ‘ఎక్స్’వేదికగా పేర్కొన్నారు. -
కేటీఆర్ కు మూడు ఆప్షన్స్!
-
కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై ఉత్కంఠ..
-
కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్, సాక్షి: ఫార్ములా ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు చుక్కెదురైంది. ఏసీబీ కేసును కొట్టేయాలని వేసిన క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఏసీబీ దర్యాప్తులో మేం జోక్యం చేసుకోం అని తీర్పు సందర్భంగా పేర్కొంది. అయితే ఆ సమయంలో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కేటీఆర్ తరఫు న్యాయవాది కోరగా.. ఆ విజ్ఞప్తిని ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదు. ఈ పిటిషన్పై ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం(Bench).. డిసెంబర్ 31న వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్ను అరెస్టు చేయవద్దని.. కావాలంటే విచారణ జరుపుకోవచ్చని దర్యాప్తు సంస్థలకు సూచించింది. మరోవైపు.. కోర్టు తీర్పు నేపథ్యంతోనే ఆయన ఇవాళ్టి ఈడీ విచారణ వాయిదా పడింది కూడా.ప్రభుత్వ వాదనలు ఇలా..ఏసీబీ తరఫున ఏజీ సుదర్శన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘‘ఎఫ్ఐఆర్ నమోదు ప్రాథమిక అంశం మాత్రమే. అందులో పేర్కొన్న అంశాలే అంతిమం కాదు. దర్యాప్తులో తేలే విషయాల ఆధారంగా సెక్షన్లు చేరుస్తారు. రెండు నెలల క్రితమే కేసు నమోదుకు నిర్ణయించారు. కేసు నమోదు కోసం గవర్నర్ నిర్ణయానికి పంపారు. గవర్నర్ ఆమోదించాకే కేసు నమోదు చేశారు. ఫార్ములా సంస్థకు డబ్బు విదేశీ కరెన్సీలో చెల్లించారు. దీంతో హెచ్ఎండీఏపై అధిక భారం పడింది. విదేశీ కరెన్సీలో చెల్లింపు కోసం ఆర్బీఐ అనుమతి తీసుకోలేదు. ఆర్థికశాఖ అనుమతి కూడా లేదు.(గవర్నర్ అనుమతి కాపీని కోర్టు అడగడంతో ఏజీ అందజేశారు.)చెల్లింపుల్లో కేటీఆర్ పాత్ర ఏంటని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. కేటీఆర్ పాత్ర ఏంటో దర్యాప్తులో తేలుతుందని ఏజీ తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు అనేది దర్యాప్తు కోసమేనని వివరించారు. కేసు పూర్తి వివరాలు అభియోగపత్రంలో ఉంటాయని, రూ.56 కోట్లకు పైగా చెల్లింపుల్లో నిబంధన ఉల్లంఘన జరిగిందని ఏజీ కోర్టు దృష్టికి తెచ్చారు.దానకిశోర్ తరఫున సీనియర్ న్యాయవాది సీపీ మోహన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పురపాలక శాఖ మంత్రి పర్యవేక్షణలోనే ఆ శాఖ అధికారులు విధులు నిర్వహిస్తారన్నారు. రేసింగ్కు సంబంధించిన చెల్లింపుల దస్త్రాన్ని అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆమోదించారని కోర్టుకు తెలిపారు. రేసింగ్ వ్యవహారంలో అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.బీఆర్ఎస్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బు చెల్లించారని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం, నేరపూరిత కుట్ర సెక్షన్లు నమోదు చేసినట్లు చెప్పారు. కేటీఆర్ తరఫు వాదనలు..‘‘అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవు. ముఖ్యంగా 13(1)(a) సెక్షన్ ఈ కేసుకు వర్తించదు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని అనేందుకు ఆధారాలు లేవు. ప్రొసీజర్ పాటించలేదనడం సరైంది కాదు. 14 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రాథమిక విచారణ కూడా లేకుండా కేసు పెట్టారు. కేవలం రాజకీయ కక్షసాధింపు కోసమే కేటీఆర్పై కేసు పెట్టారు. ఈ కేసులో ఎన్నో తప్పులు కనిపిస్తున్నాయి. కార్ రేస్ నిర్వహణకు 2022 అక్టోబరు 25న ఒప్పందం జరిగింది. సీజన్ 10 నిర్వహణకు స్పాన్సర్ వెనక్కి తగ్గారు. రేస్ నిర్వహణలో ఇబ్బందుల నివారణకే ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇబ్బందులు రాకూడదనే హెచ్ఎండీఏ చెల్లింపులు చేసింది.సీజన్-9 వల్ల దాదాపు రూ.700 కోట్ల లాభం వచ్చింది. ఆర్థికశాఖ అనుమతి లేదని ఏసీబీ అధికారులు అంటున్నారు. కార్ రేసింగ్ ఒప్పందాన్ని కొత్త ప్రభుత్వం ఉల్లంఘించింది. కొత్త ప్రభుత్వం డబ్బు చెల్లించకపోవడంతో ఒప్పందం రద్దయింది. ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యానికి కారణాలు చెప్పలేదు. సుప్రీం తీర్పుల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యం తగదు. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు ప్రాథమిక విచారణ అవసరమని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పులను ఏసీబీ అధికారులు పట్టించుకోలేదు. ప్రజాప్రతినిధిపై కేసుకు ముందు ప్రాథమిక విచారణ చేయాలి. 18న ఫిర్యాదు అందగానే.. 19న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేటీఆర్ స్పెక్యులేషన్ చేసినట్టు ఎక్కడా పేర్కొనలేదు. అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పలేదు. కానీ, అవినీతి నిరోధక చట్టం కింద కేసు పెట్టారు’’ అని కేటీఆర్ తరఫు న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు.ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు.. ఏసీబీ వాదనలనే పరిగణనలోకి తీసుకుని కేటీఆర్ క్వాష్ పిటిషన్ను కొట్టేసింది. -
కేటీఆర్ పిటిషన్..రేపే హైకోర్టు తుది తీర్పు
సాక్షి,హైదరాబాద్:ఫార్ములా-ఈ రేసుల కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్వాష్ పిటిషన్పై హైకోర్టు మంగళవారం(జనవరి7) ఉదయం తుది తీర్పివ్వనుంది. ఈ కేసులో పూర్తి వాదనలు విన్న కోర్టు తీర్పు ఇప్పటికే రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. తుది తీర్పు వచ్చేవరకు కేటీఆర్ను అరెస్ట్ చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు కూడా కోర్టు జారీ చేసింది. ఈ నేపథ్యంలో క్వాష్ పిటిషన్పై హైకోర్టు ఇవ్వనున్న తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో కేటీఆర్ ఏ1గా ఉన్నారు. హైకోర్టు ఒకవేళ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేస్తే కేటీఆర్కు శాశ్వత ఊరట లభించినట్లవుతుంది.మరోవైపు ఈ కేసులో గురువారం(జనవరి9) విచారణకు హాజరు కావాలని కేటీఆర్కు ఏసీబీ సోమవారం మళ్లీ నోటీసులిచ్చింది. సోమవారం కేసు విచారణ కోసం బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి కేటీఆర్ వెళ్లారు. న్యాయవాదిని విచారణకు అనుమతించమని పోలీసులు చెప్పడంతో కేటీఆర్ అక్కడి నుంచి వెనుతిరిగి వచ్చేశారు. ఈడీ విచారణకు రాలేను.. సమయం కావాలి: కేటీఆర్ ఫార్ములా-ఈ కేసులో మంగళవారం(జనవరి7) విచారణకు రావాలని కేటీఆర్కు ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. అయితే విచారణకు రాలేనని, తనకు సమయం కావాలని ఈడీని కేటీఆర్ కోరారు.క్వాష్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ అయినందున విచారణకు రాలేనని కేటీఆర్ సమాధానమిచ్చారు. ఇదీ చదవండి: రేవంత్ కనుసన్నల్లోనే ఏసీబీ డ్రామా -
నాపై కేసును కొట్టేయండి..
-
ఫార్ములా-ఈ కార్ కేసు..హైకోర్టులో కేటీఆర్కు ఊరట
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ-రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కేటీఆర్ను డిసెంబర్ 30 దాకా అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. అయితే ఈ కేసులో ఏసీబీ తన విచారణ కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణకు ఎవరినైనా పిలవచ్చని తెలిపింది. కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని హైకోర్టు ఆదేశించింది. కాగా, ఏసీబీ కేసుపై కేటీఆర్.. హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ వేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్లో కేటీఆర్ కోరారు. పిటిషన్పై జస్టిస్ శ్రవణ్ బెంచ్ ముందు రెండు గంటలపాటు హోరాహోరీ వాదనలు జరిగాయి. అనంతరం జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కేటీఆర్ తరపున వాదించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం ఏసీబీ తరపున వాదించిన ఏజీ సుదర్శన్రెడ్డి కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సుందరం వాదనలు..ఎన్నికల కోడ్ ఉల్లంఘనతో ఏసీబీకి ఏం సంబంధం కోడ్ ఉల్లంఘన జరిగితే ఈసీ చూసుకుంటుందినిధుల చెల్లింపునకు పీసీ యాక్ట్ వర్తించదు కేటీఆర్కు లబ్ధి జరిగిందని ఎఫ్ఐఆర్లో ఎక్కడా లేదురాజకీయ దురుద్దేశంతోనే తప్పుడు కేసులు పెట్టారు సీజన్ 9లోనే అగ్రిమెంట్ జరిగిందిసీజన్ 10కి అగ్రిమెంట్ అవసరం లేదురేస్ కోసం నిధులు చెల్లిస్తే కేటీఆర్పై కేసు ఎందుకు పెట్టారు కేటీఆర్పై ఎఫ్ఐఆర్ ఎందుకు పెట్టారో తెలియదు ప్రాథమికంగా ఎలాంటి దర్యాప్తు చేయకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చట్ట విరుద్ధంనేరం జరిగిందని తెలిసిన మూడు నెలల్లోనే కేసు రిజిస్టర్ చేయాలి 11 నెలల తర్వాత కేసు నమోదు చేశారు లలిత్ కుమార్ వర్సెస్ యూపీ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను ప్రస్తావించిన న్యాయవాది అగ్రిమెంట్ జరిగిన 14 నెలలకు కేసు పెట్టారు ఎలాంటి ఆలస్యం జరగలేదని ఎఫ్ఐఆర్లో రాశారు18న ఎంఏయూడీ సెక్రటరీ దాన కిషోర్ ఫిర్యాదు చేస్తే 19న కేసు పెట్టారుమూడో విడత నిధులు చెల్లించాలని గత ఏడాది డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి రేసులు నిర్వహించే ఎఫ్ఈవో సంస్థ లేఖ రాసిందిప్రభుత్వం నిధులు చెల్లించేందుకు నిరాకరించడంతో ఫార్ములా ఈ ఒప్పందం రద్దైందిప్రభుత్వానికి ఇష్టం లేకపోతే అవినీతి ఉన్నట్టా ఫార్ములా ఈ రేసుల వల్ల తెలంగాణకు రూ.700 కోట్ల లాభం జరిగింది పీసీ యాక్ట్లో డబ్బులు ఎవరికి వెళ్లాయో వాళ్లని నిందితులుగా చేర్చాలి కానీ ఇక్కడ డబ్బులు చేరింది ఎఫ్ఈవో సంస్థకుఎఫ్ఈవో సంస్థను ముందు నిందితుడిగా చేర్చాలి ఇది కరప్షన్ కేసు ఎలా అవుతుంది..పీసీ యాక్ట్ ఎందుకు వర్తిస్తుంది ఏసీబీ తరపున ఏజీ సుదర్శన్రెడ్డి వాదనలివే..ప్రాథమిక విచారణ జరిగాకే కేసు నమోదైందిరెండు నెలల క్రితం ఎంఏయూడీ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ ఫిర్యాదు చేశారువిచారణకు గవర్నర్ కూడా అనుమతించారుఎఫ్ఐఆర్ ద్వారానే దర్యాప్తు జరుగుతుందిప్రతి విషయం ఎఫ్ఐఆర్లో ఉండదుదర్యాప్తులో అనేక విషయాలు బహిర్గత మవుతాయికేసులో భాగస్వాములైన వారి పేర్లు దర్యాప్తులో బయటికి వస్తాయి రెండో అగ్రిమెంట్ను 2023 అక్టోబర్లోనే కుదుర్చుకున్నారుప్రభుత్వానికి అంత లాభం వస్తే స్పాన్పర్ ఎందుకు వెనక్కి వెళ్లాడుఅగ్రిమెంట్ లేకుండానే థర్డ్ పార్టీకి నిధులు పంపారు కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు పంపారుప్రజాధనం విదేశీ కంపెనీకి పంపారు రేసులో ఆర్బిట్రేషన్ను ఎఫ్ఈవో వెనక్కి తీసుకుంది ప్రభుత్వానికి ఎన్ని కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది అనేది పూర్తి దర్యాప్తు జరిగితేనే తెలుస్తుందిపిటిషనర్ సమర్పించిన సుప్రీం కోర్టు తీర్పు కాపీలు అన్నీ ట్రయల్ ముగిసిన తర్వాత ఇచ్చిన తీర్పులుఇక్కడ ఎఫ్ఐఆర్ అయ్యిందే ఇప్పుడుడబ్బులు పంపడంలో కేటీఆర్ సూత్రధారుడుగత ప్రభుత్వo లో మున్సిపల్ శాఖ కు ఆయన మంత్రిగా ఉన్నారు , పూర్తి బాధ్యత ఆయనదేప్రజా ప్రతినిధిగా ఆయన ఉన్నాడుడబ్బులు పంపాలని ఫైల్ పై సంతకం చేసింది కేటీఆర్409 సెక్షన్ వర్తిస్తుందిఅగ్రిమెంట్కు ముందే చెల్లింపులు జరిపారుఎన్నికల కోడ్ అమలులో ఉన్న టైం లో ఈ అగ్రిమెంట్ చేసుకున్నారుప్రాథమిక దర్యాప్తును గవర్నర్ దృష్టికి తీసుకెళ్తే అనుమతి ఇచ్ఛాకే ఎఫ్ఐఆర్ నమోదు చేశాండబ్బులు పంపే సమయానికి అసలు అగ్రిమెంట్ లేదు56 కోట్ల రూపాయలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు సమాచారం లేకుండానే ఎఫ్ఈవో కంపెనీకి పంపారుక్వాష్ పిటిషన్ లో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి వీలు లేదు - ఏజీపలు తీర్పు లు ప్రస్తావించిన అడ్వకేట్ జనరల్ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తరువాత రోజే క్వాష్ పిటిషన్ వేశారు..ఈ పిటిషన్ కు అర్హత లేదుకేటీఆర్ తరపు న్యాయవాది రెండోవిడత వాదనలు ఎఫ్ఐఆర్ నమోదు కు ముందే ప్రాథమిక దర్యాప్తు చేశాము అని చెబుతున్నారు, ఆల్రెడీ దర్యాప్తు చేశాక మళ్ళీ దర్యాప్తు చేయడానికి ఏం ఉంటుందిలలిత కుమారి కేస్ లో ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు ఫిర్యాదు అందిన తరువాత దర్యాప్తు చేసి మూడు నెలల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలికానీ ఇక్కడ ప్రభుత్వం ఆల్రెడీ ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసిందివిచారణ సందర్భంగా హైకోర్టు కీలక ప్రశ్నలుగవర్నర్ అనుమతి కాపీని అడిగిన హైకోర్టు కాపీని హైకోర్టుకు సమర్పించిన ఏజీ సుదర్శన్రెడ్డి గవర్నర్ అనుమతి కాపీని పరిశీలిస్తున్న హైకోర్టు కేటీఆర్పై ఉన్న అభియోగం ఏంటని ప్రశ్నించిన హైకోర్టు అంతకుముందు తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ న్యాయవాది లంచ్ మోషన్ పిటిషన్ మెన్షన్ చేశారు. జస్టిస్ లక్ష్మణ్ సెలవులో ఉండటంతో మరో బెంచ్లో మెన్షన్ చేశారు కేటీఆర్ న్యాయవాది. దీనిలో భాగంగా ముందుగా సింగిల్ బెంఛ్ జస్టిస్ శ్రవణ్ దగ్గరకు కేటీఆర్ న్యాయవాది వెళ్లగా, ఈ బెంచ్లో క్వాష్ పిటిషన్ విచారించడానికి అనుమతి లేదని ఏసీబీ కౌన్సిల్ తెలిపారు. దీంతో కేటీఆర్ న్యాయవాదులు.. సీజే కోర్టులో లoచ్ మోషన్ మెన్షన్ చేశారు. పిటిషన్పై విచారణను హైకోర్టు స్వీకరించింది. కాసేపట్లో విచారణ జరగనుంది. ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-కార్ రేసింగ్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని చేర్చారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. కేబినెట్ అనుమతి, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండానే విదేశీ కంపెనీకి రూ. 55 కోట్ల నిధులు చెల్లించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల్లో కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి, విచారణకు పిలిచే అవకాశం ఉంది. మరొకవైపు తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారుల లేఖ రాశారు. కేటీఆర్పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని ఈడీ లేఖలో కోరింది. ఎఫ్ఐఆర్ కాపీతోపాటు హెచ్ఎండీఏ అకౌంట్ నుంచి ఎంత మొత్తం బదిలీ చేశారో వివరాలను ఈడీ ఇవ్వాలని పేర్కొంది. అలాగే, దాన కిషోర్ ఫిర్యాదు కాపీ కూడా పంపించాలని కోరింది. ఇదే సమయంలో డబ్బు బదిలీలకు సంబంధించి ట్రాన్సాక్షన్లు జరిగిన తేదీల వివరాలను సైతం ఇవ్వాలని ఈడీ లేఖలో పేర్కొంది మరోవైపు.. తాజాగా కేటీఆర్ మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ.. ఈ కేసు విషయంలో నేనేమీ భయపడటం లేదు. అవినీతి జరగలేదని నిన్న మంత్రి పొన్నం చెప్పారు. ప్రొసీజర్ కరెక్ట్గా లేదని మాత్రమే పొన్నం అన్నారు. ముఖ్యమంత్రే అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారా?. మేము లీగల్గానే ముందుకు వెళ్తాం. ఔటర్ రింగ్ రోడ్ గురించి కూడా చెప్పాలి. ఓఆర్ఆర్పై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలి. సిటిలో ఉండే అధికారులు ప్రభుత్వం చెప్పినట్టు వింటారు అని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం కేసులు పెట్టాలని ముందుకుపోతే అది వాళ్ల ఇష్టం.. మేము లీగల్గా ఎదుర్కొంటామన్నారు. -
ఏపీ హైకోర్టులో సజ్జల భార్గవ్ రెడ్డి క్వాష్ పిటిషన్లపై విచారణ
-
అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్
హైదరాబాద్, సాక్షి: సంధ్య ధియేటర్ వద్ద తొక్కిసలాట కేసుకు సంబంధించి నటుడు అల్లు అర్జున్కు భారీ ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్కు వర్తించవని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో చంచల్గూడ జైలు నుంచి ఆయన విడుదల కానున్నారు. ఈ కేసులో శుక్రవారం ఉదయం అల్లు అర్జున్ను ఆయన నివాసంలో చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై వైద్యపరీక్షల అనంతరం ఆయన్ని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. ఇటు నాంపల్లి కోర్టులో.. అటు తెలంగాణ హైకోర్టులో కాసేపు వ్యవధిలో అల్లు అర్జున్ కేసులో వాదనలు జరిగాయి. అయితే నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన్ని పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. ఈలోపే.. హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్లో అల్లు అర్జున్కు ఊరట లభించింది.నాంపల్లి కోర్టులో వాదనలు ఇలా.. ‘‘ఇది అక్రమ అరెస్ట్. బీఎన్ఎస్ 105 సెక్షన్ అల్లు అర్జున్కు వర్తించదు. సినిమా చూసేందుకు ఒక నటుడికి ఎవరి అనుమతి అవసరం లేదు. సాధారణ ప్రేక్షకుడిగానే వెళ్లారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారు. అరెస్టును తిరస్కరించండి’’ అని మేజిస్ట్రేట్కు అల్లు అర్జున్ తరఫు లాయర్ కోరారు.ఈ సందర్భంగా.. 2017 నటుడు షారూఖ్ ఖాన్ గుజరాత్ పర్యటనలో చోటుచేసుకున్న అపశ్రుతి ఘటనను ప్రస్తావించారు. ‘2017లో షారూఖ్ పర్యటన సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ కేసులో షారూఖ్కు ఊరట లభించింది’ మేజిస్ట్రేట్ దృష్టికి అల్లు అర్జున్ లాయర్ తీసుకెళ్లారు. ఇది చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్.. ఇది మరీ టూమచ్!అయితే.. భద్రత కోరుతూ సంధ్య థియేటర్ యాజమాన్యం చేసిన విజ్ఞప్తిని పోలీసులు తిరస్కరించారని, అయినా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు వచ్చారని, అలా ర్యాలీగా వెళ్లడం వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసులు వాదించారు. ఈ క్రమంలో.. రెండుగంటలపాటు వాదనలు విన్న నాంపల్లి కోర్టు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్(ఈ నెల 27వ తేదీ దాకా) విధించారు. అయితే పైకోర్టులో(హైకోర్టులో) తన క్లయింట్ వేసిన క్వాష్ పిటిషన్ విచారణ జరుగుతుందని అల్లు అర్జున్ లాయర్.. మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ రిమాండ్కు ఆదేశించడంతో పోలీసులు అల్లు అర్జున్ను చంచల్గూడ జైలుకు తరలించారు.మరోవైపు.. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టేయాలని అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్పై అల్లు అర్జున్ తరఫున నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. ఇదీ చదవండి: ‘అల్లు అర్జున్ అరెస్ట్తో నాకేం సంబంధం లేదు’హైకోర్టులో వాదనలు ఇలా.. ‘‘సంచలనం కోసమే అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్, రిమాండ్ రెండూ అక్రమమే. అల్లు అర్జున్ థియేటర్కు వస్తున్నారనే సమాచారం పోలీసుల దగ్గర ఉంది. కానీ, అక్కడ తగినంత పోలీసులు లేరు. థియేటర్ వద్ద ఉన్న జనాల్ని పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. ఉన్న పోలీసులు కూడా అల్లు అర్జున్ను చూస్తూ ఉండిపోయారు. ఈ కేసు విచారణకు అల్లు అర్జున్ సహకరిస్తున్నారు. ఆయన ఎక్కడికి పారిపోవడం లేదు. మధ్యంతర బెయిల్ మంజూర చేయాలని అల్లు అర్జున్ తరఫు లాయర్ కోరారు. వాదనల సందర్భంగా.. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్కు వర్తించవని, గతంలో బండి సంజయ్ అరెస్ట్పై హైకోర్టు స్టే విధించిన విషయాన్ని లాయర్ నిరంజన్రెడ్డి ప్రస్తావించారు. ఆ సమయంలో పీపీని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నిస్తూ.. రేవతి మృతికి అల్లు అర్జున్ ఎలా కారణం అవుతారు?.సెక్షన్ 105, 118(1)లు అల్లు అర్జున్కు వర్తిస్తాయా? అని అడిగారు. 👉పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తూ.. అల్లు అర్జున్ ఓ సెలబ్రిటీ. జనాలు వస్తారని ఆయనకు తెలుసు. తొక్కిసలాటతో ఓ మహిళ ప్రాణం పోయింది. అల్లు అర్జున్ వల్లే తొక్కిసలాట జరిగింది. నేర తీవ్రతను బట్టే పోలీసులు ఈ కేసు పెట్టారు. మధ్యంతర బెయిల్ ఇవ్వదగిన కేసు ఇది కాదు. ఇది క్వాష్ పిటిషన్ మాత్రమే. ఇప్పటికే కింది కోర్టులో అల్లు అర్జున్కు రిమాండ్ విధించారు. ఆయన్ని ఈపాటికే చంచల్గూడ జైలుకు తరలించారు. కాబట్టి.. వాళ్లు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు అన్నారు.ఇదీ చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్👉ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్పై తీర్పు వెల్లడించింది. ‘‘ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్కు వర్తించవు. యాక్టర్ అయినంత మాత్రానా సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులను నిరాకరించలేం. కేవలం నటుడు కాబట్టే ఆ సెక్షన్లు ఆపాదించాలా?. మృతురాలు రేవతి కుటుంబంపై సానుభూతి ఉంది. అంతమాత్రాన నేరాన్ని ఒకరిపై రుద్దలేం. అల్లు అర్జున్కు కూడా జీవించే హక్కు ఉంది’’ అని పేర్కొంటూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఇక తీర్పు సందర్భంగా.. అర్ణబ్గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర కేసులో సుప్రీం కోర్టు తీర్పును జడ్జి ప్రస్తావించారు. వ్యక్తిగత పూచీకత్తు(రూ.50 వేలు)కింద బెయిల్ మంజూరు చేయాలంటూ చంచల్గూడ జైలు సూపరిండెంట్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
పట్నం నరేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
-
హైకోర్టు ఝలక్.. పట్నం నరేందర్ రెడ్డికి ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. లగచర్ల ఘటన తన రిమాండ్ను సవాల్ చేస్తూ నరేందర్ రెడ్డి.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తన రిమాండ్ను క్వాష్ చేయాలని ఆయన పిటిషన్ కోరారు. ఈ నేపథ్యంలో పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ను తాజాగా తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఇక, లగచర్ల ఘటనకు సంబంధించిన కేసులో నరేందర్ రెడ్డి ఏ1గా ఉన్న విషయం తెలిసిందే. నరేందర్ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. ఇదే సమయంలో పట్నం బెయిల్పై మెరిట్ ఆధారంగా వికారాబాద్ కోర్టు నిర్ణయం తీసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. -
పట్నం నరేందర్రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
సాక్షి,హైదరాబాద్:లగచర్లలో కలెక్టర్పై దాడి ఘటనలో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణను వికారాబాద్ కోర్టు వాయిదా వేసింది. కొడంగల్ మెజిస్ట్రేట్ ఇచ్చిన రిమాండ్ ఆర్డర్ను క్వాష్ చేయాలని నరేందర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు.ఈ క్వాష్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్ ఉండడంతో బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేస్తున్నట్లు వికారాబాద్ కోర్టు తెలిపింది.తదుపరి విచారణను వికారాబాద్ కోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.నరేందర్రెడ్డిని 7 రోజుల పాటు తమ కస్టడీ కి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్పై మధ్యాహ్నం విచారణ జరగనుంది.ఈ పిటిషన్పై కోర్టు వాదనలు విననుంది.మరోవైపు కొడంగల్ కోర్టు ఇచ్చిన రిమాండ్ను క్వాష్ చేయాలని నరేందర్రెడ్డి వేసిన పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణ జరగనుంది. -
పట్నం కోసం రంగంలోకి బీఆర్ఎస్ లీగల్ టీమ్.. పిటిషన్ దాఖలు
సాక్షి, హైదరాబాద్: లగచర్ల ఘటన కేసులో రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు.. నరేందర్ రెడ్డిని స్పెషల్ బ్యారక్లో ఉంచాలని కోరుతూ బీఆర్ఎస్ లీగల్ టీమ్ కోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.తెలంగాణ హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు రిమాండ్ విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్ను క్వాష్ చేయాలని ఆయన కోరారు. నిన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పట్నం నరేందర్ రెడ్డి. అయితే, ఈరోజు హైకోర్టుకు సెలవు కావటంతో సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.మరోవైపు.. నరేందర్ రెడ్డిని స్పెషల్ బ్యారక్లో ఉంచాలని కోరుతూ బీఆర్ఎస్ లీగల్ టీమ్ నేడు హౌజ్ మోషన్ పిటిషన్ వేయనున్నారు. నరేందర్ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. జైలులో ఐదుగురు నేరస్థులతో కలిపి మాజీ ఎమ్మెల్యేను ఉంచారని బీఆర్ఎస్ లీగల్ టీమ్ చెబుతోంది. ఈ క్రమంలోనే ఆయనను స్పెషల్ బ్యారక్లో ఉంచాలని కోర్టును కోరనుంది. ఇదిలా ఉండగా.. లగచర్ల ఘటనలో మరో పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని రహస్యంగా ఓ ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నారు పోలీసులు. నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు.. మరో కొంత మంది నిందితుల కోసం గాలిస్తున్నారు. -
నాపై లైంగిక వేధింపుల కేసును కొట్టేయండి
సాక్షి, అమరావతి: అత్యాచారం ఆరోపణలపై తనపై తిరుపతి తూర్పు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టకుండా ఆరోపణల్లో సత్యాలను శోధించకుండా తనపై కేసు నమోదు చేయడం సరికాదని పిటిషన్లో పేర్కొన్నారు.పోలీసులు తనపై నమోదు చేసిన కేసు సెక్షన్ 173(1)కి విరుద్ధమన్నారు. ఈ మొత్తం ఘటన ‘హనీ ట్రాప్’ గా ఆయన ఆభివర్ణించారు. జూలై, ఆగస్ట్ల్లో ఘటన జరిగిందని వరలక్ష్మి చెబుతున్నారని, అయితే ఇంత ఆలస్యంగా ఎందుకు ఫిర్యాదు చేసిందో మాత్రం చెప్పడం లేదన్నారు. బెయిల్ మంజూరు చేయండి : మాజీ ఎంపీ నందిగం సురేష్ టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి ఘటన కేసులో అరెస్టై గుంటూరు జైల్లో ఉన్న తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ ఎంపీ నందిగం సురేష్ బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. రాజకీయ కక్షతోనే తనను ఈ కేసులో ఇరికించారని తెలిపారు. 2021లో ఘటన జరిగితే రెండేళ్ల తరువాత తనపై కేసు నమోదు చేశారన్నారు. ప్రస్తుతం తాను జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నానని తెలిపారు. తనపై నమోదు చేసిన కేసులో దర్యాప్తు కూడా పూర్తయిందన్నారు. తనపై ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. తాను కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని, బెయిల్ మంజూరు సందర్భంగా ఎలాంటి షరతులు విధించినా కట్టుబడి ఉంటానని తెలిపారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు బుధవారం విచారణ జరిపే అవకాశం ఉంది. కాగా ఇదే కేసులో జైలులో ఉన్న వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు అవుతు శ్రీనివాస్రెడ్డి కూడా బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులురాష్ట్రానికి ప్రత్యేక హోదానిచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర హోం శాఖ కార్యదర్శి, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, నీతి ఆయోగ్ చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీ సులిస్తూ పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. -
సీఐడీకి స్వేచ్ఛ !..చంద్రబాబు గుండెల్లో రైళ్లు
-
రుజువైతే స్కిల్ కేసులో జీవిత ఖైదు తప్పదు
-
క్వాష్ పిటిషన్ రద్దు..షర్మిల ఎఫెక్ట్ ?
-
బాబుకు ఇది భారీ భంగపాటే!
ఢిల్లీ, సాక్షి: స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఊరట కోసం టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. సర్వోన్నత న్యాయస్థానంలో చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది. 17-ఏ విషయంలో భిన్నాభిప్రాయాలు మాత్రమే వ్యక్తం చేస్తూ సీజేఐకి పిటిషన్ను బదిలీ చేశారు ఇద్దరు న్యాయమూర్తులు. ఈ క్రమంలో ACB కోర్టు అంటే ట్రయల్ కోర్టు ఇచ్చిన రిమాండ్ను పూర్తిగా సమర్థించారు. ఇది ఏరకంగా చూసినా చంద్రబాబుకు భారీ భంగపాటే అంటున్నారు న్యాయ నిపుణులు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసు నుంచి తప్పించుకోవడం అసాధ్యం అని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చూస్తే ఎవరికైనా అర్థమవుతుందంటున్నారు న్యాయ నిపుణులు. తీర్పు విషయంలో జడ్జిలు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ చంద్రబాబు రిమాండ్ విషయంలో జోక్యం చేసుకోబోమని ఇద్దరు కూడా స్పష్టం చేయడం గమనార్హం. అరెస్ట్ అక్రమమన్న చంద్రబాబు లాయర్ హరీష్ సాల్వే వాదనను తోసిపుచ్చారు. అలాగే.. ఈ కేసులో చంద్రబాబుకి ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ చెల్లుతుందని, దర్యాప్తు కొనసాగించవచ్చని తెలిపారు. దీంతో ఈ కేసు విచారణ ముందుకు సాగేందుకు దర్యాప్తు సంస్థ సీఐడీకి మార్గం సుగమం అయ్యింది. క్వాష్ చేసేదే లే.. ఈ కేసును మొదటి నుంచి రాజకీయ కక్ష వ్యవహారంగా ప్రొజెక్ట్ చేసే యత్నం చేశారు చంద్రబాబు లాయర్లు. కానీ, కోర్టు మాత్రం ఆ వాదనతో ఏకీభవించలేదు. దీనిని రాజకీయాలకు ముడిపెట్టలేమని, ఈ కేసుకు రాజకీయ కక్షలకు సంబంధం లేదని తేల్చేసింది. ఈ కేసులో నేరం జరిగింది, నిధుల మళ్లింపు జరిగింది, విశ్వాస ఘాతుకం చోటు చేసుకుందన్న సీఐడీ వాదనను సమర్థించింది. అరెస్ట్పై అభ్యంతరాన్ని లేవనెత్తుతూ బాబు లాయర్లు కేసును క్వాష్ చేయాలన్న వాదన అసమంజసంగా తేల్చేసింది సుప్రీంకోర్టు. ఇదీ చదవండి: రిమాండ్ సబబే.. క్వాష్ చేయలేం యావజ్జీవం తప్పదా? మొత్తమ్మీద ఈ కేసులో చంద్రబాబుకు ఎలాంటి ఊరట దక్కలేదు. పైగా.. ఇప్పుడయినా గవర్నర్ అనుమతి తీసుకోవచ్చన్న సుప్రీంకోర్టు సూచనపై న్యాయనిపుణులు ఏం చెబుతున్నారంటే.. ‘‘నేరం జరిగింది, దర్యాప్తును కూడా పక్కాగా చేయమని మాత్రమే సుప్రీంకోర్టు చెబుతున్న విషయం స్పష్టమవుతోంది. ఈ కేసులో సెక్షన్ 409 కొనసాగుతుంది, నేరం రుజువయితే యావజ్జీవ ఖైదు చంద్రబాబుకు తప్పదు. అలాగే ఈ కేసులో 120B కూడా కొనసాగుతుంది. అంటే ఈ కేసులో IPC మరియు PC act (అవినీతి నిరోధక చట్టం) రెండూ కొనసాగుతాయి. బయటపడేందుకు నానా రకాల యత్నాలు చేశారు: ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు నాయుడు సాంకేతిక కోణాలు వెతికినా లాభం లేకపోయిందని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంటున్నారు. "సుప్రీంకోర్టులో ఇవాళ్టి పరిణామాలను స్వాగతిస్తున్నాం. చంద్రబాబు పెట్టుకున్న పిటిషన్ను సుప్రీంకోర్టు ఎక్కడా అనుమతించలేదు. తనను అరెస్ట్ చేస్తారా? అంటూ ఊగిపోయారు. అసలు చంద్రబాబు మీద కేసేంటీ అని ఎల్లో మీడియా ఉదరగొట్టింది. రాజకీయ కక్ష అంటూ చంద్రబాబు చేసిన వాదనను సుప్రీంకోర్టు తీసిపుచ్చింది. నేరం బయటపడేసరికి గవర్నర్ అనుమతి అంటూ సాంకేతిక కోణాలు వెతికారు. కొన్ని అబద్దాలను ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని చంద్రబాబు ప్రచారం చేయించారు. ఇన్నాళ్లు చేసిన విష ప్రచారం తప్పని తేలిపోయింది, గోబెల్స్ ప్రచారానికి అడ్డుకట్ట పడింది" అని ఏఏజీ పొన్నవోలు అన్నారు. స్కిల్ స్కాంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు చంద్రబాబు అరెస్టు, రిమాండ్ విషయంలో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు అవినీతి నిరోధక కేసుల్లో గవర్నర్ అనుమతి అవసరం అన్న జస్టిస్ అనిరుద్ధ బోస్ అయితే ఐపీసీ సెక్షన్ల నమోదు చేసిన అభియోగాలు కొనసాగుతాయని స్పష్టం చేసిన జస్టిస్ బోస్ గవర్నర్ అనుమతి తీసుకొని అవినీతి నిరోధక చట్టం కూడా అమలు చేయవచ్చన్న జస్టిస్ బోస్ జస్టిస్ అనిరుద్ధ బోస్ అభిప్రాయంతో విభేధించిన జస్టిస్ బేలా త్రివేది చంద్రబాబు కేసులో 17ఏ అవసరం లేదు, అది వర్తించదన్న జస్టిస్ బేలా త్రివేది స్కిల్ స్కాంలో చంద్రబాబును ఐపీసీ, పీసీ యాక్ట్ రెండింటి ప్రకారం విచారించాల్సిందే అన్న జస్టిస్ బేలా త్రివేది భిన్న అభిప్రాయాల నేపధ్యంలో కేవలం 17ఏ వర్తిస్తుందా లేదా అనే విషయాన్ని తేల్చడానికి… సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు నివేదన చంద్రబాబు అరెస్టు, రిమాండ్ సమర్ధించిన ఇద్దరు న్యాయమూర్తులు… చంద్రబాబుకు ఊరట ఇవ్వడానికి నిరాకణ చంద్రబాబు అరెస్టు విషయంలో సీఐడీ తీసుకున్న నిర్ణయాలను సమర్ధించిన ఇద్దరు న్యాయమూర్తులు రిమాండ్ విషయంలో ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని పూర్తిగా సమర్ధించిన ఇద్దరు న్యాయమూర్తులు చంద్రబాబు అరెస్టు విషయంలో ఎలాంటి రాజకీయ కక్ష్య సాధింపు లేదని స్పష్టం చేసిన ఇద్దరు న్యాయమూర్తులు చంద్రబాబు అరెస్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదని ఇద్దరు న్యాయమూర్తుల స్పష్టీకరణ స్కిల్ స్కాం కేసులో సీఏం హోదాలో చంద్రబాబు అవినీతి, నమ్మక ద్రోహం పాల్పడినట్లు తీవ్రమైన అభియోగాలున్నాయన్న ఇద్దరు న్యాయమూర్తులు చంద్రబాబు అరెస్టు, రిమాండ్ విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయం చట్ట ప్రకారమే ఉందన్న ఇద్దరు న్యాయమూర్తులు 17ఏ వర్తింపు విషయంలో ఒక న్యాయమూర్తి అనుకూలంగా మరో న్యాయమూర్తి వ్యతిరేకమైన అభిప్రాయం చంద్రబాబుపై ఉన్న అభియోగాలను కొట్టేసేందుకు నిరాకరించిన ఇద్దరు న్యాయమూర్తులు గవర్నర్ అనుమతి తీసుకుని పీసీ యాక్ట్లో సైతం విచారణ చేయవచ్చన్న జస్టిస్ అనిరుద్ధ బోస్ రాజకీయ కక్ష్య సాధింపు అని చంద్రబాబు చేసిన ఆరోపణలను కొట్టి పారేసిన ఇద్దరు న్యాయమూర్తులు ఎలాంటి ఆధారాలు లేవన్న చంద్రబాబు వాదనను తొసిపుచ్చిన ఇద్దరు న్యాయమూర్తులు స్కిల్ స్కాంలో సెక్షన్ 409 ప్రకారం చంద్రబాబును విచారించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ సెక్షన్ 409 ప్రకారం నేరం రుజువైతే చంద్రబాబుకు జీవితఖైదు శిక్షపడే అవకాశం సెక్షన్ 409ను కొట్టేయాలని చంద్రబాబు చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఇద్దరు న్యాయమూర్తులు సెక్షన్ 120బీ కొనసాగుతుందని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు సెక్షన్ 10బీ ప్రకారం నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని చంద్రబాబుపై పెట్టిన అభియోగాలను కొట్టేయడానికి నిరాకరించిన ఇద్దరు న్యాయమూర్తులు చంద్రబాబుపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేసేందుకు నిరాకరించిన ఇద్దరు న్యాయమూర్తులు చంద్రబాబును విచారించేందుకు పూర్తి ఆధారాలున్నాయని అభిప్రాయపడ్డ సుప్రీంకోర్టు స్కిల్ స్కాంలో చంద్రబాబును విచారించేందుకు ఏసీబీ కోర్టుకు విచారణ పరిధి ఉందని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించడం సబబే అన్న ఇద్దరు న్యాయమూర్తులు -
స్కిల్ కేసులో సుప్రీంలో ఎదురుదెబ్బ.. జైలుకు చంద్రబాబు.. అప్పుడు జరిగింది ఇదే (ఫొటోలు)
-
CBN: రిమాండ్ సబబే.. కేసు కొట్టేయలేం
ఢిల్లీ, సాక్షి: స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి ఊరట దక్కలేదు. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులు వెలువరిచింది. ఈ క్రమంలో.. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనానికి బాబు క్వాష్ పిటిషన్ను బదిలీ చేసింది. అయితే ఇద్దరు న్యాయమూర్తులు కూడా రిమాండ్ కొట్టేయలేమని చెప్పడం చంద్రబాబుకు భారీ షాక్ లాంటిది. రిమాండ్ విధించే అధికారం ట్రయల్ కోర్టు అంటే విజయవాడలోని ACB కోర్టుకు పూర్తిగా ఉందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. తీర్పు ఎలా వెలువరించారంటే.. తీర్పులో 17-ఏ వర్తింపుపై ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలు వెల్లడించారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు అవినీతి నిరోధక శాఖలోని సెక్షన్ 17-ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధబోస్ తీర్పు ఇవ్వగా.. 17-ఏ వర్తించదని జస్టిస్ బేలా ఎం.త్రివేది తీర్పు ప్రకటించారు. ముందుగా జస్టిస్ బోస్ తీర్పు చదువుతూ.. "ఈ కేసులో 17ఏ వర్తిస్తుంది. చంద్రబాబు కేసులో విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సింది. గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్ట్కు వర్తింపజేయరాదు. అయినా చంద్రబాబుకు విధించిన రిమాండ్ ఆర్డర్ను కొట్టేయలేం. అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ ఆర్డర్ నిర్వీర్యం కాదు." అని జస్టిస్ బోసు తీర్పు ఇచ్చారు. జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఈ తీర్పుతో విభేదించారు. ‘‘ఈ కేసులో చంద్రబాబుకు 17-ఏ వర్తించదు. 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్ చేయలేం. 2018లో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించినది మాత్రమే. అవినీతి నిరోధక చట్టానికి 17ఏను ముడిపెట్టలేం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి 17ఏ రక్షణగా ఉండకూడదు. అవినీతి నిరోధక చట్టంలో ఇచ్చిన మినహాయింపు కేవలం ఉద్యోగులు కక్ష్యసాధింపుకు గురి కావద్దని మాత్రమే’’ అని జస్టిస్ త్రివేది తీర్పు ఇచ్చారు. మొదటి తీర్పు : జస్టిస్ బోస్ ఏమన్నారంటే.. ఈ కేసులో 17ఏ వర్తిస్తుంది చంద్రబాబు కేసులో విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సింది గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్ట్కు వర్తింపజేయరాదు చంద్రబాబు కేసులో 13(1)(c), 13(1)(d), 13(2) వర్తించవు అయినా చంద్రబాబుకు విధించిన రిమాండ్ ఆర్డర్ను కొట్టేయలేం కేవలం అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ ఆర్డర్ నిర్వీర్యం కాదు రిమాండ్ రిపోర్ట్ను కొట్టేయాలని గానీ, చెల్లుబాటు కాదని గానీ చెప్పలేం, రిమాండ్ చెల్లుతుంది, కొనసాగుతుంది రెండో తీర్పు : జస్టిస్ బేలా త్రివేది ఏమన్నారంటే.. అసలు ఈ కేసులో చంద్రబాబు పిటిషన్కు ఏ రకంగా 17ఏ వర్తించదు 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్ చేయలేం పాత కేసులకు 17ఏ వర్తించదు, సవరణ వచ్చిన తర్వాత జరిగిన నేరాలకు మాత్రమే సెక్షన్ వర్తిస్తుంది.. కానీ చంద్రబాబు కేసుకు వర్తించదు 2018లో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించినది మాత్రమే అవినీతి నిరోధక చట్టం కింద నమోదయిన ఈ కేసును 17ఏకి ముడిపెట్టి ఊరట ఇవ్వలేం అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి 17ఏ రక్షణగా ఉండకూడదు అవినీతి నిరోధక చట్టంలో ఇచ్చిన మినహాయింపు కేవలం ఉద్యోగులు కక్ష్యసాధింపుకు గురి కావద్దని మాత్రమే గవర్నర్ అనుమతి లేదనే కారణంతో FIRను క్వాష్ చేయడం కుదరదు ట్రయల్ కోర్టు (ACB కోర్టు, విజయవాడ) ఇచ్చిన రిమాండ్ పూర్తిగా సబబే దర్యాప్తు కొనసాగించవచ్చు, ఛార్జ్షీట్ దాఖలు చేయవచ్చు, న్యాయప్రక్రియ కంటిన్యూ అవుతుంది ఇలాంటి కేసుల్లో 17ఏను అంగీకరిస్తే.. మొత్తం న్యాయప్రక్రియ అపహస్యం అవుతుంది పెండింగ్లో ఉన్న అన్ని కేసులకు ఇదే వర్తిస్తుందన్న వాదన మొదలవుతుంది అసలు 17ఏ వర్తించాలన్న వాదనే సరికాదు, దీని పర్యవసానాలు ఊహించనంత ఇబ్బందికర పరిస్థితులు తీసుకువస్తాయి దర్యాప్తు అధికారులకు పూర్తి అధికారాలున్నాయి, అవినీతి నిరోధక చట్టం కింద విచారణ కొనసాగించడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు నిజాయితీపరుల రక్షణ కోసమే ఈ సవరణ తీసుకొచ్చామన్నది పార్లమెంట్ చర్చల సారాంశం ఇప్పటి వరకు సుప్రీం కోర్టులో ఎప్పుడెప్పుడు ఏం జరిగిందంటే..! సెప్టెంబర్ 22వ తేదీన ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేత.. సెప్టెంబర్ 23వ తేదీన సుప్రీంలో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ సెప్టెంబర్ 25వ తేదీన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందుకు బాబు క్వాష్ పిటిషన్ 26న సంబంధిత న్యాయమూర్తులు రాజ్యాంగ ధర్మాసనం విచారణలో ఉన్నందున మరుసటి రోజుకి వాయిదా జస్టిస్ సంజీవ్ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్ల ధర్మాసనం ముందుకు సెప్టెంబర్ 27వ తేదీన బాబు క్వాష్ పిటిషన్ ధర్మాసనం నుంచి వైదొలగిన జస్టిస్ భట్ మరోసారి సీజేఐ చంద్రచూడ్ ముందుకు పిటిషన్ అక్టోబర్ 3న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు బాబు పిటిషన్ అక్టోబర్ 9,10,13వ తేదీల్లో వాడీవేడిగా సాగిన వాదనలు అక్టోబర్ 13వ స్కిల్ పిటిషన్కు తోడైన ఫైబర్ గ్రిడ్ కేసు పిటిషన్ స్కిల్, ఫైబర్ గ్రిడ్ పిటిషన్లను అక్టోబర్ 17వ తేదీకి వాయిదా వేసిన సుప్రీం బెంచ్ అక్టోబర్ 17వ తేదీన పిటిషన్పై తీర్పు రిజర్వ్ నవంబర్ 9వ తేదీన ఫైబర్ గ్రిడ్ పిటిషన్పై విచారణ చేస్తామని చెబుతూ.. అంతకు ముందే స్కిల్ కేసు తీర్పు వెల్లడిస్తామన్న బెంచ్ దసరా, దీపావళి సెలవుల దృష్ట్యా విచారణ వాయిదా అక్టోబర్ 31వ తేదీన షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మీద బయటకు మొత్తం 52 రోజులపాటు జైల్లో చంద్రబాబు.. మధ్యలో సీఐడీ కస్టడీ విచారణ నవంబర్ 20వ తేదీన క్వాష్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ అదే తేదీన పలు షరతులతో బాబుకి రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన ఏపీ హైకోర్టు ఇవాళ వెలువడ్డ రెండు తీర్పులు -
జడ్జిమెంట్ డే: స్కిల్ కేసులో ఏం జరగబోతోంది?
సాక్షి, ఢిల్లీ: ఏపీ రాజకీయ వర్గాలు స్కిల్ కేసులో నేటి సుప్రీం కోర్టు తీర్పు కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో తాను తప్పు చేయలేదని చెప్పలేకపోతున్న చంద్రబాబు.. తన అరెస్ట్ చెల్లదని, తనపై సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టేయాలంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వాడీవేడిగా వాదనలు జరిగిన ఈ క్వాష్ పిటిషన్పై ఇవాళ మధ్యాహ్నాం తీర్పు వెలువడనుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన స్కిల్ కేసును కొట్టేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. అదే సమయంలో ఆయనపై ఫైబర్నెట్ కేసు నమోదు కాగా ఈ కేసులోనూ సుప్రీంను ఆశ్రయించారు ఆయన తరఫు లాయర్లు. అయితే.. స్కిల్ కేసు క్వాష్ పిటిషన్పై తీర్పు వెల్లడించిన తర్వాతే.. ఫైబర్నెట్ కేసు పిటిషన్ విచారణ చేపడతామని బెంచ్ చంద్రబాబు లాయర్లకు స్పష్టం చేసింది. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన కేసు కూడా పెండింగ్లో ఉంది. ఈ రెండు కేసుల విచారణ ఈ నెల 17, 19వ తేదీల్లో విచారణకు రానున్నాయి. దీంతో.. ఇవాళే 17-ఏ పిటిషన్పై తీర్పును సర్వోన్నత న్యాయస్థానం వెలువరించనుంది. వాడీవేడీ వాదనలు ఇవే.. స్కిల్ కేసులో సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి కోర్టుల్లో వరుసగా ఆయనకు ఎదురు దెబ్బలు తగులుతూ వచ్చాయి. ఈ క్రమంలో ఏపీ హైకోర్టు తన క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో ఆ మరుసటిరోజు సెప్టెంబర్ 23వ తేదీన సుప్రీంలో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. ఈ కేసులో తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంటూ అభ్యర్థించారాయన. అక్కడ సుదీర్ఘమైన వాదనలే జరిగాయి. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, ఆయనకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ(అరెస్టుకు గవర్నర్ అనుమతి అవసరం) వర్తిస్తుందని ఆయన తరఫు లాయర్లు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా, అభిషేక్ మను సింఘ్వీలు వాదించారు. ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఇది రాజకీయ కక్ష చర్యగా వాదించారు. అయితే.. స్కిల్ స్కామ్ జరిగిన 2015-16 సమయంలో.. అంటే నేరం జరిగిన సమయంలో 17ఏ సెక్షన్ లేదని, పైగా నిజాయితీగల ప్రజాప్రతినిధులకు మాత్రమే ఈ సెక్షన్ వర్తిస్తుందని.. చంద్రబాబుకి ఈ సెక్షన్ వర్తించదని ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ, రంజిత్కుమార్లు వాదించారు. ఈ కేసులో నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, అరెస్ట్ చేసిన ఐదు రోజులకే క్వాష్ పిటిషన్ వేయడం అత్యంత తొందరపాటు చర్య అని, కేసు ట్రయల్ దశలో ఉన్నప్పుడు సెక్షన్ 482 ద్వారా క్వాష్ కోరడం సరికాదని సీఐడీ తరఫున వాదించారు . ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. చంద్రబాబు తరఫు లాయర్ల విజ్ఞప్తులు.. వరుస సెలవుల నేపథ్యంలో వాయిదా పడుతూ వస్తున్న తీర్పును ఇవాళ వెల్లడించనున్నారు. ఏపీ సీఐడీ అభియోగాలు.. అరెస్ట్.. రిలీజ్ టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.371 కోట్లు కొల్లగొట్టిన వ్యవహారమే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట కుట్రపూరితంగా భారీ అవినీతికి పాల్పడినట్లు చంద్రబాబుపై అభియోగాలు నమోదు చేసింది నేర పరిశోధన విభాగం(CID). చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామంటూ ఘరానా మోసానికి పాల్పడ్డారని, షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల కుంభకోణం జరిగిందనేది సీఐడీ అభియోగం. డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర ఏజెన్సీల గుర్తింపుతో వెలుగులోకి రాగా, 2017-2018లో నకిలీ ఇన్వాయిస్లతో అవినీతి బాగోతం బయటపడింది. అయితే అప్పటికే జీఎస్టీ అధికారులు అప్రమత్తం చేసినా.. అప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబే కాబట్టి పట్టించుకోలేదు. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే ప్రధాన సూత్రధారి, లబ్ధిదారు అని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరిన బ్యాంకు స్టేట్మెంట్లు, రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించింది. మరోవైపు ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురిని అరెస్ట్ చేసింది కూడా. ఈ కేసులో సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసింది. చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు అయ్యాయి. సీఆర్పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలోని అవినీతి నిరోధక న్యాయస్థానం(ఏసీబీ కోర్టు) కోర్టులో ప్రవేశపెట్టాగా.. జ్యూడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు పలుమార్లు పొడిగించుకుంటూ వెళ్లింది. చివరకు 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకి కంటి సర్జరీ, చికిత్స లాంటి కారణాల విజ్ఞప్తి దృష్ట్యా.. మానవతా దృక్ఫథంతో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆపై.. హైకోర్టులోనే రెగ్యులర్ బెయిల్ మంజూరు అయ్యింది. -
టీడీపీ-జనసేన శ్రేణుల్లో నరాలు తెగే ఉత్కంఠ
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీ రాజకీయాల్లో రోజుకో మలుపు చోటుచేసుకుంటోంది. ఇక పొత్తులో ఉన్న టీడీపీ జనసేన శ్రేణులు రేపటి కోసం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై మంగళవారం జడ్జిమెంట్ రానుంది. జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం మధ్యాహ్నాం తీర్పు వెల్లడించనుంది. స్కిల్ స్కామ్లో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ నెల 16న(రేపు) తీర్పు వెలువరించనుంది. ఈ క్వాష్ పిటిషన్పై తీర్పు వెల్లడించిన తర్వాతే.. ఫైబర్నెట్ కేసు పిటిషన్ విచారణ చేపడతామని బెంచ్ చంద్రబాబు లాయర్లకు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన కేసు కూడా పెండింగ్లో ఉంది. ఈ రెండు కేసుల విచారణ ఈ నెల 17, 19వ తేదీల్లో విచారణకు రానుంది. దీంతో.. ఈలోపే 17-ఏ పిటిషన్పై తీర్పును సర్వోన్నత న్యాయస్థానం వెలువరించనుంది. అంత త్వరగా క్వాష్ కోరడమా? ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట కుట్రపూరితంగా భారీ అవినీతికి పాల్పడినట్లు చంద్రబాబుపై అభియోగాలు నమోదు చేసింది నేర పరిశోధన విభాగం(CID). ఈ కేసులో సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసింది. విజయవాడలోని అవినీతి నిరోధక న్యాయస్థానం(ఏసీబీ కోర్టు) కోర్టులో ప్రవేశపెట్టాగా.. జ్యూడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు పలుమార్లు పొడిగించుకుంటూ వెళ్లింది. చివరకు 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకి కంటి సర్జరీ, చికిత్స లాంటి కారణాల విజ్ఞప్తి దృష్ట్యా.. మానవతా దృక్ఫథంతో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆపై.. హైకోర్టులోనే రెగ్యులర్ బెయిల్ మంజూరు అయ్యింది. అయితే.. ఈ మధ్యలో స్కిల్ కేసులో తనపై సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని చంద్రబాబు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ, జస్టిస్ శ్రీనివాసరెడ్డి పిటిషన్ కొట్టేయడంతో బాబుకు ఉన్నతన్యాయస్థానంలో చుక్కెదురైంది. ఆ వెంటనే చంద్రబాబు ఆలస్యం చేయకుండా వెంటనే సుప్రీం కోర్టులో తన లాయర్లతో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయించారు. తన అరెస్ట్ అక్రమమని, సీఐడీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని క్వాష్ పిటిషన్ ద్వారా సుప్రీంను అభ్యర్థించారాయన. అక్కడ సుదీర్ఘమైన వాదనలే జరిగాయి. ఇదీ చదవండి: స్కిల్ స్కాం.. అంతా బాబుగారి కనికట్టు చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, ఆయనకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ(అరెస్టుకు గవర్నర్ అనుమతి అవసరం) వర్తిస్తుందని ఆయన తరఫు లాయర్లు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా, అభిషేక్ మను సింఘ్వీలు వాదించారు. ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఇది రాజకీయ కక్ష చర్యగా వాదించారు వాళ్లంతా. అయితే.. స్కిల్ స్కామ్ జరిగిన 2015-16 సమయంలో.. అంటే నేరం జరిగిన సమయంలో 17ఏ సెక్షన్ లేదని, పైగా నిజాయితీగల ప్రజాప్రతినిధులకు మాత్రమే ఈ సెక్షన్ వర్తిస్తుందని.. చంద్రబాబుకి ఈ సెక్షన్ వర్తించదని ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ, రంజిత్కుమార్లు వాదించారు. ఈ కేసులో నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, అరెస్ట్ చేసిన ఐదు రోజులకే క్వాష్ పిటిషన్ వేయడం అత్యంత తొందరపాటు చర్య అని, కేసు ట్రయల్ దశలో ఉన్నప్పుడు సెక్షన్ 482 ద్వారా క్వాష్ కోరడం సరికాదని సీఐడీ తరఫున వాదించారు . క్వాష్ పిటిషన్.. ఎప్పుడేం జరిగిందంటే.. సెప్టెంబర్ 9వ తేదీన ఉదయం నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు.. ఆపై ఐదుసార్లు రిమాండ్ పొడిగింపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్నేహా బ్లాక్లో ఖైదీ నంబర్ 7691గా చంద్రబాబు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ సెప్టెంబర్ 13వ తేదీ విచారణకు స్వీకరించిన హైకోర్టు సెప్టెంబర్ 19వ తేదీన వాదనలు వినిపించిన బాబు లాయర్లు హరీశ్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా.. సీఐడీ తరఫున వాదించిన ముకుల్ రోహత్గీ సెప్టెంబర్ 22వ తేదీన.. స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ను కొట్టేసిన ఏపీ హైకోర్టు క్వాష్పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సెప్టెంబర్ 23వ తేదీన సుప్రీంలో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ సెప్టెంబర్ 25వ తేదీన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందుకు బాబు క్వాష్ పిటిషన్.. మర్నాడు మెన్షన్ చేయాలన్న సీజేఐ 26న సంబంధిత న్యాయమూర్తులు రాజ్యాంగ ధర్మాసనం విచారణలో ఉన్నందున మరుసటి రోజుకి వాయిదా జస్టిస్ సంజీవ్ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్ల ధర్మాసనం ముందుకు సెప్టెంబర్ 27వ తేదీన బాబు క్వాష్ పిటిషన్ ట్విస్ట్ ఇస్తూ.. ధర్మాసనం నుంచి వైదొలగిన జస్టిస్ భట్ మరోసారి సీజేఐ చంద్రచూడ్ ముందుకు అత్యవసరంగా తీసుకెళ్లిన బాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా అక్టోబర్ 3వ తేదీకి చంద్రబాబు క్వాష్ పిటిషన్ వాయిదా అక్టోబర్ 3వ తేదీన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు బాబు పిటిషన్ అక్టోబర్ 9,10,13వ తేదీల్లో వాడీవేడిగా సాగిన వాదనలు అక్టోబర్ 13వ స్కిల్ పిటిషన్కు తోడైన ఫైబర్ గ్రిడ్ కేసు పిటిషన్ స్కిల్, ఫైబర్ గ్రిడ్ పిటిషన్లను అక్టోబర్ 17వ తేదీకి వాయిదా వేసిన సుప్రీం బెంచ్ అక్టోబర్ 17వ తేదీన పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం బెంచ్ నవంబర్ 9వ తేదీన ఫైబర్ గ్రిడ్ పిటిషన్పై విచారణ చేస్తామని చెబుతూ.. అంతకు ముందే స్కిల్ కేసు తీర్పు వెల్లడిస్తామని దసరా, దీపావళి సెలవుల దృష్ట్యా విచారణ వాయిదా అక్టోబర్ 31వ తేదీన షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మీద బయటకు మొత్తం 52 రోజులపాటు జైల్లో చంద్రబాబు.. మధ్యలో సీఐడీ కస్టడీ విచారణ నవంబర్ 20వ తేదీన క్వాష్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం బెంచ్ అదే తేదీన పలు షరతులతో బాబుకి రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన ఏపీ హైకోర్టు శీతాకాల సెలవుల వల్ల వాయిదా పడుతూ వచ్చిన స్కిల్ కేసు తీర్పు ఎట్టకేలకు ఈనెల 16న వెలువడనున్న తీర్పు జరిగింది ఇదే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.371 కోట్లు కొల్లగొట్టిన వ్యవహారమే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామంటూ ఘరానా మోసానికి పాల్పడ్డారని, షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర ఏజెన్సీల గుర్తింపుతో వెలుగులోకి రాగా, 2017-2018లో నకిలీ ఇన్వాయిస్లతో అవినీతి బాగోతం బయటపడింది. అయితే అప్పటికే జీఎస్టీ అధికారులు అప్రమత్తం చేసినా.. అప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబే కాబట్టి పట్టించుకోలేదు. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే ప్రధాన సూత్రధారి, లబ్ధిదారు అని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరిన బ్యాంకు స్టేట్మెంట్లు, రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించింది. మరోవైపు ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురిని అరెస్ట్ చేసింది కూడా. ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడి ఉన్నారు. చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు అయ్యాయి. సీఆర్పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. -
స్కిల్ స్కాం కేసులో నేడు అత్యంత కీలకం?!
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ స్కిల్డెవలప్మెంట్ కుంభకోణం కేసులో నేడు అత్యంత కీలక పరిణామం చోటు చేసుకోనుందా?. ఈ కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై బుధవారం సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసులోనే చంద్రబాబును ఏపీ నేర దర్యాప్తు విభాగం (క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్-సీఐడీ) అరెస్ట్ చేసింది. సెప్టెంబర్ 09వ తేదీ నుంచి 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చివరకు.. ఆరోగ్య కారణాల దృష్ట్యా ఏపీ హైకోర్టు ఈ కేసులో నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే ఈ కేసులో తనపై సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని చంద్రబాబు తొలుత ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అక్కడ ఆయనకు చుక్కెదురైంది. ఆ వెంటనే చంద్రబాబు ఆలస్యం చేయకుండా వెంటనే సుప్రీం కోర్టులో తన లాయర్లతో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయించారు. తన అరెస్ట్ అక్రమమని, సీఐడీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని క్వాష్ పిటిషన్ ద్వారా సుప్రీంను అభ్యర్థించారాయన. అయితే అప్పటికే స్కిల్ కేసు కీలక దర్యాప్తు దశలో ఉండడంతో.. ఆ పిటిషన్ను సుప్రీం విచారణకు స్వీకరిస్తుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. చివరకు ఉత్కంఠకు తెర దించుతూ ఆ పిటిషన్ను విచారణకు చేపట్టింది ద్విసభ్య ధర్మాసనం. క్వాష్ పిటిషన్పై విచారణ సమయంలో.. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, ఆయనకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ(అరెస్టుకు గవర్నర్ అనుమతి అవసరం) వర్తిస్తుందని ఆయన తరఫు లాయర్లు వాదించారు. ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఇది రాజకీయ కక్ష చర్యగా వాదించారాయన. అయితే.. స్కిల్ స్కామ్ జరిగిన 2015-16 సమయంలో.. అంటే నేరం జరిగిన సమయంలో 17ఏ సెక్షన్ లేదని, పైగా నిజాయితీగల ప్రజాప్రతినిధులకు మాత్రమే ఈ సెక్షన్ వర్తిస్తుందని.. చంద్రబాబుకి ఈ సెక్షన్ వర్తించదని ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదించారు. ఈ కేసులో నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, అరెస్ట్ చేసిన ఐదు రోజులకే క్వాష్ పిటిషన్ వేయడం అత్యంత తొందరపాటు చర్య అని, కేసు ట్రయల్ దశలో ఉన్నప్పుడు సెక్షన్ 482 ద్వారా క్వాష్ కోరడం సరికాదని రోహత్గీ వాదించారు. ఇదీ చదవండి: స్కిల్ స్కాం.. అంతా బాబుగారి కనికట్టు ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. నవంబర్ 20వ తేదీన క్వాష్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు పేర్కొంది. అదే సమయంలో స్కిల్ కేసులో చంద్రబాబు వయసు, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మధ్యంతర బెయిల్ కోరారు చంద్రబాబు లాయర్లు. మరోవైపు ఫైబర్నెట్ కేసులో ఇదే బెంచ్ ముందు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అయితే.. స్కిల్ స్కాంలో క్వాష్ పిటిషన్పై తీర్పు వెల్లడించిన తర్వాతే ఫైబర్నెట్ కేసు పిటిషన్ విచారణ చేపడతామని బెంచ్ చంద్రబాబు లాయర్లకు స్పష్టం చేసింది. ఫైబర్నెట్ పిటిషన్ను నవంబర్ 8వ తేదీకి వాయిదా వేసిన కోర్టు.. అదే రోజున స్కిల్ స్కాం పిటిషన్ తీర్పు వెల్లడిస్తామని చెప్పింది. ఈలోపు చంద్రబాబు లాయర్ల విజ్ఞప్తితో నవంబర్ 09కి ఫైబర్నెట్ కేసు విచారణ వాయిదా వేసిన ధర్మాసనం.. నవంబర్ 8వ తేదీన(రేపు) చంద్రబాబు క్వాష్ పిటిషన్పై తీర్పు వెల్లడిస్తామని ఇరుపక్షాలకు తెలిపింది. స్కిల్ స్కాంలో.. టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.371 కోట్లు కొల్లగొట్టిన వ్యవహారమే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామంటూ ఘరానా మోసానికి పాల్పడ్డారని, షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర ఏజెన్సీల గుర్తింపుతో వెలుగులోకి రాగా, 2017-2018లో నకిలీ ఇన్వాయిస్లతో అవినీతి బాగోతం బయటపడింది. అయితే అప్పటికే జీఎస్టీ అధికారులు అప్రమత్తం చేసినా.. అప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబే కాబట్టి పట్టించుకోలేదు. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే ప్రధాన సూత్రధారి, లబ్ధిదారు అని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరిన బ్యాంకు స్టేట్మెంట్లు, రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పింర్పించింది కూడా. మరోవైపు ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురిని అరెస్ట్ చేసింది కూడా. ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడి పేరు నమోదు అయ్యింది. చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు అయ్యాయి. సీఆర్పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెఓంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసింది.ఆపై ఏసీబీ కోర్టు ఐదు పర్యాయాలు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించగా.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా 7691 నెంబర్తో 52 రోజులపాటు చంద్రబాబు ఉన్నారు. అయితే కంటికి శస్త్ర చికిత్స అభ్యర్థన మేరకు మానవతా దృక్ఫథంతో అక్టోబర్ 31వ తేదీన నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. -
చంద్రబాబుకి కోర్టుల్లో వరుస ఎదురుదెబ్బలు
సాక్షి, ఢిల్లీ/విజయవాడ: అవినీతి కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఈ శుక్రవారమూ కలిసి రాలేదు. న్యాయస్థానాల్లో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అటు సుప్రీంకోర్టులో.. ఇటు విజయవాడలోని ఏసీబీ కోర్టులోనూ శుక్రవారం ఆయనకు ఎలాంటి ఊరటా లభించలేదు. దీంతో టీడీపీ శ్రేణులు డీలా పడ్డాయి. ఫైబర్నెట్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు వేసిన పిటిషన్ను విచారణ అనంతరం సుప్రీం కోర్టు శుక్రవారం వాయిదా వేసింది. చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా, ఏపీ ప్రభుత్వం తరఫున రంజిత్కుమార్ వాదనలు వినిపించారు. సిద్ధార్థ లూథ్రా వాదనలు పిటిషనర్పై మూడు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి.. ఒక దానికి సంబంధించిన తీర్పు రిజర్వు అయ్యింది ఫైబర్నెట్ కేసులో అరెస్ట్ చేయవద్దని ఇప్పటికే కోర్టు చెప్పింది ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది రంజిత్కుమార్ వాదనలు ఒక వ్యక్తి కస్టడీలో ఉన్నప్పుడు మళ్లీ అరెస్ట్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు చంద్రబాబు జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతోంది.. ఈ అంశాన్ని కౌంటర్ అఫిడవిట్లో తెలిపాం వాదనలు విన్న జస్టిస్ అనిరుద్ధ బోస్ , జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం విచారణను నవంబర్ ఎనిమిదవ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో తీర్పు పెండింగ్లో ఉన్న విషయాన్ని చంద్రబాబు తరఫు లాయర్లకు గుర్తు చేసిన ధర్మాసనం ఆ క్వాష్ పిటిషన్పై తీర్పు వెలువడిన తర్వాతనే ఫైబర్నెట్ కేసును పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. క్వాష్ పిటిషన్పై తీర్పును నవంబర్ ఎనిమిదవ తేదీన వెల్లడిస్తామంది ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. అయితే ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు పిటిషన్పై విచారణ ఎనిమిదవ తేదీకి కాకుండా.. తొమ్మిదవ తేదీకి వాయిదా వేయాలని చంద్రబాబు లాయర్ లూథ్రా ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత ఇబ్బంది రీత్యా తదుపరి విచారణను ఒక్కరోజు ముందుకు జరపాలని కోరారు. ధర్మాసనం ఆ విజ్ఞప్తిని మన్నించి.. నవంబర్ తొమ్మిదివ తేదీనే విచారణ చేపడతామని తెలిపింది. అంతవరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని.. పీటీ వారెంట్పై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్పై ఇప్పటికే పక్షాల వాదనలు పూర్తి అయ్యాయి. సెక్షన్17-ఏ మీదనే వాడివేడి వాదనలు జరిగాయి. వాదనలు ముగిసే సమయంలో చంద్రబాబు తరఫు లాయర్ హరీశ్ సాల్వే మధ్యంతర బెయిల్ కోసం విజ్ఞప్తి చేశారు. కానీ, కేసులో ప్రధాన వాదనలు విన్నామని.. ఈ సమయంలో మధ్యంతర బెయిల్ ప్రస్తావన ఉండబోదని.. నేరుగా తుది తీర్పే ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో తీర్పు ఎలా ఉండబోతుందా? అనే ఉత్కంఠత సర్వత్రా ఏర్పడింది. ఇదీ చదవండి: అవినీతిపరులకు ‘17ఏ’ రక్షణ కవచం కాదు మరోవైపు ఫైబర్ నెట్ కేసు పిటిషన్ను వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం తాలూకూ ప్రభావం శుక్రవారం ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పిటిషన్ జరిగే విచారణపై కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ సీఐడీ చంద్రబాబును విచారించేందుకు పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. చంద్రబాబును కోర్టులో హాజరు పర్చాలని కూడా ఆదేశించింది. కానీ, సుప్రీం కోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉండడంతో.. అది వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం జరగాల్సిన విచారణ సైతం వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఫైబర్నెట్ కేసులో చంద్రబాబును కోర్టులో హాజరుపరచాల్సి వస్తే.. అరెస్ట్ చేస్తారేమోననే ఆందోళనలో టీడీపీ శ్రేణులు ఉన్నాయి. ఏసీబీ కోర్టులోనూ.. లీగల్ ములాఖత్ల సంఖ్య పెంచాలని చంద్రబాబు తరఫు లాయర్లు వేసిన పిటిషన్ను శుక్రవారం అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం కొట్టేసింది. ములాఖత్ల సంఖ్య పెంచేలా ఆదేశాలు ఇవ్వాలని, ఈ పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టాలని చంద్రబాబు లాయర్లు గురువారం కోరారు. చంద్రబాబు కేసుల విచారణ వివిధ కోర్టుల్లో ఉన్నందున ములాఖత్ల సంఖ్య మూడుకు పెంచాలని పిటిషన్లో అభ్యర్థించారు. అయితే.. అలా చేయడం సాధ్యం కాదని కోర్టు తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ సీఐడీని ఆదేశించింది. తాజాగా శుక్రవారం ఈ పిటిషన్ ఏసీబీ కోర్టు ముందుకు రాగా.. కోర్టు కొట్టేసింది. ప్రతివాదుల్ని చేర్చకపోవడంతో ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదని తిరస్కరిస్తూ.. సరైన లీగల్ ఫార్మట్లో దాఖలు చేయాలంటూ చంద్రబాబు తరపు లాయర్లకు సూచించింది. ►కాల్ డేటా రికార్డింగ్స్ పిటిషన్ కోరుతూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు వేసిన పిటిషన్ను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని కోర్టు ఆదేశించగా.. ఈ నెల 26వ తేదీ వరకు సమయం కావాలని కోరారు. ఆ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని పిటిషన్ను వాయిదా వేసింది ఏసీబీ కోర్టు -
స్కిల్ స్కాం పిటిషన్ పై తీర్పు దసరా తర్వాతే..!
-
బాబుకు నో రిలీఫ్
సాక్షి, న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్టయి, రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకి మధ్యంతర బెయిలు మంజూరు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. ఫైబర్నెట్ కుంభకోణం కేసులోనూ మధ్యంతర బెయిలు ఇవ్వాలన్న చంద్రబాబు విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు విచారణ శుక్రవారం చేపడతామని పేర్కొంది. అప్పటి వరకూ చంద్రబాబును అరెస్టు చేయొద్దని చెప్పింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ఇరుపక్షాల వాదనలు పీసీ చట్టం సెక్షన్ 17ఏ పైనే జరిగాయి. సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, రంజిత్కుమార్, నిరంజన్రెడ్డి వాదించగా, చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, సిద్దార్ధ లూథ్రా వాదనలు వినిపించారు. తొలుత సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ సెక్షన్ 17ఏ ఈ కేసుకు వర్తించదని చెప్పారు. ఇది 2018 కన్నా ముందు జరిగిన నేరమని, ఆ సమయంలో ఉనికిలోనే లేని చట్టం ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. 2018 జూన్లోనే విచారణ ప్రారంభించామని తెలిపారు. ఎఫ్ఐఆర్లో కాగ్నిజబుల్ నేరాలు ఉన్నాయా.. లేదా.. అనేది చూడాలని చెప్పారు. సెక్షన్ 17ఏ నిజాయితీపరులకే తప్ప అవినీతిపరులకు రక్షణ కవచం కాకూడదని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అవినీతి జరిగిందని స్పష్టంగా కనిపిస్తోందని, అటువంటప్పుడు సెక్షన్ 17ఏ అసలు వర్తించదని చెప్పారు. రూ. వందల కోట్ల కుంభకోణం దర్యాప్తును అడ్డుకోవడానికి ఈ సెక్షన్ను ఉపయోగించరాదని అన్నారు. 2015–16లో చట్టంలో లేనివి వర్తించవని చెప్పారు. సెక్షన్ 17ఏ భవిష్యత్తుకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొన్నారు. పీసీ చట్టానికి సంబంధం లేని అభియోగాలపై విచారించే పరిధి ప్రత్యేక కోర్టుకు ఉందని పలు కోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ గట్టిగా వాదనలు వినిపించారు. ఒక వ్యక్తి పీసీ చట్టం, ఐపీసీ సెక్షన్ల ప్రకారం నిందితుడు అయితే.. ఏదైనా కారణాలతో పీసీ చట్టం నేరాలను దాని నుంచి తొలగించినప్పటికీ, ప్రత్యేక న్యాయమూర్తి మిగిలిన ఐపీసీ కింద సెక్షన్లపై చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం విచారణ చేయొచ్చని తెలిపారు. ఈ కేసులో ప్రత్యేక కోర్టు నిందితుడి విడుదలకు నిరాకరించిందని తెలిపారు. ప్రస్తుత కేసులో ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నామని, డిశ్చార్జి ఉందా లేదా అనేది పక్కనపెడితే.. పోలీసుల దర్యాప్తులో పీసీ లేదా పీసీయేతర అభియోగాల మధ్య తేడా లేనప్పుడు ఎఫ్ఐఆర్ను ఎలా క్వాష్ చేస్తారని ప్రశ్నించారు. ఇది రాజకీయ కక్ష కాదని, కేంద్ర దర్యాప్తు సంస్థల ఆరోపణలపైనా దర్యాప్తు జరిగిందని తెలిపారు. ఒకవేళ సెక్షన్ 482 విచక్షణ ప్రకారం రిలీఫ్ ఇవ్వాలంటే దానికి కొన్ని ప్రిన్సిపుల్స్ ఉన్నాయన్నారు. ఈ కేసుకు ఆ అర్హత కూడా లేదని కౌంటర్ అఫిడవిట్ను పరిశీలిస్తే అర్థం అవుతుందని తెలిపారు. సుప్రీంకోర్టే ప్రాథమిక విచారణ చేయాలనుకోవడం సరికాదన్నారు. ఈ సందర్భంగా తన వాదనలను సమర్థించే వేర్వేరు తీర్పులను ధర్మాసనం ముందుంచారు. 40 రోజులుగా జైల్లో ఉన్నారు బెయల్ ఇవ్వండి చంద్రబాబు తరఫు న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తూ.. రాజకీయ కక్ష సాధింపులు నిరోధించేందుకే 17ఏ ఉందని, ఇది చట్టం కల్పించిన రక్షణ అని చెప్పారు. రాష్ట్ర వాదన చూస్తుంటే.. సెక్షన్ 17ఏ అమాయకులైన వారికే వర్తిస్తుందన్నట్లుందని చెప్పారు. నిర్దోషులని నిర్ధారించడానికి నిర్దోషిత్వంపై ముందుగా విచారణ నిర్వహించాలంటూ ప్రొవిజన్ తలక్రిందులు చేస్తున్నారని ఆరోపించారు. జీఎస్టీ చెల్లింపులకు, ప్రభుత్వానికి ముడిపెడుతున్నారన్నారు. 2021లో విచారణ ప్రారంభించి ఆధారాల కోసం మళ్లీ వెదుకుతున్నారని ఆరోపించారు. ఈ కేసులో సెక్షన్ 17ఏ వర్తిస్తుందని చెప్పారు. 40 రోజులుగా చంద్రబాబు జైల్లో ఉన్నారని, మద్యంతర బెయిలు ఇవ్వాలని సాల్వే అభ్యర్థించారు. సాల్వే వాదనలను లూథ్రా సమర్థించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం స్కిల్ డెవలప్మెంట్ కేసులో తీర్పు రిజర్వు చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణను 19కి వాయిదా వేసిన హైకోర్టు చంద్రబాబు న్యాయవాదుల అభ్యర్థన మేరకు హైకోర్టు ఉత్తర్వులు సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్లో తదుపరి విచారణను నెల 19వ తేదీకి వాయిదా పడింది. చంద్రబాబు తరఫు న్యాయవాదుల అభ్యర్థన మేరకు హైకోర్టు విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ ఏసీబీ కోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు రాగా, చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాయిదా వేయాలని కోరారు. దీంతో న్యాయమూర్తి తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
స్కిల్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్కు నిరాకరణ
సాక్షి, ఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో సుప్రీం కోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి ఊరట దక్కలేదు. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై ఇవాళ వాదనలు ముగిశాయి. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేస్తూ.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే వాదనలు ముగిసే సమయంలో ఆయన తరపు లాయర్లు మధ్యంతర బెయిల్ కోసం అభ్యర్థించగా.. కోర్టు అందుకు నిరాకరించింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్పై జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట మంగళవారం వాడీవేడిగా వాదనలు సాగాయి. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. అయితే వాదనల సమయంలో ప్రత్యేక కోర్టుల విచారణ అధికారం గురించి రోహత్గీ ప్రస్తావించారు. అయితే వాదనలు ముగియడంతో శుక్రవారానికి పిటిషన్ను వాయిదా వేసింది ధర్మాసనం. శుక్రవారం ఇరుపక్షాల లాయర్లు లిఖిత పూర్వక వాదనలు అందజేయనున్నారు. అయితే ఈ నెల 23 నుంచి 28 దాకా కోర్టుకి దసరా సెలవులు ఉన్నాయి. దీంతో.. దసరా తర్వాతే చంద్రబాబు పిటిషన్పై తీర్పు వెల్లడించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రోహత్గీ సుదీర్ఘ వాదనలు ‘‘ఈ కేసులో 17ఏ సెక్షన్ వర్తించదు. పాత నేరాలకు సంబంధించి ఈ సెక్షన్ వర్తించదు. 17ఏ సెక్షన్ అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ సెక్షన్ అవినీతిపరులకు రక్షణ ఛత్రం కాకూడదు. ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకునేవాళ్లు ఇబ్బందిపడకూడదనే ఈ చట్టం తీసుకొచ్చారు. ఈ కేసులో ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవే’’ అని రోహత్గీ వాదించారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టినప్పుడు ఐపీసీ సెక్షన్ ప్రకారం కూడా విచారించే అధికారం ప్రత్యేక కోర్టులకు ఉంటుంది. అవినీతి కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు. అవినీతి నిరోధం కోసం ముందస్తు చర్యలు చేపట్టాలి.. అందుకే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు. న్యాయపరిధికి సంబంధించి వివాదం లేదు.. ప్రత్యేక కోర్టుకు సంపూర్ణ న్యాయపరిధి ఉంది. రూ.వందల కోట్ల అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నప్పుడు సెక్షన్ 422 సీఆర్పీసీ కింద క్వాష్ చేయలేం. ఆరోపణలు ఉన్నప్పుడు ఛార్జిషీట్లు వేసి విచారణ జరిపి శిక్ష కూడా వేయవచ్చు’’ అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలున్నప్పుడు ప్రత్యేక కోర్టుకు విచారించే న్యాయపరిధి ఉంటుందన్నారు. ఈ కేసులో జీఎస్టీ, ఆదాయపన్ను దర్యాప్తులు ఉన్నాయన్నారు. జీఎస్టీ, ఆదాయపన్నుతో పాటు మరికొన్ని విభాగాలు కూడా ఈ కేసును దర్యాప్తు చేశాయని తెలిపారు. ‘‘నేరం జరిగిందా లేదా? ఎఫ్ఐఆర్ నమోదైందా? లేదా? అంతవరకే పరిమితం కావాలి. అవినీతి నిరోధక, సాధారణ కేసుల్లోనూ అదే పోలీసులు విచారణ చేస్తారు. ఒకే పోలీసులు విచారణ చేసినప్పుడు ఈ కేసులో ఎఫ్ఐఆర్ను ఎలా క్వాష్ చేస్తారు.మీరు అవినీతి ఆరోపణలు వర్తించవంటున్నారు.. మరి ఐపీసీ కింద పెట్టిన కేసులు ఎక్కడికి పోతాయి’’ అని రోహత్గీ వాదించారు. ‘‘మీరు కేసు పెట్టే నాటికి చట్టం అమల్లోకి వచ్చింది.. చట్టం అమల్లోకి వచ్చాక కేసు నమోదైంది. ఈ పరిస్థితుల్లో పాత నేరమంటూ కొత్తగా కేసులు పెట్టడానికి అవకాశం ఎలా ఉటుంది?’’ జస్టిస్ బోస్ ప్రశ్నించారు. ఈ కోర్టులో జరుగుతున్న వాదనలు కేవలం ప్రొసీజర్ ప్రకారమే కాకూడదు.. కేసులో ఉన్న వాస్తవ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని రోహత్గీ కోరారు. వర్చువల్గా హరీష్ సాల్వే వాదనలు చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వర్చువల్గా వాదనలు వినిపించారు. చట్టసవరణను ముందు నుంచి వర్తింపజేసే అంశంపై పలు తీర్పులను ఉటంకిస్తూ వాదనలు వినిపించారు. ఎన్నికల ముందు రాజకీయ కక్ష సాధింపులకు అవకాశం ఉంటుంది. రాజకీయ కక్ష సాధింపులను నిరోధించేందుకు 17ఏ ఉంది. సెక్షన్ 17ఏ లేకపోతే రాజకీయంగా వేధించే అవకాశం ఉంటుంది. ఆధారాల సేకరణ కూడా సరైన పద్ధతిలో జరుగుతుందన్న నమ్మకం లేదు. రిమాండ్ రిపోర్టు, కౌంటరు అఫిడవిట్లు మొత్తం ఆరోపణలతో నిండి ఉన్నాయి. విపక్ష నేతలను విచారించడం తమ హక్కుగా ప్రభుత్వం భావిస్తోంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా 17ఏ వర్తిస్తుంది అని వాదించారు. మధ్యంతర బెయిల్కు నిరాకరణ 73 ఏళ్ల వయస్సు ఉన్న చంద్రబాబు 40 రోజులుగా జైలులో ఉన్నారు. కోర్టు సెలవుల దృష్ట్యా దయ చేసి చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలించండి. కోర్టుకు అవసరమైతే లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తాం అని సాల్వే కోరారు. ఈ క్రమంలో మరో లాయర్ సిద్ధార్థ లూథ్రా సైతం న్యాయమూర్తులకు అదే విజ్ఞప్తి చేశారు. అయితే మధ్యంతర బెయిల్ ప్రస్తావన లేదన్న జస్టిస్ అనిరుద్ధ బోస్.. ప్రధాన కేసులో వాదనలు విన్నామని, తీర్పు వెలువరిస్తామని స్పష్టం చేశారు. -
Oct 17th 2023: చంద్రబాబు కేసు అప్డేట్స్
Updates.. 08:45PM, అక్టోబర్ 17, 2023 చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల ►నేటి చంద్రబాబు హెల్త్ బులిటెన్ను విడుదల చేసిన రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు ►స్కిల్ స్కామ్ కేసులో అరెస్టై.. 38 రోజులుగా రిమాండ్ ఖైదీ 7691 నెంబర్తో ఉన్న చంద్రబాబు ►జైల్లో స్నేహా బ్యారక్లో ప్రత్యేక గదిలో చంద్రబాబు ►ప్రతిరోజూ మూడుసార్లు వైద్య పరీక్షలు ►కోర్టు ఆదేశాల మేరకే ఇంటి భోజనానికి అనుమతి ►నిలకడగా చంద్రబాబు ఆరోగ్యం ►బాబు ఆరోగ్యంపై టీడీపీ శ్రేణుల అనవసర రాద్ధాంతం ►బరువు తగ్గారని కుటుంబ సభ్యుల తప్పుడు ప్రచారం ►ప్రతిరోజు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్న జైలు అధికారులు ►స్కిల్ ఎలర్జీ.. ఆపై కోర్టు ఆదేశాలతో బాబు కోసం టవర్ ఏసీ ఏర్పాటు ► ఇవాళ్టి హెల్త్ బులిటెన్లోనూ పూర్తి వివరాలు వెల్లడి 08:23PM, అక్టోబర్ 17, 2023 ఫైబర్ నెట్ కేసులో ఏసీబీ కోర్టులో మెమో దాఖలు ►ఫైబర్నెట్ కేసులో పీటీ వారెంట్పై రేపు చంద్రబాబును ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టాల్సి ఉంది ►అయితే.. సుప్రీం కోర్టు ఫైబర్ నెట్పై దాఖలైన పిటిషన్ విచారణ వాయిదా వేసింది ►విచారణ జరిగే శుక్రవారం దాకా అరెస్ట్ చేయొద్దని సీఐడీ తరపు న్యాయవాది రోహత్గీకి ఇవాళ సూచించింది ►అదే అంశాన్ని మెమో ద్వారా ఏసీబీ కోర్టుకు తెలిపిన సీఐడీ ►మళ్లీ ఎపుడు హాజరుపర్చాల్సిందీ ఏసీబీ కోర్టు రేపు నిర్ణయించే అవకాశం 07:55PM, అక్టోబర్ 17, 2023 టీడీపీ శ్రేణుల్లో కొత్త గుబులు ►చంద్రబాబు అరెస్ట్పై.. టీడీపీ శ్రేణుల్లో కొత్త టెన్షన్ ►చంద్రబాబు క్వాష్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ ►స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ కుదరదన్న ధర్మాసనం.. నేరుగా తీర్పు ఇస్తామని వెల్లడి ►శుక్రవారానికి విచారణ వాయిదా ►కానీ, శుక్రవారం లిఖిత పూర్వక వాదనలు సమర్పించనున్న ఇరుపక్షాల న్యాయమూర్తుల ►ఈ నెల 23 నుంచి 28 దాకా దసరా సెలవులు ►తీర్పు ఆలస్యం అవుతుందేమోనన్న ఆందోళనలో టీడీపీ శ్రేణులు 07:30PM, అక్టోబర్ 17, 2023 ఆ ఐడియా లోకేష్దేనట! ►హక్కుల కోసం పోరాడే పేదలను అణిచివేయాలని చూసినప్పుడు ‘స్వేచ్ఛకు బేడీలు’ వేస్తారా? అని, పౌర సంఘాలు నిరసన తెలపడం చూశాం. ►చంద్రబాబు గారు అనే అవినీతి తిమింగలాన్ని సాక్ష్యాధారాలతో అరెస్టు చేస్తే చేతులకు తాళ్లు, గొలుసులతో ప్రదర్శన చేసి పచ్చ పార్టీ పరువు తీసుకుంది. ►ఈ ఫోటో షూట్ ఐడియా లోకేశ్ దేనని టీడీపీ వర్గాల బోగట్టా! ట్విటర్లో వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి హక్కుల కోసం పోరాడే పేదలను అణిచివేయాలని చూసినప్పుడు ‘స్వేచ్ఛకు బేడీలు’ వేస్తారా అని, పౌర సంఘాలు నిరసన తెలపడం చూశాం. చంద్రబాబు గారు అనే అవినీతి తిమింగలాన్ని సాక్ష్యాధారాలతో అరెస్టు చేస్తే చేతులకు తాళ్లు, గొలుసులతో ప్రదర్శన చేసి పచ్చ పార్టీ పరువు తీసుకుంది. ఈ ఫోటో షూట్ ఐడియా లోకేశ్… — Vijayasai Reddy V (@VSReddy_MP) October 17, 2023 06:45PM, అక్టోబర్ 17, 2023 ములాఖత్ తగ్గిస్తే చంద్రబాబుకే మంచిది ►చంద్రబాబు పై ఆయన పార్టీ నాయకులే కుట్ర చేస్తున్నట్లు అనుమానం ►అచ్చెన్నాయుడు,యనమల రామకృష్ణుడు కుట్ర పన్నుతున్నారు ►చంద్రబాబు ఇంకా కుర్రాడినే అనే విధంగా గతంలో జరిగిన మీటింగ్ లో చెప్పాడు ►కానీ, ముసలోడు, అనేక జబ్బులు ఉన్నాయి.. ఎందుకూ పనికిరాడంటూ టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు ►కొంతమంది రెండు పూట్ల హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని చెప్పడం దారుణం ►రోగి యొక్క వివరాలు చెప్పే హక్కు ఎవ్వరికీ లేదు ►అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడుతో కలిసి చంద్రబాబు పై లోకేష్ కుట్ర పన్నుతున్నారు ►చంద్రబాబు పై కుట్ర పన్నేది కేవలం లోకేష్,ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలే ►చంద్రబాబు రాజకీయాలకు పనికిరాడని ఆయన కుటుంబ సభ్యులే చెబుతున్నారు ►చంద్రబాబు రాజకీయాలకు పనికిరాకపోతే రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న అచ్చెన్నాయుడు గద్దె ఎక్కాలనుకుంటున్నారు ►చంద్రబాబుకి జైల్లో ఉన్నాను అనే బాధ కంటే.. రాజకీయాలకు పనికిరాడనే ప్రచారం ఎక్కువ బాధిస్తోంది ►టీడీపీని నాశనం చేయడానికి ఒక్క లోకేష్ చాలు ►కేసు కొట్టేయాలని చంద్రబాబు లాయర్ లు కోరడం విడ్డురంగా ఉంది ►చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసాడు కాబట్టి ప్రజా ధనం లూటీ చేసే హాక్కు ఉంటుందా? ►జైల్లో చంద్రబాబుకి ములాఖత్ తగ్గించడం అనేది సాధారణం ►ములాఖత్ తగ్గిస్తే చంద్రబాబుకే మంచిదేమో! :::మంత్రి సీదిరి అప్పలరాజు 06:37PM, అక్టోబర్ 17, 2023 ఇంకెన్నాళ్లు సాగదీస్తాం? ►జనసేన కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ పవన్ కల్యాణ్ భేటీ ►రాష్ట్రంలో రాజకీయ పరిస్ధితులు, ఐదో దశ వారాహి యాత్రపై చర్చ ►జనసేన- టీడీపీ సమన్వయ కమిటీ ఉమ్మడి భేటీ నిర్వహణపై చర్చ ►ఎన్ని స్థానాలకు జనసేన పోటీ చేయాలి? ►ఈసారి పవన్ కళ్యాణ్ కు అత్యంత సురక్షితమైన నియోజకవర్గం ఏది? ►ఒక చోట పోటీ చేయాలా? లేకుంటే రెండు చోట్ల నిలబడాలా ? ►వైజాగ్ విడిచి పెట్టి పవన్ అనంతపురం వెళ్తే ఎలా ఉంటుంది? ►ఇంకెన్నాళ్లు నియోజకవర్గ విషయంలో స్పష్టత ఇవ్వకుండా సాగదీస్తాం? ►అసలు టీడీపీ ఎన్ని నియోజకవర్గాలకు ఒప్పుకుంటుంది? ►ఎన్ని చోట్ల మనకు అభ్యర్థులు ఉన్నారు? ►దీర్ఘంగా చర్చలు జరిపిన పవన్-నాదెండ్ల మనోహర్ 05:44PM, అక్టోబర్ 17, 2023 పిటిషన్లు వేయడం బాగా అలవాటైంది ►చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రిమాండ్ ఖైదీ ►జైలు నిబంధనల ప్రకారం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ►ఏది కావాలన్నా కోర్టుల్లో పిటిషన్ వేయటం టీడీపీకి అలవాటైపోయింది ►దేశంలో అత్యంత ఖరీదైన లాయర్లు ఒక రిమాండ్ ఖైదీ కోసం పని చేస్తున్నారంటే అది ఒక చంద్రబాబు విషయంలోనే కావచ్చు... ►చంద్రబాబు తప్పు చేశాడన్న ఆధారాలు ఉండబట్టే జైల్లో ఉన్నాడు ►బాబు కోసం తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్ని ఆందోళనలు చేసిన ప్రజాస్పందన కనిపించడం లేదు :::తూర్పుగోదావరిలో మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ 04:37PM, అక్టోబర్ 17, 2023 బాబు హెల్త్బులిటెన్ పిటిషన్పై రేపు విచారణ ►చంద్రబాబు హెల్త్ బులెటెన్ విషయంలో పిటిషన్ ►చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన తరపు లాయర్ల పిటిషన్ ►విజయవాడ ఏసీబీ కోర్టులో బాబు లాయర్ల పిటిషన్ ►కౌంటర్ వేయాలని సీఐడీని ఆదేశించిన కోర్టు ►సాయంత్రం దాఖలు చేసిన సీఐడీ తరపు న్యాయవాదులు ►రేపు విచారణ జరిగే అవకాశం 04:11PM, అక్టోబర్ 17, 2023 క్వాష్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ ►చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా ►తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసిన కోర్టు ►క్వాష్ పిటిషన్పై ఇరువైపులా నుంచి ముగిసిన వాదనలు ►తీర్పు రిజర్వ్ చేసిన ద్విసభ్య ధర్మాసనం ►అదే రోజు ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ►క్వాష్ పిటిషన్ విచారణలో ఇవాళ.. 17ఏ వర్తించదని వాదనలు వినిపించిన సీఐడీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ ► వర్తిస్తుందని వాదించిన చంద్రబాబు తరపు లాయర్ హరీష్ సాల్వే ►మధ్యంతర బెయిల్ ప్రస్తావన లేదన్న సుప్రీంకోర్టు ►వాదనలు ముగియడంతో.. FIR క్వాష్ చేయాలా? వద్దా? అనేదానిపైనే నేరుగా తదుపరి విచారణలో ఆదేశాలివ్వనున్న బెంచ్ 04:00PM, అక్టోబర్ 17, 2023 మధ్యంతర బెయిల్ కుదరదు: సుప్రీం కోర్టు ►చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరిన లాయర్ హరీష్ సాల్వే ►సెక్షన్ 17a వర్తిస్తే అన్ని అభియోగాలు తొలగినట్టే! ►లేదంటే మధ్యంతర బెయిల్ అయినా ఇవ్వాలని అభ్యర్థిస్తున్నా ►చంద్రబాబు 40రోజులు జైల్లో ఉన్నారు ►73 ఏళ్ల వయసున్న వ్యక్తి కాబట్టి బెయిల్ ఇవ్వండి ►మరో లాయర్ సిద్ధార్థ లూథ్రా సైతం ఇదే అభ్యర్థన ►ససేమీరా అనేసిన జస్టిస్ అనిరుద్ధబోస్ ►వాదనలన్నీ విన్నాం.. తీర్పు వెల్లడిస్తామని స్పష్టీకరణ 03:55PM, అక్టోబర్ 17, 2023 హరీష్ సాల్వే వాదనలు ►చంద్రబాబు క్వాష్ పిటిషన్పై ఇవాళ ముగిసిన వాదనలు ►సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ తర్వాత కౌంటర్ వాదనలు వినిపించిన హరీష్ సాల్వే ►17A రెట్రో యాక్టిివ్ గా వర్తిస్తుంది ►17A కింద బాబుకి రక్షణ కల్పించాలి ►17A కింద ఖచ్చితంగా అనుమతి తప్పనిసరి ►ఎన్నికలు వస్తున్నాయని, ఫిక్స్ చేస్తున్నారు ►రాజకీయ ప్రత్యర్థులైనందు వల్లే తప్పుడు కేసులు ►17ఏ గనుక లేకుంటే పబ్లిక్ సర్వెంట్స్ అందరూ పోతారు ►అయితే, ఎవరూ కూడా దీనిని ఛాలెంజ్ చేయలేదు కదా ? అని ప్రశ్నించిన జస్టిస్ బేలా త్రివేది ►17ఏ రెట్రాస్పెక్తివ్ గా ఉండదని ప్రభుత్వం అంటోంది కదా ? : జస్టిస్ అనిరుధ్ బోస్ ►అన్ని అంశాలు లిఖిత పూర్వకంగా ఇస్తాం 03:49PM, అక్టోబర్ 17, 2023 చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుంది: సాల్వే ►17ఏ కింద చంద్రబాబుపై కేసు నమోదులో గవర్నర్ అనుమతి తప్పనిసరి ►17ఏ వర్తిస్తుందంటూ పలు జడ్జిమెంట్లను వివరిస్తున్న సాల్వే 03:40PM, అక్టోబర్ 17, 2023 వాదనలు వినిపిస్తున్న బాబు లాయర్ హరీష్ సాల్వే ►ఈ కేసులో 17ఏ వర్తించదన్న సీఐడీ తరపు న్యాయవాది రోహత్గీ వాదనలకు.. కౌంటర్ వాదనలు వినిపిస్తున్న సాల్వే ►17ఏ అనేది పాత కేసులకు కూడా వర్తిస్తుంది: హరీష్ సాల్వే ►రోహత్గి తన వాదనలో 17ఏ పాత కేసులకు వర్తించదని.. కోర్టు తీర్పును ప్రస్తావించారు: జస్టిస్ అనిరుద్ధబోస్ ►రోహత్గి చెప్పిన కోర్టు తీర్పు మీరు(సాల్వేను ఉద్దేశించి..) వాదిస్తున్న దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంది: జస్టిస్ అనిరుద్ధబోస్ 03:30PM, అక్టోబర్ 17, 2023 క్వాష్ పిటిషన్పై కౌంటర్ ఆర్గ్యూమెంట్స్ ►క్వాష్ పిటిషన్పై రోహత్గీ వాదనలకు కౌంటర్ వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు లాయర్ హరీష్ సాల్వే ►వర్చువల్గా వాదిస్తున్న హరీష్ సాల్వే ►హక్కులు పౌరులకు సంబంధించినవి: సాల్వే ►కొత్త చట్టాలు వస్తే అవి హక్కుగా పౌరులకు వర్తిస్తాయి: సాల్వే ►ప్రతీ ప్రజాప్రతినిధికి హక్కుగా 17ఏ చట్టం వర్తిస్తుంది: సాల్వే 03:20PM, అక్టోబర్ 17, 2023 రోహత్గీ వాదనలు కొనసాగిస్తూ.. ►ఆరోపణలు ఉన్నప్పుడు ఛార్జిషీట్లు వేసి విచారణ జరిపి శిక్షకూడా వేయవచ్చు. ►ఆరోపణలపైనే అన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతామా? ►అవినీతి కేసుల కిందకు వస్తుందంటే పరిగణించండి ఇప్పుడు మనం మాట్లాడుతుంది..17 ఏ వర్తిస్తుందా..లేదా అనేదే కదా? కేసులు నమోదు, ఛార్జిషీట్, విచారణ అన్ని కేసుల్లోనూ జరిగేదే: జస్టిస్ అనిరుద్దబోస్ ►అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలున్నప్పుడు ప్రత్యేక కోర్టుకు విచారించే న్యాయ పరిధి ఉంటుంది. ►ఈ కేసులో జీఎస్టీ, ఆదాయపన్ను దర్యాప్తులు ఉన్నాయి ►జీఎస్టీ,ఆదాయపన్నుతో పాటు మరికొన్ని విభాగాలు కూడా ఈ కేసును దర్యాప్తు చేశాయి ►నేరం జరిగిందా లేదా..ఎఫ్ఐఆర్ నమోదైందా లేదా.. అంతవరకే పరిమితం కావాలి ►అవినీతి నిరోధక,సాధారణ కేసుల్లోనూ అదే పోలీసులు విచారణ చేస్తారు ►ఒకే పోలీసులు విచారణ చేసినప్పుడు ఈ కేసులో ఎఫ్ఐఆర్ ను ఎలా క్వాష్ చేస్తారు? ►మీరు అవినీతి ఆరోపణలు వర్తించవంటున్నారు.. మరి ఐపీసీ కింద పెట్టిన కేసులు ఎక్కడికి పోతాయి జస్టిస్ అనిరుద్ధబోస్ : మీరు కేసు పెట్టేనాటికి చట్టం అమలులోకి వచ్చింది, చట్టం అమలులోకి వచ్చాక కేసు నమోదైంది ►ఈ కోర్టులో జరుగుతున్న వాదనలు కేవలం ప్రొసీజర్ ప్రకారమే కాకూడదు. కేసులో ఉన్న వాస్తవ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. 17ఏ అనేది హైబ్రిడ్ సెక్షన్..అవినీతిపరులకు ఇది రక్షణ కాకూడదన్నదే నేను చెప్పేది: రోహత్గీ ఈలోపు చంద్రబాబు తరపు లాయర్ హరిష్ సాల్వే జోక్యం చేసుకుంటూ.. ఇప్పటికే గంటసేపు నుంచి రోహత్గి వాదనలు వినిపిస్తున్నారు... ఇంకా ఎంతసేపు వాదనలు వినిపిస్తారు. రోహత్గీ తన వాదనలు కొనసాగిస్తూ.. ►రాఫేల్ కేసులో వేసిన రివ్యూ పిటిషన్ను బెంచ్లోని ఇద్దరు న్యాయమూర్తులు డిస్మిస్ చేశారు ►కాని మరో జడ్జ్ తీర్పును అంగీకరిస్తూనే 17ఏ కీలక వ్యాఖ్యలు చేశారు ►రాఫెల్ కేసులో 17ఏపై జస్టిస్ జోసెఫ్ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమైనవి ►కోర్టు విచారణకు ఆదేశించిన కేసుల్లో 17ఏ అనేది వర్తించదు. 03:05PM, అక్టోబర్ 17, 2023 ఫైబర్నెట్ కేసులో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా ►ఫైబర్నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ శుక్రవారానికి(అక్టోబర్ 20) వాయిదా ►స్కిల్ స్కామ్ క్వాష్తో పాటు ఫైబర్నెట్ కేసులో సుప్రీం కోర్టులో విడిగా ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన బాబు తరపు లాయర్లు ► విచారణ శుక్రవారానికి వాయిదా వేసిన సుప్రీం కోర్టు ► ఒకవైపు స్కిల్ స్కామ్ కేసులో 17ఏపై వాదనలు కొనసాగుతుండడంతో వాయిదా వేసిన కోర్టు ►శుక్రవారం వరకు ఫైబర్నెట్ కేసులో బాబును అరెస్ట్ చేయొద్దని రోహత్గికి సూచించిన సుప్రీం కోర్టు 02:59PM, అక్టోబర్ 17, 2023 ఇది చాలా తీవ్రమైన ఆర్థిక నేరం: సీనియర్ లాయర్ రోహత్గీ ►ఈ కేసులో 17ఏ వర్తించినా.. మిగిలిన ఐపీసీ సెక్షన్లపై విచారించే అధికారం ప్రత్యేక కోర్టుకు ఉంది ►ఎఫ్ఐఆర్లో కాగ్నిజబుల్ అఫెన్సెస్కు సంబంధించిన సెక్షన్లు ఉన్నాయా? లేదా? అనేది ముఖ్యం ►ఈ విషయాన్ని మాత్రమే కోర్టులు పరిగణనలోకి తీసుకోవాలి ►ఈ కేసులో ఎఫ్ఐఆర్ కొట్టేయాలని క్వాష్ పిటిషన్ వేశారు ►స్కిల్ స్కామ్ కేసులో వందల కోట్ల అవినీతి జరిగింది ►పక్కా ఆధారాలతో చంద్రబాబు దొరికారు ►ఇప్పటికే ఈ కేసులో ఈడీ, ఇన్కమ్ట్యాక్స్ సంస్థలు విచారణ చేస్తున్నాయి ►ఇన్ని విచారణ సంస్థలు దర్యాప్తు జరుపుతున్నప్పుడు ఇది రాజకీయ కక్ష ఎలా అవుతుంది? ►ఈ కేసులో ఫొరెన్సిక్ నివేదిక చూస్తే షాక్కు గురవుతారు ►రూ. 371కోట్ల రూపాయలు ప్రజా సొమ్ము ను లూటీ చేశారు ►అధికారులు వద్దని వారించినా.. ఇచ్చేయండి ఇచ్చేయండంటూ ఆదేశాలు జారీచేశారు ►మొత్తంగా ఈ కేసు 482సెక్షన్ కింద క్వాష్ చేయాలా? వద్దా? అనే నిర్ణయాధికారం తీసుకునే కేసు ►ఇది ఏదో ఇద్దరు గల్లా పట్టుకుని కొట్టుకున్న కేసు కాదు ►ఇది చాలా తీవ్రమైన ఆర్ధికనేరానికి సంబంధించి కేసు ►నేరం జరిగిందనే ప్రాథమిక ఆధారాలు ఉన్న కేసుల్లో... సెక్షన్ 482 కింద క్వాష్ చేయకూడదని ఎంఆర్ షా తీర్పు ఉంది ఈ కేసులో అసలు విచారణ చేయాలా? వద్దా? అనేది 17ఏపై ఆధారపడి ఉంది కదా!: కోర్టు రోహత్గీ వాదనలు కొనసాగిస్తూ.. ►సెక్షన్ 482కింద క్వాష్ అనేది చాలా అరుదైన కేసుల్లో మాత్రమే వర్తింపజేయాలని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయి ►17ఏ అనేది ఈ కేసులో వర్తించదు ► 17ఏ చట్టం రావడానికి ముందే నేరం జరిగింది ►2018 జులైలో 17ఏ చట్టం అమలులోకి వచ్చింది ►2018 జులై కంటే ముందు నేరం జరిగింది కాబట్టి 17ఏ అనేది ఈ కేసులో వర్తించదు ►2015-16లో లేని చట్టం అనేది అప్పుడు జరిగిన నేరానికి ఎలా వర్తిస్తుంది? ►స్కిల్ స్కామ్ కేసులో మరింత దర్యాప్తు అవసరం ►ఒక వ్యక్తి మీద అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదయింది:రోహత్గీ ►ఒక వేళ కోర్టు ఆ సెక్షన్లు తొలగించాలనుకుంటే.. మిగతా సెక్షన్ల కింద కేసు కొనసాగుతుంది:రోహత్గీ ►గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ ఇది: రోహత్గీ 👇 ►రోహత్గీ : శాసనవ్యవస్థ ద్వారా తనకు సంక్రమించిన అధికారాన్ని దుర్వినియోగం చేసిన కేసు ఇది. అందుకే సెక్షన్ 44 PMLA పెట్టారు ►జస్టిస్ బోస్ : ACB కోర్టుకున్న పరిధి ఏంటీ? ►జస్టిస్ త్రివేదీ : కేవలం IPC కేసులే కదా.? ►రోహత్గీ : ACB కోర్టుకు (ప్రత్యేక కోర్టు)కు కచ్చితమైన పరిధి ఉంది. ఎప్పుడయితే వేర్వేరు సెక్షన్ల కింద నమోదయిన నేరాలన్నీ ఒక అంశంలో నమోదయి ఉంటే.. ప్రత్యేక కోర్టుకు అధికారం ఉంటుంది. ►జస్టిస్ త్రివేదీ : ఒక వేళ అవినీతి నిరోధక చట్టం ఉపసంహరిస్తే ఏమవుతుంది? ►రోహత్గీ : పదేళ్ల తర్వాత మీరు వెనక్కి వెళ్లలేరు 02:38PM, అక్టోబర్ 17, 2023 స్పెషల్ కోర్టుకు ఆ అధికారం ఉంది ►వాదనలు వింటున్న జస్టిస్ అనిరుద్ధ బోస్ , జస్టిస్ బేలా త్రివేది ►ఈ కేసులో ఉన్న ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవే: ముకుల్ రోహత్గీ ►విచారణ అనేది ఛార్జెస్ ఫ్రేమింగ్ తర్వాతనే ప్రారంభం అవుతుంది కదా?: కోర్టు ►ముందుగా పీసీ యాక్ట్ పెట్టిన తర్వాత మళ్లీ దానిని తీసేస్తే స్పెషల్ జడ్జికి విచారణాధికారం ఉండదు కదా?: కోర్టు ►పీసీ యాక్ట్ వర్తించకపోయినా.. మిగిలిన సెక్షన్లపై విచారించొచ్చు: రోహత్గీ ►ఈ కేసులో మరింత మంది ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నారు: రోహత్గీ ►చంద్రబాబు కూడా ప్రభుత్వ ప్రతినిధే కదా?: కోర్టు ►పీసీ యాక్ట్ లేకపోయినా.. విచారణ చేసే అధికారం స్పెషల్ కోర్టుకు ఉంది: రోహత్గి ►సగం సెక్షన్లకు ఒక కోర్టులో విచారణ, మరో సగం సెక్షన్లకు మరో కోర్టులో విచారణ అనడం లా కాదు ►ఇలా భావిస్తే.. వ్యవస్థ అపహస్యం అవుతుంది ►ఇది తీవ్రమైన నేరం...విచారణ చేసే అధికారం స్పెషల్ కోర్టుకు ఉంది ►పీసీ యాక్ట్ ప్రకారం స్పెషల్ కోర్టుకు ఉన్న విచారణ పరిధి ఏంటి?: జస్టిస్ అనిరుధ్ బోస్ ప్రశ్న ►జిల్లా జడ్జికి ఉండే అధికారాలూ స్పెషల్ జడ్జికి కూడా ఉంటాయి: రోహత్గి 02:30PM, అక్టోబర్ 17, 2023 ►వర్చువల్గా వాదనలు వింటున్న చంద్రబాబు లాయర్ హరీష్ సాల్వే ►కాసేపు ఆగి వస్తానంటూ బయటకు వెళ్లిపోయిన బాబు మరో లాయర్ సిద్ధార్థ లూథ్రా 02:26PM, అక్టోబర్ 17, 2023 క్వాష్ వేయడం అత్యంత తొందరపాటు చర్య ►17ఏ సెక్షన్ అనేది నిజాయితీ కలిగిన ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకే వర్తిస్తుంది: రోహత్గి ►17ఏ సెక్షన్ చంద్రబాబుకి వర్తించదు ►ఈ కేసులో నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయి ►పాత నేరాలకు సంబంధించి ఈ సెక్షన్ వర్తించదు ►స్కిల్ స్కామ్ జరిగిన 2015-16 సమయంలో.. అంటే నేరం జరిగిన సమయంలో 17ఏ సెక్షన్ లేదు:రోహత్గి ►17ఏ సెక్షన్ అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుంది ►అవినీతి పరులకు ఈ సెక్షన్ రక్షణ కవచం కాకూడదు:రోహత్గి ►అవినీతి నిరోధక చట్టాన్ని బలోపేతం చేయడానికే ఈ సెక్షన్ తెచ్చారు:రోహత్గి ►నిజాయితీ గల ప్రజాప్రతినిధులు నిర్ణయాలు తీసుకునే సమయంలో భయం లేకుండా ఉండేందుకు 17-ఏ తెచ్చారు:రోహత్గి ►ప్రజాప్రతినిధులు తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎక్కడైనా పొరపాటు జరిగితే 17-ఏ కాపాడుతుందనేది చట్టం ఉద్దేశం:రోహత్గి ►అరెస్ట్ చేసిన ఐదు రోజులకే క్వాష్ పిటిషన్ వేయడం అత్యంత తొందరపాటు చర్య:రోహత్గి ►విచారణ చేస్తున్న అధికారులకు కనీసం సమయం ఇవ్వకపోవడం కూడా సరికాదు:రోహత్గి ►సెక్షన్ 482 ప్రకారం క్వాష్ చేడయం అనేది.. అత్యంత అరుదైన కేసుల్లోనే తీసుకునే నిర్ణయం:రోహత్గి ►కేసు ట్రయల్ దశలో ఉన్నప్పుడు సెక్షన్ 482 ద్వారా క్వాష్ కోరడం సరికాదు:రోహత్గి ►గతంలో కొన్ని కేసుల్లో పీసీయాక్ట్ కొట్టేసినా సెక్షన్ 4 ప్రకారం.. ఐపీసీ సెక్షన్లపై స్పెషల్ ట్రయల్ కోర్టు విచారణ కొనసాగించవచ్చు:రోహత్గి 02:08PM, అక్టోబర్ 17, 2023 సుప్రీంలో బాబు పిటిషన్పై విచారణ ప్రారంభం ►చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభం ►వాదనలు వినిపిస్తోన్న సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి ►సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న రోహత్గి ►సెక్షన్ 17 ఏ చుట్టూరానే కొనసాగుతున్న వాదనలు ►ఇవాళ క్వాష్ పిటిషన్పై వాదనలు ముగిసే అవకాశం? 01:38PM, అక్టోబర్ 17, 2023 టీడీపీపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ ►తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అన్ని సీట్లలో పోటీ చేయదట ►క్యాండిడేట్లు దొరకడంలేదని అనుకోవాలా? ►87 సీట్లలో మాత్రమే అభ్యర్థులను నిలబెడతామని అక్కడి పార్టీ అధ్యక్షుడు ప్రకటించారు ►తెలంగాణ ప్రాంతానికి కూడా చంద్రబాబు గారు తొమ్మిదేళ్లు సిఎంగా ఉన్నారు ►ఏపీలో పచ్చ పార్టీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది అంటూ ట్వీట్ తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అన్ని సీట్లలో పోటీ చేయదట. క్యాండిడేట్లు దొరకడంలేదని అనుకోవాలా? 87 సీట్లలో మాత్రమే అభ్యర్థులను నిలబెడతామని అక్కడి పార్టీ అధ్యక్షుడు ప్రకటించారు. తెలంగాణ ప్రాంతానికి కూడా చంద్రబాబు గారు తొమ్మిదేళ్లు సిఎంగా ఉన్నారు. ఏపీలో పచ్చ పార్టీ పరిస్థితి… — Vijayasai Reddy V (@VSReddy_MP) October 17, 2023 12:50PM, అక్టోబర్ 17, 2023 చంద్రబాబు హెల్త్ బులిటెన్పై పిటిషన్ ►చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన తరపు లాయర్ల పిటిషన్ ►విచారణ చేపట్టిన విజయవాడ ఏసీబీ కోర్టు ►పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి ఏసీబీ కోర్టు ఆదేశం. 12:32PM, అక్టోబర్ 17, 2023 ►స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ ►విచారణను ఎల్లుండికి వాయిదా వేసిన కోర్టు ►స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పై విచారణ వాయిదా ►విచారణను గురువారానికి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు ►చంద్రబాబు లాయర్ల అభ్యర్థన మేరకు విచారణ వాయిదా 12:10PM, అక్టోబర్ 17, 2023 ►మార్గదర్శి చిట్ఫండ్స్లో జీజే రెడ్డి వారసులకు షేర్స్ ఉన్నాయి: అడ్వొకేట్ శివరాంరెడ్డి ►మార్గదర్శిలో జీజేరెడ్డికి షేర్స్ ఉన్నట్లు 2014 లో వెలుగులోకి వచ్చింది ►జీజే రెడ్డి మార్గదర్శి డైరెక్టర్ గా, ప్రమోటర్ గా పనిచేశారు ►జీజే రెడ్డి వారసులతో బలవంతంగా సంతకాలు పెట్టించి షేర్స్ బదిలీ చేయించుకున్నారు ►యూరిరెడ్డి ప్రమేయం లేకుండానే షేర్స్ మార్గదర్శికి బదిలీ చేశారు ►యూరిరెడ్డి కి చెందిన షేర్లను బలవంతంగా లాక్కున్నారు ►యూరిరెడ్డి షేర్లు శైలజా కిరణ్ కు బదిలీ చేసినట్లు లెక్కల్లో చూపించారు ► నా తండ్రి జీజే రెడ్డి.. రామోజీకి 1962 లో రూ. 5 వేలు ఇచ్చారు: యూరిరెడ్డి ►నా తండ్రి పేరు మీద షేర్స్ ఉన్నాయి ►మమల్ని బెదిరించడంతో సంతకం చేశారు. ►మా షేర్స్ను బలవంతంగా శైలజా పేరు మీదకు బదలాయించారు. 12:05PM, అక్టోబర్ 17, 2023 ►సీఐడీ విచారణకు హాజరుకాని కిలారు రాజేష్ ►ఇవాళ డాక్యుమెంట్లు తీసుకురావాల్సిందిగా రాజేష్కు తెలిపిన సీఐడీ అధికారులు ►సీఐడీ అడిగిన డాక్యుమెంట్లు అందుబాటులో లేవని మెయిల్ ద్వారా తెలిపిన కిలారు రాజేష్ ►దసరా తర్వాత డాక్యుమెంట్లు తీసుకుని వస్తానని సీఐడీకి మెయిల్ చేసిన కిలారు రాజేష్ 11:05AM, అక్టోబర్ 17, 2023 ►న్యూఢిల్లీ: చంద్రబాబు ఫైబర్ నెట్ స్కామ్ కేసుపై విచారణ మధ్యాహ్నానికి వాయిదా ► స్కిల్ స్కామ్ కేసు, ఫైబర్ నెట్ స్కామ్ కేసు.. రెండూ ఒకేసారి విచారణ చేస్తామన్న జస్టిస్ అనిరుధ్ బోస్ 10:25AM, అక్టోబర్ 17, 2023 ►ఇవాళ చంద్రబాబుతో వర్చువల్ గా మాట్లాడనున్న ఏసీబీ న్యాయమూర్తి ►మధ్యాహ్నం చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ 09:25AM, అక్టోబర్ 17, 2023 ఓటు దొంగలు వాళ్లు: తెలంగాణ మంత్రి హరీష్రావు ►చంద్ర బాబు డైరక్షన్ లో నాడు రేవంత్రెడ్డి నోటుకు ఓటు విషయంలో ప్రసిద్ధి ►నేడు అదే విధంగా కాంగ్రెస్ నోట్లకు సీట్లను అమ్ముకుంటోందని గాందీభవన్లో మాట్లాడుతున్నారు ►ఇలాంటి వాళ్లకు అధికారం అప్ప గిస్తే రాష్ట్రాన్ని కూడా అమ్ముతారు 09:20AM, అక్టోబర్ 17, 2023 న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు టిడిపి కొత్త వ్యూహం ► ఏపీ టుమారో పేరిట సంతకాల సేకరణ ► 36 లక్షల డిజిటల్ సంతకాలు సేకరించామంటూ ప్రచారం ► చంద్రబాబు బయటకు రావాలంటూ డిమాండ్లు ► ఢిల్లీకి వెళ్లి సీజేఐ ఆఫీస్ లో డిజిటల్ సంతకాలు పత్రాలు అందజేత ► చంద్రబాబు బయటకు రావాలంటే ఇదేనా మీకు తెలిసిన పద్ధతి? ► కోర్టులపై ఒత్తిడి తెచ్చి కేసు నుంచి బయటపడాలనుకుంటున్నారా? ► సంతకాలు తేగానే చేసిన నేరం పోతుందా? ► చంద్రబాబు అనుభవం ఏపీకి అవసరమని చెబుతున్న వాళ్లు చంద్రబాబు చేసిన తప్పుల గురించి మాట్లాడరా? ► చంద్రబాబు తప్పు చేయలేదని కోర్టుల్లో సీనియర్ లాయర్లు ఎందుకు చెప్పడం లేదు? ► కేవలం అరెస్ట్ చేసిన విధానాన్ని మాత్రమే చూపి కేసు కొట్టేయమని ఎందుకు అడుగుతున్నారు? ► రేపు కేసు బెంచ్ మీదకు వస్తున్న సమయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కార్యాలయంలో సంతకాలు ఎలా ఇస్తారు? ► అసలు మీరు ఇచ్చిన సంతకాలకు ఎంత విశ్వసనీయత ఉంది? ► రేపు ఇంకొకరు కోటి సంతకాలు తెస్తే.. తప్పును ఒప్పు అంటారా? 09:18AM, 09:20AM, అక్టోబర్ 17, 2023 నందమూరి, నారా ఒకే లైన్లో ఉన్నారా? ► చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబాల మధ్య బేధాబిప్రాయాలొచ్చాయా? ► బావ చంద్రబాబు జైల్లో ఉంటే, బాలయ్య సినిమా ఫంక్షన్లో బిజీ బిజీగా ఎందుకుంటున్నారు? ► బ్రాహ్మణిని సొంత కుటుంబ సభ్యులు కనీస మాత్రం పట్టించుకోవడం లేదా? ► సినిమా ఫంక్షన్లకు హాజరయి జోకులు వేసే మోక్షజ్ఞ... అక్క బ్రాహ్మణీకి సంఘీభావం ఎందుకు తెలపలేదు? ► ఇన్నాళ్లు రాజమండ్రిలో బ్రాహ్మణీ ఉంటే కనీసం పరామర్శించలేదెందుకు? ► ఏపీ రాజకీయాల్లో బాలకృష్ణను తలదూర్చొద్దని చంద్రబాబు చెప్పడమే కారణమా? ► కేవలం తెలంగాణ రాజకీయాలకు మాత్రమే బాలకృష్ణను పరిమితం కావాలన్న బాబు సూచన నచ్చలేదా? ► నిరసన కార్యక్రమాల్లో బాలకృష్ణ భార్య వసుంధర ఎందుకు కనిపించడం లేదు? ► గతంలో హిందూపురం ఎన్నికల్లో ప్రచారంలో యాక్టివ్ గా కనిపించిన వసుంధర ఇప్పుడు నారా కుటుంబంపై కినుక వహించారా? ► ఇప్పుడెందుకు వదిన భువనేశ్వరీ పక్కన వసుంధర కనిపించడం లేదు? ► క్యాండిళ్ల ర్యాలీ, సంకెళ్ల ర్యాలీలో భువనేశ్వరీకి సొంత కుటుంబం నుంచి అంతగా మద్ధతెందుకు రాలేదు? ► హఠాత్తుగా బాబు కుటుంబ సభ్యులంతా రాజమండ్రి నుంచి వెళ్లిపోయారెందుకు? 09:10AM, అక్టోబర్ 17, 2023 స్కిల్ కేసుపై నేడు హైకోర్టులో విచారణ ►చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో కీలక వాదనలు ►బెయిల్ పిటిషషన్ను ఏసీబీ కోర్టు కొట్టివేయడంతో హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు లాయర్లు ►నేడు ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదుల పిటిషన్ పై విచారణ ►చంద్రబాబు ఆరోగ్యం పై దాఖలైన పిటిషన్ పై విచారణ 09:02AM, అక్టోబర్ 17, 2023 ఇన్నర్రింగ్ రోడ్ కేసులో నేడు ఏపీ హైకోర్టు విచారణ ►ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన మాజీమంత్రి నారాయణ బావమరిది మునిశంకర్ ►మునిశంకర్ను నిందితుడిగా చేర్చిన సీఐడీ ►నేడు మునిశంకర్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ ►ఇన్నర్రింగ్ రోడ్ కేసులో A-17గా అవుల మునిశంకర్ 9:00AM, అక్టోబర్ 17, 2023 నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు స్కిల్ స్కాం కేసు విచారణ ►మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ చేయనున్న ధర్మాసనం ►కేసు విచారిస్తున్న జస్టిస్ అనిరుద్ధ బోస్ , జస్టిస్ బేలా త్రివేది ►సెక్షన్ 17- A చంద్రబాబుకు వర్తింపజేయాలని వాదిస్తున్న ఆయన తరపు న్యాయవాదులు ►2015లోనే స్కిల్ స్కాంలో నేరం జరిగిందని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చిన ఏపీ ప్రభుత్వం ►2018 జూన్ లోనే ఈ అంశంపై విచారణ ప్రారంభమైందని న్యాయస్థానానికి వెల్లడించిన ప్రభుత్వం ►2018 జులై నెలలో సెక్షన్ 17ఏ తీసుకొచ్చారని, కనుక ఈ చట్టం బాబుకు వర్తించదని స్పష్టం చేస్తున్న ప్రభుత్వం 8:30AM, అక్టోబర్ 17, 2023 ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 38వ రోజు రిమాండ్ ఖైదీగా అయితే చంద్రబాబు ►జైల్లో నిలకడగా చంద్రబాబు ఆరోగ్యం ►ప్రతిరోజు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్న జైలు అధికారులు ►స్నేహ బ్యారక్ లో చంద్రబాబుకు టవర్ ఏసి ఏర్పాటు ►ప్రతిరోజు మూడుసార్లు వైద్య పరీక్షలు 08:18AM, అక్టోబర్ 17, 2023 తాడేపల్లి: ►నేడు రెండోరోజు సిట్ విచారణకు టీడీపీ నేత, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ ►సోమవారం ఉదయం పదిన్నర నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన విచారణ ►మొత్తం 25 ప్రశ్నలు అడిగిన సీఐడీ అధికారులు ►మనోజ్ వాసుదేవ్ పార్ధసానితో సంబంధాల గురించి ప్రశ్నంచగా ఆయన ఎవరో తనకు తెలియదన్న కిలారి ►పార్ధసానితో వాట్సప్ చాటింగ్, నగదు ట్రాన్సాక్షన్ వివరాలను రాజేష్ ముందు పెట్టిన అధికారులు ►సమాధానం చెప్పకుండా నీళ్లు నమిలిన రాజేష్ ►నారా లోకేష్ తో పరిచయం, వ్యాపారాల గురించి అడిగిన ప్రశ్నలకూ సైలెంట్ గా ఉన్న కిలారు ►స్కిల్ స్కాం పై ప్రశ్నలకు తెలీదు, గుర్తులేదు అంటూ సమాధానం దాట వేసిన రాజేష్ ►నేడు రెండోరోజు సిట్ విచారణకు టీడీపీ నేత, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ ►సోమవారం ఉదయం పదిన్నర నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన విచారణ ►మొత్తం 25 ప్రశ్నలు అడిగిన సీఐడీ అధికారులు ►మనోజ్ వాసుదేవ్ పార్ధసానితో సంబంధాల గురించి ప్రశ్నంచగా ఆయన ఎవరో తనకు తెలియదన్న కిలారి ►పార్ధసానితో వాట్సప్ చాటింగ్, నగదు ట్రాన్సాక్షన్ వివరాలను రాజేష్ ముందు పెట్టిన అధికారులు ►సమాధానం చెప్పకుండా నీళ్లు నమిలిన రాజేష్ ►నారా లోకేష్ తో పరిచయం, వ్యాపారాల గురించి అడిగిన ప్రశ్నలకూ సైలెంట్ గా ఉన్న కిలారు ►స్కిల్ స్కాం పై ప్రశ్నలకు తెలీదు, గుర్తులేదు అంటూ సమాధానం దాట వేసిన రాజేష్ 7:00 AM, అక్టోబర్ 17, 2023 సుప్రీంలో నేడు ఫైబర్ నెట్ స్కామ్ కేసు విచారణ ►స్కిల్ స్కాంలో 17A వర్తింప చేయాలని పిటిషన్తోపాటు.. ఫైబర్ నెట్ స్కామ్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్ ►స్కిల్ స్కాంలో చంద్రబాబుకు 17A వర్తించదన్న రోహత్గీ ►17A వర్తింప చేయాలని వాదించిన చంద్రబాబు లాయర్లు ►విచారణ చేయనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్ , జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ►కోర్టు నెంబర్ 6 లో ఐటం నెంబర్ 3గా లిస్టు అయిన చంద్రబాబు కేసు ►ఈ కేసులో ఇప్పటికే ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు చంద్రబాబు అరెస్టుపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కామెంట్స్... ►చంద్రబాబు తప్పు చేయలేదని తెలుగుదేశం పార్టీ నాయకులే చెప్పడం లేదు ►కేవలం సాంకేతిక అంశాలు చూపించి మాత్రమే కేసు కొట్టేయాలంటున్నారు ►చంద్రబాబు జనం నుంచి వచ్చిన నాయకుడు కాదు ►నాయకుడు జనం నుండి వస్తే ప్రజల స్పందన వేరేగా ఉంటుంది ►చంద్రబాబు అరెస్టై 37 రోజులు గడుస్తున్నా ప్రజల వద్ద నుంచి ఎటువంటి స్పందన లేదు ►టిడిపి నాయకులు కూడా కొన్ని రోజులు ఆందోళన చేసినట్టు తూతూ మంత్రంగా చేసి సర్దేసుకున్నారు ►ప్రజల మనసును గెలుచుకున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఇదీ చదవండి: కిలారు రాజేష్ సైలెన్స్.. మళ్లీ విచారణ -
బెయిల్, క్వాష్ పిటిషన్లపై నేడే విచారణ
-
ఏమీ తెలియదంటూ.. 17ఏ రక్షణ కావాలంటే ఎలా?
సాక్షి, నూఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం గురించి తనకేమీ తెలియదన్నప్పుడు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ద్వారా రక్షణ కావాలని చంద్రబాబు ఎలా అడుగుతారని ఏపీ ప్రభుత్వ సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ప్రశ్నించారు. అలా కోరడంలో అర్థం లేదన్నారు. ‘అధికార విధులు నిర్వర్తించడమంటే అవినీతికి పాల్పడడం కాదు కదా? చట్టాల్లో నిజాయితీపరులకే రక్షణ కల్పించారు. సెక్షన్ 17ఏ కూడా అలాంటివారి కోసమే’ అంటూ దీనిపై సుప్రీంకోర్టు ఇచ్చిన పలు రూలింగ్లను ప్రస్తావించారు. ‘స్కిల్ డెవలప్మెంట్’ స్కామ్లో గవర్నరు అనుమతి లేకుండా తనను అరెస్టు చేశారు కనక... మొత్తం కేసును కొట్టేయాలంటూ చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. నేరం జరిగిందా? లేదా? అన్న అంశంపై కాకుండా టెక్నికల్గా చంద్రబాబు అరెస్టు చెల్లదు కాబట్టి కేసును కొట్టేయాలంటూ ఆయన లాయర్లు కోరటంతో శుక్రవారం కూడా ఈ విషయంపైనే వాదనలు కొనసాగాయి. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఎదుట... చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీశ్సాల్వే, సిద్ధార్థ లూథ్రా, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. మరోవైపు ఫైబర్నెట్ కుంభకోణం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్ కూడా ఇదే ధర్మాసనం ముందుకు వచ్చింది. రెండు కేసుల విచారణను మంగళవారానికి కోర్టు వాయిదా వేసింది. సవరణకు ముందు జరిగిన ఘటనకు పాత చట్టమే... ‘రద్దు చేసిన సెక్షన్ల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చా అని ఈ ధర్మాసనం ఇదివరకు అడిగింది. సరిగ్గా ఇదే పాయింట్పై ఓ తీర్పు ఉంది’ అంటూ ఎంసీ గుప్తా కేసును ముకుల్ రోహత్గీ ప్రస్తావించారు. 1947లో చట్టం రద్దు చేశాక దాంట్లోని నిబంధనల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయజాలరని ఎంసీ గుప్తా కేసులో పిటిషనర్ వాదించారన్నారు. కానీ కొత్త చట్టం అమల్లోకి రాకముందే నేరం జరిగిన విషయాన్ని కోర్టు గుర్తించిందని... చట్టాన్ని రద్దు చేసినా, వెనక్కి తీసుకున్నా నేరం జరిగే నాటికి ఉన్న చట్టమే వర్తిస్తుందని తీర్పునిచ్చిందని చెప్పారు. సరిగ్గా చంద్రబాబు కేసులోనూ అంతే జరిగిందన్నారు. చంద్రబాబుపై సెక్షన్ 13 (సీ),(డీ) కింద అభియోగాలు మోపారని, వాటిని తర్వాత రద్దు చేసినప్పటికీ, రద్దుకు ముందు నేరం జరిగిందని రోహత్గీ వివరించారు. ‘చట్ట సవరణలు సాధారణం. పాత చట్టాల్లో కొంత భాగం పోతుంది. కానీ సవరణకు ముందు జరిగిన ఘటనలకు మాత్రం ఆ పాత చట్టమే వర్తిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ఈ కేసుకు ఎట్టి పరిస్థితుల్లోనూ సెక్షన్ 17ఏ వర్తించదని రోహత్గీ తేల్చి చెప్పారు. ‘సెక్షన్ 17ఏ జూలై 2018లో అమలులోకి వచ్చింది. నేరం 2015–2016 మధ్య జరిగింది. ఆ సమయంలో చట్టంలో సెక్షన్ 17ఏ లేదు’ అని రోహత్గీ తెలిపారు. చట్ట సవరణకు ముందు కేసు కాబట్టి 17ఏ వర్తించదన్నారు. సుప్రీంకోర్టులో ఎన్నడూ ఇలా జరగలేదు... దర్యాప్తు ప్రారంభించిన ఐదు–పది రోజుల్లోనే విచారణను అడ్డుకోవడానికి కోర్టు అంగీకరించే అవకాశం లేదని ముకుల్ రోహత్గీ చెప్పారు. హైకోర్టులో కస్టడీని వ్యతిరేకిస్తూ వాదించి, అదే రోజున సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం తాను ఎన్నడూ చూడలేదన్నారు. విచారణ ప్రారంభమైందనడానికి 2018 మే, జూన్ నెలల డాక్యుమెంట్లున్నాయని, వీటిని హైకోర్టుకు కూడా ఇచ్చామని, తమ వాదనలతో కోర్టు ఏకీభవించిందని చెప్పారు. బాబుకు డబ్బు అందినట్లు ఎలా గుర్తించారు? చంద్రబాబు అనుకున్నది జరిగితే దర్యాప్తు ప్రాథమిక దశలోనే నిలిచిపోతుందని, ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాకుండా ఎన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేశాయో చూడాలని రోహత్గీ కోరారు. ‘ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రెండు సంస్థలతో ఒప్పందం చేసుకోవడం కోసం ప్రారంభమైంది. ఎలాంటి టెండర్ లేదు. సంస్థలు 90 శాతం పెట్టుబడి పెడతాయన్నది ఆలోచన’ అని రోహత్గీ చెబుతుండగా.. ఈ నిర్ణయం ఏ స్థాయిలో తీసుకున్నారని జస్టిస్ త్రివేది ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకున్నారని రోహత్గీ తెలిపారు. చంద్రబాబుకు సొమ్ములు అందాయని ఎలా గుర్తించారని న్యాయమూర్తి ప్రశ్నించగా.. సొమ్ములు షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు, ఆయన పార్టీ ఖాతాలకు చేరాయని, అది ప్రజాధనమని, దీనిపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని రోహత్గీ తెలిపారు. దీంతో మరో రోజు విచారణ చేపడతామని జస్టిస్ బోస్ పేర్కొంటూ మంగళవారానికి వాయిదా వేశారు. అరెస్ట్ భయం ఉంది... అనంతరం ఫైబర్నెట్ కుంభకోణం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిలు పిటిషన్పై లూథ్రా వాదనలు ప్రారంభించారు. ఒక కేసులో అరెస్టు చేశాక... పలు కేసులు తెరపైకి తెచ్చారన్నారు. 2021లో ఎఫ్ఐఆర్ నమోదైందని, తర్వాత ఏమీ జరగకున్నా.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టయ్యాక సెప్టెంబరు 19న ఫైబర్నెట్ కేసులో నిందితుడిగా చేర్చి కోర్టు ముందు హాజరు కావాలని అధికారులు పీటీ వారెంట్ దాఖలు చేశారన్నారు. పీటీ వారెంట్ను ఏసీబీ కోర్టు అనుమతించిందని, ఇప్పుడు అరెస్టు చేస్తారేమో అని లూథ్రా ఆందోళన వ్యక్తం చేశారు. విచారణ పూర్తి చేశామంటున్నారని, ఇక్కడ కూడా సెక్షన్ 17ఏ వర్తిస్తుందని, అయినప్పటికీ అధికారులు పరిగణనలోకి తీసుకోవడం లేదని లూథ్రా చెప్పారు. ఈ కేసులో ముగ్గురు ఇప్పటికే ముందస్తు బెయిలుపై బయట ఉన్నారని, మరో ముగ్గురు రెగ్యులర్ బెయిలుపై ఉన్నారని చెప్పారు. ఈ కేసులో చంద్రబాబును అరెస్టు చేయాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయన్నారు. ఈ కేసులోనూ సెక్షన్ 17ఏ వర్తిస్తుందా అని జస్టిస్ బోస్ ప్రశ్నిస్తూ.. షార్ట్ నోటీసు ఇచ్చి మంగళవారం విచారణ చేపడతామన్నారు. -
ఫైబర్ నెట్ పీటీ వారెంట్పై 18 వరకు నిర్ణయం వాయిదా - ఏసీబీ కోర్టు
విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణ 18కి వాయిదా పడింది. ఫైబర్ నెట్ పీటీ వారెంట్పై ఎప్పుడు కోర్టు ముందు హాజరుపరచాలో 18 తర్వాత నిర్ణయిస్తామని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. కావున సోమవారం కోర్టుకి హాజరుపరచాల్సిన అవసరం లేదు. విచారణ సందర్బంగా చంద్రబాబుని 18 వరకు కస్టడీకి తీసుకోకూడదని సీఐడీని ఆదేశించింది. అంతే కాకుండా ఆ లోపల కోర్టు ముందు హాజరుపరచవద్దని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం తీర్పు ఆధారంగా 18 తర్వాతే చంద్రబాబు పిటి వారెంట్పై నిర్ణయం తీసుకోనుంది. -
సుప్రీంలో చంద్రబాబు రెండు పిటిషన్ల విచారణ వాయిదా
సాక్షి, ఢిల్లీ: సుప్రీం కోర్టులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వేసిన పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. స్కిల్డెవలప్మెంట్ కుంభకోణం కేసులో క్వాష్ పిటిషన్తో పాటు ఫైబర్ నెట్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వేర్వేరు పిటిషన్లు వేశారాయన. ఈ క్రమంలో ఇవాళ రెండు పిటిషన్లు విచారణకు వచ్చాయి. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో తనపై సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై సీఐడీ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ.. జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వాదనలు వినిపించారు. ‘‘ఐదేళ్ల కిందట జరిగిన నేరానికి కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు చట్టం అనుమతిస్తుంది. ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదు చేశారనేది ముఖ్యం కాదు. నేరం జరిగిన సమయంలో ఉన్న చట్టం ఆధారంగానే విచారణ జరగాలి. కొన్ని చట్టాలను సవరించిన ఆ చట్టంలోని మిగిలిన భాగం అలాగే కొనసాగుతుంది. 17ఏ చట్టం తర్వాత జరిగిన కేసులకే వర్తిస్తుందని.. సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అవినీతి అనేది ఎప్పుడు ఉద్యోగ బాధ్యత కిందకు రాదు. 17ఏ చట్టంం ప్రాథమిక విచారణకే వ్యతిరేకం అయినప్పుడు.. కేసులు ఎలా విచారిస్తారు. 17ఏ విషయంపై నాలుగు హైకోర్టులు చెప్పిన తీర్పులు చంద్రబాబుకి వ్యతిరేకంగానే ఉన్నాయి. నేరం జరిగిన సమయానికి 17ఏ లేదు కాబట్టి.. ఇది బాబుకి వర్తించదు. ఈ కేసులో నేరం జరిగినట్లు స్పష్టమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. ప్రాథమిక ఆధారాల ప్రకారం ఇది ఎక్కడా ఉద్యోగ బాధ్యతగా కనిపించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ 17ఏ చంద్రబాబుకు వర్తించదు. ఈ కేసులో నేరం జరిగినట్లు స్పష్టమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. ప్రాథమిక ఆధారాల ప్రకారం.. ఇది ఎక్కడా ఉద్యోగ బాధ్యతగా కనిపించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ 17ఏ చంద్రబాబుకు వర్తించదు.. ఇది అవినీతికి సంబంధించిన చట్టం. అవినీతి పరుల్ని కాపాడే చట్టం కాదు. చంద్రబాబు కేసు ఉద్యోగ బాధ్యత కిందకు రాదు కాబట్టి 17ఏ వర్తించదు. గతంలో నేరం జరిగి.. ఇప్పుడు కేసు రిజిస్టర్ చేసినా 17ఏ వర్తించదు. చంద్రబాబుది సాక్ష్యాలు తారుమారు చేయడం.. ప్రజాధనం లూటీ చేసిన కేసు. అరెస్ట్ చేసిన వెంటనే సెక్షన్ 482 కింద క్వాష్ అడగడం ఎంత వరకు కరెక్టో కోర్టు నిర్ణయించాలి. పోలీసులకు కనీసం విచారణ చేసే అవకాశం ఇవ్వకుండా క్వాష్ కోరడం ఎంత వరకు సబబు. స్కిల్ స్కాం కేసు విచారణ ప్రాథమిక దశలో ఉంది. ఈ సమయంలో చంద్రబాబు క్వాష్ సరికాదు. 17ఏ చట్టం రాకముందు జరిగిన నేరాలకు.. 17ఏ వర్తించదని నాలుగు హైకోర్టులు తీర్పు ఇచ్చాయి. 17ఏ వర్తిస్తుందని ఏమైనా తీర్పులున్నాయా? అని ప్రశ్నించిన బెంచ్ అలా తీర్పులు వచ్చినట్లు నా దృష్టికి రాలేదు.. రోహత్గీ 17ఏ వర్తిస్తుందని తీర్పులు ఉన్నాయి.. చంద్రబాబు తరపు న్యాయవాది లాయర్ లూథ్రా రోహత్గీ వాదనలు కొనసాగిస్తూ.. ‘‘కేసు విచారణ ప్రాథమిక దశలో ఉన్నప్పుడు.. విచారణను అడ్డుకోవద్దని సుప్రీం కోర్టు పలుమార్లు తీర్పు ఇచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయాలతో తనకు సంబంధం లేదని చంద్రబాబు చెబుతున్నారు. మరి నిర్ణయాలతో సంబంధం లేకుంటే.. 17ఏ ఎలా వర్తిస్తుంది?. 17ఏ అనేది కేవలం అధికార బాధ్యతలకు సంబంధించిన సెక్షన్. నేనే ఈ నిర్ణయాలకు బాధ్యుడిని అని చంద్రబాబు అంటేనే సెక్షన్ 17ఏ వర్తిస్తుంది. ఈ కేసులో 2018 జూన్ 5వ తేదీన జీఎస్టీ డీజీ రాసిన లేఖ చాలా కీలకం. విచారణ 2018లోనే ప్రారంభమైంది అని చెప్పడానికి ఇది తిరుగులేని సాక్ష్యం. జీఎస్టీ డీజీ రాసిన లేఖపై హైకోర్టులోనూ వాదనలు జరిగాయి. జీఎస్టీ రాసిన సమయంలో చంద్రబాబే సీఎంగా ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతి జరుగుతోందని.. 2017లోనే ఒక విజిల్ బ్లోయర్ లేఖ రాశారు. విజిల్ బ్లోయర్ పేరు చెప్పకుండా ఉండే చట్టం.. ఇంకా అమల్లో ఉందా? అని రోహత్గీని అడిగిన సుప్రీం కోర్టు విజిల్ బ్లోయర్తన గుర్తింపును చెప్పకుండా ఉండే హక్కు ఉంది: రోహత్గీ ..14మే 2017లో మరోసారి విజిల్ బ్లోయర్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతి జరుగుతోందని పుణే జీఎస్టీకి లేఖ రాశారు. ఢిల్లీ ప్రత్యేక చట్టానికి సవరణ 6ఏను గతంలో సుప్రీం కోర్టు కొట్టేసింది. విచారణ సంస్థలను విచారణ నుంచి అడ్డుకునేందుకు సవరణ చేయలేదు’’ అని రోహత్గీ వాదించారు. దాదాపు గంటన్నరపాటు సాగిన వాదనల అనంతరం పిటిషన్పై తదుపరి విచారణను అక్టోబర్ 17కు వాయిదా వేసింది ధర్మాసనం. చంద్రబాబుని అరెస్ట్ చేస్తారేమో? ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. చంద్రబాబు పిటిషన్ పై ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ వాయిదా వేసింది. అయితే.. పీటీ వారెంట్ ప్రకారం చంద్రబాబుని సోమవారం ఏసీబీ కోర్టులో హాజరుపర్చాల్సి ఉందని, ఆ రోజు హాజరుపరిస్తే గనుక ఈ కేసులో అరెస్ట్ చేస్తారని చంద్రబాబు లాయర్ లూథ్రా విచారణ వాయిదాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ రోజు హాజరుపరిస్తే అరెస్టు చేస్తారని, అప్పుడు ఈ పిటిషన్ నిరర్థకం అవుతుందని లూథ్రా ధర్మాసనానికి వివరించారు. ఆ దశలో సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న ముకుల్ రోహత్గి జోక్యం చేసుకుని.. ‘‘సోమవారం అరెస్టు ఉండద’’ని సీఐడీ తరఫున హామీ ఇచ్చారు. -
అవినీతిని కాపాడటానికా సెక్షన్ 17ఏ?
సాక్షి, న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. గవర్నరుకు సమాచారమివ్వకుండా తనను అరెస్టు చెయ్యటం చెల్లదు కనుక ఈ కేసును కొట్టేయాలంటూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లో మంగళవారం కూడా ఎలాంటి ఉపశమనం లభించలేదు. మంగళవారమే దీన్ని ముగించాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులుపట్టుబట్టినప్పటికీ.. దర్మాసనం ఈ కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. విశేషమేంటంటే తాను స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి పాల్పడలేదని కానీ... షెల్ కంపెనీల ద్వారా నిధులను కొల్లగొట్టడం జరగలేదని కానీ మొదటి నుంచీ ఒక్క ముక్క కూడా చెప్పని చంద్రబాబు... తాజా విచారణలో సైతం అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎ కింద తన అరెస్టు చెల్లదని, కాబట్టి కేసును కొట్టేయాలనే సాంకేతిక అంశాలనే సుప్రీంకోర్టు ధర్మాసనానికి వినిపించారు. నిజానికి అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(ఏ)ను 2018లో సవరించారు. కొన్ని పదవుల్లో ఉన్నవారికి అరెస్టు విషయంలో రక్షణ ఉండేలా... తగిన అనుమతితో అరెస్టు చేసేలా ఈ సవరణ చేశారు. కాకపోతే స్కిల్ కుంభకోణం 2018కి ముందే జరగటం... ఈ కేసులో పలు ఐపీసీ సెక్షన్లు కూడా ఉండటం వల్ల సెక్షన్ 17ఏ వర్తించదని ప్రతి కోర్టులోనూ చెబుతున్నా... సుప్రీంకోర్టులో సైతం ఇదే విషయంపై చంద్రబాబు లాయర్లు వాదనలు వినిపించటం గమనార్హం. సెక్షన్ 17ఏ అవినీతి కేసుల నుంచి కాపాడటానికా? అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ అనేది అవినీతి కేసుల నుంచి కాపాడటానికి కాదని మంగళవారం నాటి వాదనల్లో ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి చెప్పారు. మంగళవారం జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదీతో కూడిన ధర్మాసనం ఎదుట ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ నేరం కొన్నేళ్ల తర్వాత బయట పడితే అప్పటి చట్టాలకు లోబడే దర్యాప్తు జరుగుతుందని రోహత్గి ధర్మాసనానికి చెప్పారు. ‘‘చంద్రబాబు నాయుడి కేసు విషయానికొస్తే ఈ చట్ట సవరణ 2018లో జరిగింది. కానీ నేరం 2018 కంటే ముందు జరిగింది. మరి అప్పట్లో జరిగిన నేరాన్ని అప్పటి చట్టాల ప్రకారమే దర్యాప్తు చేస్తారు కదా? 17ఏ అనేది ఈ కేసులో ఒక భాగం మాత్రమే’’ అని వివరించారు. దర్యాప్తు అధికారి వద్ద ఉన్న సాక్ష్యాలు, ఆధారాలను బట్టి కోర్టు నిర్ణయం తీసుకోవాలని చెప్పారాయన. ఈ సందర్భంగా ఇరు పక్షాలనూ ధర్మాసనం పలు ప్రశ్నలు వేసింది. ప్రధానంగా ఈ కేసుకు సెక్షన్ 17ఏ వర్తించడంపై ఇరు పక్షాల న్యాయవాదులనూ తీసింది. తొలుత చంద్రబాబు నాయుడి తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే సోమవారం నాటి వాదనలను కొనసాగించారు. తనకు మరో గంట సమయమివ్వాలని ధర్మాసనాన్ని కోరగా అనుమతించింది. మూడు రోజులుగా వేచి చూస్తున్నామని ఇది ఇప్పటికే కొట్టేయాల్సిన కేసు అని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ధర్మాసనానికి తెలిపారు. అసలు నోటీసులివ్వకుండా మరోసారి వాదనలు వినిపించడానికి అవకాశం ఇవ్వకూడదన్నారు. క్రిమినల్ కేసులకు కౌంటరు అఫిడవిట్ అక్కర్లేదని హరీష్ సాల్వే పేర్కొనగా... ముకుల్ రోహత్గి విబేదించారు. కోర్టు ప్రొసీజర్ను అనుసరించాలని కోరారు. నిందితుడికి రక్షణ కల్పించే అంశాలు కోర్టుకు వివరిస్తానని, గంట సేపు వాదనలకు అవకాశం ఇవ్వాలని సాల్వే మరోసారి కోరగా ధర్మాసనం అనుమతించింది. గవర్నరు అనుమతి లేకుండా అరెస్టు చేశారు: సాల్వే సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా దర్యాప్తు చేయడం సరికాదని సాల్వే తెలిపారు. ముందుగా అనుమతి తీసుకున్నాకే చర్యలు చేపట్టాలన్నారు. సెక్షన్ 17ఏ దుర్వినియోగం కాకుండా ఉండాలనే తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కేసులో యశ్వంత్ సిన్హాపై దాఖలైన కేసుతో సహా మూడు కేసుల్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దర్యాప్తు అనేది హక్కు కాదని అవినీతి నిరోధక చట్టం చెబుతోందంటూ... ఆర్టికల్ 20(1)కి సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కూడా సాల్వే ఉదహరించారు. సాల్వే ఇలా పలు తీర్పులను ప్రస్తావిస్తుండగా... జస్టిస్ బోస్ వారించారు. చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి ఉండాలని చెప్పడమే తన ఉద్దేశమని సాల్వే వ్యాఖ్యానించారు. దీంతో అసలు ఎఫ్ఐఆర్లో ఉన్న అభియోగాలేంటని జస్టిస్ బేలా ఎం త్రివేదీ ఆరా తీశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో కుట్రకు పాల్పడ్డారన్నది ప్రధాన అభియోగం అని సాల్వే తెలిపారు. ఐపీసీ సెక్షన్ 120బీ, సెక్షన్ 420, సెక్షన్ 465 , అవినీతి నిరోధక (పీసీ) చట్టం సెక్షన్ 12, సెక్షన్ 13 వంటివి ఈ కేసులో ఉన్నాయన్నారు. ‘‘ఈ కేసు పూర్తిగా అవినీతి నిరోధక చట్టం కిందనే ఉంది. ఆ చట్టం లేకపోతే మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచాల్సి వచ్చేది’’ అన్నారు. అయితే ఈ అభియోగాలన్నీ మేజిస్ట్రేట్ ముందు విచారణ చేయతగిన అభియోగాలేనా? అని జస్టిస్ బోస్ ప్రశ్నించారు. పీసీ చట్టం మినహాయిస్తే ఇవన్నీ మేజిస్ట్రేట్ పరిధిలోవేనని సాల్వే తెలిపారు. మధ్యప్రదేశ్లో కొన్ని అంశాల్లో సెషన్స్ కోర్టు వెళ్లిన ధాఖలాలున్నాయని చంద్రబాబు తరఫు మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూత్రా చెప్పగా... జస్టిస్ త్రివేది జోక్యం చేసుకొని దేశమంతా ఒకే విధంగా ఉంటందని, మేజిస్ట్రేట్ పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో చంద్రబాబు తరఫున వాదనలు ముగించారు. సవరణల పేరుతో కేసు కొట్టేయమంటే ఎలా?: రోహత్గి ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి... చంద్రబాబుపై నమోదైన కేసులో ఎలాంటి రాజకీయ కక్షా లేదని మరోసారి స్పష్టం చేశారు. ‘‘‘ఎఫ్ఐఆర్ 2021లో నమోదయింది. 2023లో చంద్రబాబును నిందితుడిగా చేర్చారు’’ అంటూ సెపె్టంబరు 8 నుంచీ జరిగిన పరిణామాలు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ‘‘చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఈ కేసు పీసీ చట్టంలోని సెక్షన్ 17ఏకు లోబడే ఉందని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. అయినా అరెస్టయిన వెంటనే బెయిలు గురించో, రిమాండ్ వద్దనో కాకుండా నేరుగా పూర్తి కేసును కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్ వేశారంటే చంద్రబాబు ఏంటో అర్థం చేసుకోవాలి. రెండు రోజుల్లోనే హైకోర్టు ముందుకు క్వాష్ పిటిషన్ విచారణకు వచ్చిందంటే నిందితుడి ఉద్దేశాలను కోర్టు ఆలోచించాలి. కాకపోతే హైకోర్టు ఈ క్వాష్ పిటిషన్ కొట్టేసింది’’ అని రోహత్గీ వివరించారు. ఒకే కేసులో అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్లు ఉన్నప్పుడు ఏం చేయాలనే దానిపై కోర్టుకు రోహత్గి వివరణ ఇచ్చారు. చేసిన నేరానికి రెండు సెక్షన్లు వర్తింపజేసినప్పుడు ఏసీబీ కోర్టుకి రెండింటినీ విచారించే పరిధి ఉంటుందన్నారు. అయితే, సాల్వే చెప్పినట్లుగా అవినీతి నిరోధక చట్టాన్ని తొలగిస్తే.. సీఆర్పీసీ సెక్షన్ 3 కింద పేర్కొన్న నేరంతోపాటు ఇతర అభియోగాలు కూడా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పరిశీలించవచ్చునని చెప్పారు. ఈ దశలో జస్టిస్ త్రివేది జోక్యం చేసుకొని అవినీతి నిరోధక చట్టం తొలగించినప్పుడు సెక్షన్ 4(3) కూడా వర్తించదు కదా? అని ప్రశ్నించారు. అందుకే ఒకే కేసులో వేర్వేరు అభియోగాలుంటే ఏం చేయాలనే దానిపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చిందని రోహత్గీ చెప్పారు. చంద్రబాబు కేసులో పీసీ చట్టాన్ని తొలగించినా మిగతా అభియోగాలపై ప్రత్యేక కోర్టు దర్యాప్తు చేయొచ్చని వివరించారు. ‘‘చంద్రబాబు న్యాయవాది సాల్వే ప్రకారం ఈ కేసులో పీసీ చట్టం అభియోగాలు తొలగిస్తే.. సెక్షన్ 4(3) అభియోగాలకు అర్హత లేదు. అప్పుడు ప్రత్యేక కోర్టు పరిధి... ఆ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులు సంగతేంటి’’ అని జస్టిస్ త్రివేదీ ప్రశ్నించారు. సెక్షన్ 420 కింద అభియోగాలు ఉంటే వాటిని తొలగించలేమని, అదే విధంగా ఈ కేసులో పీసీ చట్టాన్ని కూడా తొలగించలేమని రోహత్గీ చెప్పారు. ‘‘ఒక వ్యక్తి మరో వ్యక్తిని కొడితే ఆ కేసులో ఉద్దేశపూర్వకంగా కొట్టడంతో పాటు స్వచ్ఛందంగా హాని కలిగించడానికి సంబంధించిన సెక్షన్ 323 కూడా ఉంటుంది. ఆ సెక్షన్ను గనక తొలగిస్తే అభియోగాలు పోతాయా? చట్ట ప్రకారం సదరు వ్యక్తికి శిక్ష పడాలి కదా? సవరణల ద్వారా వచ్చిన కొత్త సెక్షన్లు చట్టానికి బలం చేకూర్చాలి తప్ప సవరణ పేరుతో కేసును కొట్టేయమంటే ఎలా?’’ అని రోహత్గి ప్రశ్నించారు. ఎప్పటి నేరాలకు అప్పటి సెక్షన్లు... 2018 కన్నా ముందు జరిగిన నేరాలకు సెక్షన్ 17ఏ వర్తించదని రోహత్గీ చెప్పారు. ‘‘సెక్షన్ 17ఏ వల్ల దర్యాప్తునకు కొన్ని మినహాయింపులు వచ్చాయి. అంతే!. 2018లో పీసీ చట్టంలో కొన్ని సెక్షన్లు తొలగించారు. కానీ అంతకు ముందు జరిగిన నేరాలకు తొలగించిన సెక్షన్లు కూడా వర్తిస్తాయి. బాబు కేసు కూడా అంతే. చంద్రబాబుపై పీసీ చట్టం సెక్షన్ 13(1), (సీ), (డీ) అభియోగాలు ఉన్నాయి’’ అన్నారు. ఆ సెక్షన్లను చట్టం నుంచి తొలగించారుగా? అని జస్టిస్ త్రివేదీ ప్రశ్నించగా... ఇంతకు ముందు తాను చెప్పిన అంశం ఇదేనని, సవరణకు ముందు జరిగిన నేరాలకు తొలగించిన సెక్షన్లు వర్తిస్తాయని రోహత్గీ వివరించారు. చంద్రబాబు నిర్ణయాలు, అక్రమాల వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చిందన్నారు. ఈ అంశాలు దర్యాప్తు సంస్థ ఎప్పుడు గుర్తించిందో తెలపాలని జస్టిస్ త్రివేదీ కోరారు. ట్రయల్ దశలోనే గుర్తించారని రోహత్గి తెలిపారు. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ కొత్త విషయాలు తెరపైకి వచ్చాయని, భారీ స్థాయిలో అవినీతి జరిగినప్పుడు ప్రాథమికంగానే కేసు కొట్టేయాలని కోరడం సరికాదని రోహత్గి తెలిపారు. చట్ట సవరణ ఎప్పుడు చేయాలి? దాన్ని ఎప్పటి నుంచి అమలులోకి తేవాలి? అనేది పార్లమెంటు అధికారమని, అయితే ఈ కేసులో 2018 కన్నా ముందు జరిగిన నేరాలకు సెక్షన్ 17ఏ ప్రకారం ముందస్తు అనుమతులు తీసుకోవాలని సవరణలో ఎక్కడా లేదని రోహత్గీ వివరించారు. ‘‘తప్పు చేసిన వారంతా సెక్షన్ 17ఏను చూపించి అనుమతులు తీసుకురమ్మంటే ఎలా? ఇలాగైతే దర్యాప్తు చేయడానికి అధికారులు ముందుకొస్తారా? మన పార్లమెంటు విధానమే అవినీతి రహిత దేశం... ఇందులో భాగంగానే చట్టాలు, సవరణలు వచ్చాయి. కాబట్టి అవినీతికి పాల్పడే వారికి సెక్షన్ 17ఏ అండ కాకూడదు. అది ఉన్నది నిజాయితీ పరులకు మద్దతు ఇవ్వటానికి’’ అని రోహత్గీ వివరించారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేశారు కనక ఈ దశలో మెరిట్స్లోకి వెళ్లకూడదని ముకుల్ రోహత్గి పేర్కొన్నారు. అధికారిక విధులంటే ఏంటి? సిఫార్సులు అంటే ఏంటి? నిర్ణయాలంటే ఏంటి? ఇవన్నీ సాక్ష్యాల మీద ఆధారపడి ఉంటాయని, మౌఖికంగా వాదించేది కాదని రోహత్గి తెలిపారు. సెక్షన్ 17ఏ రక్షణ కల్పిస్తుందా అని జస్టిస్ బోస్ ప్రశ్నించగా.. గతంలో జరిగిన వాటికి రక్షణగా ఉండదని, కానీ పిటిషనర్ అదే కోరుకుంటున్నారని రోహత్గి తెలిపారు. ఎప్పుడైనా కేసు నమోదు చేయొచ్చు... ఈ దశలో జస్టిస్ త్రివేదీ జోక్యం చేసుకొని సవరణ తర్వాత సదరు చట్టంనుంచి సెక్షన్ను తొలగిస్తే.. ఆ సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చా? అని ప్రశ్నించారు. దానికి వెసులుబాటు ఉందని రోహత్గి చెప్పారు. ‘‘ఫలానా నేరానికి ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడని ఏ చట్టమూ చెప్పలేదు. కాబట్టి సెక్షన్ తొలగించారని అనడం సరికాదు’’ అన్నారు. దీన్ని వివరించాలని జస్టిస్ త్రివేది కోరగా... ‘‘ఆర్టికల్ 20(1) ప్రకారం ఓ వ్యక్తి నేరం చేసిన విషయం కొన్నేళ్ల తర్వాత తెలిసినా కూడా కేసు నమోదు చేయొచ్చని చట్టం చెబుతోంది. దీనికి కొన్ని పరిధులు ఉండొచ్చు కానీ కేసు నమోదుకు ఆటంకమేమీ ఉండదు. మూడేళ్లకు మించి శిక్ష పడే కేసులకు ఏదో ఒక దశలో ఎఫ్ఐఆర్ ఉండాలని సీఆర్పీసీ సెక్షన్ 468 చెబుతోంది‘‘ అంటూ సీఆర్పీసీ సెక్షన్ 6 గురించి రోహత్గి చెప్పబోతుండగా.. విచారణ అవసరం లేదంటోందిగా?! అని జస్టిస్ త్రివేది అడిగారు. ‘‘అవును నిజమే. కానీ ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదయిందా లేదా అనేది ముఖ్యం’’ అని రోహత్గి చెప్పారు. భోజన విరామ అనంతరం మధ్యాహ్నాం వేరే కేసులు ఉన్నాయని విచారణను శుక్రవారం మధ్యాహా్ననికి వాయిదా వేస్తామని ధర్మాసనం పేర్కొంది. అయితే వాదనలు మంగళవారమే ముగించాలని లూత్రా కోరగా ధర్మాసనం నిరాకరించింది. -
చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా
సాక్షి, ఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. సీఐడీ తనపై నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం.. శుక్రవారానికి(13వ తేదీ) మధ్యాహ్నానికి విచారణ వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. సీఐడీ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ‘‘17A.. అవినీతి పరులను కాపాడుకోవడం కోసం కాదు. నిజాయితీ పరులను కాపాడుకోవడం కోసమే. చంద్రబాబుకు 17ఏ వర్తించదని’’ ముకుల్ రోహత్గీ వాదించారు. యశ్వంత్ సిన్హా కేసును ప్రస్తావన.. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే 17ఎ సెక్షన్కు సంబంధించిన వివిధ అంశాలు, మరికొన్ని కేసుల్లో వచ్చిన తీర్పులను ప్రస్తావించారు. రఫేల్ కొనుగోళ్లపై యశ్వంత్ సిన్హా వేసిన పిటిషన్, అనంతరం దాఖలైన పలు కేసులపై వచ్చిన తీర్పులను ఆయన ఉదహరించారు. రఫేల్ కేసులో జస్టిస్ కేఎం జోసెఫ్ ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. రఫేల్ కేసు ఆరోపణలు 2016కు సంబంధించినవి. 2019లో యశ్వంత్ సిన్హా పిటిషన్లపై తీర్పులు వచ్చాయి. చట్ట సవరణకు ముందున్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకునే 2019లో కేసు కొట్టేశారు. ‘1988 అవినీతి నిరోధక చట్టం’ ప్రకారం పోలీసులకు ఇన్వెస్టిగేషన్ జరిపే హక్కు ఉండదు. ఇన్వెస్టిగేషన్ అనేది పోలీసుల బాధ్యత మాత్రమే. అన్నిరకాల విధుల్లోని ప్రభుత్వ అధికారులకు సెక్షన్ 17ఎతో రక్షణ లభించింది’’అని పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల హైకోర్టుల తీర్పులను ఈ సందర్భంగా సాల్వే ప్రస్తావించారు. పూర్వ అంశాలకు కూడా వర్తించేలా ఆర్టికల్ 20(1)పై వచ్చిన తీర్పును ఆయన ఉదహరించారు. స్పందించిన జస్టిస్ అనిరుద్ధ బోస్.. సుప్రీంకోర్టులో తీర్పులు ఉన్నప్పుడు మిగిలిన హైకోర్టుల తీర్పుల ప్రస్తావన అవసరం లేదన్నారు. చంద్రబాబుకి వర్తించదు: రోహత్గీ 2018కి ముందు విచారణ కొంతవరకు జరిగి నిలిచిపోయిందని.. అంతమాత్రాన విచారణ జరగనట్లు కాదని సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదించారు. ‘‘2018 మేలో మెమో దాఖలు చేశారు. అందులో తగిన వివరాలు ఉన్నాయి. మెమోకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ బెంచ్ ముందు ఉంచుతున్నాం. విచారణ ముగిశాక పత్రాలు ఇచ్చామన్న దానిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. వాదనలు జరుగుతున్నప్పుడు 400 పేజీల బండిల్ను హైకోర్టు బెంచ్ ముందుంచారు. మేం కూడా అదేరోజు అవసరమైన డాక్యుమెంట్లను కోర్టు ముందుంచాం. 2018 చట్టసవరణ తర్వాత చంద్రబాబును ఎఫ్ఐఆర్లో చేర్చినప్పటికీ దీన్ని రాజకీయ ప్రతీకార చర్యగా చూడకూడదు. ఆయనపై తగినన్ని ఆధారాలు దొరికిన తర్వాత 2021లో కేసు నమోదు చేశారు. కేసులో చంద్రబాబును ఎప్పుడు చేర్చినప్పటికీ విచారణ కొనసాగుతున్నట్లుగానే పరిగణించాలి. చట్టసవరణకు ముందున్న ఆరోపణలకు అంతకుముందున్న చట్టమే వర్తిస్తుంది. చట్టసవరణకు ముందున్న నేరం కాబట్టి 17ఎ వర్తించదు. 2014-15 మధ్య ఈ స్కాం జరిగింది. 2018 లో 17A రాకముందే నేరం జరిగింది. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు కాదు. 2021లోనే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినా, 2023లో బాబు అరెస్ట్ జరిగింది. జిఎస్టీ పుణె ఫిర్యాదు ఆధారంగా కేసు ప్రారంభమైంది. దీని రిఫరెన్స్ రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. 17-A తెచ్చింది నిందితుల రక్షణ కోసం కాదు, నిజాయితీ కల అధికారుల రక్షణ కోసమే. 17-A గొడుగు కింద అవినీతి పరులు తప్పించుకోలేరు, నిజాయితీ పరులకు ఇది సహాయపడుతుంది. ప్రభుత్వ విధుల్లో దుర్వినియోగం చేశారా ? లేదా అన్నది విచారణలోనే తేలుతుంది ’’ అని రోహత్గీ తన వాదనలు వినిపించారు. ఈ క్రమంలో వాదనలు సుదీర్ఘంగా కొనసాగగా.. సమయం సరిపోదని, మిగతా వాదనలు వచ్చే విచారణలో వింటామని తెలిపింది. ఇక.. తదుపరి విచారణకు హరీష్ సాల్వే వర్చువల్గా హాజరు కానున్నట్లు తెలిపారు. సాక్షి వాట్సాప్ ఛానెల్తో ముఖ్యమైన వార్తల కోసం క్లిక్ చేయండి -
చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు
-
చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో రెండో రోజు విచారణ
-
CBN Petition: 17ఏ అవినీతిని కాపాడేందుకు కాదు
సాక్షి, ఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని ఆయన క్వాష్ పిటిషన్ వేశారు. అయితే.. ఈ పిటిషన్పై ఇవాళ(సోమవారం) సుదీర్ఘ వాదనలే జరిగాయి. మొత్తం 17-ఏ చుట్టూరానే వాదనలు కొనసాగడం గమనార్హం. ఈ క్రమంలో చంద్రబాబు తరపు న్యాయవాదుల్ని ఉద్దేశించి.. ధర్మాసనంలోని జస్టిస్ బేలా త్రివేది 17-ఏపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘17-A వ్యాఖ్యానంలో చట్టం ముఖ్య ఉద్దేశం చూడాలి. అవినీతి నిరోధమే చట్టం అసలు ఉద్దేశం. ఇది అవినీతి నిరోధానికి ఉండాలే తప్ప.. అవినీతిని కాపాడేందుకు కాదు. అవినీతి నిరోధించడంలో నష్టం జరగకూడదన్న బాధ్యత కూడా ఉంది కదా!. చట్టం ఉద్దేశానికి భంగం కలిగేలా దీన్ని అమలు చేయలేం. 17-A లో చాలా అంశాలున్నాయి కదా. 17-A కు ముందు జరిగిన నేరాలకు ఇది వర్తిస్తుందా ?. 17-A ప్రకారం అనుమతి తీసుకోకపోతే జరిగిన దర్యాప్తు ఏం కావాలి?’’ అని బేలా త్రివేది, చంద్రబాబు లాయర్ హరీష్ సాల్వేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. చంద్రబాబు క్వాష్ పిటిషన్పై జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం వాదనలు వింది. ఇవాళ దాదాపు రెండున్నర గంటల పాటు చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ తరుణంలో. కోర్టు సమయం ముగియడంతో వాదనల్ని రేపు(అక్టోబర్ 10) వింటామంది ధర్మాసనం. రేపు ఉదయం చంద్రబాబు క్వాష్ పిటిషన్పై.. ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించనున్నారు. చంద్రబాబు పిటిషన్పై వాదనలు ప్రారంభం కాగానే.. 2018లోనే ఈ కేసు విచారణ ప్రారంభమైందన్న ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ గత వాదనల్ని.. జస్టిస్ బేలా ఈ సందర్భంగా ప్రస్తావించారు. అయితే రోహత్గీ వాదన సరికాదంటూ హరీశ్ సాల్వే తన వాదనలు మొదలుపెట్టారు. రాజకీయ ప్రతీకార చర్యలు లేకుండా ఉండడం కోసమే 17ఏ తీసుకొచ్చారు. 17ఏ ప్రకారం ప్రజాప్రతినిధులపై ఏ తరహా విచారణ చేయాలన్నా పోలీసుల అనుమతి పొందాల్సిందే. అని వాదించారు. ఈ కేసు.. రెజిం రివెంజ్(పాలన పగ) అని, పబ్లిక్ సర్వెంట్ను ఎఫ్ ఐ ఆర్ లో చేర్చాలి అంటే ఖచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందేనని, దీనిపై కేంద్రం SOP కూడా జారీ చేసింది అని బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. -
సుప్రీంకోర్టులో చంద్రబాబు క్యాష్ పిటిషన్ పై విచారణ
-
బాబు సాక్షులను బెదిరిస్తున్నాడు..బెయిల్ ఇవ్వొద్దు..
-
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్న న్యూస్క్లిక్ అధినేత
న్యూఢిల్లీ: న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్త తమ ఆన్లైన్ న్యూస్ పోర్టల్పై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్నారు. చైనా అనుకూల ప్రచారం కోసం న్యూస్క్లిక్కు డబ్బు అందిందని ఆరోపణల నేపథ్యంలో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిషేధిత చట్టం (యుఎపిఎ) కింద నమోదైన కేసుకు సంబంధించి పుర్కాయస్తాను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. న్యూస్క్లిక్ సంస్థకు చైనా నుంచి అక్రమంగా నిధులు అందాయన్న ఆరోపణల నేపథ్యంలో మంగళవారం ఢిల్లీ పోలీసులు వీరి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. దాదాపు 37 మంది అనుమానిత జర్నలిస్టులను విచారించారు. తొమ్మిది మంది మహిళా జర్నలిస్టులను కూడా ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన తర్వాత పుర్కాయస్తను కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు. ఏడు రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం.. ప్రతిరోజు ఒక గంట నిందితుడు తమ లాయర్లను కలుసుకునే అవకాశం కల్పించాలని ఆదేశించింది. అయితే.. తమపై సోదాలు నిర్వహించే క్రమంలో ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండానే పోలీసులు దౌర్జన్యం చేశారని నిందితుడు న్యాయస్థానానికి విన్నవించారు. కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. న్యూస్క్లిక్-అమెరికా-చైనా: ట్రయాంగిల్ స్టోరీ న్యూస్క్లిక్ సంస్థకు ప్రముఖ అమెరికన్ బిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘమ్ నుంచి నిధులు అందుతున్నాయని న్యూయార్క్ టైమ్స్ ఆగష్టు 10న ఓ కథనం వెలువరించింది. సోషలిస్టు భావాలను ప్రచారం చేయడం, తద్వారా చైనా అనుకూల వార్తలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం వారి ప్రధాన ఉద్దేశమని న్యూయార్క్ పోస్టు ప్రచురించింది. ఈ నెట్వర్క్లో భాగంగానే న్యూస్క్లిక్ సంస్థకు కూడా నిధులు అందుతున్నాయని స్పష్టం చేసింది. సింఘమ్కు చైనా ప్రభుత్వంతో సన్నిహత సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. దీని ఆధారంగా ఆగష్టు 17న న్యూస్క్లిక్పై పోలీసుల కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే మంగళవారం సోదాలు నిర్వహించి చీఫ్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థతో సహా హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిలను అరెస్టు చేశారు. ఇది కూడా చదవండి: వరల్డ్ కప్ ముందు ఖలిస్థాన్ నినాదాలు.. పోలీసులు అలర్ట్ -
చంద్రబాబుకు 17A తోనే తిప్పలు !
-
సుప్రీంకోర్టులోనూ చంద్రబాబుకు దక్కని ఊరట
-
స్కిల్ కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ ఈ నెల 9వ తేదీకి వాయిదా
-
చంద్రబాబు కుంభకోణాన్ని హైకోర్టు నమ్మింది
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం నైపుణ్య కేంద్రాల పేరుతో కుంభకోణం చేసిందన్న విషయాన్ని హైకోర్టు కూడా నమ్మిందని.. అందుకే చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ను కొట్టేసిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు పేర్కొన్నారు. శాసన మండలిలో మంగళవారం స్కిల్ కుంభకోణంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా మాధవరావు మాట్లాడారు. రెండున్నరేళ్లు దర్యాప్తు చేసి.. 140 మందిని విచారించి.. పక్కా సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతే సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసిందన్నారు. చంద్రబాబు నిజాయితీపరుడని, రాజకీయ కక్షతోనే ఆయనను అరెస్ట్ చేశారంటూ టీడీపీ నాయకులు చేస్తున్న వాదనను ఆయన కొట్టిపారేశారు. సీఐడీ విచారణలో సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే అని నిర్థారించుకున్న తర్వాతే ఆయనను అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. ఈ కుంభకోణం వాస్తవంగా 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే వెలుగులోకి వచ్చిందన్నారు. జీఎస్టీ ఎగ్గొట్టారంటూ నోటీసులు వస్తే.. దానిపై దర్యాప్తు చేయకుండా ఈ కుంభకోణాన్ని కప్పిపుచ్చుకోవడానికి నోట్ ఫైల్స్ను మాయం చేసిన ఘనులు వీరంటూ విమర్శించారు. ముసలోడు నేరం చేస్తే ఒప్పా? 73 ఏళ్ల వ్యక్తిని అవినీతి కేసులో అరెస్ట్ చేశారని టీడీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారని, 60 ఏళ్లు దాటిన వ్యక్తులు తప్పు చేసినా వదిలేయాలని చట్టంలో ఎక్కడైనా ఉందా అని మాధవరావు ప్రశ్నించారు. చంద్రబాబు తరఫు న్యాయవాదులు కూడా చంద్రబాబు అవినీతి చేయలేదని ఎక్కడా వాదించడం లేదని, సెక్షన్ 17ఏ ఆయనకు వర్తించదంటున్నారని చెప్పారు. ఐటీ అధికారులు నోటీసులు ఇస్తే వాళ్లకు నోటీసులు ఇచ్చే అధికారం లేదంటూ సాంకేతిక సమస్యలు చూపించి తప్పించుకుంటున్నారని, అరెస్ట్ చేస్తానంటే జైల్లో కాదు హౌస్ అరెస్ట్ చేయండని విచిత్రమైన వాదనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. -
బాబు క్వాష్ పిటిషన్ విచారణకు సుప్రీం కోర్టు నిరాకరణ
-
మాజీ మంత్రి నారాయణ పిటిషన్లపై విచారణ, అక్టోబర్ 3కు వాయిదా
-
ఎన్నిరోజుల నుంచి రిమాండ్లో ఉన్నారు?
సాక్షి, ఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను సుప్రీం కోర్టు ఇవాళ(సోమవారం) విచారణకు స్వీకరించలేదు. అత్యవసరంగా చంద్రబాబు పిటిషన్ను విచారించాలని న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా మెన్షన్ చేయగా.. కుదరదని తేల్చేసింది సర్వోన్నత న్యాయస్థానం. అయితే.. పూర్తి వివరాలతో రేపు రావాలని.. రేపే(మంగళవారం) మెన్షన్ లిస్ట్లో చేరుస్తామని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఏపీ సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయడంతో పాటు.. సీఐడీ రిమాండ్లపై ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు నాయుడు పిటిషన్ వేశారు. సోమవారం ఉదయం కోర్టు ప్రారంభం కాగానే.. హడావిడిగా చంద్రబాబు క్వాష్ పిటిషన్ను చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు తీసుకెళ్లారు లూథ్రా. అయితే సుప్రీం కోర్టులో ఇవాళ్టి మౌఖిక ప్రస్తావన విషయాల జాబితాలో(oral mentioning matters) ఈ పిటిషన్ లేదు. ఈ క్రమంలో ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ జోక్యం చేసుకుని.. ‘‘ఎప్పుడు కస్టడీలోకి తీసుకున్నారు? అని ప్రశ్నించారు. దానికి లూథ్రా ‘ఈ నెల 8వ తేదీన’అని బదులిచ్చారు. ఎన్నిరోజుల నుంచి రిమాండ్లో ఉన్నారని సీజేఐ ఆరా తీశారు. కేసు వివరాలు చెప్పేందుకు ప్రయత్నించగా సీజేఐ ఆపి.. రేపే అన్ని విషయాలను రేపు మెన్షన్ చేయాలని లూథ్రాకు సూచించారు. దీంతో.. రేపు లిస్టింగ్ అంశంగా చంద్రబాబు క్వాష్ పిటిషన్ సుప్రీం కోర్టు ముందుకు వెళ్లనుంది. అలాగే ఈ పిటిషన్పైనా విచారణ తేదీని కూడా ఖరారు చేసే ఛాన్స్ ఉంది. కానీ, ఈనెల 28 నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నాయి. దీంతో బాబు పిటిషన్లకు వెకేషన్ ఎఫెక్ట్ పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: బ్రహ్మణి మాటతో బిత్తరపోయిన జనసేన కేడర్ -
మాజీ మంత్రి నారాయణ పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ
-
సుప్రీం కోర్టులో చంద్రబాబుకు షాక్
-
హైకోర్టులో చంద్రబాబు మరోసారి క్వాష్ పిటిషన్
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఇంకోసారి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనను రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు శుక్రవారం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ శనివారం ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ ఉత్తర్వులను కొట్టేయాలని తన క్వాష్ పిటిషన్లో కోర్టును కోరారు. ఈ వ్యాజ్యం తేలేంత వరకు ఏసీబీ కోర్టులో విచారణ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. 45 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్న తనను అవమానించేందుకే సీఐడీ కస్టడీ కోరిందన్న విషయాన్ని ఏసీబీ కోర్టు పరిగణనలోకి తీసుకోలేకపోయిందని పిటిషన్లో పేర్కొన్నారు. జస్టిస్ శ్రీనివాసరెడ్డి సెలవులో ఉండటంతో ఈ క్వాష్ పిటిషన్ గురించి చంద్రబాబు న్యాయవాది ఎస్.ప్రణతి మరో న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి ముందు ప్రస్తావించారు. లంచ్మోషన్ రూపంలో శనివారం మధ్యాహ్నం అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. అత్యవసర విచారణకు న్యాయమూర్తి నిరాకరించారు. సాధారణ పద్ధతిలో తమ ముందు విచారణకు వచ్చినప్పుడే ఈ వ్యాజ్యాన్ని విచారిస్తామని న్యాయమూర్తి జస్టిస్ సురేష్రెడ్డి స్పష్టం చేశారు. పారని పాచిక! పోలీసు కస్టడీ ఉత్తర్వులను అడ్డం పెట్టుకుని, స్కిల్ కుంభకోణంపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్కు సంబంధించి ఏసీబీ కోర్టులో జరుగుతున్న విచారణ తాలూకు తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని చంద్రబాబు తన పిటిషన్లో కోరారు. వాస్తవానికి పోలీసు కస్టడీని అడ్డుకోవడం ఇక్కడ చంద్రబాబు వ్యూహం కాదు. ఎందుకంటే పోలీసు కస్టడీ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు ఒకవేళ లంచ్మోషన్ రూపంలో అత్యవసరంగా విచారణ జరిపి ఉన్నా, విచారణ పూర్తయి కోర్టు ఉత్తర్వులు జారీ చేసే సమయానికి ఒక రోజు కస్టడీ ముగుస్తుంది. మరో రోజు కస్టడీ మాత్రమే మిగిలి ఉంటుంది. సాధారణంగా క్రిమినల్ కేసుల్లో హైకోర్టు తమ ముందు దాఖలయ్యే ప్రతి కొత్త పిటిషన్పై వెంటనే పూర్తి స్థాయి విచారణ జరపదు. కేసుకు సంబంధించిన వివరాలను కోర్టుకు సమర్పించేందుకు పోలీసులకు వారం గడువునిస్తుంది. ప్రతి కేసులోనూ హైకోర్టు ఇదే వైఖరి అవలంభిస్తుంది. ఒకవేళ ఇలానే తమ పిటిషన్ను వివరాల సమర్పణ నిమిత్తం ఓ వారానికి వాయిదా వేస్తే, కనీసం అప్పటి వరకైనా ఏసీబీ కోర్టులో జరుగుతున్న విచారణను నిలుపుదల చేయిస్తూ మధ్యంతర ఉత్తర్వుల కోసం కోర్టును గట్టిగా కోరవచ్చన్నది చంద్రబాబు ఎత్తుగడ. ఇక్కడ చంద్రబాబు తన అదృష్టాన్ని పరీక్షించుకోదలిచారు. అయితే ఆయన ఎత్తుగడ పారలేదు. ఎప్పుడైతే న్యాయమూర్తి అత్యవసర విచారణకు నిరాకరించారో అప్పుడే చంద్రబాబు ఆశలు ఆవిరైపోయాయి. పోలీసు కస్టడీపై తాజాగా దాఖలు చేసిన వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చి, దానిపై కోర్టు విచారణ జరిపినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఆదివారం సాయంత్రానికల్లా ఏసీబీ కోర్టు ఇచ్చిన రెండు రోజుల కస్టడీ ముగుస్తుంది. దీంతో సోమవారం విచారణకు వచ్చినా ఆ వ్యాజ్యం నిరర్థకం అవుతుంది. ప్రధాన అభ్యర్థనే నిరర్థకం అయినప్పుడు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉండదు. వాస్తవానికి ఇంతకు ముందు తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు, ఆ పిటిషన్లో సైతం ఏసీబీ కోర్టులో జరుగుతున్న విచారణకు సంబంధించిన తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. అయితే ఆ క్వాష్ పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్రెడ్డి మధ్యంతర ఉత్తర్వులు కాకుండా ప్రధాన వ్యాజ్యంలోనే తుది తీర్పునిస్తానంటూ, ఆమేర చంద్రబాబు క్వాష్ పిటిషన్ను కొట్టేస్తూ శుక్రవారం తీర్పునిచ్చారు. ఏసీబీ కోర్టులో జరుగుతున్న విచారణలో ఏ రకంగానూ జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. శనివారం జస్టిస్ శ్రీనివాసరెడ్డి సెలవులో ఉండగా, చంద్రబాబు మరో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం విశేషం. -
పాపం పండింది..చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ
-
బాబుకు భంగపాటు
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో భంగపాటు ఎదురైంది. వందల కోట్ల రూపాయల ప్రజాధనం లూటీకి సంబంధించి ఆయనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేసేందుకు హైకోర్టు నిరాకరించింది. తనపై సీఐడీ కేసును కొట్టేయడంతో పాటు, సీఐడీ కేసు ఆధారంగా ఏసీబీ కోర్టు తనకు రిమాండ్ విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సైతం రద్దు చేయాలన్న చంద్రబాబు అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. స్కిల్ కుంభకోణంలో సీఐడీ దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందని చెప్పింది. హైకోర్టు తన స్వతఃసిద్ధ అధికారాలను ఉపయోగించి కేసును కొట్టేయాలని అభ్యర్థిస్తూ, నేర విచారణ ప్రక్రియ స్మృతి (సీఆర్పీసీ)లోని సెక్షన్ 482 కింద దాఖలు చేసిన పిటిషన్లో ‘మినీ ట్రయల్’ నిర్వహించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ‘దర్యాప్తు సంస్థ 2021లో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత 140 మంది సాక్షులను విచారించింది. 4 వేలకు పైగా డాక్యుమెంట్లను సేకరించింది. నిగూఢమైన ఈ వ్యవహారంలో వృత్తి సంబంధ ప్రావీణ్యం కలిగిన నిపుణులే దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. దర్యాప్తు తుది దశకు చేరేందుకు వెసులుబాటు కల్పించే సీఐడీ కేసు విషయంలోనూ, తదనుగుణంగా ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వుల విషయంలో ప్రస్తుతం ఏ రకంగానూ జోక్యం చేసుకోలేం’ అని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం 68 పేజీల తీర్పు వెలువరించారు. అభ్యంతరం లేదన్నాకే న్యాయమూర్తి విచారణ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు ఈ నెల 12న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే సీఐడీ నమోదు చేసిన కేసు ఆధారంగా తనకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను సైతం కొట్టేయాలని కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యం తేలేంత వరకు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై ఏసీబీ కోర్టులో జరుగుతున్న విచారణను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. చంద్రబాబు దాఖలు చేసిన ఈ క్వాష్ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి రోజంతా విచారణ జరిపారు. విచారణకు ముందే ఆయన గతంలో తాను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చంద్రబాబుకు వ్యతిరేకంగా వాదనలు వినిపించానని, ఇప్పుడు ఆయన కేసును విచారించడంపై మీకేమైనా అభ్యంతరం ఉందా? అంటూ అటు సీఐడీ, ఇటు చంద్రబాబు తరఫు న్యాయవాదులను ప్రశ్నించారు. ఇరుపక్షాలు కూడా ఎలాంటి అభ్యంతరం లేదన్న తర్వాతే ఆయన విచారణ కొనసాగించారు. అటు చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్దార్థ లూథ్రా, ఇటు సీఐడీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, రంజిత్ కుమార్, అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు విన్నారు. సెక్షన్ 17–ఏ పై చంద్రబాబు న్యాయవాదులు గట్టిగా వాదనలు వినిపించారు. సుదీర్ఘ వాదనలు విన్న నేపథ్యంలో న్యాయమూర్తి తాను మధ్యంతర ఉత్తర్వులు కాకుండా ప్రధాన వ్యాజ్యంలోనే ఉత్తర్వులు జారీ చేస్తానంటూ తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు తీర్పును వెలువరించారు. చంద్రబాబు పిటిషన్ను కొట్టేస్తున్నట్లు తీర్పు చెప్పారు. దర్యాప్తునకు సమయం ఇవ్వాలి ‘భజన్లాన్ కేసు మొదలు నిహారికా కేసు వరకు సీఆర్పీసీ సెక్షన్ 482 కింద హైకోర్టు తన పరిధిని ఉపయోగించే విషయంలో సుప్రీంకోర్టు నిర్ధిష్టమైన పలు కొలమానాలను నిర్ధేశించింది. సుప్రీంకోర్టు నిర్ధేశించిన ఆ కొలమానాలేవీ కూడా ఈ కేసులో ఇప్పుడు జోక్యం చేసుకునేందుకు అనుమతించడం లేదు. ప్రస్తుత కేసులో సీఐడీ చంద్రబాబును 2023 సెప్టెంబర్ 7న 37వ నిందితునిగా చూపింది. 2023 సెప్టెంబర్ 9న ఆయన్ను అరెస్ట్ చేసింది. కేసును కొట్టేయాలంటూ చంద్రబాబు 2023 సెప్టెంబర్ 12న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే రీతిలో మరిదాస్ కేసులోనూ జరిగింది. మరిదాస్పై 2021 డిసెంబర్ 9న ఎఫ్ఐఆర్ నమోదైంది. 2021 డిసెంబర్ 10న కేసు కొట్టేయాలంటూ మరిదాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. 2021 డిసెంబర్ 14న మద్రాసు హైకోర్టు మరిదాస్పై కేసు కొట్టేసింది. మద్రాసు హైకోర్టు తీర్పును ఆ తర్వాత సుప్రీంకోర్టు రద్దు చేసింది. హైకోర్టు సీఆర్పీసీ సెక్షన్ 482 కింద తనకున్న అధికారాన్ని ఉపయోగించే ముందు ఏం చేయాలో సుప్రీంకోర్టు ఆ కేసులో చాలా స్పష్టంగా చెప్పింది. దర్యాప్తు సంస్థకు దర్యాప్తు చేసేందుకు తగిన సమయం ఇవ్వకుండా కేసు కొట్టేయడాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. దర్యాప్తు చేసేందుకు దర్యాప్తు సంస్థకు సహేతుక సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆ తీర్పులో చాలా స్పష్టంగా చెప్పింది’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. ఆర్థిక నేరాల విషయంలో భిన్న దృక్పథం ‘వాస్తవానికి లలిత కుమారి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం విచారణకు స్వీకరించతగ్గ కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే. సీఆర్పీసీ సెక్షన్ 154కు అనుగుణంగా ఎఫ్ఐఆర్ను నమోదు చేయడం తప్పనిసరి. ఈ కేసులో రికార్డుల్లో ఉన్న ఆధారాలను పరిశీలిస్తే అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్)లో సెక్షన్ 17–ఏను చేర్చడానికి ముందే ప్రాథమిక విచారణ జరిగింది. కేసు నమోదుకు కారణమైన ఫిర్యాదు ఆధారంగా ఆ విచారణ జరిగింది. తీవ్రమైన ఆర్థిక నేరాలకు సంబంధించి దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నప్పుడు న్యాయస్థానాల దృక్పథం భిన్నంగా ఉండాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే చట్టం ముఖ్య ఉద్దేశం ఏమిటన్న దాన్ని కూడా న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకోవాలి’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించే వారి కోసమే సెక్షన్ 17–ఏ చిత్తశుద్ధితో, సదుద్దేశంతో అధికారిక బాధ్యతలను, విధులను నిర్వర్తించే పబ్లిక్ సర్వెంట్లను కాపాడేందుకే అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 17–ఏను చేర్చారు. శాసనసభకర్తల ఉద్దేశం కూడా ఇదే. అయితే పబ్లిక్ సర్వెంట్ చర్యలు నేరపూరితంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు, ఆ చర్యలు నేరమైనప్పుడు వాటిపై విచారణ జరిపేందుకు పీసీ యాక్ట్లోని సెక్షన్ 17–ఏ కింద ముందస్తు అనుమతి అవసరం లేదు. నిధుల దుర్వినియోగం, తప్పుడు అకౌంట్లు సృష్టించడం, మోసం, నేరపూరిత విశ్వాస ఘాతుకం, లంచాలు తీసుకోవడం వంటివి సెక్షన్ 17–ఏ పరిధిలోకి రావు. ప్రస్తుత కేసులో చంద్రబాబు నిధుల చెల్లింపు విషయంలో తీసుకున్న నిర్ణయం లేదా చేసిన సిఫారసు, ఆయన చేసిన నిధుల దుర్వినియోగం.. అధికారిక విధులు, బాధ్యతల కిందకు రావు. అందువల్ల ఆ నేరాలపై దర్యాప్తు చేసేందుకు కాంపిటెంట్ అథారిటీ నుంచి ముందస్తు అనుమతి అవసరం లేదు. 2018 జూలై 26కు ముందు జరిగిన అన్ని కేసులకు సెక్షన్ 17–ఏ వర్తించదు. పబ్లిక్ సర్వెంట్ తన అధికారిక విధులను నిర్వర్తిస్తూ నేరానికి పాల్పడినప్పుడు మాత్రమే అది వర్తిస్తుంది. అధికార విధుల్లో భాగం కాకుండా నేరానికి పాల్పడితే సెక్షన్ 17–ఏ వర్తించదు’ అని న్యాయమూర్తి తన తీర్పులో వివరించారు. ►న్యాయమూర్తి తన తీర్పులో చంద్రబాబుపై ఉన్న ఆరోపణలను సైతం స్పష్టంగా వివరించారు. ‘చంద్రబాబు, ఇతర నిందితులు కలిసి కుట్రపూరితంగా ప్రజా ఖజానాకు సంబంధించిన నిధులను దుర్వినియోగం చేశారు. రూ.110 కోట్ల నుంచి రూ.130 కోట్లతో మాత్రమే అమలు చేసే ఓ ప్రాజెక్టును రూ.3,300 కోట్లుగా మోసపూరితంగా చూపారు. రూ.371 కోట్ల విలువైన వర్క్ ఆర్డర్ను నామినేషన్ ప్రాతిపదికన ఇచ్చేశారు. ►ఇందులో కనీసం రూ.241 కోట్ల మేర నిధుల దుర్వినియోగం జరిగింది. చంద్రబాబు, ఇతర నిందితులు కలిసి కుట్రపూరితంగా మంత్రి మండలి ఆమోదం లేకుండానే ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)ను ఏర్పాటు చేశారు. ►చంద్రబాబు నాయుడు రూ.3,300 కోట్ల ప్రాజెక్టు వ్యయంలో సీమెన్స్, డిజైన్టెక్ సంస్థలు 90 శాతం ఖర్చును భరిస్తాయని, రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.371 కోట్లు (ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం) చెల్లిస్తే సరిపోతుందని మంత్రులకు చెప్పి, ఆ మొత్తాన్ని ఆ సంస్థలకు విడుదల చేయించేందుకు అనుమతి పొందారు. ►మంత్రి మండలి తీర్మానం, జీవో ఎమ్మెస్ నెంబర్ 4 ప్రకారం సాంకేతిక సాయం అందిస్తున్న సీమెన్స్, డిజైన్టెక్ల నుంచి ఆ 90 శాతం గ్రాంట్ ఆన్ ఎయిడ్గా వస్తుందని పేర్కొన్నారు. కొన్ని వారాల తర్వాత సీమెన్స్ అప్పటి ఎండీ, ఈ కేసులో 6 నిందితుడు ఆ మొత్తాన్ని గ్రాంట్ ఇన్ కైండ్గా చెబుతూ.. చంద్రబాబును, ఆర్థిక శాఖ కార్యదర్శిని ప్రభుత్వ వాటా కింద ఇవ్వాల్సిన 10 శాతం మొత్తాన్ని విడుదల చేయాలని కోరారు. ►జీవో ఎమ్మెస్ 4లో నియమ నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అయితే వాటిని ఉద్దేశ పూర్వకంగా పక్కన పెట్టి ముసాయిదా ఒప్పందానికి ఆమోద ముద్ర వేశారు. ఈ ముసాయిదా ఒప్పందాన్ని సీమెన్స్, డిజైన్టెక్కు నామినేషన్ పద్దతిలో కట్టబెట్టే రీతిలో తయారు చేశారు. రూ.371 కోట్లను ముందునే ఆ కంపెనీలకు ఇచ్చేశారు. ►కేంద్ర దర్యాప్తు సంస్థలైన డీజీజీ ఎస్ఐటీ ఆఫీస్ పూణే, ఆదాయపు పన్ను శాఖ, సీమెన్స్ అంతర్గత విచారణ, ఏపీఎస్ఎస్డీసీ చేపట్టిన ఫోరెన్సిక్ ఆడిట్లో రూ.241 కోట్లను బోగస్ ఇన్వాయిస్ల ద్వారా, షెల్ కంపెనీల ద్వారా దుర్వినియోగం చేసినట్లు తేలింది. చంద్రబాబు పర్సనల్ సెక్రటరీగా పని చేసిన పెండ్యాల శ్రీనివాస అనే వ్యక్తికి ఆదాయపు పన్ను శాఖ సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసు ఇచ్చింది. ఆ వ్యక్తి ఆమెరికా పారిపోయారు. ►సీమెన్స్ ఇండియా యాజమాన్యం ఈ కేసులో 6వ నిందితుడితో తమ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. గ్రాంట్ ఆన్ ఎయిడ్ కింద 90% ఇచ్చేలా తాము ఎలాంటి స్కీంను చేపట్టలేదని కూడా సీమెన్స్ స్పష్టం చేసింది. రికార్డును పరిశీలిస్తే ఆడిట్ జరిగినట్లు స్పష్టమవుతోంది. ఆడిట్ నివేదికను పరిశీలిస్తే, రూ.241.78 కోట్ల మేర నిధులను మళ్లించినట్లు తెలుస్తుంది. ఈ మొత్తంతో పాటు షెల్ కంపెనీల ద్వారా మరో షెల్ కంపెనీ అయిన ఏసీఐకి చెల్లింపులు కూడా చేశారు’ అని న్యాయమూర్తి తన తీర్పులో ప్రముఖంగా ప్రస్తావించారు. ఇది కూడా చదవండి: చంద్రబాబు లాయర్ లూథ్రాకు ఆర్జీవీ చురక -
ఇంత జరిగాక దర్యాప్తు ఆపమని చెప్పలేం: ఏపీ హైకోర్టు
సాక్షి, కృష్ణా: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది. క్వాష్ పిటిషన్ను కొట్టేస్తున్నట్లు ‘పిటిషన్ డిస్మిస్డ్’ అంటూ ఏకవాక్యంతో తీర్పు ఇచ్చారు హైకోర్టు న్యాయమూర్తి. ఇక 68 పేజీలతో కూడిన చంద్రబాబు క్వాష్ ఆర్డర్ కాపీలో ఏపీ హైకోర్టుల కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ కీలక దశలో క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆపడం సరికాదు. ప్రత్యేకమైన సందర్భాల్లో తప్ప ప్రతిసారి పిటిషన్ను క్వాష్ చేయలేం.అసాధారణ పరిస్థితుల్లో ఉంటేనే ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలి. ఎఫ్ఐఆర్లో అన్ని విషయాలు ఉండాల్సిన అవసరం లేదు. విచారణ పూర్తి చేసే అధికారాన్ని పోలీసులకు ఇవ్వాలి. విచారణ అంశాలను తర్వాతి దశలో ఎఫ్ఐఆర్లో నమోదు చేయొచ్చు. విచారణలో ఎఫ్ఐఆర్ మెరిట్స్ మీద కేసును అడ్డుకోకూడదు. సీఆర్పీసీ 482 కింద దాఖలైన పిటిషన్పై మినీ ట్రయల్ నిర్వహించలేం. 2021 నుంచి 140 మందిని సీఐడీ విచారించింది. నాలుగు వేల దాకా డాక్యుమెంట్లు సేకరించింది. ఈ దశలో ఈ విచారణలో జోక్యం చేసుకోలేం. కేసు దర్యాప్తు కొనసాగుతున్నందు వల్ల మేం జోక్యం చేసుకోలేం’’ అని స్పష్టం చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ రెండేళ్ల దర్యాప్తు తదనంతరం.. తనపై నమోదు అయిన ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై చంద్రబాబు తరపున న్యాయవాదులు హరీశ్ సాల్వే, సిద్ధార్థ లుథ్రా వాదనలు వినిపించారు. మరోవైపు సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. సీఐడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ను కొట్టేసింది. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు రిమాండ్ను అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం(ఏసీబీ కోర్టు) రెండ్రోజులు పొడిగించిన సంగతి తెలిసిందే హైకోర్టు ఆర్డర్ పూర్తి కాపీ కోసం క్లిక్ చేయండి -
చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేత
-
బాబు కనుసన్నల్లోనే స్కిల్ స్కాం
-
Babu Case : గవర్నర్ అనుమతి చుట్టే బాబు లాయర్ల పట్టు
సాక్షి, గుంటూరు: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టైన చంద్రబాబు నాయుడు.. క్వాష్ పిటిషన్కు అనర్హుడని సీఐడీ తరపు న్యాయవాదులు మంగళవారం ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్ చేసిన వెంటనే చంద్రబాబును అరెస్ట్ చేయలేదని.. రెండేళ్లు అన్ని సాక్ష్యాలు సేకరించాకే అరెస్ట్ చేశారని తెలిపారు న్యాయవాదులు. కేవలం ఎఫ్ఐఆర్ ఆధారంగానే చంద్రబాబు అరెస్ట్ జరగలేదు. సెక్షన్ 319 ప్రకారం ఎన్ని ఛార్జిషీట్లు అయినా వేయొచ్చు.. ఎంత మంది సాక్ష్యులను అయినా చేర్చొచ్చు. ఈ కేసు ప్రారంభ దశలోనే ఉంది. బెయిల్ దరఖాస్తు చేసుకున్న దరిమిలా.. 10 రోజుల్లో దర్యాప్తు పూర్తి కాదు. కేసు దర్యాప్తు దశలోనే ఉంది. ఐటీ శాఖ దర్యాప్తు చేస్తోంది. ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ దశలో నిందితుడికి అనుకూలంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని హైకోర్టును కోరారు. ► 2018 జూన్ 5వ తేదీనే ప్రాథమిక విచారణ ప్రారంభమైంది.ఐపీసీ ప్రకారం నేరం కనిపిస్తున్నప్పుడు.. గవర్నర్ నుంచి ఎలాంటి అనుమతి అవసరం లేదని ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి అన్నారు. అంటే 2018లో సెక్షన్ 17A సవరణకు ముందే ఇది పూర్తయింది. 2015లోనే ఈ స్కాంకు సంబంధించి ప్రశ్నలు తలెత్తాయి. ఒక సెక్షన్కు సంబంధించిన సవరణ కోసం దర్యాప్తు ఆగదు అని హైకోర్టు ముందు వాదించారాయన. ► పథకం ప్రకారం కుంభకోణం జరిగింది. ఎంవోయూలో సబ్ కాంట్రాక్ట్ ప్రస్తావనే లేదు. ఎలాంటి సేవలు అందించకుండానే షెల్ కంపెనీలకు నిధులు వెళ్లాయి. షెల్ కంపెనీల కోసమే డబ్బు విడుదల చేశారు. ఎంవోయూలో సబ్కాంట్రాక్టుల అంశం ప్రస్తావనే లేదు. చంద్రబాబు నాయకత్వంలో నెమ్మదిగా మానిప్యులేషన్ చేశారు. ఆరు షెల్ కంపెనీలకు డబ్బు తరలించారు. ప్రభుత్వం ముందుగా డబ్బు ఇవ్వడం ఎప్పుడూ ఉండదు. మొదటి నుంచి కూడా ఇదొక బొమ్మ మాదిరిగా జరిగింది. కక్ష సాధింపు అనుకుంటే చంద్రబాబును ఏనాడో అరెస్ట్ చేసేవారు.ఏపీ ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరిస్తోంది. ► షెల్ కంపెనీల జాడ తీస్తున్నాం. అన్ని బోగస్ కంపెనీలు కలిపి ప్రజాధనాన్ని లూటీ చేశాయి. . ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా నిధుల దుర్వినియోగం జరిగింది. ఈ డీల్కు కేబినెట్ ఆమోదం లేదు. చంద్రబాబు పథకం ప్రకారమే తన అనుచరులతో కలిసి బోగస్ కంపెనీల పేరుతో రూ.371 కోట్ల ప్రజాధనం దోచుకున్నారు. రూ. 3 వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. మార్గదర్శకాలను కూడా కోర్టు అనుసరించాలి. విచారణ పూర్తయ్యే దాకా ఆగాలి. దర్యాప్తు సంస్థను నివేదిక సమర్పించేదాకా వేచి చూడాలి. ► విచారణ పూర్తై అధికారులు నివేదిక సమర్పించిన తరువాతే కోర్టు జోక్యం చేసుకోవాలి. మెరిట్స్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడ. నేను సీఎంను(మాజీ) కాబట్టే.. అనే అంశం ప్రస్తావిస్తున్నారు కాబట్టి ఇది రాజకీయమైంది. దర్యాప్తు బృందంపై రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులపైనే నిందలు మోపుతున్నారు. కానీ, వీళ్లంతా శిక్షణ పొందిన అధికారులు. ఆరోపించేవాళ్లు ముందు ఈ విషయం గుర్తించాలి. ► 2021కు ముందు చంద్రబాబుపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. పూర్తి ఆధారాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టకుండానే కంపెనీలకు రూ.300 కోట్లు విడుదల చేశారు. అవినీతి చేసిన వారు సెక్షన్ 17ఏ పేరుతో తప్పించుకోలేరు. సెక్షన్ 17A ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకున్న అమాయక సేవకులను (innocent servants) రక్షించడం కోసం మాత్రమే. కాబట్టి.. పోలీసులకు పూర్తి స్వేచ్చను ఇచ్చి.. క్వాష్ పిటిషన్ను కొట్టివేయాలి. సెక్షన్ CrPC 482 ప్రకారం దర్యాప్తు అధికారులను విచారణ పూర్తి చేసుకోనివ్వాలి అని సీఐడీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. -
చంద్రబాబుకు ఊహించని షాక్..
-
ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు నిరాశ..
-
బాబుకు భారీ ఎదురుదెబ్బ..అప్పటివరకూ జైల్లో..
-
చంద్రబాబు లాయర్ల కొత్త స్కెచ్..
-
ఎంపీ రఘురామ కుమారుడిపై బలవంతపు చర్యలొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ కాని స్టేబుల్పై దాడి చేశారంటూ ఎంపీ రఘురామ కుమారుడు భరత్పై గచ్చిబౌలి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ మేరకు బలవంతపు చర్యలొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలీ సులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ క్వాష్ చేయా లంటూ ఎంపీ రఘురామ, భరత్లు దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ జేకే మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ఆగస్టు 12న ఇదే పిటిషన్ విచారించి కొట్టివేశామని, ఆర్డర్ ఇచ్చే సమయంలో మరికొన్ని ఆర్డర్లు కనిపించాయని ధర్మాసనం పేర్కొంది. అవి కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడం, అనంతరం సుప్రీంకోర్టు ఆర్మీ ఆసుపత్రిలో చికిత్సకు అను మతివ్వడానికి సంబంధించిన ఆర్డర్లని ఎంపీ రఘురామ తరఫు సీనియర్ న్యాయవాది ఆది నారాయణరావు తెలిపారు. రెండూ ఒకే అంశా నికి చెందినవా? అని ధర్మాసనం ప్రశ్నించింది. వేర్వేరు కేసులని న్యాయవాది స్పష్టం చేశారు. తర్వాత గచ్చిబౌలి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ మేరకు పిటిషనర్లపై తదుపరి ఆదే శాలవరకు బలవంతపు చర్యలు తీసుకోవద్దని పేర్కొంటూ.. ధర్మాసనం హైదరాబాద్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. చదవండి: (సీఎం జగన్ నిర్ణయంతో మంచి జరుగుతుందని భావిస్తున్నా: ఉండవల్లి) -
నేడు హైకోర్టులో బండి సంజయ్ క్వాష్ పిటిషన్ పై విచారణ
-
ధూళిపాళ్లకు హైకోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ధూళిపాళ్ల క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఆయనను విచారించాలని కోర్టు ఆదేశించింది. మే 5లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డెయిరీలో పలు అక్రమాలు, అవినీతి కేసులో ధూళిపాళ్ల నరేంద్రను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సంగం డెయిరీ అక్రమాల కేసులో ఏ1గా ఉన్న ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ కస్టడీకి కోరనుంది. ధూళిపాళ్ల నరేంద్ర అక్రమాల చిట్టా ఇదీ.. ♦సంగం డెయిరీకి ప్రభుత్వం ఇచ్చిన పదెకరాల భూమిని ప్రభుత్వ అనుమతి లేకుండా తన తండ్రి వీరయ్య చౌదరి పేరుతో ఉన్న ట్రస్ట్కు నరేంద్ర బదలాయించారు. అప్పటి డెయిరీ ఎండీగా ఉన్న గోపాలకృష్ణ ఆ పదెకరాలను ట్రస్టుకు బదలాయించినట్టు తీర్మానం చేయడం, మేనేజింగ్ ట్రస్టీగా నరేంద్ర వాటిని తీసేసుకోవడం జరిగిపోయాయి. ఇది బైలా నంబర్ 439 ప్రకారం ఉల్లంఘన. ♦ప్రభుత్వ భూమిలో వీరయ్య చౌదరి పేరుతో నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్ నిర్మించుకున్నారు. ఈ ఆస్పత్రికి నరేంద్ర భార్య జ్యోతిర్మయి ఎండీగా వ్యవహరిస్తున్నారు. ♦ఏదైనా సహకార సంఘాన్ని కంపెనీగా మార్చుకోవాలంటే ప్రభుత్వానికి బకాయిలు చెల్లించి, భూములు అప్పగించి జిల్లా కోఆపరేటివ్ అధికారి నుంచి ఎన్వోసీ (నిరభ్యంతర పత్రం) తెచ్చుకోవాలి. 2011 ఫిబ్రవరి 28న రిటైర్ అయిన డీసీవో గురునాథం నుంచి ఆయన రిటైర్మెంట్కు రెండు రోజుల ముందు తేదీతో ఎన్వోసీ తెచ్చి.. సంగం డెయిరీని కంపెనీ చట్టం కిందకు తెచ్చుకున్నారు. ఫలితంగా తన సొంత కంపెనీగా నరేంద్ర డెయిరీని మార్చేశారు. ♦దీనికి సంబంధించి గుంటూరు జిల్లా కోఆపరేటివ్ అధికారి కార్యాలయంలో తనిఖీలు చేసిన ఏసీబీ.. ఎన్వోసీకి సంబంధించిన దరఖాస్తు, ఇతర ఉత్తరప్రత్యుత్తరాలు లేవని నిర్ధారించింది. అక్రమ పద్దతుల్లో ఎన్వోసీని సృష్టించినట్టు తేలింది. మరోవైపు ఏపీడీడీసీ కమిషనర్ పేరుతో ఉన్న డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి వాటిని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ)లో తనఖా పెట్టి 2013లో ధూళిపాళ్ల నరేంద్ర రూ.115.58 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ మొత్తాన్ని తన తండ్రి పేరుతో ఆస్పత్రి నిర్మాణానికి, నిర్వహణకు మళ్లించారు. ♦సంగం డెయిరీ లాభాలు, ప్రభుత్వ నిధులతో 1973, 1976, 1977, 1978లో కొనుగోలు చేసిన 72.54 ఎకరాలకు చెందిన 51 డాక్యుమెంట్లను కూడా ఏసీబీ సేకరించింది. ఈ భూములను కొట్టేసేందుకు ధూళిపాళ్ల నరేంద్ర తప్పుడు పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో డాక్యుమెంట్లు సృష్టించారు. ♦ప్రభుత్వం 1995లో మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ (మ్యాక్స్) చట్టం తెచ్చింది. దీని ప్రకారం.. ఒక సహకార సంఘాన్ని మ్యాక్స్ పరిధిలోకి తేవాలంటే ప్రభుత్వానికి చెందిన భూములు తిరిగి అప్పగించడంతోపాటు బకాయిలను చెల్లించాలి. అలా చేయకుండానే 1997 ఫిబ్రవరి 1న గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాన్ని మాక్స్ చట్టం పరిధిలోకి తెచ్చారు. నరేంద్ర సంగం డెయిరీ నిర్వహణ చూస్తునే మరోవైపు సొంతంగా మిల్క్లైన్ అనే ప్రయివేటు పాల సేకరణ కంపెనీని నిర్వహించారు. ఇది నిబంధనలకు విరుద్ధం. తర్వాత మిల్క్లైన్ కంపెనీకి తన భార్య జ్యోతిర్మయిని ఎండీని చేశారు. చదవండి: చంద్రబాబు అండతోనే.. Sangam Dairy: ప్రభుత్వ పరిధిలోకి సంగం డెయిరీ -
ధూళిపాళ్లకు హైకోర్టులో ఎదురుదెబ్బ
-
హైకోర్టులో శివాజీ క్వాష్ పిటీషన్ దాఖలు
హైదరాబాద్: సినిమా నటుడు శొంఠినేని శివాజీ హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెల్సిందే. తనపై సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ ద్వారా విన్నవించారు. పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలని పిటీషన్లో కోరారు. ఈ పిటీషన్ను హైకోర్టు బుధవారం విచారించింది. ప్రస్తుతం ఈ కేసులో రవిప్రకాశ్ పిటిషన్పై తీర్పు రిజర్వ్లో ఉన్న కారణంగా ప్రభుత్వం గడువు కోరింది. ఇప్పటి వరకు శివాజీకి మూడు సార్లు నోటీసులు జారీ చేసినా పోలీసు విచారణకు హాజరు కాలేదని ప్రభుత్వం హైకోర్టుకి తెలిపింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. టీవీ-9లో అక్రమాలకు పాల్పడినట్లు కొత్త యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థ మాజీ సీఈఓ రవిప్రకాశ్పై పోలీసులు కేసు నమోదు చేసి, నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ కేసుతో సంబంధమున్న శొంఠినేని శివాజీ అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. -
హైకోర్టులో శివాజీ క్వాష్ పిటిషన్
సాక్షి, హైదరాబాద్ : సినీ నటుడు, గరుడ పురాణం శివాజీ మంళగవారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. తనపై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అలంద మీడియా ఇచ్చిన ఫిర్యాదుతో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్తోపాటు శివాజీపై సైబర్ క్రైమ్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. విచారణకు హాజరు కావాల్సిందిగా వీరిద్దరికీ నోటీసులు కూడా ఇచ్చారు. కాగా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రవిప్రకాశ్ హైకోర్టును ఆశ్రయించగా.. వాదనలు విన్న ధర్మాసనం వచ్చే మంగళవారానికి కేసు విచారణ వాయిదా వేసింది. -
వరవరరావుకు హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్ : విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావుకు ఉమ్మడి హైకోర్టులో చుక్కెదురైంది. తనపై మహారాష్ట్ర పోలీసులు అక్రమంగా నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. దీంతో ఏ క్షణమైన పూణే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని పుణేకు ఆయనను తరలించేందుకు జారీ అయిన ట్రాన్సిట్ వారెంట్ అమలును ఇటీవల తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ గడవు ముగిసేలోపు పూణే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాగా గృహనిర్భందంలో ఉన్న వరవరరావుకు చికిత్స ఉందించాలని హైకోర్టు అదేశించినా.. ఇప్పటివరకు చికిత్స అందలేదని ఆయన తరుఫున న్యాయవాది న్యాయస్థానంలో తెలిపారు. -
వేమూరి రాధాకృష్ణకు హైకోర్టు షాక్!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణకు హైకోర్టులో చుక్కెదురైంది. విచారణకు హాజరు కాలేనంటూ రాధాకృష్ణ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. దీంతో రేపు (మంగళవారం) నాంపల్లి కోర్టుకు విచారణకు రాధాకృష్ణ స్వయంగా హాజరు కావాల్సి ఉంటుంది. ఇటీవల జరిగిన కేసు విచారణకు రాధాకృష్ణతోపాటు ఎడిటర్, పబ్లిషర్, మరికొందరు మంది ఉద్యోగులు హాజరు కాకపోవడంపై నాంపల్లి కోర్టు మండిపడిన విషయం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో కోర్టుకు రాలేకపోతున్నామంటూ చెప్పడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. డిసెంబర్ 5న జరగనున్న తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరై తీరాల్సిందేనని ఎండీ రాధాకృష్ణ, ఎడిటర్ కె.శ్రీనివాస్, పబ్లిషర్ శేషగిరిరావు, మరో నలుగురు ఉద్యోగులను ఆదేశించింది. ఏపీకి ప్రత్యేక హోదా, కరువు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సమయంలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు కథనం ప్రచురించి, ఆయన పరువు ప్రతిష్టలను దెబ్బతీశారని, ఇందుకుగాను రాధాకృష్ణతోపాటు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టులో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదుపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం, మంగళవారం నాటి విచారణకు స్వయంగా హాజరు కావాలంటూ రాధాకృష్ణ, తదితరులను ఆదేశించింది. వ్యక్తిగత హాజరులో మినహాయింపు కోరుతూ రాధాకృష్ణ దాఖలుచేసిన క్వాష్ పిటిషన్ను నేడు విచారించిన హైకోర్టు అనుమతి ఇవ్వలేదు. నాంపల్లి కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు హైకోర్టు షాక్ -
'నీతిగా ఉంటే విచారణను ఎదుర్కో బాబు'
శ్రీకాకుళం: ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు నీతిగా వ్యవహరించి ఉంటే విచారణను ఎదుర్కోవాలని వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. ఆముదాల వలసలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు వైఖరిని తప్పు పట్టారు. ప్రతి రోజూ తాను నిప్పు నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు కోర్టులో లంచ్మోషన్ పిటిషన్ ఎందుకు వేయాల్సి వచ్చిందని అన్నారు. వైఎస్జగన్ మోహన్ రెడ్డిలా విచారణను ఎదుర్కొని తన నిజాయితీ నిరూపించుకోవాలని అన్నారు. -
'వంద శాతం ముద్దాయి చంద్రబాబే'
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన 'ఓటుకు కోట్లు' కేసులో ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వంద శాతం ముద్దాయేనని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే ఉన్నతస్థాయి విచారణ జరుగుతున్న ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రస్తుతం చంద్రబాబు అడ్డదారులు తొక్కుతున్నారని విమర్శించారు. అందులో భాగంగానే 'ఓటుకు కోట్లు' కేసు విచారణ నిలిపివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారని చెప్పారు. దమ్మూ, ధైర్యం ఉంటే ఈ కేసు విచారణను ఎదుర్కోవాలన్నారు. కరువు, చంద్రబాబు ఇద్దరూ కవలపిల్లల్లాంటి వాళ్లని ఎద్దేవాచేశారు. ఆయన ఎక్కడుంటే అక్కడ కరువు తాండవిస్తుందని నవీన్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. -
దోషిగా తేలుతానన్న భయంతోనే క్వాష్ పిటిషన్
ఓటుకు కోట్లు కేసులో పునర్విచారణ జరగాలని ఏసీబీ కోర్టు ఇప్పటికే ఆదేశించిందని, అందువల్ల కోర్టు ఉత్తర్వుల ప్రకారం విచారణ జరగాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. తనపై కేసు కొట్టేయాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన నేపథ్యంలో.. ఎమ్మెల్యే ఆర్కే స్పందించారు. సీఆర్పీసీ 156 (3) కింద విచారణ జరిగితే చంద్రబాబు దోషా.. నిర్దోషా అన్న విషయం తేలిపోతుందని ఆయన చెప్పారు. ఈ కేసులో చంద్రబాబు పాత్రను తేల్చేందుకు, ఆయనను దోషిగా చేర్చాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఆర్కేనే. ''విచారణ అర్హత ఉందని ఏసీబీ కోర్టు చాలా స్పష్టంగా పేర్కొంది. నిజంగా చట్టాల మీద, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంటే, అప్పీలుకు వెళ్లొద్దని స్పష్టంగా అడిగాను. విచారణ ఎదుర్కోడానికి మీకు ఎందుకు భయం.. దోషి అన్న విషయం మీకే తెలుసు కాబట్టే ఇలా చేస్తున్నారా? ఈ రెండు రోజుల నుంచి నిద్ర లేకుండా గడుపుతూనే ఉన్న మీరు.. ఈరోజు ఎందుకు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందో ప్రజలకు చెప్పాల్సిందే. ఈ రెండు రోజుల్లో భయం లేనట్లు నటిస్తూనే గవర్నర్ వద్దకు ఎవరెవర్ని పంపారో ప్రపంచం మొత్తం చూస్తూనే ఉంది. చట్టంలో ఉన్న చుట్టాలు కూడా ఎవరూ రక్షించలేరని తెలియడం వల్లే క్వాష్ పిటిషన్ను ఆశ్రయించాల్సి వచ్చింది'' అని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. దర్యాప్తు జరిగితే తాను దోషిగా తేలుతానన్న విషయం చంద్రబాబుకు తెలుసని, తన గొంతును ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లు ధ్రువీకరించినందు వల్లే బాబు భయపడుతున్నారని ఆర్కే అన్నారు. ఈ కేసులో తన పాత్ర బయట పడుతుందన్న భయంతోనే బాబు క్వాష్ పిటిషన్ వేశారన్నారు. గతంలో చాలామంది మహామహులు సీఆర్పీసీ 156 (3) కింద విచారణను ఎదుర్కొన్నారని ఆయన గుర్తుచేశారు. జయలలిత, జస్వంత్ సింగ్, కేంద్రమంత్రులు అందరూ ఇదే సెక్షన్, క్లాజు కింద విచారణ ఎదుర్కొన్నారన్నారు. అసలు విచారణ ఎదుర్కోకుండానే కేసు నుంచి తప్పించుకోవాలని ఆయన కోరడమేంటని ప్రశ్నించారు. దాన్ని బట్టే మీరు ఎంత తప్పు చేశారో తెలిసిపోతోందన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, తప్పు చేసిన వాళ్లు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని ఆయన చెప్పారు. -
దోషిగా తేలుతానన్న భయంతోనే క్వాష్ పిటిషన్
-
హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు
-
హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గురువారం ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ విచారణను నిలిపివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గత సోమవారం ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని ఉన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రత్యేక కోర్టు ఆదేశాలపై ఏసీబీ స్పందించింది. ఓటుకు కోట్లు కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, ఈ కుట్రలో పాత్రధారులెవరో కనిపెట్టే దిశగా దర్యాప్తు చేస్తున్నామని ప్రత్యేక కోర్టుకు ఏసీబీ నివేదించింది. కుట్రను నిరూపించేందుకు అవసరమైన అన్ని ఆధారాలను సేకరిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు బుధవారం ప్రత్యేక కోర్టులో ఏసీబీ మెమో దాఖలు చేసింది. ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించిన చంద్రబాబుపై దర్యాప్తు చేయాలంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేయాలంటూ ప్రత్యేక కోర్టు ఆదేశించిందని, అయితే ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో ఉన్న నేపథ్యంలో మరో ఎఫ్ఐఆర్ జారీచేయాల్సిన అవసరం లేదని ఏసీబీ నివేదించింది. దర్యాప్తులో వెగులుచూసిన అంశాల ఆధారంగా అనుబంధ చార్జిషీట్ దాఖలు చేస్తామని స్పష్టం చేసింది. దర్యాప్తు పురోగతిని ఈ మెమో ద్వారా ఏసీబీ కోర్టు దృష్టికి తెచ్చింది. -
మత్తయ్యకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జెరుసలేం మత్తయ్యను నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఓటుకు కోట్లు కేసుపై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ దాఖలు చేసిన మత్తయ్య క్వాష్ పిటిషన్ను హైకోర్టు అనుమతించింది. దీన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని మత్తయ్యకు సుప్రీం కోర్టు నోటీసులిచ్చింది. శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్లు లంచం ఇవ్వజూపి రేవంత్రెడ్డి తోపాటు పలువురు టీడీపీ నేతలు రెడ్హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో మత్తయ్య ఎ4 నిందితుడిగా ఉన్నారు. -
హైకోర్టులో మత్తయ్యకు ఊరట
హైదరాబాద్: సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జెరుసలేం మత్తయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన జెరుసలేం మత్తయ్య దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్పై విచారణ పూర్తయింది. మత్తయ్యపై ఉన్న ఆరోపణలను న్యాయస్థానం శుక్రవారం కొట్టేసింది. కాగా కేసు విచారణ నుంచి తనను తప్పించాలని ఆయన పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్లు లంచం ఇవ్వజూపి రేవంత్రెడ్డి తోపాటు పలువురు టీడీపీ నేతలు రెడ్హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో మత్తయ్య ఎ4 నిందితుడిగా ఉన్నారు. -
మత్తయ్య క్వాష్ పిటిషన్ విచారణ 16కు వాయిదా
హైదరాబాద్: సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో తన పేరును తొలగించాల్సిందిగా మత్తయ్య వేసిన క్వాష్ పిటిషన్ తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 16కు వాయిదా వేసింది. శుక్రవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. మత్తయ్య వేసిన పిటిషన్ విచారణకు అర్హత లేదని ఏసీబీ తరపు న్యాయవాది వాదించారు. ఈ కేసులో ఇప్పటికే ఏసీబీ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేశారని కోర్టుకు తెలియజేశారు. కౌంటర్ దాఖలలకు మత్తయ్య తరపు న్యాయవాది గడువు కోరారు. హైకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వెలుగు చూసిన ఓటుకు కోట్లు కేసులో మత్తయ్య ఎ-4 నిందితుడిగా ఉన్నాడు.