Rajkumar Hirani
-
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్బస్టర్ సినిమా
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'డంకీ' సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాదిలో సలార్కు పోటీగా డిసెంబర్ 21న డంకీ విడుదలైంది. 2023లో పఠాన్,జవాన్ చిత్రాలతో షారుక్ ఖాన్ రెండు బ్లాక్ బస్టర్లను అందుకున్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన డంకీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించినా ఆ రెండు చిత్రాల రేంజ్లో మెప్పించలేక పోయింది. దీంతో రూ. 470 కోట్ల కలెక్షన్స్ వద్ద డంకీ ఆగిపోయింది. తాజాగా డంకీ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. వాస్తవంగా ఈ సినిమా జనవరిలోనే ఓటీటీలోకి రావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వీలు కాలేదు. తాజాగా ఎలాంటి ప్రకటన లేకుండు షారుక్ డంకీ సినిమాను నెట్ఫ్లిక్స్ విడుదల చేసింది. ఇప్పటికే నెట్ఫ్లిక్స్లో టాలీవుడ్ సినిమాలు అయిన సలార్,యానిమల్,గుంటూరు కారం, హాయ్నాన్న వంటి చిత్రాలు టాప్ టెన్లో కొనసాగుతున్నాయి. ఇప్పుడు డంకీ చిత్రం నెట్ఫ్లిక్స్లో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. థియేటర్స్లో డంకీ చిత్రాన్ని చూడలేకపోయిన ప్రేక్షకులు ఈ వీకెండ్లో చూసి ఎంజాయ్ చేయవచ్చు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
Dunki Movie Review: ‘డంకీ’ మూవీ రివ్యూ
టైటిల్: డంకీ నటీనటులు: షారుక్ ఖాన్, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, బొమాన్ ఇరానీ, అనీల్ గ్రోవర్ తదితరులు నిర్మాణ సంస్థలు: జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రాజ్కుమార్ హిరాణి ఫిల్మ్స్ నిర్మాతలు:గౌరీ ఖాన్, రాజ్ కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్పాండే దర్శకత్వం: రాజ్ కుమార్ హిరాణీ సంగీతం: అమన్ పంత్, ప్రీతమ్(పాటలు) సినిమాటోగ్రఫీ: సీకే మురళీధరన్, మనుష్ నందన్, అమిత్ రాయ్, కుమార్ పంకజ్ విడుదల తేది: డిసెంబర్ 21, 2023 ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా సినిమాలను తెరకెక్కించే అతికొద్ది మంది దర్శకుల్లో రాజ్ కుమార్ హిరాణీ ఒకరు. ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే సాధారణంగానే అంచనాలు పెరిగిపోతాయి. అలాంటిది షారుక్ ఖాన్తో సినిమా అంటే.. ఆ అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. డంకీ విషయంలో అదే జరిగింది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా ఇది. అందుకే డంకీపై మొదటి నుంచే ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 21)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పఠాన్, జవాన్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ల తర్వాత షారుక్ నటించిన ఈ చిత్రం ఎలా ఉంది? షారుక్ ఖాతాలో హ్యాట్రిక్ పడిందా? లేదా? రివ్యూలో చూద్దాం. డంకీ కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1995లో సాగుతుంది. శత్రువుల దాడిలో గాయపడిన సైనికుడు హార్డీ(షారుఖ్)ని ఓ వ్యక్తి కాపాడుతాడు. కొన్నాళ్ల తర్వాత అతన్ని కలిసేందుకు హార్డీ పంజాబ్కి వస్తాడు. అయితే అప్పటికే ఆ వ్యక్తి మరణిస్తాడు. అతని సోదరి మను రంధ్వా అలియాస్ మన్ను(తాప్సీ పన్ను) కుటుంబ బాధ్యతను తీసుకుంటుంది. అప్పులు కట్టలేక ఇంటిని కూడా ఆమ్మేస్తారు. లండన్ వెళ్లి బాగా డబ్బు సంపాదించి.. అమ్ముకున్న ఇంటిని మళ్లీ కొనాలనేది మను కల. అలాగే ఆమె స్నేహితులు బుగ్గు లక్నపాల్(విక్రమ్ కొచ్చర్), బల్లి(అనిల్ గ్రోవర్) కూడా డబ్బు సంపాదించడానికై లండన్ వెళ్లాలనుకుంటారు. వీసా కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు. తన ప్రాణాలను కాపాడిన ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న హార్డీ.. మనుని లండన్ పంపించేందుకు సహాయం చేస్తాడు. ఈ నలుగురు వీసా కోసం ట్రై చేస్తారు. అందుకోసం ఇంగ్లీష్ నేర్చుకోవాలని అష్టకష్టాలు పడతారు. ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్లో ఈ నలుగురికి సుఖీ(విక్కీ కౌశల్) పరిచయం అవుతాడు. తన ప్రియురాలి జెస్సీని కలిసేందుకు అతను లండన్ వెళ్లాలనుకుంటాడు. వీళ్లంతా లీగల్గా ఇంగ్లండ్ వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అవుతాయి. దీంతో దేశ సరిహద్దుల గుండా అక్రమంగా ప్రయాణించి లండన్ వెళ్లాలని డిసైడ్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంగ్లండ్కు అక్రమంగా వెళ్లే క్రమంలో వీళ్లు పడిన కష్టాలేంటి? లండన్లో వీళ్లకు ఎదురైన సమస్యలు ఏంటి? ప్రియురాలి కోసం ఇంగ్లండ్ వెళ్లాలనుకున్న సుఖీ కల నెరవేరిందా లేదా? మన్నుతో ప్రేమలో పడిన హర్డీ.. తిరిగి ఇండియాకు ఎందుకు వచ్చాడు? పాతికేళ్ల తర్వాత.. మన్ను తిరిగి ఇండియాకు ఎందుకు రావాలనుకుంది? ఈ క్రమంలో హార్డీ మళ్లీ ఎలాంటి సహాయం అందించాడు? మను, హర్డీల ప్రేమ కథ సంగతేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. మంచి కథ, భావోద్వేగాలతో పాటు చక్కటి సామాజిక సందేశం ఉన్న సినిమాలను తెరకెక్కించడం రాజ్ కుమార్ హిరాణి స్పెషాలిటీ. సామాజిక అంశాలకు వినోదాన్ని మేళవించి ప్రేక్షకులకు అర్థమయ్యేలా సినిమాను తీర్చిదిద్దుతాడు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాభాయ్, త్రి ఇడియట్స్, పీకే, సంజు..చిత్రాలే వీటికి నిదర్శనం. డంకీ చిత్రంలో కూడా మంచి సోషల్ మెసేజ్ఉంది. కానీ దాన్ని ప్రేక్షకులకు ఆకట్టుకునేదే తీర్చిదిద్దడంలో రాజ్ కుమార్ హిరాణీ పూర్తిగా సఫలం కాలేదు. భారత్ నుంచి అక్రమంగా యూకేలోకి ప్రవేశించాలనుకునే నలుగురు స్నేహితుల కథే డంకీ. దర్శకుడు రాజ్ కుమార్.. అక్రమ వలసదారుల కాన్సెప్ట్ని తీసుకొని దానికి దేశభక్తి, లవ్స్టోరీని టచ్ చేసి ఎమోషనల్ యాంగిల్లో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. కానీ పాత్రలదారుల భావోద్వేగాలను ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేయలేకపోయాడు. ఎమోషనల్ సీన్లను ఆకట్టుకునేలా తీర్చిదిద్దలేకపోయాడు. వినోదం పండించడంలో మాత్రం తన పట్టు నిలుపుకున్నాడు. ఫస్టాఫ్ అంతా చాలా సరదాగా సాగిపోతుంది. పాతికేళ్లుగా లండన్లో ఉన్న మన్ను తిరిగి ఇండియా రావాలనుకొని ఆస్పత్రి నుంచి బయటకు పారిపోయే సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కాసేపటికే కథ 1995లోకి వెళ్తుంది. మన్ను.. ఆమె స్నేహితులు బల్లి,బుగ్గుల నేపథ్యం నవ్విస్తూనే.. ఎమోషనల్గా టచ్ అవుతుంది. ఇక హీరో ఎంట్రీ అయిన కాసేపటికే కథంతా కామెడీ మూడ్లోకి వెళ్తుంది. ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ఈ మను గ్యాంగ్ పడే కష్టాలు నవ్వులు పూయిస్తాయి. అలాగే వీసా కోసం చేసే ప్రయత్నాలు కూడా నవ్విస్తాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశం ఎమోషనల్కు గురి చేస్తుంది. ఇక సెకండాఫ్ అంతా కాస్త సీరియస్గా సాగుతుంది. డంకీ రూటులో( దేశ సరిహద్దులగుండా అక్రమంగా ప్రయాణించడాన్ని డాంకీ ట్రావెల్ అంటారు. పంజాబ్లో దాన్ని డంకీ అని పిలుస్తారు) ఇంగ్లండ్కి వెళ్లే క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. ఇక లండన్ వెళ్లాక ఈ నలుగు పడే కష్టాలు నవ్విస్తూనే..కంటతడి పెట్టిస్తాయి. కొన్ని సన్నివేశాలు ఆలోచింపజేస్తాయి. తిరిగి ఇండియాకు రావాలనుకున్నా..మళ్లీ డాంకీ ట్రావెలే చేయాల్సి వస్తుంది. ఆ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కన్నీళ్లను పెట్టిస్తుంది. కథ సాగదీసినట్లుగా అనిపించడం.. ప్రేక్షకుడి ఊహకు అందేలా కథనం సాగడం కూడా మైనస్. ఎవరెలా చేశారంటే.. పఠాన్, జవాన్ చిత్రాల్లో యాక్షన్తో ఇరగదీసిన షారుక్.. ఇందులో సాదాసీదా పాత్రలో కనిపించి, తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. హార్డీసింగ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. కామెడీ పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా అద్భుతంగా నటించాడు. అయితే ఓల్డ్ లుక్లో షారుఖ్ని చూడడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో తాప్సీకి మరో బలమైన పాత్ర లభించింది. మన్ను పాత్రలో ఆమె ఒదిగిపోయింది. సినిమా మొత్తం ఆమె పాత్ర ఉంటుంది. కొన్ని చోట్ల అయితే తనదైన నటనతో కన్నీళ్లను తెప్పిస్తుంది. ఇక విక్కీ కౌశల్ ఈ చిత్రంలో కనిపించేది కొద్ది సేపే అయినా..గుర్తిండిపోయే పాత్రలో నటించాడు. విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్, బోమన్ ఇరాన్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. అమన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. ప్రీతమ్ పాటలు పర్వలేదు.లుట్ ఫుట్ గయా సాంగ్ ఆకట్టకుంటుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
కూతురుతో షిర్డీ ఆలయంలో షారుక్ ఖాన్ పూజలు
బాలీవుడ్ కింగ్ షారుక్ఖాన్ హీరోగా రాజ్కుమార్ హిరాణీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'డంకీ'. ఈ సినిమా డిసెంబర్ 21న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు నానుంది. ఈ ఏడాది రెండు సూపర్ హిట్లతో బాక్సాఫీస్ వద్ద షారుక్ ఖాన్ సంచలనం సృష్టించారు. తాజాగా 'డంకీ'తో హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్తో పాటు షారుక్ కూడా ప్రమోషన్స్లలో బిజీగా ఉన్నారు. తాజాగా షారుక్ ఖాన్ తన కూతురు సుహానా ఖాన్తో కలిసి షిర్డీ సాయి బాబాను దర్శించుకున్నారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం షారుక్ ఖాన్కు ఆలయ ట్రస్ట్ అధికారి శివ శంకర్ సన్మానం చేశారు. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో షిర్డీ ఎయిర్ఫోర్టుకు చేరుకున్న షారుక్.. అక్కడి నుంచి కారులో బయల్దేరి సాయి బాబా ఆలయానికి చేరుకున్నారు. రెండు రోజుల క్రితమే జమ్మూ కాశ్మీర్లోని వైష్ణోదేవి మాత ఆలయానికి వెళ్లిన షారుక్ అక్కడ అమ్మవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. గత రెండు సినిమాలు పఠాన్,జవాన్ విడుదలకు ముందు కూడా ఇలా పలు ఆలయాలను షారుక్ ఖాన్ దర్శించుకుని తన సనిమా మంచి విజయం సాధించాలని పూజలు జరిపారు. ఈ క్రమంలో డిసెంబర్ 21న విడుదల కానున్న తన చిత్రం డంకీ కూడా సూపర్ హిట్ కొట్టాలని ఆయన కోరుకుంటున్నారు. డిసెంబర్ 22న ప్రభాస్ సలార్ కూడా విడుదల కానుంది. -
షారుక్ ఖాన్ డంకీ ట్రైలర్ వచ్చేసింది.. తక్కువ అంచనా వేయకండి
బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్, తాప్సీ పన్ను నటించిన డంకీ మూవీ ట్రైలర్ వచ్చేసింది. టాలెంటెడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల నటించడం విశేషం. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. తాజాగా మంగళవారం (డిసెంబర్ 5) రిలీజైన ఈ ట్రైలర్ ఫన్, ఎమోషన్ కలగలిపి ఎంతో ఆసక్తి రేపేలా ఉంది. ఈ ట్రైలర్ SRK వాయిస్తో ప్రారంభం అవుతుంది. ఇందులో స్నేహం, కామెడీ, విషాదం వంటి అంశాలు కీలకంగా ఉన్నాయి. ఈ చిత్రంలో ఇంగ్లిష్ నేర్చుకొని యూకే వెళ్లి సెటిలవ్వాలనుకునే ఓ గ్రామీణ యువకుడి పాత్రలో షారుక్ ఖాన్ అదరగొట్టేశాడు అనిపిస్తుంది. కానీ అతనికి ఎంత ప్రయత్నించినా ఇంగ్లిష్ రాకపోవడంతో అక్రమంగా చూకేలోకి చొరబడాలని ప్రయత్నించడం ఆపై అక్కడి వారికి దొరికిపోవడం వంటి అంశాలు ఈ కథలో కీలకంగా ఉండనున్నాయి. షారుక్ జర్నీలో స్నేహితులతో అతను పడే ఇబ్బందులు ఎలా ఎదుర్కొన్నాడో డంకీ ట్రైలర్ ద్వారా అర్థం అవుతుంది. తాజాగా డంకీ ట్రైలర్ను షారుక్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఇలా చెప్పాడు. 'ఈ కథను నేను లాల్టూ నుంచి మొదలు పెట్టాను. నా ఫ్రెండ్స్ తో కలిసి రాజు సర్ విజన్ నుంచి మొదలైన ప్రయాణాన్ని డంకీ ట్రైలర్ చూపిస్తుంది. ఈ ట్రైలర్ స్నేహం, కామెడీ, విషాదంతో పాటు ఇల్లు, కుటుంబ జ్ఞాపకాలను అందరినీ తట్టిలేపేలా ఉంటుంది. నేను ఎంతో కాలంగా ఎదరు చూస్తున్న సమయం వచ్చేసింది. డంకీ డ్రాప్ వచ్చేసింది.' అనే క్యాప్షన్తో షారుక్ ఈ ట్రైలర్ రిలీజ్ చేశాడు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, త్రీ ఇడియట్స్, పీకే లాంటి సినిమాలను తీసిన రాజు హిరానీ డైరెక్షన్లో డంకీ చిత్రం రావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. -
'డంకీ సినిమాను థియేటర్లలో ప్రదర్శించకండి'.. షారుక్కు నెటిజన్ రిక్వెస్ట్!
ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన బాలీవుడ్ బాద్షా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. ఇటీవలే అట్లీ డైరెక్షన్లో వచ్చిన జవాన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ మూవీతోనే లేడీ సూపర్ స్టార్ నయనతార బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఓకే ఏడాదిలోనే మూడో చిత్రం క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుంది. షారుఖ్ ఖాన్ డంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం నుంచి లుట్ పుట్ గయా అనే సాంగ్ను రిలీజ్ చేశారు. అయితే తాజాగా షారుక్ ప్రతి సినిమా రిలీజ్కు ముందు ఎప్పటిలాగే సోషల్ మీడియాలో ఆస్క్ ఎస్ఆర్కే సెషన్ నిర్వహించాడు. ఈ సందర్భంగా పలువురు నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తనదైన శైలిలో వారికి ప్రశ్నలకు బదులిచ్చారు. మొదటి డంకీ అనే పదానికి అర్థమేంటో వివరించారు. డంకీ అంటే దేశ సరిహద్దుల వెంట అక్రమ ప్రయాణం గురించి వివరించే మార్గమని షారుక్ వివరించారు. ఓ నెటిజన్ సినిమాను థియేటర్లలో చూడటానికి చట్టవిరుద్ధమైన మార్గం ఏదైనా ఉందా? అన షారుక్ను ప్రశ్నించాడు. దీనిపై స్పందిస్తూ.. నా చిన్నతనంలో సినిమాలు చూసేందుకు థియేటర్ ప్రొజెక్షనిస్ట్ను లైన్లో పెట్టేవాడిని.. మీరు ఒకసారి ఇలా ప్రయత్నించండి.. వర్కవుట్ అవుతుందేమో.. కానీ ఈ విషయం మీకు చెప్పినట్లు ఎవరికీ చెప్పకండి. ఇది చాలా రహస్యం" అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. మరో నెటిజన్ కూడా డంకీని థియేటర్లో కాకుండా స్టేడియంలో ప్రదర్శించమని ఎస్ఆర్కేను కోరారు. దీనికి బాద్షా బదులిస్తూ "అవును.. నేను కూడా మా టీమ్కి ఈ విషయం చెప్పాను.. కానీ ఎయిర్ కండిషనింగ్ సమస్య. మీరు సినిమా చూసేందుకు పిల్లలు, పెద్దలతో కలిసి వెళ్లాలి. చాలా అసౌకర్యంగా ఉంటుంది..." అంటూ ఫన్నీగా ఇచ్చిపడేశాడు. కాగా.. రాజ్కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కించిన డంకీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 21న విడుదల కానుంది. ఈ చిత్రంలో తాప్సీ పన్ను, బోమన్ ఇరానీ, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ కీలక పాత్రల్లో నటించారు. విక్కీ కౌశల్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. Dunki is a way of describing an illegal journey across borders. It is pronounced डंकी. It’s pronounced like Funky…Hunky….or yeah Monkey!!! https://t.co/t0Et738SEk — Shah Rukh Khan (@iamsrk) November 22, 2023 Yes I also told the team but the air conditioning is an issue. You have to go with kids and elders for the film…will be uncomfortable…so let’s keep this one in the theatres in the 21st December only. #Dunki https://t.co/vOkGZ2fJzD — Shah Rukh Khan (@iamsrk) November 22, 2023 -
కింగ్ ఖాన్ బర్త్ డే.. సర్ప్రైజ్ ఇచ్చిన మేకర్స్!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తోన్న తాజా చిత్రం డంకీ. డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో తాప్సీ హీరోయిన్గా నటిస్తోంది. గౌరీ ఖాన్, రాజ్కుమార్ హిరాణి, జ్యోతిదేశ్ పాండే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్రిస్ట్మస్ కానుకగా అభిమానులను అలరించనుంది. తాజాగా నవంబర్ 2న కింగ్ ఖాన్ బర్త్ డే కావడంతో మేకర్స్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా డంకీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ చూస్తే ఐదుగురు కలిసి ఇంగ్లాండ్ వెళ్లేందుకు చేసిన ప్రయత్నమే కథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పంజాబ్ ప్రాంతంలోని యువకుల కథనే ఇందులో చూపించనున్నట్లు కనిపిస్తోంది. ఇంగ్లాండ్ వెళ్లేందుకు వారు ఎలా ప్రయత్నించారు? వారికెదురైన సమస్యలేంటి అనేది తెలియాలంటే డంకీ సినిమా చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ, అనిల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. A story of simple and real people trying to fulfill their dreams and desires. Of friendship, love, and being together… Of being in a relationship called Home! A heartwarming story by a heartwarming storyteller. It's an honour to be a part of this journey and I hope you all come… pic.twitter.com/AlrsGqnYuT — Shah Rukh Khan (@iamsrk) November 2, 2023 -
ఇండియాని షేక్ చేయబోయే సూపర్ కాంబో..!
-
ఏకంగా తొమ్మిది చిత్రాలు.. ఆ దర్శకుల్లో టాప్ ఎవరంటే.. రాజమౌళి మాత్రం!
ఒక సినిమా వందకోట్లు కలెక్షన్స్ రావడమంటే అంతా ఈజీ కాదు. స్టార్ హీరోల సినిమాలకైతే వాళ్ల క్రేజ్ను బట్టి వసూళ్లు రాబట్టడం జరుగుతూ ఉంటోంది. ఇక హీరోల సంగతి పక్కన పెడితే.. దర్శకుడే సినిమాకు ప్రధాన బలం. వారి కథ, స్క్రీన్ ప్లేను బట్టి సినిమా హిట్టా, ఫ్లాపా అనే టాక్ తెచ్చుకోవడంపై ఆధారపడి ఉంటుంది. అదే కాకుండా కంటెంట్ ఉంటే చిన్న సినిమా అయినా సరే బాక్సాఫీస్ వద్ద వందకోట్లు కొల్లగొట్టడం చూస్తుంటాం. కానీ ఓకే దర్శకుడి తెరకెక్కించిన తొమ్మిదికి పైగా చిత్రాలు వంద కోట్లు రాబట్టమంటే మామూలు విషయం కాదు. అలాంటి అరుదైన ఘనత సాధించిన దర్శకధీరుడి గురించి తెలుసుకుందాం. తొమ్మిది చిత్రాల దర్శకుడు 2000ల మధ్యకాలంలో భారతీయ సినిమాలు.. దేశీయ కలెక్షన్లతో వందకోట్ల మార్కు చేరుకున్న సినిమాలుగా గుర్తించారు. ఆ తర్వాత దేశవ్యాప్తం కలెక్షన్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లు దాటిన సినిమాలను వంద కోట్ల క్లబ్లో చేర్చారు. చాలా మంది హీరోల సినిమాలు రూ.100 కోట్ల క్లబ్లో చేరాయి. కానీ వందకోట్ల వసూళ్లు సాధించిన సినిమాలు నిర్మించిన దర్శకుల సంఖ్య మాత్రం ఇలా వేళ్లమీదే లెక్కపెట్టొచ్చు. ఇలాంటి అరుదైన మైలురాయిని అందుకున్న దర్శకుల్లో రోహిత్ శెట్టి ఒకరు. ఆయన నిర్మించిన తొమ్మిది చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూళ్లు సాధించాయి. అత్యధికంగా రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాలు తీసిన భారతీయ దర్శకుడిగా పేరు సంపాదించారు. గోల్మాల్ 3తో మొదలై.. గోల్మాల్ 3 చిత్రంతో మొదలైన రోహిత్ ప్రభంజనం సూర్యవంశీ వరకు కొనసాగింది. అతను నిర్మించిన చిత్రాల్లో రూ. 423 కోట్ల కలెక్షన్స్తో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా చెన్నై ఎక్స్ప్రెస్ నిలిచింది. ఆ తర్వాత సింగం (రూ. 157 కోట్లు), బోల్ బచ్చన్ (రూ. 165 కోట్లు), సింగం రిటర్న్స్ (రూ. 219 కోట్లు), దిల్వాలే (రూ. 377 కోట్లు), గోల్మాల్ ఎగైన్ (రూ. 311 కోట్లు), సింబా (రూ. 400 కోట్లు) ఉన్నాయి. అయితే అయితే రోహిత్ శెట్టి తెరకెక్కించిన కొన్ని చిత్రాలు నిరాశపరిచనవి కూడా ఉన్నాయి. వాటిలో జమీన్ (రూ. 18 కోట్లు), సండే (రూ. 32 కోట్లు), సర్కస్ (రూ. 62 కోట్లు)తో రూ. 100 కోట్లు రాబట్టని లిస్ట్లో ఆరు సినిమాలు ఉన్నాయి. ప్రతి సినిమా 100 కోట్లే.. తన ప్రతి సినిమా 100 కోట్ల క్లబ్లో చేరిన ఘనత కరణ్ జోహార్ సొంతం. దిల్వాలే దుల్హనియా లే జాయేంగేలో ఆదిత్య చోప్రాకు అసిస్టెంట్గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన చిత్రనిర్మాత, 1998లో కుచ్ కుచ్ హోతా హైతో దర్శకుడిగా మారారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 107 కోట్లను రాబట్టి.. ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత కభీ ఖుషీ కభీ గమ్, కభీ అల్విదా నా కెహనా, మై నేమ్ ఈజ్ ఖాన్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, ఏ దిల్ హై ముష్కిల్ రూ.100 కోట్లు దాటాయి. ఇటీవల విడుదలైన రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీతో ఏడో చిత్రం కూడా ఈ లిస్ట్లో చేరిపోయింది.. రూ.100 కోట్ల చిత్రాల దర్శకులు వీళ్లే.. ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా వసూలు సాధించిన దర్శకులు కూడా ఉన్నారు. డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఐదు చిత్రాలు ఈ లిస్ట్లో ఉన్నాయి. ఆ తర్వాత కబీర్ ఖాన్, రాజ్కుమార్ హిరానీ ఒక్కొక్కరు నాలుగు సినిమాలు ఉన్నాయి. దర్శకు ధీరుడి నాలుగు చిత్రాలు టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాలు నాలుగు ఉన్నాయి. వాటిలో మగధీర, బాహుబలి-1, బాహుబలి-2, ఆర్ఆర్ఆర్ ఉన్నాయి. అయితే రాజమౌళి తెరకెక్కించిన రెండు సినిమాలు మాత్రం రూ.1000 కోట్ల వసూళ్లను దాటేశాయి. ఈ ఘనత సాధించిన ఏకైక దర్శకుడిగా రాజమౌళి మాత్రమే నిలిచారు . -
అత్యంత ధనవంతులైన డైరెక్టర్ల లిస్ట్లో రాజమౌళి
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ధనవంతులైన దర్శకులు ఎవరో తెలుసా? స్క్రీన్పై అభిమానులకు వినోదాన్ని అందిస్తూ కోట్లు సంపాదించిన డైరెక్టర్లను వేళ్ల మీదే చెప్పొయొచ్చు. అలాంటి ఇండియాలో ధనవంతులైన దర్శకులెవరో ఓ లుక్కేద్దాం. జీక్యూ ఇండియా తాజాగా దర్శకుల జాబితాను ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ జాబితాలో టాలీవుడ్కు చెందిన ఎస్ఎస్ రాజమౌళి మాత్రమే ఉన్నారు. బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ గురించి బాలీవుడ్తో పాటు దక్షిణాదిలో పరిచయం అక్కర్లేదు. సూపర్ హిట్ సినిమాలతో ఫేమస్ అయ్యారు. ఆయనకు దాదాపు రూ.1640 కోట్ల ఆస్తులతో మొదటిస్థానంలో ఉన్నారు. రెండోస్థానంలో రాజ్కుమార్ హిరాణీ రూ.1105 కోట్లతో నిలవగా.. రూ.940 కోట్లతో సంజయ్ లీలా భన్సాలీ మూడోస్థానం పొందారు. ఆ తర్వాత వరుసగా రూ.720 కోట్లతో అనురాగ్ కశ్యప్, రూ.300 కోట్లతో కబీర్ ఖాన్, రూ.280 కోట్లతో రోహిత్ శెట్టి, రూ.158 కోట్లతో ఎస్ఎస్ రాజమౌళి, రూ.76 కోట్లతో జోయా అక్తర్ నిలిచారు. View this post on Instagram A post shared by GQ India (@gqindia) -
డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్కి మధ్య మనస్పర్థలు,నిలిచిపోయిన షారుక్ మూవీ!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ దాదాపు మూడేళ్ల గ్యాప్ అనంతరం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో వస్తున్నాడు. ప్రస్తుతం షారుక్ చేతి మూడు నుంచి నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో డైరెక్టర్ రాజ్కుమార్ హీరాని ‘డంకీ’ ఒకటి. తాప్సీ పన్ను హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అమిత్ రాయ్ సినిమాటోగ్రాఫర్గా చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. సెట్స్పైకి వచ్చి తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. చదవండి: అతియా, కేఎల్ రాహుల్ పెళ్లి డేట్పై క్లారిటీ ఇచ్చిన సునీల్ శెట్టి డంకీకి సినిమాటోగ్రాఫర్గా పని చేసిన అమిత్ రాయ్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై క్లారిటీ లేదు. తాజాగా ఈ వార్తలపై అమిత్ రాయ్ స్పందించాడు. ఇటీవల ముంబై మీడియాతో ముచ్చటించిన ఆయన ఇకపై తాను డంకీ మూవీకి పనిచేయడం లేదని స్పష్టం చేశాడు. ‘తొలి షెడ్యూల్లో భాగంగా డంకీ చిత్రానికి 18, 19 రోజులు వర్క్ చేశాను. ఇకపై నేను ఆ సినిమాకీ పని చేయడం లేదు. నాకు, డైరెక్టర్ రాజ్కుమార్ హిరానికి మధ్య అనుకొని మనస్పర్థలు తలెత్తడమే ఇందుకు కారణం’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: పెళ్లి అనంతరం అదే జోరు.. 75వ చిత్రానికి రెడీ అయిన నయన్ అనంతరం ఆయన మనస్పర్థలపై వివరణ ఇస్తూ.. ‘ఇద్దరి ఆలోచనలు ఏకీభవించడం లేదు. మేం ఒకే కోణంలో చూడలేకపోయాం. ఈ క్రమంలో మా మధ్య కొన్ని మనస్పర్థలు వచ్చాయి. ఇది భవిష్యత్తులో ఎలాంటి గొడవలకు దారి తీయకూడదనే ఉద్దేశంతోనే ఈ సినిమా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. ఇదే విషయాన్ని డైరెక్టర్తో కూర్చొని మాట్లాడాను కూడా. ఇక పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయానికి వచ్చాం’ అని అన్నాడు. అయితే తాను తీసిన షాట్స్ మాత్రం అలాగే ఉంటాయని అమిత్ రాయ్ తెలిపాడు. కాగా ఈ సినిమాను 2023 డిసెంబర్ 22న థియేటర్లోకి తీసుకురానున్నట్లు మూవీ యూనిట్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కొత్త సినిమా ప్రకటించిన షారుక్, డైరెక్టర్ ఎవరంటే
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన ఫ్యాన్స్ సర్ప్రైజింగ్ అప్డేట్ ఇచ్చాడు. మూడేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న షారుక్ ప్రస్తుతం వరస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. తాజాగా ఆయన మరో సినిమాకు సంతకం చేశాడు. తన తదుపరి సినిమా కోసం పీకే, మున్నా భాయ్ ఎంబీబీఎస్ చిత్రాల దర్శకుడు రాజ్కుమార్ హీరానీతో తొలిసారి జతకట్టాడు. ఈ విషయాన్ని స్వయంగా షారుక్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ సందర్భంగా డైరెక్టర్ రాజ్కుమార్ హీరానితో కలిసి ఓ ఆసక్తికర వీడియోను పంచుకుంటూ మూవీ టైటిల్ను కూడా రివీల్ చేశాడు. ఈ వీడియోలో షారుక్ మున్నా భాయ్ ఎంబీబీఎస్, పీకే చిత్రాల పోస్టర్ల ఎదురుగా నిలబడి కనిపిస్తాడు. చదవండి: ‘ఆచార్య’ రీషూట్పై స్పందించిన డైరెక్టర్ కొరటాల ఆ తర్వాత రాజ్కుమార్ హీరానీతో తన కోసం కూడా ఏదైనా కథ ఉందా అని అడగ్గా అవును..ఉందని సమాధానం ఇస్తాడు. దీనికి టైటిల్ ఏంటని అడగ్గా డంకీ అంటూ టైటిల్ చెప్పేశాడు డైరెక్టర్. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య సాగే సంభాషణ ఫన్నీగా ఉంటుంది. ఇక ఈ పోస్ట్ను షారుక్ షేర్ చేస్తూ.. ‘డియర్ రాజ్కుమార్ సర్, మీరు నాకోసం సాంటా క్లాజ్ని వదిలారు. మీరు మొదలు పెట్టండి నేను వచ్చేస్తున్నా. చెప్పాలంటే ఇప్పటికే నేను సెట్లో ఉండాల్సింది. అయితే చివరకు మీతో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉంది’ అంటూ రాసుకొచ్చాడు. ఈ నేపథ్యంలో షారుక్ మూవీ టైటిల్ ‘డంకీ’ అని, 2023 డిసెంబర్ 22న ఈ సినిమాను థియేటర్లోకి తీసుకురానున్నట్లు పోస్ట్లో పేర్కొన్నాడు. కాగా ఈ మూవీలో కథానాయికగా తాప్పీ పన్ను నటిస్తున్నట్లు సమాచారం. చదవండి: భారీ ఆఫర్ను తిరస్కరించిన అల్లు అర్జున్!, ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్ View this post on Instagram A post shared by Shah Rukh Khan (@iamsrk) -
కింగ్ ఖాన్తో జోడీ...
కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ హీరోగా రాజ్కుమార్ హిరాణీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందని, ఈ చిత్రంలో తాప్సీ హీరోయిన్గా నటిస్తారనీ బాలీవుడ్లో ఓ వార్త ఎప్పట్నుంచో ప్రచారంలో ఉంది. ఈ వార్త నిజమేనని, షారుక్కు జోడీగా తాప్సీ నటించనున్నారనీ బాలీవుడ్ లేటెస్ట్ టాక్. చట్టవిరుద్ధంగా అమెరికా, కెనడా వంటి విదేశాలకు వీసాలు సంపాదించే విద్యార్థులు, వ్యక్తుల బ్యాక్డ్రాప్లో సాగే సోషల్డ్రామాగా ఈ సినిమా కథనం ఉంటుందట. అంతేకాదు.. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, వచ్చే ఏడాది పంజాబ్లో ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుందని టాక్. తాప్సీ కెరీర్ను నెక్ట్స్ లెవల్కు తీసుకుని వెళ్లిన ‘బద్లా’ సినిమాకు షారుక్ ఖాన్ ప్రొడ్యూసర్ అనే సంగతి తెలిసిందే. -
అమీర్, అనుష్క ఎందుకు నోరు విప్పలేదు?
బాలీవుడ్ సంచలన హీరోయిన్ కంగనా రనౌత్ మరోసారి బాలీవుడ్ స్టార్లపై మండిపడ్డారు. యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసును ఆమె ప్రస్తావిస్తూ.. సుశాంత్తో కలిసి నటించిన వాళ్లు దీనిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. హీరో అమీర్ ఖాన్, హీరోయిన్ అనుష్క శర్మ.. సుశాంత్తో కలిసి 'పీకే' చిత్రంలో పని చేశారని తెలిపారు. ఈ ఇద్దరూ సుశాంత్కు న్యాయం జరగాలనో లేదా సీబీఐ విచారణ జరపాలనో ఎందుకు డిమాండ్ చేయలేదని నిలదీశారు. వీళ్లే కాకుండా పీకే సినిమా దర్శకుడు రాజ్కుమార్ హిరానీ, సుశాంత్ సినిమాలను తెరకెక్కించిన నిర్మాత ఆదిత్య చోప్రా, రాణి ముఖర్జీలపై కూడా ఆమె అసహనం వ్యక్తం చేశారు. వీళ్లందరినీ బాలీవుడ్ రాకెట్ ముఠాగా పరిగణించారు. (టర్కీ ప్రథమ మహిళతో ఆమిర్.. నెటిజన్ల ఫైర్) ఒక్కరు సైలెంట్గా ఉన్నా అందరూ అదే ఫాలో అవుతారు "ఈ రాకెట్ ఎలా పని చేస్తుందో తెలుసా? ఒక్కరు నోరు విప్పకపోయినా మిగతా అందరూ మౌనంగా ఉంటారు. అలా.. ఎవరూ సీబీఐ దర్యాప్తు జరగాల్సిందేనని డిమాండ్ చేయడానికి ముందు రాలేదు. ఇదెలా ఉంటుందంటే.. అమీర్ ఖాన్ ఏమీ మాట్లాడలేదనుకో, అనుష్క కూడా నాకెందుకొచ్చిందిలే అని సైలెంట్గా ఉంటారు. అలానే రాజ్కుమార్ హిరానీ, ఆదిత్య చోప్రా, అతని భార్య రాణి ముఖర్జీ కూడా నోరు మెదపరు. వీళ్లదంతా ఓ గ్యాంగ్" అని కంగనా మండిపడ్డారు. (అమిర్ నాకు పెట్టకుండానే తిన్నారు: దీపిక) మీకు మాటలే కరువయ్యాయా? "మీకు ఎక్కడో చోట తప్పు చేశామన్న అపరాధ భావన లేకపోతే మీ సహనటుడు, ఇండస్ట్రీలోని ముఖ్య వ్యక్తి సుశాంత్ మరణంపై ఎందుకు స్పందించట్లేదు? అంటే మీకు ఈగనో, దోమనో చనిపోయినట్లు అనిపిస్తుందా? అతని కోసం చెప్పేందుకు మీకు మాటలే కరువయ్యాయా? అక్కడ అతని కుటుంబం రోదిస్తోంది. కనీసం వారి పట్ల మీరు సానుభూతి కూడా చూపించలేరా? సీబీఐ దర్యాప్తు చేయాల్సిందేనని గొంతెత్తి ప్రశ్నించలేరా? ఇందులో మీరు ఏ ఒక్కటీ చేయలేదు, ఎందుకు? ఎందుకని ఇంతలా భయపడుతున్నారు? జరుగుతున్న పరిణామాలన్నింటినీ దేశమంతా చూస్తోంది" అని ఆమె పేర్కొన్నారు. కాగా సుప్రీం కోర్టు సుశాంత్ బలవన్మరణం కేసును సీబీఐకి అప్పగించాలని కంగనా మొదటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. అనంతరం ఇదే డిమాండ్ అంతటా వినిపించడంతో ఎట్టకేలకు సుప్రీం కోర్టు సీబీఐ దర్యాప్తుకు అంగీకరించిన విషయం తెలిసిందే. (సుశాంత్ కేసు సీబీఐకే) -
పంజాబ్ టు కెనడా
దాదాపు ఏడాదిన్నర కావస్తున్నా బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తర్వాతి చిత్రంపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ‘జీరో’ చిత్రం తర్వాత షారుక్ మరో సినిమాకు సైన్ చేయలేదు. ఈ నేపథ్యంలో రాజ్కుమార్ హిరాణీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా నటించే చిత్రానికి రంగం సిద్ధమైందని బాలీవుడ్ టాక్. వాస్తవానికి వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందని గత ఏడాదే వార్తలు వచ్చాయి. కథ రెడీ అయ్యిందని, హిరాణీ అండ్ టీమ్ ప్రస్తుతం ఈ స్క్రిప్ట్కు ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారని సమాచారం. ఇందులో సరదా సరదాగా ఉండే వ్యక్తి పాత్రలో షారుక్ నటించబోతున్నారట. ఇందుకోసం ప్రస్తుతం జుట్టు పెంచుతున్నారని భోగట్టా. పంజాబ్ టు కెనడాల మధ్య ప్రయాణించే ఓ వ్యక్తి నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందని తెలిసింది. ఎక్కువగా ఫారిన్ లొకేషన్స్లో షూటింగ్ను ప్లాన్ చేశారట. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా షూటింగ్ ఆరంభమయ్యే అవకాశం ఉంది. -
టాప్లో 3 ఇడియట్స్!
కోవిడ్ 19 (కరోనా వైరస్) కారణంగా ఏర్పడిన లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో థియేటర్స్కి తాళం పడిన విషయం తెలిసిందే. ఇంటి నుంచి కాలు బయటపెట్టలేని ఈ పరిస్థితిలో డిజిటల్ ప్లాట్ఫామ్స్లో అందుబాటులో ఉన్న సినిమాలను చూస్తున్నారు. కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న యుఎస్లో లాక్డౌన్ సమయంలో వ్యూయర్స్ ఎక్కువగా చూసిన భారతీయ సినిమాగా ‘3 ఇడియట్స్’ నిలిచింది. రాజ్కుమార్ హిరాణీ దర్వకత్వంలో ఆమిర్ ఖాన్, మాధవన్, షర్మాన్ జోషి, కరీనా కపూర్, బొమన్ ఇరానీ ముఖ్య తారాగణంగా తెరకెక్కిన ఈ చిత్రం 2009లో విడుదలైన సంగతి తెలిసిందే. ‘‘పదేళ్ల తర్వాత కూడా మా సినిమాకు మంచి ఆదరణ దక్కుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు హిరాణీ. ఇక ‘ది డార్క్నైట్’, ‘అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’, ‘ఇన్సెప్షన్’, ‘మ్యారేజ్ స్టోరీ’ వంటి హాలీవుడ్ చిత్రాలను కూడా యూఎస్ ప్రజానీకం ఎక్కువగా వీక్షించారు. -
ఎదురు చూస్తున్నా
బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్ కెరీర్లో ‘మున్నాభాయ్ ఎమ్బీబీఎస్’(2003), ‘లగే రహో మున్నాభాయి’ (2006) చిత్రాలు ప్రత్యేకమైనవి. ఈ రెండు చిత్రాల్లో మంచి ఎమోషన్కు కాస్త కామిక్ను జోడించి హిట్స్ అందుకున్నారు సంజయ్దత్. ఈ రెండు సినిమాలకు రాజ్కుమార్ హిరాణీయే దర్శకుడు. మరి... ఈ మున్నా భాయ్ ఫ్రాంౖచైజీలో థర్డ్ పార్ట్ ఎప్పుడు వస్తుంది అన్న ప్రశ్నను సంజయ్దత్ ముందు ఉంచితే – ‘‘మరో సీక్వెల్ రావాలని నేను కూడా దేవుణ్ని కోరుకుంటున్నాను. కానీ ఈ విషయం గురించి స్పందించాల్సింది దర్శకుడు రాజ్కుమార్ హిరాణీ. నేనైతే ఈ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ఈ సీక్వెల్కి కథ రాస్తున్నానని గతంలో రాజ్కుమార్ పేర్కొన్నారు. మరి.. కథ ఎందాకా వచ్చింది? అనే విషయంలో క్లారిటీ లేకే సంజయ్ ఈ విధంగా చెప్పి ఉంటారు. ఇదిలా ఉంటే ‘మున్నాభాయ్ ఎమ్బీబీఎస్’ చిత్రాన్ని ‘శంకర్దాదాఎమ్బీబీఎస్’ (2004)గా, ‘లగే రహో మున్నాభాయ్’ చిత్రాన్ని ‘శంకర్దాదా జిందాబాద్’ (2007)గా చిరంజీవి తెలుగులో రీమేక్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
సోలోగానే వెళ్తానంటోన్న టాప్ డైరెక్టర్
తనుశ్రీ దత్తా ప్రారంభించిన ‘మీటూ’ ఉద్యమం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమా, జర్నలిజం వంటి పలు రంగాలకు చెందిన ప్రముఖుల మీద లైంగిక వేధింపులు ఆరోపణలు రావడంతో దేశం అట్టుడికి పోయింది. ఇలా ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్కుమార్ హిరాణీ కూడా ఉన్నారు. ‘సంజు’ సినిమా సమయంలో రాజ్కుమార్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళ ఆరోపించిన సంగతి తెలిసిందే. దాంతో ఈ ఏడాది అనీల్ కపూర్ - సోనమ్ కపూర్లు ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఏక్ లడ్కీ కో దేఖా థో హైసా’ లగా చిత్రం నుంచి కూడా రాజ్కుమార్ పేరును తొలగించారు. ఇన్నాళ్లు వినోద్ చోప్రోతో కలిసి తన ప్రొడక్షన్ హౌస్లో ఎన్నో హిట్ సినిమాలు తీసిన రాజ్కుమార్ హిరాణీ తొలిసారి ఒంటరిగా ఓ సినిమాను తెరకెక్కించబోతున్నారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నట్లు సమాచారం. ‘ప్రస్తుతానికి స్క్రిప్ట్ రెడీ అయ్యింది. ఈ సారి రాజ్కుమార్ ఒక్కరే ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే కొంతమంది నటీనటులతో సినిమా గురించి మాట్లాడారు. వారంతా ఈ చిత్రంలో పని చేసేందుకు రెడీగా ఉన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రటకన వెలువడనుంద’ని రాజ్కుమార్ సన్నిహితుడొకరు మీడియాకు తెలిపారు. గతంలో రాజ్కుమార్ సంజు, పీకే సినిమాలకు వినోద్ చోప్రాతో కలిసి నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే రాజ్కుమార్ మీద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సంజయ్ దత్, రణ్బీర్ కపూర్, సోనమ్ కపూర్ వంటి బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు మద్దతుగా నిలిచారు. -
ఆ ఆరోపణలను నమ్మను
‘‘దర్శకుడు రాజ్కుమార్ హిరాణీతో కలసి చాలా సినిమాలు చేశాను. చాలా కాలంగా అతను నాకు పరిచయం. అతని మీద వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలను నేను అస్సలు నమ్మను’’ అన్నారు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్. ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా ‘మున్నాభాయ్’ సిరీస్, ‘పీకే, సంజు’ చిత్రాల దర్శకుడు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయన వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన ఓ మహిళ చేసిన ఆరోపణలను సంజయ్ దత్ కొట్టి పారేశారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘రాజు మీద ఆరోపణలు నమ్మశక్యంగా లేవు. ఆరోపణలు కాకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయవచ్చుగా?’’ అన్నారు. ‘‘మున్నాభాయ్ సిరీస్లో కొత్త చిత్రం కచ్చితంగా ఉంటుందని రాజు ఆల్రెడీ చెప్పాడు. కానీ అది ఎప్పుడు ఉంటుందో నాక్కూడా సరిగ్గా తెలియదు’’ అని కూడా సంజయ్ దత్ చెప్పారు. -
‘ఆ ఆరోపణలు అవాస్తవం అయితే..?!’
నటి తనుశ్రీ దత్తా ప్రారంభించిన మీటూ ఉద్యమం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేవలం సిని రంగంవారేకాక.. మీడియా రంగంలోని వారు ధైర్యంగా బయటకు వచ్చి తమకు ఎదురైన ఇబ్బందులను బయటపెట్టారు. బాలీవుడ్లోని చాలామంది ప్రముఖులు బాధితులకు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకడు రాజ్కుమార్ హిరాణీ మీద లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో సోనమ్ కపూర్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’ చిత్రం పోస్టర్ నుంచి రాజ్కుమార్ హిరాణీ పేరు తొలగించారు. అయితే మీటూ ఉద్యమం ప్రారంభం నుంచి బాధితులకు మద్దతు తెలిపిన సోనమ్ కపూర్ రాజ్కుమార్ హిరాణీ విషయంలో మాత్రం ఆయనకే మద్దతిస్తోంది. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘మీటూ ఉద్యమంలో ప్రతి బాధితురాలిని నేను నమ్ముతాను. కానీ హిరాణీ విషయంలో నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేను. హిరాణీ దర్శకునిగానే కాక వ్యక్తిగతంగా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి నాకు తెలుసు. నేను ఆయనను చాలా గౌరవిస్తాను. కానీ ఇప్పుడు నా సినిమా కూడా నాకు ముఖ్యమే. సినిమా విడుదలయ్యాక దీని గురించి మాట్లాడతాను. ఇక్కడ నేను ఒక్క విషయం అడగదల్చుకున్నాను.. హిరాణీ మీద వచ్చిన ఆరోపణలు నిజం కాదని తెలితే అప్పుడేంటి పరిస్థితి. ఒక వేళ అలాంటిదే జరిగితే ఈ ఉద్యమం పూర్తిగా దెబ్బతింటుంది’ అని తెలిపారు సోనమ్ కపూర్. హిరాణీ మీద వచ్చిన లైంగిక వేధింపలు ఆరోపణలను ఆయన కుటుంబ సభ్యులే కాక స్నేహితులు, పలువురు నటులు కూడా కొట్టిపారేస్తున్నారు. తనను లైంగికంగా వేధించారంటూ హిరాణీ వద్ద పనిచేసిన సహాయ దర్శకురాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నటి దియా మీర్జా, రచయిత జావేద్ అక్తర్, హర్షద్ వాసి, షర్మాన్ జోషి తదితర ప్రముఖులు రాజ్కుమార్కు మద్దతుగా నిలుస్తుండగా... మరికొంతమంది మాత్రం ఈ విషయం గురించి పూర్తి నిజాలు బయటపడిన తర్వాతే మాట్లాడాల్సి ఉంటుందంటూ అభిప్రాయపడుతున్నారు. -
‘తను ఎప్పటికీ అలాంటి పని చేయడు’
‘రాజ్కుమార్ చాలా మంచివాడు. ఆయనపై వచ్చిన ఆరోపణలు నేను నమ్మను. తను ఎప్పటికీ అలాంటి పని చేయడు’ అంటూ నిర్మాత బోనీ కపూర్... బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్కుమార్ హిరాణీకి మద్దతుగా నిలిచారు. తనను లైంగికంగా వేధించారంటూ హిరాణీ వద్ద పనిచేసిన సహాయ దర్శకురాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నటి దియా మీర్జా, రచయిత జావేద్ అక్తర్, హర్షద్ వాసి, షర్మాన్ జోషి తదితర ప్రముఖులు రాజ్కుమార్కు మద్దతుగా నిలుస్తుండగా... మరికొంత మంది మాత్రం ఈ విషయం గురించి పూర్తి నిజాలు బయటపడిన తర్వాతే మాట్లాడాల్సి ఉంటుందంటూ అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ విషయంపై స్పందించిన హీరో ఇమ్రాన్ హష్మీ మాట్లాడుతూ..‘ నేను దీని గురించి మాట్లాడాలనుకోవడం లేదు. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే. అయినా హిరాణీ ఈ వీటిని కొట్టిపారేశారు కూడా. నిజ నిర్ధారణ జరిగేంత వరకు ఈ విషయం గురించి కామెంట్ చేయకపోవడమే మంచిది’ అని వ్యాఖ్యానించాడు. కాగా బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్ పదేళ్ల క్రితం సినిమా షూటింగ్లో భాగంగా తనను లైంగికంగా వేధించాడంటూ హీరోయిన్ తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్లో #మీటూ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. వివిధ రంగాల్లో తాము ఎదుర్కొంటున్న వేధింపుల గురించి మహిళలు సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేశారు. (టాప్ డైరెక్టర్పై లైంగిక ఆరోపణలు.. షాక్లో బాలీవుడ్!) రాజ్కుమార్ హిరాణీ -
‘15 ఏళ్లుగా రాజు సర్ నాకు తెలుసు’
ముంబై: ప్రముఖ దర్శకుడు రాజ్కుమార్ హిరానీపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం పట్ల హీరోయిన్ దియా మిర్జా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై అధికారిక విచారణ జరగాలని ఆమె ఆకాంక్షించారు. ‘ఈ వార్త విని చాలా బాధ పడ్డాను. 15 ఏళ్లుగా రాజు సర్ నాకు తెలుసు. ఆయనను ఎంతో గౌరవిస్తాను. నేను పనిచేసిన వారిలో అత్యంత గౌరవప్రదమైన వ్యక్తి ఆయన. పూర్తి వివరాలు తెలియకుండా దీని గురించి వ్యాఖ్యానించలేను. ఈ వ్యవహారంపై అధికారిక దర్యాప్తు జరగాల’ని దియా మిర్జా అన్నారు. రాజ్కుమార్ హిరానీ తెరకెక్కించిన లగే రహో మున్నాభాయ్, సంజు సినిమాల్లో ఆమె నటించారు. హిరానీ తనను లైంగికంగా వేధించారంటూ ‘సంజు’ సినిమాకి దర్శకత్వ శాఖలో పని చేసిన ఓ మహిళ ఆరోపించిన సంగతి తెలిసిందే. గతేడాది మార్చి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో తనను పలుమార్లు వేధించారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. దర్శకులు సాజిద్ ఖాన్, వికాస్ బల్, సీనియర్ నటులు అలోక్నాథ్, నానాపటేకర్, సంగీత దర్శకుడు అనుమాలిక్ తదితరులు ఇప్పటికే లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
టాప్ డైరెక్టర్పై లైంగిక ఆరోపణలు.. షాక్లో బాలీవుడ్!
‘మీటూ’ ఉద్యమంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో చాలామంది లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొన్నారు. తాజాగా ‘3 ఇడియట్స్, సంజు’ వంటి చిత్రాలను తెరకెక్కించిన అగ్రదర్శకుడు రాజ్ కుమార్ హిరానీపై ‘సంజు’ సినిమాకి దర్శకత్వ శాఖలో పని చేసిన ఓ మహిళ ఆరోపించారు. ‘‘సంజు’ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో హిరానీ నన్ను లైంగికంగా వేధించారు. ఆయన్ని ఓ తండ్రిలా భావించాను. మా నాన్నగారి ఆరోగ్యం బాగాలేదు. ఆ పరిస్థితుల్లో ఉద్యోగం పోతే మళ్లీ ఉద్యోగం సంపాదించడం కష్టం అవుతుందని సైలెంట్గా ఉండిపోయాను’’ అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని హిరానీ ఫిల్మ్ మేకింగ్ పార్ట్నర్ విదూ వినోద్ చోప్రా, ఆయన భార్య అనుపమా చోప్రా, రచయిత అభిజిత్ జోషీకు మెయిల్ చేశారామె. అయితే ఈ ఆరోపణలు అసత్యమని, తన ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రయత్నమే అని కొట్టిపారేశారు హిరానీ. టాప్ డైరెక్టర్పై ఇలాంటి ఆరోపణ రావడం బాలీవుడ్కి పెద్ద షాకే. -
‘రాజ్కుమార్ హిరాణీ నాపై లైంగిక దాడి చేశాడు’
సాక్షి, న్యూఢిల్లీ: మీటూ ఉద్యమం బాలీవుడ్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్కుమార్ హిరాణీపై లైంగిక దాడి ఆరోపణలు రావడం సంచలనం రేపుతోంది. హిరాణీ తనపై లైంగిక దాడి చేశాడని ఆయన వద్ద పనిచేసిన సహాయ దర్శకురాలు ఆరోపణలు చేశారు. సంజు సినిమాకు సహాయ దర్శకురాలిగా పనిచేసిన ఆమెపై సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో 2018 మార్చి-సెప్టెంబర్ మధ్యకాలంలో హిరాణీ తనపై లైంగిక దాడి చేశాడని, తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు ఆరోపించారు. ఈ మేరకు ఈ ఘటన గురించి సంజు సినిమా నిర్మాత విధూవినోద్ చోప్రాకు ఆమె ఈమెయిల్ పంపినట్లు తెలిసింది. ‘హిరాణీ మంచి పేరున్న దర్శకుడు. నేను కేవలం ఆయన వద్ద పనిచేస్తున్న అసిస్టెంట్ను. నా పట్ల జరిగినది చాలా పెద్ద తప్పు. నా పట్ల జరిగిన దారుణాన్ని ఎవరికీ చెప్పుకోలేను. ఆయన కారణంగా నా మనసు, శరీరం పాడైపోయాయి. అలా ఆరు నెలల పాటు హిరాణీ నన్ను లైంగికంగా వేధించారు. ఉద్యోగాన్ని పోగొట్టుకోలేక మౌనంగా ఉండాల్సి వచ్చింది. ఒకవేళ ఈ ఉద్యోగాన్ని వదిలేసినా మరో ఉద్యోగం దొరకదేమోనన్న భయం. తప్పని పరిస్థితుల్లో మౌనంగా ఉండాల్సిం వచ్చింది’’ అని ఆమె మెయిల్ ద్వారా తన ఆవేదనను వ్యక్తపరిచారు. తనపై వస్తున్న ఆరోపణలను హిరాణీ తీవ్రంగా ఖండించారు. ఆయన తరఫు న్యాయవాది ఆనంద్ దేశాయ్ మీడియాతో మాట్లాడుతూ.. హిరాణీపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఆయపై కావాలనే ఎవరో తప్పడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆయన పేరు చెడగొట్టడానికి ఎవరో ఇలా చేయిస్తున్నారని అన్నారు. రాజ్కుమార్ హిరాణీ వంటి పెద్ద దర్శకుడిపై ఓ సహాయ దర్శకురాలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో మళ్లీ మీటూ ఉద్యమం తీవ్రతరమైంది. -
రెండేళ్ల తర్వాత బాలీవుడ్లో సంబురాలు
దాదాపు రెండేళ్ల తర్వాత బాలీవుడ్లో పండగ వాతావరణం కనిపిస్తోంది. సంజు చిత్రం రూ. 500 కోట్ల క్లబ్లో అడుగుపెట్టడంతో డిస్ట్రిబ్యూటర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంజయ్ దత్ బయోపిక్గా తెరకెక్కిన సంజులో రణ్బీర్ కపూర్ లీడ్ రోల్ పోషించగా, రాజ్కుమార్ హిరాణీ డైరెక్టర్. సంజు బాబా లైఫ్లోని ప్రధాన కోణాలతో ఈ చిత్రాన్ని భావోద్వేగంగా హిరాణీ తెరకెక్కించాడు. తొలిరోజు రూ.34 కోట్లు రాబట్టి ఈ ఏడాది హయ్యెస్ట్ ఓపెనర్గా నిలిచిన సంజు.. వరుస డిజాస్టర్లతో అయోమయంలో ఉన్న రణ్బీర్ కెరీర్కు భారీ సక్సెస్ ఇచ్చింది. అమీర్ఖాన్ దంగల్(2016 డిసెంబర్) తర్వాత రిలీజ్ అయిన (బాహుబలి-2ని మినహాయిస్తే...) చిత్రాలేవీ పట్టుమని మూడు వందల కోట్ల క్లబ్లో చేరలేకపోయాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ట్యూబ్లైట్.. షారూఖ్ నటించిన జబ్ హ్యారీ మెట్ సెజల్లు చతికిలపడగా.. భారీ బడ్జెట్తో తెరకెక్కిన టైగర్ జిందా హై, రేస్-3.. పద్మావత్ లాంటి చిత్రాలు ఆ ఫీట్ను సాధించలేకపోయాయి. ఈ తరుణంలో బిగ్గెస్ట్ హిట్ కోసం బాలీవుడ్ దాహాన్ని సంజు తీర్చేసింది. ఇండియాలో రెండువారాల్లో 378 కోట్ల (గ్రాస్), రూ.295 కోట్ల(నెట్) వసూళ్లు(తొలివారంలోనే రూ.202 కోట్లు) రాబట్టింది. ఓవర్సీస్లో రూ.122 కోట్లు వసూలు చేసింది. యూఎస్లో 7 మిలియన్ క్లబ్ దాటేసి ఇంకా దూసుకుపోతోంది. విమర్శలు... అయితే సంజు జీవితంలోని చీకటి కోణాలు పేరిట రాజ్కుమార్ హిరాణీ తప్పులను కప్పిపుచ్చాడని పలువురు విమర్శలకు దిగారు. ఈ క్రమంలో మిశ్రమ రివ్యూలు ఇవ్వటంతోపాటు, పలు కోణాల్లో క్రిటిక్స్ సంజును తప్పుబట్టారు. అయితే తన జీవితం తెరిచిన పుస్తకమని, దాచేందుకు ఏం లేదంటూ విమర్శలపై సంజయ్ దత్ అంతే ఘాటుగా స్పందించారు. -
సంజయ్ దత్ గొప్పా.. ఎలా? : పాంచజన్య
న్యూఢిల్లీ : సంజయ్ దత్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘సంజూ’ చిత్రాన్ని ప్రశ్నిస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధికారిక వార పత్రిక పాంచజన్య సమాజానికి బాలీవుడ్ ఏం సందేశం ఇవ్వాలనుకుంటోందో చెప్పాలని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఎడిటోరియల్ కాలమ్లో సంజూ సినిమాను ఉద్దేశించి ఓ కథనాన్ని ప్రచురించింది. హాలీవుడ్ ‘ది మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ’ పేరుతో గణిత శాస్త్రంలో మేధావి అయిన రామనుజం జీవిత చరిత్రను తెరకెక్కిస్తే, బాలీవుడ్ మాత్రం అండర్వరల్డ్కు సంబంధించిన వారిపై చిత్రాలను తీస్తోందంటూ మండిపడింది. అండర్వరల్డ్ను, సంజయ్ దత్ అవలక్షణాలను పొగుడుతూ సంజూ సినిమాను తీశారని వ్యాఖ్యానించింది. ముంబై పేలుళ్లలో సంజయ్ దత్ దోషిగా తేలడాన్ని, అతని అరెస్ట్ను, కూతురితో అతనికున్న సంబంధాలను కూడా ఈ సందర్భంగా పాంచజన్య ప్రస్తావించింది. సంజయ్ దత్కు లేని అవలక్షణం లేదు. అతడు 1993 బాంబు పేలుళ్లు, మత హింసలో పాలుపంచుకున్నాడు. మారణాయుధాలను తన దగ్గర దాచుకున్నాడు. మూడుసార్లు పెళ్లి చేసుకున్నాడు. తన కూతురిని కొన్నేళ్లుగా కనీసం కలవనేలేదు. సినిమాలో చూపించినట్లుగా అతనికి 308 మంది అమ్మాయిలతో శారీరక సంబంధం ఉంది. ఇదీ సంజయ్ దత్. అలాంటి వ్యక్తి జీవిత చరిత్రను తెరకెక్కించి పొగడ్తలతో ముంచెత్తడంపై తీవ్ర స్థాయిలో ఆ పత్రిక ధ్వజమెత్తింది. చిత్ర దర్శకుడు రాజ్కుమార్ హిరాణీపై కూడా పాంచజన్య విరుచుకుపడింది. గతంతో పీకే వంటి సినిమాను హిందువులకు వ్యతిరేకంగా హిరాణీ తీశారని, ఇప్పుడు అవలక్షణాలు ఎక్కువగా ఉన్న ఓ వ్యక్తిని సమాజానికి ఏదో చేసేసినట్లు హీరోను చేసి చూపించడం సరియైన పద్దతేనా? అని ప్రశ్నించింది. ఇలాంటి చిత్రాల నిర్మాణానికి గల్ఫ్ నుంచి నుంచి పెట్టుబడులు వస్తున్నాయా? అనే అనుమానాలు వ్యక్తం చేసింది. -
‘సంజు’ సిన్మాకు సంజయ్ ఎంత తీసుకున్నారు?
బయోపిక్లు వాస్తవానికి దూరంగా తెరకెక్కుతున్నాయన్న విమర్శలు వస్తోన్నా.. సినిమాలు మాత్రం విజయవంతమవుతున్నాయి. బాలీవుడ్లో అందరూ ఎదురుచూసిన సంజయ్ దత్ బయోపిక్ ‘సంజు’ సినిమా గత వారం విడుదలై సక్సెస్ఫుల్గా దూసుకెళ్తోంది. సంజయ్దత్గా రణ్బీర్ కపూర్ నటనకు బాలీవుడ్ మొత్తం ఆశ్చర్యపోతోంది. రాజ్కుమార్ హిరాణీ గత సినిమాల మాదిరిగానే ‘సంజు’ సినిమా రికార్డులను బ్రేక్ చేస్తోంది. విడుదలైన వారంలోనే దాదాపు 200కోట్లు కలెక్ట్ చేసి ప్రస్తుతం 250కోట్లకు పరుగెడుతోంది. అయితే ఈ సినిమాకు గాను సంజయ్దత్కు ఎంత ముట్టజెప్పారన్న వార్తలు వైరల్గా మారాయి. సంజయ్దత్కు మొదటగా ఓ పదికోట్లు ఇచ్చారని, సినిమా లాభాల్లో షేర్ కూడా ఉందనీ.. మొత్తంగా సంజయ్ దత్కు దాదాపు 20కోట్ల వరకు ముట్టవచ్చని బీటౌన్ టాక్. విదూ వినోద్ చోప్రా, రాజ్కుమార్ హిరాణీ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో సోనమ్కపూర్, మనీషా కొయిరాల, పరేష్ రావెల్, దియా మీర్జా, విక్కీ కౌశల్, అనుష్క శర్మ ముఖ్యపాత్రల్లో నటించారు. -
రాజ్ కుమార్ హిరాణితో తరుణ్ భాస్కర్
డైరెక్టర్ తరుణ్ భాస్కర్ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణిని ముంబాయిలో కలిశారు. ఈ నగరానికి ఏమైంది చిత్ర స్పెషల్ షో సందర్భంగా వీరిద్దరు కలుసుకున్నారు. ఇటీవల రిలీజ్ అయిన రాజ్ కుమార్ హిరాణి ‘సంజు’, తరుణ్ భాస్కర్ ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాల గురించి చర్చించుకున్నట్టుగా తెలుస్తోంది. భవిష్యత్తులో తరుణ్ భాస్కర్ తీయాలనుకుంటున్న సినిమాలకు సంబంధించిన ఆలోచనలను కూడా హిరిణితో చర్చించారట. సంజయ్ దత్ బయోపిక్ ఆధారంగా రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో తెరకెక్కిన సంజు గత శుక్రవారం రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది చిత్రం కూడా అదే రోజు రిలీజ్ అయి తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్ సొంతం చేసుకుంది. -
ఆయనకు నేను బిగ్ ఫ్యాన్ : హీరోయిన్
సాక్షి, ముంబై : సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘సంజు’ మూవీ హిట్ టాక్తో దూసుకుపోతోంది. సంజుగా రణ్బీర్ నటన విమర్శకులను సైతం మెప్పించింది. తాజాగా సంజు మూవీ దర్శకుడు రాజ్కుమార్ హిరాణీ, రణ్బీర్ కపూర్లపై హీరోయిన్ అలియా భట్ ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా చూసిన అనంతరం తన స్పందన తెలియజేస్తూ... ‘రాజ్కుమార్కు నేను పెద్ద అభిమానిని. ఆయన తీసిన సినిమాలన్నీ సూపర్ ఇవ్వడం సాధారణ విషయంగా మారిపోయింది. అయితే గత రెండేళ్లలో ఆయన తీసిన గొప్ప సినిమా ఏదంటే మాత్రం కచ్చితంగా సంజు అనే చెప్తాను. ఈ సినిమా ద్వారా ఆయన స్టామినా ఏంటో మరోసారి రుజువైంది’ అంటూ అలియా వ్యాఖ్యానించారు. పనిలో పనిగా తన స్నేహితుడు రణ్బీర్ కపూర్ను కూడా పొగడ్తల్లో ముంచెత్తారు అలియా. ‘సంజు పాత్రలో రణ్బీర్ జీవించేశారు. నా ఫేవరెట్ సినిమాల్లోని టాప్ 10లో సంజుకు మొదటి స్థానం ఇస్తాను. విక్కీ కౌశల్, పరేష్ జీ, అనుష్క శర్మ, సోనమ్ కపూర్ ఇలా ప్రతీ ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇదొక అద్భుతమైన సినిమా’ అంటూ అలియా ప్రశంసించారు. -
‘అమ్మ చనిపోతే కనీసం ఏడవలేదు’
భావోద్వేగాలతో తెరకెక్కిన రణ్బీర్ కపూర్ ‘సంజు’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సీనియర్ నటుడు సంజయ్ దత్ బయోపిక్ కావటంతో ఆయన జీవితంలోని ఆసక్తికర కోణాలను తెలుసుకునేందుకు కొందరు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో సంజూ బాబా పాత వీడియోలు వైరల్గా మారుతున్నాయి. అందులో తన తల్లి చనిపోయిన సమయంలో తాను ఎలా ప్రవర్తించిందనేది చెబుతూ భావోద్వేగానికి లోనైన ఇంటర్వ్యూ ఒకటుంది. 90వ దశకంలో తీసిన ఆ ఇంటర్వ్యూలో సంజయ్ చెప్పిన మాటలు... ‘నా తల్లిది చాలా మంచి మనస్తత్వం. సెట్స్లో అందరితోనూ మంచిగా మెలిగేది. ఆమె చనిపోయినప్పుడు నేను ఎలాంటి ఎమోషన్లను చూపించలేకపోయా. కనీసం ఏడవలేదు కూడా. రెండేళ్ల తర్వాత కుటుంబ సభ్యులతో గ్రూప్గా కూర్చున్న సమయంలో హఠాత్తుగా ఓ ఆడియో క్లిప్ ప్లే అయ్యింది. అందులో ఉంది నా తల్లి వాయిస్. (బ్యాక్ గ్రౌండ్లో నర్గీస్దత్ గొంతు వినిపించింది...)... ‘అది విన్నాక ఆమెకు నా మీద ఎంత ప్రేమ ఉందో?.. ఎంత జాగ్రత్తలు తీసుకుందో? తను నా గురించి ఏం కోరుకుందో? అప్పుడు నాకు అర్థమైంది. అంతే నా ప్రమేయం లేకుండా కళ్లలోంచి నీళ్లు వచ్చేశాయి. అలా నాలుగైదు గంటలు ఏడ్చుకుంటూ ఉండిపోయా. తప్పో.. ఒప్పో.. అన్నీ నాలోనే ఉంటాయి. వాటిని బయటకు తీసినప్పుడే మారినమనిషిని అవుతాను’ సంజు ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. సంజు డెబ్యూ చిత్రం రాకీకి కొద్ది రోజుల ముందే నటి, సునీల్ దత్ సతీమణి నర్గీస్ దత్ చనిపోవటం తెలిసిందే. -
సంజయ్ దత్ ఎమోషనల్ వీడియో
-
హయ్యెస్ట్ గ్రాసర్గా ‘సంజు’
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంజయ్ దత్ బయోపిక్ ‘సంజు’ తొలిరోజు కలెక్షన్ల దుమ్మురేపింది. ఈ ఏడాది ఇప్పటిదాకా రిలీజ్ అయిన చిత్రాల్లో హయ్యెస్ట్ కలెక్షన్లు రాబట్టింది. అంతేకాదు రణ్బీర్ కెరీర్లోనే బెస్ట్ వసూళ్లు(ఫస్ట్ డే) రాబట్టిన చిత్రంగా నిలిచింది. సంజు మూవీ రివ్యూ బాలీవుడ్ ట్రేడ్ అనాలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపిన వివరాల ప్రకారం.. కేవలం ఇండియాలోనే సంజు ఫస్ట్ డే రూ. 34.75 కోట్లు రాబట్టింది. ఇక రణ్బీర్ కెరీర్లో ఇప్పటిదాకా తొలిరోజు వసూళ్లు రాబట్టిన చిత్రంగా సంజు నిలిచింది. అంతకు ముందు ఈ రికార్డు బేషరమ్(రూ.21.56) పేరిట ఉంది. చిత్రానికి పాజిటివ్ టాక్ రావటంతో వీకెండ్లోనే వంద కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉందని ఆదర్శ్ అంచనా వేస్తున్నారు. రాజ్కుమార్ హిరాణీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ ఎమోషనల్ డ్రామాలో పరేష్ రావెల్, మనీషా కోయిరాలా, విక్కీ కౌశల్, సోనమ్ కపూర్, అనుష్క శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. -
సంజయ్ దత్తు
సినిమా హీరోలకు మేకప్ మామూలే. తళతళలాడిపోడానికి పూస్తారు. సమాజంలో కూడా రంగులు పులిమేవారుంటారు. నిజం సరిగ్గా తెలియకపోతే ఆ రంగులు భలే ఇంట్రెస్ట్గా అనిపిస్తాయి. ఒక్కోసారి ఆ రంగులే నిజం అనిపిస్తాయి. సంజయ్దత్ జీవితంలో అలాంటి రంగులు ఎన్నో! ఉగ్రవాది.. వ్యసనపరుడు.. స్త్రీలోలుడు.. వగైరా.. వగైరా..! ‘సంజూ’ సినిమాలో రాజ్కుమార్ హిరాణీ ఈ రంగుల్లో నిజానిజాల్ని ఇంకో కోణంలో చూపించాడు. సంజయ్ని ముత్యంలా చూపించడానికి దత్తత తీసుకున్నాడు! డ్రగ్స్, ఆల్కహాల్, అమ్మాయిలు, గన్స్, గూండాలు.. ఇదంతా సినిమా సరుకు. సంజయ్దత్ జీవితాన్ని ‘సంజు’ సినిమాగా తీసిన రాజ్కుమార్ హిరాణీకి ఈ సరుకు ఎక్కడా వెతుక్కోకుండానే గంపగుత్తగా ఒకటే చోట దొరికింది. సంజయ్దత్ జీవితంలోనే ఇవన్నీ ఉన్నాయి. వాటికి హిరాణి కొంచెం ఎమోషన్ కలిపాడు. పిక్చర్ హిట్ అయింది. ఐదు స్టార్లకు అంతా నాలుగు స్టార్లు వేస్తున్నారు. సంజయ్ రోల్ వేసిన రణబీర్ కపూర్ కూడా మళ్లీ చాలాకాలం తర్వాత ఈ సినిమాతో స్టార్ అయ్యాడు. ‘నేను టెర్రరిస్టును కాదు’ పాతికేళ్లుగా సంజయ్దత్ తన నెత్తిమీద ‘టెర్రరిస్ట్’ అనే గంపను మోస్తున్నాడు. అది అతడి జీవితంలో ఒక భాగం అయిపోయింది. దాన్నిప్పుడు దించి, సినిమాలో పెట్టి సంజయ్ మనో భారం తగ్గించాడు హిరాణీ. కళంకితుడన్న ఇమేజ్ని తొలగించి సంజయ్ని ప్రక్షాళన చెయ్యిడానికి హిరాణీ ఈ సినిమా తియ్యలేదు. ఒక స్టార్ తనయుడు.. విలాసాలకు, విపరీతాలకు అలవాటు పడినవాడు.. జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నాడో కూడా హిరాణీ చెప్పలేదు. నిరంతరం ప్రశ్నలతో విసిగించి, వేధించే మీడియా నుంచి పారిపోయి.. ‘నేను టెర్రరిస్టును కాదు’ అని అరిచి చెప్పడానికి బయోగ్రఫీని రాయించాలనుకుంటాడు రణబీర్కపూర్ (సంజు). పూర్తిగా అతడి సైడు నుంచి స్టోరీ చెప్పాలి. అనుష్క వస్తుంది బయోగ్రఫీ రాయడానికి. వస్తుంది కానీ, గొప్ప ఉద్వేగంతో వచ్చేం కూర్చోదు. టెర్రరిస్ట్ బయోగ్రఫీలో తెలియంది ఏముంటుందీ?! ‘ఏముంటుందిలే అనుకునేదానిలో ఎంతో ఉండొచ్చు’ అని రణబీర్ భార్య దియా మీర్జా అంటుంది. రణబీర్ కూడా అంతా నిజమే చెబుతాను అంటాడు. అనుష్క రెడీ అవుతుంది. సినిమా మొదలౌతుంది. ఒక్కో ఘట్టం చెప్పుకుంటూ పోతాడు రణవీర్. ఒక్కో ఘట్టం రాసుకుంటూ పోతుంది అనుష్క. ఒక్కో ఘట్ట తీసుకుంటూ పోతాడు రాజ్ హిరాణీ. రీలంతా రియల్ లైఫే బయోపిక్ల ట్రెండ్ నడుస్తున్న తరుణంలో సీనియర్ నటుడు సంజయ్దత్ జీవితగాథను సినిమాగా తీస్తున్నట్లు ప్రకటించి, ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాడు దర్శకుడు రాజ్కుమార్ హిరాణీ. పైగా సక్సెస్ లేక సతమతమవుతున్న యువ హీరో రణ్బీర్ కపూర్ను ‘సంజు’ మూవీ రోల్కు తీసుకోవటం ఆశ్చర్యం కలిగించింది. అయితే ట్రైలర్, ప్రొమోల్లో అచ్చం ‘సంజూబాబా’లా కనిపించిన రణ్బీర్.. ఆ అంచనాలను తారస్థాయికి చేర్చాడు. కథేమిటంటే.. స్టార్ వారసుడిగా బాలీవుడ్లో అడుగుపెట్టి, తొలి చిత్రం (రాకీ)తోనే స్టార్డమ్ సంపాదిస్తాడు సంజు. సినీ ప్రస్థానం కొనసాగుతున్న సమయంలోనే డ్రగ్స్ అలవాటు, అక్రమాయుధాల కేసు అతడి జీవితాన్ని కుదిపేస్తాయి. ఆయుధాల కేసులో తనకు తానుగా లొంగిపోవాలని భావిస్తాడు. కానీ, అంతకు ముందే తన జీవితాన్ని కథగా బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తాడు. బయోగ్రాఫర్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో విన్నె (అనుష్క శర్మ) ముందుకు వస్తుంది. తన జీవితంలోని ముఖ్య ఘట్టాలను సంజు.. అనుష్కకు వివరిస్తూ ఉండగా కథ సాగుతుంది. ‘ఒక్క మనిషి.. పలు కోణాలు’ ఈ ట్యాగ్ లైన్తోనే సంజు జీవితంలోని దశలను దర్శకుడు వివరించే ప్రయత్నం చేశాడు. వివాదాల నటుడు సంజయ్ దత్ లైఫ్ను తెరపై ఆయన డీల్ చేసిన విధానం అద్భుతం. వివాదాలను కూడా ఎమోషనల్గా మలిచిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. తన జీవితంలో ఎత్తుపల్లాలను పూస గుచ్చినట్లుగా వివరిస్తూ సంజు కథ ముందుకు సాగుతుంది. తల్లి మరణం, హీరోగా ఎదిగే క్రమంలో డ్రగ్స్ అలవాటుతో సంజు సతమతమయ్యే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆ వ్యసనం నుంచి బయటపడేందుకు చేసే స్ట్రగ్రుల్, విమర్శలు వెల్లువెత్తినా తండ్రి (పరేష్ రావెల్) కొడుక్కి అండగా నిలవటం, ముఖ్యంగా వాళ్లిద్దరి మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్లు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అయితే ఫస్టాఫ్ను గ్రిప్పింగ్గా నడిపిన దర్శకుడు.. సెకండాఫ్ను మొత్తం జైలు జీవితం, కేసు, కోర్టు ప్రధానాంశాలుగా నడిపించాడు. తాను టెర్రరిస్ట్ను కాదంటూ సంజు పడే మానసిక సంఘర్షణ, భావోద్వేగపూరిత సన్నివేశాలతోనే ద్వితీయార్థాన్ని కానిచ్చేశాడు. ఈ క్రమంలో సంజు కెరీర్ను చూపించినా.. వ్యక్తిగత విషయాల జోలికి పోలేదు. హీరోయిన్లతో రిలేషన్షిప్స్, వైవాహిక జీవితంలోని లోతైన అంశాలను (మొదటి భార్య రిచా శర్మ, కూతురు త్రిశల గురించి) చూపించకుండా సంజు కథ సాగింది. ఈ విషయంలో ప్రేక్షకులు కొంత అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది. దియా మెప్పించారు సంజయ్ దత్ పాత్రలోకి రణ్బీర్ కపూర్ జీవించేశాడు. సంజు అంటే రణబీర్ అనేలా కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కొన్ని సన్నివేశాల్లో రణ్బీర్ తనను తాను అద్భుతంగా ఆవిష్కరించుకున్నాడు. డ్రగ్స్ బాధితుడిగా చేసే సన్నివేశాలు అయితేనేం, వీధుల్లో అడుక్కునే సీన్ అయితేనేం, పోలీస్ విచారణలో, ఆస్పత్రిలో స్నేహితుడితో... ఒక్కటి కాదు.. చెప్పుకుంటూ పోతే బోలెడు సీన్లు. తండ్రి సునీల్ దత్ పాత్రలో పరేష్ రావల్ను తప్ప వేరే ఎవరినీ ఊహించుకోలేం అనిపిస్తుంది. ఇక సంజు బెస్ట్ ఫ్రెండ్ కమలేష్ (విక్కీ కౌశల్) పాత్ర సినిమాకు మరో ఆకర్షణ. కష్టాల్లో ఉన్న స్నేహితుడికి అండగా ఉండటం, సంజు–కమలేష్ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు మంచి అనుభూతిని కలిగిస్తాయి. నర్గీస్ దత్ పాత్రలో సీనియర్ నటి మనీషా కొయిరాలాకు పెద్దగా సీన్లు లేవు. అయినా ఉన్నంతలో ఆమె పాత్ర అలరిస్తుంది. భార్య మాన్యతా పాత్రలో దియా మీర్జా మెప్పించారు. సోనమ్ కపూర్, అనుష్క శర్మ, మిగతా పాత్రలు ఓకే. పలువురు సెలబ్రిటీలు, చివర్లో కాసేపు స్వయంగా సంజయ్ దత్ కనిపించటం ఆకట్టుకుంది. ఏఆర్ రెహమాన్, రోహన్ రోహన్–విక్రమ్ మాంట్రెసె సంగీతం సినిమాకు తగ్గ మూడ్ను అందించింది. ‘కర్ హర్ మైదాన్ ఫతే సాంగ్’, ‘రుబీ రుబీ’ పాటలు అలరిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్తోపాటు విజువల్గా కూడా సంజు మెప్పిస్తుంది. రాజ్కుమార్ హిరాణీ అద్భుతమైన స్టోరీ టెల్లర్. అందులో ఏ మాత్రం సందేహం లేదు. దత్ ఫ్యామిలీతో ఉన్న స్నేహాన్ని పక్కనపెట్టి మరీ కథానుగుణంగా కొన్ని సన్నివేశాలను స్వేచ్ఛగా తెరకెక్కించారు. చిత్రం నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఓవరాల్గా హిరాణీ సినిమాల్లో లభించే హ్యూమన్ ఎమోషన్స్, హ్యూమర్ ఎలిమెంట్స్ ‘సంజు’లో పుష్కలంగా లభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 5300 స్క్రీన్లు ‘సంజు’తో రణ్బీర్ కపూర్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్తో స్టార్టయ్యింది. శుక్రవారం సినిమాకి íß ట్ టాక్ వస్తే శని, ఆదివారాలు హౌస్ఫుల్ అవుతాయి. అటువంటిది ‘సంజు’ సినిమా ముందుగానే అడ్వాన్స్ బుకింగ్లతో హోరెత్తిందనే చెప్పాలి. ఇకపోతే బాలీవుడ్లో రెండు రకాలుగా సినిమా ఓపెనింగ్స్ ఉంటాయి. హాలిడే ఓపెనింగ్, నాన్ హాలిడే ఓపెనింగ్. శుక్రవారం నార్త్ ఇండియాలో నాన్ హాలిడే ఓపెనింగ్ 55 శాతంతో మార్నింగ్ షో స్టార్టయ్యింది. అంటే అది చాలా పెద్ద ఓపెనింగ్ కింద లెక్క. మొత్తమ్మీద 4000 స్క్రీన్లతో పాటు విదేశాల్లోని 1300 స్క్రీన్లు కలుపుకుని 5300 స్క్రీన్లలో రిలీజైంది సంజు. మొదటిరోజు షేర్ 33 కోట్లనుండి 36 కోట్ల వరకు వస్తుందని బిజినెస్ అనలిస్ట్ల విశ్లేషణ. ఇది రీసెంట్గా రిలీజైన సల్మాన్ఖాన్ రేస్3 కంటే ఎక్కువ. (రేస్3 ఫస్ట్ డే షేర్ 29.5 కోట్లు) అని ‘సంజు’ విశేషాలను వివరించారు ఫాక్స్ స్లార్ ఇండియా హైదరాబాద్ ప్రతినిధి తెలిపారు. ‘సంజు’కు భారీ షాక్ కొన్ని గంటల క్రితమే విడుదలైన ఈ సినిమాకు ఇంతలోనే భారీ షాక్ తగిలింది. పైరసీ భూతం సంజు సినిమానూ వదల్లేదు. ప్రస్తుతం ‘సంజు’ పైరసీ కాపీ, అది కూడా హెచ్డీ ప్రింట్ ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది. అది కూడా పూర్తి నిడివి చిత్రం కావడం గమనార్హం. ఇది గమనించిన సోషల్ మీడియా యూజర్లు ఆ వెబ్సైట్ లింక్ను స్క్రీన్ షాట్స్ తీసి ఇంటర్నెట్లో షేర్ చేస్తున్నారు. సినిమా విడుదలైన కొద్దిసేపటికే ఈ సంఘటన జరగడం వల్ల సినిమాకు భారీ నష్టం వాటిల్లే అవకాశముందంటున్నారు విశ్లేషకులు. సినిమా లీక్ అయిన విషయం తెలుసుకున్న రణ్బీర్ కపూర్ అభిమానులు ఈ విషయం గురించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అభిమానులు ‘సంజు లీక్ అయ్యింది. దయచేసి ఈ లింక్లను ఎవరికీ షేర్? చేయకండి’ అంటూ రణ్బీర్కు మద్దతు తెలుపుతున్నారు. సంజుపై కామెంట్స్ సంజు చాలా బాగా నచ్చింది. తండ్రీకొడుకులు, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య రిలేషన్ మనసుని కదలించేలా చెప్పారు రాజ్ కుమార్గారు. రణ్బీర్ కపూర్ అవుట్స్టాండింగ్గా చేశారు. విక్కీ కౌశల్ మైండ్బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎంటర్టైన్ చేస్తూనే ఎంగేజింగ్గా కథ చెప్పారు హిరాణీ. టీమ్ అందరికీ కంగ్రాట్స్. – ఆమిర్ ఖాన్ కేవలం రెండున్నర గంటల్లో ఏడుస్తూనే, నవ్వించడం అచీవ్మెంట్. ప్రస్తుతం ఉన్న నెంబర్ 1 ఫిల్మ్ మేకర్ రాజ్ కుమార్ హిరాణీ. సంజయ్ దత్లా రణ్బీర్ అత్యద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. మిమిక్రీ చేస్తున్నట్టుగా కాకుండా సంజయ్ దత్ క్యారెక్టర్ స్కిన్లోకి వెళ్లి మరి నటించాడు. మనందర్నీ స్క్రీన్కి కట్టిపారేస్తాడు. బ్లాక్బస్టర్ హిట్కొట్టినందుకు టీమ్కి కంగ్రాట్స్. – దర్శక–నిర్మాత కరణ్ జోహార్ మాస్టర్ ఆఫ్ సినిమా నుంచి మరో బెస్ట్ జెమ్ బయటకు వచ్చింది. బెస్ట్ ఇవ్వడంలో రణ్బీర్, రాజ్ కుమార్ హిరాణీ ఇద్దరూ పోటీపడ్డారు. – దర్శకుడు హరీష్ శంకర్. రాజ్ కుమార్ సార్... మంచి సినిమా ఇవ్వడం ప్రతిసారీ మీకెలా సాధ్యం అవుతుంది? మైండ్బ్లోయింగ్ సినిమా. నవ్వించారు. ఏడిపించారు. రణ్బీర్, రాజు సార్ మీ ఇద్దరికీ పెద్ద హగ్. థియేటర్ నుంచి ఓ బెటర్ పర్సన్గా.. నన్ను బయటకు పంపించారు. – ధనుశ్, తమిళ నటుడు మాస్టర్పీస్. బయోపిక్ తీయడమంటే ఆషామాషీ కాదు. కానీ, రాజు హిరాణీ, రైటర్ అభిజిత్ జోషీ అద్భుతమైన స్క్రీన్ప్లే రాశారు. పవర్ఫుల్. ఎంగేజింగ్, ఎమోషనల్. రాజ్కుమార్ ఎందుకు మాస్టర్ స్టోరీ టెల్లరో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. రణ్బీర్ కపూర్కి ఈ సినిమాతో అవార్డ్లు, అభినందనలు అందుకుంటాడు. సినిమాలో ప్రతి ఒక్కరు తమ పాత్రల్లో మెరిశారు. – తరణ్ ఆదర్శ్, ట్రెడ్ అనలిస్ట్ -
‘సంజు’ మూవీ రివ్యూ
టైటిల్ : సంజు జానర్ : బయోపిక్ తారాగణం : రణ్బీర్ కపూర్, పరేష్ రావెల్, మనీషా కోయిరాలా, దియా మీర్జా, విక్కీ కౌశల్, అనుష్క శర్మ తదితరులు సంగీతం : ఏఆర్ రెహమాన్ దర్శకత్వం : రాజ్కుమార్ హిరాణీ నిర్మాత : విదూ వినోద్ చోప్రా, రాజ్కుమార్ హిరాణీ Sanju Telugu Movie Review: బయోపిక్ల ట్రెండ్ నడుస్తున్న తరుణంలో సీనియర్ నటుడు సంజయ్ దత్ జీవితగాథ సంజును ప్రకటించి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాడు దర్శకుడు రాజ్కుమార్ హిరాణీ. పైగా సక్సెస్ లేక సతమతమవుతున్న యువ హీరో రణ్బీర్ కపూర్ను సంజు రోల్కు తీసుకోవటం ఆశ్చర్యం కలిగించింది. అయితే ట్రైలర్-ప్రొమోల్లో అచ్చం సంజు బాబాల కనిపించిన రణ్బీర్.. ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చాడు. భారీ అంచనాల మధ్య సంజు ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సంజుగా రణ్బీర్ ఏమేర అలరించాడో చూద్దాం... కథ.. స్టార్ వారసుడిగా బాలీవుడ్లో అడుగుపెట్టి డెబ్యూ చిత్రం(రాకీ)తోనే స్టార్డమ్ సంపాదిస్తాడు సంజు(రణ్బీర్ కపూర్). సినీ ప్రస్థానం కొనసాగుతున్న సమయంలోనే డ్రగ్స్ అలవాటు, అక్రమాయుధాల కేసు సంజు(రణ్బీర్ కపూర్) జీవితాన్ని కుదిపేస్తాయి. ఆయుధాల కేసులో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో తనకు తానుగా లొంగిపోవాలని సంజు భావిస్తాడు. కానీ, అంతకు ముందే తన జీవిత కథగా మలిచేందుకు ప్రయత్నిస్తాడు. రచయిత కోసం ఎదురుచూస్తున్న తరుణంలో విన్నె(అనుష్క శర్మ) ముందుకు వస్తుంది. తన జీవితంలోని ముఖ్య ఘట్టాలను సంజు.. విన్నెకు వివరిస్తూ కథ సాగుతుంది. విశ్లేషణ.. మనకు బాగా తెలిసిన వ్యక్తి జీవితంలోని ఆసక్తికర అంశాలను కూలంకుశంగా తెలుసుకోవాలనే ఆసక్తి సహజం. ‘ఒక్క మనిషి.. పలు కోణాలు’ అంటూ ట్యాగ్ లైన్తోనే సంజు జీవితంలోని దశలను దర్శకుడు రాజ్కుమార్ హిరాణీ వివరించే యత్నం చేశాడు. అయితే వివాదాల నటుడు సంజయ్ దత్ లైఫ్ను తెరపై హిరాణీ డీల్ చేసిన విధానం అద్భుతం. వివాదాలను కూడా ఎమోషనల్గా మలిచిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. తన జీవితంలో ఎత్తుపల్లాలను పూసగూచ్చినట్లు వివరిస్తూ సంజు కథ ముందుకు సాగుతుంది. తల్లి మరణం, హీరోగా ఎదిగే క్రమంలో డ్రగ్స్ అలవాటుతో సంజు సతమతమయ్యే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆ వ్యసనం నుంచి బయటపడేందుకు చేసే స్ట్రగుల్, విమర్శలు వెల్లువెత్తినా తండ్రి(పరేష్ రావెల్) కొడుక్కి అండగా నిలవటం, ముఖ్యంగా వాళ్లిద్దరి మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్లు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అయితే ఫస్టాఫ్ను గ్రిప్పింగ్గా నడిపిన దర్శకుడు.. సెకండాఫ్ను మొత్తం జైలు జీవితం, కేసు, కోర్టు ప్రధానాంశాలుగా నడిపించాడు. తాను టెర్రరిస్ట్ను కాదంటూ సంజు పడే మానసిక సంఘర్షణ, భావోద్వేగపూరిత సన్నివేశాలతోనే ద్వితీయార్థాన్ని కానిచ్చేశాడు. అయితే ఈ క్రమంలో సంజు కెరీర్ను చూపించినా.. వ్యక్తిగత విషయాల జోలికి పోలేదు. హీరోయిన్లతో రిలేషన్షిప్స్, వైవాహిక జీవితంలోని లోతైన అంశాలను(మొదటి భార్య రిచా శర్మ, కూతురు త్రిశల గురించి) చూపించకుండా సంజు కథ సాగటం గమనార్హం. ఈ విషయంలో ప్రేక్షకులు కొంత అసంతృప్తికి గురికావొచ్చు. నటీనటుల విషయానికొస్తే.. సంజయ్ దత్ పాత్రలోకి రణ్బీర్ కపూర్ జీవించేశాడు. సంజు అంటే రణబీర్ అనేలా కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కొన్ని సన్నివేశాల్లో రణ్బీర్ తనను తాను అద్భుతంగా ఆవిష్కరించుకున్నాడు. డ్రగ్స్ బాధితుడిగా చేసే సన్నివేశాలు అయితేనేం, వీధుల్లో అడుక్కునే సీన్ అయితేనేం, పోలీస్ విచారణలో, ఆస్పత్రిలో స్నేహితుడితో... ఒక్కటి కాదు చెప్పుకుంటూ పోతే బోలెడు సీన్లు. ఎమోషనల్ సీన్లలోనే కాదు.. కామెడీతో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ను కూడా పండించాడు. తండ్రి సునీల్ దత్ పాత్రలో పరేష్ రావల్ను తప్ప వేరే ఎవరినీ ఊహించుకోలేం అనిపించింది. సాధారణంగా ఎంటర్టైన్మెంట్ పాత్రలకు పేరుగాంచిన ఈ సీనియర్ నటుడు.. సీరియస్ నటనతో సంజుకు బలంగా నిలిచాడు. ఇక సంజు బెస్ట్ ఫ్రెండ్ కమలేష్(విక్కీ కౌశల్) పాత్ర సినిమాకు మరో ఆకర్షణ. కష్టాల్లో ఉన్న స్నేహితుడికి అండగా ఉండటం, సంజు-కమలేష్ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు మంచి అనుభూతిని కలిగిస్తాయి. నర్గీస్ దత్ పాత్రలో సీనియర్ నటి మనీషా కోయిరాలాకు పెద్దగా సీన్లు లేవు. అయినా ఉన్నంతలో ఆమె పాత్ర అలరిస్తుంది. భార్య మాన్యతా పాత్రలో దియా మీర్జా మెప్పించారు. సోనమ్ కపూర్, అనుష్క శర్మ, మిగతా పాత్రలు ఓకే. పలువురు సెలబ్రిటీలు, చివర్లో కాసేపు స్వయంగా సంజయ్ దత్ కనిపించటం ఆకట్టుకుంది. ఏఆర్ రెహమాన్, రోహన్ రోహన్-విక్రమ్ మాంట్రెసె సంగీతం సినిమాకు తగ్గ మూడ్ను అందించింది. కర్ హర్ మైదాన్ ఫతే సాంగ్, రుబీ రుబీ పాటలు అలరిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్తోపాటు విజువల్గా కూడా సంజు మెప్పిస్తుంది. రాజ్కుమార్ హిరాణీ అద్భుతమైన స్టోరీ టెల్లర్. అందులో ఏ మాత్రం సందేహం లేదు. దత్ ఫ్యామిలీతో ఉన్న స్నేహాన్ని పక్కనపెట్టి మరీ కథానుగుణంగా కొన్ని సన్నివేశాలను స్వేచ్ఛగా తెరకెక్కించారు. చిత్రం నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఓవరాల్గా హిరాణీ సినిమాల్లో లభించే హ్యూమన్ ఎమోషన్స్, హ్యూమర్ ఎలిమెంట్స్ ‘సంజు’లో పుష్కలంగా లభిస్తాయి. ఫ్లస్ పాయింట్లు కథా-కథనం రణ్బీర్ కపూర్ మిగతా పాత్రలు సంగీతం మైనస్ పాయింట్లు కొన్ని ఆసక్తికరమైన అంశాలను చూపించకపోవటం అక్కడక్కడ సాగదీత సన్నివేశాలు - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
హీరో ‘డ్రగ్స్’ కష్టాలు
బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ బయోపిక్ సంజు రిలీజ్కు ముందే హాట్ టాపిక్గా మారింది. అచ్చం సంజూ బాబాలా తెరపై కనిపించేందుకు రణ్బీర్ కపూర్ పడ్డ కష్టం.. పైగా సంజయ్ దత్ లైఫ్లోని ప్రతీ కోణాన్ని విప్పి చూప్పానని దర్శకుడు చేసిన ప్రకటనతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లు ఆ అంచనాలను పెంచేయగా.. తాజాగా చిత్రంలోని ఓ సాంగ్ ప్రమోషన్ బిట్ను వదిలారు. ‘కర్ హర్ మైదాన్ ఫతే...’ అంటూ సాగే పాట.. శేఖర్ అస్థిత్వ లిరిక్స్, విక్రమ్ మాంట్రోస్ సంగీతాన్ని అందించగా.. సుఖ్విందర్ సింగ్-శ్రేయా ఘోషల్లు పాటను ఆలపించారు. సంజయ్ దత్ జీవితంలోని డ్రగ్స్ కోణాన్ని చూపిస్తే సాగే పాట ఇది. వాటి నుంచి తేరుకోడానికి పునరావాస కేంద్రానికి పంపించటం, అక్కడి నుంచి తప్పించుకుని తిరిగి ఇంటికి చేరటం, దారిలో అడ్డుకుంటూ కష్టాలు పడటం, డ్రగ్స్ నుంచి బయటపడేందుకు చేసే యత్నాలు, తల్లిదండ్రుల ఆప్యాయత.. మొత్తం ఎమోషనల్ కంటెంట్తో సాంగ్ సాగింది. ప్రముఖ దర్శకుడు రాజ్కుమార్ హిరాణీ దర్వకత్వం వహించిన ఈ చిత్రంలో సంజయ్ దత్ తండ్రి సునీల్దత్ పాత్రలో పరేష్ రావెల్, తల్లి నర్గీస్ దత్ పాత్రలో మనీషా కోయిరాల నటించారు. సోనమ్ కపూర్, దియా మీర్జాలు ఇతరత్రా పాత్రల్లో నటిస్తుండగా, కీలక పాత్రలో అనుష్క శర్మ కనిపించనుంది. జూన్ 29న సంజు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
సంజు కొత్త పోస్టర్.. అచ్చం నర్గీస్లా..!
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ జీవితంలోని సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ‘సంజు’ చిత్రానికి సంబంధించిన ఏ వార్త అయిన క్షణాల్లో వైరల్గా మారుతోంది. రణబీర్ కపూర్ ఈ చిత్రంలో సంజయ్ దత్ పాత్రలో కన్పించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సంజు ట్రైలర్ అభిమానులను విశేషంగా అకట్టుకుంటుంది. తాజాగా ఈ చిత్రంలో అలనాటి ప్రముఖ నటి, సంజయ్ దత్ తల్లి నర్గీస్ పాత్రలో నటిస్తున్న మనీషా కొయిరాలకు సంబంధించి ఓ పోస్టర్ను విడుదల చేశారు. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఈ పోస్టర్ను ట్విటర్లో అభిమానులతో పంచుకున్నారు. ‘ ఆమె తన కొడుకును ముద్దుగా సంజు అని పిలుచుకునేది.. ఇప్పడు మనం కూడా అలానే పిలుస్తున్నాం. నర్గీస్జీ పాత్రలో మనీషా నటనను జూన్ 29న చూడనున్నాం’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్కు విశేష స్పందన వస్తుంది. మనీషా అచ్చం నర్గీస్లాగే ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మనీషా లుక్ను, నర్గీస్ ఫొటోలతో పోలుస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సంజయ్ దత్ నటించిన తొలి సినిమా విడుదలకు మూడు రోజుల ముందు నర్గీస్ క్యాన్సర్తో చనిపోయింది. మనీషా కోయిరాలా కూడా క్యాన్సర్తో పోరాడి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనిని ఓ సారూప్యతగా చెబుతూ.. మనీషా ఈ పాత్రలో అద్భుతంగా నటించి ఉంటుందని కూడా కామెంట్లు చేస్తున్నారు. మనీషా మాట్లాడుతూ.. ‘లెజండ్రీ నటి నర్గీస్ పాత్రలో నటించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఎన్ని ఏళ్లు గడిచిన ఆమె పేరు ఎప్పటికి నిలిచి ఉంటుంది. ఇది నాకు ఒక చాలెజింగ్ రోల్’ అని తెలిపారు. ఈ చిత్రంలో వీరితో పాటు సోనమ్ కపూర్, పరేష్ రావల్, అనుష్క శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు.సంజయ్దత్ జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలతో పాటు ప్రపంచానికి తెలియని నిజాలను ఈ సినిమాలో ఆవిష్కరించనున్నారు. -
‘సంజు’ ట్రైలర్ వచ్చేసింది..!
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంజు ట్రైలర్ వచ్చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ జీవితంలోని సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా కోసం ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ అభిమానుల అంచనాలను మరింతగా పెంచేస్తోంది. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సంజు’ జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. రణబీర్కపూర్, సంజయ్ దత్ పాత్రలో నటించిన ఈ సినిమాలో మనీషా కొయిరాలా, సోనమ్ కపూర్, పరేష్ రావల్, అనుష్క శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ తాజాగా థియేట్రికల్ ట్రైలర్ను రిలీజ్ చేసింది. సంజు భాయ్ పాత్రలో రణబీర్ కపూర్ ఒదిగిపోయిన తీరుకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సంజయ్దత్ జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలతో పాటు ప్రపంచానికి తెలియని నిజాలను ఈ సినిమాలో ఆవిష్కరించనున్నారు. -
సంజు డైలాగ్: సెక్స్ వర్కర్ల ఆగ్రహం
-
సంజుని రిజెక్ట్ చేశా
దర్శకుడు రాజ్కుమార్ హిరాణీ, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ఖాన్ సూపర్హిట్ కాంబినేషన్ గురించి తెలిసిందే. ‘త్రీ ఇడియట్స్, పీకే’ వంటి బ్లాక్బాస్టర్స్ ఇచ్చారు. ప్రస్తుతం రాజ్కుమార్ హిరాణీ సంజయ్దత్ బయోపిక్ ‘సంజు’ రూపొందించిన విషయం తెలిసిందే. తొలుత ఈ సినిమాలో ఆమిర్ ఖాన్ను ఓ పాత్ర కోసం సంప్రదించారట హిరాణీ. ఆ విషయం గురించి ఆమిర్ మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ çసంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ క్యారెక్టర్ చేయమని హిరాణీ నన్ను అప్రోచ్ అయ్యాడు. ఫెంటాస్టిక్ రోల్. సినిమా ఎక్కువగా తండ్రీ కొడుకుల రిలేషన్షిప్ మీద నడుస్తుంది. సంజూ రోల్ అత్యద్భుతంగా ఉంది. యాక్టర్గా సంజూ రోల్ నాకు బాగా నచ్చింది. ఒకవేళ చేస్తే సంజూ రోల్ చేస్తా. కానీ అది ఆల్రెడీ రణ్బీర్ కపూర్ చేస్తున్నాడు కాబట్టి వేరే ఏ రోల్ చేయను అని చెప్పేశాను’’ అని పేర్కొన్నారు. ‘సంజు’ సినిమా జూన్29న విడుదల కానుంది. -
ఆ సినిమాను వదులుకున్న ఆమిర్
సంజయ్ దత్ జీవితం ఆధారంగా, రాజ్కుమార్ హిరానీ దర్శకత్వంలో వస్తున్న ‘సంజు’ సినిమా ప్రకటించిన దగ్గరనుంచే ప్రతి నిత్యం ఏదో ఒక విశేషంతో పత్రికల్లో హల్చల్ చేస్తుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి బీ టౌన్లో చక్కర్లు కొడుతోంది. సంజయ్ దత్ గా బాలీవుడ్ రొమాంటిక్ హీరో రణ్బీర్ కపూర్ నటిస్తుండగా, సంజయ్ దత్ తండ్రి, ప్రముఖ హీరో సునిల్ దత్ పాత్ర కోసం బాలీవుడ్ ‘మిస్టర్ పర్ఫెక్షనిస్ట్’ ఆమిర్ ఖాన్కు తీసుకోవాలని భావించారట చిత్ర దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ. ఈ విషయం గురించి ఆయనే ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. ‘నేను ఏ కథను సిద్ధం చేసుకున్న ముందుగా ఆమిర్ ఖాన్కే చెపుతాను. అలానే ఈ స్క్రిప్ట్ను ఆమిర్కు చెప్పినప్పుడు చాలా బాగా ఉందని ఆయన మెచ్చుకున్నారు. అంతేకాక సునిల్ దత్ పాత్రను చేయడానికి కూడా ఒప్పుకున్నారు. కానీ అదే సమయంలో తాను ‘దంగల్’ చిత్రం కోసం నడి వయసు వ్యక్తిగా కనిపించాల్సిన అవసరం ఉండటంతో, మరోసారీ అదే తరహా పాత్రలో నటించడం ఇష్టం లేక ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు’ అని తెలిపాడు. ‘సంజు’ చిత్రంలో ఈ ‘ఖల్నాయక్’ పాత్రకు రణ్బీర్ కపూర్ అచ్చుగుద్దినట్టుగా సరిపోయాడు. ఈ మధ్యే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం సంజయ్దత్లా కనిపించడం కోసం రణ్బీర్ కపూర్ చాలా కష్టపడుతున్నాడు. సంజయ్ దత్ జీవితంలోని మూడు దశలకు సంబంధించిన వివరాలతో రూపొందుతున్న ఈ చిత్రం 2018, జూన్ 29న విడుదల కానుంది -
ఒక్క మనిషిలో ఎన్ని కోణాలో...
సాక్షి, ముంబై ; బాలీవుడ్లో మరో బయోపిక్ వచ్చేస్తోంది. సీనియర్ నటుడు సంజయ్ దత్ జీవితగాథను సంజు పేరుతో దర్శకుడు రాజ్కుమార్ హిరానీ(మున్నాభాయ్, త్రీ ఇడియట్స్, పీకే ఫేమ్) తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు టీజర్లు కాసేపటి క్రితం విడుదల అయ్యాయి. యంగ్ హీరో రణ్బీర్ కపూర్ లీడ్ రోల్ చేస్తుండగా.. అనుష్క, సోనమ్ కపూర్, మనీషా కోయిరాల, పరేష్ రావెల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. టీజర్ విషయానికొస్తే.. సంజు బాబాకు లుక్కులో రణ్బీర్ ఆకట్టుకున్నాడు. తొలినాళ్ల నుంచి ఇప్పటిదాకా సీనియర్ నటుడు జీవితంలో ఎదుర్కున్న పరిస్థితులను మొత్తం చూపించేశారు. సినీ కెరీర్ మొదలు.. వ్యక్తిగత జీవితం, డ్రగ్స్ అలవాట్లు, జైలు జీవితం తదితర అంశాలను చూపించేశారు. ఇక ఆయా దశల్లో సంజయ్లా కనిపించటం కోసం రణ్బీర్.. బాడీ, బాడీ లాంగ్వేజ్ల విషయంలో బాగానే కష్టపడ్డట్లు అర్థమౌతోంది. ఫన్నీగా మొదలై చివరికి సీరియస్గా టీజర్ను ముగించేశారు. వినోద్ చోప్రా ఫిలింస్, ఆర్హెచ్ఎఫ్-ఫాక్స్ స్టార్ ఇండియా సంయుక్తంగా నిర్మిస్తున్న సంజు చిత్రం జూన్ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
సంజయ్ దత్ బయోపిక్ ‘సంజు’ టీజర్ రీలీజ్
-
ఇది నకిలీ.. అసలు త్వరలో !
హీరోగా సంజయ్దత్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్డమ్ సంపాదించుకున్నారు. కానీ కొన్ని అనుకోని సంఘటనలు ఆయన జీవితాన్ని మరింత పాపులర్ అండ్ ఇంట్రస్టింగ్గా చేశాయి. అందుకే ఆయన బయోగ్రఫీ ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. ఆల్రెడీ రణ్బీర్ సింగ్ హీరోగా రాజ్కుమార్ హిరానీ దర్శకత్వంలో సంజయ్దత్ జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ ఏడాది విడుదల కానుంది. కానీ ఇంతలోనే సంజయ్దత్ బయోగ్రఫీ అంటూ ‘‘ది క్రేజీ అటోల్డ్ స్టోరీ ఆఫ్ బాలీవుడ్ బ్యాడ్బాయ్ సంజయ్దత్’’ అనే టైటిల్తో ఓ బుక్ మార్కెట్లోకి వచ్చింది. ఈ బుక్ గురించి సంజయ్దత్ స్పందించారు. ‘‘మార్కెట్లో ఉన్న నా బయోగ్రఫీ బుక్కి, నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ బుక్ని ప్రచురించినవాళ్లు నా అనుమతి తీసుకోలేదు. మా లాయర్స్ సంబంధిత వ్యక్తులకు నోటీసులు పంపించడం జరిగింది. పబ్లిక్ డొమైన్లో లభించిన సమాచారం ఆధారంగా ఈ పుస్తకం రాయబడిందని సంబంధిత పుస్తక ప్రచురణ సంస్థ పేర్కొంది. కానీ వాటిలో ఉన్న విషయాలు నా పాత ఇంటర్వ్యూస్లోనివని తెలిసింది. అందులో అన్నీ నిజాలు లేవు. కొన్ని గాసిప్స్, చెప్పుడు మాటలు కూడా ఉన్నాయి’’ అని అన్నారు. ఆయన ఇంకా చెబుతూ– ‘‘ఇక ఏ ఇతర రచయితలు నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బందిపెట్టరని భావిస్తున్నాను. నా అఫీషియల్ బయోగ్రఫీని త్వరలోనే విడుదల చేస్తాం. అందులో ఉన్న సంగతులే వాస్తవమైనవి’’ అన్నారు. -
రణ్బీర్ బ్రహ్మాస్త్రం తీశాడు..!
రణ్బీర్ కపూర్పై బాలీవుడ్కు భారీ ఆశలున్నాయి. నెక్ ్స›్టసూపర్స్టార్ రణ్బీరే అని అందరూ అనుకోవడం ఎప్పుడూ జరిగేదే! అయితే యాక్టింగ్ పరంగా ది బెస్ట్ అనిపించుకుంటాడు కానీ, బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ హిట్ ఎప్పుడూ కొట్టలేక పోతుంటాడు. ప్రస్తుతానికి బాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజ్కుమార్ హిరానితో ‘సంజు’ సినిమా చేస్తున్నాడు రణ్బీర్. బాలీవుడ్ స్టార్ సంజయ్దత్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మార్చిలో రిలీజ్. ఈ సినిమాతో రణ్బీర్ బాలీవుడ్లో టాప్ రేసులోకి దూసుకెళతాడని ట్రేడ్ భావిస్తోంది. దీని తర్వాత వచ్చే సినిమా కూడా అదే రేంజ్లో ఉండాలని రణ్బీర్ భావిస్తున్నాడట. అందుకే ఈసారి ఏకంగా బ్రహ్మాస్త్రం తీశాడు. బ్రహ్మాస్త్రం అంటే మామూలు విషయమా? శక్తులన్నీ కూడగట్టి బలాన్ని చూపించడం. ‘వేక్ అప్ సిద్’, ‘యే జవానీ హై దీవానీ’ సినిమాలతో తనకు సూపర్హిట్స్ ఇచ్చిన అయాన్ ముఖర్జీతో హ్యాట్రిక్ కోసం ‘బ్రహ్మాస్త్ర’ టైటిల్తో వచ్చేస్తున్నాడు రణ్బీర్. ఇందులో హీరోయిన్ ఆలియా భట్. అమితాబ్ బచ్చన్ కీ రోల్లో కనిపిస్తారు. ఇదొక సూపర్ హీరో జానర్ అని టాక్. ఫిబ్రవరిలో సెట్స్పైకి వెళుతుందీ సినిమా. ఇప్పటికే టీమ్ ఇజ్రాయిల్లో లొకేషన్ హంట్లో ఉంది. ‘సంజు’, ‘బ్రహ్మాస్త్ర’ ప్లాన్ చేసినట్లుగా, అందరూ అనుకున్నట్లుగా పెద్ద కమర్షియల్ హిట్స్ అయిపోతే రణ్బీర్ టాప్ రేసులోకి వెళ్లినట్టే!!! -
అన్న సినిమా సూపర్ గా ఉంటుంది!
ముంబై: బాలీవుడ్ మున్నాభాయ్ సంజయ్ దత్. మొన్ననే ఎరవాడ జైలు నుంచి విడుదలైన సంజూ భాయ్ జీవితకథ ఆధారంగా త్వరలోనే సినిమా రానుంది. రణ్బీర్ కపూర్ సంజూగా నటించే ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రాజ్కుమార్ హిరానీ వేగంగా సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్ 'ఖల్నాయక్' ముద్రపడిన సంజూభాయ్ జీవితం నిండా వివాదాలే. హీరోయిన్లతో ప్రేమ వ్యవహారాలు, డ్రగ్స్కు బానిస కావడం, అండర్ వరల్డ్ మాఫియాతో సంబంధాలు, అక్రమ ఆయుధాలు, జైలు జీవితం.. వై-ఫైలా వివాదాలు చుట్టుముట్టిన ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కే సినిమాపై సంజయ్ దత్ సోదరి ప్రియా దత్ తాజాగా స్పదించింది. అన్న సినిమా ప్రేక్షకులకు చాలా ఆసక్తిగా ఉంటుందని, ఎంతగానో నచ్చుతుందని ఆమె పేర్కొంది. 'ఆయన జీవితం చాలా ఆసక్తికరం. ఈ బయోపిక్లో ఏం చూపిస్తారో, ఎలా చూపిస్తారో అన్నది నాకు తెలియదు. కానీ ఇంతటి సంఘర్షణను ఎదుర్కొని కూడా శాంతంగా, బలంగా కనిపించే వ్యక్తులు చాలా అరుదు. కాబట్టి ఈ జీవిత కథ తప్పకుండా ఆసక్తికరంగా ఉంటుంది' అని ప్రియాదత్ తెలిపింది. తన కెరీర్లో సంజూభాయ్ ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసినప్పటికీ.. 'మున్నాభాయ్' సిరీస్ చిత్రాలు, 'వాస్తవ్' సినిమా తనకెంతో ఇష్టమని పేర్కొంది. -
ఇంటెలిజెంట్ ఇడియట్స్
దేడ్ కహానీ - త్రీ ఇడియట్స్ ప్రతి సినిమాకీ మూలస్తంభాల్లా, త్రిమూర్తుల్లా ముగ్గురు నిర్ణయాత్మక శక్తులుంటారు. సినిమా హిట్టయితే వాళ్లని లోకమంతా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని, కర్త, కర్మ, క్రియలని తెగ ఆరాధిస్తారు. సినిమా ఫ్లాపయితే వాళ్లని త్రీ ఇడియట్స్ అని తిడతారు. అలాంటిది ఏకంగా ‘త్రీ ఇడియట్స్’ అనే టైటిల్నే పెట్టి ప్రేక్షకులతో నీరాజనాలందుకున్న త్రిమూర్తులున్నారు. వాళ్లే రాజ్కుమార్ హిరానీ, విధూ వినోద్ చోప్రా, ఆమిర్ ఖాన్. ఒక అద్భుతమైన సృష్టి‘కర్త’, క్రమశిక్షణ గల ‘క్రియా’స్రష్ట, కలిసి ఒకే సినిమాకి పనిచేయడం ఆ నిర్మాత చేసుకున్న మంచి ‘కర్మ’ల పుణ్యం అన్నమాట. అందుకే 60 కోట్ల బడ్జెట్తో తీస్తే ప్రేక్షకులు ‘త్రీ ఇడియట్స్’ సినిమాని హారతిలా ‘కళ్ల’కద్దుకుని, పళ్లెంలో మూడు వందల కోట్ల రూపాయలు భక్తిగా వేసేశారు. భారతీయ సినిమాలో ఆ రోజుకి ఎవ్వరూ అందుకోని వాణిజ్యపరమైన ల్యాండ్ మార్కులన్నీ ఈ సినిమా సెట్ చేసింది. రికార్డుల్లో కొత్త పుంతలు తొక్కింది. కథకి, కథనానికి, మాటలకి, పాటలకి, కామెడీకి, సున్నితమైన భావోద్వేగాలకి, యువతరం తాలూకు ఆలోచనలకి, జీవన శైలికి, ఆశయాలకీ, రొమాన్స్కీ, ఆకతాయితనాలకీ, ర్యాగింగులకీ, విద్యావ్యవస్థని ప్రశ్నించ గలిగిన సామాజిక బాధ్యతల రెబెలిజానికి, పరిష్కారాన్ని కూడా చూపించగల మేధస్సుకి... అన్నిటికీ ఒక బెంచ్ మార్క్ ‘త్రీ ఇడియట్స్’. స్కూల్లో నాతో చదువుకున్న బాల్య స్నేహితుడు సత్యన్నారాయణకి ప్రముఖ మాటల, పాటల రచయిత లక్ష్మీ భూపాల్ మంచి స్నేహితుడు. ఆయన రాసిన కృష్ణవంశీగారి ‘చందమామ’ సినిమా సంభాషణలు నాకు బాగా నచ్చాయి. మా మిత్రుడి ప్రోద్బలం కూడా తోడై ఆయనతో ఒక సినిమాకి వర్క్ చేద్దాం అని అనుకున్నాను. ఆ సందర్భంగా మా సత్యం మీటింగ్ ఏర్పాటు చేశాడు. లక్ష్మీభూపాల్ అడిగిన మొదటి ప్రశ్న ‘త్రీ ఇడియట్స్’ సినిమా చూశారా? నేను, ‘లేదండీ... రిలీజ్ రోజున ఔట్డోర్ షూటింగ్లో ఉన్నాను. నిదానంగా చూస్తాను’ అన్నాను. ఆయన ఒప్పుకోలేదు. ‘ఆ సినిమా చూశాకే కలిసి మాట్లాడుకుందాం. మన మీటింగ్ రాఘవేంద్రరావుగారి సినీమ్యాక్స్ థియేటర్కి షిఫ్ట్’ అని చెప్పి టిక్కెట్లు బుక్ చేసేసి బలవంతంగా తీసుకెళ్లి థియేటర్లో కూర్చోపెట్టేశారు. సినిమాని ఇద్దరు స్నేహితులు కలిసి చూసినట్టు చూడలేదు మేం. ఇద్దరు వేర్వేరు ప్రేక్షకులు చూసినట్టు లీనమైపోయాం. సినిమా అయిపోయాక కూడా చాలాసేపు ఏమీ మాట్లాడుకోలేదు. ముక్కూ మొహం తెలీని ప్రేక్షకుల్లా ఎవరి దారిన వాళ్లు పార్కింగ్ దగ్గరికి వచ్చేశాం. ఎవరన్నా దర్శకుడు సినిమాని బాగా తీస్తే వెంటనే ఫస్ట్ మైండ్లోకొచ్చే ఆలోచన ఎక్కడో మంచి ఫారెన్ ఫిల్మ్ పట్టుంటాడు లేదా, ఎవడో మంచి రైటర్ పాపం డెరైక్టర్ అవుదామని ఏళ్ల తరబడి స్క్రిప్టు రాసుకుని ఉంటే, డబ్బులిచ్చి లాగేసి ఉంటాడు. నా కన్నా ఇంకో హ్యూమన్ బ్రెయిన్కి నాలాగే ఒకటికి మించి రెండు, మూడు, నాలుగైదు సార్లు మంచి ఆలోచనలొస్తాయంటే ఎందుకో అంతరాత్మ ఓ పట్టాన అంగీక రించదు. ఈ ఆలోచనలన్నీ మున్నాభాయ్ పార్ట్ 1, పార్ట్ 2లకే వచ్చేశాయి. కొత్తగా ఈ మూడో సినిమా ఇంత బాగా, వాటిని మించి తీశాడంటే కారణం ఎంత ట్రై చేసినా దొరకలేదు. ఆ కారణం వెతికే ప్రయత్నమే ఆ సెలైన్స్. చివరికి లక్ష్మీ భూపాల్గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పి ఇంటికొచ్చేశాను. ఎవడీ డెరైక్టరు? క్షీర సాగర మథనంలో కూడా ఓసారి విషం, ఓసారి అమృతం వచ్చాయి. నాలాంటి దర్శకులందరికీ ఓసారి మంచి మంచి ఆలోచనలు, ఒక్కోసారి చెత్త చెత్త ఆలో చనలు వస్తుంటాయి సినిమా విషయంలో. అలాంటిది ఎప్పుడు మెదడుని చిలికినా అమృతం లాంటి ఆలోచనలే ఒక దర్శకుడికి వస్తాయంటే నాకు నచ్చడం లేదు. ఆ ద్వేషంలోంచి ప్రేమించాను రాజ్కుమార్ హిరానీని. ఆ ప్రేమ ఆరాధనైంది. భక్తిగా మారింది. ఆలో చించడం నేర్చుకున్నాను. ఓ దర్శకుడిగా, ఒక వ్యక్తిగా, ఒక పౌరుడిగా. ఈ రోజు వరకూ ‘షోలే’ తర్వాత అన్ని విభాగాల్లోనూ పెర్ఫెక్ట్, వెల్ మేడ్ సోషల్ సినిమా అండ్ బెస్ట్ ఎంటర్టైనర్ అంటే ‘త్రీ ఇడియట్స్’నే చెప్పొచ్చు. : కరీనా కపూర్ దటీజ్ రాజ్కుమార్ హిరానీస్ త్రీ ఇడియట్స్. ‘ఆల్ ఈజ్ వెల్’ అన్న మాటని కాయిన్ చేసి, ఏ కష్టంలో ఉన్నా, ఎవడి గుండెని వాడే తడుముకుని ‘ఆల్ ఈజ్ వెల్’ అని మూడు సార్లు అనుకోవాలని హీరో పాత్రతో చెప్పిం చడం ఒక అద్భుత సృష్టి. మున్నాభాయ్లో రుగ్మత పోగొట్టడం కోసం ‘జాదూకీ జప్పి’ అనే మందుని, త్రీ ఇడియట్స్లో బాధని పోగొట్టడం కోసం ‘ఆల్ ఈజ్ వెల్’ అనే మంత్రాన్ని కనిపెట్టిన రాజ్కుమార్ హిరానీని... భారతీయ సాంస్కృతిక, సంప్రదాయ వైద్య సంపదైన ఆయుర్వేదాన్ని కనిపెట్టిన ధన్వంతరో, అతని వారసుడో అనుకోవాలి. చేతన్ భగత్ అనే యంగ్, భారతీయ మేధావి నవలా రచయిత రాసిన ఫైవ్ పాయింట్ సమ్ వన్ ఆధారంగా... అభిజిత్ జోషి, విధూ వినోద్ చోప్రాలతో కలిసి స్క్రీన్ప్లే రాసుకుని, సహ రచయితగా, దర్శకుడిగా, ఎడిటర్గా త్రీ ఇడియట్స్ చిత్రాన్ని రూపొందించాడు రాజ్కుమార్ హిరాణీ. ఒక సినిమా సూపర్హిట్టు రెండు టేబుల్స్ మీద నిర్ణయించబడుతుంది అన్న ప్రాథమిక ఫార్ములా ప్రకారం, రైటర్స్ టేబుల్, ఎడిటర్స్ టేబుల్ రెండింటి మీదా కూర్చో గలిగిన దర్శకుడు, సినిమాని అంతలా శాసించగలిగిన దర్శకుడు భారతీయ దర్శకులలో ఈ తరంలో ఎవ్వరూ లేరు. డిసెంబర్ 25, 2009న విడుదలైన ఈ చిత్రం ప్రస్తుత భారతీయ విద్యా విధాన రూపకల్పనకి ‘బైబిల్’ లాంటిది. ఫర్హాన్ ఖురేషి అనే ఒక వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ తన ఇంజినీరింగ్ కాలేజీ స్నేహితుడు రాంచోని వెతకడంతో సినిమా మొదలౌతుంది. తన మరో స్నేహితుడు రాజు రస్తోగితో కలిసి తమ కాలేజీ రోజుల్లో బాగా ఏడిపించిన ఓ దద్దోజనం లాంటి కామిక్ విలన్ చతుర్ రామ లింగంని కట్టి పడేసి, దారిలో కాలేజీ డీన్ ‘వైరస్’గారమ్మాయి పియకి పెళ్లి జరగ బోతోందని తెల్సుకుని ఆమెని పీటల మీద నుంచి తప్పించి, రాంచోని చేరుకుంటారు. ఆ ప్రయాణంలో అసలు రాంచో ఎవరు? కాలేజీలో ఎలా పరిచయం అయ్యాడు? పియకి అతనికి ప్రేమ ఎలా పుట్టింది? చతుర్ రామలింగం అలియాస్ సెలైన్సర్ రాంచోతో చేసిన చాలెంజ్ ఏమిటి? అందులో ఎవరు గెలిచారు? ‘వైరస్’ అనే డీన్కి రాంచోకి నడిచిన వార్ ఎలాంటి పరిణామాలకి దారి తీసింది? భారతీయ విద్యా విధానాన్ని రాంచో ఎలా ప్రశ్నిం చాడు? ఎలాంటి మంచి పరిష్కారాలు చూపించాడు? తీరా వీళ్లంతా క్లైమాక్స్లో కలుసుకునేసరికి రాంచో ఏం చేస్తు న్నాడు? పియ, రాంచో కలుసుకున్నారా? ముక్కుకి ముక్కు తగలకుండా ముద్దు పెట్టుకున్నారా లేదా?... ఈ ప్రశ్నలన్నీ సమాధానాలు తెలుస్తాయి. ఈ కథని క్లుప్తంగా ఎలా రాయాలో నాకు తెలీలేదు. ప్రతి మాటనీ ప్రస్తావించాలి. ప్రతి సీన్ లోనూ నటీనటుల హావభావాల్ని అనలైజ్ చేసి డీటైల్డ్గా రాయాలి. సంగీతం గురించి, ఫోటోగ్రఫీ గురించి, కాస్ట్యూమ్స్ గురించి ప్రతి అంశం గురించీ క్లుప్తంగా చర్చించాలి. ఈ రోజు వరకూ ‘షోలే’ తర్వాత అన్ని విభాగాల్లోనూ పర్ఫెక్ట్, వెల్ మేడ్ సోషల్ సినిమా అండ్ బెస్ట్ ఎంటర్ టైనర్ అంటే ‘త్రీ ఇడియట్స్’నే చెప్పచ్చు. వైరస్ పెద్ద కూతురికి బిడ్డ పుట్టే సన్నివేశాన్ని దర్శకుడు తెరకెక్కించిన విధానం, అది చూసినప్పుడు కలిగే ఉత్కంఠ గురించి ఎంత రాసినా తక్కువే. పర్ఫెక్షనిస్టు ఆమిర్ ఖాన్ అతికినట్టు సరిపోయాడు రాంచో పాత్రలో. పుస్తకం గురించి లెక్చెరర్కి రాంచో క్లాస్ పీకి నప్పుడు చప్పట్లు కొట్టకుండా ఉండలేం. రాజు పాత్ర క్యాంపస్ ఇంటర్వ్యూలో చూపించే కాన్ఫిడెన్స్కి ఫిదా అవ్వకుండా ఉండలేం. పిల్లలని ఇంజినీర్లో, డాక్టర్లో చెయ్యా లని బలవంతపెట్టి వారి ఇష్టాయిష్టాల్ని పట్టించుకోకుండా వాళ్లని ఒత్తిడిలోకి నెట్టే తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, మొత్తం విద్యావ్యవస్థకి సూటిగా చెప్పిన రెండున్నర గంటల మంచి పాఠం త్రీ ఇడియట్స్. టైటిల్ని బట్టి ఇందులో ముగ్గురు స్నేహి తుల్నీ త్రీ ఇడియట్స్ అనుకుంటే తప్పు. చతుర్ రామలింగం, వైరస్, ఖురేషీ (మాధవన్) తండ్రి - ఈ ముగ్గురూ సమాజంలోని మూడు పాత్రలకి చిహ్నాలు. విద్యార్థుల్లో ఉండకూడని యాటిట్యూడ్ చతుర్, ఉపాధ్యాయుల్లో ఉండకూడని యాటిట్యూడ్ ‘వైరస్’, తల్లిదండ్రుల్లో ఉండకూడని యాటిట్యూడ్ ఖురేషి తండ్రి - వీళ్లల్లా నిజ జీవితంలో ఎవరున్నా వాళ్లే ఇడియట్స్. - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
'ఆ విషయం నన్నెంతో బాధిస్తోంది'
ముంబయి: ప్రస్తుతం పబ్లిక్గా ఏ అంశంపై మాట్లాడినా సెలబ్రిటీలు హెచ్చరికలకు కేంద్రాలుగా మారుతున్నారని ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ అన్నారు. అందుకే, ఇటీవల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు. దేశంలో అసహన పరిస్థితులపై తమ అభిప్రాయాలను ప్రముఖ బాలీవుడ్ నటులు అమిర్ ఖాన్, షారుక్ ఖాన్, కరణ్ జోహార్ వంటి వారు సోషల్ మీడియా ద్వారా, నాయకుల ద్వారా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భావ వ్యక్తీకరణ భారత్లో కష్టంగా మీరు భావిస్తున్నారా అని ప్రశ్నించగా.. గతాన్ని పక్కనపెడితే ఇప్పుడు మాత్రం తాను మాట్లాడే ప్రతి పదం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నానని చెప్పారు. 'ఇప్పుడు ప్రతి చిత్ర నిర్మాత, ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వారు ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో పెద్ద రాద్ధాంతంగా మారుతుంది కనుక' అని ఆయన చెప్పారు. 'మనకు ఏదైనా అభిప్రాయం ఉంటే అది సమతుల్యంతో ఉండాలి. అవతలి వైపువారు కూడా గర్వించేదిగా ఉండాలి' అని ఆయన చెప్పారు. అసహ్యభావంతో ప్రారంభమైన ఒక అంశం తొలుత చివరకు సొసైటీలో నేడు అనేక చీలికలు తీసుకొచ్చి ముగుస్తుందని, ఇది తనను ఎంతో బాధిస్తుందని చెప్పారు. కృత్రిమంగా సృష్టించిన వాతావరణమేమిటో మనుషులుగా ప్రతి ఒక్కరం తెలుసుకొని బతికితే బాగుంటుందని చెప్పారు. -
'అతడితో ఏదోక రోజు సినిమా చేస్తా'
చెన్నై: తమిళ హీరో సూర్యతో సినిమా చేస్తానని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజకుమార్ హిరానీ అన్నారు. సూర్య గొప్ప నటుడని, అతడు నటించిన సినిమాలు చూశానని తెలిపారు. 'ఇరుధి సుత్రు' తమిళ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో హిరానీ మాట్లాడుతూ... సూర్యతో ఏదోక రోజు సినిమా చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమానికి హీరో సూర్య స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యాడు. మాధవన్, శశికాంత్, సీవీ కుమార్, రితికా సింగ్, ముంతాజ్ సర్కార్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాకు సుధ కొంగర దర్శకత్వం వహించారు. రాజకుమార్ హిరానీ సహ నిర్మాతగా వ్యహరిస్తున్నారు. మాధవన్ చొరవతోనే ఈ సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించేందుకు హిరానీ ఒప్పుకున్నారని సుధ తెలిపారు. ఆర్థిక సమస్యలతో షూటింగ్ ఆగిపోయే పరిస్థితి రావడంతో హిరానీతో మాధవన్ మాట్లాడి తమ సినిమాలో భాగస్వామిని చేశారని వెల్లడించారు. 'ఇరుధి సుత్రు' సినిమాలో మాధవన్ బాక్సింగ్ కోచ్ గా నటిస్తున్నాడు. చాక్లెట్ బాయ్ నుంచి మాధవన్ బయటపడ్డాడని ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన నటుడు సిద్ధార్ధ అన్నారు. విలక్షణ దర్శకుడు బాల, సీనియర్ నటుడు నాజర్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
లగే రహో గాంధీగిరీ!
* ఈ చిత్రం... మంచిని, మానవత్వాన్ని చాటింది. * మనిషి ఎలా బతకాలో నేర్పింది. * మనిషికి మహాత్ముడయ్యే మార్గాన్ని చూపింది. ఎప్పుడైనా రాజ్కుమార్ హిరానీ కనిపిస్తే... నేను ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నాను. అవే ఇవి... రాజ్ హిరానీ గారూ... మీరు మాత్రమే జీవితాన్ని ఇంత అందంగా, ఇంత మంచిగా, ఇంత ఆర్ద్రతతో, ఇంత ఆహ్లాదంగా, ఇంత పాజిటివ్గా ఎలా చూస్తారండీ? ప్రతి దర్శకుడూ కష్టపడి తను బాగా తీసిన ఒక్కో సినిమాని కళామతల్లి పాదాల వద్ద ఒక పువ్వుగా పేర్చుతుంటే... మీరు మాత్రమే సినిమాలో ఉన్న డెబ్భై సీన్లనీ డెబ్భై పువ్వులు చేసి, మీదైన స్క్రీన్ప్లేలో వాటికి దండ కూర్చి, కళామతల్లి కంఠంలో మీ ఒక్కో సినిమాని ఒక్కో పూవుల దండగా ఎలా వేస్తారండీ? మీ పూలని దండగా కూర్చే మీ దారం పేరేంటండీ? మీ మనసు ఫెవికాలా? మీ మెదడు సెలోఫెన్ టేపా? మానవత అనే దృష్టి మీకు మాత్రమే ఎలా వచ్చిందండీ? సమాజంలో ప్రతి మధ్య తరగతి వాడి మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు మీకు మాత్రమే ఎలా తెలుసండీ? మీకు పరకాయ ప్రవేశం తెలుసా? 200 కోట్లు చేరకుండానే చాలామంది దర్శకులు అగ్ర దర్శకులమని ఢంకా బజాయించి పబ్లిసిటీలు చేసుకుంటున్న ఈ రోజుల్లో... మూడొందల కోట్లు, నాలు గొందల కోట్లు అవలీలగా దాటించేసినా, ఎక్కడా పర్సనల్ పబ్లిసిటీ చేసుకోకుండా అగ్ర దర్శకుడిననే అహంకారం సామాజిక అనుసంధాన వేదికల్లో కనిపించనీకుండా ఎలా ఉంటున్నారండీ? మీ సినిమాలు మాత్రమే కంటి నుండి కాకుండా మనసు నుండి నీరు కార్పిస్తా యెందుకండీ? మీ సినిమా విడుదలైతే, ప్రేక్షకుడిగా అత్యంత ఆనందం, దర్శకుడిగా అతి సిగ్గు నాకెందుకు కలగాలండీ? ఏంటండీ ఈ టార్చరు? సమాజానికి మీరు సినిమా దర్శకుడా? మార్గ దర్శకుడా? ఎందుకండీ ఇంత మంచి సినిమా తీస్తారు అని నేనడగను. ఎలా అండీ ఇంత గొప్ప సినిమాలు అంత అలవోకగా తీస్తున్నారు అని నేనడుగుతున్నాను. ఈ మిలీనియమ్ సినిమాల్లో రాజ్కుమార్ హిరానీ సినిమాలు మాత్రమే రాకూడదని నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే... అవే వస్తే, మిగిలిన సినిమాలన్నీ బలాదూరే కాబట్టి. వాటి గురించి రాయబుద్ధి కాదు కాబట్టి. ‘మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్.’ జనామోదం పొందిన తర్వాత మళ్లీ కొంతకాలానికి అదే దర్శక నిర్మాతలు మున్నాభాయ్, సర్క్యూట్, మామూ పాత్రల్ని యథాతథంగా తీసుకుని, అదే ఆర్టిస్టులని ఉంచి (సంజయ్దత్, అర్షద్ వార్సీ, బోమన్ ఇరానీ), విద్యాబాలన్ని హీరోయిన్గా పెట్టి తీసిన సినిమా ‘లగేరహో మున్నాభాయ్’. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి 149వ చిత్రంగా ఈ చిత్రాన్ని ‘శంకర్దాదా జిందాబాద్’ పేరుతో అనువదించారు, నిర్మాత జెమిని కిరణ్. ప్రభుదేవా దర్శకత్వం వహించారు. సర్క్యూట్ (అర్షద్) ఒక మున్సిపల్ ఆఫీసర్ని కిడ్నాప్ చేసి లక్కీసింగ్ ఆఫీసుకి తీసుకెళ్తాడు. లక్కీసింగ్ (బోమన్) ఆ ఆఫీసర్ని బెదిరించి ఒక బిల్డింగ్ కబ్జా చేయడానికి పేపర్స్ సృష్టించుకుంటాడు. మున్నాభాయ్కి థ్యాంక్స్ చెప్పి స్వీట్లు ఇవ్వమంటాడు. మున్నాభాయ్ హాయిగా ఎఫ్.ఎం. రేడియోలో గుడ్ మా...ర్నిం...గ్... ముం... బై... అని సాగదీసి కార్యక్రమం మొదలుపెట్టే జాహ్నవిని ప్రేమిస్తూ ఆమె గొంతు కోసం ఆ రేడియో కార్యక్రమం మిస్సవ్వకుండా వింటూ ఉంటాడు. ముంబైలో ఉదయాన్నే జీతాల కోసం ఆఫీసులకి పరుగులు పెట్టే ఒత్తిడిలో బతకడాన్నే జీవించడం అంటే, మరి మరణించడాన్ని ఏమంటారు? అని అడుగుతుంది రేడియోలో జాహ్నవి. మున్నాభాయ్ లాంటి ప్రేక్షకుడు కూడా ఆ మాట అడిగిన జాహ్నవి పాత్రతో ప్రేమలో పడిపోతాడు వాడికీ మనసుంటే. అక్టోబర్ 2న బాపు గురించి కొన్ని ప్రశ్నలడుగుతాను, ఆ క్విజ్లో గెలిచిన వాళ్లు తర్వాత రోజు స్టూడియోలో నాతో షోలో పాల్గొనవచ్చు అంటుంది జాహ్నవి. మున్నాభాయ్ ఒక రౌడీ కాబట్టి బాపు అక్టోబర్ 2 మందు దొరకని ‘డ్రై’డే అని తప్ప, ఆ రోజుకి, ఆ రోజు పుట్టిన జాతి పితకి ఉన్న విలువేమిటో తెలియదు. అందుకే ముగ్గురు ప్రొఫెసర్లని కిడ్నాప్ చేసి, వాళ్ల సాయంతో షోలో సమాధానాలన్నీ కరెక్ట్గా చెప్పి జాహ్నవిని రేడియో స్టేషన్లో నేరుగా కలిసే అవకాశం పొందుతాడు. అయినా మున్నాభాయ్ ఎంత మంచివాడంటే, ఈ కిడ్నాప్ చేసిన ముగ్గురు ప్రొఫెసర్లకీ సరైన సమాధానం చెప్పినప్పుడల్లా ఒక గ్రైండరో, ఫ్యానో, ఇస్త్రీ పెట్టో గిఫ్ట్గా ఇచ్చి పంపుతాడు. జాహ్నవికి తనని తాను మురళీ ప్రసాద్శర్మగా, ప్రొఫెసర్గా పరిచయం చేసుకుంటాడు మున్నా. జాహ్నవి సెకెండ్ ఇన్నింగ్స్ అనే వృద్ధాశ్రమం నడుపు తుంటుంది. ఆ ఆశ్రమం ఉన్న బిల్డింగ్ని తన కూతురికి (దియామీర్జా) పెళ్లి సంబంధం కుదర్చడానికి కట్నంగా ఇవ్వాల్సి వస్తుంది లక్కీసింగ్కి. దాంతో మున్నాభాయ్ని, జాహ్నవిని, ముసలి వాళ్లని హాలిడేకి పంపించి, సర్క్యూట్ అండ్ గ్యాంగ్తో కలిసి కబ్జా చేస్తాడు. అప్పటికే జాహ్నవి కోసం బాపు గురించి చదవడం మొదలుపెట్టిన మున్నాభాయ్కి బాపు స్వయంగా ప్రత్యక్షమై సత్యం వైపు, అహింస వైపు మార్గ దర్శనం చేస్తూ మున్నాభాయ్తో దాదాగిరి మానిపించి, దాని స్థానంలో గాంధీగిరి అనే కొత్త మార్గాన్ని పాటింపజేస్తుంటాడు. ఈ బాపు ప్రభావం వల్ల, సలహాల వల్ల లక్కీసింగ్లో పరివర్తన కలిగే వరకూ మున్నాభాయ్ ఆ బిల్డింగ్ కోసం అహింసతో నిరసన చేపడ తాడు. కానీ, అబద్ధం చెప్పి ప్రేమలో దింపిన సంగతి జాహ్నవితో చెప్పేస్తానని లక్కీసింగ్ బెదిరిస్తాడు. దాంతో తనే జాహ్నవికి నిజం చెప్పేస్తాడు మున్నా. ఆమె దూరమైపోయినా సత్యం, అహింసల కోసం నిలబడతాడు. చివరికి లక్కీలో మార్పును తీసుకురావడం, ఇల్లు ఇవ్వా ల్సిన అవసరం లేకుండా లక్కీ కూతురి పెళ్లి జరిపించడం, ఆ ఇంటిని మళ్లీ జాహ్నవికి అప్పగించడం జరుగుతుంది. చెప్పుకోడానికి ఇది కథ. కానీ ఇందులో ఉన్న డెప్త్ రాస్తే కాదు, చూస్తే తెలుస్తుంది. పుస్తకాలు చదివినంత మాత్రాన గాంధీ ప్రత్యక్షమైపోతాడా అనుకోవచ్చు. కానీ దానికీ ఓ చక్కని లాజికల్ ఆన్సర్ ఇచ్చారు హిరానీ. మున్నాభాయ్కి గాంధీజీ ప్రత్యక్షమవడం అనేది అతని హాలూసినేషన్. మతి భ్రమణం వల్ల అతనలా గాంధీజీతో మాట్లాడుతున్నట్టు ప్రవర్తిస్తున్నాడని చెప్పారు. ఆ విషయం మనకే కాదు, హీరో మున్నాభాయ్కీ అర్థమయ్యేలా చేసేందుకు మీడియా సమక్షంలో డాక్టర్లతో నిరూపణ అయ్యేలా చేశారు ఓ సన్నివేశంలో. ఇదే హెల్యూసినేషన్ని చివర్లో కామెడీ కోసం వాడుకున్నారాయన. లక్కీసింగ్ పరివర్తన చెందాక గాంధీజీని చూడాలన్న ఆశతో అదే లైబ్రరీకి వెళ్లి గాంధీజీ గురించి చదువుతాడు. ఆయన ప్రత్యక్షం అవ్వగానే ఫొటో దిగాలని ట్రై చేస్తాడు. ఆ తర్వాత, అంటే చిత్రం ఆఖరులో గాంధీ ఇచ్చే సందేశం ఎంతో విలువైనది. ‘‘నాకు గౌరవం ఇవ్వడం అంటే, నా విగ్రహాలు పెట్టి, నోట్ల మీద నా ముద్ర వేయించి, రోడ్లకి, కాలనీలకి నా పేర్లు పెట్టడం కాదు. నన్ను మనసులో నింపుకోవడం, నేను పాటించిన మార్గాన్ని కష్టమైన సహనంతో అవలంబించడం, నేను కలలుగన్న భారతావనిని తీర్చిదిద్దడంలో ప్రతి భారతీయుడూ నిర్మాణాత్మకంగా నడుం బిగించడం’’ అన్న ఆ మాటలు అందరూ మనసుల్లో నిలుపుకోవాల్సిన ఆణిముత్యాలు. పాఠాల్లో చదువుకుని, పరీక్షలు రాస్తేనే గాంధీజీ గురించి మనకి తెలిసినట్టు కాదు. ఆయన అడుగు జాడల్లో నడవాలి అని చెప్పేందుకు హిరానీ చేసిన ఓ అద్భుతమైన ప్రయత్నమే... ‘లగేరహో మున్నాభాయ్’. ఈ సినిమా చూస్తే నిజంగా గాంధీజీ సిద్ధాంతం ఏంటో, దాన్ని ఇవాళ్టి దైనందిన జీవితంలో ఎంత అందంగా పాటించవచ్చో తెలుస్తుంది. స్మరించుకోవడానికి గాంధీజీ దేవుడు కాదు. మనిషి మహాత్ముడు కావొచ్చు అనడానికి నిరూపణగా, నిర్వచనంగా నిలిచిన మనిషి. కాబట్టి గాంధీజీ చదువుకునే చరిత్ర కాదు, ఆచరించే పాత్ర. అనుసరించాల్సి మార్గం. ఇది మనకి తెలియజెప్పిన రాజ్కుమార్ హిరానీ కూడా దర్శకుల్లో మహాత్ముడు. మంచితనం, మంచి మార్గం మాత్రమే సినిమాల్లో ప్రతిబింబించే గొప్ప సంస్కారమున్న దర్శకుడు, రచయిత. నవ సమాజ సంస్కృతీ వికాస నిర్దేశకుడు, మార్గదర్శకుడు. సామాజిక కథాంశాలతో, మానవత, ఆర్ద్రత కలగలిపి... సెట్లు, గ్రాఫిక్కులు, భారీ తారాగణం, అంచనాలు పెంచే పబ్లిసిటీలు లేకుండానే వంద కోట్లు, రెండొందల కోట్లు, మూడొందల కోట్ల వసూళ్లు సునాయాసంగా చేసే కమర్షియల్ చిత్రాలను నిర్మాతలకి అందించిన మేటి దర్శకుడు. కళ్లు, చెవుల నుంచి పెద్ద మెదడుకి, అక్కణ్నుంచి గుండెకి ఒక ప్రయాణం చేసి... గుండెని తాకగానే అప్రయత్నంగా కళ్లల్లో నీరు ఉబికి వచ్చి చెంపని తడమడం ఎలా ఉంటుందో అనుభవించాలనుకుంటే ‘లగేరహో మున్నాభాయ్’ చూడండి. ఇది నిజం. గాంధీయిజమ్ అంత నిజం.ఇది అద్భుత జీవన సౌందర్యానికి రహదారి... ఇదే గాంధీగిరి! - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
మున్నాభాయ్-3కి... స్క్రిప్ట్ దొరికింది!
బాలీవుడ్ హీరో సంజయ్దత్ కెరీర్ను మలుపు తిప్పిన ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ సంచలనం. రాజ్కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రకథ తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో రీమేకై, ఘన విజయం సాధిం చింది. తెలుగులో ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’గా చిరంజీవి చేసిన సందడి ఎవరూ మర్చిపోలేరు. సెకండ్ పార్ట్ ‘లగేరహో మున్నాభాయ్’ కూడా హిందీ నుంచి ఇతర భాష ల్లోకి వెళ్ళింది. మున్నాభాయ్ మూడోపార్ట్ తీస్తానని ఎప్పటి నుంచో ఊరిస్తున్న రాజ్కుమార్ హిరానీ ఇప్పుడు ఆ సినిమాకు స్క్రిప్ట్ ఐడియా కొలిక్కివచ్చిందని వెల్లడించారు. సంజయ్దత్ జీవితచరిత్ర ఆధారంగా తీయాలనుకుంటున్న సినిమాకు స్క్రిప్ట్ వర్క్ చేస్తూనే, మున్నాభాయ్- 3కి కూడా కసరత్తులు చేస్తున్నారాయన. ‘‘పార్ట్3కి మంచి ఐడియా తట్టింది. ఈ స్క్రిప్ట్ను తయారు చేస్తున్నాం. ఇందులో సంజయ్దత్, అర్షద్వార్శీలే ప్రధాన పాత్రలు పోషిస్తారు. అయితే వాళ్లను దృష్టిలో పెట్టుకుని కథ రాయడం లేదు. ఎందుకంటే స్టార్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని కథ రాస్తే అంత స్వేచ్ఛగా ఆలోచనలు రావని నా అభిప్రాయం’’ అని రాజ్కుమార్ స్పష్టం చేశారు. సో... బీ రెడీ ఫర్ ‘మున్నాభాయ్-3’ -
ఓవర్సీస్లోనే 300 కోట్లు..!
2014 డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన పికె ఇప్పటికీ రికార్డులు సృష్టిస్తూనే ఉంది. అమీర్ఖాన్, అనుష్క శర్మ, బోమన్ ఇరనీ లీడ్ రోల్స్లో నటించిన ఈ సినిమాకు రాజ్ కుమార్ హిరానీ దర్శకుడు. ఇప్పటికే భారత్లో అత్యధిక వసూళ్లు సాదించిన సినిమాగా రికార్డ్ సృష్టించిన పికె తాజాగా ఓవర్సీస్లోనూ ఓ అరుదైన ఘనత సాదించింది. మూఢనమ్మకాలపై సెటైరికల్గా తెరకెక్కిన ఈ సినిమా ఇండియాలో రూ. 348 కోట్ల వసూళ్లు సాదించగా, ఓవర్సీస్లో కూడా రూ. 300 కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్డు నెలకొల్పింది. హాంకాగ్, తైవాన్, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో ఇప్పటికీ నడుస్తున్న పికె, భవిష్యత్తులో మరిన్ని రికార్డ్లు నెలకొల్పే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. విధూ వినోద్ చోప్రా నిర్మించిన ఈ సినిమాలో అమీర్ఖాన్ గ్రహాంతరవాసిగా నటించాడు. పొరపాటున భూమి మీదకు వచ్చిన ఓ ఏలియన్ తిరిగి తన గ్రహానికి వెళ్లటానికి కావల్సిన కీ పోగొట్టుకోవటం, ఆ కీని వెతుక్కునే ప్రయత్నంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనే పాయింట్ను సెటైరికల్ కామెడీ జానర్లో తెరకెక్కించారు. అన్ని ప్రాంతాల వారికి కనెక్ట్ అయ్యే కథ కావటంతో ఇప్పటికీ ఈ సినిమా వసూళ్ల పరంగా రికార్డులు తిరగరాస్తూనే ఉంది. -
రాజ్కుమార్ హిరానీకి గాయాలు
ప్రముఖ హిందీ చలనచిత్ర దర్శకుడు రాజ్కుమార్ హిరానీకి యాక్సిడెంట్ అయింది. మోటార్సైకిల్ మీద నుంచి కిందపడిపోవడంతో మంగళవారం ఉదయం ఆయన గాయాల పాలయ్యారు. ఆయన ముఖం మీద దవడ భాగంలో గాయమైంది. ముంబయ్లోని బంద్రా ప్రాంతంలోని ప్రసిద్ధ లీలావతీ హాస్పిటల్లో చేర్పించి, చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. డాక్టర్లు ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నట్లు సమాచారం. మోటార్ సైకిల్ ప్రమాదంలో హిరానీకి గడ్డం దగ్గర గాయాలయ్యాయి. అలాగే, కింద దవడ భాగం దగ్గర ఎముక విరిగినట్లు అనుమానిస్తున్నారు. సంజయ్ దత్ హీరోగా ‘మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్’ చిత్రం తీసినప్పటి నుంచి దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు హిరానీ. ఆ తరువాత సంజయ్ దత్తోనే ‘లగేరహో మున్నాభాయ్’ లాంటి చిత్రాలు రాజ్కుమార్ హిరానీకి మంచి పేరు తెచ్చాయి. ఆమిర్ఖాన్తో ఆయన తీసిన ‘3 ఇడియట్స్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. గత ఏడాది చివరలో వచ్చిన ‘పీకే’ సైతం హయ్యస్ట్ గ్రాసర్స్లో ఒకటిగా నిలిచింది. -
రోడ్డు ప్రమాదంలో దర్శకుడికి గాయాలు
ముంబై: బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ (52) తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ముంబైలో మంగళవారం ఉదయం ఆయన బైక్ పై నుంచి కింద పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. ముంబైలోని లీలావతి ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాన్ని అదుపు చేయలేక కిందిపడినట్టు సమాచారం. ఆయన ప్రాణాలకు ప్రమాదం లేదని లీలావతి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఫ్రాక్చర్స్ అయ్యాయని, ఆపరేషన్ నిర్వహించనున్నాని తెలిపారు. బాలీవుడు ప్రముఖులు, నటులు లీలావతి ఆసుపత్రికి వెళ్లి హిరానీని పరామర్శించారు. బాలీవుడ్కు హిరానీ ఎన్నో బ్లాక్ బ్లస్టర్స్ అందించారు. ముఖ్యంగా మున్నాభాయ్ ఎంబిబిఎస్, లగే రహో మున్నాభాయ్, త్రి ఇడియట్స్, పీకె సినిమాలు ఆయన దర్శకత్వ ప్రతిభకు అద్దం పడతాయి. -
'వారికి కథ బాగా నచ్చింది'
ముంబై: ప్రాంతంతో సంబంధం లేకుండా 'పీకే' సినిమాను ఆదరిస్తున్నామని దర్శకుడు రాజకుమార్ హిరానీ అన్నారు. చైనాలో 'పీకే' సినిమా వసూళ్లే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఈ సినిమాకు చైనాలో వస్తున్న స్పందన తనను ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొన్నారు. పీకే సినిమా కథ చైనీయులకు బాగా ఆకట్టుకుందని తెలిపారు. ఈ కథ వారికి కొత్తగా అనిపించిందని పేర్కొన్నారు. చైనాలో 16 రోజులుగా 4500 స్క్రీన్లపై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న పీకే' సినిమా రూ.100 కోట్లు వసూళ్లు దాటినట్టు వార్తలు వచ్చాయి. చైనాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ సినిమాగా పీకే' రికార్డు సృష్టించింది. మే 22న చైనాలో ఈ సినిమా విడుదల చేశారు. -
పీకే సక్సెస్ మీట్..
-
'ఆ నటుడి జీవితాన్ని తెరకెక్కిస్తున్నా'
ముంబై: బార్న్ విత్ సిల్వర్ స్ఫూన్. చిన్నప్పుడే చెడు సావాసాలు. అంతలోనే తల్లి మరణం. కొన్నేళ్లు సినిమాలు. ఆపై డ్రగ్స్కు బానిస. అక్రమ ఆయుధాల కేసులో దోషి. మళ్లీ సినిమాలు.. ప్రస్తుతం జైలు శిక్ష .. ఇలా ఒక మసాలా సినిమాకు ఏమాత్రం తీసిపోనిది బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితం. దానినే ఇప్పుడు తెరకెక్కించనున్నారు దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ. బ్లాక్ బస్టర్ మూవీ 'పీకే' తరువాత తాను రూపొందించబోయే సినిమా వివరాలను హిరానీ శుక్రవారం అధికారికంగా వెలువరించారు. సంజయ్ దత్ జీవితాన్ని తెరకెక్కిస్తున్నది నిజమేనని, ప్రస్తుతం స్క్రిప్ట్ పూర్తిచేసే పనిలో ఉన్నానని ఆయన చెప్పారు. ఈ సినిమాలో నటీనటులు ఎవరనే ప్రశ్నకు బదులిస్తూ.. కాస్టింగ్ గురించి ఇప్పుడే ఏమీ ఆలోచించలేదని, స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత ఆయా పాత్రల డిమాండ్ మేరకు నటీనటుల్ని ఎంపిచేస్తామన్నారు. కాగా, యంగ్ హీరో రణ్బీర్ కపూర్ సంజూ బాబా పాత్రను పోషించనున్నారని వార్తలు వినవచ్చాయి. హిరానీ మాత్రం వాటిని నిర్ధారించలేదు. -
'చైనాలో మా సినిమాను విడుదల చేస్తాం'
ముంబై: విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ నటించిన 'పీకే' సినిమాను చైనా ప్రేక్షకులు ఆమోదిస్తారన్న నమ్మకాన్ని దర్శకుడు రాజకుమార్ హిరాణి వ్యక్తం చేశారు. తన గత చిత్రం '3 ఇడియట్స్'కు చైనాలో మంచి స్పందన వచ్చిందని ఆయన గుర్తు చేశారు. 'పీకే సినిమా చైనాలో విడుదల కానుంది. ప్రచారం కోసం మేమంతా చైనా వెళతాం. చైనాలో 3500 నుంచి 4000 ధియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారని విన్నాను' అని హిరాణి పేర్కొన్నారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నడానికి వచ్చిన ఆయన ఈ విషయం వెల్లడించారు. పీకే సినిమా ఇప్పటికే పాకిస్థాన్, ఆస్ట్రేలియా, సింగపూర్, న్యూజిలాండ్, మలేసియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక దేశాల్లో విడుదలైంది. చైనాలో జూలైలో విడుదలకానుంది. దేవుడు పేరుతో మోసాలు చేసే దొంగస్వాముల పట్ల అప్రమత్తంగా ఉండాలనే ఇతివృత్తంతో తెరకెక్కిన 'పీకే' కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అనుష్క శర్మ, సుశాంత్ సింగ్ రాజపుత్, సంజయ్ దత్ ముఖ్యపాత్రల్లో నటించారు. -
సునీల్ దత్గా...!
ఏడు పదుల వయసులో ఏడాదికి రెండు, మూడు సినిమాలు, వాణిజ్య ప్రకటనలు, టీవీ షోస్ చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు అమితాబ్ బచ్చన్. ఆయన నటించిన తాజా చిత్రాలు షమితాబ్, పీకు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమితాబ్ మరో చిత్రానికి పచ్చజెండా ఊపారని సమాచారం. అది కూడా ఓ నిజజీవిత పాత్రనే ఈ బిగ్ బి చేయనుండటం విశేషం. ఆ విషయంలోకి వస్తే... 3 ఇడియట్స్, పీకే తదితర చిత్రాలతో విలక్షణ దర్శకుడనిపించుకున్న రాజ్కుమార్ హిరానీ, త్వరలో నటుడు సంజయ్ దత్ జీవిత చరిత్రతో ఓ సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ పాత్రను అమితాబ్తో చేయించాలనుకుంటున్నారట. ఇటీవల అమితాబ్తో సంప్రతింపులు జరిపారని భోగట్టా. సంజయ్ దత్ పాత్రను రణబీర్ కపూర్ చేయనున్నారని సమాచారం. -
'పీకే' నిర్మాత, దర్శకులకు నోటీసులు
న్యూఢిల్లీ: ఆమిర్ఖాన్ హీరోగా నటించిన 'పీకే' హిందీ సినిమా కథ తన నవల నుంచి కాపీ కొట్టిందేనంటూ ఓ రచయిత పిటిషన్ వేసిన నేపథ్యంలో ఆ సినిమా నిర్మాత, దర్శకులకు ఢిల్లీ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. తన హిందీ నవల 'ఫరిస్తా'లోని పాత్రలు, సన్నివేశాలను పీకే సినిమాలో వాడుకుని భావచౌర్యానికి పాల్పడ్డారని కపిల్ ఇసాపురి అనే రచయిత కోర్టుకు తెలిపారు. తన నవలలోని పాత్రలు, 17 సన్నివేశాలను తెలివిగా కాపీకొట్టారని ఆరోపించారు. తనకు ఆ సినిమా రచయితగా గుర్తింపు ఇవ్వడంతో పాటు కోటి రూపాయల నష్ట పరిహారం ఇప్పించాలని కోరారు. తాను నవలను 2009లో పూర్తి చేశానని, అది 2013లో ప్రచురితమైందని వివరించారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు బుధవారం పీకే సినిమా నిర్మాత విధు వినోద్ చోప్రా, దర్శకుడు రాజ్కుమార్ హిరానీ, స్క్రిప్టు రచయిత అభిజత్ జోషీలకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 16న తన ముందు హాజరై పిటిషనర్ ఆరోపణలపై స్పందించాలని న్యాయమూర్తి నజ్మీ వజీరి నోటీసుల్లో ఆదేశించారు. ఇదిలా ఉండగా, సినిమా విడుదలై ఇంతకాలమైన తరువాత ఈ పిటిషన్ దాఖలు చేయడమేమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. -
‘పీకే’ మేకింగ్ శ్రమయేవ జయతే
‘పీకే’ సినిమాకు 635 కోట్ల రూపాయల వసూళ్లు!ఇది నిజంగా షాకింగ్ న్యూస్! బ్రేకింగ్ న్యూస్!!ఒక భారతీయ చిత్రానికి ఇంతటి స్థాయి వసూళ్లంటే కలో నిజమోసినిమా పండితులకే అర్థం కావడం లేదు.భారతీయ సినిమాకు మున్ముందు ఇంకా మంచి రోజులు రానున్నాయనడానికి ‘పీకే’ ఓ ఆశాదీపం.అసలు ఈ సినిమాకు ఇంత క్రేజ్ ఎందుకొచ్చింది? ఈ వసూళ్లకు కారణాలేంటి?ఆమిర్ఖాన్తో రాజ్కుమార్ హిరానీ దీన్ని తెరకెక్కించడానికి ఎన్ని కసరత్తులు చేశారు?‘పీకే’ స్పెషల్ స్టోరీ మీకోసం... ఆమిర్ ఖాన్తో ‘3 ఇడియట్స్’ వంటి బ్లాక్ బస్టర్ తీశాక రాజ్కుమార్ హిరానీ వెంటనే మరో సినిమా మొదలుపెట్టేయలేదు. కథ కోసం నెలల తరబడి శ్రమించి, ఫైనల్గా దాన్ని తన సన్నిహితులకు చెప్పారు. కథ మొత్తం విని వాళ్లు... హాలీవుడ్ చిత్రం ‘ఇన్సెప్షన్’లా ఉందనడంతో హిరానీ ఖంగుతిన్నారు. దాంతో ఆ కథను పక్కనపెట్టేశారు. మళ్లీ ఇంకో కథ మొదలుపెట్టారు. అదే ‘పీకే’. కథ విన్న హిరానీ సన్నిహితులు బ్రహ్మాండం అన్నారు.. కానీ వెండితెరపై ఆవిష్కరించడం అంత సులువు కాదని హెచ్చరించారు. మామూలు వ్యక్తుల పాత్రలంటే, ఇలా ప్రవర్తిస్తారనీ, వేషధారణ ఇలా ఉంటుందని ఊహించవచ్చు. కానీ, ఈ చిత్రంలో పీకే ఓ గ్రహాంతరవాసి. ఆ పాత్ర ‘ఇలా ఉంటుంది’ అని ఓ ఊహకు రావడం కష్టమే. పోనీ.. ఈ పాత్రకు రిఫరెన్స్ తీసుకుందామా? అంటే.. ఏ పుస్తకంలోనూ లేదు. నిజజీవితంలో కూడా హిరానీకి ఈ లక్షణాలున్న వ్యక్తులు తారసపడలేదు. దాంతో పాత్ర తీరుతెన్నులు, శారీరక భాష ఎలా ఉండాలి? అనే విషయమై ఆయన చాలా రోజులు తర్జన భర్జన పడ్డారు. ఈ పాత్ర అమాయకంగా కనిపించాలి.. చిన్నపిల్లాడి తరహాలో ఉండాలి. ఈ లక్షణాలను ఆవిష్కరించగల నటుడు ఎవరు? ఇంకెవరూ.. ‘ఆమిర్ఖాన్’ అని ఫిక్స్ అయిపోయారు. ఆమిర్ మొత్తం కథ విని, ఉద్వేగానికి గురయ్యారు. అప్పటికప్పుడు పీకేగా మారిపోవాలన్నంత ఉద్వేగం. ఆ తర్వాత పీకే లుక్ ఎలా ఉండాలి? అనే విషయంపై బోల్డన్ని చర్చలు. ఆకుపచ్చరంగు కళ్లు, తమలపాకుతో ఎర్రబడిన పెదాలు, సాదాసీదా దుస్తులు, చెప్పులు... షూటింగ్ ఆరంభించకముందే ఆమిర్పై మేకప్ టెస్ట్ చేశారు. ఆమిర్ దుస్తుల కోసం మనోషి నాథ్, రుచీ శర్మ అనే ఇద్దరు కాస్ట్యూమ్ డిజైనర్లను నియమించారు. అయితే ఈ ఇద్దరూ ప్రత్యేకంగా దుస్తులు డిజైన్ చేయలేదు. ఈ చిత్రంలో ఆమిర్ రాజస్థాన్ ప్రింట్ చొక్కాల్లో కనిపిస్తారు. వాటిని, రాజస్థాన్ వీధుల్లో ఫుట్పాత్ మీద కొన్నారు. కొన్ని చొక్కాలైతే అక్కడి స్థానికులు వాడేవి డబ్బిచ్చి మరీ కొన్నారు. కొంతమందైతే తమంతట తాము చొక్కాలివ్వడానికి ఉత్సాహంగా ముందుకొచ్చారట. పీకే హెయిర్ స్టయిల్ వినూత్నంగా ఉండాలనుకున్నారు హిరానీ. ముందుగా హెయిర్ జెల్ రాసి ఓ రకమైన హెయిర్ స్టయిల్ చేశారు. అది అంత సంతృప్తినివ్వకపోవడంతో స్పైక్స్ (ఒక రకమైన స్టయిల్) ట్రై చేశారు. అదీ నచ్చకపోవడంతో జుత్తుని బంగారు వర్ణానికి మార్చారు. అది చూడ్డానికి స్టయిల్గా ఉన్నా పాత్రకు తగ్గట్టుగా లేదు. చివరకు ఆమిర్ ఒరిజినల్ హెయిర్ స్టయిల్నే సినిమాలో కంటిన్యూ చేయాలనుకున్నారు. ఈ చిత్రంలో ఆమిర్ చెవులు సాసర్లా, కళ్లు హెడ్లైట్స్ని తలపించేలా ఉంటాయి. చెవులు పెద్దగా కనిపించడం కోసం ఆమిర్ ‘బ్లూ టాక్’ వాడారు. స్పాంజ్ తరహాలో చాలా తేలికగా ఉండే బ్లూ టాక్ వల్లే ఆమిర్ చెవులు అలా కనిపించాయి. కళ్లకేమో ఆకుపచ్చ రంగు లెన్స్ వాడారు. అమాయకంగా కనిపించడం కోసం కనుబొమలను తీర్చిదిద్దారు. సినిమాలో ఆమిర్ఖాన్ తింటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, చివరికి ఏడ్చే సీన్లో కూడా కళ్లు ఆర్పరు. ఈ పాత్రకు ఆ కళ్లు ఓ ప్లస్ పాయింట్ కాబట్టి, లెన్స్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నారు. ఆమిర్ఖాన్ ఎక్కువ సన్నివేశాల్లో పాన్ తింటూ కనిపిస్తారు. ఆ సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు.. ఓ పాన్వాలాను నియమించుకున్నారు. ఆమిర్ పాన్ తినాల్సి వచ్చినప్పుడు అప్పటికప్పుడు అతను పాన్ రెడీ చేసే ఇచ్చేవాడట. సరైన రంగు రావడంకోసం ఒక్కో సీన్ తీసే ముందు పది నుంచి పదిహేను పాన్లను ఆమిర్ నమిలేవారు. ఆ విధంగా రోజుకి ఏకంగా వంద పాన్లు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రం షూటింగ్ను ప్రధానంగా ఢిల్లీ, రాజస్థాన్ల్లో జరిపారు. 2013 ఫిబ్రవరి 1న ఢిల్లీలో షూటింగ్ ఆరంభించారు. 45 రోజుల పాటు ఓ షెడ్యూల్ చేశారు. ఆ తర్వాత రాజస్థాన్లో! ఢిల్లీ చాందినీ చౌక్ ఏరియాలో శివుడు పాత్రధారి ఇద్దరు ముస్లిం మహిళలున్న రిక్షా తొక్కే సన్నివేశం చిత్రీకరిస్తున్నారు. వివాదం మొదలైంది. అక్కడి స్థానికులు హిందువుల మనోభావాలు తీసే విధంగా ఈ సీన్ ఉందంటూ కేస్ పెట్టారు. కొన్ని వివాదాలు, మరికొన్ని ఇబ్బందుల మధ్య ఎట్టకేలకు ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేశారు. తొలుత ఈ చిత్రానికి ‘ఏక్ థా టల్లి’ అనే టైటిల్ పెట్టారు. సరిగ్గా ఆ సమయంలోనే సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన ‘ఏక్ థా టైగర్’ విడుదలైంది. దాంతో ‘ఏక్ థా’ తీసేసి, జస్ట్ ‘టల్లి’ అని పెట్టారు. ఆ తర్వాత మనసు మార్చుకుని ‘పీకే’ అని పెట్టారు. ఇదేం టైటిల్ విచిత్రంగా ఉంది అందరూ అన్నారు. పైగా, పీకే అంటే మందు తాగడమని అర్థం కాబట్టి, ఇందులో హీరో తాగుబోతు అయ్యుంటాడని అనుకున్నారు. ఈ చిత్రం శాటిలైట్ హక్కులను దాదాపు 85 కోట్ల రూపాయలకు అమ్మారు. ‘పీకే’ 300 కోట్ల రూపాయలు వసూలు సాధించడం ఖాయం అనే నమ్మకంతో చిత్ర నిర్మాతలు విధు వినోద్ చోప్రా, రాజ్కుమార్ హిరానీ శాటిలైట్ హక్కుల విషయంలో రాజీపడలేదు. చివరకు తాము అనుకున్నట్లు 85 కోట్లు దక్కించుకున్నారు. ఈ స్థాయిలో అమ్ముడుపోయిన తొలి హిందీ చిత్రం ఇదే కావడం విశేషం. వాస్తవానికి ఈ ఏడాది జూన్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. కానీ, అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. చివరికి ఆమిర్కి బాగా కలిసొచ్చిన డిసెంబర్లో తెరపైకొచ్చింది. ఆమిర్ కెరీర్లో సంచలనాత్మక విజయం సాధించిన ‘గజిని’, ‘3 ఇడియట్స్’ ఈ నెలలో విడుదలైనవే. ఆమిర్, హిరానీల కాంబినేషన్ వేల్యూతో పాటు విడివిడిగా వారిద్దరి ట్రాక్ రికార్డుని చూసి, బయ్యర్లు ఈ చిత్రాన్ని ఎగబడి కొన్నారు. ప్రేక్షకులు థియేటర్కి రావడానికి కారణం కూడా ఈ క్రేజీ కాంబినేషనే. మొత్తానికి ఆమిర్-హిరానీల మేజిక్ రిపీట్ అయ్యింది. 2014 డిసెంబర్ 19న ఈ చిత్రం విడుదలైంది. ‘దేవుడు మిస్సింగ్’ అంటూ ఈ చిత్రంలో ఆమిర్ పోస్టర్లు అంటిస్తాడు. అలాగే, మత గురువులపై సెటైర్లు వేశారు. ఇవి హిందూ, ముస్లిమ్ల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయంటూ వివాదం మొదలైంది. అయితే, వాటికి అతీతంగా ఈ చిత్రం భారీ వసూళ్లు సాధిస్తూ ముందుకు దూసుకెళుతోంది. భారతీయ బాక్సాఫీస్ పరంగా ఈ చిత్రం 300 కోట్లు దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికి 635 కోట్లు సాధించింది. ఆమిర్ నటించిన ‘ధూమ్ 3’ ప్రపంచవ్యాప్తంగా 540 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ‘పీకే’ భారీ వసూళ్లతో ఆమిర్ తన రికార్డ్ని తానే బద్దలు కొట్టారు. ఇప్పటివరకు పాకిస్థాన్లో రికార్డ్ స్థాయి వసూళ్లు కురిపించిన చిత్రం ‘వార్’. ఈ పాకిస్థానీ యాక్షన్ థ్రిల్లర్ 23 కోట్లు వసూలు చేసింది. ఏడాదిన్నర క్రితం విడుదలైన ఈ చిత్రం వసూళ్లను ఏ చిత్రమూ అధిగమించలేదు. ఆ రికార్డ్ని ‘పీకే’ బద్దలు కొట్టబోతోందని అక్కడి ట్రేడ్వర్గాలు అంటున్నాయి. ‘పీకే’ ఇప్పటివరకు 18 కోట్లకు పైగా వసూలు చేసిందనీ, ఈ నెలాఖరు వరకు ఆడుతుంది కాబట్టి, ‘వార్’ రికార్డ్ని బద్దలు కొట్టడం ఖాయమని చెబుతున్నారు.బుల్లితెరపై ‘సత్యమేవ జయతే’ కార్యక్రమంతో సంచలనం సృష్టించిన ఆమిర్ఖాన్ ‘శ్రమయేవ జయతే’ అంటూ ‘పీకే’ చేసి సంచలనాలకే సంచలనంగా మారారు! - డి.జి. భవాని -
ఓ వైపు వివాదాలు.. మరోవైపు కాసుల వర్షం!
-
అన్ని మతాలను గౌరవిస్తాం: పీకే దర్శకుడు హిరాణీ
ముంబై: బాలీవుడ్ హీరో ఆమిర్ఖాన్ నటించిన 'పీకే' సినిమా ద్వారా ఏ మతాన్ని అగౌరవపరచలేదని ఆ చిత్ర దర్శకుడు రాజ్కుమార్ హిరాణీ వివరణ ఇచ్చారు. ఈ నెల 19న విడుదలైన ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. హిందువులే కాకుండా ముస్లింలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నిషేధం విధించాలంటూ పలు హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. హిందూ దేవతలను, స్వామీజీలను ఎగతాళి చేసేలా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయని వీహెచ్పీ, బజ్రంగ్ దళ్, హిందూ జనజాగతి సమితి, అఖిల భారత మహాసభ ఆరోపించాయి. సినిమాపై నిషేధం విధించడంతోపాటు చిత్రంతో సంబంధం ఉన్న వారందరినీ సమాజం నుంచి వెలివేయాలని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ డిమాండ్ చేశారు. రాందేవ్ డిమాండ్కు అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా మద్దతు పలికింది. అత్యధికుల మనోభావాలు దెబ్బతినే సన్నివేశాలు చిత్రం నుంచి తొలగించాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపిఎల్బీ) సభ్యుడు మౌలానా ఖలీద్ రషీద్ కోరారు. మత సామరస్యానికి హాని కలిగించే సన్నివేశాలను సెన్సార్ బోర్డు తొలగించాలని ఆయన అన్నారు. పీకే చిత్రంలోని ఎటువంటి సన్నివేశాలను తొలగించాల్సిన అవసరం లేదని సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. ఇప్పటికే చిత్రం విడుదలైన నేపథ్యంలో ఎటువంటి సీన్స్ లను తొలగించేందుకు బోర్డు సిద్ధంగా లేదని సెన్సార్ బోర్డ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) చైర్ పర్సన్ లీలీ శాంసన్ చెప్పారు. అన్ని మతాలను తాము గౌరవిస్తామని హీరో ఆమిర్ఖాన్ అన్నారు. ఈ చిత్రాన్ని తన హిందూ స్నేహితులు చూశారని, వారెవరూ అటువంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదన్నారు. సినిమాలో హిందూ దేవతలను హాస్యాస్పదంగా చిత్రీకరించి, తమ మనోభావాలను కించపరచారని భోపాల్, అహ్మబాదాద్లలో ఆ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లపై సోమవారం బజరంగ్దళ్ సభ్యులు దాడి చేశారు. అహ్మదాబాద్లో కర్రలు, రాడ్లతో వచ్చిన పాతిక మంది రెండు థియేటర్ల అద్దాలు పగలగొట్టి, పోస్టర్లు చింపేశారు. ఈ రోజు కూడా ఢిల్లీలో బజరంగ్దళ్ కార్యకర్తలు చిత్రప్రదర్శనను అడ్డుకున్నారు. ఈ నేపధ్యంలో సినిమా దర్శకుడు రాజ్కుమార్ హిరాణీ సినిమా యూనిట్ తరపున వివరణ ఇచ్చారు. తాము అన్ని మతాలను, విశ్వాసాలను గౌరవిస్తామని చెప్పారు. -
'పీకే' తెలివైన సినిమా: కశ్యప్
ముంబై: ఆమిర్ఖాన్ 'పీకే' సినిమాపై ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రశంసలు కురిపించారు. మత సంబంధ సున్నితమైన విషయాన్ని చాలా తెలివిగా తెరకెక్కించారని అన్నారు. 'ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాను చాలా తెలివిగా తీశారు. ఎటువంటి వివాదాలకు తావులేకుండా మతం, దేవుడు, స్వాములపై సినిమా తీయడం మామూలు విషయం కాదు. రాజ్కుమార్ హిరానీ ఎంతో సాహసంతో ఈ సినిమా తెరకెక్కించారు' అని అనురాగ్ కశ్యప్ ప్రశంసించారు. తాము ఇలాంటి సినిమాలు వెనుకాడతామని, కాని హిరానీ, నిర్మాత విదూ వినోద్ చోప్రా, హీరో ఆమిర్ ఖాన్ ధైర్యంగా ముందుకెళ్లారని పేర్కొన్నారు. -
'పీకే' పోస్టర్ పై పిటిషన్
ముంబై: బాలీవుడ్ నటుడు ఆమిర్ఖాన్ పై దాఖలైన పిటిషన్ ను విచారించేందుకు ముంబై కోర్టు శుక్రవారం అంగీకరించింది. ఆమిర్ఖాన్ హీరోగా నటించిన 'పీకే' సినిమాలో అశ్లీల దృశ్యాలు, అభ్యంతకర మాటలున్నాయంటూ హేమంత్ పాటిల్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమా నిర్మాత విదూ వినోద్ చోప్రా, దర్శకుడు రాజు హిరాణిలతో పాటు సెన్సార్ బోర్డుపైనా దావా వేశారు. అయితే సెన్సార్ బోర్డుపై పిటిషన్ ను కోర్టు అంగీకరించలేదు. ఆమిర్ఖాన్ నగ్నంగా రైల్వే ట్రాక్ పై నిలబడి ట్రానిస్టర్ అడ్డుపెట్టుకున్న పోస్టర్ పై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా విడుదలకు ముందు ఈ సీన్ తొలగించాలని కోర్టును కోరారు. అయితే పీకే సినిమా ఈ రోజు(19-12-2014) విడుదలైంది. ఈ దావాపై తదుపరి విచారణను కోర్టు జనవరి 22కు వాయిదా వేసింది. ఆమిర్ఖాన్ నగ్న పోస్టర్ పై నిషేధం విధించేందుకు ఇటీవల సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. 'మీకు నచ్చక పోతే సినిమా చూడడం మానుకోండి' అంటూ అత్యున్నత న్యాయస్థానం పిటిషనర్ కు చురక అంటించింది. -
మంచి దర్శకుడే కాదు... మార్గదర్శకుడు
సందర్భం: నేడు రాజ్కుమార్ హిరానీ బర్త్డే 2003వ సంవత్సరం భారతీయ సినిమా ప్రేక్షకలోకం ఆర్ద్రతతో హర్షించింది. కళామతల్లిని కనకవర్షంతో అభిషేకించింది. మనసు తడిని చెంప మీద ఆనంద భాష్పాలుగా రాల్చింది. ‘మున్నాభాయ్ ఎమ్బీబీఎస్’ అనే కొత్త డాక్టరు ఆగమనంతో దశాబ్దాలుగా మూస సినిమాల కథా వస్తువుల్లోని బ్యాక్టీరియాను పోగొట్టి ప్రేక్షకులనూ, పరిశ్రమలోని ఆలోచనాపరుల్నీ ఆరోగ్యంతో ఉత్తేజితుల్ని చేసింది. ఇన్ని అద్భుతాలకు మూలకారకుడు భూమ్మీద పడింది 1962 నవంబర్ 22న. ప్రేక్షకలోకాన్నీ, నాతిగా భావించి ముచ్చటగా మూడు ముళ్లేశాడు ఈ దర్శకుడు - రాజ్కుమార్ హిరానీ. ‘మున్నాభాయ్ ఎమ్బీబీఎస్, లగేరహో మున్నాభాయ్, త్రీ ఇడియట్స్’ - ఈ మూడు ముళ్లు వేసి ‘నాతి చరామి’ అన్నాడీయన. ప్రేక్షక లోకంలో ఏడు జన్మల అనుబంధం పెనవేసుకున్నాడు. ఈ మూడు చిత్రాల్లో... సాధారణ చలన చిత్రాల్లో లోపించిన, మరుగున పడిన మానవ ‘ధర్మం’ ఉంది. మనుషులు మర్చిపోయిన మానవత్వపు విలువలను ఆచరించాలన్న ‘కామం’ (కోరిక) ఉంది. నిర్మాత విధూ వినోద్ చోప్రాకు ప్రేక్షకులిచ్చిన ‘అర్థం’ (ధనం) భారీగా ఉంది. ‘ఇలాంటి సినిమాల్రా మాక్కావాలి’ అనిపించేలా శాటిస్ఫ్యాక్షన్ ప్రేక్షకుడికి - ‘మోక్షం’గా లభించింది. దటీజ్ రాజ్కుమార్ హిరానీ. చాలా పెద్ద సమస్యల్ని చిరునవ్వు నవ్వేలా తేలికగా ప్రస్తావించడం, జీవితాన్ని కాంప్లికేట్ కాకుండా ఎలా చూసుకోవాలో చిన్న చిన్న పరిష్కార మార్గాలు చూపడం, ప్రేమను శరీరం మీద కాకుండా మనసులతో చూపడం, అన్ని కళాత్మక భావాలనీ కమర్షియల్గా కళ్ల ముందు ఆవిష్కరించడం - నిజంగా సినిమా చూడడం వచ్చిన వాడికి ఇంతకంటే నచ్చే విషయం మరొకటి ఉండదు. ‘ఖల్నాయక్’ వేషధారిని ‘మున్నాభాయ్’గా మెప్పించడం ఓ సాహసం. ‘జాదూ కీ జప్పీ’ (కౌగిలి మంత్రం) సినిమాకే కాదు ఆత్మీయతలు కొరవడిన ఆధునిక సమాజానికీ ఓ అవసరం. సీక్వెల్ కథలు హిట్ అవ్వడమే చాలా అరుదైన రోజుల్లో ‘లగేరహో మున్నాభాయ్’ సినిమా తీయడం ఇంకో పెద్ద సాహసం. అహింస, సత్యం అనే ఆయుధాలతో భారతావనికి స్వాతంత్య్రం సాధించిన గాంధీ మహాత్ముని ఆశయాలనూ, ఆలోచనలనూ ఇవాళ్టి సమాజంలో ఎలా ఆచరణలో పెట్టచ్చో చూపించిన చిత్రం - ‘లగేరహో...’. ‘గూండా గిరీ’కి వ్యతిరేకంగా ‘గాంధీగిరి’ని ప్రేరేపించడం దర్శకునిలోని ఎవరెస్ట్ అంత ఎత్తై వ్యక్తిత్వానికి నిలువెత్తు దర్పణం. రాంచోడ్ పాత్రతో ‘త్రీ ఇడియట్స్’లో విద్యావ్యవస్థలో వ్యక్తిత్వ వికాసం ఎంత అవసరమో చూపించిన తీరు అద్భుతం. కొంతమంది మేధావులైన దర్శకులు సమస్యల్ని వెండితెర మీద ప్రతిబింబిస్తారు. అవార్డు సినిమాలగానో, ఆర్ట్ సినిమాలగానో పేరు పొంది, మంచి దర్శకులవుతారు. రాజ్కుమార్ హిరానీ మాత్రం సమస్యలకు పరిష్కారాన్ని చూపాడు. జనామోదం పొంది, కమర్షియల్గానూ సక్సెస్ అయ్యాడు. మంచి దర్శకుడేకాదు, మార్గదర్శకుడు కూడా అయ్యాడు. ఈ తరం యువతరానికి రాజ్కుమార్ హిరానీ సినిమాల సారాంశాలు, కథాంశాలు... పాఠ్యాంశాలు. 2014లో ఒక బైబిల్, ఒక భగవద్గీత, ఒక ఖురాను... కొత్తగా రాయాలంటే రాజ్కుమార్ హిరానీ స్క్రిప్టులు అన్నీ కలిపి రాసేసుకోవడమే. ఆయన సినిమా ఒక ‘చికెన్ సూప్ ఫర్ ద సోల్’! ఒక ‘సీక్రెట్’! మానవ జీవన పోరాటంలో శిథిలమైపోతున్న నైతిక విలువలనూ, మానవీయ దృక్పథాన్నీ, ఆత్మీయతనూ, సరళమైన మృదుభాషణనూ, ఆలింగనాన్నీ, ఓదార్పునూ, నవ్వునూ, కన్నీటినీ - అన్నిటినీ స్పృశించి మనలో వాటికి మళ్లీ జీవం తొడుగుతున్న వెండితెర బ్రహ్మ - రాజ్కుమార్ హిరానీ. ‘పీకే’తో ఆయనతో నాలుగో అడుగు వేయడం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అఖిల భారత సినీ ప్రేక్షకులలో నేనొకడిని! ఆయనకు మనందరి తరపునా ‘శతమానం భవతి’. జన్మదిన శుభాకాంక్షలతో... -
ముచ్చటగా మూడో లుక్!
సినిమానే శ్వాసించే అతికొద్దిమంది భారతీయ నటుల్లో ఆమిర్ఖాన్ ఒకరు. 24 శాఖలపై ఆమిర్కున్న అవగాహన అపారం. సినిమా కోసం ఎంతటి కష్టాన్నయినా అనుభవించడం ఆయన నైజం. ప్రస్తుతం ఆయన ‘పీకె’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్లుక్ వివాదాలకు తెరలేపింది. ఆమిర్లాంటి సూపర్స్టార్ ఇలా నగ్నంగా నటించడమేంటని విమర్శలు కూడా తలెత్తాయి. కానీ... ఆయన అలాంటివాటిని లెక్క చేయరు. ఆమిర్కి పాత్రే ప్రాణం. పంజాబీ వాయిద్యకారునిగా ‘పీకె’ సెకండ్ లుక్ దేశవ్యాప్తంగా ఆమిర్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ముచ్చటగా మూడో స్టిల్ని మీడియాకు విడుదల చేశారు ఆమిర్. పోలీస్ యూనిఫాంలో ఆమిర్ కనిపిస్తున్న ఈ థర్డ్లుక్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. డ్రస్ని బట్టి చూస్తే... ఆ యూనిఫాం తనది కాదని చూడగానే పట్టేయొచ్చు. లూజ్గా, భారీ కొలతలతో ఉన్న యూనిఫామ్ని, బెల్డ్ సహాయంతో బిగించి మరీ తొడిగి కనిపిస్తున్నారు ఆమిర్. ఆ వివరాలేంటో తెలుసుకోవాలంటే కథ తెలియాల్సిందే. ఇందులో ఆమిర్ది గ్రహాంతరవాసి పాత్రట. గ్రహాంతర వాసి మానవరూపం ధరించడానికి కారణమేంటనేది ఈ సినిమాలో ఆసక్తికరమైన అంశం. అనుష్కశర్మ ఇందులో కథానాయిక. రాజ్కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 19న విడుదల చేయనున్నారు. -
బట్టల్లేకుండా రైలు పట్టాలపై ఆమిర్ ఖాన్!
బాలీవుడ్ లో చొక్కాలు విప్పే హీరోలు అనగానే సల్మాన్ఖాన్, జాన్అబ్రహం, హృతిక్ రోషన్ గుర్తుకు వస్తారు. అయితే ఈ జాబితాలోకి మిస్టర్ పెర్పెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కూడా చేరాడు. సల్మాన్, జాన్, హృతిక్ చొక్కాలు మాత్రమే విప్పితే ఆమిర్ ఏకంగా ఒంటిమీదున్న బట్టలన్ని విప్పేసి అందరీని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు. రాజ్కుమార్ హిరానీ తెరకెక్కిస్తున్న 'పీ.కే.' సినిమా కోసం ఈ ఫీట్ చేశాడు. దీంతో 'పీ.కే.' ఫస్ట్లుక్ చర్చనీయాంశంగా మారింది. ఒంటిమీద నూలు పోగులేకుండా రైలు పట్టాలపై నిలబడి కోపంగా చూస్తున్నట్టుగా పోస్టర్ లో ఉంది. ఆమిర్ ఖాన్ ఆచ్చాదనగా ఒక పాత టేప్ రికార్డర్ ను మాత్రమే అడ్డుపెట్టుకోవడం విశేషం. సినిమా ఇంట్రడక్షన్ సీన్ లోనే ఆమిర్ బేర్ బాడీతో కన్పించనున్నాడు. ఇంతకుముందెన్నడూ అతడు ఇలాంటి సీన్లు చేయలేదు. భూమిపైకి వచ్చిన గ్రహాంతరజీవి పాత్రను ఆమిర్ ఖాన్ ఈ సినిమాలో పోషించాడు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై వ్యంగాస్త్రంగా ఈ సినిమాను హిరానీ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకుముందు ఆమిర్, హిరానీ కాంబినేషన్ లో వచ్చిన త్రీఇడియట్స్ ఘన విజయం సాధించింది. 'పీ.కే.' ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. -
తెరపై నగ్నంగా అమీర్!
రాజ్కుమార్ హిరానీ దర్శకత్వంలో త్వరలోనే తెరకెక్కనున్న ‘పీకే’ చిత్రంలో అమీర్ ఖాన్ నగ్నంగా నటించనున్నట్లు సమాచారం. ఈ రాజకీయ వ్యంగ్య చిత్రంలో అమీర్ఖాన్ సరసన అనుష్కాశర్మ నటించనుంది. భూమిపైకి దిగే గ్రహాంతరవాసి పాత్రలో కనిపించనున్న అమీర్, ఈ చిత్రంలో అనుష్కాశర్మతో హాట్హాట్ ముద్దు సీన్లలో కూడా కనిపించనున్నట్లు బాలీవుడ్ వర్గాల భోగట్టా. మల్లికలా ఉంటానట... ‘నేను మల్లికా షెరావత్లా ఉంటానట.. మా మేకప్ మ్యాన్ సహా చాలామంది నాతో ఈ మాట చెబుతున్నారు’ అంటూ హొయలు పోతోంది టీవీ నటి సోనాల్ వెంగుర్లేకర్. ‘దిల్ దోస్తీ డ్యాన్స్, ది బడ్డీ ప్రాజెక్ట్’ వంటి టీవీ సిరీస్లతో యువతను ఆకట్టుకున్న సోనాల్.. తాజాగా ‘శాస్త్రి సిస్టర్స్’లో కనిపించనుంది. నా పెదవులు, ముఖం అచ్చం మల్లికా షెరావత్లానే ఉంటాయని చాలామంది అంటుంటారంటూ సంబరపడుతోంది. -
డిసెంబర్ 19న అమీర్ ఖాన్ 'పీకే' విడుదల!
ముంబై: బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన 'పీకే' చిత్రం ముందునుకున్న తేది కంటే వారం రోజుల ముందే విడుదలకు సిద్దమవుతోంది. రాజ్ కుమార్ హిరాణీ, అమీర్ ఖాన్ కాంబినేషన్ లో '3 ఇడియెట్స్' తర్వాత 'పీకే' చిత్రం రూపొందుతోంది. డిస్నీ ఇండియా, విధూ వినోద్ ఫిల్మ్స్, రాజ్ కుమార్ హిరాణీ ఫిల్మ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 19 విడుదల చేయనున్నట్టు అమీర్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. క్రిస్మస్ కానుకగా రూపొందుతున్న ఈ చిత్రంలో అనుష్క శర్మ, సుశాంత్ సింగ్ రాజ్ పుత్, బోమన్ ఇరానీ, సంజయ్ దత్ లు నటిస్తున్నారు.