-
Rakul Preet Singh: డిజైనర్ వేర్లో మస్త్ క్యూట్గా రకుల్ ప్రీత్ సింగ్ (ఫొటోలు)
-
Rakul Preet Singh: హైదరాబాద్లో రెస్టారెంట్ బిజినెస్ మొదలుపెట్టిన రకుల్ (ఫోటోలు)
-
హైదరాబాద్ లో హీరోయిన్ రకుల్ ప్రీత్ మరో బిజినెస్
తెలుగులో చాలామంది హీరోహీరోయిన్లు.. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపారాల్లోనూ రాణిస్తుంటారు. పలువురు హీరోలకు హైదరాబాద్ లో పబ్స్ ఉన్నాయి. కొందరు హీరోయిన్లకు జిమ్స్, రెస్టారెంట్స్ ఉన్నాయి. అలాంటి వాళ్లలో రకుల్ ప్రీత్ ఒకరు. ఈ మధ్యే పెళ్లి చేసుకున్న ఈమె తాజాగా మరో వ్యాపారంలోకి అడుగుపెట్టబోతుంది. హీరోయిన్ గా తెలుగులో చరణ్, బన్నీతో సినిమాలు చేసిన రకుల్.. ఫిట్ నెస్ కి ఎక్కువ ప్రాధాన్యమిస్తూ ఉంటుంది. ఇదే కాన్సెప్టుతో గతంలో జిమ్స్ ప్రారంభించింది. హైదరాబాద్, వైజాగ్ తదితర నగరాల్లో ఎఫ్ 45 పేరుతో రకుల్ కి జిమ్స్ ఉన్నాయి. చాలామంది తెలుగు స్టార్ వీటికి వెళ్తుంటారు కూడా. (ఇదీ చదవండి: Yatra 2 In OTT: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'యాత్ర 2'.. స్ట్రీమింగ్ అందులోనే) వెల్ బీయింగ్ న్యూట్రిషన్, వెల్ నెస్ న్యూట్రిషన్ బ్రాండ్స్లోనూ రకుల్ ప్రీత్ పెట్టుబడులు పెట్టింది. హెల్త్ అండ్ స్కిన్ రంగంలో కూడా అడుగుపెట్టింది. 2019లో న్యూబూ‘పేరుతో బయోడీగ్రేడబుల్, రీ యూజబుల్ డైపర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు మరో రంగంలోకి అడుగుపెట్టబోతుంది. ఫుడ్ బిజినెస్ స్టార్ చేసింది. హైదరాబాద్ ఆరంభం పేరుతో త్వరలో ఓ రెస్టారెంట్ ప్రారంభం కానుంది. ఇందులో మిల్లెట్స్ తో తయారు చేసిన పుడ్ లభించనుంది. మొన్నీ మధ్యే పెళ్లి చేసుకున్న రకుల్.. ఇప్పుడు కొత్తగా బిజినెస్ గా మొదలుపెట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటోంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన రెండు హిట్ సినిమాలు.. స్ట్రీమింగ్ అందులోనే) -
Ayalaan OTT Release: ఓటీటీలోకి 'అయలాన్'
తమిళ హీరో శివకార్తికేయన్కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఆయన తమిళ్లో నటించిన రెమో, డాక్టర్ వరుణ్, డాన్, ప్రిన్స్ చిత్రాలు తెలుగులో విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలో ‘అయలాన్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం..టాలీవుడ్లో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో రిలీజైంది. సంక్రాంతికి గట్టిపోటీ ఉండటంతో అయలాన్ తెలుగు రిలీజ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం ఇప్పటికే తమిళ్ వర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. భారీ ధరకు డిజిటల్ రైట్స్ను సొంతం చేసుకున్న సన్ నెక్ట్స్ ఫిబ్రవరిలోనే ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఓటీటీలోకి 'అయలాన్' తెలుగు వర్షన్ రాబోతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఏప్రిల్ 19 నుంచి అయలాన్ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. ఆర్.రవికుమార్ దర్శకత్వం వహించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. కేవలం తమిళ్ వర్షన్లో సుమారుగా రూ. 100 కోట్ల గ్రాస్ను ఈ సినిమా కలెక్ట్ చేసింది. -
షాపింగ్లో మంగళవారం బ్యూటీ.. ఈషా రెబ్బా స్టన్నింగ్ లుక్స్!
బ్లూ డ్రెస్లో రకుల్ ప్రీత్ హోయలు.. షాపింగ్తో బిజీగా ఉన్న మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్పుత్... ప్రగ్యా జైస్వాల్ హాట్ లుక్స్.. అలాంటి డ్రెస్లో ఈషా రెబ్బా స్టన్నింగ్ పోజులు.. బ్లాక్ డ్రెస్లో రితికా సింగ్ బోల్డ్ లుక్స్.. గ్రీన్ డ్రెస్లో మిల్కీ బ్యూటీ తమన్నా హోయలు.. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
పెళ్లి తర్వాత డ్రెస్సింగ్ స్టైల్ మార్చరా? రకుల్ అదిరిపోయే రిప్లై
చాలామంది అమ్మాయిలు పెళ్లంటేనే భయపెడతారు. ఎందుకు? పెళ్లి తర్వాత స్వేచ్ఛ ఉండదని, అనేక కట్టుబాట్లు ఉంటాయని, తమ జీవితం అవతలివారి చేతుల్లోకి వెళ్లిపోతుందని! పెళ్లికి ముందు, తర్వాత.. జీవితం ఒకేలా ఉండదన్నదే వారి ప్రధాన భయం! అయితే ఇది కేవలం అపోహే అని కొట్టిపాడేయలేం.. పెళ్లి తర్వాత కూడా హ్యాపీగా, జాలీగా తమకు నచ్చినట్లు ఉన్నవాళ్లు ఉన్నారు. ఇష్టం ఉన్నా, లేకపోయినా అవతలివారికి నచ్చినట్లు మెదులుకునేవారూ ఉన్నారు. పెళ్లిని ఎందుకని.. ఇప్పుడిదంతా ఎందుకంటే? ఈ మధ్యే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్కు ఓ ప్రశ్న ఎదురైంది. పెళ్లయ్యాక మీ ఇంట్లో నీ వేషధారణ (డ్రెస్సింగ్ సెన్స్) ఏమైనా మార్చుకోమని చెప్పారా? అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగాడు. అందుకు రకుల్ మాట్లాడుతూ.. అలా ఎవరూ చెప్పలేదు. పుట్టింట్లో, అత్తింట్లో నాకు నచ్చినట్లు ఉండేలా స్వేచ్ఛనిచ్చారు. మన సమాజమే పెళ్లిని పెద్ద విషయంగా చూస్తోంది. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ఒక సహజ ప్రక్రియలా భావిస్తే సరిపోతుంది. అమ్మాయిలనే ఎందుకడుగుతారు? అలాగే పెళ్లి తర్వాత.. ధగధగ మెరిసే షేర్వాణీలే ధరించాలని మగవాళ్లకు చెప్పగలరా? చెప్పరు కదా.. మరి ఆడవాళ్ల విషయంలో మాత్రం ఎందుకు ప్రత్యేక శ్రద్ధ పెడతారు? కాలం మారింది.. ఎవరికి నచ్చినట్లు వాళ్లుంటారు. ఎవరికి ఇష్టమైన బట్టలు వారు వేసుకుంటారు' అని చెప్పుకొచ్చింది. కాగా రకుల్ ఫిబ్రవరి 21న గోవాలో ప్రియుడు జాకీ భగ్నానీని పెళ్లాడింది. ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహానికి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. చదవండి: సూర్యను ఇచ్చేయమన్న వీరాభిమాని.. జ్యోతిక ఏమందంటే? -
అమెజాన్ ఈవెంట్లో మెరిసిన సమంత.. పెళ్లి తర్వాత రకుల్ లుక్స్ వైరల్!
గౌనులో చిన్నపిల్లలా మారిపోయిన రవీనా టాండన్ అమెజాన్ ఈవెంట్లో మెరిసిన సమంత.. కళ్లతోనే మాయ చేస్తోన్న శ్రియా శరణ్.. గ్రీన్ డ్రెస్లో లైగర్ భామ అనన్య పాండే అలాంటి పోజులు.. బ్లాక్ డ్రెస్లో రకుల్ ప్రీత్ సింగ్ లుక్స్... View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Arun Prasath (@arunprasath_photography) View this post on Instagram A post shared by Raveena Tandon (@officialraveenatandon) -
లాక్మే ఫ్యాషన్ వీక్ 2024: వయ్యారి భామల సందడి, ఫోటోలు
-
ఆధ్యాత్మిక బాటలో రకుల్ ప్రీత్ సింగ్.. పెళ్లి తర్వాత తొలిసారిగా!
టాలీవుడ్ హీరోయిన రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. నటుడు, నిర్మాత అయిన తన ప్రియుడు జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసింది. గోవాలో జరిగిన వీరి పెళ్లికి పలువురు సినీ తారలు కూడా హాజరయ్యారు. ఫిబ్రవరి 21 వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆనంద్ కరాజ్ అనే పంజాబీ సాంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. వరుడి సాంప్రదాయం ప్రకారం సింధి పద్ధతిలోనూ ముచ్చటగా పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత రకుల్, భగ్నానీ జంట బిజీగా మారిపోయింది. తన భర్తతో కలిసి ఆధ్యాత్మిక బాట పట్టింది. కుటుంబసభ్యులతో పాటు దేవుళ్ల ఆశీర్వాదాలు తీసుకుంటోంది. తాజాగా అస్సాం గువహటిలోని కామాఖ్య దేవి అమ్మవారిని రకుల్ దర్శించుకున్నారు. కొత్త జీవితం ప్రారంభించిన నూతన దంపతులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
ఏప్రిల్ 17న 'రామాయణ' ప్రకటన.. అదే రోజు ఎందుకంటే
భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా హిందీలో 'రామాయణ' అనే సినిమా రూపొందనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మూడు భాగాలుగా రానున్న ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్బీర్ కపూర్, సీత పాత్రలో సాయిపల్లవి, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, రావణుడి పాత్రలో యశ్, శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇతిహాస గాథను తెరపై అద్భుతంగా చూపించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాది వేసవిలో ప్రారంభించాలనుకుంటున్నారట. అంతేకాకుండా ఈ భారీ ప్రాజెక్ట్కు సంబంధించిన విషయాలను శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 17న ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో తాను పోషించనున్న రాముడి పాత్ర ఆహార్యం కోసం రణ్బీర్ కపూర్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకోనున్నారని బాలీవుడ్ సమాచారం. డైలాగ్స్ స్పష్టంగా పలికేందుకు కూడా డైలాగ్ డిక్షన్లో రణ్బీర్ ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారట. ఇక ఈ సినిమాను నమిత్ మల్హోత్రా, మధు మంతెన, అల్లు అరవింద్లు భారీ బడ్జెట్తో నిర్మిస్తారనే ప్రచారం సాగుతోంది. -
గోవాలో ఘనంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి న్యూ ఫోటోలు
-
Rakul-Jackky Wedding : ఫస్ట్ వీడియో వచ్చేసింది, ఫ్యాన్స్ ఫిదా!
లవ్ బర్డ్స్ రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నానీ మూడు ముళ్ల బంధంతో కపుల్గా మారిపోయారు. గోవాలో అత్యంత ఘనంగా ఈ జంట పెళ్లి చేసుకున్నారు. దీంతో ఇపుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరి పెళ్లి సందడి కబుర్లే. రకుల్-భగ్నానీ వెడ్డింగ్ వేడుకుల వీడియోలు, ఫోటోలు కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈక్రమంలో ఇప్పటికి ఈ జంట ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు మెహిందీ, సంగీత వేడుక వీడియోను బ్రైడ్స్ టుడేఇన్ ఇన్స్టా షేర్ చేసింది. ఇందలో తుం బినే సాంగ్కు వీరిద్దరూ స్టెప్పులేయడం ఫ్యాన్స్ను ఆకట్టుకుటోంది. View this post on Instagram A post shared by Brides Today (@bridestodayin) -
రకుల్-భగ్నానీ జంటకు ప్రధాని మోదీ స్పెషల్ విషెస్ వైరల్
PM Modi Wishes to Rakul-Jackky: మూడుమూళ్లు బంధంతో ఒక్కటైన నూతన జంట రకుల్ ప్రీత్ సింగ్-జాకీభగ్నానీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు అందించారు. దీనికి సంబంధించిన ఒక నోట్ను స్వయంగా రకుల్ ట్విటర్ వేదికగా షేర్ చేసింది. ‘‘మా సరికొత్త జర్నీలో మీ ఆశీర్వాదాలు, మా హృదయాలను తాకాయి. ఇవి మాకెంతో విలువైనవి.. ధన్యవాదాలు’’ అంటూ రకుల్, జాకీ ఇద్దరూ మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ఇది వైరల్గా మారింది. Your blessings touch our hearts deeply, Prime Minister @narendramodi ji. Thank you for your kind wishes as we begin this meaningful new chapter.@Rakulpreet pic.twitter.com/6VOfWhzl68 — Jackky Bhagnani (@jackkybhagnani) February 22, 2024 ఫిబ్రవరి 21న గోవాలో ఘనంగా వివాహం చేసుకున్నారు రకుల్-జాకీ జంట. దీంతో కొత్తగా పెళ్లయిన ఈ జంటకు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ జాబితాలో దేశ ప్రధాని మోదీ చేరడం విశేషంగా నిలిచింది. తన బిజీ షెడ్యూల్ కారణంగా మోదీ రకుల్-జాకీ పెళ్లికి హజరుకాలేక పోయానని తెలిపిన మోదీ నూతన దంపతులకు స్పెషల్ ఆశీర్వాదాలు అందించారు. తనకు ఆహ్వానం పంపినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా ధనికవర్గాలు విదేశాల్లో కాకుండా భారతదేశంలోనే డెస్టినేషన్ పెళ్లిళ్లు చేసుకోవాలని, తద్వారా, పర్యాటక రంగానికి, ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలన్న భారత ప్రధాని మోదీ విజ్ఞప్తి మేరకు విదేశాల్లో చేసుకోవాలనుకున్న వీరి పెళ్లి తొలి ప్లాన్ను గోవాకు మార్చుకున్నారనే వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. -
తగ్గేదేలే అంటోన్న టాలీవుడ్ మూవీ.. ఏకంగా ప్రపంచ రికార్డ్ సొంతం!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ నటించిన సూపర్ హిట్ చిత్రం 'జయ జానకి నాయక'. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా రిలీజై ఇప్పటికీ ఐదేళ్లు దాటిపోయినా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ సినిమా హిందీ వర్షన్ యూట్యూబ్లో రిలీజ్ అయినప్పటీ నుంచి ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. తాజాగా 800 మిలియన్ల వ్యూస్తో ప్రపంచ రికార్డ్ సృష్టించింది. కాగా.. ఈ సినిమాను హిందీలో ఖుంఖార్ పేరుతో రిలీజ్ చేశారు. సౌత్ డబ్బింగ్ మూవీస్లో ఇప్పటివరకు జయ జానకి నాయక మాత్రమే ఈ రికార్డ్ సాధించింది. యశ్ నటించిన కేజీఎఫ్ రెండో స్థానంలో కొనసాగుతోంది. కానీ తెలుగు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయిన ఈ సినిమా హిందీలో మాత్రం రికార్డులు బద్దలు కొడుతోంది. గతంలోనే హిందీ వర్షన్ కేజీఎఫ్ సినిమాను అధిగమించేసింది. ఇప్పటి వరకు కేజీఎఫ్ 772 మిలియన్ల వ్యూస్తో రెండోస్థానంలో కొనసాగుతోంది. కాగా.. అల్లుడు శీను సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఆ తర్వాత స్పీడున్నోడు సినిమాలో నటించాడు. ఆ తర్వాత మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో జయ జానకి నాయక సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ ఆగస్ట్ 11వతేదీ 2017లో థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. ఈ చిత్రంలో జగపతి బాబు, శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. #JayaJanakiNayaka 800M+ Views 💥👌@BSaiSreenivas @Rakulpreet #BellamkondaSrinivas #RakulPreetSingh #PenMovies pic.twitter.com/eC5M6cml89 — South Hindi Dubbed Movies (@SHDMOVIES) February 20, 2024 -
గోవాలో గ్రాండ్ గా రకుల్ పెళ్లి
-
ప్రియుడిని పెళ్లాడిన రకుల్ ప్రీత్ సింగ్
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికూతురిగా ముస్తాబైంది. మనసిచ్చినవాడితో మనువాడింది. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసింది. గోవాలో బుధవారం (ఫిబ్రవరి 21న) మధ్యాహ్నం వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆనంద్ కరాజ్ అనే పంజాబీ సాంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లి కన్నుల పండుగ్గా జరిగింది. వరుడి సాంప్రదాయం ప్రకారం సింధి పద్ధతిలోనూ మరోసారి ముచ్చటగా పెళ్లి చేసుకోనున్నారు. మూడు రోజుల నుంచే సంబరాలు ఫిబ్రవరి 19 నుంచే వీరి పెళ్లి సంబరాలు షురూ అయ్యాయి. వీరి హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. హీరో వరుణ్ ధావన్, హీరోయిన్ శిల్పాశెట్టి- రాజ్ కుంద్రా దంపతులు సహా తదితరులు సంగీత్లో స్టెప్పులేశారు. తాజాగా బాలీవుడ్, టాలీవుడ్ తారలు పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అప్పుడే లీక్ చేసింది కాగా రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రేమ విషయాన్ని 2021 అక్టోబర్లో బయటపెట్టింది. అప్పటినుంచి ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఈ బ్యూటీ కెరీర్తో పాటు పర్సనల్ లైఫ్పైనా ఫోకస్ చేసింది. ఇన్నాళ్లకు ప్రియుడితో కలిసి కొత్త జీవితం ప్రారంభించింది. ప్రస్తుతం ఆమె ఇండియన్ 2 సినిమా చేస్తోంది. జాకీ భగ్నానీ విషయానికి వస్తే అతడు నిర్మించిన బడే మియా చోటే మియా సినిమా ఈద్ పండగకు థియేటర్లలో రిలీజ్ కానుంది. చదవండి: సద్గురు హాలీవుడ్ ఎంట్రీ.. జెన్నిఫర్ లోపెజ్ సినిమాలో అలా! -
Rakul-Jackky Wedding : జాకీ స్పెషల్ సర్ప్రైజ్, ఫోటోలు వైరల్
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ , నటుడు-నిర్మాత జాకీ భగ్నానీ పెళ్లి ముహూర్తం వచ్చేసింది. ఈరోజు గోవాలో ఫిబ్రవరి 21 న వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. దీనికి సంబంధించి ప్రీ-వెడ్డింగ్ వేడుకలు, తరలి వెళుతున్న సెలబ్రిటీల ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. రకుల్, జాకీ పెళ్లికి భగ్నానీ & సింగ్ కుటుంబం స్వాగతం పలుతుకున్న వేదిక దగ్గర్నించి, RJ లవ్బర్డ్స్ పేర్ల తొలి అక్షరాలను రాసిన కొబ్బరికాయ, గోవా చేరుకుంటున్న పలువురు సినీరంగ ప్రముఖుల ఫోటోలను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. రకుల్ జాకీ వారి మెహందీ, సంగీత వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంగీత్లో వరుణ్ 'కూలీ నంబర్ 1' లోని 'హస్న్ హై సుహానా'కి డ్యాన్స్ చేయగా,. వరుణ్తో పాటు శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా , ఇతర కుటుంబ సభ్యులు కూడా స్టెప్పులేశారు. అంతేకాదు జాకీ భగ్నాని తన లవ్ లేడీని ఓ పాటతో సర్ ప్రైజ్ చేయాలని ప్లాన్ చేశాడట. వారి ప్రేమకథను సూచించే బిన్ తేరే అంటూ సాగే ఈ పాట వేడుకకు ఓ ప్రత్యేకతను తీసుకొచ్చిందట. ఈ పాటకు మయూర్ పూరి సాహిత్యం అందించగా, తనిష్క్ బాగ్చి కంపోజిషన్లో జహ్రా ఎస్ ఖాన్, రోమీ మతనిష్క్ బాగ్చి పాడారు. రకుల్కి గుండెల్లో ఎప్పటికీ పదిలంగా ఉండేలా ఈ పాటను ప్లాన్ చేశాడట. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) పంజాబీ వెడ్డింగ్లంటే చుడా వేడుక అతిముఖ్యమైంది. వధువు మేనమామ పాలతో శుద్ధి చేసిన గాజులను అందిస్తాడు. ఇద్దరు మేనమామలుంటే, ఎవరు ఎక్కువ గాజులు పెడతారనే అందమైన పోటీ ఉంటుంది ఇద్దరి మధ్యా. ఉదయం 'చుడా' వేడుక ఆ తర్వాత గోవా ITC గ్రాండ్ సౌత్ 'సాథ్ ఫేరా' ఉంటుందని సమాచారం. రకుల్ , జాకీ రెండు సాంప్రదాయల ప్రకారం పెళ్లిళ్లు చేసుకుంటారని తెలుస్తోంది. అంగరంగ వైభవంగా ఈ పెళ్లి వేడుకలో జాకీ భగ్నాని తండ్రి వాషు భగ్నాని సన్నిహిత మిత్రుడు రాజ్కుంద్రా, ఆయన భార్య నటి శిల్పా శెట్టి ఈ వేడుకలో ప్రత్యేకంగా కనిపించనున్నారు. నటుడు వరుణ్ ధావన్, భార్య నటాషా దలాల్ ఇప్పటికే గోవాలో సందడి చేస్తున్నారు. కొన్నేళ్ల డేటింగ్ తరువాత, రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నానీ తమ ప్రేమ బంధాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా 2021,అక్టోబర్ అధికారంగా షేర్ చేసిన సంగతి తెలిసిందే. #WATCH The Gorgeous actress #PragyaJaiswal was snapped arriving at Goa airport to attend bestie #RakulPreetSingh & #JackkyBhagnani's wedding. She was seen posing with fans at the airport. The pair decided to skip overseas weddings and marry in a beautiful hotel in South Goa. pic.twitter.com/Sn2LxraSWh — E Global news (@eglobalnews23) February 20, 2024 -
బాయ్ ఫ్రెండ్తో హీరోయిన్ రకుల్ పెళ్లి.. ఈ జోడీ ఆస్తి ఎంతో తెలుసా?
హీరోయిన్ రకుల్ ప్రీత్ పెళ్లికి రెడీ అయిపోయింది. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ఏడడుగులు వేయబోతుంది. ఫిబ్రవరి 21న ఈకో-ఫ్రెండ్లీ పద్ధతిలో ఈ వేడుక జరగనుంది. గత కొన్ని రోజుల నుంచి పెళ్లి హడావుడి నడుస్తుండగా.. మరోవైపు పెళ్లికి హాజరవడం కోసం ఇప్పటికే అతిథులు అందరూ గోవాకు చేరుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో రకుల్-ఈమె భర్తకు సంబంధించిన ఆస్తుల వివరాలు చర్చనీయాంశంగా మారిపోయాయి. (ఇదీ చదవండి: బాలీవుడ్లో డబ్బులిచ్చి ఆ పని చేయించుకుంటారు: ప్రియమణి) దిల్లీకి చెందిన రకుల్ ప్రీత్.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు హిందీలో కొన్ని సినిమాలు చేసింది గానీ పెద్దగా పేరు రాలేదు. తెలుగులో 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' చేసిన తర్వాత రకుల్ ఫేట్ మారిపోయింది. అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతానికి మాత్రం హిందీలో మాత్రమే మూవస్ చేస్తోంది. కరోనా లాక్ డౌన్ టైంలో బాలీవడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో పడ్డ రకుల్.. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచింది. 2021 అక్టోబరులో అధికారికంగా ప్రకటించేశారు. అప్పటి నుంచి వీళ్లిద్దరూ చాలాసార్లు కలిసి కనిపిస్తూ వచ్చారు. దాదాపు మూడేళ్ల తర్వాత ఇప్పుడు పెళ్లికి రెడీ అయ్యారు. బుధవారం (ఫిబ్రవరి 21) గోవాలో పెళ్లి చేసుకోనున్నారు. (ఇదీ చదవండి: తల్లి కాబోతున్న హీరోయిన్ దీపికా పదుకొణె.. పెళ్లయిన ఆరేళ్లకు ఇలా!) ఇక రకుల్ ఆస్తుల విషయానికొస్తే.. హైదరాబాద్, విశాఖపట్నంలో మూడు జిమ్స్ ఉన్నాయి. వీటితో పాటు మెర్సిడెజ్ బెంజ్ (రూ.కోటి), రేంజ్ రోవర్ స్పోర్ట్స్ (రూ.70 లక్షలు), బీఎండబ్ల్యూ 520డీ (రూ.75 లక్షలు), ఆడీ Q3 (రూ.35 లక్షలు), మెర్సిడెజ్ మెబాజ్ జీఎల్ఎస్600 (రూ.2.96 కోట్లు) కార్లు ఉన్నాయి. ఓవరాల్గా ఈమె దగ్గర రూ.49 కోట్లు విలువైన ఆస్తి ఉందట. మరోవైపు రకుల్ కాబోయే భర్త జాకీ భగ్నానీ ఆస్తుల విషయానికొస్తే.. నిర్మాతగా పలు సినిమాలు చేస్తున్న ఇతడి దగ్గర పోర్స్ కేయన్ని (రూ.1.36 కోట్లు), మెర్సిడెజ్ బెంజ్ సీఎల్ఎస్ (రూ.84 లక్షలు), మెర్సిడెజ్ బెంజ్ ఎస్ క్లాస్ (రూ.2.11 కోట్లు), రేంజ్ రోవల్ వాగ్ (రూ.2.39 కోట్లు) కార్లు ఉన్నాయి. పలు స్థిరాస్తులతో కలిపి ఓవరాల్గా ఇతడి దగ్గర రూ.35 కోట్ల విలువైన ఆస్తి ఉందట. ఇలా ఇద్దరి దగ్గర కలిపి రూ.84 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయని సమాచారం. (ఇదీ చదవండి: కొత్త పెళ్లి కూతురిలా సన్నీ లియోన్.. మంచు లక్ష్మీ అలాంటి లుక్!) -
నా తొలి రెమ్యునరేషన్ ఇదే: రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్ పంజాబీ కుటుంబానికి చెందిన ఈ బ్యూటీ గిల్లి అనే కన్నడ సినిమాతో 2009లో మొదటిసారి వెండితెరపై మెరిసింది. టాలీవుడ్లో కెరటం అనే చిన్న సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చినా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో బ్రేక్ అందుకుంది. ఆ తర్వాత తన టాలెంట్తో సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో నటిస్తూనే బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. అలా మోడలింగ్ నుంచి హీరోయిన్గా మంచి గుర్తింపు పొందే స్థాయికి రకుల్ చేరుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో తన ప్రియుడు బాలీవుడ్ అగ్ర నిర్మాత జాకీ భగ్నానీతో కలిసి పెళ్లి పీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. ఈ నెల 21న గోవాలో వారి వివాహం ఘనంగా జరగనుంది. ఈ క్రమంలో ఆమె జర్నీని ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది. జీవితంలో కష్టకాలం వచ్చినప్పుడు వెన్నంటి ఉండి సాయం చేసే వ్యక్తులు మన చుట్టూ లేకుంటే సమస్యలు తలెత్తుతాయని ఆమె తెలిపింది. 'నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రోజు నుంచి నాకు 25 ఏళ్లు వచ్చే వరకు మా అమ్మ ఎప్పుడూ తోడుగా నిలిచింది. నా కెరియర్ మోడలింగ్తోనే ప్రారంభమైంది. అలా నేను మొదట అందుకున్న రెమ్యునరేషన్ రూ.5 వేలు.. అక్కడి నుంచి నేడు ఈ స్థాయికి చేరుకున్నానంటే అందుకు ప్రధాన కారణం నా తల్లిదండ్రులు, సన్నిహితులు మాత్రమే.. నా వెంట వాళ్లు లేకుంటే ఎన్నో సమస్యలు ఫేస్ చేయాల్సి వచ్చేది.' అంటూ రకుల్ తెలిపింది. ప్రస్తుతం రకూల్ మేరీ పత్నీ కా రీమేక్, భారతీయుడు 2 సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
రకుల్, జాకీ పెళ్లి సందడి : వెడ్డింగ్ కార్డ్ వైరల్
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో పెళ్లిసందడికి ముహూర్తం ఖరారైన సంగతి తెలిసిందే. చాలాకాలంగా ప్రేమలో ఉన్న ఈ లవ్బర్డ్స్ తమ రిలేషన్ షిప్లో మరో అడుగు వేయబోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాజగా వీరి పెళ్లికి సంబందించిన వెడ్డింగ్ కార్డ్ నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఫిబ్రవరి 21న రకుల్, జాకీ భగ్నానీ ల వివాహం గోవాలో జరగబోతోంది. వివాహ సన్నాహాలు పూర్తి స్వింగ్లో ఉన్నాయి. వీరి వెడ్డింగ్ స్పెషల్గా , చిరకాలం గుర్తుండిపోయేలా అంగరంగ వైభవంగా జరిపేందుకు రెండు కుటుంబాలు బిజీగా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే నీలం, తెలుపు రంగుల్లో రకుల్, జాకీ భగ్నానీ పెళ్లి శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శుభలేఖలో కొబ్బరి చెట్లు, బీచ్ దృశ్యాలతోపాటు గోవా అందాలు కనిపించేలా ముద్రించడం విశేషం. అందమైన సోఫా నీలం , తెలుపురంగుల్లో క్యూట్ క్యూట్ కుషన్లు.. మరో పూలద్వారం గుండా నీలిరంగు గేటు అందమైన బీచ్కి దారి తీస్తూ, రకుల్, జాగీ పెళ్లి ముహూర్తం విశేషం ఇందులో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అన్నట్టు వీరి వెడ్డింగ్ డెస్టినేషన్ కూడా హాట్ టాపిక్కే. ఎందుకంటే వీరి ద్దరి ప్రేమ కూడా ఇక్కడే మొదలైందట. అందుకే గోవాను ఎంచుకున్నట్టు సమాచారం. -
శూర్పణఖ?
రామాయణం ఆధారంగా హిందీలో దర్శకుడు నితీష్ తివారి ఓ భారీ బడ్జెట్ ట్రయాలజీ ఫిల్మ్ను తెరకెక్కించనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండేళ్లుగా జరుగు తున్న ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ తుది దశకు చేరుకున్నాయి. దీంతో నితీష్ తివారి ఈ సినిమాలోని నటీనటుల ఎంపికపై దృష్టి సారించారు. ఈ సినిమాలోని రాముడి పాత్రలో రణ్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, హనుమంతునిగా బాబీ డియోల్, విభూషణుడిగా విజయ్ సేతుపతి, రావణుడిగా యశ్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. తాజాగా శూర్పణఖ పాత్రలో రకుల్ప్రీత్ సింగ్ నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. రకుల్కు ఆల్రెడీ నితీష్ స్టోరీ చెప్పారని, లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని టాక్. కాగా ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన ఈ వేసవిలో రానుందని, 2025 చివర్లో తొలి భాగం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్ టాక్. మరోవైపు ఈ నెలలో రకుల్ప్రీత్ సింగ్ వివాహం జాకీ భగ్నానీతో జరగనుంది. -
రామాయణంలో రకుల్.. ఆ పాత్రకు సెట్ అయ్యేనా?
రకుల్ ప్రీత్ సింగ్.. ఒకప్పుడు టాలీవుడ్లో ఈ పేరు మారుమ్రోగింది. వరుస సినిమాల్లో నటిస్తూ తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ మొదలు రవితేజ లాంటి స్టార్ హీరోల వరకు అందరితో రకుల్ నటించింది. ఇక్కడ వచ్చిన ఫేమ్తో బాలీవుడ్కు చక్కెసింది. అక్కడ అనుకున్న స్థాయిలో క్లిక్ కాలేదు. ఇటీవల అయితే ఈ బ్యూటీకి అటు బాలీవుడ్తో పాటు ఇటు టాలీవుడ్లోనూ ఒక్క సినిమా లేదు. తాజాగా తమిళ్లో అలయాన్ సినిమాతో ఓ మోస్తరు కమర్షియల్ హిట్ అందుకుంది. అయినా కూడా ఈ బ్యూటి చేతికి పెద్ద ప్రాజెక్టులు రాలేదు. దీంతో వెస్ సిరీస్ల మీదనే ఎక్కువ దృష్టిపెట్టింది. ఇక వెండితెరకు రకుల్ దూరమైనట్లే అనుకుంటున్న సమయంలో ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో రకుల్ నటించబోతుందని ఆ వార్త సారాంశం. (చదవండి: పెళ్లయి ఏడాది కూడా కాలేదు, అంతలోనే నటి విడాకులు!) బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారి రామాయణాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ ప్రొడ్యూసర్లతో కలిసి నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే కాస్టింగ్ పనులు ప్రారంభం అయ్యాయి. ఇందులో రాముడిగా రణ్బీర్ కపూర్ నటించబోతున్నారు. సీత పాత్రలో సాయి పల్లవి లేదా జాన్వీ కపూర్ నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. హనుమంతుడిగా నటించేందుకు సన్నీ డియోల్ అంగీకారం తెలిపాడు. తాజాగా మరో కీలకమైన పాత్ర కోసం మేకర్స్ రకుల్ని సంప్రదించారట. రామాయణంలో కీలకమైన శూర్పణఖ పాత్రను రకుల్ పోషిస్తున్నట్లు సమాచారం. ఈ పాత్ర కోసం మేకర్స్ ఆమెను సంప్రదించగా..వెంటనే ఓకే చెప్పిందట. త్వరలోనే లుక్ టెస్ట్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో రావణుడిగా యష్, విభీషణుడిగా విజయ్ సేతుపతి నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
రకుల్ బ్యాచిలర్ పార్టీ.. ఆ ముగ్గురు హీరోయిన్లు ఎందుకున్నారంటే?
తెలుగులో పలు హిట్ సినిమాలు చేసిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి రెడీ అయిపోతుంది. మొన్నటివరకు రూమర్స్ వచ్చాయి కానీ తాజాగా జరిగిన బ్యాచిలర్ పార్టీతో ఇది నిజమని తేలిపోయింది. ప్రస్తుతం కాబోయే భర్తతో కలిసి రకుల్ ఫుల్ చిల్ అవుతోంది. ఈమెతో పాటు టాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా ముగ్గురు కనిపించారు. ఇంతకీ వీళ్లందరూ ఎక్కడ పార్టీ చేసుకున్నారు? (ఇదీ చదవండి: దీనస్థితిలో 'షాపింగ్ మాల్' హీరో.. ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?) ముంబయి బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.. హిందీలోనే కెరీర్ మొదలుపెట్టింది. కానీ 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' చిత్రంతో హిట్ కొట్టి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అలానే రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి సక్సెస్ అందుకుంది. కానీ అలాఅలా ఈమెకు తెలుగులో ఛాన్సులు తగ్గిపోయాయి. దీంతో ముంబయికి షిఫ్ట్ అయిపోయింది. వరసగా హిందీ చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. మరోవైపు ప్రముఖ నిర్మాత జాకీ భగ్నానీతో గత కొన్నాళ్ల నుంచి రకుల్ డేటింగ్ చేస్తోంది. ఈ విషయం దాదాపు అందరికీ తెలుసు. ఇప్పుడు వీళ్లిద్దరూ పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. ఫిబ్రవరి 22న గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం థాయ్లాండ్లో బ్యాచిలర్ పార్టీ చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పార్టీలో మంచు లక్ష్మితో పాటు హీరోయిన్లు ప్రగ్యా జైస్వాల్, సీరత్ కపూర్ కూడా కనిపించారు. రకుల్కి వీళ్లు ముగ్గురు ఎప్పటి నుంచో స్నేహితులు. అలా ఇప్పుడు వీళ్లందరూ కలిసి పార్టీ చేసుకున్నారనమాట. (ఇదీ చదవండి: 'హనుమాన్' కోసం 70-75 సినిమాలు రిజెక్ట్ చేశా: హీరో తేజ) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) -
Rakul, Jackky Wedding: పెళ్లి విషయంలో రకుల్ యూ టర్న్.. అదే కారణమా?
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. కెరటం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన దిల్లీ భామ తెలుగులో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీతో అభిమానుల్లో పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత లౌక్యం, కరెంటు తీగ, కిక్ -2, సరైనోడు, నాన్నకు ప్రేమతో, ధృవ, స్పైడర్ సినిమాల్లో స్టార్ హీరోలతో నటించింది. అయితే గత రెండేళ్లుగా బాలీవుడ్కు మకాం మార్చింది. అక్కడ అటాక్, రన్ వే -34, ఛత్రీవాలీ, ఐ లవ్ యూ లాంటి సినిమాలు చేసింది. అయితే గత కొన్నాళ్లుగా నటుడు-నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమాయణం కొనసాగిస్తోంది ముద్దుగుమ్మ. ఇప్పటికే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఇక త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతోంది భామ. ఈ జంట తమ వివాహా వేడుక కోసం డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. విదేశాల్లో పెళ్లి చేసుకోవాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. గోవాకు మారిన వెడ్డింగ్.. అయితే రకుల్ ప్రీత్ సింగ్ సడన్గా యూ టర్న్ తీసుకుంది. తన పెళ్లి కోసం విదేశాలకు వెళ్లడం లేదని తెలుస్తోంది. పెళ్లి వేదికను ఇండియాలోని గోవాకు మార్చుకుంది. ఫిబ్రవరి 22న వీరిద్దరి వివాహా వేడుక గోవాలో జరగనుంది. అయితే చివరి నిమిషంలో లొకేషన్ను ఇండియాకు మార్చడానికి నిర్ణయం తీసుకోవడానికి అదే కారణమా అంటూ నెటిజన్స్ తెగ చర్చించుకుంటున్నారు. అదేంటో తెలుసుకుందాం. మోదీ పిలుపే కారణమా? రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నాని మొదట్లో విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ని ప్లాన్ చేశారు. కానీ సడన్గా ఈ నిర్ణయం మార్చుకోవడం వెనుక మన ప్రధాని మోదీనే కారణమని వార్త నెట్టింట వైరలవుతోంది. ఎందుకంటే గతేడాది డిసెంబర్లో ధనిక, వ్యాపార, సెలబ్రిటీల కుటుంబాలు తమ పెద్ద పెద్ద ఈవెంట్లకు భారతదేశాన్ని వేదికగా ఎంచుకోవాలని పీఎం పిలుపునిచ్చారు. అందువల్లే రకుల్, జాకీ విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇటీవలే లక్షద్వీప్ వెళ్లిన మోదీ చేసిన ఫొటోషూట్ తర్వాత మాల్దీవుల మంత్రులు చేసిన కామెంట్స్తో వివాదం మొదలైంది. ఆ తర్వాత చాలామంది సెలబ్రిటీలు అక్కడి వెకేషన్లను సైతం రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఇటీవలే ఈ జంట ముంబైలోని రామమందిరంలో ప్రార్థనలు చేశారు. ఈ విషయాన్ని తమ ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. గోవాలో ఫిబ్రవరి 22న జరగబోయే వీరి వివాహానికి బాలీవుడ్తో పాటు సౌత్ ఇండస్ట్రీకి చెందిన సన్నిహితులు హాజరుకానున్నారు. -
రకుల్-జాకీ పెళ్లి.. ఈ జోడీ కోసం స్పెషల్ ట్రాక్!
బాలీవుడ్ హీరో–నిర్మాత జాకీ భగ్నానీ, హీరోయిన్ రకుల్ ప్రీత్సింగ్ ఇప్పుడు ఓ హాట్ టాపిక్. ఈ ఇద్దరూ భార్యాభర్తలుగా మారి, తమ జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని ఆరంభించాలనుకుంటున్నారనే వార్త వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 22న గోవాలో కుటుంబ సభ్యులు, బాగా దగ్గర స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఈ ఇద్దరి పెళ్లి జరగనుందని టాక్. కాగా.. పసందైన పాటలతో తమ పెళ్లిని ఆహ్లాదకరంగా జరుపుకోవాలని ప్లాన్ చేస్తున్నారట జాకీ–రకుల్. వెడ్డింగ్ వీడియోగ్రాఫర్ విశాల్ పంజాబీని నియమించారట. విరాట్ కోహ్లీ–అనుష్కా శర్మ, రణ్వీర్ సింగ్–దీపికా పదుకోన్, సిద్ధార్థ్ మల్హోత్రా–కియారా అద్వానీ వంటి స్టార్స్ వివాహ వేడుకలకు వీడియోగ్రాఫర్గా వ్యవహరించినది విశాల్ పంజాబీయే. వివాహ వేడుకల కోసం ప్రత్యేకంగా సౌండ్ ట్రాక్స్ చేస్తుంటారట విశాల్. ఇప్పటికే బాగా హిట్టయిన ప్రేమ పాటలను రీ–క్రియేట్ చేయడంతో పాటు కొత్త ట్యూన్లు కూడా చేస్తుంటారట. ఇంకా పెళ్లి కోసం ప్రత్యేకంగా పాటలు తయారు చేయడానికి, పాడటానికి సంగీతదర్శకులు విశాల్–శేఖర్, గాయనీమణులు యాషికా సిక్కా, హర్షదీప్ కౌర్ వంటి వారిని కూడా జాకీ–రకుల్ సంప్రదించారని భోగట్టా. తమ డేటింగ్ నుంచి పెళ్లి, భవిష్యత్తుని ప్రతిబింబించేలా విశాల్ పంజాబీతో ఓ ట్రాక్ తయారు చేయిస్తున్నారని సమాచారం. ఫిబ్రవరి మొదటి వారానికి ఈ ట్రాక్ రెడీ అవుతుందట. ఇలా ప్రత్యేకమైన, పసందైన పాటలతో తమ వివాహాన్ని ఓ కమ్మని పాటలా తీపి గుర్తులా ఉండేలా ఈ జోడీ ప్లాన్ చేసుకుంటోందని టాక్.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
టీ20 వరల్డ్కప్ 2024.. ఐసీసీ కీలక నిర్ణయం!? అలా అయితే కష్టమే
నేనెవర్నీ విడగొట్టలేదు.. ఆ హీరోయిన్కు, నా భర్తకు ఆల్రెడీ బ్రేకప్!
పెళ్లిరోజే చెల్లెలి కొంపముంచిన ‘ఇన్స్టాగ్రామ్’ అన్నలు
అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
యోగా విషయంలో రాందేవ్ కృషి మంచిదే కానీ: సుప్రీంకోర్టు
మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
రెమో మళ్లీ వచ్చేస్తున్నాడు.. బుకింగ్స్ అదుర్స్!
కేఎల్ రాహుల్ను ఇంటికి పిలిచిన గోయెంక: అతియా శెట్టి పోస్ట్ వైరల్
ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!
వైఎస్సార్సీపీలో ఉన్నంత కాన్ఫిడెన్స్.. కూటమిలో లేదు!
తప్పక చదవండి
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- హోర్డింగ్ కూలి 14 మంది మృతి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
- వీడు మాములోడు కాదు.. 100 రోజులు, 200 విమానాలు కట్ చేస్తే..!
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు.. నేడు అదనపు ట్రిప్పులు
- మీ పిల్లలను సరైన క్రమంలో తీర్చిదిద్దాలంటే ఇలా చేయండి!
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- ‘గాజాపై అణు బాంబు వేయనివ్వండి’
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement