removed
-
ఉగ్ర లింకులున్న ముగ్గురు ఉద్యోగుల తొలగింపు
జమ్మూ: ఉగ్ర మూకలతో సంబంధాలున్నట్లు తేలడంతో పోలీసు కానిస్టేబుల్ సహా ముగ్గురు ఉద్యోగులను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శనివారం విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వీరిలో పోలీస్ కానిస్టేబుల్ ఫిర్దౌస్ అహ్మద్ భట్, స్కూల్ టీచర్ అష్రాఫ్ భట్, అటవీ శాఖ ఉద్యోగి నిసార్ అహ్మద్ ఖాన్ ఉన్నారు. నిసార్ అహ్మద్ ఖాన్ 2000వ సంవత్సరంలో నేషనల్ కాన్ఫరెన్స్కు చెందిన మంత్రి హత్య కేసులో అరెస్టయ్యాడు. ఇతడికి హిజ్బుల్ ముజాహిదీన్తో సంబంధాలున్నట్లు తేలింది. అదేవిధంగా, 2005లో స్పెషల్ పోలీస్ అధికారి(ఎస్పీవో)గా నియమితుడై, 2011లో కానిస్టేబుల్గా ప్రమోషన్ పొందిన ఫిర్దౌస్కు ఉగ్రలింకులున్నట్లు తేలడంతో గతేడాది సస్పెండ్ చేశారు. ఆయుధాలు, డ్రగ్స్ సరఫరా చేసే ఇతడు ప్రస్తుతం కొట్ భల్వాల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అనంత్నాగ్ జిల్లాలో దాడులకు పథక రచన చేస్తుండగా మరో ఇద్దరు ఉగ్రవాదులతోపాటు పట్టుకున్నారు. రియాసికి చెందిన అష్రాఫ్ భట్ రెహ్బార్–ఇ–తలీం టీచర్గా 2008లో చేరాడు. ఇతడికి లష్కరేతోయిబాతో సంబంధాలున్నాయి. పాక్ కేంద్రంగా పనిచేసే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మహ్మద్ కాసిమ్ ఆదేశాల మేరకు ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇతడిని పోలీసులు 2022లో అరెస్ట్ చేశారు. -
భోపాల్లో విష వ్యర్థాల తొలగింపు
భోపాల్: భారత దేశ చరిత్రలో అత్యంత దారుణమైన పారిశ్రామిక ప్రమాదంగా నిలిచిన భోపాల్ గ్యాస్ లీకేజీ ఉదంతంలో 40 సంవత్సరాల తర్వాత కీలక ఘట్టం జరిగింది. విషపూరిత గ్యాస్ లీకేజీ తర్వాత ఇంకా యూనియన్ కార్బైడ్ కర్మాగారంలో మిగిలిపోయిన అత్యంత ప్రమాదకర వ్యర్థాల తొలగింపు ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. బుధవారం రాత్రి 9 గంటలపుడు ఏకంగా 337 టన్నుల బరువైన వ్యర్థాలను ప్రత్యేకమైన కంటైనర్లలో జాగ్రత్తగా ప్యాక్చేసి 250 కిలోమీటర్ల దూరంలోని వ్యర్థ్యాల దహన కర్మాగారానికి తరలించారు. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఈ ట్రక్కులన్నీ ధర్ జిల్లాలోని పీతంపూర్ పారిశ్రామిక వాడకు చేరుకున్నాయని ధర్ ఎస్పీ మనోజ్ సిన్హా చెప్పారు. వ్యర్థాలను దహనం చేసి అందులో ఏరకమైన విష పదార్థలు లేవని నిర్ధారణ చేసుకున్నాకే మిగిలిన అవశేషాలను నేలలో పాతిపెట్టనున్నారు. 1984 డిసెంబర్ రెండో తేదీ రాత్రి భోపాల్లోని యూనియన్ కార్బైడ్ పురుగుమందుల కర్మాగారం నుంచి అత్యంత విషపూరితమైన మిథైల్ ఐసోసైనేట్ గ్యాస్ లీక్ అయింది. అది ఎక్కడి జనాన్ని అక్కడే విగతజీవులుగా మార్చేసిన దారుణోదంతం తెల్సిందే. విష వాయువులు పీల్చి దాదాపు 5,480 మంది అక్క డిక్కడే చనిపోయారు. వేలాది మంది వికలాంగులయ్యారు. విషవాయువును పీల్చిన ఆనాటి తరం వాళ్లకు ఈ నాలుగు దశాబ్దాల కాలంలో లక్షలాది మంది వైకల్యంతో జన్మించారు. ఇంకెందరో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద పారిశ్రామిక విపత్తులలో ఒకటిగా ఇది నిలిచిపోయింది. అంబులెన్సులు, పోలీసు వాహనాలు, అగ్నిమాపక దళాల ప్రత్యేక పర్యవేక్షణలో వ్యర్థాల తరలింపు ప్రక్రియ జరిగింది. ఇందుకోసం 250 కిలోమీటర్ల పొడవునా గ్రీన్ కారిడార్ను ఏర్పాటుచేశారు. విషపూరిత వ్యర్థాలలో మట్టి, పురుగుమందుల అవశేషాలు, తయారీ ప్రక్రియల్లో మిగిలిపోయిన రసాయనాలతో సహా ఐదు రకాల ప్రమాదకరమైన పదార్థాలు ఉన్నాయి. మందలించిన హైకోర్టురాష్ట్ర రాజధానిలోని ఈ కర్మాగారం నుంచి వ్యర్థాలను తొలగించాలని సుప్రీంకోర్టు గతంలోనే పలుమార్లు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదు. ఫ్యాక్టరీని ఖాళీ చేయకపోవడంపై మధ్యప్రదేశ్ హైకోర్టు ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఉదాసీనత కొత్త విషాదానికి దారి తీస్తుందని కోర్టు పేర్కొంది. వ్యర్థాలను తొలగించడానికి నాలుగు వారాల గడువు విధిస్తూ డిసెంబర్ మూడో తేదీన తీర్పునిచ్చింది. వ్యర్థాలను 2025 జనవరి ఆరో తేదీలోపు పూర్తిగా తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పాటించకుంటే కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ మేరకు ప్రభుత్వం తరలింపు చర్యలు చేపట్టింది. అత్యంత భద్రత మధ్య..వ్యర్థాలను సురక్షితంగా తరలించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. కర్మాగారంలో 337 మెట్రిక్ టన్నుల విష వ్యర్థాలున్నాయి. ఆదివారం నుంచే వీటిని మూటలు కట్టే పనులు మొదలుపెట్టారు. వీటిని ప్రత్యేకంగా రూపొందించిన 12 కంటైనర్లలో లోడ్ చేశారు. ప్రతి కంటైనర్లో సుమారు 30 టన్నుల వ్యర్థాలను నింపారు. రసాయన చర్యలను నివారించడానికి అత్యంత మందంగా ఉండే పాలిథీన్ సంచుల్లో ప్యాక్ చేశారు. వ్యర్థాల తరలింపుకోసం కర్మాగారం చుట్టూతా 200 మీటర్ల పరిధిలో ఎవరూ రాకుండా నిషేధం విధించారు. సుమారు 200 మంది కార్మికులు ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. పీపీఈ కిట్లు ధరించి కట్టుదిట్టమైన భద్రతా ప్రమానాలను పాటిస్తూ వ్యర్థాలను కంటైనర్లలో నింపారు. బుధవారం రాత్రి 9 గంటలకు 12 కంటైనర్ ట్రక్కులు కర్మాగారం నుంచి బయలుదేరాయి. 50 మంది పోలీసులు కంటైనర్లకు రక్షణ కల్పిస్తున్నారు. అత్యున్నత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా వ్యర్థాలను తరలిస్తున్నామని పోలీసు కమిషనర్ తెలిపారు.పీతంపూర్లో దహన కర్మాగారం..పీతంపూర్లోని వ్యర్థాల దహన కర్మాగారం రాష్ట్రంలోని ఏకైక అత్యాధునిక కర్మాగారం. దీనిని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డ్ మార్గదర్శకాల ప్రకారం రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ నిర్వహిస్తోంది. 2015లో ట్రయల్రన్లో భాగంగా గంటకు 90 కిలోల వ్యర్థాల చొప్పున 10 టన్నుల యూనియన్ కార్బైడ్ వ్యర్థాలను ప్రయోగాత్మకంగా దహనం చేశారు. ఇది విజయవంతం కావడంతో మిగిలిన వ్యర్థాలను కాల్చేయనున్నారు. భూమికి 25 అడుగుల ఎత్తులో నిర్మించిన ప్రత్యేక వేదికపై వ్యర్థాలను కాల్చనున్నారు. ఈ ప్రక్రియ కోసం కఠినమైన శాస్త్రీయ ప్రోటోకాల్స్ను అనుసరిస్తారు. గంటకు 90 కిలోల వ్యర్థాల చొప్పున మొత్తం 337 టన్నుల వ్యర్థాలను కాల్చడానికి సుమారు 153 రోజులు పడుతుంది. ఈ వేగాన్ని గంటకు 270 కిలోలకు పెంచితే 51 రోజుల్లో పూర్తిగా వ్యర్థాలను కాల్చేయొచ్చు.12 trucks carrying 337 tonnes of toxic waste from the Union Carbide factory in Bhopal, stored for 40 years, left at 9:05 p.m. for Pithampur near Indore. The waste is expected to arrive early on January 2nd, following a 250-km green corridor with heavy security. 📹@MehulMalpani pic.twitter.com/zU78cVRE85— The Hindu (@the_hindu) January 1, 2025స్థానికుల నుంచి వ్యతిరేకత2015లో పీతంపూర్లో 10 టన్నుల యూనియన్ కార్బైడ్ వ్యర్థాలను ప్రయోగాత్మకంగా కాల్చివేయడం వల్ల సమీప గ్రామాల మట్టి, భూగర్భ జలాలు, నీటి వనరులు కలుషితమయ్యాయని స్థానికులు ఆందోళన తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యర్థాల తరలింపునకు స్థానిక ప్రజల నుంచి తీవ్ర నిరసన ఎదురవుతోంది. ఆదివారం పెద్ద సంఖ్యలో ప్రజలు నిరసన ప్రదర్శన చేపట్టారు. వ్యర్థాలను పీతంపూర్కు బదులు విదేశాలకు పంపాలని డిమాండ్ చేస్తూ 10కి పైగా సంస్థలు గురువారం బంద్కు పిలుపునిచ్చాయి. తగిన ట్రయల్స్ లేకుండా వ్యర్థాల తొలగింపు ప్రక్రియను ప్రశ్నిస్తూ ఇండోర్లోని మహాత్మాగాంధీ మెమోరియల్ హాస్పిటల్ పూర్వ విద్యార్థుల సంఘం వైద్యులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే అన్ని అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతే వ్యర్థాలను కాల్చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు భోపాల్ ఘటన సహాయక, పునరావాస విభాగ డైరెక్టర్ స్వతంత్ర కుమార్ సింగ్ తెలిపారు. అన్నీ సవ్యంగా జరిగితే, మూడు నెలల్లో వ్యర్థాలను కాల్చివేస్తామని చెప్పారు. ఏదైనా ఆటంకం జరిగితే తొమ్మిది నెలల వరకు పట్టవచ్చ న్నారు. కాల్చిన తర్వాత, వ్యర్థాల బూడిదలో ఏదైనా హానికరమైన మూలకం మిగిలి ఉందా లేదా అని పరిశీలిస్తామని పేర్కొన్నారు. విషపూరిత మూలకాల జాడలు లేవని నిర్ధారించాక బూడిదను భూగర్భజలంతో కలవని రీతిలో భూమిలో పాతిపెడతామన్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారుల పర్యవేక్షణలో నిపుణుల బృందం ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.ఇది కూడా చదవండి: బోరుబావి ప్రమాదాలు.. ఒకసారి విఫలం.. మరోసారి సఫలం -
Pune Porsche car crash: మైనర్ నిందితునికి బెయిలు.. జడ్జిల తొలగింపు
పుణే: పోర్షే కారు దుర్ఘటనలో మైనర్ నిందితుడికి బెయిల్ మంజూరు చేసిన కేసులో జువెనైల్ జస్టిస్ బోర్డు (జేజేబీ)కి చెందిన ఇద్దరు జడ్జిలను మహారాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. విధానపరమైన లోపాలు, దుష్ప్రవర్తన, నిబంధనలు పాటించకపోవ డంవంటి ఆరోపణలపై ఎల్.ఎన్.దన్వాడే, కవితా థోరట్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ (డబ్ల్యూసీ డీ) దర్యాప్తు కమిటీ సిఫారసు చేసింది. ఈ మేరకు జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కల్పించిన అధికారాలను దుర్వినియోగం చేసిన ట్లు తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరి ని యామకాన్ని రద్దు చేసింది. పుణేలోని కళ్యా ణి నగర్ ప్రాంతంలో ఓ బిల్డర్ కుమారుడైన 17 ఏళ్ల బాలుడు మద్యం మత్తులో పోర్షే కారు నడిపి మోటార్ సైకిల్ను ఢీకొట్టాడు. ఈ దుర్ఘటనలో ఇద్దరు ఐటీ నిపుణులు మృతి చెందారు. అప్పటి జేజేబీ జడ్జిలు నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఆ షరతులలో రోడ్డు భద్రతపై 300 పదాల వ్యాసం రాయాలని ఉంది. ఇది జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. -
ట్యాంక్బండ్ వద్ద ఉద్రిక్తత.. గణేశ్ ఉత్సవ సమితి Vs పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ట్యాంక్బండ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ట్యాంక్బండ్ పై వినాయక నిమజ్జనం లేదంటూ పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, భారీ కేడ్లను భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నేతలు తొలగించారు. ట్యాంక్ బండ్ ఏర్పాటుచేసిన జాలీలను తొలగించిన సమితి నేతలు.. వినాయకుని నిమజ్జనం చేశారు.ట్యాంక్బండ్పై వినాయక నిమజ్జనం అనేక సంవత్సరాలుగా జరుగుతుందని.. కొత్త రూల్స్ తీసుకువచ్చి భక్తుల మనోభావాలను ప్రభుత్వం, పోలీసులు దెబ్బతీస్తున్నారని ఉత్సవ సమితి నేతలు మండిపడుతున్నారు. 2022, 23లో కూడా ఇదే విధంగా చెప్పారు. కానీ చివరకు ట్యాంక్ బండ్లో గణేష్ నిమజ్జనాలు జరిగాయన్నారు.‘‘ప్రభుత్వం వెంటనే ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జన ఏర్పాట్లు ఈ రోజు మధ్యాహ్నం వరకు చేయాలి.. లేని పక్షంలో ఈ రోజు అన్ని వినాయక మండపాల నిర్వాహకులకు సమాచారం తెలియజేసి రేపు నగరా వ్యాప్తంగా ఆందోళన చేసి నగరాన్ని స్తంభింప చేస్తాం. ఎక్కడికక్కడ మండపాల్లో వినాయకులను అదే విధంగా ఉంచుతాం’’ అంటూ భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రాజావర్ధన్ రెడ్డి హెచ్చరించారు.ఇదీ చదవండి: గణేశ్ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు -
నైతిక ఉల్లంఘన: థాయ్లాండ్ ప్రధాని తొలగింపు
బ్యాంకాక్: థాయ్లాండ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ ప్రధాన మంత్రిపై వేటు వేస్తూ.. రాజ్యాంగ న్యాయ స్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. నైతిక ఉల్లంఘన కేసులో స్రెత్తా తవిసిన్ను ప్రధాన మంత్రి పదవి నుంచి తొలిగించినట్లు వెల్లడించింది. గతంలో జైలు శిక్ష అనుభవించిన న్యాయవాదిని మంత్రివర్గంలో నియమించటంతో థావిసిన్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని కోర్టు న్యాయమూర్తి పుణ్య ఉద్చాచోన్ అన్నారు. విచారణ సందర్భంగా ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో నలుగురు న్యాయమూర్తులు తవిసిన్ను ప్రధాని పదవి నుంచి తొలగించాలని నిర్ణయించారు. మరోవైపు.. తక్షణమే తమ ఆదేశాలను అమలు చేయాలని కోర్టు ఆదేశించింది.ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన దేశ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో పిచిత్ చుయెన్బాన్ను ప్రధాని కార్యాలయ మంత్రిగా తవిసిన్ నియమించారు. అయితే ఆయన 2008లో మాజీ ప్రధాని తక్సిన్ షినవత్రాకు సంబంధించిన న్యాయమూర్తికి లంచం ఇచ్చిన కేసులో కోర్టు ధిక్కార ఆరోపణలు ఎదుర్కొని ఆరు నెలల జైలు శిక్ష అనుభవించారు. ఏప్రిల్లో పిచిత్ మంత్రిగా నియామకం జరిగిన నెల రోజుల తర్వాత దేశ మిలిటరీ నియమించి 40 మంది మాజీ సెనేటర్ల బృందం నైతిక ఉల్లంఘిన కింద కేసు నమోదు చేశారు. ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రధాని తొలిగించిన అనంతరం కేబినెట్ తక్షణమే రద్దు చేయబడదని, థాయ్లాండ్ కొత్త ప్రధానిని ఎన్నుకునే వరకు కేర్ టేకర్ ప్రధాని ఉంటారని అధికారులు పేర్కొన్నారు. -
బ్యాటరీ మింగేసిన చిన్నారి
పశ్చిమగోదావరి: ఆడుకునే బొమ్మలో ఉండే చిన్న బ్యాటరీని పొరపాటున 11 నెలల పాప మింగేసింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగింది. ఈ విషయాన్ని గుర్తించిన చిన్నారి తల్లి.. వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు చిన్నారిని పరీక్షించి విజయవాడకు తీసుకెళ్లాలని రిఫర్ చేశారు. దీంతో హుటాహుటిన అంబులెన్స్లో విజయవాడలోని ఆయుష్ హాస్పిటల్కు తీసుకువెళ్లారు.డాక్టర్లు చిన్నారి పొట్టను ఎక్స్రే తీసి పరిశీలించారు. కడుపు, ఛాతి మధ్య భాగంలో బ్యాటరీ ఇరుక్కున్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఆపరేషన్ అవసరం లేకుండానే వైద్యులు ఎండోస్కోపీ ద్వారా చిన్నారి పొట్టలోని బ్యాటరీని బయటకు తీశారు. ఘటన జరిగిన వెంటనే తల్లిదండ్రులు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తీసుకురావడంతో ప్రమాదం తప్పిందని వైద్యులు వెల్లడించారు. -
10 యాప్ సంస్థలపై గూగుల్ చర్యలు
న్యూఢిల్లీ: సర్వీస్ ఫీజు చెల్లింపుల వివా దం కారణంగా టెక్ దిగ్గజం గూగుల్ పలు యాప్ సంస్థలపై చర్యలకు ఉపక్రమించింది. వాటిని తమ ప్లేస్టోర్ నుంచి తొలగించే ప్రక్రియ ప్రారంభించింది. అనేక అవకాశాలు ఇచి్చనప్పటికీ, తమ ప్లాట్ఫామ్తో ప్రయోజనం పొందుతున్న ‘పేరొందిన’ పది సంస్థలు ఫీజులు చెల్లించడం లేదని సంస్థ పేర్కొంది. అయితే, గూగుల్ సదరు సంస్థల పేర్లను నిర్దిష్టంగా వెల్లడించలేదు. కానీ, షాదీ, మ్యాట్రిమోనీడాట్కా మ్, భారత్ మ్యాట్రిమోనీ వంటి యాప్స్ కోసం ఆండ్రాయిడ్ ఫోన్లపై సెర్చి చేస్తే వాటి పేర్లు కనిపించకపోవడంతో జాబితాలో అవి ఉన్నట్లుగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే బాలాజీ టెలీఫిలిమ్స్కి చెందిన ఆల్ట్ (గతంలో ఆల్ట్బాలాజీ), ఆడియో ప్లాట్ఫాం కుకు ఎఫ్ఎం, డేటింగ్ సర్వీస్ యాప్ క్వాక్క్వాక్, ట్రూలీ మ్యాడ్లీ కూడా ప్లేస్టోర్ నుంచి మాయమయ్యాయి. ఇన్–యాప్ పేమెంట్స్పై గూగుల్ 11 నుంచి 26 శాతం ఫీజులను విధిస్తుండటంపై నెలకొన్న వివాదం ఈ పరిణామానికి దారి తీసింది. ప్లాట్ఫాం ఫీజుపై పోరాడుతున్న కంపెనీలకు అనుకూలంగా సుప్రీం కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో నిబంధనలను పాటించని యాప్లను గూగుల్ తొలగించడం ప్రారంభించింది. ఉచిత డిజిటల్ మార్కెట్ప్లేస్ను ఆఫర్ చేస్తూ ఇండస్ యాప్ స్టోర్ను ఫోన్పే ప్రవేశపెట్టిన తరుణంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది గుత్తాధిపత్య ధోరణి..: కుకు ఎఫ్ఎం కాగా, గూగుల్ గుత్తాధిపత్య ధోరణితో వ్యవహరిస్తోందని కుకు ఎఫ్ఎం సహ–వ్యవస్థాపకుడు వినోద్ కుమార్ వ్యాఖ్యానించగా, ఇది భారత్లో ఇంటర్నెట్కు దుర్దినంగా భారత్ మ్యాట్రిమోనీ వ్యవస్థాపకుడు మురుగవేల్ జానకిరామన్ అభివరి్ణంచారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ పెండింగ్లో ఉన్నందున ఎటువంటి చర్యలు తీసుకోవద్దని, ఏ యాప్ను డీలిస్ట్ చేయొద్దని గూగుల్కి ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ (ఏఐఎంఏఐ) సూచించింది. -
జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయండి
ఖైరతాబాద్ (హైదరాబాద్): ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని ఆయన ఘాట్ వద్ద నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫొటోతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలంటూ బాలకృష్ణ ఆదేశించడం వివాదానికి దారితీసింది. బాలకృష్ణ ఆదేశాలతో ఆయన అనుచరులు ఫ్లెక్సీలు తొలగించడం, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వాటిని తిరిగి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడం, పోలీసులు అడ్డుకోవడంతో ఘాట్ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్టీఆర్కు కుటుంబసభ్యుల నివాళి గురువారం ఎన్టీఆర్ వర్ధంతి పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్లోని ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. తెల్లవారు జామున జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్లు.. ఎన్టీఆర్ ఘాట్కు విచ్చేసి తాతకు నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ కుమారు డు, సీనియర్ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, నంద మూరి రామకృష్ణ, సుహాసినితో పాటు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నివాళులర్పించారు. అయితే ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లోపల, ప్రవేశ ద్వా రం రెండువైపులా జూనియర్ ఎన్టీఆర్ అభిమాను లు.. ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్లతో కూడిన భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. తండ్రికి నివాళులర్పించి బయటకు వచ్చే క్రమంలో ఈ ఫ్లెక్సీలను చూసిన బాలకృష్ణ.. వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించడంతో, ఆయన అనుచరులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించి కొన్నింటిని రోడ్డు ఫుట్పాత్పై, మరికొన్ని ఘాట్ పార్కింగ్ ప్రాంతంలో కనిపించకుండా పెట్టారు. జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం తమ హీరో ఫ్లెక్సీలు తొలగించారన్న విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. బయట ఉంచిన ఫ్లెక్సీలను తిరిగి లోపల పెట్టేందుకు అనుమతించాలని పోలీసులను కోరారు. వారు అందుకు అనుమతించకపోవడంతో అభిమానులు ఘాట్ లోపల తొలగించకుండా వదిలేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలకు పూలమాల వేసి పాలాభిషే కం చేశారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన జూని యర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం అధ్యక్షుడు ఫుట్పాత్పై ఉంచిన రెండు ఫ్లెక్సీలను ఘాట్ లోపలికి తీసుకువచ్చారు. ఇది గమనించిన పోలీ సులు.. బయట ఉన్న ఫ్లెక్సీలు లోపలికి ఎందుకు తీసుకువచ్చారంటూ.. వెంటనే వాటిని యథా స్థానంలో పెట్టాలని ఆదేశించారు. వారు విన్పించుకోక పోవడంతో అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రి క్తత నెలకొంది. చివరకు పోలీసులు లోపలికి తీసుకువచ్చిన ఫ్లెక్సీలను తిరిగి బయట పెట్టించి వారిని అక్కడినుంచి పంపించి వేయడంతో ఉద్రి క్తత చల్లారింది. కాగా నివాళులర్పించిన అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ..తెలుగు బిడ్డ బొడ్డు కోయకముందే రాజకీయాలంటే ఏంటో తెలిపిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. సాహసోపేత పథకాల అమలుతో పేదవాడి ఆక లి తీర్చి, విప్లవాత్మక, సామాజిక మార్పులు తీసుకువచ్చిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. అందుకే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారని చెప్పారు. -
అన్నపూరణి ఆగింది
బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అన్నపూరణికి దేశంలోనే నంబర్ వన్ చెఫ్ కావాలన్నది ఆశయం. తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి మాంసాహార వంటలు చేసేందుకు సిద్ధం అవుతుంది. అది మాత్రమే కాదు.. ముస్లిమ్ యువకుడితో ప్రేమలో పడుతుంది. నయనతార టైటిల్ రోల్లో నటించిన ‘అన్నపూరణి’ చిత్రం ప్రధానాంశం ఇది. ‘ది గాడెస్ ఆఫ్ ఫుడ్’ అనేది ఉపశీర్షిక. నీలేష్ కృష్ణ దర్శకత్వంలో జతిన్ సేథీ, ఆర్. రవీంద్రన్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలై, అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఓటీటీ ప్రేక్షకులను కొంత ఆకట్టుకోగలిగింది. ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ఓ బ్రాహ్మణ యువతి మాంసాహారం వండటం, ముస్లిమ్ యువకుడితో ప్రేమలో పడటం అనే కథాంశం వివాదమైంది. పైగా రాముడు కూడా మాంసాహారం తిన్నాడన్నట్లు, వాల్మీకి అయోధ్య కాండలో ఉందన్నట్లు ఓ డైలాగ్ కూడా ఉంది. ఓ దేవత (అన్నపూర్ణ) మీద టైటిల్ పెట్టి ఇలాంటి సినిమా తీయడం తగదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దాంతో ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని కొందరు బ్రాహ్మణ సంఘం నాయకులు డిమాండ్ మొదలుపెట్టారు. అలాగే మహారాష్ట్రకు చెందిన శివసేన మాజీ నేత రమేశ్ సోలంకి ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ పై తగిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నయనతారపై కూడా కేసు నమోదైంది. వివాదం పెద్దదవుతుండటంతో ఈ సినిమా స్ట్రీమింగ్ను నిలిపివేస్తున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. ఆ విధంగా ఓటీటీలో ‘అన్నపూరణి’ ఆట ఆగింది. -
2500 యాప్స్ తొలగించిన గూగుల్ - నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
చాలీ చాలని జీతాలతో పనిచేసే చాలామంది ఉద్యోగులు అత్యవసర సమయంలో బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకోవడం.. లేకుంటే కొన్ని యాప్స్ నుంచి ఇన్స్టంట్ లోన్స్ తీసుకోవడం ఎక్కువైపోతోంది. బ్యాంకుల్లో లోన్ తీసుకునే వారి విషయం పక్కన పెడితే.. యాప్స్ ద్వారా లోన్స్ తీసుకున్న వారు ఏకంగా ప్రాణాలే తీసుకున్న సందర్భాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి వాటిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది, తాజాగా దీని గురించి కేంద్ర ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' లోక్సభలో మాట్లాడారు. 2021 ఏప్రిల్ నుంచి 2022 జూలై మధ్య కాలంలో గూగుల్ సంస్థ తన ప్లే స్టోర్ నుంచి ఏకంగా 2500 మోసపూరిత లోన్ యాప్లను తొలగించినట్లు డిసెంబర్ 18న లోక్సభలో వెల్లడైన ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ప్రజలను మోసం చేస్తున్న యాప్ల మీద కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో వర్షానికి మొలిచిన పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఫ్రాడ్ లోన్ యాప్ల మీద కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిసి పనిచేస్తున్నట్లు కూడా కేంద్రమంత్రి వెల్లడించారు. ఫేక్ లోన్ యాప్స్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇలాంటి వాటిని నివారించడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే సరిపోతుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. జనం కూడా ఫ్రాడ్ లోన్ యాప్ల గురించి అవగాహన పెంచుకోవాలని, అలాంటప్పుడే మోసాల నుంచి బయటపడే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: 2024లో బంగారం డిమాండ్ మరింత పైపైకి - కారణం ఇదే అంటున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ మోసపూరిత రుణ యాప్లను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలలో భాగంగా, భారత ప్రభుత్వ చట్టపరమైన నియమాలను పాటిస్తున్న యాప్ల జాబితాను ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (Meity) గూగుల్తో భాగస్వామ్యం చేసింది. ఈ యాప్లన్నీ కూడా తప్పకుండా ప్రభుత్వ నియమాలను లోబడి పనిచేయాల్సి ఉంటుంది. -
డేంజర్ యాప్స్.. మీ ఫోన్లో ఇప్పుడే తొలగించండి..
వినియోగదారుల సమాచార భద్రతకు ముప్పుగా పరిణమించిన పలు మొబైల్ యాప్లను గూగుల్ ఇటీవల తన ప్లేస్టోర్ నుంచి తొలగించింది. సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈసెట్(ESET) ఈ ఏడాది గూగుల్ ప్లేస్టోర్లో 18 లోన్ యాప్లను స్పైలోన్ యాప్లుగా గుర్తించింది. కోట్లాది డౌన్లోడ్స్ ఉన్న ఈ లోన్యాప్లు వినియోగదారుల ఫోన్ల నుంచి వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఈ సమాచారాన్ని రుణగ్రహీతలను బ్లాక్మెయిల్ చేసి అధిక వడ్డీ రాబట్టడానికి దుర్వినియోగం చేస్తున్నాయి. ఇటువంటి యాప్లకు సంబంధించిన వివరాలను ఈసెట్ పరిశోధకులు తెలియజేశారు. ఈ యాప్లు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియాలోని వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈసెట్ గుర్తించిన 18 డేంజర్ యాప్లలో 17 యాప్లను గూగుల్ ఇప్పటికే తొలగించింది. ఒకటి మాత్రం ఇప్పటికీ యాప్ స్టోర్లో అందుబాటులో ఉంది. అయితే ఇది యాక్టివ్ స్థితిలో లేదు. గూగుల్ ప్లేస్టోర్లో తొలగించిన ఈ యాప్ను ఇక్కడ ఇస్తున్నాం.. ఇవి మీ మొబైల్ ఫోన్లో ఉంటే ఇప్పుడే తొలగించండి.. డేంజర్ యాప్స్ ఇవే.. ఏఏ క్రెడిట్ (AA Kredit) అమోర్ క్యాష్ (Amor Cash) గేయబాక్యాష్ (GuayabaCash) ఈజీ క్రెడిట్ (EasyCredit) క్యాష్వావ్ (Cashwow) క్రెడిబస్ (CrediBus) ఫ్లాష్లోన్ (FlashLoan) ప్రెస్టమోస్క్రెడిటో (PréstamosCrédito) ప్రెస్టమోస్ డి క్రెడిట్-యుమికాష్ (Préstamos De Crédito-YumiCash) గో క్రెడిటో (Go Crédito) ఇన్స్టంటానియో ప్రెస్టమో (Instantáneo Préstamo) కార్టెరా గ్రాండే (Cartera grande) రాపిడో క్రెడిటో (Rápido Crédito) ఫైనప్ లెండింగ్ (Finupp Lending) ఫోర్ఎస్ క్యాష్ (4S Cash) ట్రూనైరా (TrueNaira) ఈజీ క్యాష్ (EasyCash) ఇది కూడా చదవండి: టెక్ ప్రపంచంలో సంచలనం.. ఈ యేటి మేటి సీఈవో ఈయనే.. -
ఇనుప కంచె తొలగింది
సాక్షి, హైదరాబాద్: ప్రజాభవన్గా మారిన ప్రగతి భవన్ ఎదుట సుదీర్ఘకాలంగా ఉన్న ఇనుప కంచెను జీహెచ్ఎంసీ అధికారులు గురువారం తొలగించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే రేవంత్రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో ఈ చర్యలు తీసుకున్నారు. సిటీ ట్రాఫిక్ చీఫ్ జి.సుదీర్బాబు సైతం ఆ ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఒకట్రెండు రోజుల్లో ఆ రోడ్డును పూర్తిస్థాయిలో వాహన చోదకుల కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు. కిరణ్కుమార్రెడ్డి హయాంలో మొదలు.. బేగంపేటలోని గ్రీన్లాండ్స్ చౌరస్తా సమీపంలో చాలా ఏళ్లుగా ముఖ్యమంత్రి నివాసం, క్యాంప్ ఆఫీస్ కొనసాగుతున్నాయి. వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో అక్కడ ముఖ్యమంత్రి నివాసం నిర్మితమైంది. ఆయన అందులో బస చేసినప్పుడు రహదారిపై ఎలాంటి అడ్డంకులు ఉండేవి కాదు. కేవలం సీఎం నివాసంలోకి ప్రవేశించడానికే అనుమతులు అవసరమయ్యేవి. అయితే నల్లారి కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక అప్పటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తొలిసారిగా ఆ రహదారిలో బారికేడ్లు వెలిశాయి. తొలినాళ్లలో తాత్కాలికంగా 8 అడుగుల ఎత్తున వాటిని ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో ప్రగతి భవన్ నిర్మించిన తర్వాత రోడ్డుపైకి ఇనుప గ్రిల్స్ వచ్చాయి. వాటి ప్రభావంతో బేగంపేట మార్గంలో పీక్ అవర్స్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడేవి. సీఎం రేవంత్ ఆదేశంతో... మంగళవారం తనను ముఖ్యమంత్రిగా ప్రకటించిన వెంటనే మాట్లాడిన రేవంత్రెడ్డి మాట్లాడుతూ ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మారుస్తున్నట్లు, అక్కడే ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. శుక్రవారం నుంచి ప్రజాదర్బార్ ప్రారంభం కానుండటంతో అందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంతోపాటు అడ్డంకులు తొలగించాలని అధికారులను ఆదేశించారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు గురువారం ఉదయం నుంచి అవసరమైన చర్యలు ప్రారంభించారు. -
ఓపెన్ ఏఐ సహ వ్యవస్థాపకుడికి ఉద్వాసన
శాన్ ఫ్రాన్సిస్కో: చాట్ జీపీటీకి రూపకల్పన చేసిన ఓపెన్ ఏఐ కంపెనీ సహవ్యవస్థాపకుడు, సీఈవో శామ్ ఆల్ట్మన్కు ఆ సంస్థ ఉద్వాసన పలికింది. కంపెనీ బోర్డుకు విశ్వాసం కలిగేలా ఆయన వ్యవహరించడం లేదని ఓపెన్ ఏఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఓపెన్ ఏఐకి సారథిగా ఆయన సామర్థ్యంపై కంపెనీ బోర్డుకు విశ్వాసం పోయిందని పేర్కొంది. ఆయన స్థానంలో ఓపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ అధికారిణి మిరా మురాటికి తాత్కాలిక సీఈవో బాధ్యతలను అప్పగిస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. -
కునో నేషనల్ పార్కులోని 6 చీతాలకు రేడియో కాలర్ల తొలగింపు
భోపాల్: మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కు(కేఎన్పీ)లో ఉన్న చీతాల్లో ఆరింటికి రేడియో కాలర్లను తొలగించినట్లు అధికారులు సోమవారం తెలిపారు. కేఎన్పీ వైద్యులు, నమీబియా దక్షిణాఫ్రికాల నుంచి వచ్చిన నిపుణులు వీటి ఆరోగ్య పరిస్థితిపై పరిశీలన జరుపుతారని వెల్లడించారు. కేఎన్పీలో ప్రస్తుతం 11 చీతాలున్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి 5 పెద్ద చీతాలు, 3 కూనలు చనిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేఎన్పీలో ఉన్న ఆరు చీతాల ఆరోగ్యాన్ని పరిశీలిస్తామని, మరో నాలుగు చీతాలకు ఏర్పాటు చేసిన రేడియో కాలర్లను కూడా తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. రేడియో కాలర్ల వల్లే చీతాలు మృతి చెంది ఉంటాయనే అనుమానాలున్నాయా అన్న ప్రశ్నకు.. అటువంటిదేమీ లేదని ఆ అధికారి అన్నారు. ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసే అవసరమున్న చీతాలకు మాత్రమే రేడియో కాలర్లను తొలగిస్తున్నామని వివరించారు. -
తీవ్ర ఉద్రిక్తత.. పేదల గుడిసెలు కూల్చివేత
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా కలెక్టరేట్ సమీపంలో ప్రభుత్వ భూమిలో వెలసిన గుడిసెలను అధికారులు తొలగించారు. 255/1 సర్వే నెంబర్ లోని పదెకరాల భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలను మున్సిపల్ రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. తొలగింపును అడ్డుకునేందుకు పేదలు యత్నించడంతో భారీగా పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో అధికారులతో గుడిసెవాసుల వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు వెళ్ళిపోవాలంటూ గుడిసె వాసుల ఆందోళన చేపట్టారు. గుడిసె వాసులను బలవంతంగా పోలీసులు నెట్టివేసి గుడిసెలు తొలగించారు. కాగా అధికారులు పేదలు వేసుకున్న గుడిసెల తొలగింపు ప్రక్రియ చేపట్టడం ఇది నాలుగోసారి. -
మీకు మాత్రం అన్యాయం జరిగింది సార్!
న్యాయ వ్యవస్థకు న్యాయం జరిగింది కానీ.. మీకు మాత్రం అన్యాయం జరిగింది సార్! -
రాత్రి అదిరిపోయే పార్టీ ఇచ్చి...ఉదయాన్నే ఉద్యోగులను పీకేసిన కంపెనీ..
-
హైదరాబాద్ లో తెలుగుతల్లి, పొట్టిశ్రీరాములు విగ్రహాల తొలగింపు
-
చరిత్ర పుస్తకాల్లో ‘గాంధీ, ఆరెస్సెస్’ తొలగింపు
న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం రాగానే హిందూ, ముస్లింల మధ్య గొడవలు, సయోధ్య కోసం గాంధీ విఫలయత్నం, ఆయన హత్య తర్వాత ఆరెస్సెస్పై నిషేధం, గోధ్రా అల్లర్ల తర్వాత ఘటనలు తదితరాలను పన్నెండో తరగతి చరిత్ర పాఠ్య పుస్తకాల నుంచి ఎన్సీఈఆర్టీ తొలగించింది. హేతుబద్ధీకరణలో భాగంగా ఏయే అంశాలను తొలగించబోతున్నదీ తెలుపుతూ మండలి గత జూన్లో విడుదల చేసిన బుక్లెట్లో వీటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. హిందూ అతివాదంపై గాంధీ అభిప్రాయాలు వంటి అంశాలను తొలగించడం భావితరాలకు వాస్తవాలు తెలియకుండా చేసే కుటిల యత్నమని ఆరోపించింది. బీజేపీ, ఆరెస్సెస్ ఎంత ప్రయత్నించినా చరిత్రను మార్చలేవని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. విషయ నిపుణుల సూచన మేరకే వాటిని తొలగించినట్టు ఎన్సీఈఆర్టీ చీఫ్ దినేశ్ సాక్లానీ చెప్పారు. ఈ విషయంలో రాద్ధాంతం అనవసరమని అభిప్రాయపడ్డారు. -
వైద్యుల పొరపాటు.. యువకుడి మర్మాంగం తొలగింపు.. పరిహారంగా..
వైద్యులు చికిత్స అందించే సమయంలో చేసిన పొరపాటు ఓ యువకుడికి శాపంగా మారింది. అతని మర్మాంగాన్ని పూర్తిగా తొలిగించాల్సి వచ్చింది. దీంతో అతడు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కోర్టు నుంచి అనుకులంగా తీర్పు వచ్చింది. ఫలితంగా ఆస్పత్రి యాజమాన్యం అతనికి భారీ పరిహారం చెల్లించింది. ఫ్రాన్స్ నాంటెస్ యూనివర్సిటీలో 2014లో ఈ ఘటన జరిగింది. అప్పుడు యువకుడి వయసు 30 ఏళ్లు. పెళ్లి కూడా అయింది. అయితే అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లిన అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా కార్సినోమా క్యాన్సర్ అని తేలింది. అంటే చర్మ ఎపిథీలియల్ కణజాలం లేదా అంతర్గత అవయవాల టిష్యూలకు క్యాన్సర్ సోకింది. పొరపాటుతో తలకిందులు.. అయితే వైద్యులు అతనికి చికిత్స అందించారు. టిష్యూల నుంచి క్యాన్సర్ను పూర్తిగా తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో చేసిన పొరపాట్లు అతనికి మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. క్యాన్సర్ మర్మాంగానికి కూడా సోకింది. దీంతో భరించలేని నొప్పితో అతను నరకయాతన అనుభవించాడు. ఒకానొక సమయంలో కట్టర్తో స్వయంగా తానే మర్మంగాన్ని తొలగించుకునేందుకు ప్రయత్నించాడు. కానీ భార్య వద్దని చెప్పడంతో ఆగిపోయాడు. కానీ రానురాను అతని క్యాన్సర్ తీవ్రత పెరిగింది. మొత్తం మర్మాంగానికి అది సోకింది. ఇక గత్యంతరం లేదని భావించిన వైద్యులు యువకుడి మర్మాంగాన్ని పూర్తిగా తొలగించారు. అలా చేయకపోతే అతని ప్రాణాలు పోయేవని చెప్పారు. అయితే తనకు జరిగిన అన్యాయంపై యువకుడు న్యాయపరంగా పోరాడాడు. వైద్యులు పొరపాటు వల్లే మర్మాంగాన్ని తొలగించుకోవాల్సి వచ్చిందని, ఆ బాధ వర్ణనాతీతం అని వాపోయాడు. ఆస్పత్రి యాజమాన్యం తమ తప్పును అంగీకరించి యువకుడికి రూ.54 లక్షలు పరిహారంగా ఇచ్చింది. చదవండి: అఫ్గాన్లో విద్యార్థినుల నిరసన గళం -
హ్యారీకి అవమానం
లండన్: రాణి అస్తమయం నేపథ్యంలో విభేదాలు పక్కన పెట్టి దగ్గరవుతున్నారని భావించిన రాకుమారులు విలియం, హ్యారీ మధ్య దూరాన్ని మరింతగా పెంచే ఉదంతం తాజాగా చోటుచేసుకుంది. ఇది హ్యారీకి తీరని అవమానం కూడా మిగిల్చిందట. రాణి ఎలిజబెత్–2 మనవలు, మనవరాళ్లు శనివారం రాత్రి ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. విలియంతో పాటు హ్యారీ కూడా రాజు చార్లెస్–3 ప్రత్యేక అనుమతితో ఈ సందర్భంగా సైనిక దుస్తులు ధరించారు. కానీ వాటిపై ఉండాల్సిన రాణి అధికార చిహ్నమైన ‘ఈఆర్’ను తొలగించారు. పెద్ద కుమారుడైన యువరాజు విలియం సైనిక దుస్తులపై మాత్రం ఈఆర్ చిహ్నం అలాగే ఉంచారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక హ్యారీకి గుండె పగిలినంత పనైందట. తండ్రితోనూ సోదరునితోనూ హ్యారీకి సత్సంబంధాలు లేవన్న విషయం తెలిసిందే. రాచకుటుంబం అభ్యంతరాలను కాదని ఆయన అమెరికా నటి మెగన్ మార్కెల్ను పెళ్లాడినప్పటినుంచీ విభేదాలు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలో హ్యారీ దంపతులు రాచరిక హోదా వదులుకున్నారు. దాంతో ఆయన సైనిక దుస్తులు ధరించే అర్హత కోల్పోయారు. ‘‘నాయనమ్మ అంత్యక్రియల సందర్భంగా ప్రత్యేక అనుమతితో వాటిని ధరిస్తే ఇంతటి అవమానం జరిగిందంటూ హ్యారీ కుమిలిపోయారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేసిన పనేనని భావిస్తున్నారు. ఎందుకంటే సైనిక దుస్తులు ధరించే అర్హత లేని ఎలిజబెత్–2 కుమారుడు ప్రిన్స్ ఆండ్రూ సైనిక దుస్తులపై కూడా అధికార చిహ్నాన్ని యథాతథంగా కొనసాగించారు. కేవలం తన దుస్తులపై మాత్రమే తొలగించడం హ్యారీకి మరింత మనస్తాపం కలిగించింది’’ అని ఆయన మిత్రున్ని ఉటంకిస్తూ సండే టైమ్స్ కథనం పేర్కొంది. అంతేకాదు, ఆదివారం రాత్రి బకింగ్హాం ప్యాలెస్లో దేశాధినేతలకు చార్లెస్–3 అధికారిక విందు కార్యక్రమానికి కూడా హ్యారీ దంపతులను దూరంగా ఉంచారు. గురువారం హ్యారీ 38వ పుట్టిన రోజు. ఆ సందర్భంగా మెగన్తో కలిసి కార్లో వెళ్తుండగా విలియం తన ముగ్గురు పిల్లలను స్కూలు నుంచి కార్లో తీసుకొస్తూ ఎదురయ్యారు. ఇద్దరూ కార్ల అద్దాలు దించుకుని క్లుప్తంగా మాట్లాడుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయారట. -
దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీ హైకమాండ్ గట్టి షాక్..
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరికి పార్టీ హైకమాండ్ గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఒడిశా పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ బాధ్యతల్లో కోతలు విధించగా తాజాగా ఛత్తీస్గఢ్ బాధ్యతల నుంచి పురందేశ్వరిని పూర్తిగా తప్పించారు. 2020 నవంబర్ నుంచి ఆమె ఛత్తీస్గఢ్, ఒడిశా బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్గా ఉన్నారు. పురందేశ్వరి స్థానంలో రాజస్థాన్కు చెందిన కీలక నాయకుడు ఓం మాథుర్ను ఛత్తీస్గఢ్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్గా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తాజాగా అక్కడ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఇన్చార్జ్ను మారుస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. చదవండి: బీజేపీ బిగ్ ప్లాన్.. ప్రత్యర్థులకు అంతుచిక్కని ఎత్తుగడలు! యూపీ విజయంలో కీలక పాత్ర ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు అత్యంత సన్నిహితుడిగా భావించే ఓం మాథుర్ గతంలో గుజరాత్ ఇన్చార్జ్గా, గతేడాది ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇన్చార్జ్గా పనిచేశారు. యూపీ విజయంలో మాథుర్ తనదైన శైలిలో కీలక పాత్ర పోషించారు. ఏడాదిన్నరగా పురందేశ్వరి అంచనాలకు తగ్గట్లుగా పార్టీ బలోపేతానికి కృషి చేయని కారణంగానే ఆమెను తప్పించారనే చర్చ జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా మార్పు.. వచ్చే సార్వత్రిక ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ క్షేత్రస్థాయిలో భారీ మార్పులు చేపట్టింది. అందులో భాగంగా 15 రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్లుగా బలమైన నేతలకు బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా వచ్చే ఏడాది డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఛత్తీస్గఢ్లో అధికార కాంగ్రెస్ను గద్దె దింపేందుకు బీజేపీ సన్నద్ధమైంది. ఒడిశా ఇన్చార్జ్గా ఉన్న పురందేశ్వరి బాధ్యతల్లో హై కమాండ్ కోత విధించింది. అంతేకాకుండా ఛత్తీస్గఢ్కు మరో ఇన్చార్జ్గా జాతీయ ప్రధాన కార్యదర్శి, అమిత్ షాకి సన్నిహితుడైన సునీల్ బన్సల్ను నియమించింది. బన్సల్ రంగంలోకి దిగడంతో పురందేశ్వరి పాత్ర నామమాత్రమే అనే చర్చ జరుగుతోంది. రానున్న రోజుల్లో మరిన్ని మార్పులు చోటు చేసుకొనే అవకాశాలున్నాయని కీలక నేత ఒకరు వెల్లడించారు. -
2 వేల లోన్ యాప్స్ తొలగింపు
న్యూఢిల్లీ: నిబంధనల ఉల్లంఘన, తప్పుదోవ పట్టించే సమాచారం ఇవ్వడం, వివాదాస్పద ఆఫ్లైన్ ధోరణులు తదితర అంశాల కారణంగా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ ఇండియా ప్లే స్టోర్ నుంచి 2,000 పైగా లోన్ యాప్స్ను తొలగించినట్లు టెక్ దిగ్గజం గూగుల్ సీనియర్ డైరెక్టర్ సైకత్ మిత్రా తెలిపారు. రుణాల యాప్ల సమస్య ఇప్పటికే తారా స్థాయికి చేరుకుందని, దీనిపై అంతా దృష్టి పెడుతున్న నేపథ్యంలో ఇది ఇకపై క్రమంగా తగ్గుముఖం పట్టొచ్చని మిత్రా వివరించారు. రాబోయే రోజుల్లో నిబంధనలను మరింత కఠినతరం చేసే అంశాన్ని కూడా సంస్థ పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. లోన్ యాప్ల సమస్య ఒకో మార్కెట్లో ఒకో రకంగా ఉంటోందని మిత్రా తెలిపారు. అమెరికాలో పోటీ సంస్థలను దెబ్బతీసే విధమైన యాప్ల సమస్య ఉండగా.. భారత్లో తప్పుదోవ పట్టించే, నిబంధనలను ఉల్లంఘించడం రూపంలో యాప్ల సమస్య ఉన్నట్లు పేర్కొన్నారు. తాము కార్యకలాపాలు సాగించే అన్ని దేశాల్లోనూ నియంత్రణ నిబంధనలను పాటించడానికి కట్టుబడి ఉన్నామని మిత్రా స్పష్టం చేశారు. సైబర్సెక్యూరిటీపై రోడ్షోలు.. ఆన్లైన్ భద్రతపై అవగాహన కల్పించే దిశగా భారత్లో వివిధ నగరాల్లో సైబర్సెక్యూరిటీ రోడ్షోలు నిర్వహించనున్నట్లు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా తెలిపారు. 1,00,000 మంది డెవలపర్లకు శిక్షణ కల్పించనున్నట్లు, అలాగే డిజిటల్ భద్రతను ప్రోత్సహించే దిశగా వివిధ సంస్థలకు గూగుల్డాట్ఆర్గ్ 2 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 16 కోట్లు) నిధులు గ్రాంట్గా అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కలెక్టివ్ గుడ్ ఫౌండేషన్, పాయింట్ ఆఫ్ వ్యూ, హెల్ప్ఏజ్ ఇండియా తదితర స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. సైబర్ ముప్పుల నుంచి డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు పటిష్టమైన రక్షణ కల్పించే ఉద్దేశ్యంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు గుప్తా వివరించారు. డిజిటల్ లావాదేవీలను సురక్షితంగా నిర్వహించే క్రమంలో మెరుగైన విధానాలు పాటించేలా ఇంటర్నెట్ యూజర్లను ప్రోత్సహించే అవగాహన కార్యక్రమాన్ని కూడా వివిధ భాషల్లో గూగుల్ ఆవిష్కరించింది. -
ట్విటర్లో భారీ కుదుపు.. టాప్ ఎగ్జిక్యూటివ్లకి ఉద్వాసన
మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విటర్ పేరు నెల రోజులుగా అందరి నోళ్లలో నానుతోంది. ఈ కంపెనీ గురించి రోజుకో వార్త ప్రచారంలోకి వస్తోంది. త్వరలోనే ఈలాన్ మస్క్ చేతిలోకి ఈ సంస్థ వెళ్లనుండగా టాప్ మేనేజ్మెంట్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ కంపెనీకి చెందిన టాప్ ఎగ్జిక్యూటీవ్లను బయటకు సాగనంపారు. దయచేసి వెళ్లిపోండి ఈలాన్ మస్క్ భారీ డీల్తో ట్విటర్ను సొంతం చేసుకుంది మొదలు వరుసగా ఏదో ఘటన ఆ సంస్థలో జరుగుతూనే ఉంది. ట్విటర్ సీఈవో పరాగ్ అగ్రావాల్ను బయటకు పంపుతారని, పాలసీ హెడ్ గద్దె విజయకు ఎగ్జిట్ తప్పదంటూ వార్తలు వినవస్తూనే ఉన్నాయి. అయితే అనూహ్యంగా ట్విటర్ హెడ్ ఆఫ్ ప్రొడక్ట్గా పని చేస్తున్న టాప్ ఎగ్జిక్యూటీవ్ బెక్పూర్ని సంస్థను వీడ వెళ్లాల్సిందిగా సీఈవో పరాగ్ అగర్వాల్ కోరాడు. అదే విధంగా రెవెన్యూ హెడ్ బ్రూస్ ఫలాక్ను పక్కన పెట్టారు. ఊహించలేదు ట్విటర్ సీఈవో అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడంటూ బెక్పూర్ వాపోయాడు. ఇంత కాలంలో ట్విటర్లో పని చేసినందుకు, సాధించిన లక్ష్యాల పట్ల తాను గర్వంగా ఉన్నానంటూ బెక్పూర్ ట్వీట్ చేశాడు. ట్విటర్ను వెళ్లి వీడాల్సిన రోజు వస్తుందని తాను ఊహించలేదంటూ చెప్పుకొచ్చాడు బెక్పూర్. While I’m disappointed, I take solace in a few things: I am INSANELY proud of what our collective team achieved over the last few years, and my own contribution to this journey. — Kayvon Beykpour (@kayvz) May 12, 2022 బ్రూస్ ఫలాక్ కూడా మరోవైపు ట్విటర్ రెవెన్యూ హెడ్గా బ్రూస్ ఫలాక్ను కూడా ఆ స్థానం నుంచి తప్పిస్తున్నట్టు తొలుత ట్విటర్లో ప్రకటించారు. అయితే ఆ ట్వీట్ను తర్వాత తొలగించినా ఫలాక్ను మాత్రం కీలక బాధ్యతల నుంచి పక్కన పెట్టారు. కీలకమైన ఈ రెండు బాధ్యతలను జే సల్లివాన్కి అప్పగించారు. ఇకపై ప్రొడక్ట్ హెడ్గా జే సల్లివాన్ బాధ్యతలు నిర్వర్తిసారు. రెవెన్యూ హెడ్గా మరొకరు వచ్చే వరకు ఆ బాధ్యతలకు ఇంఛార్జీగా ఉంటారు. I wanted to take a moment to thank all the teams and partners I’ve been lucky enough to work with during the past 5 years. Building and running these businesses is a team sport — bruce.falck() 🦗 (@boo) May 12, 2022 సమర్థుడు ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్ల తొలగింపుపై సీఈవో పరాగ్ అగర్వాల్ స్పందిస్తూ.. సరైన సమయంలో సరైన లీడర్లు వస్తారని చెప్పారు. ప్రొడక్ట్ హెడ్గా బాధ్యతలు స్వీకరించిన సల్లివాన్ వేగంగా నిర్ణయాలు తీసుకోవడంతో అత్యంత సమర్థుడంటూ పరాగ్ కొనియాడారు. చదవండి: Elon Musk: నాకు ధమ్కీ ఇచ్చారు.. నా ప్రాణాలకు ఏమైనా అయితే ? మస్క్ ట్వీట్కి కారణం ఇదే! -
అనూహ్యం: డీజీపీని తప్పించిన సీఎం యోగి
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్ర డీజీపీ ముకుల్ గోయల్ను అర్ధాంతరంగా తప్పిస్తున్నట్లు బుధవారం సాయంత్రం ప్రకటించారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించిన నేపథ్యంలోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పనులను పట్టించుకోకపోవడం, శాఖాపరమైన పనులపై ఆసక్తి చూపడం లేదంటూ డీజీపీ పదవి నుంచి ఆయన్ని తప్పిస్తున్నట్లు సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది జూన్లోనే యూపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు ముకుల్ రాయ్. ప్రస్తుతం డీజీపీ పోస్ట్ నుంచి ముకుల్ గోయల్ను సివిల్ డిఫెన్స్ డీజీ పోస్టుకు పంపించారు. ఇంటెలిజెన్స్ డీజీ డీఎస్ చౌహాన్ యూపీకి తర్వాతి డీజీపీ అయ్యే అవకాశం ఉంది. 1987 ఉత్తర ప్రదేశ్ క్యాడర్కు చెందిన ముకుల్ గోయల్.. గతంలో పలు కీలక పదవులు చేపట్టారు. గతంలో బీఎస్ఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్గానూ ఆయన బాధ్యతలు నిర్వహించారు. పోలీసు రిక్రూట్మెంట్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో 2007లో మాయావతి సర్కార్ ముకుల్పై సస్పెన్షన్ వేటు వేసింది కూడా. చదవండి👉🏼: మాజీ ఐపీఎస్పై ట్రోలింగ్! కారణం ఏంటంటే.. -
జగ్గారెడ్డికి బిగ్ షాక్.. బాధ్యతల నుంచి తొలగింపు
-
జగ్గారెడ్డి బాధ్యతల్లో కోత...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. సీనియర్లు వర్సెస్ పీసీసీ అధ్యక్షుడు అన్నట్టుగా చోటు చేసుకుంటున్న పరిణామాల పరంపర సోమవారం కూడా కొనసాగింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి సవాల్ విసిరిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఉన్న పార్టీ బాధ్యతల్లో కోత పడింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఆయన ఇన్చార్జిగా వ్యవహరిస్తోన్న ఖమ్మం, వరంగల్, భువనగిరి, కరీంనగర్ లోక్సభ స్థానాలతో పాటు మహిళా కాంగ్రెస్, ఐఎన్టీయూసీ, ఇతర సంఘాల ఇన్చార్జి బాధ్యతలను ఇతర వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పగిస్తూ రేవంత్ ఉత్తర్వులు జారీ చేశారు. తాను వర్కింగ్ ప్రెసిడెంట్గానే కొనసాగుతానని, ఇతర బాధ్యతలు వద్దని తెలియజేస్తూ గతంలో జగ్గారెడ్డి పార్టీకి రాసిన లేఖ ఆధారంగా ఆయన్ను ఆ బాధ్యతల నుంచి తొలగించినట్టు గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు రాష్ట్ర మంత్రి హరీశ్రావును కలిసిన అంశంపై వివరణ కోరుతూ త్వరలోనే మాజీ ఎంపీ, సీనియర్ నేత వి. హనుమంతరావుకు షోకాజ్ నోటీసు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. జగ్గారెడ్డి బాధ్యతల తొలగింపు, వీహెచ్కు షోకాజ్ నోటీసు జారీ చేయడం ద్వారా ఇతర అసంతృప్త నేతలను కూడా అధిష్టానం దారిలోకి తీసుకురావాలని టీపీసీసీ నాయకత్వం భావిస్తున్నట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఢిల్లీ వెళ్లిన రేవంత్రెడ్డి జగ్గారెడ్డి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సీఎల్పీలో విలేకరులతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఇటీవలి, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడతారన్నది కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మరోవైపు పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు సోమవారం ఢిల్లీ వెళ్లిన రేవంత్రెడ్డి.. మంగళవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్తో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్లో మరేమైనా ఇతర పరిణామాలు చోటు చేసుకుంటాయా అనే చర్చ కూడా జరుగుతోంది. పార్టీకి నష్టం కలిగితే వారిదే బాధ్యత: మహేశ్కుమార్ గౌడ్ టీపీసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్ గౌడ్ సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎంతటి సీనియర్లు అయినా ఊరుకునేది లేదని అన్నారు. సీనియర్లంటే తమకు గౌరవం ఉందని, వారికి వ్యక్తిగతంగా ఏవైనా సమస్యలు ఉంటే అధిష్టానానికి చెప్పుకోవాలని, పార్టీని నష్టపరిచే వ్యవహారాలు మంచివి కావని సూచించారు. పార్టీకి నష్టం కలిగితే వారిదే బాధ్యత అని పేర్కొన్నారు. -
ఉపరాష్ట్రపతి ఖాతా: ట్విటర్ దుందుడుకు చర్య
సాక్షి, న్యూఢిల్లీ: మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ దుందుడుకు చర్య సోషల్ మీడియాలో దుమారం రేపింది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాకు బ్లూటిక్ను తాజాగా తొలగించింది. 6 నెలలుగా ఆయన ఖాతా యాక్టివ్గా లేని కారణంగా అన్ వెరిఫై చేసి బ్లూ మార్క్ తొలగించినట్టు ట్విటర్ వెల్లడించింది. శనివారంఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ వినియోగదారు పేరు మార్చినా లేదా ఖాతా యాక్టివ్గా లేకపోయినా ఎలాంటి నోటీసు లేకుండా ఎప్పుడైనా 'ధృవీకరించబడిన' బ్లూ బ్యాడ్జ్ చిహ్నాన్ని తొలగిస్తామని ట్విటర్ తెలిపింది. ఉపరాష్ట్రపతి ట్విటర్ హ్యాండిల్ నుండి బ్లూ బ్యాడ్జ్ తొలగించడంపై బీజేపీ ముంబై అధికార ప్రతినిధి సురేష్ నఖువా గ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 'భారత రాజ్యాంగంపై దాడి' అని వ్యాఖ్యానించారు. మరోవైపు ఉపరాష్ట్రపతి జూలై 23, 2020 న పోస్ట్ చేసిన చివరి ట్వీట్ చేయగా, సుమారు 1.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఖాతాకు 931,000 మందికి పైగా అనుచరులున్నారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 25న ప్రకటించిన కొత్త ఐటీ నిబంధనలకు సంబంధించి ట్విటర్కు కేంద్రానికి మధ్య వివాదం నడుస్తోంది. ఇటీవల ఈ వార్ మరింత ముదిరిన సంగతి తెలిసిందే. దిగొచ్చిన ట్విటర్ అటు బీజేపీ శ్రేణులు, ఇటు నెటిజనుల నుంచి తీవ్ర ఆగ్రహం పెల్లుబుకిన నేపథ్యంలో ట్విటర్ దిగొచ్చింది. ఉపరాష్ట్రపతి ట్విట్టర్ ఖాతా బ్లూ మార్క్ టిక్ను పునరుద్ధరించింది. -
వేధించే లోన్ యాప్స్ ఔట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టాంట్ లోన్ యాప్స్ ఆగడాలపై దేశవ్యాప్తంగా వేడివేడి చర్చ జరుగుతున్న వేళ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఘాటుగా స్పందించింది. వినియోగదార్ల భద్రతా విధానాలను ఉల్లంఘిస్తున్న వ్యక్తిగత రుణ యాప్లను ఆన్డ్రాయిడ్ ప్లే స్టోర్ నుంచి తొలగించినట్టు వెల్లడించింది. కస్టమర్లు, ప్రభుత్వ సంస్థలతోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు వందలాది యాప్స్ను సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ఆన్డ్రాయిడ్ సెక్యూరిటీ, పైవసీ ప్రొడక్ట్ వైస్ ప్రెసిడెంట్ సుజాన్నే ఫ్రే ఒక బ్లాగ్ పోస్ట్ ద్వారా తెలిపారు. కస్టమర్లకు అధిక వడ్డీ రేట్లకు రుణాలు ఇవ్వడమేగాక, వసూలు చేసేందుకు యాప్స్ ప్రతినిధులు వేధింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయితే ఎన్ని యాప్స్ను తొలగించారో గూగుల్ అధికారికంగా వెల్లడించనప్పటికీ.. గత 10 రోజుల్లో సుమారు 120 యాప్స్ను తీసివేసినట్టు సమాచారం. ఇలా ప్లే స్టోర్ నుంచి గుడ్బై చెప్పిన యాప్స్ సంఖ్య డిసెంబర్ చివరి వారం నుంచి ఇప్పటి వరకు వందల్లోనే ఉంటుందని తెలుస్తోంది. నోటీసు లేకుండానే..: స్థానిక చట్టాలు, ఆర్బీఐ నిబంధనల మేరకు ఉన్నాయా లేవా అని నిరూపించాలని ఇతర గుర్తించిన యాప్ డెవలపర్లను గూగుల్ ఆదేశించింది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల నుంచి పొందిన లైసెన్సు పత్రాలను తమ ముందు అయిదు రోజుల్లో ఉంచాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. గూగుల్ ప్లే డెవలపర్ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్కు లోబడే డెవలపర్లు పనిచేయాల్సి ఉంటుందని సంస్థ గుర్తు చేసింది. విఫలమైన యాప్స్ను ముందస్తు నోటీసు లేకుండానే తొలగిస్తామని హెచ్చరించింది. ఆన్లైన్ రుణ వేధింపుల సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో.. డిజిటల్ రుణాల క్రమబద్ధమైన వృద్ధిని ప్రోత్సహించడానికి, నియంత్రణ చర్యలను సూచించడానికి ఒక బృందాన్ని నియమించినట్టు ఆర్బీఐ బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొస్తున్న ఫిన్టెక్ యాప్స్పై కన్నేసి ఉంచాలన్న ఆర్బీఐ ఆదేశాల నేపథ్యంలో గూగుల్ తాజా చర్యలకు దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. కీలక వివరాలు ఉండాల్సిందే..: వ్యక్తిగత రుణాలను అందిస్తున్న ఫైనాన్షియల్ సర్వీసెస్ యాప్స్.. రుణాలను తిరిగి చెల్లించాల్సిన కనీస, గరిష్ట కాల పరిమితి, గరిష్ట వార్షిక వడ్డీ శాతం, మొత్తం లోన్కు అయ్యే ఖర్చు వంటి కీలక వివరాలను ముందస్తుగా వెల్లడించాల్సిందేనని గూగుల్ స్పష్టం చేసింది. తద్వారా నిర్ణయం తీసుకోవడానికి కస్టమర్లకు ఆస్కారం ఉంటుందని, మోసానికి గురయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుందని తెలిపింది. రుణం జారీ చేసిన తేదీ నుండి 60 రోజులు, అంతకన్నా ఎక్కువ రోజుల్లో తిరిగి చెల్లించాల్సిన వ్యక్తిగత రుణ యాప్స్ను మాత్రమే గూగుల్ అనుమతిస్తుంది. డెవలపర్లు ప్రస్తుత సేవలను అమలు చేయడానికి అవసరమైన అనుమతులను మాత్రమే యూజర్ల నుంచి అభ్యర్థించాలి. వారు బహిర్గతం చేయని, అమలు చేయని, అనుమతించని ప్రయోజనాల కోసం వినియోగదారు లేదా వారి మొబైల్లో ఉన్న సమాచారాన్ని ఉపయోగించరాదని హెచ్చరించింది. అనుమతి తీసుకోవాలి.. డెవలపర్లు వినియోగదారు అంగీకరించిన ప్రయోజనాల కోసం మాత్రమే డేటాను ఉపయోగించాలి. తరువాత వారు ఇతర ప్రయోజనాల కోసం డేటాను ఉపయోగించాలనుకుంటే, వారు అదనపు ఉపయోగాలకు వినియోగదారు అనుమతి పొందాలని గూగుల్ స్పష్టం చేసింది. దర్యాప్తులో భాగంగా చట్టాన్ని అమలు చేసే సంస్థలకు సహకరిస్తామని సంస్థ తెలిపింది. ‘గూగుల్ ఉత్పత్తుల ద్వారా సురక్షిత, భద్రమైన అనుభవాన్ని కస్టమర్లకు అందించడం మా ప్రాధాన్యం. మా గ్లోబల్ ప్రొడక్ట్ పాలసీలు ఈ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించి, అమలు చేయబడ్డాయి. వినియోగదార్ల భద్రతను పెంచడానికి మా పద్ధతులను మెరుగుపరచడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తున్నాము’ అని వివరించింది. -
ట్రంప్ని గడువుకు ముందే తప్పిస్తారా?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని గడువుకి ముందే గద్దె దింపాలని కాంగ్రెస్ యోచిస్తోంది. దీనికి గల మార్గాలను అన్వేషిస్తోంది. ట్రంప్ని ఎలాగైనా తప్పించాలని సభ్యుల్లో చర్చ జరుగుతోంది. అధ్యక్షుడిగా జనవరి 20న ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంది. కానీ ఈలోగా అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణ అధికరణం ద్వారా ట్రంప్ని తొలగించడానికి గల అవకాశాలను కాంగ్రెస్ సభ్యులు పరిశీలిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిని పదవీచ్యుతుడిని చేయడానికి రెండు మార్గాలున్నాయి. మొదటిది అభిశంసన తీర్మానం కాగా, రెండోది 25వ రాజ్యాంగ సవరణ ఇచ్చిన అధికరణం. దేశ ఉపాధ్యక్షుడు, మంత్రి మండలి సభ్యులు కలిసి ఈ అధికరణాన్ని ప్రయోగించి అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించవచ్చు. ఆ తర్వాత ఉపాధ్యక్షుడు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఏమిటీ సవరణ? రాజ్యాంగంలోని 25వ సవరణలో నాలుగు సెక్షన్లు ఉన్నాయి. అమెరికా అ«ధ్యక్షుడు పదవిలో ఉండగానే మరణిస్తే దీనిలో మొదటి సెక్షన్ ద్వారా ఉపాధ్యక్షుడు పదవి బాధ్యతలు చేపడతారు. రెండో సెక్షన్ ఉపాధ్యక్షుడిని పదవీచ్యుతుడిని చేయడానికి సంబంధించినది కాగా, మూడోది అధ్యక్షుడెవరైనా తనంతట తానుగా పదవిలో కొనసాగలేనని, తప్పుకుంటానని చెప్పినప్పుడు ఉపాధ్యక్షుడికి అధికారాన్ని అప్పగించడానికి వినియోగిస్తారు. ఇక అధ్యక్షుడు పాలనా వ్యవస్థపై నియంత్రణ కోల్పోతే ఉపాధ్యక్షుడు, కేబినెట్ సభ్యుల ఆమోదంతో నాలుగో సెక్షన్ ద్వారా అధ్యక్షుడిని తొలగించవచ్చు. అభిశంసన చేయొచ్చా? ట్రంప్ని అభిశంసన ద్వారా కూడా పదవి నుంచి తొలగించవచ్చు. అయితే ఇది ప్రతినిధుల సభ ద్వారా జరగాలి. మూడింట రెండు వంతుల మెజార్టీతో ప్రతినిధుల సభ ఆమోదిస్తే, దానిని సెనేట్ కూడా ఆమోదించాల్సి ఉంటుంది. అవసరం అనుకుంటే ఒకే రోజులో ఈ ప్రక్రియని ముగించేలా వెసులుబాటు ఉంది. గత ఏడాది ట్రంప్పై అభిసంశన తీర్మానం పెట్టినా సెనేట్లో వీగిపోయింది. -
పేటీఎంకు గూగుల్ షాక్!
న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీల సంస్థ పేటీఎంకు టెక్ దిగ్గజం గూగుల్ శుక్రవారం షాకిచ్చింది. పేటీఎం ఆండ్రాయిడ్ యాప్ను తమ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. నిబంధనలకు విరుద్ధంగా క్రీడలపై బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తుండటమే ఇందుకు కారణమని వెల్లడించింది. దీంతో కొద్ది గంటలపాటు పేటీఎం యాప్పై గందరగోళం నెలకొంది. అయితే, వివాదాస్పదమైన ’క్యాష్బ్యాక్’ ఫీచర్ను పేటీఎం తొలగించడంతో యాప్ను సాయంత్రానికి గూగుల్ మళ్లీ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంచింది. గూగుల్ నిబంధనలకు అనుగుణంగా క్యాష్బ్యాక్ కింద ఆఫర్ చేస్తున్న స్క్రాచ్ కార్డులను ఉపసంహరించినట్లు పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ వెల్లడించారు. కొత్త కస్టమర్లను చేర్చుకోనివ్వకుండా పేటీఎంకు గూగుల్ అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. దేశీయంగా స్టార్టప్ వ్యవస్థ వృద్ధి చెందేందుకు మరింత తోడ్పాటు అవసరమని పేర్కొన్నారు. ‘(గూగుల్ వంటి) కొన్ని ప్లాట్ఫామ్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఆధిపత్యం గలవారు బాధ్యతగా కూడా మెలగాల్సి ఉంటుంది. ఈ దేశ అభివృద్ధి పాలుపంచుకోవాల్సిన బాధ్యత వారిపై కూడా ఉంటుంది. నవకల్పనలను అణగదొక్కేయకుండా దేశ స్టార్టప్ వ్యవస్థకు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉంది’ అని విజయ్ శేఖర్ శర్మ వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 19 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమవుతోంది. ఐపీఎల్ వంటి భారీ టోర్నమెంట్లు మొదలయ్యే ముందు బెట్టింగ్ యాప్స్ కుప్పతెప్పలుగా రావడం సర్వసాధారణంగా మారిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతకు ముందు ఏం జరిగిందంటే... ప్లేస్టోర్లో పేటీఎం యాప్ పునరుద్ధరణకు ముందు పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ‘ప్లే స్టోర్ నిబంధనలను ఉల్లఘించినందుకు యాప్ను బ్లాక్ చేయాల్సి వచ్చింది. ఐపీఎల్ టోర్నమెంటు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే మా విధానాలపై వివరణ విడుదల చేశాం‘ అని గూగుల్ పేర్కొంది. కేవలం ప్లే స్టోర్లో ఉన్న యాప్ను మాత్రమే తొలగించామని, ఇప్పటికే ఉన్న యూజర్లపై ప్రతికూల ప్రభావమేదీ ఉండబోదని తెలిపింది. మరోవైపు, ఈ పరిణామంపై స్పందించిన పేటీఎం .. ప్లే స్టోర్లో కొత్తగా డౌన్లోడ్ చేసుకునేందుకు, అప్డేట్ చేసుకునేందుకు తమ యాప్ తాత్కాలికంగా అందుబాటులో ఉండదని మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో పేర్కొంది. అయితే, యాప్ను వెంటనే మళ్లీ అందుబాటులోకి తెస్తామని, యూజర్ల డబ్బుకేమీ ఢోకా లేదని భరోసానిచ్చే ప్రయత్నం చేసింది. క్రికెట్ లీగ్ తెచ్చిన తంటా.. క్రికెట్ ఇష్టపడే యూజర్లు తాము జరిపే లావాదేవీలపై క్యాష్బ్యాక్ ఆఫర్లు పొందే విధంగా తమ కన్జూమర్ యాప్లో ఇటీవల ’పేటీఎం క్రికెట్ లీగ్’ను ప్రారంభించినట్లు పేటీఎం ప్రతినిధి తెలిపారు. ‘ఈ గేమ్ ఆడే యూజర్లకు ప్రతీ లావాదేవీ తర్వాత స్టిక్కర్స్ లభిస్తాయి. వాటన్నింటినీ సేకరించి, పేటీఎం క్యాష్బ్యాక్ పొందవచ్చు. క్యాష్బ్యాక్ భారత్లో పూర్తిగా చట్టబద్ధమే. మేం అన్ని నిబంధనలు, చట్టాలను పక్కాగా పాటిస్తున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఇది తమ నిబంధనలకు విరుద్ధమని గూగుల్ భావిస్తోంది. అందుకే ప్లే స్టోర్ నుంచి పేటీఎం ఆండ్రాయిడ్ యాప్ను తొలగించింది‘ అని వివరించారు. బెట్టింగ్ యాప్స్ అన్నీ తొలగింపు.. క్రీడలపై బెట్టింగ్ చేసే యాప్స్ వేటినీ తాము అనుమతించబోమని, అలాంటి వాటన్నింటినీ తమ ప్లే స్టోర్ నుంచి తొలగిస్తామని గూగుల్ తమ బ్లాగ్లో వెల్లడించింది. ‘స్పోర్ట్స్ బెట్టింగ్ కార్యకలాపాలకు ఉపయోగించే అనియంత్రిత గ్యాంబ్లింగ్ యాప్స్, ఆన్లైన్ కేసినోలు మొదలైన వాటిని మేం అనుమతించం‘ అని స్పష్టం చేసింది. యూజర్లు నష్టపోకుండా, వారి ప్రయోజనాలు కాపాడేందుకే ఈ విధానం అమలు చేస్తున్నట్లు పేర్కొంది. ఒకవేళ పదే పదే నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో గూగుల్ప్లే డెవలపర్ అకౌంట్ను రద్దు చేయడం సహా తీవ్ర చర్యలు ఉంటాయని ఆండ్రాయిడ్ సెక్యూరిటీ, ప్రైవసీ విభాగం వైస్ ప్రెసిడెంట్ సుజానె ఫ్రే తెలిపారు. మరోవైపు, ఐపీఎల్ ప్రారంభానికి సరిగ్గా ఒక్క రోజు ముందు గూగుల్ ఇలాంటి చర్య తీసుకోవడమనేది .. తమ కఠినతరమైన విధానాల గురించి డెవలపర్లకు మరోసారి గుర్తు చేయడానికే అయి ఉంటుందని కేఎస్ లీగల్ అండ్ అసోసియేట్స్ మేనేజింగ్ పార్ట్నర్ సోనం చంద్వానీ పేర్కొన్నారు. -
డ్రాగన్ గేమింగ్ యాప్స్పై యాపిల్ వేటు
బీజింగ్ : టెక్ దిగ్గజం యాపిల్ తన చైనీస్ యాప్ స్టోర్స్ నుంచి శనివారం 29,800 యాప్స్ను తొలగించింది. వీటిలో 26,000కు పైగా గేమ్ యాప్స్ ఉన్నాయని పరిశోధన సంస్థ క్విమై వెల్లడించింది. ప్రభుత్వం జారీ చేసిన లైసెన్స్ నెంబర్ను ఈ ఏడాది జూన్లోగా సమర్పించాలని అంతకుముందు గేమ్ పబ్లిషర్లకు యాపిల్ డెడ్లైన్ విధించింది. చైనా యాండ్రాయిడ్ యాప్ స్టోర్స్ ఎప్పటినుంచో ఈ మార్గదర్శకాలు అమలవుతున్నాయి. అయితే ఈ ఏడాది నుంచి వాటిని కఠినంగా అమలు చేయాలని యాపిల్ ఎందుకు నిర్ణయించిందో స్పష్టం కాలేదు. జులై మొదటివారంలో తన యాప్ స్టోర్ నుంచి యాపిల్ 2500కు పైగా టైటిల్స్ను తొలగించింది. యాప్స్ తొలగింపుతో జింగా, సూపర్సెల్ వంటి యాప్లు ప్రభావితమయ్యాయని పరిశోధన సంస్థ సెన్సార్ టవర్ అప్పట్లో పేర్కొంది. సెన్సిటివ్ కంటెంట్ను నియంత్రించేందుకు గేమింగ్ పరిశ్రమకు చైనా ప్రభుత్వం కఠిన నిబంధనలు ఉండాలని దీర్ఘకాలంగా కోరుతోంది. గేమింగ్ యాప్స్పై కఠిన నిబంధనలు విధించడం చిన్న మధ్యతరహా డెవలపర్ల రాబడిపై ప్రభావం చూపుతుందని, బిజినెస్ లైసెన్స్ పొందడంలో ఎదురయ్యే అవరోధాలు మొత్తం చైనా ఐఓఎస్ గేమ్ పరిశ్రమకే విఘాతమని యాప్ఇన్ చైనా మార్కెటింగ్ మేనేజర్ టాడ్ కున్ ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి : అమెజాన్, యాపిల్, ఫేస్బుక్- భల్లేభల్లే -
20 సెం.మీ. కత్తినే మింగేశాడు..అయినా ఏం కాలేదు
ఢిల్లీ : డ్రగ్స్కి బానిసైన ఓ 28 ఏళ్ల యువకుడు లాక్డౌన్ కారణంగా డ్రగ్స్ అందుబాటులో లేకపోవడంతో ఏకంగా కత్తినే మింగేసాడు. అంతేకాకుండా నెలన్నరకు పైగా పొట్టలో పదునైన కత్తి ఉన్నా చాలా సాధారణంగా గడిపాడు. వైద్యులకే ఆశ్చర్యం కలిగించిన ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. కొన్ని రోజుల క్రితం తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండటంతో ఎక్స్రే తీయగా 28 సెంటీమీటర్ల పదునైన కత్తి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ అరుదైన కేసును ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం యువకుని పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొన్నారు. కాగా యువకుడు వంటింట్లోని కత్తిని మింగేశాడన్నా విషయం తెలిసి కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు. (కుటుంబంతో డిన్నర్.. ఫొటో షేర్ చేసిన ఎమ్మెల్యే!) గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగానికి చెందిన సర్జన్ డాక్టర్ ఎన్ఆర్ దాస్ పర్యవేక్షణలో యువకునికి మూడు గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించారు. దీనికి సంబంధించి ఎయిమ్స్ వైద్యులు మాట్లాడుతూ..ఒక వ్యక్తి 20 సెంటీమీటర్ల కత్తిని మింగి ప్రాణాలతో బయటపడటం ఇదే మొదటికేసని వెల్లడించారు. ఇప్పటిదాకా సూది, పిస్ లాంటి చిన్న వస్తువులు మింగినవారిని చూశాం కానీ 20 సెంటీమీటర్ల కత్తి ఎక్స్రేలో చూసి షాకయ్యాం అని వివరించారు. ఏ చిన్న పొరపాటు జరిగినా రోగి ప్రాణాలకే ముప్పు వాటిల్లేదని ఈ కేసుసు చాలా చాలెంజింగ్ తీసుకొని విజయవంతంగా శస్ర్తచికిత్స చేశామని డాక్టర్ దాస్ తెలిపారు. (పెళ్లి మండపంలో కోవిడ్ విలయం) -
గోల్డ్ స్మగ్లింగ్ కేసు : ప్రిన్సిపల్ కార్యదర్శిపై వేటు
తిరువనంతపురం : గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం కేరళలో పెనుప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ బాగోతంలో సీఎం కార్యాలయం ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రిన్సిపల్ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం. శివశంకర్ను తొలగించారు. గత వారం వెలుగుచూసిన గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో ఐటీ శాఖ ఉద్యోగి పాత్రపై ఆరోపణలు బయటపడిన మరుసటి రోజే శివకంర్పై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. శివశంకర్ స్ధానంలో మరో ఐఏఎస్ అధికారి మిర్ మహ్మద్ను నియమించినట్టు సీఎంఓ కార్యాలయం మంగళవారం వెల్లడించింది. ఇటీవల దుబాయ్ నుంచి చార్టర్డ్ విమానంలో వచ్చిన కన్సైన్మెంట్ ద్వారా దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దౌత్య మార్గంలో తరలిన 30 కిలోల బంగారం విమానాశ్రయంలో పట్టుబడటం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి కేరళలో యూఏఈ కాన్సులేట్లో పనిచేసే ఓ మాజీ ఉద్యోగిని సోమవారం కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. రూ 15 కోట్ల విలువైన గోల్డ్ స్మగ్లింగ్స్ కేసుకు సంబంధించి కస్టమ్స్ అధికారులు ఉద్యోగిని ప్రశ్నిస్తున్నారు.మరోవైపు ఈ వ్యవహారంలో మాజీ యూఏఈ కాన్సులేట్ అధికారి స్వప్న సురేష్ పాత్రపైనా ఆరా తీస్తున్నారు.రెండు రోజుల కిందటే ఆమెను కేరళ ఐటీ శాఖ నుంచి తొలగించారు. విజయన్పై విమర్శల వెల్లువ గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం కేరళ రాజకీయాల్లో దుమారం రేపుతుండగా విపక్షాలు సీఎం విజయన్పై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఐటీ శాఖ ఉద్యోగి ప్రమేయం వెనుక విజయన్ హస్తం ఉందని కాంగ్రెస్, బీజేపీలు ఆరోపించాయి. సీఎం కార్యాలయం నేర కార్యకలాపాలకు అడ్డాగా మారిందని సీనియర్ కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితల ఆరోపించారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై సీబీఐచే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. చదవండి : కోవిడ్-19 : కేరళ కీలక నిర్ణయం -
‘రిమూవ్ చైనా యాప్స్’కు
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్స్ నుంచి చైనా గేమ్స్, ఇతర సాఫ్ట్వేర్ను తొలగించేందుకు ఉపయోగపడే దేశీ మొబైల్ యాప్ ’రిమూవ్ చైనా యాప్స్’కు గూగుల్ షాకిచ్చింది. తమ విధానాలకు విరుద్ధంగా ఉందంటూ ఈ యాప్ను ప్లేస్టోర్ నుంచి తొలగించింది. యూజర్లు తమ ఫోన్లలో ఇన్స్టాల్ అయిన చైనా యాప్స్ను ప్రధానంగా గుర్తించేందుకు ఇది ఉపయోగపడేది. ఆయా యాప్స్ను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి సూచించేది. భారత్తో సరిహద్దుల్లో చైనా బలగాలు దూకుడుగా వ్యవహరిస్తుండటంతో ఆ దేశ ఉత్పత్తులను బహిష్కరించాలంటూ విద్యావేత్త సోనమ్ వాంగ్చుక్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ యాప్ ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనితో పాటు చైనాకు చెందిన టిక్–టాక్ యాప్నకు ప్రత్యామ్నాయంగా తెరపైకి వచ్చిన భారతీయ యాప్ ’మిత్రో’ను కూడా గూగుల్ ఇటీవలే ఇదే కారణాలతో తొలగించింది. ఈ రెండు యాప్లను లక్షల సంఖ్యలో యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నారు. రిమూవ్ చైనా యాప్స్ యాప్ను వన్ టచ్ యాప్ల్యాబ్స్ రూపొందించింది. -
ఆ వీడియో అతని ఉద్యోగానికి ఎసరు పెట్టింది
-
ఆ వీడియో అతని ఉద్యోగానికి ఎసరు పెట్టింది
అమేథి : జిల్లా కలెక్టర్గా ప్రజా సమస్యను పరిష్కరించాల్సిన వ్యక్తి తన బాధ్యతను విస్మరించిన ఘటన ఉత్తర్ప్రదేశ్లోని అమేథిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రశాంత్ కుమార్ శర్మ అమేథి జిల్లా మెజిస్ట్రేట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్కుమార్ సింగ్ అలియాస్ సోనుసింగ్ అనే వ్యక్తి మంగళవారం రాత్రి గుర్తు తెలియని యువకుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. కాగా, సోనుసింగ్ మృతదేహానికి ఇంకా పోస్టుమార్టం ఎందుకు నిర్వహించలేదో తెలుసుకుందామని అతని బంధువు, ట్రైనీ పీసీఎస్ ఆఫీసర్ సునీల్ సింగ్ బుధవారం ప్రశాంత్కుమార్ను కలిసేందుకు వచ్చారు. 'సోనూసింగ్ మృతదేహానికి పోస్టుమార్టమ్ ఎందుకు నిర్వహించలేదని, తన కజిన్ను చంపిన వ్యక్తులను ఎందుకు పట్టుకులేదో చెప్పాలని' సునీల్ సింగ్ ప్రశ్నించారు. ఈ విషయం తన పరిధిలో లేదని, అయినా అది అడగానికి నువ్వెవరు అంటూ ప్రశాంత్ కుమార్ సునీల్ కాలర్ పట్టుకొని దౌర్జన్యంగా బయటికి ఈడ్చుకువచ్చాడు. అయితే ఈ ఘటన మొత్తం సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఈ వీడియోను సునీల్ సింగ్ సోషల్మీడియాలో షేర్ చేయడంతో వైరల్గా మారింది. అయితే ఈ వీడియోపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందిస్తూ ..' ప్రశాంత్ కుమార్ ! నీవు ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్నావన్న విషయాన్ని మరిచిపోయావు. న్యాయం అడగడానికి వచ్చిన వ్యక్తి పట్ల నువ్వు ప్రదర్శించిన తీరు ఆగ్రహం తెప్పించింది. మనం ప్రజలకు సేవకులగా పని చేయాలే తప్ప నియంతలా వ్యవహరించకూడదంటూ' ట్వీట్ చేశారు. కాగా, ఉన్నతస్థాయి అధికారి పదవిలో ఉంటూ ప్రశాంత్ వ్యవహరించిన తీరును పలువురు నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు. మొరాదాబాద్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న అరుణ్కుమార్ను ప్రశాంత్ కుమార్ స్థానంలో అమేథి జిల్లా మెజిస్ట్రేట్గా నియమించారు. 'మంగళవారం రాత్రి హత్యకు గురైన సోనూసింగ్ స్థానికంగా ఇటుక బట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతని తండ్రి శివనాయక్ సింగ్ స్థానిక బీజేపీ నేతగా ఉన్నారు. కాగా, మంగళవారం రాత్రి కొంతమంది దుండగులు అతన్ని అడ్డగించి రూ. 2లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరించారు. ఈ నేపథ్యంలో వారి మధ్య గొడవ జరిగి జిల్లా ఎస్పీ కార్యాలయానికి 500 మీటర్ల దూరంలో సోనూసింగ్ను హత్య చేసి పారిపోయారు. అయితే సోనూను హత్య చేసిన ఐదుగురిపై ఎప్ఐఆర్ నమోదు చేశామని' పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సోనూ హత్యకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు వచ్చిన సునీల్కుమార్పై జిల్లా మెజిస్ట్రేట్ ప్రశాంత్ కుమార్ దౌర్జన్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. विनय शील एवं संवेदनशील बने हम यही प्रयास होना चाहिए । जनता के हम सेवक है , शासक नहीं @DmAmethi 🙏 — Smriti Z Irani (@smritiirani) November 13, 2019 -
ఉద్యోగినితో ఎఫైర్ : మెక్డొనాల్డ్ సీఈవోపై వేటు
న్యూయార్క్ : కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా సంస్థ ఉద్యోగినితో శారీరక సంబంధం నెరిపిన ప్రెసిడెంట్, సీఈవో స్టీవ్ ఈస్టర్బ్రూక్పై మెక్డొనాల్డ్స్ వేటు వేసింది. కంపెనీ విధానాలను ఉల్లంఘిస్తూ పరస్పర అంగీకారంతో ఉద్యోగినితో ఎఫైర్ సాగించిన ఈస్టర్బ్రూక్ను తొలగించాలని బోర్డు నిర్ణయం తీసుకుందని మెక్డొనాల్డ్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈస్టర్బ్రూక్ స్ధానంలో క్రిస్ కెంప్స్కీని మెక్డొనాల్స్ట్ యూఎస్ఏ ప్రెసిడెంట్గా నియమస్తూ ఆయన డైరెక్టర్గా కంపెనీ బోర్డులోనూ అడుగుపెడతారని తెలిపింది. కంపెనీలో నాయకత్వ మార్పునకు సంస్థ నిర్వహణ, ఆర్థిక సామర్థ్యాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. కాగా కంపెనీ విధానాలకు విరుద్ధంగా ఉద్యోగినితో తన రిలేషన్షిప్ పొరపాటు చర్యేనని మెక్డొనాల్డ్స్ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో ఈస్టర్బ్రూక్ పేర్కొన్నారు. కంపెనీ పాటించే విలువలను గౌరవిస్తూ తాను తప్పుకోవాలన్న బోర్డు నిర్ణయాన్ని అంగీకరిస్తానని చెప్పారు. ప్రపంచంలోనే దిగ్గజ ఫాస్ట్ఫుడ్ చైన్గా పేరొందిన మెక్డొనాల్డ్స్కు 100కు పైగా దేశాల్లో 38,000కు పైగా రెస్టారెంట్లు ఉన్నాయి. -
టర్కీ సెంట్రల్ బ్యాంకు గవర్నర్పై వేటు
అంకారా : టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ కేంద్ర బ్యాంకు గవర్నరు మురాత్ సెటింకాయను అనూహ్యంగా పదవినుంచి తప్పించారు. ఆయన స్థానంలో డిప్యూటీ గవర్నర్ మురత్ ఉయిసాల్ ను నియమించారు. ఈ మేరకు శనివారం అధికారిక గెజిట్ను ఉటంకిస్లూ బ్లూం బర్గ్ నివేదించింది. ప్రభుత్వానికి, కేంద్ర బ్యాంకు గవర్నకు మధ్య నెలకొన్నవివాదం జూన్ 12 నాటిపాలసీ రివ్యూ తరువాత మరింత ముదిరింది. కీలక వడ్డీరేట్ల యథాతథం నిర్ణయం చివరికి గవర్నర్ ఉద్వాసనకు దారితీసిందని భావిస్తున్నారు. ఈ నిర్ణయం అక్కడి మార్కెట్లను భారీగా ప్రభావితం చేసింది. దేశంలో ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే కిందికి దిగజారిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టర్కీ ప్రస్తుత వాస్తవ రేటు 8.3 శాతానికి చేరుకున్న కొద్ది రోజుల తరువాత ఈ నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ బ్యాంక్ విశ్వసనీయతను అణగదొక్కడానికి ఈ నిర్ణయం తీసుకున్నారని లండన్ కు చెందిన వ్యూహకర్త పియోటర్ మాటిస్ అభిప్రాయపడ్డారు. తాజా నిర్ణయం డబుల్ డిప్ మాంద్య ప్రమాదాన్ని పెంచుతుందన్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో మొదటిసారిగా పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయింది. సెంట్రల్ బ్యాంకు తదుపరి విధాన నిర్ణయం జూలై 25 న జరగాల్సి ఉంది. మురాత్ నాలుగేళ్ల పదవీకాలం 2020లో ముగియనుంది. టర్కీ ఆర్థిక వ్యవస్థ ఇటీవల తిరిగి మాంద్యంలోకి జారుకుంది. దశాబ్దకాలం తర్వాత మరోసారి మాంద్యంలోకి పడిపోవడం సర్వత్రా ఆందోళ రేపింది. దేశ ఆర్థిక వ్యవస్థలో వృద్ధితోపాటు ద్రవ్యోల్బణం వంటి అంశాలు దేశ అధ్యక్షుడు రెసెప్ తెయిప్ ఎర్డోగాన్ ప్రభుత్వానికి సవాలుగా మారనున్నాయని ఆర్థిక వేత్తలు అంచనావేశారు. గత ఏడాదిలో డాలర్ మారకంలో టర్కీ కరెన్సీ లిరా 30 శాతం మేర క్షీణించింది. ఫలితంగా విదేశాల నుంచి దిగుమతులు మరింత భారమైన సంగతి తెలిసిందే. -
సచివాలయంలో చంద్రబాబు ఫొటోలు తొలగింపు
-
పాక్ క్రికెటర్ల ఫొటోలు తొలగింపు
చండీగఢ్: పుల్వామా ఘటన నేపథ్యంలో పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) తమ తరఫున నిరసన వ్యక్తం చేసింది. మొహాలి క్రికెట్ స్టేడియంలో ఉన్న 15 మంది పాకిస్తాన్ క్రికెటర్ల ఫొటోలను పీసీఏ తొలగించింది. స్టేడియంలో లోపలి భాగంలో గ్యాలరీలో, రిసెప్షన్ వద్ద, ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో ఈ చిత్రాలు ఉన్నాయి. ‘జవాన్ల పై దాడికి సంబంధించి దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు ఉన్నాయి. మేం కూడా దానికి అతీతులం కాదు. చనిపోయిన కుటుంబాలకు సంఘీభావం ప్రకటిస్తూ మా వైపు నుంచి ఈ చర్య తీసుకున్నాం’ అని పీసీఏ కోశాధికారి అజయ్ త్యాగి చెప్పారు. తొలగించిన వాటి జాబితాలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్తో పాటు మియాందాద్, వసీం అక్రమ్, షాహిద్ అఫ్రిది తదితరుల ఫొటోలు ఉన్నాయి. -
ఆలోక్ వర్మపై వేటు
ఆలోక్ వర్మపై కేంద్ర ప్రభుత్వం మరోసారి వేటువేసింది. రెండు నెలల క్రితం అనూహ్యంగా బలవంతంగా సెలవుపై పంపిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా సీబీఐ చీఫ్ పదవి నుంచే తప్పించేసింది. సీబీఐలో అంతఃకలహాల నేపథ్యంలో గత అక్టోబర్ 23 అర్ధరాత్రి ఆయనను సెలవుపై పంపింది. దీనిపై సుప్రీంకోర్టు నుంచి ఊరట పొందిన రెండు రోజులకే ప్రభుత్వం ఆయనను అత్యున్నత దర్యాప్తు సంస్థ అధిపతి బాధ్యతల నుంచి తొలగిస్తూ మరోమారు అసాధారణ నిర్ణయం తీసుకుంది. మోదీ అధ్యక్షతన సమావేశమైన అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ 2:1 మెజారిటీతో ఆయనపై వేటువేసింది. మోదీ కక్షగట్టి ఆయనను తప్పించారని విపక్షాలతోపాటు న్యాయనిపుణులు కూడా పేర్కొన్నారు. విమర్శలకు జడవకుండా మోదీ ఆయనపై వేటు వేయడం కలకలం రేపింది. 55 ఏళ్ల సీబీఐ చరిత్రలో డైరెక్టర్స్థాయి అధికారిపై వేటు పడటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఆలోక్ స్థానంలో తెలుగు వ్యక్తి నాగేశ్వర్రావుకు బాధ్యతలు అప్పగించారు. న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మపై మరోసారి వేటుపడింది. రెండు నెలల క్రితం ప్రభుత్వం ఆయన్ను సెలవుపై పంపగా ఈసారి ఏకంగా బాధ్యతల నుంచి తొలగిస్తూ ప్రధాని నేతృత్వంలోని అత్యున్నత ఎంపిక కమిటీ 2–1 తేడాతో నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తరఫున జస్టిస్ ఏకే సిక్రి, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేల అత్యున్నత భేటీ అనంతరం వర్మను సీబీఐ నుంచి ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్గా కేంద్రం బదిలీ చేసింది. ఆ స్థానంలో తెలుగు వ్యక్తి నాగేశ్వర్రావుకే మళ్లీ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలోక్ వర్మ, సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో రెండు నెలల క్రితం కేంద్రం వారిని సెలవుపై పంపించింది. అనంతరం కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆలోక్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రెండేళ్ల పదవీ కాలం ముగియకుండా సీబీఐ డైరెక్టర్పై కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదని పేర్కొన్న సుప్రీంకోర్టు.. ఆయన్ను డైరెక్టర్గా కొనసాగనివ్వాలని ఆదేశించింది. పలు బదిలీలు చేపట్టిన వర్మ సీబీఐ డైరెక్టర్గా తిరిగి బాధ్యతలు చేపట్టిన ఆలోక్ వర్మ బుధ, గురువారాల్లో పలు బదిలీలు చేపట్టారు. ముఖ్యంగా సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాపై అవినీతి ఆరోపణల కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐ డీఐజీ ఎంకే సిన్హాకు అప్పగించారు. ఆస్థానాపై వచ్చిన లంచం ఆరోపణలపై దర్యాప్తును పర్యవేక్షిస్తున్న ఎస్కే సిన్హాను 2018 అక్టోబర్ 23న సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ ఎం.నాగేశ్వర్రావు నాగ్పూర్కు బదిలీ చేశారు. సిన్హాతోపాటు నాగేశ్వర్రావు చేపట్టిన ఇతర బదిలీలను రద్దుచేస్తూ ఆలోక్ ఆదేశాలిచ్చారు. భేటీలో ఏమయింది? ఆలోక్ వర్మ భవితవ్యంపై చర్చించేందుకు ప్రధాని నేతృత్వంలోని ఎంపిక కమిటీ బుధ, గురువారాల్లో సమావేశమయింది. ఈ భేటీల్లో ప్రధాని మోదీతోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తరఫున జస్టిస్ ఏకే సిక్రి, లోక్సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. గురువారం సాయంత్రం రెండు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించిన ఈ కమిటీ... వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అందజేసిన నివేదికను పరిశీలించింది. దీంతో వర్మను సీబీఐ డైరెక్టర్ బాధ్యతల నుంచి తొలగించేందుకు ప్రధాని మోదీతోపాటు జస్టిస్ ఏకే సిక్రి మొగ్గు చూపగా మరో సభ్యుడు మల్లికార్జున ఖర్గే మాత్రం వ్యతిరేకించారు. శిక్షించేందుకు ముందుగా ఆలోక్ వర్మ వాదనను కూడా కమిటీ వినాలని ఖర్గే వాదించినట్లు అధికార వర్గాల సమాచారం. అత్యున్నత స్థాయి భేటీ అనంతరం ప్రభుత్వం.. సివిల్ డిఫెన్స్ అండ్ హోం గార్డ్స్ విభాగంలోని ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్గా ఆలోక్ వర్మను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అవినీతి బయటపడుతుందనే.. రఫేల్ కుంభకోణం కేసును ఆలోక్ వర్మతో దర్యాప్తు చేయిస్తే ప్రభుత్వ అవినీతి బయటపడుతుందనే భయంతోనే ఆయన్ను పదవి నుంచి తొలగించేందుకు ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్లో ఆరోపించారు. ‘సీబీఐ చీఫ్ వర్మను పదవి నుంచి తొలగించేందుకు ప్రధాని ఎందుకు తొందర పడ్డారు?, ఎంపిక కమిటీ ముందు హాజరై తన వాదనలు వినిపించకుండా వర్మను మోదీని ఎందుకు అడ్డుకున్నారు? అని ప్రశ్నించారు. ఇందుకు సమాధానం ‘రఫేల్’ అని రాహుల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. వివరణ కోరి ఉండాల్సింది బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందిస్తూ..సీబీఐ డైరెక్టర్ బాధ్యతల నుంచి వర్మను తొలగించడం ఏకపక్ష నిర్ణయమైతే అది దురదృష్టకరం. ఆయనపై మోపిన ఆరోపణలపై వివరణ కోరి ఉండాల్సింది’ అని అన్నారు. ఆలోక్ వర్మ తొలగింపును అధికార ఉల్లంఘనగా రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది మజీద్ మెమన్ అన్నారు. విశ్వసనీయత లేని సీవీసీ ఆరోపణలే ప్రాతిపదికగా వర్మను బాధ్యతల నుంచి తప్పించడం దురదృష్టకరమని లాయర్ అభిషేక్ సింఘ్వి అన్నారు. ఖర్గే అసమ్మతి నోట్ ఆలోక్ను తొలగించాలన్న అత్యున్నత ఎంపిక కమిటీ నిర్ణయంపై లోక్సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే అసమ్మతి నోట్ ఇచ్చారు. ముందుగా ఆలోక్పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఆయన వాదనలు కమిటీ వినాలని ఖర్గే తెలిపినట్లు తెలిపారు. ‘సీవీసీ, సిబ్బంది శిక్షణ మంత్రిత్వశాఖ నుంచి వచ్చిన చట్ట విరుద్ధమైన ఉత్తర్వుల ఆధారంగా కోల్పోయిన 77 రోజుల పదవీ కాలాన్ని పూర్తిగా అధికారంలో కొనసాగకుండా వర్మను పదవి నుంచి తొలగించడం అన్యాయం’ అని ఖర్గే తన నోట్లో పేర్కొన్నారు. 2018 అక్టోబర్ 23వ తేదీన జరిగిన ఘటనలపై సుప్రీంకోర్టు నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించాలని ఖర్గే డిమాండ్ చేశారు. ‘సీవీసీ చేసిన పది ఆరోపణల్లో ఆరింటికి ఎలాంటి ఆధారాలు లేవు, అవి అసత్యాలు. మిగతా నాలుగు ఆరోపణలపై ఒక నిర్ధారణకు రావడానికి మరింత దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. నాగేశ్వర్రావుకే మళ్లీ పగ్గాలు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ బాధ్యతలను అడిషనల్ డైరెక్టర్గా ఉన్న నాగేశ్వర్రావుకు కేంద్రం గురువారం అప్పగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు లేదా మరొకరిని నియమించే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారని పేర్కొంది. వర్మ సెలవులో ఉన్నకాలంలో నాగేశ్వర్రావు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ ఉన్నారు. నాగేశ్వర్రావు 1986 బ్యాచ్ ఒరిస్సా కేడర్ ఐపీఎస్ అధికారి. 1979 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన వర్మ 2017 ఫిబ్రవరి ఒకటో తేదీన సీబీఐ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఆయన పదవీ కాలం ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. కాగా, కేంద్ర మాజీ మంత్రులు అరుణ్ శౌరీ, యశ్వంత్ సిన్హా, లాయర్ ప్రశాంత్ భూషణ్లు రఫేల్ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి, దీనిపై కేసు నమోదు చేయాలంటూ 2018 అక్టోబర్ 15వ తేదీన సీబీఐ డైరెక్టర్గా ఉన్న ఆలోక్ వర్మకు వినతిపత్రం అందజేయడం గమనార్హం. ఆలోక్ వర్మ తొలగింపు వెనక.. న్యూఢిల్లీ: 50 ఏళ్ల సీబీఐ చరిత్రలో ఉద్వాసనకు గురైన తొలి డైరెక్టర్గా అప్రతిష్ట మూటగట్టుకున్న ఆలోక్ వర్మ..అవినీతి, విధుల నిర్వహణలో నిర్లిప్తతతో మూల్యం చెల్లించుకున్నారు. సీబీఐ అంతర్గత సంక్షోభం దరిమిలా విచారణ జరిపిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) చేసిన పలు రకాల ఆరోపణలే ప్రాతిపదికగా ప్రధాని నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ వర్మపై వేటు వేసింది. వర్మను తొలగించడానికి సీవీసీ పేర్కొన్న కారణాల్ని పరిశీలిస్తే.. 1. మాంస వ్యాపారి మొయిన్ ఖురేషి మనీ లాండరింగ్ కేసులో హైదరాబాద్ వ్యాపారవేత్త సతీశ్బాబు సానాను నిందితుడిగా చేర్చాలని సీబీఐ భావించినా, అందుకు ఆలోక్ వర్మ అనుమతివ్వలేదు. 2. ‘సీబీఐలో నంబర్ వన్ స్థానంలో ఉన్న వ్యక్తి’తో మధ్యవర్తులకు సంబంధం ఉందని రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) సేకరించిన సమాచారం ద్వారా తెలుస్తోంది. 3. గుర్గావ్లో సుమారు రూ.36 కోట్లు చేతులు మారిన భూమి కొనుగోలు కేసులో ఆలోక్ వర్మ పేరు ఉంది. 4. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధాన నిందితుడిగా ఉన్న ఐఆర్సీటీసీ అవినీతి కేసులో ఓ అధికారిని కాపాడేందుకు ప్రయత్నించారని ఆలోక్ వర్మపై ఆరోపణలు వచ్చాయి. 5. అవినీతి, కళంకిత అధికారుల్ని సీబీఐలోకి తీసుకొచ్చేందుకు వర్మ ప్రయత్నించారు. 6. సీవీసీకి సహకరించడానికి నిరాకరించిన వర్మ ఉద్దేశపూర్వకంగా కీలక ఫైల్స్ను దాచిపెట్టారు. 7. ఎంపిక కమిటీకి నకిలీ, కల్పిత పత్రాలు సమర్పించి ఆలోక్ వర్మ సీబీఐ విశ్వసనీయత, సమగ్రతను దెబ్బతీశారు. 8. డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ల మధ్య అంతర్గత విభేదాలతో సీబీఐ ప్రతిష్ట మసకబారింది. 9. కేబినెట్ కార్యదర్శి ఫార్వర్డ్ చేసిన ఫిర్యాదులోని విషయాలు చాలా వరకు నిజమని నిరూపితమయ్యాయి. ఆ ఆరోపణలు తీవ్రమైనవని, అవి సీబీఐ, దాని ఉన్నతాధికారులపై పెను ప్రభావం చూపాయి. 10. కొన్ని ఆరోపణల్లో నిజం తేలాలంటే లోతైన విచారణ చేయాలి. ఆలోక్ డైరెక్టర్గా ఉండగా నిష్పక్షపాత విచారణ జరగదు. ఎన్నో మలుపులు.. 2017, ఫిబ్రవరి 1: సీబీఐ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఆలోక్ వర్మ 2018 జులై 12: సీబీఐలో ప్రమోషన్ల సమావేశానికి తన అనుమతి లేకుండానే తన ప్రతినిధిగా ఆస్థానా హాజరుకావడంపై సీవీసీకి వర్మ లేఖ. ఆగస్ట్ 24: దర్యాప్తు కొనసాగుతున్న ఓ కేసులో నిందితులను కాపాడడానికి ఆలోక్, ఆయన సహాయకుడైన అదనపు డైరెక్టర్ ఎన్కే శర్మ ప్రయత్నించారని, మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీ కేసులో వర్మకు హైదరాబాద్కు చెందిన వ్యాపారి సతీష్ సానా రూ.2కోట్లు లంచం ఇచ్చారని ఆరోపిస్తూ సీవీసీ, కేబినెట్ సెక్రెటరీకి ఆస్థానా లేఖ. అక్టోబర్ 4: ఆస్థానాకు రూ.3 కోట్లు చెల్లించినట్టు మేజిస్ట్రేట్ ముందు చెప్పిన సానా. అక్టోబర్ 15: మొయిన్ ఖురేషీ కేసులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణపై ఆస్థానాపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు. అక్టోబర్ 23: రాకేశ్ ఆస్థానా కేసులో యథాతథ స్థితి కొనసాగించాలని సీబీఐని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మరో సీబీఐ అధికారి దేవేంద్రకుమార్కు ఏడురోజుల సీబీఐ రిమాండ్కు కోర్టు ఆదేశం. అక్టోబర్ 15న ఆస్థానాపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కుమార్ పేరు కూడా చేర్చారు. అక్టోబర్ 24: సీవీసీ సిఫార్సుతో ఆలోక్, ఆస్థానాలను సెలవుపై పంపిస్తూ కేంద్రం నిర్ణయం. అక్టోబర్ 26: వర్మపై జరుగుతున్న సీవీసీ దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ జడ్జీ ఏకే పట్నాయక్ను నియమించిన సుప్రీంకోర్టు. నవంబర్ 12: కోర్టుకు సీవీసీ విచారణ నివేదిక. 2019, జనవరి 8: ఆలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్గా పునర్నియమిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు.∙ జనవరి 9: బాధ్యతలు చేపట్టిన ఆలోక్ వర్మ. తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన బదిలీలను రద్దుచేస్తూ నిర్ణయం. వర్మ భవితవ్యంపై నిర్ణయం తీసుకునే హైపవర్డ్ కమిటీలో జస్టిస్ ఏకే సిక్రికి చోటు కల్పించిన సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ జనవరి 10: ఇద్దరు జాయింట్ డైరెక్టర్లు సహా మొత్తం ఐదుగురు అధికారులను బదిలీచేసిన వర్మ. ∙ప్రధాని మోదీ, మల్లికార్జున ఖర్గే, జస్టిస్ సిక్రిలతో కూడిన హైపవర్డ్ కమిటీ భేటీ. ఆలోక్ వర్మకు ఉద్వాసన పలుకుతూ నిర్ణయం. ఆలోక్ వర్మను బదిలీ చేస్తూ కేబినెట్ నియామకాల కార్యదర్శి త్రిపాఠి జారీ చేసిన ఉత్తర్వులు -
నిస్సాన్ ఛైర్మన్పై వేటు
టోక్యో: ఆర్థిక అక్రమాలకు పాల్పడిన కేసులో ప్రపంచం ఆటోదిగ్గజం నిస్సాన్ ఛైర్మన్ కార్లోస్ ఘోన్ వేటుపడింది. రెండురోజులక్రితం గోన్ను టోక్యో విచారణ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. నిస్సాన్ బోర్డునుంచి ఆయన్ను తొలగించాలని బోర్డు ఏకగ్రీవ నిర్ణయం తీసుకుందని నిస్సాన్ గురువారం వెల్లడించింది. అలాగే మరో ఎగ్జిక్యూటివ్ రిప్రెజెంటేటివ్ డైరెక్టర్ గ్రెగ్ కెల్లీని కూడా తొలగించినట్టు తెలిపింది. సంస్థ నిర్వహించిన అంతర్గత నివేదికను పూర్తిగా పరిశీలించిన అనంతరం బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని ఒక ప్రకటనలో తెలిపింది. యోకోహామాలో సంస్థ ప్రధాన కార్యాలయంలో బోర్డు అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. మరోవైపు ఘోన్ స్థానంలో సమర్ధుడైన నాయకుడిని ఎన్నుకునేందుకు ఒక ఎడ్వైజరీ కమిటీని నియమించినట్టు నిస్సాన్ ప్రకటించింది. ముగ్గురు సభ్యుల ఈ కమిటీలో జపనీస్ మహిళా రేసింగ్ డ్రైవర్ కైకో ఇహారా కూడా ఉన్నారు. -
లక్ష మొక్కలు పీకేశారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘తెలంగాణకు హరితహారం’ అటవీప్రాంత జిల్లాల్లో అభాసుపాలవుతోంది. అటవీ భూముల కబ్జాదారుల ప్రతాపానికి పచ్చదనం ఆదిలోనే అంతమవుతోంది. కబ్జాదారులకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులే అండగా నిలుస్తుండటంతో అడవుల పునరుద్ధరణ లక్ష్యం ‘మొక్క’ దశలోనే ముగిసిపోతోంది. హరితహారం కార్యక్రమంలో భాగంగా అటవీ భూముల్లో నాటిన మొక్కల్లో 1,05,618 మొక్కలను జూలైలో కబ్జాదారులు పీకేశారు. 2014 నాటికి కబ్జాకు గురైన అటవీ భూముల జోలికి వెళ్లవద్దని స్వయంగా అటవీశాఖ మంత్రి జోగు రామన్న ఆదేశించడంతో ఈ ప్రాంతాల్లో హరితహారం నిలిచిపోయింది. కొందరు రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం క్షేత్రస్థాయిలో ఇలాంటి ప్రకటనలే చేస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో ఈ కార్యక్రమానికి బ్రేక్ పడింది. ఈ పరిస్థితులను వివరిస్తూ రాష్ట్ర అటవీ విభాగాధిపతి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) స్వయంగా గత నెల 20న ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. కబ్జాకు గురైన అటవీ భూములను ప్రభుత్వం క్రమబద్ధీకరించనుందనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడంతో కొత్తగా ఆక్రమణలు చోటుచేసుకుంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో స్వాధీనం చేసుకున్న అటవీ భూములను మళ్లీ ఆక్రమించుకుంటున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. గత మూడేళ్లలో నాటిన మొక్కలు, చెట్లను పీకేసి మరీ స్థానికులు కబ్జాలకు పాల్పడుతున్నారని నివేదించారు. క్షేత్రస్థాయిలో అడుగడుగునా అడ్డంకులు... రాష్ట్రంలో పచ్చదనాన్ని 24 శాతం నుంచి 33 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం హరితహారాన్ని నిర్వహిస్తోంది. 2015–19 మధ్య మొత్తం 230 కోట్ల మొక్కలను నాటాలనే లక్ష్యం నిర్దేశించుకోగా అందులో 80 కోట్ల మొక్కలను అటవీ ప్రాంతాల పునరుద్ధరణకు, మరో 20 కోట్ల మొక్కలను దట్టమైన అడవుల్లో నాటాలని నిర్ణయించింది. మిగిలిన 130 కోట్ల మొక్కలను మైదాన ప్రాంతాల్లో నాటుతోంది. వేల ఎకరాల్లో కబ్జాకు గురైన భూముల్లో మొక్కలు నాటి అడవులను పునరుద్ధరించాల్సి ఉండగా క్షేత్రస్థాయిలో అటవీ అధికారులకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇప్పటివరకు ఈ కార్యక్రమానికి రూ. 2,535.7 కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం వెచ్చింది. నాటిన మొక్కలను ఎక్కడికక్కడ పీకేస్తుండటంతో ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటోందని, మానవ శ్రమ, ప్రజాధనం భారీగా వృథా అవుతోందని పీసీసీఎఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అటవీ భూముల క్రమబద్ధీకరణ హామీలపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని పీసీసీఎఫ్ విజ్ఞప్తి చేశారు. ఆయన రాసిన లేఖలోని ముఖ్యాంశాలు... ఏడేళ్లలో 50 వేల ఎకరాల అడవులు అన్యాక్రాంతం... తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు అటవీ భూములను ఆక్రమించిన గ్రామస్తులను వేధించరాదంటూ గత జూన్ 22న అటవీశాఖ ఉన్నతాధికారులు, అటవీ సెక్షన్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి జోగు రామన్న ఆదేశాలు జారీ చేశారు. కానీ 2014 జూన్కు ముందు కబ్జాకు గురైన అటవీ భూములను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అటవీశాఖ వద్ద ఎలాంటి సమాచారం లేదు. 2005 డిసెంబర్ 13 నాటికి అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకే అటవీ హక్కుల గుర్తింపు చట్టం (ఆర్ఓఎఫ్ఆర్–2006) హక్కులు కల్పించింది. ఈ చట్టం కింద 1,86,534 దరఖాస్తులు రాగా అందులో అర్హతగల 93,494 దరఖాస్తులను ఆమోదించి 3,00,092 ఎకరాల భూములను సాగు చేసుకోవడానికి గిరిజనులకు సర్టిఫికెట్లు జారీ చేశారు. ఆ తర్వాత జరిగిన అటవీ భూముల కబ్జాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అటవీశాఖ వద్ద సమాచారం లేదు. 2008–09లో సైతం అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నాటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో ఇలాంటి అభిప్రాయాన్ని కలిగించడంతో పెద్ద ఎత్తున అడవులను నరికేసి భూములను కబ్జా చేయడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. అధికారిక లెక్కల ప్రకారం 2007 నుంచి 2014 నాటికి కొత్తగా 58,032 ఎకరాల అటవీ భూములు కబ్జాకు గురయ్యాయి. ఈ భూముల్లో మొక్కలు నాటేందుకు చేస్తున్న ప్రయత్నాలను స్థానిక ప్రజాప్రతినిధులు అడ్డుకుంటూ సిబ్బందిపై భౌతిక దాడులు చేసేలా స్థానికులను ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని ఘటనలు... ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తన గన్మెన్లతో కలసి గత నెల 18న కొత్తగూడెం పరిధిలోని చాటకొండ రిజర్వ్ ఫారెస్ట్లో 100 ఎకరాల అటవీ భూముల్లో హరితహారాన్ని అడ్డుకున్నారు. అటవీ సిబ్బందిని బెదిరించి బలవంతంగా అక్కడ్నుంచి వెళ్లగొట్టారు. అవి అటవీ భూములంటూ కలెక్టర్ ఫోన్లో ధ్రువీకరించినా లాభం లేకపోయింది. జూలై 7న బెల్లంపల్లి డివిజన్లో గిరెపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో రాజారాం, వెమనపల్లి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చెట్లను నరికి మూడోసారి అటవీ భూముల కబ్జాకు ప్రయత్నించారు. పాఖాల్ వన్యప్రాణి సంరక్షణ ప్రాంతంలో అటవీ భూమిని ట్రాక్టర్తో చదును చేసే యత్నాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి డి. నాగరాజుపై అశోక్నగర్ గ్రామ సర్పంచ్ సాయిలు, గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లా హాజీపూర్ రిజర్వు అటవీ ప్రాంతంలోని 10 హెక్టార్లలో నాటిన మొక్కలను గత నెల 5న బెల్యానాయక్ తండావాసులు పీకేశారు. ఏటూరునాగారం అటవీ సంరంక్షణ ప్రాంతంలో గత నెల 5న ఐదు ట్రాక్టర్లతో భూములను చదును చేసేందుకు జరిగిన ప్రయత్నాలను అడ్డుకునేందుకు వెళ్లిన వరంగల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్తోపాటు మరో ఇద్దరు ఐఎఫ్ఎస్ అధికారులను గ్రామస్తులు రెండు గంటలపాటు నిర్బంధించారు. ఈ ప్రాంతంలో ఐదు గ్రామాల ప్రజలు దాదాపు 13 వేల ఎకరాల అటవీ భూములను ఆక్రమించారు. పెద్దపల్లి అటవీ ప్రాంతంలోని 75 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు ప్రయత్నించిన అటవీ సిబ్బందిపై గత నెల 5న కబ్జాదారులు దాడికి పాల్పడ్డారు. మామిడిగూడ అటవీ ప్రాంతంలోని 25 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీ సిబ్బందిపై గత నెల 2న టడ్వాల్ మండలం బోటిలింగాల గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. -
నాగార్జున యాడ్ను తొలగించేశారు
న్యూఢిల్లీ : తాజాగా కల్యాణ్ జువెలర్స్ రూపొందించిన యాడ్ అందరికీ తెలిసే ఉంటుంది. ‘నిజాయితీ ఎక్కడో నమ్మకమూ అక్కడే’ అనే కాన్సెప్ట్తో.. ప్రతి రోజూ బుల్లితెరపై ఇది మారుమోగిపోయింది. ఇంత హల్చల్ చేసిన ఈ యాడ్ ఇక నుంచి టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో కనిపించదట. ఈ యాడ్ను అన్ని ప్రసార మాధ్యమాల నుంచి తొలగిస్తున్నట్టు కల్యాణ్ జువెలర్స్ నిర్వాహకులు ప్రకటించారు. తెలుగులో నాగార్జున, హిందీలో అమితాబ్ బచ్చన్, ఆయన కుమార్తె శ్వేతా బచ్చన్ లతో రూపొందించిన ఈ వ్యాపార ప్రకటన బ్యాంకులపై నమ్మకం కోల్పోయేలా ఉందంటూ ఏఐబీవోసీ అసంతృప్తిని వ్యక్తం చేయడంతో, ఆ యాడ్ ను తీసేస్తున్నట్టు కల్యాణ్ జువెలర్స్ తెలిపింది. ఈ యాడ్ను తాము కేవలం ప్రచారం కోసమే రూపొందించామని, కానీ ఈ యాడ్ వల్ల కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని కల్యాణ్ జువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కల్యాణ్ రామన్ అన్నారు. తమ సంస్థ వ్యాపారంలో బ్యాంకింగ్ వ్యవస్థది కీలక పాత్రని, దేశంలోని బ్యాంకులకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఎదురైనందుకు చింతిస్తూ, ఈ యాడ్ ను తొలగిస్తున్నామని ఆయన తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి బ్యాంకులకు నష్టం కలిగించే చర్యలను తామెన్నడూ ప్రోత్సహించబోమని చెప్పారు. అమితాబ్తో రూపొందిన హిందీ యాడ్ను కూడా సోమవారమే తొలగించిన సంగతి తెలిసిందే. ప్రభూతో రూపొందిన తమిళ యాడ్, మంజు వారియర్తో షూట్ చేసిన మలయాళ యాడ్ను కూడా కల్యాణ్ జువెలర్స్ తొలగించినట్టు తెలిసింది. కాగ, కల్యాణ్ జువెలర్స్ రూపొందించిన ఈ యాడ్, బ్యాంకింగ్ వ్యవస్థపై అపనమ్మకం కలిగించేలా ఉందంటూ.. బ్యాంకింగ్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ యాడ్ను తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ యాడ్ను తొలగించకపోతే, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. కల్యాణ్ జువెలర్స్ యాడ్లో ఏముంది.. అక్కినేని నాగార్జున ఓ రిటైర్డు ఉద్యోగి వేషంలో.. తన మనవరాలితో పాటు బ్యాంకుకు వస్తారు. నా పెన్షన్ అని ఓ బ్యాంక్ ఉద్యోగికి పాస్పుస్తకం చూపిస్తే, నాలుగు కౌంటర్ వద్దకు వెళ్లడంటూ ఆ బ్యాంక్ ఉద్యోగి విసుక్కోవడం, మరో కౌంటర్ వద్ద ఇది తలనొప్పి కేసు అంటూ మేనేజర్ వద్దకు వెళ్లమనడం బ్యాంక్ ఉద్యోగుల నిర్లక్ష్యాన్ని చూపించారు. బ్యాంక్ మేనేజర్ వద్ద తన ఖాతాలోకి రెండు సార్లు పెన్షన్ డబ్బు క్రెడిట్ అయిందని చెబితే, అదృష్టం అంటే ఇదే పండుగ చేసుకోండని సూచిస్తారు. తిరిగి ఇవ్వడానికి వచ్చానంటే, ఇది పెద్ద తతంగమండి, గమ్మున వదిలేయండి, ఎవరికి తెలుస్తుందని అని నిర్లక్ష్య పూర్వక సమాధానం చెబుతారు. నాకు తెలుసు, ఎవరికి తెలిసినా తెలియకపోయినా.. తప్పు తప్పే అని నాగార్జున అనడం.. నిజాయితీ ఎక్కడో నమ్మకమో అక్కడే.. అదే కల్యాణ్ జువెలర్స్ అనడంతో ఈ యాడ్ ముగుస్తుంది. ఈ యాడ్ లో బ్యాంకు అధికారులు కస్టమర్లను పట్టించుకునే విధానంతో పాటు.. అనుకోకుండా ఒకరి ఖాతాలోకి రెండు పర్యాయాలు వచ్చిన పెన్షన్ డబ్బును కట్ చేయడానికి చూసిన నిర్లక్ష్యం ధోరణి కనబడుతుంది. దీంతో కల్యాణ్ జువెల్లర్స్ యాడ్ పై బ్యాంకింగ్ అధికారులు కన్నెర చేశారు. అటు బ్యాంకు ఉద్యోగ కార్మిక సంఘాలు కూడా ఈ యాడ్ పై తీవ్రంగా ఫైర్ అవుతున్నాయి. -
ఎర్రకోటలో ‘దుమ్ము’ దులిపారు..
న్యూఢిల్లీ : భారత చరిత్రలో ఎర్రకోటకు ఉన్న విశిష్టత గురించి అందరికి తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశ ప్రధాని జాతీయ జెండా ఎగరేసేది ఇక్కడి నుంచే. అయితే పెరిగిపోతున్న కాలుష్యం వల్ల అటువంటి అద్భుత కట్టడాల ఉనికి ప్రశ్నార్ధకంగా మారుతుంది. దాదాపు నాలుగు శతాబ్దాల కిందట మెఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన ఎర్రకోటని పరిరక్షించటానికి భారత పురావస్తు సర్వే విభాగం(ఏఎస్ఐ) నడుం బిగించింది. అందులో భాగంగా ఎర్రకోట పరిధిలో దుమ్మును తొలగించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. కేవలం ఐదు నెలల కాలంలోనే కోటకు ముప్పుగా పరిణమించిన 22 లక్షల కేజీల దుమ్ము, ధూళిని ఏఎస్ఐ తొలగించింది. ఈ ఏడాది ప్రారంభంలో ఈ పక్రియను మొదలుపెట్టిన పురావస్తు శాఖ... గత వందేళ్ల నుంచి దాదాపు రెండు మీటర్ల మందంగా విస్తరించిన మట్టి పొరను తొలగించామని ఏఎస్ఐ డైరక్టర్ జనరల్ జె శర్మ తెలిపారు. నేలపై పేరుకుపోయిన దుమ్ము కట్టడానికి ప్రమాదకరంగా మారిందన్నారు. ఎర్రకోటకు వాస్తవ రూపాన్ని తెచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. కోట లోపల మరుగుదొడ్లు, తాగునీరు వంటి వసతులు కల్పించడానికి ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు. -
లెక్చరర్లపై వేటు...!
శాతవాహనయూనివర్సిటీ: ప్రైవేట్ ఇంజినీరింగ్ అధ్యాపకుల నెత్తిన మరో పిడుగుపడనుంది. ఏళ్లుగా అరకొర వేతనాలతోనే బోధన చేస్తున్న లెక్చరర్ల ఉద్యోగాలకు కళాశాల యాజమాన్యాలు ఉద్వాసన పలికేందుకు పావులు కదుపుతున్నాయి. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) రూపొందించిన కొత్త నిబంధన కత్తి ఇంజినీరింగ్ మాస్టార్ల మెడపై వేలాడుతోంది. ప్రస్తుతం జేఎన్టీయూ తనిఖీలు పూర్తై అనుబంధ హోదా ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలో ఏఐసీటీఈ తనిఖీలు కూడా జరగనున్నట్లు సమాచారం. ఈ తనిఖీలన్నీ పూర్తయితే అనుబంధ హోదా ప్రకటించగానే పలు కళాశాలలు ఫ్యాకల్టీ సంఖ్య తగ్గించుకునేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఇంజినీరింగ్ కళాశాల వర్గాల్లో చర్చ మొదలైంది. ఇదే జరిగితే తనిఖీలు పూర్తవగానే యాజమాన్యాలు అధ్యాపకులను నిర్దాక్షిణ్యంగా బయటకు పంపనున్నాయి. ఈ పరిణామంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు 200పైగా మంది రోడ్డున పడనున్నట్లు సమాచారం. తమ ఉద్యోగాలకు భద్రత కల్పించాలని, నిబంధనల పేరుతో బయటకు పంపొద్దని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శరాఘాతంలా 1@20 నిబంధన.. ఏఐసీటీఈ కొత్త నిబంధనలు ఇంజినీరింగ్ లెక్చరర్ల ఉద్యోగాలకు ఎసరుపెట్టేందుకు శరాఘాతంగా మారింది. గతంలో 1ః15గా ఉన్న ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి ప్రస్తుతం 1ః20గా మార్చింది. దీంతో 60 మంది విద్యార్థులకు నలుగురు ఉండాల్సింది ఇక నుంచి ముగ్గురే అవసరముంటుంది. అంటే ప్రతీ 60 మందికి ఒక అధ్యాపకుడు ఉద్యోగాన్ని కోల్పోతున్నాడని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. కొత్త నిబంధనలతో తమ ఉద్యోగాలు ఏ క్షణాన కోల్పోతామోనని అధ్యాపకులు కలవరపాటుకు గురవుతున్నారు. తనిఖీలు పూర్తయ్యే వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగిన లెక్చరర్లలో కొత్త నిబంధన అలజడి సృష్టించింది. ఇష్టారాజ్యంగా తొలగింపులు.. ఇంజినీరింగ్ కళాశాలల్లో లెక్చరర్ల నియామకాలు యూనివర్సిటీలో పరిధిలోనే ఉంటాయని సమాచారం. దీనికోసం యూనివర్సిటీ అ«ధికారులు ప్రత్యేకంగా ర్యాటిఫికేషన్ నిర్వహించి అర్హతను తేల్చి వారి సర్టిఫికేట్లు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. సబ్జెక్టుల్లో పరిజ్ఞానం స్వయంగా తెలుసుకునేందుకు యూనివర్సిటీ అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో ఎక్కడ తేడా జరిగినా వారిని తిరస్కరిస్తారు. ఈ విధంగా లెక్చరర్లను నియమించే బాధ్యత పూర్తిస్థాయిలో యూనివర్సిటీ అధికారులదే ఉంటుందని విద్యావేత్తలు అంటున్నారు. తొలగింపు మాత్రం యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా చేస్తున్నాయని సమాచారం. ఒక లెక్చరర్ను తొలగించాలంటే సాంకేతిక విద్యాశాఖకు సమాచారమిచ్చి తొలగింపునకు గల కారణాలు తెలపాలి. ఈ ఫిర్యాదుపై సాంకేతిక విద్యాశాఖ అధికారులు విచారణ జరిపిన తర్వాత వారు ఇచ్చిన నివేదిక మేరకు నిర్ణయం తీసుకోవాలి. కానీ.. పలు కళాశాలల్లో గతంలో లెక్చరర్ల తొలగింపుల్లో ఇవేమీ జరగడం లేదని ఆరోపణలున్నాయి. అకాడమిక్ ఫలితాలు సరిగా లేవని.. ప్యాకల్టీగా నైపుణ్యాలు లేవనే కారణాలు చూపుతూ కొందరు తొలగింపులు చేయడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం. జిల్లాలో 200 మందిపై వేటు..? ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 13 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. ఇందులో దాదాపుగా విద్యార్థులకు తరగతులు బోధించే లెక్చరర్ల సంఖ్య వేల సంఖ్యల్లో ఉంటుంది. వీరిలో ఏఐసీటీఈ విధిస్తున్న నూతన నిబంధనలతో ఊహించినట్లు తొలగింపులు జరిగితే దాదాపు 200 మందికి పైగానే ఉద్యోగాలు కోల్పోతారనే చర్చ ఇంజినీరింగ్ అధ్యాపకవర్గాల్లో జరుగుతోంది. కొన్ని కళాశాలల్లో లెక్చరర్లు ఎక్కువగా ఉన్నా ఫర్వాలేదని వారిని అలాగే కొనసాగించాలని నిర్ణయానికి వస్తున్నట్లు.. మరికొన్ని కళాశాలల్లో నిబంధన ప్రకారం ఫ్యాకల్టీని సరిచూసుకొని మిగితా వారికి ఉద్వాసన పలకాలని చూస్తున్నట్లు సమాచారం. లెక్చరర్లు తగ్గితే చదువుల్లో నాణ్యత కొరవడుతుందని, ప్రభుత్వం వెంటనే దీనిపై దృష్టిసారించి వెంటనే తొలగింపులు ఆపేలా చర్యలు చేపట్టాలని లెక్చరర్లు, విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. తొలగింపులు ఆపాలి ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏఐసీటీఈ విధించిన నిబంధనల ప్రకారం తొలగింపులు చేయకూడదని కోరుతున్నాం. ఇప్పటికే భద్రత లేని బతుకులతో జీవితాన్ని నెట్టుకొస్తున్నాం. లెక్చరర్లు ఎక్కువ సంఖ్యలో ఉంటే చదువులో నాణ్యత కూడా పెరిగేందుకు అవకాశాలుంటాయి. అనవసరంగా ఇలాంటి నిబంధనలను తీసుకొస్తూ ఇంజినీరింగ్ కళాశాల లెక్చరర్లను అయోమయానికి గురిచేస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే ఈ నిబంధనను వెనక్కి తీసుకొని పాతపద్ధతిని కొనసాగించాలని కోరుతున్నాం.– కె.మహేశ్,పీజీ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు -
క్రేజీ పాటను హ్యాక్ చేసేశారు
ఈ మధ్య హ్యాకర్లు దేన్నీ వదలటం లేదు. పాప్ సింగర్స్ కమ్ కంపోజర్స్ లూయిస్ ఫోన్సీ, డాడీ యాంకీలు చేసిన ‘డెస్పాసిటో’ ఆల్బమ్ ప్రపంచాన్ని ఉర్రూత లూగించిన విషయం తెలిసిందే. చాలా మంది ఆ ఆల్బమ్ను కాపీ కొట్టేసి సొమ్ము చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోను దాదాపు 500 కోట్ల మంది ఈ వీడియోను వీక్షించారు. యూట్యూబ్లో అత్యధిక మంది వీక్షించిన పాట ఇదే. అయితే ఈ వీడియోపై హ్యాకర్ల కన్నేశారు. వెవో యూట్యూబ్ అకౌంట్ను హ్యాక్ చేసి ఆ పాట ఒరిజినల్ థంబ్ నెయిల్(ఫోటో)ను.. సాంగ్ టైటిల్ను మార్చిపడేయటంతో డెస్పాసిటో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. కాసేపటికే ఆ ఒరిజినల్ ట్రాక్ యూట్యూబ్లోంచి మాయం కావటం గమనార్హం. అయితే డిలీట్ చేసింది ఎవరన్న దానిపై స్పష్టత లేదు. కాగా, సంచలనం సృష్టించిన గంగ్నమ్ స్టైల్ పాట తర్వాత మళ్లీ యూట్యూబ్లో ఆ స్థాయిలో ఉర్రూతలు ఊగించింది డెస్సాసిటోనే. ఒరిజినల్ సాంగ్ స్పానిష్, ఇంగ్లీష్ లిరిక్స్తో రూపుదిద్దుకుంది. తెలుగులో నటుడు నోయల్ ఈ పాటను రిమేక్ చేయగా.. ఆ ప్రయత్నం ఆకట్టుకుంది. -
రైళ్లలో ఎల్సీడీ స్క్రీన్లు కనుమరుగు
సాక్షి, న్యూఢిల్లీ : గత ఏడాది జులైలో అట్టహాసంగా తేజాస్ ఎక్స్ప్రెస్లో ఎల్సీడీ స్ర్కీన్లను ఆవిష్కరించిన రైల్వేలు ఏడాది తిరగకుండానే వాటిని శాశ్వతంగా తొలగించనున్నాయి. ప్రయాణీకులు ఎల్సీడీ స్క్రీన్లను పలుమార్లు ధ్వంసం చేయడం, హెడ్ఫోన్స్ను పగులగొట్టడం వంటి ఘటనలతో నిర్వహణ ఖర్చులు పెరిగిపోతుండటంతో రైల్వేలు వాటిని తొలగించాలని నిర్ణయించాయి. కొందరు ప్రయాణీకులు ఎల్సీడీ స్ర్కీన్లను తమ ఇంటికి తీసుకెళ్లేందుకు వాటిని పూర్తిగా పెకిలించే ప్రయత్నం చేస్తుండటంతో విస్తుపోవడం అధికారుల వంతవుతోంది. ముంబయి నుంచి గోవాకు వెళ్లే తేజాస్ ఎక్స్ప్రెస్లో ఎల్సీడీ స్క్రీన్లను జెండా ఊపి ప్రారంభించినప్పటి నుంచే వాటిని ధ్వంసం చేయడం, చెడగొట్టడం మొదలైందని అధికారులు చెబుతున్నారు. నిర్వహణ ఖర్చుల భారంతో తేజాస్, శతాబ్ధి ఎక్స్ప్రెస్ల్లో ప్రతిసీటు వెనుకాల అమర్చిన అన్ని ఎల్సీడీ స్క్రీన్లనూ తొలగించాలని రైల్వేలు నిర్ణయించాయి. -
గూగుల్లో ఈ మార్పును గమనించారా?
సాక్షి, టెక్నాలజీ : ఇంటర్నెట్ యూజర్లకు ప్రముఖ సెర్చింజన్ గూగుల్ షాక్ ఇచ్చింది. ఇకపై మీకు నచ్చిన ఫోటోలను ఇష్టమొచ్చినట్లు సేవ్ చేసుకోకుండా సెర్చింజన్లో మార్పులు చేసేసింది. ఫ్రీ ఫోటోలకు ఆస్కారం లేకుండా ‘వ్యూ ఇమేజ్’ బటన్ను తొలగించేసింది. ఇంతకు ముందు గూగుల్లో ఏదైనా ఫోటోలను ఓపెన్ చేసినప్పుడు పక్కన విజిట్, షేర్లతోపాటు వ్యూ ఇమేజ్ ఆప్షన్ కూడా కనిపించేది. దానిని క్లిక్ చేస్తే ఆ ఫోటో ఓపెన్ అయ్యి సేవ్ చేసుకునే సౌలభ్యం ఉండేది. అయితే కాపీ రైట్స్ కారణం చెబుతూ ఇప్పుడు ఆ ఆప్షన్ను గూగుల్ తొలగించేసింది. ఇప్పుడు గూగుల్ లో కేవలం విజిట్, షేర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ‘గూగుల్లో నేటి నుంచే కొన్ని మార్పులు చేశాం. వ్యూ ఇమేజ్ బటన్ను తొలగించేశాం అని, యూజర్లకు, ఆధారిత వెబ్సైట్లకు ఉపయోగకరంగా ఉండాలనే ఈ పని చేశాం’ అని ఓ ప్రకటనలో గూగుల్ పేర్కొంది. దీని ద్వారా విజిట్ పేజ్ బటన్ ద్వారా ఆధారిత వెబ్ సైట్కు యూజర్ వెళ్తాడు. తద్వారా తమ ఆదాయం పెంచుకునేందుకే గూగుల్ ఈ పని చేసినట్లు స్పష్టమౌతోంది. హై డెఫినేషన్ ఫోటోలు కావాలనుకుంటే తప్పనిసరిగా ఆ వెబ్సైట్ను ఆశ్రయించాల్సిందేనని గూగుల్ చెబుతుండగా.. ప్రత్యామ్నయ మార్గాలను కూడా వెతుక్కునే పనిలో యూజర్లు పడ్డారు. Today we're launching some changes on Google Images to help connect users and useful websites. This will include removing the View Image button. The Visit button remains, so users can see images in the context of the webpages they're on. pic.twitter.com/n76KUj4ioD — Google SearchLiaison (@searchliaison) 15 February 2018 -
ఎయిర్టెల్ నేషనల్ రోమింగ్ చార్జీలు తొలగింపు
⇒ 90% తగ్గిన ఇంటర్నేషనల్ కాల్ రేట్స్ ⇒ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి... న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ కంపెనీ నేషనల్ రోమింగ్ చార్జీలను పూర్తిగా తొలగించింది. భారత్లో రోమింగ్కు సంబంధించి అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్లు, డేటా వినియోగంపై అన్ని రోమింగ్ చార్జీలను తొలగిస్తున్నట్లు భారతీ ఎయిర్టెల్ తెలిపింది. అంతర్జాతీయ కాల్ రేట్లను 90 శాతం, డేటా చార్జీలను 99 శాతం తగ్గించామని భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈఓ (ఇండియా, సౌత్ ఏషియా) గోపాల్ విట్టల్ చెప్పారు. ఇప్పుడు అంతర్జాతీయ కాల్స్ నిమిషానికి కనిష్టంగా రూ.3, డేటా చార్జీలు ఒక్క ఎంబీకి రూ.3 చొప్పున ఉంటాయని పేర్కొన్నారు. ఈ మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని వివరించారు. ఇటీవలే రంగంలోకి వచ్చిన రిలయన్స్ జియో పోటీని తట్టుకోవడానికి ఎయిర్టెల్ ఈ నిర్ణయం తీసుకుంది. భారత్లో ఎక్కడ నుంచి ఎక్కడికైనా తమ వినియోగదారులు రోమింగ్ చార్జీలు లేకుండా స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చని గోపాల్ విట్టల్ చెప్పారు. నేషనల్ రోమింగ్లో ఉన్నప్పుడు అదనపు డేటా చార్జీలు కూడా ఉండవని, తమ వినియోగదారులకు ఇప్పుడు దేశం మొత్తం లోకల్ నెట్వర్క్లాగానే ఉంటుందని వివరించారు. ఆనలాగ్ ప్రపంచంలో నియంత్రణ సంస్థలు... బార్సిలోనా: పలు నియంత్రణ సంస్థలు ఇంకా అనలాగ్ ప్రపంచంలోనే ఉన్నాయని బారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ చెప్పారు. కంపెనీలు ఎక్కువగా ఉంటే, పోటీ తీవ్రంగా ఉంటుందనుకోవడం సరికాదన్నారు. చిన్న దేశాల్లో 2, పెద్ద దేశాల్లో అయితే మూడే టెలికం కంపెనీలుండాలని సూచిం చారు. బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో ఆయన మాట్లాడారు. ఎయిర్టెల్ టెలినార్ను కొనుగోలు చేయడం, ఐడియా, వొడాఫోన్ల విలీన వార్తల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత
దేవాదాయశాఖ స్థలంలో పేదల ఇళ్లు కోర్టు ఆదేశాలతో తొలగించే యత్నం అడ్డుకున్న స్థానికులు.. ఆత్మహత్యాయత్నం.. ఏప్రిల్ వరకు గడువిప్పించిన ఎమ్మెల్యే గోరంట్ల ఆవలోని వాంబే గృహాల్లో ఇళ్లు ఇస్తామని హామీ సాక్షి, రాజమహేంద్రవరం : దేవాదాయశాఖ స్థలంలో నిర్మించుకున్న ఇళ్ల తొలగింపులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్డు వైపు 37వ డివిజన్ పరిధిలోని వీరభద్రపురంలో టౌన్ సర్వే నంబర్ 919లో దువ్వూరి వెంకాయమ్మ సత్రం భూమి 526 చదరపు గజాలు ఉంది. ఈ భూమి పందిరి మహదేవుడు సత్రం ఆధీనంలో ఉంది. ఆ భూములను ఆక్రమించుకున్న 19 మంది 50 ఏళ్లుగా పెంకుటిళ్లు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నారు. ఈ భూములు ఖాళీ చేయించేందుకు దేవాదాయ శాఖ ట్రిబ్యునల్లో పందరి మహదేవుడు సత్రం అధికారులు కేసు వేశారు. ఆక్రమణదారులను ఖాళీ చేయించాలని ఆదేశిస్తూ ట్రిబ్యునల్ తీర్పు వెలువరించింది. ఆ భూమిని ఖాళీ చేయాలని ఆక్రమణల తొలగింపు అధికారి ఇన్చార్జ్ డీసీ డీఎల్వీ రమేష్బాబు వారికి మూడుసార్లు నోటీసులు జారీ చేశారు. ప్రతిసారీ రాజకీయ పార్టీల నేతలు జోక్యం చేసుకుంటుండడంతో వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా సోమవారం వారిని ఖాళీ చేయించేందుకు ఇన్చార్జ్ డీసీ రమేష్బాబు, పందిరి మహదేవుడు సత్రం ఈవో సుబ్రమణ్యం నేతృత్వంలో 50 మంది దేవాదాయ శాఖ సిబ్బంది వచ్చారు. మూడో పట్టణ పోలీస్స్టేషన్ నుంచి సీఐ రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో 10 మంది కానిస్టేబుళ్లు వచ్చారు. తాము ఇళ్లు ఖాళీ చేయబోమని అక్కడి వారు భీష్మించారురు. బలవంతంగా ఖాళీ చేయించాలని ప్రయత్నించడంతో స్థానికుల్లో ఒకరు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోబోయారు. అతడి ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకున్నారు. కేబుల్ వైర్లు, విద్యుత్ సౌకర్యం తొలగించారు. మహిళలు ఇంట్లో వస్తువులు ఓ వైపు తీసుకొస్తుండగానే దేవాదాయ శాఖ అధికారులు తొలగింపు ప్రక్రియ చేపట్టారు. ఈ నేపథ్యంలో అధికారులకు, స్థానికులకు మధ్య పెనుగులాట చోటుచేసుకుంది. స్థానిక కార్పొరేటర్ పెనుగొండ విజయభారతి, ఇతర కార్పొరేటర్లు తంగెళ్ల బాబి, పాలవలస వీరభద్రం, వైఎస్సార్సీపీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని బాధితులకు అండగా నిలిచారు. అయినా సిబ్బంది ఆక్రమణల తొలగింపు చేపట్టడంతో సమాచారం అందుకున్న రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు ఇతర అనుచరులతో ఘటనా స్థలానికి వచ్చారు. ఆదివారం ఈ విషయం ఈవో సుబ్రమణ్యంతో చర్చించినా తన మాట ఖాతరు చేయకుండా తొలగింపు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరందరికీ ఆవ రోడ్డులోని వాంబే గృహాలు కేటాయించనున్నామని, ఇంతలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆ ప్రకియ నిలిచిపోయిందన్నారు. మార్చి 25 తర్వాత వీరికి ఇళ్లు కేటాయించిన వెంటనే ఏప్రిల్ మొదటి వారంలో ఆక్రమణలు తొలగింపజేస్తామని స్పష్టం చేశారు. అప్పటి వరకు కూడా ఆగకుండా పేదలపై దేవాదాయ శాఖ సిబ్బంది ప్రతాపం చూపడం భావ్యం కాదన్నారు. ఎమెల్యే విజ్ఞప్తి మేరకు ఏప్రిల్ వరకు గడువు ఇచ్చిన దేవాదాయ శాఖ ఇన్చార్జ్ డీసీ రమేష్బాబు సిబ్బందితో తిరిగి వెళ్లిపోయారు. ఏప్రిల్ మొదటి వారం వరకు గడువిచ్చామని, ఆ తర్వాత ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లో ఆపబోమని రమేష్బాబు స్పష్టం చేశారు. -
యువతి కడుపులో...150పాములు!
-
యువతి కడుపులో...150పాములు!
లక్నో: ఉత్తరప్రదేశ్ లో ఓ యువతికి ఆపరేషన్ చేసిన డాక్టర్లు సైతం నివ్వర పోయే షాకింగ్ ఘటన ఒకటి చోటుచేసుకుంది. కడుపునొప్పితో బాధపడుతున్న నేహా బేగం(22)కు శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులు ఆమె కడుపులోంచి దాదాపు 150 బతికున్న వానపాములను వెలికితీశారు. దాదాపు 4 గంటల పాటు శస్త్ర చికిత్స నిర్వహించి డాక్టర్లు పెద్ద సంఖ్యలో వాన పాములు(వార్మ్స్) ఉండడాన్ని చూసి షాక్ తిన్నారు. వివరాల్లోకి వెళ్తే...చందౌలి కి చెందిన నేహా తరచూ కడుపునొప్పి, వాంతులతో బాధపడేది. ఎన్ని రకాలు మందులు తీసుకున్నా.. ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం కనబడలేదు. ఇక భరించలేని స్థితిలో చివరికి కేజీ నందా ఆసుపత్రి వైద్యులను సంప్రదించింది. ఆమె పేగుల్లో ఏదో ఆడ్డుపడుతున్నట్లు గుర్తించిన డాక్టర్లు ఆపరేషన్ చేశారు. ఆమె పేగుల్లోంచి 10 అంగుళాల పొడవైన దాదాపు 150 బతికున్న వానపాములు బయటికి తీశారు. సాధారణంగా 3 లేదా 4 వాన పాములు బయట పడుతుంటాయని, కానీ మానవ శరీరంలో ఇంత పెద్ద సంఖ్యలో వానపాములు బయట పడడం మాత్రం ఇదే తొలిసారని మేల్ గైనకాలజిస్టు డాక్టర్ ఆనంద్ ప్రకాష్ తివారీ చెప్పారు. తామే దిగ్బ్రాంతికి గురయ్యామన్నారు. అనారోగ్యమైన జీవనశైలి కారణంగానే శరీరంలో ఇలాంటి క్రిములు పెరుతాయన్నారు. రక్తప్రవాహంలో ప్రవేశించి అనంతరం శరీరంలోపల పెరుగుతాయని డాక్టర్ తివారీ చెప్పారు. ఈ జీవులు ఆమె మెదడులోకి ప్రయాణించి ఉంటే.. ప్రాణానికే ముప్పు వచ్చేదన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు, నోటి ద్వారా ఆహారం తీసుకుంటున్నట్లు చెప్పారు. భరించలేని కడుపునొప్పి, వాంతులతో విలవిలలాడిపోయేదాన్నని, ఎన్నోనిద్రలేనిరాత్రుళ్లు గడిపానని నేహ తెలిపింది. తనకు పునర్జన్మను ప్రసాదించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపింది. -
సర్జరీ చేసిన 18 సంవత్సరాల తర్వాత!
హనోయ్: తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ ఎదురైంది. ఆల్ట్రా సౌండ్ స్కాన్లో తన పొట్టలో 15 సెంటీమీటర్ల పొడవైన కత్తెర ఉందని తేలడంతో కళ్లు తేలేశాడు. అయితే.. అది తన పొట్టలోకి ఎలా వచ్చిందా అని ఆలోచిస్తే.. అది ఈనాటిది కాదు.. 18 సంవత్సరాల క్రితంది అని గుర్తుచేసుకున్నాడు. 1998లో జరిగిన కారు ప్రమాదంలో వియత్నాంకు చెందిన మా వాన్ నాట్(54) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పట్లో వైద్యులు ఆపరేషన్ నిర్వహించి అతడి ప్రాణాలు కాపాడారు. అయితే.. ఆపరేషన్ నిర్వహించే సమయంలో అతడి పొట్టలో ఓ భారీ కత్తెరను వదిలేసి ముగించారు. ఆ సర్జరీ విషయమే మరచిపోయి హాయిగా ఉంటున్న వాన్ నాట్ ఇటీవల తీవ్ర కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్లడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హనోయ్ సమీపంలోని ఓ ఆసుపత్రి వైద్యులు సుమారు 3 గంటల పాటు శ్రమించి అతడి పొట్టలో ఉన్న కత్తెరను తొలగించారు. గతంలో సర్జరీ చేసిన వైద్యులపై చర్యలు తీసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఇన్నేళ్లు గడవడంతో వారిని గుర్తించడం కష్టంగా మారిందని వారు చెబుతున్నారు. -
మిస్త్రీకి మరో షాక్!
ముంబై: టాటా గ్రూప్ ఛైర్మన్ గా తొలగించబడిన సైరస్ మిస్త్రీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛైర్మన్ గా తొలగించబడిన తరువాత ఆయన అధికారాలకు, పదవులకు చెక్ పెడుతున్న సంస్థ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. టాటా గ్రూపుకు చెందిన టాటా ఇండస్ట్రీస్ డైరెక్టర్ పదవి నుంచి కూడా తొలగించింది. ఈ మేరకు సోమవారం జరిగిన షేర్ హోల్డర్స్ సమావేశంలో నిర్ణయం జరిగింది. టాటా ఇండస్ట్రీస్ అసాధారణ సర్వ సభ్య సమావేశంలో (ఈజీఎం) ఆయన్ను డైరెక్టర్ గా తొలగిస్తూ నిర్ణయం జరింగింది. మిస్త్రీ తొలగింపుకు అనుకూలంగా వాటాదారులు ఓటు వేశారు. ఆయన డైరెక్టర్ గా కొనసాగితే టాటా గ్రూపు మరింత విచ్ఛిన్నమవుతుందని పేర్కొన్న సంస్థ ఆయన్ను తొలగించాల్సిందిగా వాటాదారులకు విజ్ఞప్తి చేసింది. అలాగే రానున్న రోజుల్లో మిస్త్రీ తొలగింపు కోసం మరో ఆరు టాటా గ్రూపులు సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ఇంతకు ముందే ఆయన్ను టాటా ఇండస్ట్రీస్ ఛైర్మన్ గా తొలగించారు. తాజాగా డైరెక్టర్ పదవి నించి కూడా తొలగించిన టాటా సంస్థ మిస్త్రీపై మరింత పట్టు సాధించింది. కాగా టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి అర్థాంతరంగా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీపై గ్రూప్ కంపెనీలు కూడా వేటువేస్తున్న సంగతి తెలిసిందే. కంపెనీల చైర్మన్గా బోర్డు సభ్యుడిగా ఆయన్ని తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సైరస్ మిస్త్రీ ఇక షేర్హోల్డర్స్ మద్దతుపై దృష్టిసారించిన సంగతి తెలిసిందే. -
అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ తొలగింపు
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జేపీ రాజ్కోవాను పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిర్ణయం తీసుకున్నారు. మేఘాలయ గవర్నర్ షన్ముగనాథన్కు అదనంగా అరుణాచల్ ప్రదేశ్ బాధ్యతలను అప్పగించారు. ఆరోగ్య కారణాల రిత్యా రాజ్కోవాను రాజీనామా చేయాల్సిందిగా కేంద్రం ఇటీవల కోరిన విషయం తెలిసిందే. అయితే రాజ్కోవా మాత్రం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, విధులను సక్రమంగానే నిర్వర్తిస్తున్నానని రాజీనామా చేయడానికి నిరాకరించారు. అవసరమైతే రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా తొలగించాలని, అప్పటివరకు రాజీనామా చేసే ప్రసక్తే లేదని రాజ్కోవా ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అతడిని తప్పిస్తూ సోమవారం ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. -
గోవా ఆరెస్సెస్ చీఫ్పై వేటు
పనాజీ: గోవా ఆరెస్సెస్ చీఫ్పై ఆరెస్సెస్ వేటు వేసింది. ఆయనను చీఫ్ బాధ్యతల నుంచి తొలగించింది. గోవాలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే. అయితే, గోవా అరెస్సెస్ విభాగ చీఫ్ సుభాష్ వెలింకార్ బీజేపీకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని కారణంతో ఆయనపై వేటు వేసింది. 'గోవా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ఆరెస్సెస్ చీఫ్ సుభాష్ వెలింకార్ను ఆ బాధ్యతల నుంచి తొలగిస్తున్నాము. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయి' అని ఆరెస్సెస్ పబ్లిసిటీ చీఫ్ మన్మోహన్ వైద్యు బుధవారం ఒక ప్రకటనలో చెప్పారు. -
సైనికుడి ముఖం నుంచి గ్రనేడ్ తొలగించిన వైద్యులు!
అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఓ సైనికుడి ముఖంలోకి లైవ్ గ్రనేడ్ చొచ్చుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన వైద్యులు తక్షణ వైద్యం అందించి అతడ్ని ప్రాణాలతో కాపాడటంతోపాటు, ముఖంలోకి చొచ్చుకు పోయిన లైవ్ గ్రనేడ్ను విజయవంతంగా బయటకు తీశారు. బాధితుడి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం కలగకుండా గ్రనేడ్ను ముఖం నుంచి తొలగించి సఫలమయ్యారు. ఇందుకోసం కొలంబియా సర్జన్లు గంటల తరబడి కష్టపడ్డారు. ఆపరేషన్ కోసం సంఘటన స్థలం నుంచీ సైనికుడిని బొగోటా మిలటరీ ఆస్పత్రికి అంబులెన్స్ ద్వారా తరలించారు. ఇలా తరలించేందుకు దాదాపు 8 గంటల సమయం పట్టింది. అత్యవసర పరిస్థితుల్లో హెలికాప్టర్ ద్వారా తరలించాల్సిన బాధితుడిని, అతడి ముఖంలో ఉన్న గ్రనేడ్ పేలే ప్రమాదం ఉండటంతో ఆలస్యం అయినా రోడ్డు మార్గంలోనే తరలించాల్సి వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు. ప్రమాద పరిస్థితుల్లో అప్రమత్తమై అత్యవసర చికిత్స అందించాల్సి ఉండగా... అతడి పరిస్థితిని బట్టి అలా జరగలేదని, ఆస్పత్రి సర్జన్ల సూచనల మేరకు వైద్యులంతా కష్టపడి ఆపరేషన్ చేయడంతో పేషెంట్ కోలుకున్నాడని ఆస్పత్రి చీఫ్ సర్జన్ ఓ ప్రకటనలో తెలిపారు. సదరు సైనికుడు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు లాంచర్ యాక్టివేట్ అవ్వడంతో గ్రనేడ్ అతడి కుడి దవడలోకి దూసుకుపోయిందని అధికారులు తెలిపారు. -
అక్రమ నిర్మాణాలను తొలగించిన అధికారులు
హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ హైదర్గూడలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని చేపట్టిన అక్రమ నిర్మాణాలను సోమవారం రెవెన్యూ అధికారులు తొలగించారు. దీంతో స్థానికులు రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికులను చెదరగొట్టారు. -
సీఎం ఆఫీసులో సీసీటీవీలు మాయం
తిరువనంతపురం: అవినీతికి పాల్పడిన ఏస్థాయి వ్యక్తినైనా, సంస్థనైనా విడిచిపెట్టబోమని కేరళ సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ నేత, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న పినరాయ్ విజయన్ హెచ్చరించిన నేపథ్యంలో అక్కడి సీఎంవో ఆఫీసులోని సీసీటీవీ కెమెరాలన్నింటిని తొలగించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పూర్తిగా తొలగించారు. 2011లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజల వద్ద తానేమీ దాచబోనని ప్రకటిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉమెన్ చాందీ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసి వాటిని ప్రత్యేక వెబ్సైట్కు లైవ్ టెలికాస్ట్ గా అందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అధికారం మారిన నేపథ్యంలో సీఎం కార్యాలయాన్ని చాందీ ఖాళీ చేశారు. ఈ క్రమంలోనే అందులోని సీసీటీవీ కెమెరాలు కూడా తొలగించినట్లు తెలుస్తోంది. 'మొత్తం సీఎం కార్యాలయాన్ని ఖాళీ అయింది. మేం సోమవారం వెళ్లి చూడగా అక్కడి సీసీటీవీ కెమెరాలు కూడా కనిపించలేదు' అని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక అధికారి చెప్పారు. -
350 మంది డ్రైవర్లు రోడ్డున పడ్డారు!
ఆబ్కారీలో రెండేళ్లకు మించి పనిచేస్తున్నవారిపై ఎక్సైజ్ ఈడీ వేటు సాక్షి, హైదరాబాద్: ఆబ్కారీ శాఖలో అద్దె వాహనాల్లో పనిచేస్తున్న డ్రైవర్లు రోడ్డున పడ్డారు. రాజధానితోపాటు పది జిల్లాల్లోని అధికారులు ఉపయోగిస్తున్న అద్దె కార్లు, జీపులపై రెండేళ్లకు మించి పనిచేస్తున్న డ్రైవర్లను తొలగిస్తూ ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ అకున్ సబర్వాల్ ఇటీవల ఆదేశాలిచ్చారు. దీంతో సుమారు 20 ఏళ్లుగా పనిచేస్తున్న 350 మందిని విధుల నుంచి తొలగించారు. డ్రైవర్లుగా కొనసాగుతూ అక్రమాల్లో పాలుపంచుకుంటున్నారనే కారణంతో ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఎక్సైజ్ శాఖకు అద్దె ప్రాతిపదికన తీసుకున్న వాహనాలకు డ్రైవర్లుగా వీరు కొనసాగుతున్నారు. పోలీస్శాఖకు సమకూర్చిన తరహాలోనే ఎక్సైజ్ శాఖకు కూడా సొంత వాహనాలు అందించాలని సీఎం కేసీఆర్కు ఆ శాఖ మంత్రి టి.పద్మారావుగౌడ్ కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో అద్దె వాహనాల డ్రైవర్లు తమకు పర్మనెంట్ ఉద్యోగాలు లభిస్తాయని భావించారు. కానీ, అకున్ సబర్వాల్ నిర్ణయం వారికి అశనిపాతంగా మారింది. 20 ఏళ్లుగా సేవచేస్తున్న తమను అర్ధాంతరంగా రోడ్డున పడేశారని డ్రైవర్లు రెండు రోజులుగా ఆబ్కారీ భవన్ వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఎక్సైజ్ హైర్ వెహికిల్స్ డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు సంఘం అధ్యక్షుడు ఎ.నర్సింహ, ప్రధాన కార్యదర్శి వి.నరేందర్ల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ భానుప్రసాద్ను కలసి తమ గోడును వినిపించారు. ప్రభుత్వం సమకూర్చే వాహనాలకు డ్రైవర్లుగా తమకు అవకాశం ఇవ్వాలని వారు కోరారు. -
సీఎం పర్యటన పేరుతో వైఎస్ఆర్ సీపీ ఫ్లెక్సీల తొలగింపు
-
రోడ్డున పడనున్న ఆరోగ్య మిత్రలు
-
పైలట్కు ఇబ్బందని నలుగురిని దించేశారు
న్యూయార్క్: విమాన సిబ్బందికి నచ్చలేదని నలుగురు ప్రయాణికులను బలవంతంగా దించివేసిన ఘటన ఆందోళన రేకెత్తించింది. ఒక సిక్కు యువకుడు సహా అతని స్నేహితులు నలుగుర్ని విమానం దిగిపోవాల్సిందిగా అమెరికన్ ఎయిర్ లైన్స్ అదేశించింది. లేదంటే విమానాన్ని ఆపివేస్తామన్నారు. దీంతో వివాదం రాజుకుంది. ఒక సిక్కు యువకుడు, ముగ్గురు ముస్లిం యువకులతో కలిసి టొరంటో నుంచి న్యూయార్క్ వెళ్లేందుకు విమానంలో బయలుదేరారు. షాన్ ఆనంద్, ఆలం, డబ్ల్యూ.హెచ్, ఎంకె, ఈ నలుగురు విమానం ఎక్కి సర్దుకుని కూర్చొనే లోపే వారికి చేదు అనుభవం ఎదురైంది. విమానంనుంచి దిగిపోవాల్సింది విమాన అటెండెంట్ అదేశించింది. దీంతో షాకైన యువకులు వాదనకు దిగారు. అయినా ఫలితం దక్కలేదు. చివరికి వారిని బలవంతంగా గెంటేసి మరీ విమానం ఎగిరిపోయింది. దీనిపై షాన్ , అతని స్నేహితులు ఎయిర్ లైన్స్ సంప్రదించినపుడు అధికారులు విచిత్రమైన వాదనకు తెరతీశారు. వారి ఇంటి పేర్ల ఆధారంగా బంగ్లాదేశ్ ముస్లిం, అరబ్ ముస్లింలను గుర్తించిన విమాన సిబ్బంది ఆందోళనకు లోనయ్యారని తెలిపారు. ముఖ్యంగా పైలట్ వారు విమానంలో ఉంటే తమకు అసౌకర్యంగా ఉంటుందని వాదించారన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పడంతో ఆ యువకులు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. అమెరికన్ ఎయిర్ లైన్స్ సంస్థపై సుమారు 62 కోట్ల (9 మిలియన్ డాలర్లు) పరిహారం చెల్లించాల్సింది కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధమంటూ, ప్రోటోకాల్ పేరుతో ఎయిర్ లైన్స్ సంస్థ తమను మానసికంగా వేధించిందని ఆనంద్ ఆరోపించాడు. అందరూ తనను క్రిమినల్గా చూస్తోంటే చాలా బాధేసిందని డబ్ల్యూ.హెచ్ అనే మరోయువకుడు వాపోయాడు. -
యువకుడి కిడ్నీలో భారీ రాయి
మెదక్ టౌన్: ఓ యువకుడి కిడ్నీలో నుంచి 300 గ్రాముల రాయిని వైద్యులు బయటకు తీశారు. ఇంతపెద్ద రాయిని చూసి వైద్యులే ఆశ్చర్యపోయారు. ఈ ఘటన మెదక్లో గురువారం వెలుగులోకి వచ్చింది. కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన మోహన్(25) లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మూడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మూడు రోజులుగా మూత్రం ఆగిపోయింది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆయన మెదక్లోని సాయిచంద్ర నర్సింగ్హోంకు వచ్చాడు. పరీక్షలు చేసిన వైద్యులు కిడ్నీలో రాళ్లు ఉన్నట్టు గుర్తించారు. ఆపరేషన్ నిర్వహించగా కిడ్నీలో 300 గ్రాముల బరువుగల రాయి బయట పడింది. ఓ వ్యక్తి కిడ్నీలో ఇంత పెద్ద రాయి రావడం ఇదే మొదటిసారి అని వైద్యులు సురేశ్ పేర్కొన్నారు. -
ఓఎస్డీ అభీష్టను తప్పించారు..
► లోకేశ్పై ఆరోపణల నేపథ్యం ► ఆయన రాజకీయ భవిష్యత్తుకు ముప్పు వాటిల్లకుండా ► ఏపీ సీఎం ముందుజాగ్రత్త సాక్షి, హైదరాబాద్: తన కార్యాలయంలో ఓఎస్డీగా పని చేస్తున్న సీతేపల్లి అభీష్టను ఏపీ సీఎం చంద్రబాబు ఆ బాధ్యతల నుంచి తప్పించారు. అభీష్ట రాజీనామాకు ఆమోదం తెలిపారు. సాధారణ పరిపాలన శాఖ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు చేసింది. చినబాబు లోకేశ్పై ఆరోపణలు నానాటికీ తీవ్రమవుతుండటం, ఇలాగే కొనసాగితే కుమారుడి రాజకీయ జీవితానికి భవిష్యత్తులో ఇబ్బంది తప్పదనే భావనతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వాస్తవానికి లోకేశ్ సహధ్యాయి అయిన అభీష్టను మొదటి నుంచి ప్రోత్సహించింది బాబే. ఇటు ప్రభుత్వంలో అటు పార్టీలో లోకేశ్ క్రియాశీల పాత్ర పోషించేలా చేసేందుకు అభీష్టను పావులా వాడుకున్నారనే విమర్శలున్నాయి. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అభీష్ట కూడా ఆయన కార్యాలయంలో ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు. అప్పటినుంచి ఆయనద్వారానే తండ్రీకొడుకులు అన్ని వ్యవహారాలు నడిపించారనే ఆరోపణలున్నాయి ముఖ్యంగా చినబాబు లోకేశ్ తరఫున సీఎం కార్యాలయంలో కార్యకలాపాలను అభీష్ట చక్కబెడుతుండేవారు. కాంట్రాక్టులు, ఒప్పందాలు, ఐటీ ప్రాజెక్టులకు భూముల కేటాయింపు దగ్గర నుంచి ప్రభుత్వంలో ఏ చిన్నపని అయినా లోకేశ్ మాట మేరకు అభీష్ట నెరవేరుస్తూ వచ్చారు. సీనియర్ అధికారులు కూడా లోకేశ్కు సన్నిహితుడైన అభీష్ట కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాల కోసం ఎదురు చూసేవారు. అభీష్ట మాట వినని పలువురు అధికారులు కీలకమైన శాఖల నుంచి బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో లోకేశ్పై ఆరోపణలు వెల్లువెత్తాయి. చంద్రబాబు అధికారం చేపట్టినప్పటి నుంచి తెరవెనుక మంత్రాంగం అంతా ఆయనే నడిపిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇటీవలి మరింత తీవ్రమై సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం ఊపందుకుంది. కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు ముప్పు వాటిల్లే సూచనలు కన్పిస్తుండటంతో బాబు అభీష్టను తప్పించారు. అయితే అభీష్ట... బాబు, లోకేశ్లు చెప్పినట్లు వ్యవహరించారే తప్ప తనంతట తానుగా వ్యవహారాలు నడపలేదని సీఎంఓ వర్గాలంటున్నాయి. పార్టీ, ప్రభుత్వ కార్యకలాపాలను సమన్వయం చేసుకోలేకపోతున్నందుకే ఓఎస్డీ బాధ్యతల నుంచి అభీష్ట తప్పుకున్నారని, భవిష్యత్తులో పార్టీ వ్యవహారాలు చూసుకుంటారని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. బాబు తనను తప్పించాలని నిర్ణయం తీసుకోవడంతో అభీష్ట గత నవంబర్ 30నే రాజీనామా లేఖను సీఎం కార్యాలయానికి పంపించారని సమాచారం. -
టీడీపీ నేతల బరితెగింపు
పాఠశాలలో జాతీయ జెండా స్థూపం పెరికివేత మరోచోట పచ్చరంగు వేసి, టీడీపీ జెండా ఎగురవేసి... శ్రీకాకుళం: అధికారం ఉంటే ఏదైనా చేయవచ్చన్న రీతిలో.. టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. అంధవరం పంచాయతీ రామకృష్ణాపురంలో ఆదివారం జరిగిన జనచైతన్య యాత్రలో మితిమీరి ప్రవర్తించారు. ఇక్కడ ప్రభుత్వ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉన్న జాతీయ జెండా స్థూపాన్ని పెకలించి గ్రామం మధ్యలో పెట్టి పసుపు రంగు వేసి టీడీపీ జెండా కట్టి పండగ చేసుకున్నారు. దీనిపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అప్పటికప్పుడు, పాఠశాల ముందు తాత్కాలికంగా స్థూపం కోసం సిమెంటు దిమ్మకట్టి చేతులు దులుపుకున్నారు. దీనిపై హెచ్ఎం పి.రామకృష్ణను సంప్రదించగా, జాతీయ జెండా స్థూపాన్ని తొలగించడం నేరమని చెప్పారు. దీన్ని తొలగిస్తామని తనకు ముందుగా ఫోన్ చేయగా వ్యతిరేకించానని, అయినా ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో పెకలించి వేశారని చెప్పారు. దీనిపై కలెక్టరుకు ఫిర్యాదు చేయనున్నట్లు ఎంపీపీ, జెడ్పీటీసీ ప్రతినిధులు కొయ్యాన సూర్యారావు, మెండ రాంబాబుతోపాటు మరికొందరు గ్రామస్తులు తెలిపారు. -
అక్రమ లేఔట్ల తొలగింపు
రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండల పరిధిలో అక్రమ లేఔట్లను గురువారం అధికారులు తొలగించారు. అనుమతులు లేకుండా వేసిన లేఔట్లను వికారాబాద్ డివిజన్ ఈవోఆర్డీ పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఈవోఆర్డీ ఆధ్వర్యంలో అధికారులు బోర్డులను, హద్దు రాళ్లను తొలగించారు. అనుమతులు లేకుండా లేఔట్లు వేస్తే కఠినచర్యలు తీసుకుంటామని రియల్టర్లను హెచ్చరించారు. -
170 ఆసరా పింఛన్ల తొలగింపు
కరీంనగర్(వీణవంక): వీణవంక మండలంలో డీఆర్డీఏ అధికారులు శుక్రవారం సామాజిక తనిఖీలు నిర ్వహించారు. ఆసరా పింఛన్లు తీసుకున్న వారిలో 170 మంది అనర్హులుగా తేలడంతో వారికి ఆసరా పింఛన్లు తొలగించారు. వారి నుంచి రూ.4.3 లక్షలను రికవరీ చేయాలని అధికారులను డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ ఆదేశించారు. అనర్హులకు పింఛన్లు ఇచ్చినందుకు గానూ చల్లూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి సారయ్యకు వెయ్యి రూపాయలు జరిమాన విధించారు. -
అసెంబ్లీ లాంజ్లో వైఎస్సార్ చిత్రపటం తొలగింపు
-
ఆ ముగ్గురి ఫొటోలు తీసేశారు!
హైదరాబాద్: పీసీసీ మాజీ అధ్యక్షులు కె.కేశవరావు, డి.శ్రీనివాస్, బొత్స సత్యనారాయణల ఫొటోలను గాంధీభవన్ నుంచి తొలగించారు. రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు స్వయంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. గాంధీభవన్లో శనివారం వీహెచ్, మాజీమంత్రి దామోదర్రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. సమావేశం ముగుస్తుందనగా.. పార్టీ వదిలివెళ్లిన పీసీసీ మాజీ అధ్యక్షుల ఫొటోలను ఎప్పుడు తొలగిస్తున్నారంటూ ఓ విలేకరి ప్రశ్నించారు. ఆ వెంటనే హనుమంతరావు రంగంలోకి దిగారు. సహచర నేత దామోదర్రెడ్డి సహాయంతో ముందుగా కె.కేశవరావు ఫొటోను తొలగించారు. ఆ తరువాత దామోదర్ రెడ్డి ఓ కుర్చీ వేసుకుని దానిపైకి ఎక్కి మరో వైపు ఉన్న డి.శ్రీనివాస్, బొత్స సత్యనారాయణల ఫోటోలను తొలగించారు. కాగా, పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన వారి ఫొటోలను వారు పనిచేసిన కాలం వివరాలతో గాంధీభవన్లో ఉంచడం సంప్రదాయంగా వస్తోంది. అయితే.. కేకే, డీఎస్, బొత్స ముగ్గురూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరారు. వీరి ఫొటోల తొలగింపుపై పార్టీ అధిష్ఠానం నుంచి ఇంకా ఒక నిర్ణయం రాకముందే వి.హనుమంతరావు, దామోదర్ రెడ్డి ఆ పని పూర్తి చేశారు. -
ఆ నేతల ఫొటోలు తీసేశారు!
సాక్షి, హైదరాబాద్: పీసీసీ అధ్యక్షులుగా పనిచేసి ఆపై పార్టీని వీడిన డి.శ్రీనివాస్, కె.కేశవరావు, బొత్స సత్యనారాయణల ఫొటోలను గాంధీభవన్ నుంచి తొలగించాలని టీపీసీసీ నిర్ణయించింది. పదవులు, స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ నుంచి వెళ్లిపోయిన ద్రోహుల ఫొటోలను గాంధీభవన్లో ఉంచాల్సిన అవసరం లేదని టీపీపీసీ నేతలు గురువారం ప్రతిపాదించారు. మరోసారి ముఖ్యులతో మాట్లాడి ఈ ప్రతిపాదనను అమలు చేయనున్నారు. తెలంగాణలో పార్టీ పరిస్థితిపై ఆలోచించండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులపై దృష్టి సారించాలని ఎంపీ వి.హనుమంతరావు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్కు విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందనే దానిపై పరిశీలించాలని కోరారు. దిగ్విజయ్తో గురువారం ఇక్కడ వీహెచ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పర్యటన ఒకట్రెండు రోజులకు పరిమితం చేయకుండా, వారం రోజులు ఉండి పరిస్థితులపై సమీక్షించాలని దిగ్విజయ్ను కోరారు. అనంతరం వీహెచ్ విలేకరులతో మాట్లాడుతూ బంగారు తెలంగాణ కోసం టీఆర్ఎస్లోకి వెళ్లినట్టు చెబుతున్న పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్ నాడు శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణాజలాలు పోతిరెడ్డిపాడుకు తరలిపోతే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ‘లాబీయిస్టులను నమ్మితే ఇదే సమస్య’ పార్టీకి నమ్మకస్తులుగా పనిచేసే వారిని కాకుండా డీఎస్ లాంటి లాబీయిస్టులను నమ్మితే వ్యక్తిగత స్వార్థంకోసం పార్టీని కష్టకాలంలో విడిచిపెట్టి పోతారని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనాయకుడు పొంగులేటి సుధాకర్రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఆవరణలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ డీఎస్కు అర్హత కంటే ఎక్కువగా పదవులు వచ్చాయని, పార్టీ కోసం పని చేయకుండా ఇలాంటి సంక్షోభ సమయంలో పార్టీని వీడాలని తీసుకున్న నిర్ణయం సమంజసం కాదన్నారు. -
ఉబ్బసం కాదు.. చేప ముల్లు
కొచ్చి: సుధీర్ఘకాలంగా శ్వాస వ్యాధితో బాధపడుతున్నవ్యక్తికి ఎట్టకేలకు విముక్తి లభించింది. తొలుత ఉబ్బసం వ్యాధి అనుకున్నడాక్టర్లు చివరకు ఊపిరతిత్తుల్లో చేప ముల్లు ఉందని గమనించారు. కేరళకి చెందిన 37ఏళ్ల వ్యక్తికి 7 సంవత్సరాలుగా ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోయిన చేప ముల్లుని అమృతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆండ్ రిసెర్చ్ డాక్టర్లు శస్త్ర చికిత్స చేసి బయటకి తీశారు. 'శ్వాస వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి 2009 నుంచి రెగ్యులర్ చెక్అప్ కి వచ్చేవాడు. ఉబ్బసం వ్యాధితో బాధపడేవాడని అనుకున్నాము. కానీ చివరకు చేప ముల్లు ఊపిరితిత్తుల్లో ఉన్నట్టు గమనించాము. కుడి వైపు ఉన్న ఊపిరితిత్తు కింద భాగం నుంచి 1.5 సెం.మీX 1.4 సెం.మీ కొలత ఉన్న ముల్లును శస్త్ర చికిత్స చేసి తీసి వేసాము. ముల్లు చుట్టు పేరుకు పోయిన చీమును తొలగించాము. శస్త్ర చికిత్స అనంతరం ఆ వ్యక్తి సులువుగా శ్వాస తీసుకోగలుగుతున్నాడు. ఇన్ని సంవత్సరాలు ఊపిరితిత్తుల్లోనే ముల్లు ఇరుక్కొని ప్రాణాపాయ పరిస్థితినుంచి బయట పడటం చాలా అరుదైన విషయం' అని డాక్టర్లు అన్నారు. -
ఆపరేషన్ తర్వాతే మాపాప కిడ్నీలు మాయం!
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో దీపిక అనే నాలుగేళ్ల బాలిక కిడ్నీలు మాయం కావడంపై తండ్రి పవన్ కుమార్ పలు అనుమానాలు వ్యక్తం చేశాడు. ఎయిమ్స్ డాక్టర్లు ఆపరేషన్ చేసిన తర్వాతే తన పాప కిడ్నీలు మాయం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశాడు. దీనిపై పోలీసు ఫిర్యాదు ఇచ్చినట్లు పేర్కొన్నాడు.ఈ అంశానికి సంబంధించి పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని కోరాడు. వివరాల్లోకి వెళితే.. యూపీలోని రాయ్బరేలీకి చెందిన పవాన్.. తోపుడు బండిమీద జ్యూస్ అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. అతని ఆరేళ్ల కూతురు దీపిక కొన్నేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. స్థానిక వైద్యుల సూచనమేరకు చికిత్స నిమిత్తం గత డిసెంబర్లో ఢిల్లీలోని ఎయిమ్స్ వచ్చారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం దీపిక ఎడమ కిడ్నీలో లోపం ఉందని, కుడి కిడ్నీ బాగానే పనిచేస్తోందని, కుటుంబ సభ్యులు అంగీకరిస్తే చెడిపోయిన కిడ్నీని తొలిగిస్తామని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. ఆ క్రమంలోనే ఈ ఏడాది మార్చి 17న ఆపరేషన్ నిర్వహించారు.ఆ పాపకు పీడియాట్రిక్ విభాగంలో సీనియర్ సర్జన్ ఒకరు ఆపరేషన్ చేశారు. అయితే ఆ తరువాత జరిపిన పరీక్షల్లో దీపిక రెండు కిడ్నీలు కనబడకపోవడంతో ఇటు తల్లిదండ్రులు సహా ఆసుపత్రి సిబ్బంది సైతం అవాక్కయ్యారు. అసలేం జరిగిందని ఆపరేషన్ నిర్వహించిన వైద్యుడ్ని అడిగితే.. 'మీ అమ్మాయికి ఉన్నది ఒకే ఒక్క కిడ్నీ. దానినే నేను తీసేశా. రెండు కిడ్నీలు లేనేలేవు' అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో డయాలసిస్ పై చికిత్స అందిస్తున్నారు. -
ఎయిమ్స్లో బాలిక కిడ్నీలు మాయం
దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థగా పేరొందిన ఎయిమ్స్లో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. పీడియాట్రిక్ విభాగంలో సీనియర్ సర్జన్ ఒకరు.. ఉత్తరప్రదేశ్కు చెందిన ఆరేళ్ల బాలిక రెండు కిడ్నీలను మాయం చేశాడు. పైగా ఆపరేషన్ సమయంలో ఆ బాలికకు ఒకటే కిడ్నీ ఉందని దబాయించాడు. అయితే ఆసుపత్రి రికార్డులు మాత్రం ఆ అమ్మాయికి రెండు కిడ్నీలు ఉన్నట్లు పేర్కొనడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. యూపీలోని రాయ్బరేలీకి చెందిన పవాన్.. తోపుడు బండిమీద జ్యూస్ అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. అతని ఆరేళ్ల కూతురు దీపిక కొన్నేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. స్థానిక వైద్యుల సూచనమేరకు చికిత్స నిమిత్తం గత డిసెంబర్లో ఢిల్లీలోని ఎయిమ్స్ వచ్చారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం దీపిక ఎడమ కిడ్నీలో లోపం ఉందని, కుడి కిడ్నీ బాగానే పనిచేస్తోందని, కుటుంబ సభ్యులు అంగీకరిస్తే చెడిపోయిన కిడ్నీని తొలిగిస్తామని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. ఆ క్రమంలోనే ఈ ఏడాది మార్చి 17న ఆపరేషన్ నిర్వహించారు. ఆ తరువాత జరిపిన పరీక్షల్లో దీపిక రెండు కిడ్నీలు కనబడకపోవడంతో ఇటు తల్లిదండ్రులు సహా ఆసుపత్రి సిబ్బంది సైతం అవాక్కయ్యారు. అసలేం జరిగిందని ఆపరేషన్ నిర్వహించిన వైద్యుడ్ని అడిగితే.. 'మీ అమ్మాయికి ఉన్నది ఒకే ఒక్క కిడ్నీ. దానినే నేను తీసేశా. రెండు కిడ్నీలు లేనేలేవు' అంటూ నర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన మరికొందరు వైద్యులు విషయం బయటికి చెప్పొద్దని, వీలైనంత త్వరలో దీపికకు మరో కిడ్నీ అమర్చుతామని ఆమె తండ్రి పవాన్ కు నచ్చజెప్పారు. ప్రస్తుతం ఆ అమ్మాయి డయాలసిస్ ఆధారంగా బతుకుతోంది. 'ఎలాగోలా కిడ్నీ పెడతామని, అప్పటిదాకా మాట్లాడొద్దని డాక్టర్లు చెప్పారు. నా కూతురికి ఏదైనా జరిగితే మాత్రం వాళ్లని వదలను. కోర్టుకు ఈడ్చుతా' అని దీపిక తండ్రి పవాన్ అంటున్నాడు. కాగా, ఈ విషయం తన దృష్టికి రాలేదని, దానిపై ఎంక్వైరీ చేయిస్తానని ఎయిమ్స్ డైరెక్టర్ ఎం.సీ. మిశ్రా పేర్కొన్నారు. -
చిట్టితల్లికి.. ఊచ కష్టం..
అనపర్తి: తూర్పు గోదావరి జిల్లా అనపర్తికి చెందిన గంగిరెడ్డి నర్సింగ్హోమ్ అధినేత డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి బుధవారం ఒక చిన్నారి గొంతులో ప్యాలట్(అంగిడి) భాగాన గుచ్చుకున్న ఊచను శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా తొలగించారు. రాజానగరం మండలం ముక్కినాడ గ్రామానికి చెందిన కొప్పుల మిత్రవింద (5) కొక్కెంతో ఉన్న సుమారు మూడడుగుల పొడవున్న ఇనుప ఊచతో ఆడుకుంటూ నోట్లో పెట్టుకుంది. ఊచ చివరి భాగాన ఉన్న కొక్కెం చిన్నారి అంగిడికి గుచ్చుకుంది. గొంతునుంచి రక్తస్రావం అవుతున్న ఆమెను త ల్లిదండ్రులు అనపర్తిలోని గంగిరెడ్డి నర్సింగ్హోమ్కు తరలించారు. డాక్టర్ సూర్యనారాయణరెడ్డి ఆపరేషన్ చేసి చిన్నారి గొంతులోంచి ఊచను తొలగించారు. మిత్రవిందకు ఇక ఇబ్బందేమీ లేదని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి విలేకరులకు చెప్పారు. -
అంగన్వాడీలపై వేటు
నెల్లూరు (అర్బన్): అంగన్వాడీలపై బాబు సర్కారు మరోమారు కన్నెర్ర చేసింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన 14 మంది అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ సీఎం సభలో ప్లకార్డులు చూపినందుకు వారిని ఏకంగా విధుల నుంచి తొలగించారు. వివరాలు.. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నెల్లూరు రూరల్ మండలం కనుపర్తిపాడులో మహిళా దినోత్సవం సభ నిర్వహించారు. దీనికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఆ రోజు సభ ముగిసే సమయంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్లకార్డులు ప్రదర్శించారు. అది బాబు ఆగ్రహానికి కారణమై వారిని అప్పుడే తీవ్రస్థాయిలో హెచ్చరించారు. బాబు అన్నట్లే చేశారు..:సభలో ఇలా చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు వారి పట్ల నియంతలా వ్యవహరించారు. సమస్యల పరిష్కారం కోసం ప్లకార్డులు పట్టుకున్న 14 మంది అంగన్వాడీ ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు సోమవారం ఐసీడీఎస్ పీడీ విద్యావతి ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే అధికారులు ఇలా చేసినట్లు సమాచారం. మహిళలకు బాబు ఇచ్చే గౌరవం ఇదేనా? తరచు మహిళల గౌరవం గురించి మాట్లాడే బాబు మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ఉద్యోగాలు కోల్పోయిన అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు శేషమ్మ, స్వరూపారాణిలు ‘సాక్షి’తో మాట్లాడారు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని హెచ్చరించారు. -
ఫూనమ్ పాండే అకౌంట్ ను తొలగించిన ఫేస్ బుక్!
దైనందిక జీవితంలో సోషల్ మీడియా వినియోగం చెప్పలేనంతగా పెరిగిపోయిందనడంలో సందేహం అక్కర్లేదు. సినీ, రాజకీయ ప్రముఖులతోపాటు పలువురు సోషల్ మీడియా ఆధారంగా అభిమానులకు, కార్యకర్తలకు తమ సందేశాన్ని చేరవేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో బాలీవుడ్ తార పూనమ్ పాండే కూడా చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. కాని పూనమ్ పాండేకు సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ షాకిచ్చింది. పూనమ్ పాండే అకౌంట్ ను ఫేస్ బుక్ తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2.1 లక్షల ఫాలోవర్స్ ఉన్న ఫేస్ బుక్ అకౌంట్ ను తొలగించడం వెనుక కారణాలను ఫేస్ బుక్ సంస్థ తెలుపలేదు. తన ఫేస్ బుక్ అకౌంట్ ను తొలగించారంటూ పూనమ్ పాంటే ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది. నిజంగా బాధగా ఉంది. నా అధికారిక ఫేస్ బుక్ అకౌంట్ ను ఫేస్ బుక్ తొలగించింది. ఏం చేయాలో అర్ధం కావడం లేదు. ఏం చేస్తే ఫేస్ బుక్ అకౌంట్ మళ్లీ వెనక్కి వస్తోందో చెప్పండి అంటూ ట్విటర్ లో పూనమ్ ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఎవరైనా సరే అసభ్యకరమైన, అశ్లీలకరంగా ఉండే అంశాలను పోస్ట్ చేస్తే ఫేస్ బుక్ అకౌంట్లను సాధారణంగా నిలిపివేస్తోంది. పూనమ్ పాండే అకౌంట్ నిలిపివేయడం వెనుక కారణాల తెలియాల్సి ఉంది. కావున ఎవరైనా సోషల్ మీడియాను హద్దు మీరి ప్రవర్తిస్తే ఇలాంటి సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది.. జాగ్రత్త!