retired
-
నూతన సీజేఐ జస్టిస్ ఖన్నా ప్రమాణ స్వీకారం నేడు
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నా రు. రాష్ట్రపతి భవన్లో ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. జస్టిస్ ఖన్నా ఆరు నెలలపాటు సీజేఐగా కొనసాగుతారు. ఆయన పదవీ కాలం వచ్చే ఏడాది మే 13వ తేదీన ముగియనుంది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆదివారం పదవీ విరమణ చేశారు. ఆయన సిఫార్సు మేరకు నూతన సీజేఐగా జస్టిస్ ఖన్నాను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 24న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. న్యాయ వ్యవస్థతో సుదీర్ఘ అనుబంధం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జస్టిస్ సంజీవ్ ఖన్నాకు న్యాయ వ్యవస్థతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయన 1960 మే 14న జని్మంచారు. ఆయన తండ్రి జస్టిస్ దేవ్రాజ్ ఖన్నా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. జస్టిస్ ఖన్నా ఢిల్లీలోని మోడ్రన్ స్కూల్లో చదువుకున్నారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ అనంతరం ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన క్యాంపస్ లా సెంటర్లో న్యాయ విద్య అభ్యసించారు. 1983లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో అడ్వొకేట్గా చేరారు. తొలుత తీస్హజారీ కాంప్లెక్స్లోని జిల్లా కోర్టుల్లో, తర్వాత ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఆదాయపు పన్ను విభాగంలో సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా పని చేశారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా సేవలందించారు. ఢిల్లీ హైకోర్టులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా, అమికస్ క్యూరీగా ఎన్నో క్రిమినల్ కేసుల్లో సమర్థంగా వాదించి పేరు తెచ్చుకున్నారు. 2005 జూన్ 24న ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఏడాది తిరగకుండానే శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. హైకోర్టు న్యాయమూర్తుల్లో ఆయన కంటే 32 మంది సీనియర్లున్నా వారిని కాదని జస్టిస్ ఖన్నాకు పదోన్నతి దక్కడం వివాదాస్పదంగా మారింది. అయినా ఆయన నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. పలు కీలక తీర్పులు ఇచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనాల్లో జస్టిస్ ఖన్నా సభ్యుడిగా ఉన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేసిన ధర్మాసనంలో ఆయన సభ్యుడు. ఆరి్టకల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేశారు. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వాడకాన్ని సమర్థించారు. బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను తిరస్కరించారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. పెండింగ్ కేసుల పరిష్కారంపై జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రత్యేక శ్రద్ధ చూపుతారని పేరుంది. అనవసరమైన వాయిదాలకు తావు లేకుండా వేగంగా న్యాయం చేకూర్చడంలో ఆయన దిట్ట అని న్యాయవాద వర్గాలు చెబుతాయి. ఇక ఇంట్లోనే మార్నింగ్ వాక్ తెల్లవారుజామునే ట్రాక్ ప్యాంట్, ఆఫ్ హ్యాండ్స్ టీ షర్ట్తో ఢిల్లీ వీధుల్లో వాకింగ్ చేయడం జస్టిస్ ఖన్నాకు చాలా ఇష్టం. అనేక సందర్భాల్లో ఆయన మార్నింగ్ వాక్ గురించి ప్రస్తావించారు. ‘‘ఉదయాన్నే వాకింగ్ చేస్తే రోజంతా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మంచి ఆలోచనలు వస్తాయి’’ అంటారాయన. సీజేఐగా బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఇకపై మార్నింగ్ వాక్కు ఆయన స్వస్తి పలకనున్నట్లు తెలిసింది. వాకింగ్తో పాటు జిమ్ వంటి కసరత్తులన్నీ ఇంట్లోనే చేయనున్నారు. -
సమాజం పట్ల కరుణతోనే న్యాయమూర్తిగా నిలదొక్కుకున్నా..
ముంబై: న్యాయస్థానాలు, న్యాయమూర్తులు సైతం సూక్ష్మ పరిశీలనకు గురి కావాల్సిందేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. న్యాయమూర్తుల పనితీరును చుట్టూ ఉన్న సమాజం పరిశీలిస్తూనే ఉంటుందని అన్నారు. అయితే, సమాజం పట్ల ఉన్న దయ, కరుణ, జాలి, అనురాగం వల్లే తాను అన్ని రకాల పరిశీలనలు, పరీక్షలకు నిలిచి, న్యాయమూర్తిగా నిలదొక్కుకున్నానని తెలిపారు. సమాజం పట్ల తమ ప్రేమానురాగాలు తమ తీర్పుల ద్వారా వెల్లడవుతాయని వివరించారు. జస్టిస్ చంద్రచూడ్ వచ్చే నెల 10వ తేదీన పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ముంబైలో ఆయనను ఘనంగా సత్కరించారు. జస్టిస్ చంద్రచూడ్ అందించిన సేవలను న్యాయవాదులు ప్రశంసించారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ తాను ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. ‘‘ఐఐటీ–ధన్బాద్లో చేరేందుకు సకాలంలో అడ్మిషన్ ఫీజు రూ.17,500 చెల్లించలేకపోయిన దళిత విద్యార్థికి మా ఆదేశాలతో ప్రవేశం లభించింది. ఇలాంటి తీర్పులు తనకెంతో సంతృప్తిని ఇచ్చాయి’’ అని తెలిపారు. -
పట్టపగలు శాస్త్రవేత్త ఇంట్లో రూ. రెండు కోట్లు దోపిడీ
న్యూఢిల్లీ: ఢిల్లీలోని రోహిణిలో సంచలన ఉదంతం చోటుచేసుకుంది. ప్రశాంత్ విహార్ ప్రాంతంలో ఒక రిటైర్డ్ సైంటిస్ట్తో పాటు అతని భార్యను బంధించి దోపిడీకి పాల్పడిన ఉదంతం వెలుగుచూసింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రోహిణిలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలో తమ సొంత ఇంట్లో ఓ రిటైర్డ్ సైంటిస్ట్ను అతని భార్యను తుపాకీతో బెదిరించి, ఆ తర్వాత బందించి రూ. రెండు కోట్ల విలువైన నగలు నగదును దుండగులు దోచుకెళ్లారు. శాస్త్రవేత్త శిబు సింగ్, అతని భార్య నిర్మల ఇంట్లో ఉండగా, మధ్యాహ్నం సమయంలో ఇద్దరు యువకులు తాము కొరియర్ బాయ్స్మని చెబుతూ, వారి ఇంట్లోకి ప్రవేశించారు.తర్వాత వారు శిబు, అతని భార్య నిర్మలను తుపాకీతో బెదిరించి, బందించారు. ఈ క్రమంలో నిందితులు వారిపై దాడి చేశారు. దుండగుల తమ ఇంట్లోని రూ. రెండు కోట్ల విలువైన నగలు, నగదు దోచుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే బాధితులు ఈ విషయాన్ని తమ కుమారునికి తెలియజేశారు. ఆయన ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు.పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్లు ప్రారంభించారు. బాధితులిద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ఆరు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. కాగా ఈ ఘటన తీరు చూస్తుంటే ఈ వ్యవహారంలో తెలిసినవారి ప్రమేయం ఉన్నట్లు కనిపిస్తోందని పోలీసులు అంటున్నారు. సీసీటీవీలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. ఇది కూడా చదవండి: వికాస్ యాదవ్ కథలో కొత్త మలుపు -
రెండో ప్రపంచయుద్ధవీరుడికి ఘనంగా పుట్టినరోజు వేడుకలు
రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్న సైనికుడు, ప్రతిష్టాత్మక ‘బర్మా స్టార్ అవార్డ్’ గ్రహీత రిటైర్డ్ లాన్స్ నాయక్ చరణ్ సింగ్ 100వ పుట్టినరోజు వేడుకలను భారత సైన్యం ఘనంగా నిర్వహించింది. శనివారం హిమాచల్ ప్రదేశ్లోని స్వగృహంలో ఆయనతో కేక్ కట్చేయించి జన్మదిన వేడుకలను ఆరంభించారు. ఆర్మీ తరఫున సైతం బ్రిగేడియర్ అధికారి, సైనికులు పాల్గొనడంతో కార్యక్రమం సందడిగా మారింది. 1924 సెపె్టంబర్ ఏడో తేదీన జన్మించిన చరణ్సింగ్ 1942 ఆగస్ట్ 26వ తేదీన భారత్లో బ్రిటిష్ సైన్యం ఫిరోజ్పూŠ కంటోన్మెంట్ యూనిట్లో చేరారు. రెండో ప్రపంచయుద్ధంలో వీరోచితంగా పోరాడారు. సింగపూర్ నుంచి లాహోర్ దాకా పలు దేశాల్లో యుద్ధక్షేత్రాల్లో తన ధైర్యసాహసాలను ప్రదర్శించారు. తర్వాత హిమాచల్ప్రదేశ్లోని యోల్ కంటోన్మెంట్లోనూ పనిచేశారు. ‘‘ 17 ఏళ్లపాటు సైన్యంలో చూపిన ప్రతిభకు బర్మా స్టార్ అవార్డ్ను, ఇండియన్ ఇండిపెండెన్స్ మెడల్ను ఆయన పొందారు. 1959 మే 17న పదవీవిరమణ చేశారు. తర్వాత ప్రస్తుతం తన శేషజీవితాన్ని రోపార్ జిల్లాలోని దేక్వాలా గ్రామంలో గడుపుతున్నారు. ఆయనకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. సొంతింట్లో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో బ్రిగేడియన్ అధికారి, సైనికులు పాల్గొన్నారు. దేశసేవలో తరించిన మాజీ సైనికులను గుర్తుపెట్టుకుని వారిని తగు సందర్భంలో గౌరవిస్తూ భారతసైన్యం పలు కార్యక్రమాలు చేస్తున్న విషయం విదితమే. ఇందులోభాగంగానే శనివారం చరణ్సింగ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించినట్లు సైన్యాధికారి ఒకరు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ దశాబ్దాల క్రితం సైన్యంలో పనిచేసినా సరే ఆర్మీ దృష్టిలో అతను ఎప్పటికీ సైనికుడే. సైన్యంలో భాగమే. సైన్యానికి, పౌరులకు స్ఫూర్తిప్రదాతలుగా వారిని సదా స్మరించుకోవాలి. వారి నుంచి నేటి సైనికులు ఎంతో నేర్చుకోవాలి’ అని సైన్యం పేర్కొంది. – న్యూఢిల్లీ -
‘ఆమె మహిళా హక్కుల పరిరక్షకురాలు’
న్యూఢిల్లీ: జస్టిస్ హిమా కోహ్లి ఒక మహిళా జడ్జి మాత్రమే కాదని స్త్రీ హక్కుల పరిరక్షణకు తీవ్రంగా పాటుపడ్డారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ కితాబిచ్చారు. సెప్టెంబరు 1న రిటైరవుతున్న హిమా కోహ్లి గౌరవార్థం సీజేఐ శుక్రవారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఆమె రిటైరయ్యాక సర్వోన్నత న్యాయస్థానంలో ఇద్దరు మహిళా న్యాయమూర్తులు.. జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ బేలా ఎం. త్రివేదిలు ఉంటారు. ‘జస్టిస్ కోహ్లితో కలిసి ధర్మాసనంపై కూర్చోవడం ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. హిమా.. మీరొక మహిళా జడ్జి మాత్రమే కాదు.. స్త్రీల హక్కుల పరిరక్షకురాలు కూడా’ అని సీజేఐ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చంద్రచూడ్, హిమాకోహ్లిలు బ్యాచ్మేట్లు కావడం గమనార్హం. న్యాయం కోసం జస్టిస్ కోహ్లి తన జీవితాన్ని ధారబోశారని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి అన్నారు. 2006 మే నెలలో ఢిల్లీ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులైన హిమా కోహ్లి.. 2007 ఆగస్టులో శాశ్వత జడ్జి అయ్యారు. జనవరి 7, 2021న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021 ఆగస్టు 31న సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. -
జస్టిస్ బండారు శ్యాంసుందర్ పదవీ విరమణ
సాక్షి, అమరావతి : హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బండారు శ్యాం సుందర్ శుక్రవారం పదవీ విరమణ చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలో న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమై ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జస్టిస్ ఠాకూర్ మాట్లాడుతూ.. జస్టిస్ శ్యాం సుందర్ 33 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించి, న్యాయవ్యవస్థకు ఎన్నో రకాలుగా సేవలు అందించారని తెలిపారు. ఇంత సుదీర్ఘ కాలం పని చేయడం చిన్న విషయం కాదన్నారు. జస్టిస్ శ్యాం సుందర్ విలువలకు పెద్ద పీట వేశారని, తండ్రి చెప్పిన మాటలను తూచా తప్పకుండా ఇప్పటివరకు పాటించారని తెలిపారు. క్లిష్టమైన కేసులను చాలా సులభంగా పరిష్కరించారని చెప్పారు. సత్వర న్యాయం కోసం కృషి చేశారు అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కిలిగినీడి చిదంబరం, బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకనాథరెడ్డి, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) పసల పొన్నారావు తదితరులు జస్టిస్ శ్యాం సుందర్ సేవలను కొనియాడారు. న్యాయవ్యవస్థకు ఆయన అందించిన సేవలు మరువలేనివన్నారు. సత్వర న్యాయం కోసం ఎంతో కృషి చేశారని, న్యాయవ్యవస్థ సమర్థతను పెంచేందుకు కృషి చేశారని తెలిపారు. ఎన్నో క్లిష్టమైన కేసులను సమర్థతతో, స్పష్టతతో పరిష్కరించారన్నారు. పని చేసిన ప్రతి చోటా ఎంతో హుందాగా, సమర్థవంతంగా వి«ధులు నిర్వర్తించారన్నారు. ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని వారు చెప్పారు.ఈ స్థాయికి వస్తానని ఊహించలేదు అనంతరం జస్టిస్ శ్యాం సుందర్ మాట్లాడుతూ.. తాను ఈ స్థాయికి వస్తానని ఎన్నడూ ఊహించలేదన్నారు. ఎంతో మంది తనకు మార్గదర్శకంగా ఉండి, ఇక్కడి వరకు వచ్చేందుకు సహకరించారని తెలిపారు. తన గురువు, సీనియర్ అయిన తన తండ్రి ఎంతో నేర్పారన్నారు. విధి నిర్వహణలో ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలన్నారు. తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ న్యాయవ్యవస్థతో తనకు ఎన్నో మధుర స్మృతులున్నాయని, వాటిని గుండెల్లో దాచుకుంటున్నానని తెలిపారు. తాను చేసిన ప్రమాణానికి కట్టుబడి విధులు నిర్వర్తించానని చెప్పారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో జస్టిస్ శ్యాం సుందర్ కుటుంబ సభ్యులు, అదనపు ఏజీ ఇవన సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, న్యాయవాదులు, రిజి్రస్టార్లు పాల్గొన్నారు. అనంతరం హైకోర్టు న్యాయవాదుల సంఘం జస్టిస్ శ్యాం ప్రసాద్ దంపతులను ఘనంగా సన్మానించింది. వారికి శాలువా కప్పి, అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు చిదంబరం, ఉపా«ధ్యక్షుడు ఎన్.రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి నన్నపనేని శ్రీహరి, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
కేరళ చీఫ్ సెక్రటరీగా భర్త తర్వాత భార్య
తిరువనంతపురం: దక్షిణ భారతదేశంలో నెల వ్యవధిలోనే అరుదైన రికార్డు పునరావృతమైంది. కేరళ నూతన ప్రధాన కార్యదర్శిగా శారదా మురళీధరన్ బుధవారం నియమితులయ్యారు. ఆమె తన భర్త, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి వి.వేణు నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. వేణు ఆగస్టు 31న పదవీ విరమణ చేయనున్నారు. ప్రణాళిక విభాగంలో అడిషనల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న 1990 బ్యాచ్ ఐఏఎస్ శారదను తదుపరి సీఎస్గా ఎంపిక చేస్తూ కేరళ కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. కర్నాటకలోనూ ఆగస్టు 1న శాలినీ రజనీష్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. భర్త రజనీష్ గోయెల్ రిటైరయ్యాక ఆయన స్థానంలో శాలినీ సీఎస్ అయ్యారు. -
Cris Comerford: ఆ రుచికి రిటైర్మెంట్
‘విందు భోజనం అంటే సరైన సమయంలో సరైన పదార్థం అందించడమే’ అంటుంది క్రిస్ కమర్ఫోర్డ్. అన్య జాతులకు ప్రవేశం లేని అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్హౌస్ వంటశాలలో ప్రవేశం సాధించిన మొదటి మహిళ ఆమె. తొలి శ్వేత జాతీయేతర మహిళ కూడా! 30 ఏళ్లు వైట్హౌస్లో పని చేశాక తన 61వ ఏట జూలై 31న ఆమె రిటైర్ అయ్యారు. ఎందరో దేశాధినేతలకు తన చేతి వంట తినిపించిన క్రిస్ కమర్ఫోర్డ్ పరిచయం.‘అమెరికాకు అనేక మంది రాయబారులు ఉంటారు. కాని క్రిస్ కమర్ఫోర్డ్ షెఫ్గా ఉండక శాకపాకాల రాయబారి వలే అలాంటి పనే చేశారు. అమెరికా రుచులను ప్రపంచనేతలకు పంచి ఎలా ఉత్సవభరితం చేయవచ్చో చూపించారు’ అని క్రిస్ కమర్ఫోర్డ్ రిటైర్మెంట్ సందర్భంగా ఆమె సమకాలిక షెఫ్ ఒకరు వ్యాఖ్యానించారు. అధ్యక్షుడు జో బైడన్ సతీమణి జిల్ బైడన్ ‘క్రిస్ కమర్ఫోర్డ్ తన టీమ్తో కలిసి ప్రేమ, ఆ΄్యాయతలతో కూడిన రుచులతో మా ఆత్మలను నింపారు’ అని వీడ్కోలు సందేశంలో పేర్కొంది. క్రిస్ కమర్ఫోర్డ్ విజయగాథ...ఫిలిప్పైన్స్ నుంచిక్రిస్ కమర్ఫోర్డ్ది ఫిలిప్పైన్స్. మనీలాలో బాల్యం గడిచింది. గ్రాడ్యుయేషన్ అయ్యాక ఫుడ్ టెక్నాలజీలో పి.జి. చేయాలనుకుంది. ‘నాకు సైన్స్ ఇష్టం. ఫుడ్ టెక్నాలజీలో పరిశోధన చేయాలనుకున్నాను. కాని మా నాన్న నువ్వు కలనరీ ఇన్స్టిట్యూట్లో చదివితే ఇంకా రాణిస్తావు అన్నాడు. నేను మా నాన్న సలహాను పాటించడం వల్లే పాకశాస్త్రం తెలుసుకొని వైట్హౌస్ దాకా వచ్చాను. కాబట్టి పెద్దల మాట వినండి’ అంటుంది క్రిస్ కమర్ఫోర్డ్. తన 23వ ఏట అమెరికా వలస వచ్చిన క్రిస్ మొదట షికాగో, తర్వాత న్యూయార్క్ రెస్టరెంట్లలో పని చేసింది. వైట్హౌస్లో వంటశాలలో మహిళలను తీసుకోక΄ోయినా, శ్వేతజాతీయేతర మహిళలను తీసుకునే అవకాశం అసలు లేక΄ోయినా 1995లో నాటి ఎగ్జిక్యూటివ్ షెఫ్ వాల్టర్ స్టాన్లీ ఆమెను అసిస్టెంట్ షెఫ్గా తీసుకున్నాడు.మన్మోహన్ సింగ్తో ప్రమోషన్నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ 2005లో అమెరికా సందర్శించినప్పుడు వైట్ హౌస్లో భారీ విందు జరిగింది. దానికి కావలసిన వంటా వార్పు అంతా క్రిస్ చూసింది. విందుకు హాజరైన వారంతా ఆహా ఓహో అన్నారు. క్రిస్ ప్రతిభ గమనించిన జార్జ్బుష్ సతీమణి లారా బుష్ ఆమెకు ఎగ్జిక్యూటివ్ షెఫ్గా ప్రమోషన్ ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ షెఫ్ వైట్హౌస్లోని సకల వంటా వార్పులకు సర్వోన్నత అధికారి. ఆమె పర్యవేక్షణలోనే దేశాధినేతలు వచ్చినప్పుడు వైట్హౌస్లో ఇచ్చే గౌరవ విందు, హాలిడే ఫంక్షన్లు, రిసెప్షన్లు, అధికారిక విందులు జరుగుతాయి.ఆహారమే ఆరోగ్యం‘దేశ భవిష్యత్తు నిర్మించడమంటే నేటి బాలలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడమే’ అంటుంది క్రిస్. ‘పాకశాస్త్రం తెలిసిన వారు ఏది ఉత్తమమైన ఆహారమో ఏది ΄ûష్టికతతో నిండినదో తర్వాతి తరాలకు తెలియ చేయాలి. పిల్లలు మెచ్చుకునే రీతిలో ఆరోగ్యకరమైన వంటలు చేయగలగాలి. వారిని కూరగాయలతో గడపనివ్వాలి. కూరగాయల మడులకు తీసుకెళ్లాలి. వంట పట్ల అభిరుచి, అవగాహన కలిగించాలి’ అంటుందామె. వంట ఒక సవాలువైట్ హౌస్లో వంట ఒక సవాలు. జపాన్ దేశాధినేత వచ్చినప్పుడు ఒక మెనూ, కెన్యా అధ్యక్షుడు వచ్చినప్పుడు ఒక మెనూ, భారత ప్రధాని వచ్చినప్పుడు మరో మెనూ తయారు చేయాలి. ఒకోసారి ఆయా దేశాలకు చెందిన వంటవాళ్లను రప్పించి వారితో కలిసి వండాలి. ‘ప్రతి విందుకు నాలుగు రోజుల ముందు నుంచే సిద్ధమవుతాం. సలాడ్లు తాజాగా ఉండేందుకు ఆ రోజున వైట్హౌస్లోని తోట నుంచి ఆకులు, దుంపలు సేకరిస్తాం. పండిన కూరగాయలు వృథా చేయడం నాకు ఇష్టం ఉండదు. వైట్ హౌస్లో ఉపయోగానికి రాక΄ోతే అవసరమైనవారికి పంపించేస్తాను’ అంది క్రిస్. -
తెలుగు అధికారికి ఎస్బీఐ పగ్గాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నూతన చైర్మన్గా సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ చల్లా శ్రీనివాసులు శెట్టిని ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) శనివారం ఎంపిక చేసింది. ప్రస్తుతం ఆయన ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో అంతర్జాతీయ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్స్, టెక్నాలజీ విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. ఆగస్టు 28న పదవీ విరమణ చేయనున్న దినేష్ కుమార్ ఖరా స్థానంలో బాధ్యతలు స్వీకరిస్తారు. శ్రీనివాసులు తెలుగువారు కావడం విశేషం. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా పెద్దపోతులపాడు ఆయన స్వస్థలం. ఎస్బీఐలో ప్రొబేషనరీ అధికారిగా 1988లో కెరీర్ ప్రారంభించారు. ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థల డైరెక్టర్లను ఎంపిక చేసే ఎఫ్ఎస్ఐబీ.. ఎస్బీఐ కొత్త చైర్మన్ కోసం జూన్ 29న ముగ్గురు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి శ్రీనివాసులు పేరును ఖరారు చేసింది. ఎఫ్ఎస్ఐబీ సిఫార్సుపై ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. -
రిటైర్డ్ ఆర్మీ జవానుకు 20 ఏళ్ల జైలు
రాంగోపాల్పేట్: ఓ మైనర్ బాలికను బెదిరించి లైంగికదాడికి పాల్పడిన ఓ రిటైర్డ్ ఆర్మీ జవానుకు పోక్సో స్పెషల్ సెషన్స్ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధించింది. మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన 2017 సంవత్సరంలో జరిగింది. మార్కెట్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం ఓ మైనర్ బాలిక రెజిమెంటల్బజార్లోని హోంలో ఉంటూ 31బస్టాప్ ప్రాంతంలోని పాలికాబజార్లో ఉండే ఓ టైలరింగ్ సెంటర్లో టైలరింగ్ నేర్చుకుంటోంది. 2017 జూలై 24వ తేదీన ఉదయం 11గంటలకు టైలరింగ్ సెంటర్కు వెళ్తుండగా ఆర్మీలో పదవి విరమణ పొందిన యాప్రాల్లో నివాసం ఉండే పెరియాటి శ్రీధరన్(59) బాలికను ఆపి భోజనం చేశావా అంటూ ప్రశ్నించాడు. భోజనం పెట్టిస్తానని ముత్యాలమ్మ దేవాలయం ప్రాంతంలోని ఓ హోటల్కు తీసుకుని వెళ్లి భోజనం పెట్టించాడు. అక్కడి నుంచి ఆ బాలికను హోటల్కు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అటు తర్వాత మనోహర్ థియేటర్ ప్రాంతంలోని ఓ లైన్లో ఆ బాలికను విడిచి వెళ్లిపోయాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. బాలిక హోంకు వెళ్లి రెండు రోజుల పాటు ఏడుస్తూ విచారంగా ఉంది. హోంలోని ఓ ఆరోగ్య కార్యకర్త గమనించి ఆరా తీయగా జరిగిన విషయం చెప్పింది. వెంటనే 27వ తేదీన హోం నిర్వాహకులు మంజుల, పద్మ బాలికను తీసుకుని వెళ్లి మార్కెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించి చార్జిïÙట్ను కోర్టుకు సమరి్పంచారు. పోక్సో ప్రత్యేక సెషన్స్ జడ్జి పుష్పలత కేసును విచారించి పోలీసులు సమరి్పంచిన సాక్ష్యాధారాలతో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేశారు. మరో రూ.20వేల జరిమానా కూడా విధించారు. ఈ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్రెడ్డి బాలిక తరఫున వాదనలు వినిపించి శిక్ష పడేలా చూశారు. -
చదువు శక్తినిస్తుంది
‘ఈ రోజులను చూస్తుంటే మా రోజుల్లోనే అమ్మాయిలకు తగినంత స్వేచ్చ,అనుకున్నవి సాధించే ధైర్యం, సమాజాన్ని అర్ధం చేసుకునే పరిణతిని పొందారు’ అనిపిస్తుంటుంది అన్నారు రిటైర్డ్ ప్రిన్సిపల్ కమలా మీనన్. తిరుపతి పద్మావతి మహిళా కళాశాల మూడవ ప్రిన్సిపల్గా బాధ్యతలు నిర్వహించిన కమలా మీనన్ సికింద్రాబాద్ బోయినపల్లిలో ఉంటున్నారు. భర్త డగ్లస్ ఎమ్ కాక్రన్ జ్ఞాపకాలతో పాటు, 86 ఏళ్ల జీవితంలో ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలు తనను ఎలా నిలబెట్టాయో వివరించారు. ‘‘చదువు అమ్మాయిలను శక్తిమంతులను చేస్తుంది. ఈ విషయాన్ని ఆ రోజుల్లోనే మా అమ్మ గుర్తించారు..’ అంటూ గతకాలపు విషయాలను మన ముందుంచారు. చదువు వేసిన మార్గం.. ‘‘పుట్టి పెరిగింది చెన్నైలో. నాన్నగారు బ్రిటిష్ గవర్నమెంట్లో ఉద్యోగం చేసేవారు.అమ్మానాన్నలకు ఎనిమిది మంది సంతానం. అక్కతోపాటు ఆరుగురు అన్నలు నాకు. ఆడ, మగ అనే వివక్ష ఏ మాత్రం లేదు. అందరికీ మంచి చదువులు చదువుకునే అవకాశం ఇచ్చారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి ఆనర్స్ పూర్తయ్యాక బెంగుళూరు మౌంట్ కార్మెల్ కాలేజీలో లెక్చరర్గా ఐదేళ్లు పని చేశాను. ఆ ఎక్స్పీరియెన్స్ నాకు చాలా హెల్ప్ అయ్యింది. అప్పుడు చదువుకునే అమ్మాయిల శాతం కూడా బాగానే ఉంది. ఆ తర్వాత మార్పు కోసం తిరిగి మద్రాస్కు వచ్చేశాను. తిరుపతిలోని పద్మావతి మహిళా కళాశాలలో పొలిటికల్ విభాగంలో టెంపరరీ జాబ్ గురించి పేపర్లో ప్రకటన చూసి, అప్లై చేసి, సెలక్ట్ అయ్యాను. ఆరు నెలల తర్వాత పర్మినెంట్ అయ్యింది. సవాళ్లను తట్టుకుని ఎదుగుతూ.. జీవితంలో సవాళ్లు, బాధలు ఎక్కడి నుంచైనా ఎదురు కావచ్చు. నన్ను విపరీతంగా బాధపెట్టే సంఘటన నుంచి కోలుకోవడానికి సమయం పట్టింది. మా అక్క ఢిల్లీలో ఉండేవారు. జబ్బు పడి అక్క, నాన్న ఇద్దరూ ఒకే రోజు చనిపోయారు. ఈ సంఘటన నన్ను బాగా కదిలించాయి. ఆ టైమ్లో డా.రాజేశ్వరి మూర్తి కాలేజీ ప్రిన్సిపల్గా ఉండేవారు. ఆవిడ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లినప్పుడు సెలక్షన్ కమిటీ నన్ను ఇన్ఛార్జిగా ఎంపిక చేసింది. నా మైండ్ కూడా ఛేంజ్ కావాలనుకొని, 1975లో ఆ బాధ్యత తీసుకున్నాను. ఇంటర్వ్యూ ద్వారా టెంపరరీ జాబ్ వచ్చింది. తర్వాత పర్మినెంట్ అయ్యింది. ఆ తర్వాత ఇన్ఛార్జి ప్రిన్సిపల్గా అవకాశం వచ్చింది. నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. అదే సమయంలో విదేశాలకు వెళ్లిన మరో సీనియర్ మహిళా లెక్చరర్ తిరిగి వచ్చారు. అప్పుడు మేనేజ్మెంట్ సీనియర్ కాబట్టి ఆవిడను నా ప్లేస్లో రీ ప్లేస్ చేశారు. అప్పటికే నన్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది, ఆ తర్వాత మరొకరికి ఇచ్చింది. దీంతో నా పొజిషన్ కోసం కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ నేను గెలిచాను. అలా యూనివర్శిటీకి 3వ మహిళా ప్రిన్సిపల్గా బాధ్యతలు తీసుకున్నాను. ఆ తర్వాత 1993లో రిటైర్ అయ్యేవరకు ప్రిన్సిపల్గా చేశాను. 1997 వరకు దేవస్థానం ఎడ్యుకేషన్ ఆఫీసర్గా వర్క్ చేశాను. లెక్చరర్గా ఎంతో మంది విద్యార్థులను చూశాను. ఎంతోమంది విద్యార్థులతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇప్పటికీ కలిసేవారు, ఫోన్లు చేసి మాట్లాడేవారున్నారు. ఆత్మీయులుగా మారినవారు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన, మొదటి తరం అమ్మాయిలే అక్కడంతా. వారిలో భవిష్యత్తుని చక్కగా మార్చుకోవాలనే పరిణతి బాగా కనిపించేది. వారి భవిష్యత్తుకు ప్రత్యేక క్లాసులు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేర్చాం. లెక్చరర్లు ఎంతో సపోర్ట్గా నిలిచేవారు. నాటి ఆ విద్యార్థుల్లో నేడు ఎంతోమంది పెద్ద పెద్ద పొజిషన్లలో, దేశ విదేశాల్లో ఉన్నారు. జీవితంలో ముఖ్యమైన మలుపు 1979–80లో నాటి మద్రాస్లో సౌత్ ఇండియా అమెరికా రాయబార కార్యాలయానికి డగ్లస్ ఎమ్ కాక్రన్ కాన్సులేట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. కాలేజీ సెమినార్ సందర్భంగా మద్రాస్ నుంచి తిరుపతికి సెమినార్కు వచ్చారు. అక్కడ డిస్కషన్స్ అన్నీ పూర్తయి, వెళ్లిపోయారు. ఆ సమయంలో యునైటెడ్ స్టేట్స్ ఇరాన్ పొలిటికల్ ఇష్యూస్ జరుగుతున్నాయి. చెన్నైలోని అమెరికన్ ఎంబసీ ఎదుట నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో సేఫ్గా ఉండమని రాసిన నోట్ తిరిగి మమ్మల్ని కలిపింది. ఆ తర్వాత జరిగిన డిస్కషన్స్ మమ్మల్ని మంచి స్నేహితులుగా మార్చాయి. 1985లో మేం పెళ్లి చేసుకున్నాం. ఆ విధంగా శ్రీమతి డగ్లస్ ఎమ్ కాక్రన్ అయ్యాను. జీవితంలో ఒక అద్భుతమైన వ్యక్తిని కలిసాను అనిపించేది. మా అమ్మను ఆమె సొంత కొడుకుల కన్నా డగ్లస్ గొప్పగా చూసుకున్నారు. ఇన్నేళ్ల మా జీవనంలో ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఇటీవల డగ్లస్ అనారోగ్యంతో భౌతికంగా దూరమయ్యారు. అయితేనేం.... ఆ జ్ఞాపకాలు ఎంతో పదిలంగా ఉన్నాయి. అవే నన్ను శక్తిమంతురాలిని చేస్తున్నాయి. విశ్రాంత జీవనంలో.. రిటైర్ అయినా కొన్ని విదేశీ కంపెనీలు, సూపర్మార్కెట్స్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించేవారు డగ్లస్. నేను రిటైర్ అయిన తర్వాత ఎక్కడ ఉండాలో ఇద్దరమూ ఆలోచించుకున్నాం. అందుకు, సికింద్రాబాద్లోని బోయినపల్లి మాకు అనువైనదిగా అనిపించింది. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం. మా ఇంట్లోనే కాదు మా చుట్టుపక్కల ఇళ్లలో పనులు చేసే వారి పిల్లలకు మంచి చదువు చెప్పించాలనే ఉద్దేశ్యంతో వారిని ఒక చోట చేర్చి చదువులు చెప్పేవాళ్లం. కాలనీలోని చదువుకున్న మహిళల చేత ట్యూషన్స్ చెప్పించేవాళ్లం. వారి పిల్లలను కాన్వెంట్ స్కూల్లో చేర్పించి, మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకునేవాళ్లం. అలా, ఆ పిల్లలు కూడా ఇప్పుడు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అమ్మానాన్నల పెంపకంలోనూ, చదువులోనూ, సమాజంలో మనకు లభించే స్వేచ్ఛ దుర్వినియోగం చేసుకోకూడదు. ఆ స్వేచ్ఛను మనకు అనుకూలంగా మలచుకోవాలి. అదే మనల్ని శక్తిమంతులుగా నిలుపుతుంది అది ఏ దేశమైనా అని నేనూ కాక్రన్ అనుకునేవాళ్లం’’ అంటూ నేటి తరంలో వస్తున్న మార్పులను అన్వయించుకుంటూ తెలియజేశారు’’ కమలా మీనన్. – నిర్మలారెడ్డి -
Chennamadhavuni Ashok raj: విశ్రాంతి ఉద్యోగానికే... జీవితానికి కాదు!
ప్రతిరోజూ మనదే. ప్రతిరోజునీ శ్వాసించాలి. ప్రతిరోజునీ ఆఘ్రాణించాలి. ప్రతిరోజునీ ఆస్వాదించాలి. ప్రతిరోజుకీ జీవం ఉండాలి. అప్పుడే... జీవితం జీవంతో ఉంటుంది. సంతోషాల సుమహారమవుతుంది. ‘బోర్ కొడుతోంది’ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరి ముని పెదవుల మీద ఉంటుందీ మాట. పిల్లలను బోర్డమ్ నుంచి బయటేయడం సులువే. కానీ రిటైర్ అయిన వాళ్లను వేధించే బోర్డమ్కు పరిష్కారం ఎలా? వయసు పై బడేకొద్దీ... అలవాటు పడిన జీవితం నుంచి కొద్దిపాటి మార్పును కూడా స్వీకరించలేని మొండితనం ఆవరించేస్తుంటుంది. ఆ మొండితనం నుంచి బయటపడలేక అవస్థలు పడే వార్ధక్యానికి ఓ సమాధానం చెన్నమాధవుని అశోక్రాజు. విదేశాల్లో స్థిరపడిన పిల్లల దగ్గరకు వెళ్లిన తల్లిదండ్రులు ‘మేమక్కడ ఉండలేక΄ోయాం. బోర్ కొట్టి చచ్చాం. ఒక్క రోజు ఒక్క యుగంలా గడిచింది’ అనే వాళ్లకు సమాధానంగా అశోక్రాజు తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. కలప కరెంట్ స్తంభాలు ‘‘మేము హైదరాబాద్లోని వనస్థలిపురంలో విశ్రాంత జీవనం గడుపుతున్నాం. యూఎస్లోని రెడ్మాండ్లో మా పెద్దమ్మాయి, అల్లుడు, మనుమరాలు ఉన్నారు. గడచిన ఏడాది నేను, మా ఆవిడ వీణారాణి... పెద్దమ్మాయి దగ్గరకు వెళ్లి ఆరు నెలలు ఉండి డిసెంబర్లో ఇండియాకొచ్చాం. టూర్లో భాగంగా... యూఎస్లో టకోమా – సియాటెల్ ఎయిర్΄ోర్ట్లో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గాన రెడ్మాండ్కు చేరుకున్నాం. రోడ్డు వెడల్పుగా, ఇరువైపులా నిటారుగా పెరిగిన చెట్లతో పచ్చగా ఉన్నాయి పరిసరాలు. కర్రలతో నిర్మించిన ఇళ్లు చూడముచ్చటగా ఉన్నాయి. ఇంటి చుట్టూ ఎత్తుగా పెరిగిన చెట్లతో అడవిమధ్యలో ఇల్లు కట్టినట్లు ఉంది. ఇంటి నిర్మాణంలో మాత్రమే కాదు, విద్యుత్ స్తంభాలుగా కూడా కలపనే వాడతారు. బాగా ఎత్తుగా పెరిగిన చెట్లను కరెంట్ స్తంభాలుగా ఉపయోగిస్తారు. పైన్ లేక్, లేక్ వాషింగ్టన్, స్నో క్యూలమిన్ ఫాల్స్, విద్యుత్ ఉత్పాదన కేంద్రాలను చూశాం. ఓపెన్ ప్లేస్ మేరిమూర్ పార్క్లో సినిమా చూడడం మాకు విచిత్రమైన అనుభూతి. మన దగ్గర ఉన్నట్లు క్లోజ్డ్ థియేటర్ కాదది. బహిరంగ ప్రదేశంలో లాన్లో కుటుంబాలతో కూర్చుని స్నాక్స్ తింటూ, కూల్డ్రింకులు తాగుతూ సినిమా చూస్తుంటారు. పాశ్చాత్యంలో మన పతంజలి యోగ మెక్సికోలో ముఖ్యమైన పర్యాటక ప్రదేశం కంకూన్కెళ్లాం. అక్కడ క్లౌన్ ΄్యారడైజ్ క్లబ్... ఐదు వందలకు పైగా గదులున్న పెద్ద హోటల్. యూఎస్, కెనడా, బ్రెజిల్, యూకే నుంచి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. మన దగ్గర ఫైవ్స్టార్ హోటళ్లలో జిమ్లుంటే... అక్కడ అతిథుల కోసం డెయిలీ రొటీన్లో యోగసాధన కూడా ఉంది. అక్కడి శిక్షకులు పతంజలి యోగ పుస్తకాన్ని ఆధారం చేసుకుని స్పానిష్ భాషలో వివరిస్తున్నారు. థియరీని మక్కీకి మక్కీ నేర్చుకుని అర్థమైనంతలో సాధ్యమైనంత వరకు ఆచరణలో పెడుతున్నారని అర్థమైంది. నాకున్న ముప్పై ఏళ్ల యోగ సాధన అనుభవంతో సీనియర్ సిటిజెన్ కోసం ఆరు రోజుల కోర్సు డిజైన్ చేసి నేర్పించాను. పవన ముక్తాసనం, మకరాసనం, సర్పాసనం, వజ్రాసనం, భుజంగాసనం, సూర్య నమస్కారాలతోపాటు ్రపాణాయామం, భస్త్రిక సాధనను కూడా వాళ్లు వీడియో తీసుకుని ఇకపై ఇలాగే సాధన చేస్తామని చె΄్పారు. పర్యటన కోసం అక్కడికి వెళ్లిన భారతీయులకంటే పాశ్చాత్యులు, అక్కడ స్థిరపడిన భారతీయులు యోగసాధన పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. శంకర నేత్రాలయ కోసం దాండియా యూఎస్ పర్యటనలో కొన్ని రోజులు అట్లాంటాలో గడిపాం. అట్లాంటాలో ఉన్న రోజుల్లో నేను రోజూ జేమ్స్ క్రీక్ క్లబ్లో యోగసాధన చేసేవాడిని. అక్కడి వారి కోరిక మేరకు యోగాతోపాటు విపస్సన ధ్యాన ప్రక్రియ కూడా నేర్పించాను. అక్కడ ఉద్యోగ, వ్యాపారాల్లో భారతీయులు ఎక్కువగా ఉన్నారు. వాళ్లకు యోగ సాధన చేయాలని ఉన్నప్పటికీ టీచర్ లేక΄ోవడంతో ్రపాక్టీస్ చేయలేక΄ోయేవారు. ‘అట్లాంటా విజిటర్స్ అసోసియేషన్’ వాట్సాప్ గ్రూప్లో కనెక్ట్ అయ్యాం. అక్కడ చాలా విశాలమైన కమ్యూనిటీ హాల్ ఉంది. అందులో సమావేశపరిచి యోగ, విపస్సన నేర్పించాను. వీటన్నింటికంటే నాకు అత్యంత సంతృప్తినిచ్చిన విషయం ఏమిటంటే... సియాటెల్లోని మైక్రోసాఫ్ట్ కార్యాలయంలో నవరాత్రి సందర్భంగా నిర్వహించిన కల్చరల్ ్ర΄ోగ్రామ్లో పాల్గొనడం. ఎందుకంటే అది మనదేశంలో పేదవారికి ఉచితంగా వైద్యం అందించే సేవాసంస్థ ‘శంకర్ నేత్రాలయ’ కోసం ఫండ్ రైజింగ్ ్ర΄ోగ్రామ్. పాశ్చాత్య గడ్డ మీద మన భారతీయులతో కలిసి దాండియా నాట్యం చేయడం, విదేశీయులకు నేర్పించడం, అది కూడా ఒక సామాజిక ప్రయోజనం కోసం కావడం నాకు సంతోషాన్నిచ్చింది. మనం ఎక్కడ ఉన్నా సరే... రోజును ఉపయుక్తంగా మలుచుకోవడం మన చేతుల్లోనే ఉంటుందని నమ్ముతాను. అదే ఆచరణలో పెడతాను. పని... చేసే వారికి ఎదురొస్తుంది! ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. పెద్దమ్మాయి అమెరికా, చిన్నమ్మాయి ఆస్ట్రేలియాలో స్థిరపడడంతో రెండేళ్లకోసారి ఒక్కో అమ్మాయి దగ్గరకు వెళ్లడం అలవాటు చేసుకున్నాం. ఎక్కడ ఉన్నా నాకు బోర్ అనే మాట నా దగ్గరకు చేరదు. ఎందుకంటే మనిషి సంఘజీవి. ఏ సంఘంలో ఉంటే ఆ సంఘంతో మమేకమై జీవించాలనేది నా ఫిలాసఫీ. ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు అక్కడి వాళ్లతో కలిసి కమ్యూనిటీ ఫార్మింగ్ చేశాను. మా చిన్నల్లుడి సహకారంతో అక్కడి లైబ్రరీలో తెలుగు పుస్తకాలు పెట్టే ఏర్పాటు చేయగలిగాను. మనం ఖాళీగా ఉండకుండా ఎప్పుడూ ఏదో ఒక పని చేయడానికి సిద్ధంగా ఉంటే చాలు. అక్కడ మన అవసరం ఏమిటో, మనం మాత్రమే చేయగలిగిన పని ఏమిటో మనకు కనిపించి తీరుతుంది. ఒక్కమాటలో చె΄్పాలంటే పని మనకు ఎదురొస్తుంది. అలా ఒక వ్యాపకంలో నిమగ్నమైతే చాలు. మన వల్ల మరొకరికి ప్రయోజనమూ కలుగుతుంది. మనకు రోజు నిర్వీర్యంగా గడిచి΄ోకుండా ఉపయుక్తంగా గడిచిన సంతోషమూ కలుగుతుంది’’ అన్నారు చెన్నమాధవుని అశోక్రాజు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఉగ్రదాడిలో రిటైర్డ్ పోలీసు అధికారి మృతి
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో రిటైర్డ్ పోలీసు అధికారి మరణించారు. గంటముల్లా బాలా ప్రాంతంలోని స్థానిక మసీదులో ఎస్ఎస్పీ మహమ్మద్ షఫీ మీర్ ప్రార్థనలు చేస్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది. ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి దర్యాప్తు ప్రారంభించారు. "బారాముల్లా ప్రాంతంలో మసీదులో రిటైర్డ్ పోలీసు అధికారి మహ్మద్ షఫీ ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయాలపాలై ఆయన మరణించారు. ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి దర్యాప్తు ప్రారంభించాం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది" అని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. గత నెలలో, శ్రీనగర్లోని ఈద్గా మసీదు సమీపంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో రాష్ట్ర పోలీసు ఇన్స్పెక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. గత కొంతకాలంగా కశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతోంది. ఇటీవల పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 విజృంభణ -
సర్జికల్ స్ట్రైక్ హీరోకి మణిపూర్ అల్లర్ల బాధ్యతలు
ఇంఫాల్:మణిపూర్లో హింసాత్మక ఘటనల తర్వాత ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. శాంతియుత పరిస్థితులు నెలకొల్పడానికి కావాల్సిన అన్ని కోణాల్లో ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే అక్కడి పరిస్థితుల్ని చక్కదిద్దడానికి కీలక అధికారిని నియమించింది. 2015లో మయన్మార్పై జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ లో కీలక పాత్ర పోషించిన రిటైర్డ్ ఆర్మీ అధికారి నెక్టార్ సంజెన్బామ్ను నియమించింది. Kirti Chakra for Lt Col Nectar Sanjenbam. Part of the Army's Myanmar cross-border strike. #IDay2015 pic.twitter.com/rNqfgb9o1o — Shiv Aroor (@ShivAroor) August 14, 2015 మణిపూర్ పోలీస్ డిపార్ట్మెంట్లో కల్నల్ నెక్టార్ సంజెన్బామ్ను సీనియర్ సూపరింటెండెంట్గా ప్రభుత్వం నియమించింది. ఐదేళ్ల పాటు పదవిలో ఆయన కొనసాగనున్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆగష్టు 24న నియమాక ఉత్తర్వుల్లో పేర్కొంది. కల్నల్ నెక్టార్ సంజెన్బామ్కు అత్యున్నత పురష్కారాల్లో రెండోదైన కీర్తి చక్రతో పాటు మూడో అత్యున్నత పురస్కారం శౌర్య చక్ర కూడా ఇప్పటికే లభించాయి. సహసోపేతమైన నిర్ణయాలతో ఎలాంటి పరిస్థితుల్నైన చక్కదిద్దే వ్యూహాలను రచించగలరనే పేరు ఆయనకు ఉంది. Lt Col (Now Col) Nectar Sanjenbam, Kirti Chakra, Shaurya Chakra of 21 PARA SF. On 8 June 2015, he led his team nd carried out cross-border raid on insurgents in Myanmar to revenge the ambush on the soldiers of 6 DOGRA. The operation resulted in the eliminating of 300+ insurgents. pic.twitter.com/kf4PHuLrxg — Guardians_of_the_Nation (@love_for_nation) January 23, 2021 ఈ మేరకు కేబినెట్ జూన్ 12న నిర్ణయం తీసుకుందని ఆగష్టు 24న మణిపూర్ హోం శాఖ తెలిపింది. మణిపూర్లో మెయితీ, కుకీ తెగల మధ్య ఇంకా ఘర్షణలు జరుగుతున్నాయి. గత ఐదు రోజుల్లోనే రాష్ట్రంలో 12 మంది మరణించారు. 30 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అల్లరి మూకలను అణిచివేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మెయితీ తెగ ప్రజలకు గిరిజన హోదా ఇవ్వాలని హైకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత రాష్ట్రంలో అశాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. మెయితీ, కుకీ తెగల మధ్య మే 3న మొదటిసారి ఘర్షణలు జరిగాయి. ఇప్పటివరకు అక్కడ జరిగిన హింసాత్మక ఘటనల్లో 170 మందికి పైగా మరణించారు. ఇదీ చదవండి: సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు.. -
రాత్రి వేళ తహసీల్దార్ కార్యాలయంలో రిటైర్డ్ వీఆర్వో
అనకాపల్లి: తహసీల్దార్ కార్యాలయంలో రాత్రి సమయంలో రిటైర్డ్ వీఆర్వో కనిపించడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. రాత్రి వేళలో ఆయనకు ఏం పనంటూ పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని బయ్యవరం గ్రామానికి చెందిన లాలం సూర్యనారాయణ గతంలో వీఆర్వోగా పనిచేసి రిటైరయ్యారు. ఈయన శనివారం రాత్రి 10 గంటల అనంతరం గిడుతూరు సచివాలయ సర్వే అసిస్టెంట్ శ్రీనుతో కలిసి తహసీల్దార్ కార్యాలయంలో కనిపించారు. రెవెన్యూ రికార్డులకు సంబంధించిన విషయాలపై మాట్లాడుతుంగా తీసిన ఫొటోలు, వీడియో ఆదివారం సోషల్ మీడియాతోపాటు వివిధ వాట్సప్ గ్రూపుల్లో వైరల్ అయ్యాయి. దీంతో శనివారం మొహర్రం సందర్భంగా కార్యాలయానికి సెలవు కావడం, పైగా రాత్రివేళ కార్యాలయంలో కనిపించడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. గిడుతూరు సచివాలయం పరిధిలోని బయ్యవరానికి సంబంధించి రికార్డులు తారుమారు చేసేందుకే ఆ సమయంలో రిటైర్డ్ వీఆర్వోను రెవెన్యూ అధికారులు రప్పించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనప్పటికీ రెవెన్యూ అధికారులు ఆ సమయంలో ఆయన్ను కార్యాలయంలోకి అనుమతించడం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. ఆరోపణల్లో వాస్తవం లేదు.. రెవెన్యూ కార్యాలయంలో సెలవు రోజు రాత్రి రిటైర్డ్ వీఆర్వోతో కలిసి రికార్డులు తారుమారు చేస్తున్నట్టు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని తహసీల్దార్ ప్రసాద్ వివరణ ఇచ్చారు. బయ్యవరం గ్రామానికి సంబంధించి రీసర్వేపై డీఎల్ఆర్(డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్) నమోదు చేస్తున్నామని, సూర్యనారాయణకు ఉన్న భూమికి సంబంధించిన వివరాలపై సర్వే అసిస్టెంట్ పిలవడంతోనే ఆయన వచ్చాడని తహసీల్దార్ తెలిపారు. -
ఊహించని గిఫ్ట్ ఇచ్చిన విద్యార్థులు.. చూడగానే టీచర్ ఆనందంతో కన్నీళ్లు ఆగలేదు
చెన్నై: తల్లి, తండ్రి, గురువు అంటారు.. వీళ్లు ముగ్గురు జీవితంలో చాల కీలకమైన వాళ్లుగా మన పెద్దలు చెబుతుంటారు. తల్లిదండ్రులు నీకు ఆలనాపాలనా చూస్తే , గురువులు నీకు విద్యా బుద్దులు నేర్పించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడంతో కీలక పాత్ర పోషిస్తారు. అలాంటి గురువుకి కొందరు విద్యార్థులు ఆయన ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా ఊహించిన బహుమతి ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ఈ ఘటన తిరువారూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విద్యాబుద్ధులు నేర్పిన గురువుకు విద్యార్థులు, పూర్వ విద్యార్థులు కలిసి తమ గుర్తుగా ఓ చిరు కానుకను అందజేశారు. తిరువారూరు జిల్లా ముత్తుపేట సమీపంలోని అలంగాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రామన్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆయన 1988 జూన్ 27న ఈ స్కూల్లో చేరి శనివారం ఉద్యోగ విరమణ చేశారు. ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఈ క్రమంలో రామన్ ఉద్యోగ విరమణ చేస్తున్న విషయాన్ని తెలుసుకుని మాలంగాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చేరుకున్నారు. ఆయనకు రూ.లక్ష విలువైన ద్విచక్ర వాహనాన్ని బహుమతిగా అందజేశారు. ఉపాధ్యాయుడు రామన్ను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. విద్యార్థులు తనపై చూపిన ప్రేమకు ఆ ఉపాధ్యాయుడికి ఆనందంతో కంట కన్నీళ్లు ఆగలేదు. చదవండి: బస్సు వైపు కోపంగా దూసుకొచ్చిన ఏనుగు.. ఇదే చివరి రోజు అనుకున్నారు.. కానీ ఫైనల్గా -
రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య కిడ్నాప్ విషాదాంతం
సాక్షి, జనగామ జిల్లా: రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య కిడ్నాప్ విషాదాంతంగా మారింది. కిడ్నాపర్లు కొట్టి హత్య చేసి మృతదేహాన్ని జనగామ సమీపంలోని చంపక్ హిల్స్ క్వారీ గుంతలో పడేశారు. మృతదేహాన్ని పోలీసులు గుర్తించి, ఐదుగురిని అందులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు భూ వివాదాలే కారణమని స్థానికులు భావిస్తున్నారు. హత్య వెనుక అధికారపార్టీ నాయకుల హస్తం ఉందని కుటుంబసభ్యులు ఆరోపిస్తు ఆందోళనకు దిగారు. కిడ్నాప్నకు గురైన బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంపీడీఓ నల్లా రామకృష్ణయ్య మృతదేహం లభించడంతో మూడు రోజుల మిస్టరీకి తెరపడింది. రామకృష్ణయ్య కిడ్నాప్ ఉదంతం జిల్లాలో సంచలనం కలిగించగా.. అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ రంగంలోకి దిగినట్లు సమాచారం. కిడ్నాప్పై స్థానిక పోలీసులతో పాటు టాస్క్ఫోర్స్ బృందం అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న క్రమంలో.. రామకృష్ణయ్య హత్యకు సంబంధించిన సమాచారం శనివారం సాయంత్రమే బయటకు వచ్చింది. పోచన్నపేటకు చెందిన రామకృష్ణయ్య గతంలో నర్మెట, రఘునాథపల్లి, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో ఎంపీడీఓగా పని చేశారు. ఆ తర్వాత ఇంటి వద్దనే ఉంటూ.. సమాచార హక్కు చట్టం కింద వివరాల సేకరణలో యాక్టివ్గా పని చేస్తున్నాడు. జీపీ, తదితర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి సర్కారు నుంచి మంజూరైన నిధులు, వాటి వినియోగం తదితర వివరాలు సేకరించేవారు. ఆయన ఈనెల 15వ తేదీన బచ్చన్నపేట మండల కేంద్రం నుంచి తన ద్విచక్రవాహనంపై పోచన్నపేటకు వస్తుండగా మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అదే రోజు కుటుంబ సభ్యులు అనుమానితులపై స్థానిక పీఎస్లో ఫిర్యాదు చేశారు. చదవండి: Hyderabad: అనుమానాస్పదంగా సినీ రచయిత మృతి క్రైం నంబర్ 105/2023, యూ/ఎస్.363 ఐపీఎస్ కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. రామకృష్ణయ్యను కిడ్నాపర్లు జనగామ మండలం ఓబుల్ కేశ్వాపురం వైపు తీసుకువెళ్లినట్లు పోలీసులు గుర్తించి.. ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాప్ చేసే సమయంలో రిటైర్డ్ ఎంపీడీఓ సెల్ఫోన్ దారిలో పడిపోయింది. ఫోన్ సిగ్నల్ ను ట్రాక్ చేసిన పోలీసులు.. ఓ రైతు వద్ద ఉన్నట్లు గుర్తించారు. విచారణలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి భర్తతో పాటు ఆయన సోదరుడు, మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు. చివరికి రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య కిడ్నాప్ విషాదాంతంగా ముగిసింది. -
సెలవిక.. శత్రుంజయ! ‘ఐఎన్ఎస్ మగర్’ యుద్ధ నౌక నిష్క్రమణ
సాక్షి, విశాఖపట్నం: నీటిలోనే కాదు.. నేలపైనా దాడిచేసే స్వభావం ఉన్న మొసలి (మగర్) లక్షణాల్ని పుణికిపుచ్చుకున్న ఆ యుద్ధ నౌక వస్తుందంటే శత్రువుల వెన్నులో వణుకు పుట్టేది. ఆయుధ సంపత్తిని మోసుకొస్తున్న ఆ నౌక కనిపిస్తే చాలు.. శత్రు సైన్యంతో పోరాడుతున్న బలగాలకు కొండంత ధైర్యం పోగవుతుంది. ఆపదలో ఉన్నవారికి ఆత్మీయత పంచుతూ.. విపత్తులో ఉన్నవారిని ఒడ్డుకు చేర్చుతూ.. 36 ఏళ్లపాటు భారత నౌకాదళానికి సుదీర్ఘ సేవలందించిన ఐఎన్ఎస్ మగర్ ఆదివారంతో విధులకు స్వస్తి పలకనుంది. వార్ఫేర్ వెసెల్గా అంతర్జాతీయ విన్యాసాల్లో సత్తా చాటిన మగర్కు భారత నౌకాదళం ఆదివారం ఘనంగా వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతోంది. ఒడ్డుకు వచ్చి మరీ.. భారత నౌకాదళ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన ఉభయచర యుద్ధ నౌకల్లో కీలకమైనదిగా ఐఎన్ఎస్ మగర్ ఖ్యాతి ఆర్జించింది. విశాఖలోని హిందుస్థాన్ షిప్యార్డు సహకారంతో కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ (జీఆర్ఎస్ఈ)లో మగర్ని యాంఫిబియాస్ షిప్గా తీర్చిదిద్దారు. అంటే.. సాధారణంగా షిప్లు ఒడ్డు వరకూ రాలేవు. కానీ.. మగర్ మాత్రం ఒడ్డు వరకూ వచ్చి.. సైన్యానికి అవసరమైన ఆయుధ సంపత్తిని అందించగల సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది. అందుకే.. దీనికి మగర్ (తెలుగులో మొసలి అని అర్థం) అనే పేరుపెట్టారు. 1987 జూలై 15న భారత నౌకాదళంలో ఈ షిప్ ప్రవేశించింది. విశాఖ నుంచి సుదీర్ఘ సేవలు తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రమైన విశాఖపట్నానికి ఐఎన్ఎస్ మగర్ని కేటాయించారు. ల్యాండింగ్ షిప్ ట్యాంక్(ఎల్ఎస్టీ) హోదాలో యుద్ధ ట్యాంకులు, ఆయుధాలు తీసుకెళ్లగల సామర్థ్యం దీని సొంతం. నలుగురు ల్యాండింగ్ క్రాఫ్ట్ వెహికల్ సిబ్బంది, అత్యవసర సమయంలో దళాల్ని మోహరించేందుకు మగర్ యుద్ధ నౌకను వినియోగించేవారు. శ్రీలంకలో ఎల్టీటీఈని నిరోధించే సమయంలో నిర్వహించిన ఆపరేషన్ పవన్లో మగర్ కీలక పాత్ర పోషించింది. నిరంతర పోరాటం చేసిన ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్(ఐపీసీకే)కు అవసరమైన సామగ్రిని అందించింది. వివిధ దేశాల్లో జరిగిన ద్వైపాక్షిక విన్యాసాల్లో మగర్ సత్తా చాటింది. 2006 ఫిబ్రవరి 22న విశాఖ తీరానికి 70 కి.మీ. దూరంలో మగర్ యుద్ధ నౌకలో ఘోర ప్రమాదం సంభవించింది. షిప్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ముగ్గురు నావికులు మృతి చెందారు. మరో 19 మంది గాయాల పాలయ్యారు. 2018వ సంవత్సరం వరకూ విశాఖ కేంద్రంగా సేవలందించిన మగర్ను 2018 ఏప్రిల్లో కొచ్చికి తరలించి.. మార్పులు చేర్పుల అనంతరం మొదటి స్క్వాడ్రన్ శిక్షణ నౌకగా సేవలు అందించింది. సునామీలో విశిష్ట సేవలు మగర్ అందించిన సేవల్లో ముఖ్యంగా 2004లో వచ్చిన సునామీ సమయమనే చెప్పుకోవాలి. ఎప్పుడు మళ్లీ సముద్రం ఉప్పొంగి.. విలయం వస్తుందో తెలీని సమయంలో ధైర్యంగా సాగర జలాల్లో ప్రయాణించిన మగర్.. అండమాన్ నికోబార్ దీవుల్లో చిక్కుకున్న 1,300 మందిని రక్షించి సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చింది. అంతేకాకుండా.. అక్కడి నుంచి వివిధ విపత్తు ప్రాంతాలకు తరలివెళ్లి నిరాశ్రయులుగా మిగిలిన వారికి సహాయక సామగ్రి అందజేయడంలోనూ కీలకంగా వ్యవహరించిన మగర్కు భారత రక్షణ దళం నుంచి అద్భుత ప్రశంసలందాయి. కోవిడ్ సమయంలో నిర్వహించిన ఆపరేషన్ సముద్ర సేతులోనూ మగర్ విశిష్ట పాత్ర పోషించింది. వివిధ ప్రాంతాల్లో ఉన్న భారతీయుల్ని స్వదేశానికి తీసుకురావడం, స్నేహపూర్వక దేశాలకు వైద్యసామగ్రి అందించడం మగర్ ద్వారానే సాధ్యమైంది. నౌకాదళంలో సేవలు ప్రారంభం:15 జూలై, 1987 పొడవు: 390 అడుగులు వెడల్పు: 57 అడుగులు డ్రాఫ్ట్: 13 అడుగులు వేగం: గంటకు 28 కి.మీ. ప్రయాణ సామర్థ్యం: ఏకధాటిగా 3 వేల మైళ్ల ప్రయాణం ఆయుధ సామర్థ్యం: బీఈఎల్–1245 రాడార్ నావిగేటర్, నాలుగు బోఫోర్స్ 40 ఎంఎం గన్స్, 2 మల్టిపుల్ బ్యారెల్ రాకెట్ లాంచర్స్, ఒక సీ కింగ్ హెలికాప్టర్ వార్ ఫేర్ యూనిట్: 15 యుద్ధ ట్యాంకులు, 13 బీఎంపీ పదాతిదళ పోరాట వాహనాలు, 10 ట్రక్కులు, 8 భారీ మోటార్ వెహికల్స్తోపాటు 500 మంది సైనికుల్ని ఒకేసారి తీసుకెళ్లగల సామర్థ్యం దీని సొంతం. నేడు కొచ్చిలో నిష్క్రమణం నౌకాదళానికి 36 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలందించిన మగర్ యుద్ధ నౌకకు కొచ్చి పోర్టులో భారత నౌకాదళం ఘనంగా వీడ్కోలు పలికేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించే డీకమిషన్ కార్యక్రమంలో ఐఎన్ఎస్ మగర్లో సేవలందించిన కెప్టెన్లు, అధికారులకు ఆత్మీయ సత్కారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ‘అవర్ బోల్డ్ అండ్ బ్రేవ్ మగర్’ పేరుతో షార్ట్ ఫిల్మ్ని ప్రదర్శించి యుద్ధ నౌకకు ఘనంగా వీడ్కోలు పలకనున్నారు. (చదవండి: మరింత వేగంగా వీసీఐసీ అభివృద్ధి) -
సుందరానికి అదనపు బాధ్యతలు
న్యూఢిల్లీ: బోర్డులో స్వతంత్ర డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న కిరణ్ మజుందార్ షా పదవీ విరమణ చేయనున్నట్లు ఐటీ సర్వీసుల దిగ్గజం ఇన్ఫోసిస్ తాజాగా పేర్కొంది. ఈ నెల 22న పదవీ కాలం ముగిసినట్లు వెల్లడించింది. అయితే నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ సిఫారసుమేరకు ఈ 23 నుంచి డి.సుందరంను లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఎంపిక చేసినట్లు పేర్కొంది. బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా ఇన్ఫోసిస్ బోర్డులో 2014 నుంచి స్వతంత్ర డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. 2018 నుంచి లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. అంతేకాకుండా నామినేషన్, రెమ్యునరేషన్ కమిటీ, సీఎస్ఆర్ కమిటీలకు చైర్పర్శన్గా వ్యవహరించారు. బోర్డుకు చెందిన రిస్క్ మేనేజ్మెంట్, ఈఎస్జీ కమిటీలలో సభ్యులుగా ఉన్నారు. ఇన్ఫోసిస్ కుటుంబంలో సభ్యులైన కిరణ్ కొన్నేళ్లుగా విలువైన నాయకత్వం, మార్గదర్శకత్వం వహించారని, ఇందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు కంపెనీ చైర్మన్ నందన్ నిలేకని పేర్కొన్నారు. ఇదేవిధంగా లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఎంపికైన సుందరంకు శుభాకాంక్షలు తెలియజేశారు. 2017 నుంచి సుందరం ఇన్ఫోసిస్ బోర్డులో కొనసాగుతున్నారు. ఫైనాన్స్, వ్యూహ రచనలో అత్యంత సమర్ధుడైన సుందరం కంపెనీ భవిష్యత్ లక్ష్యాలను నిజం చేయడంలో కీలకంగా నిలవగలరని అభిప్రాయపడ్డారు. ఆయన ఆడిట్, రిస్క్ మేనేజ్మెంట్, వాటాదారుల రిలేషన్షిప్, నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ తదితర పలు కమిటీలలో సేవలందించనున్నారు. -
ఉచితంగా చదువుకోండి.. ఉన్నతంగా ఎదగండి
నిరుపేద కుటుంబాల్లో తల్లిదండ్రులిద్దరూ పనిచేస్తే గానీ పూటగడవని పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా విద్యనందిస్తున్నప్పటికీ, బడిలో నేర్చున్న పాఠాలను ఇంట్లో వల్లెవేయించడానికి గానీ, హోంవర్క్ చేయించడానికి కానీ ఎవరూ ఉండరు. పిల్లలకు సొంతంగా హోమ్వర్క్ ఎలా చేయాలో తెలియదు. దీంతో వాళ్లు మరుసటి రోజు టీచర్ హోంవర్క్ అడుగుతుందని స్కూలుకు వెళ్లడానికి భయపడి మధ్యలోనే స్కూలు మానేసి అరకొర చదువులతో భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి వారిని ఆదుకోవడానికి 70 ఏళ్ల శివస్వామి, మహాలక్ష్మి దంపతులు ఏర్పాటు చేసిన ఉచిత సెంటరే ‘కల్వితునై’. ‘ఉచితంగా నేర్చుకుని ఉన్నతంగా ఎదగండి’ అని చెబుతున్నారు ఈ దంపతులు. కోయంబత్తూరుకు చెందిన మహాలక్ష్మి దంపతులు 2010 లో రిటైర్ అయ్యారు. ‘సమాజం ఇచ్చినదాన్ని తిరిగి ఇవ్వాలి’ అన్న ఆలోచనా దృక్పథం కలిగిన వారు కావడంతో.. నిరుపేద పిల్లలు పడుతోన్న ఇబ్బందులను గమనించి వారికోసం ఏకంగా నలభై లక్షల రూపాయలను పెట్టి 2014లో ‘కల్వితునై’ పేరిట విద్యాసంస్థను ఏర్పాటుచేశారు. నాలుగో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఒక బ్యాచ్గా, తొమ్మిది నుంచి 12వ తరగతి వరకు రెండోబ్యాచ్గా పిల్లలకు ట్యూషన్ చెబుతున్నారు. అలా ఈ సెంటర్లో నిత్యం 130 మంది పిల్లలు చదువుకుంటున్నారు. వీరికోసం టీచర్లకు జీతాలు చెల్లించి చదువు చెప్పిస్తున్నారు ఈ దంపతులు. ఇప్పటిదాకా వెయ్యిమందికిపైగా విద్యార్థులు ఇక్కడ చదువుకోగా, 350 మందికిపైగా మంచి ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. చదువుతోపాటు... పాఠాలేగాక కథలు చెప్పించడం, మొక్కలు నాటించడం, కల్చరల్ ఈవెంట్స్, జాతీయ పర్వదినాలను నిర్వహించడం ద్వారా పిల్లల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇంకా సమ్మర్ క్యాంప్లు, టూర్లకు తీసుకెళ్లడం, సేంద్రియ వ్యవసాయం గురించి వివరించడం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాలికలకు మెనుస్ట్రేషన్ సెషన్స్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్ తయారీలో శిక్షణ ఇప్పిస్తున్నారు. విద్యార్థులు ఎటువంటి పరిస్థితుల్లోనూ జారిపోకుండా ఉండేందుకు వొకేషనల్ ట్రైనింగ్ కోర్సులు, సాఫ్ట్స్కిల్స్లో శిక్షణను మొదలు పెట్టారు. బేసిక్ కంప్యూటర్ కోర్సులు, బయట యాభైవేల రూపాయలు ఖరీదు చేసే సీఏ ఫౌండేషన్ కోర్సును 4,500కే అందించి ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్ను బంగారు మయం చేస్తున్నారు. ఇవన్నీ చేయడానికి నెలకు లక్షరూపాయలు ఖర్చు అవుతుంది. సీఎస్ఆర్, బాష్, విప్రో, ఇంకా ఇతరులు ఇచ్చే విరాళాల ద్వారా సెంటర్ను నడిపిస్తున్నారు. వీరి వద్ద చదువుకున్న వాళ్లు వందశాతం ఉత్తీర్ణత సాధించారు. ఇదంతా చూస్తుంటే ఇలాంటి వారు మన రాష్ట్రాల్లోనూ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. చదువునుంచి దృష్టి మరల్చకుండా... నిరుపేదలకు కనీస అవసరాలు తీరాలన్నా కష్టమే. అందుకే వాళ్లు డబ్బు సంపాదన మీదే దృష్టిపెడతారు. పిల్లల చదువుల గురించి శ్రద్ధ తీసుకునే అవగాహన, సమయం వారికి ఉండదు. దానివల్ల వారి భవిష్యత్ తరాలు కూడా పేదరికంలోనే మగ్గిపోతున్నారు. ఇటువంటివారికి ఉచితంగా ట్యూషన్ చెప్పడం ద్వారా వారి భవిష్యత్ మారుతుందని ఈ సెంటర్ను ఏర్పాటు చేశాం. దీనిద్వారా కొంతమంది టీచర్లకు ఉపాధి దొరకడంతోపాటు విద్యార్థులకు చక్కని బోధన అందుతుంది. ఎప్పుడూ చదువే కాకుండా వివిధ రకాల విజ్ఞాన, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, సంక్రాంతి సమయంలో కొత్తబట్టలు ఇవ్వడం, రోజూ ఆరోగ్యకరమైన స్నాక్స్ అందిస్తూ చదువునుంచి పిల్లల దృష్టి మరలకుండా చూస్తున్నాం’’ – శివస్వామి, మహాలక్ష్మి -
పనిలో ఉంటే మనసూ బాగుంటుంది
స్త్రీలకు రిటైర్మెంట్ వయసు వస్తే వారు మనుమల, మనమరాళ్ల బాగోగుల్లో పడాల్సి వస్తుంది. లేదా కొడుకు దగ్గరో కూతురు దగ్గరో ఉంటూ టీవీ చూస్తూ కాలక్షేపం చేయాల్సి ఉంటుంది. ‘కాని అలా ఉంటే బోర్. ఏదైనా ప్రయోజనకరమైన పని చేస్తే సంతోషంగా ఉంటుంది... మనసూ బాగుంటుంది’ అంటుంది అనంతలక్ష్మి. రిటైర్ అయ్యాక రైతుగా కూడా మారిన ఆమె పచ్చని పరిసరాల్లో ఉంటూ తనూ ఒక చెట్టులా నీడను పంచుతోంది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం రైతునగర్ గ్రామానికి చెందిన కొమ్మినేని అనంతలక్ష్మి వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎంగా చేరి, సూపర్వైజర్గా తన సర్వీసునంతా గ్రామీణ ప్రాంతాల్లోనే చేసి రిటైర్ అయ్యింది. ఇద్దరు పిల్లలు. జీవితం చక్కగా ఒక ఒడ్డుకు చేరింది. ఇక ఏ పనీ చేయకుండా ఆమె కాలక్షేపం చేయవచ్చు. కాని ఆమె అలా ఉండలేకపోయింది. వృత్తిగతంగా, వ్యక్తిగతంగా ఏర్పడ్డ అనుబంధాలు వదులుకోలేకపోయింది. వారి కోసం పని చేస్తూనే ఉండాలని అనుకుంది. కష్టమనుకుంటే కుదరదు ‘ఎ.ఎన్.ఎమ్గా ఉద్యోగం అంటే పల్లె పల్లె తిరగాలి. నా పరిధిలో నాలుగూళ్లు ఉండేవి. వైద్య పరంగా ఎవరెలా ఉన్నారో కనుక్కుంటూ రోజంతా తిరుగుతూనే ఉండేదాన్ని’ అంటుంది అనంతలక్ష్మి. ‘ఆ రోజుల్లో కుటుంబ అవసరాలు తీరాలంటే నేనూ ఉద్యోగం చేయక తప్పని పరిస్థితులు. పిల్లలు చిన్నవాళ్లు. వాళ్లని వెంటేసుకుని ఊరూరు తిరిగిన రోజులూ ఉన్నాయి. కష్టం అనుకుంటే ఏ పనీ చేయలేం. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండటమే కాదు, మనకంటూ సొంత పని అంటూ ఉండాలి. ఎవరి మీదా ఆధారపడకూడదనే మనస్తత్వం నాది. ఎఎన్ఎమ్ నుంచి సూపర్వైజర్గా చేసి, రిటైర్ అయ్యాను’ అంటుందామె. ప్రయత్నాలు ఫలవంతం ‘పిల్లలిద్దరూ జీవితంలో స్థిరపడ్డారు. ఉద్యోగంలో రిటైర్మెంట్ వచ్చింది. పాతికేళ్లకు పైగా విధులు నిర్వర్తించిన దాన్ని. ఒక్కసారిగా ఖాళీగా ఇంట్లో కూర్చోవాలంటే ఇబ్బందిగానే అనిపించింది. కొన్ని రోజులు ఏం చేయాలో అర్థం కాలేదు. ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో కొద్దిపాటి పొలం ఉంది. రోజూ కాసేపు పొలం వద్దకు వెళ్లేదాన్ని. కూరగాయల సాగు, పండ్ల మొక్కలను నాటడం వంటి పనులు చేయడం మొదలుపెట్టాను. పల్లెలూ, పంటపొలాల్లో తిరుగుతున్నప్పుడు నా దృష్టి రైతులు చేసే పని మీద ఉండేది. నాకు తెలియకుండానే గమనింపు కూడా పెరిగింది. నేను కూరగాయలు, పండ్ల మొక్కల పెంపకం మొదలుపెట్టినప్పుడు నాకు మరో కొత్త జీవితం మొదలైనట్టనిపించింది. రెండేళ్లుగా వ్యవసాయంలో చేస్తున్న ప్రయత్నాలన్నీ ఫలితమివ్వడం మొదలుపెట్టాయి. ఇంటికి వాడుకోగా, మిగిలిన వాటిని అవసరమైనవారికి ఇస్తూ వస్తున్నాను’ అందామె. మరవని సేవ.. ‘విశ్రాంత జీవనం వచ్చింది కదా అని చేసిన పనిని మర్చిపోలేం. అలాగే గ్రామాలవాళ్లు కూడా మర్చిపోరు. వారికి అవసరమైన వైద్య సేవలు అడుగుతూ ఉంటారు. నాకు అందరూ తెలుసు కాబట్టి నేనే స్వయంగా అడిగి తెలుసుకుంటుంటాను. వైద్యపరమైన ఏ చిన్న అవసరం వచ్చినా ముందుంటాను. ఊళ్లోనే వైద్య అవసరాలలో ఉన్నవారిని గమనించి, అవగాహన కల్పిస్తుంటాను. పొలంలో పండిన కూరగాయలు, పండ్లు రోడ్డు మీద ఓ వైపుగా పెట్టేస్తాను. అవసరమైన వాళ్లు ఆగి తీసుకెళుతుంటారు. కొందరు డబ్బిచ్చి తీసుకెళుతుంటారు. వీటితోపాటు ఈ మధ్య రెండు ఆవులతో పశు పోషణ కూడా మొదలుపెట్టాను. మట్టి పనిలో సంతోషాన్ని, నలుగురికి మేలు చేయడంలో సంతృప్తిని పొందుతున్నాను. పనిలో ఉంటే మనసూ బాగుంటుంది. ఆ పనిని నలుగురు మెచ్చుకుంటే మరింత ఉత్సాహం వస్తుంది. మలివయసులో నలుగురికి మేలు చేసే పనులను ఎంచుకుంటే జీవితంలో ఏ చీకూ చింత లేకుండా గడిచిపోతుందని నా జీవితమే నాకు నేర్పించింది’ అని వివరించింది అనంతలక్ష్మి. విశ్రాంత జీవనం వచ్చింది కదా అని చేసిన పనిని మర్చిపోలేం. అలాగే గ్రామాలవాళ్లు కూడా మర్చిపోరు. వారికి అవసరమైన వైద్యసేవలు అడుగుతూ ఉంటారు. నాకు అందరూ తెలుసు కాబట్టి నేనే స్వయంగా అడిగి తెలుసుకుంటుంటాను. వైద్యపరమైన ఏ చిన్న అవసరం వచ్చినా ముందుంటాను. – సేపూరి వేణుగోపాలాచారి, సాక్షి, కామారెడ్డి -
రాజ్యసభలో 72మంది సభ్యుల పదవీకాలం పూర్తి
-
అనుభవాన్ని అందరికీ పంచండి!
న్యూఢిల్లీ: త్వరలో రాజ్యసభ నుంచి రిటైరవుతున్న సభ్యులు దేశ ప్రయోజనాలకు అనుగుణంగా, యువతలో ఆసక్తి రేపేలా తమ అనుభవసారాన్ని అన్నిదిశలకు వ్యాపింపజేయాలని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. జ్ఞానం కన్నా అనుభవం గొప్పదని, సభ్యులంతా తమ అనుభవాన్ని దేశ సేవకు వినియోగించాలని కోరారు. రాజ్యసభలో రిటైరవుతున్న 72 మంది సభ్యులకు గురువారం వీడ్కోలు పలికారు. ఈ ఏడాది మార్చి– జూలై సమయంలో వీరంతా పదవీ విరమణ చేయనున్నారు. చట్టసభల సభ్యులు సమర్థవంతమైన పనితీరు చూపాలని, చట్టసభల విధులకు అంతరాయం కలిగించకుండా పనిచేయాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. -
లాటరీలో డబ్బులు గెలిస్తే? ట్యాక్స్ ఎంత కట్టాలో తెలుసా?
నేను ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాను. వచ్చే నెల ఇండియా వస్తాను. నాతో బాటు 10,000 డాలర్లు తెచ్చుకోవచ్చా. ఇంకేదైనా మార్గం ఉందా? - కోనేరు రంగారావు, వర్జీనియా (ఈమెయిల్ ద్వారా) గతంలో ఎన్నోసార్లు మనం ఈ విషయం ప్రస్తావించాం. మీరు ఇండియా వస్తున్నప్పుడు అంత పెద్ద మొత్తం డాలర్ల కరెన్సీ నోట్లను మీతో పాటు తేకూడదు. తెస్తే రిస్క్. చట్టరీత్యా నేరం. నిషేధం. ఇంత పెద్ద వ్యవహారాన్ని ‘హవాలా’గా పరిగణించే అవకాశం ఉంది. అలా తేకండి. రాచమార్గం ఉండగా వేరే మార్గం ఎందుకు? మీరు వచ్చే ముందు, లేకపోతే వచ్చిన తర్వాత .. అక్కడున్న మీ అబ్బాయి/అమ్మాయి అకౌంటు నుండి ఇండియాలోని మీ బ్యాంకు ఖాతాకు బదిలీ చేయించుకోండి. ఇలా పంపబడిన మొత్తం.. అమెరికాలో పన్నుభారానికి గురి అయినదై ఉంటుంది. కాబట్టి ఎటువంటి సమస్యా ఉండదు. ఇక్కడ మీ అకౌంటులోకి జమ అవుతుంది. పంపే వ్యక్తి వివరాలన్నీ మీ ఇన్కం ట్యాక్స్ ఫైల్లో భద్రపర్చుకోండి. పేరు, చిరునామా, పాస్పోర్ట్ కాపీ, బ్యాంకు ఖాతా వివరాలు, మొత్తం, బదిలీ వివరాలు వీటితో పాటు ఒక ఈమెయిల్ తెప్పించుకోండి. మీరు ఇటునుంచి ఆ మేరకు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వండి. ఇక మీ విషయానికొస్తే ఇంత మొత్తం జమ అవ్వడమనేది, బ్యాంకు అధికారుల దృష్టిలో పడుతుంది. ఏ అధికారి దృష్టిలో పడినా మీ దగ్గర పూర్తి వివరణ ఉండాలి. ఈ వ్యవహారం వల్ల గానీ, జమ వల్ల గానీ ఎటువంటి పన్నుభారం ఉండదు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ సందర్భంలో మీరు అక్కడ సంపాదించిన మొత్తం గానీ, మీ పిల్లలు సంపాదించిన మొత్తం గానీ ఇండియా వస్తోందని అనుకుంటున్నాం. కుటుంబ సభ్యులు ఇచ్చిన గిఫ్ట్కి ఎటువంటి పన్నుభారం ఉండదు. కుటుంబ సభ్యులు కాకపోతే ఈ వ్యవహారాన్ని అప్పుగా పరిగణించాలి. అలా కాకపోతే ఆదాయం అవుతుంది. ఏ వ్యవహారానికయినా సరైన డాక్యుమెంట్లు ఉండాలి. నేను ఈ మధ్యే రైల్వే శాఖలో నుంచి రిటైర్ అయ్యాను. ఆ సందర్భంలో సుమారు రూ.50,00,000 వచ్చింది. దీని మీద పన్ను భారం ఉంటుందా? - నండూరి సత్యవతి, హైదరాబాదు సాధారణంగా ప్రభుత్వ సర్వీసు నుండి రిటైర్ అయిన వారికి పదవీ విరమణ సందర్భంలో వచ్చిన పెన్షన్ ప్రయోజనాల మీద ఎటువంటి పన్నుభారం ఉండదు. సెక్షన్ 10 ప్రకారం వీటన్నింటి మీద మినహాయింపు ఉంది. అయితే, రిటర్ను వేసేటప్పుడు, రిటర్నులో ఒక కాలం ఉంటుంది. ఆ కాలంలో ఈ వివరాలు రాయండి. ఇలా రాయడం వల్ల మున్ముందు ‘సోర్స్’ వివరణలో ఎటువంటి ఇబ్బందీ ఉండదు. లాటరీల మీద ఆదాయాన్ని ఎలా ట్రీట్ చేస్తారు? - ఎం. ఉపేంద్ర, నిజామాబాద్ ముందుగా లాటరీల మీద ఆదాయాన్ని/ప్రైజ్ మొత్తాన్ని ఆదాయంగా భావిస్తారు. ఇతర ఆదాయం కింద వర్గీకరిస్తారు. ఈ ఆదాయం మీద విధిగా టీడీఎస్ చేస్తారు. దీనిపై 30 శాతం మేర భారం పడుతుంది. విద్యా సుంకం అదనం. పైగా ఎటువంటి బేసిక్ లిమిట్ మినహాయింపు ఉండదు. మొత్తం లాటరీని ఆదాయంగా భావించి, 30 శాతం ప్రకారం పన్ను వేస్తారు. ఈ భారంలో నుంచి టీడీఎస్ను తగ్గించి, పన్ను చెల్లించాలి. కె.సీహెచ్.ఎ.వీ.ఎస్. ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య - ట్యాక్సేషన్ నిపుణులు -
ఇన్నాళ్లు ఎక్కడున్నావయ్యా.. భర్తను చూడగానే..
కమలాపురం: మండలంలోని టి.చదిపిరాళ్లకు చెందిన రిటైర్డ్ వీఆర్ఓ లింగాల రాఘవేంద్ర రావు రెండున్నరేళ్ల తర్వాత ఇంటికొచ్చాడు. మండలంలోని పలు గ్రామాల్లో వీఆర్ఓగా పనిచేసిన ఆయన నాలుగేళ్ల క్రితం రిటైర్డ్ అయ్యారు. అయితే పక్షవాతం రావడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లి ఆయన తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు వివిధ చోట్ల గాలించి ఆశలు వదిలేశారు. ఇంటి నుంచి వెళ్లి దాదాపు రెండున్నరేళ్లవుతోంది. శనివారం కమలాపురం పట్టణంలోని క్రాస్ రోడ్డులో రాఘవేంద్రరావు ఉన్నట్లు గ్రామ మాజీ సర్పంచ్ జయ సుబ్బారెడ్డికి సమాచారం వచ్చింది. ఆయన అక్కడకు చేరుకుని రాఘవేంద్రరావును ఇంటికి తీసుకెళ్లి భార్య లీలావతమ్మకు అప్పగించారు. ఆమె భర్తను చూడగానే ఆనందపరవశమయ్యారు. ఎటు చూసినా కరోనా కాటేస్తోంది..ఇన్నాళ్లు ఎక్కడున్నావయ్యా.. అని కన్నీటి పర్యంతమైంది. ఇన్నాళ్లు ఎక్కడున్నావని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అడుగుతున్నప్పటికీ ఆయన సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాడు. ఏదీ అడిగిన నమఃశివాయః అనడం తప్ప వేరే మాట మాట్లాడటం లేదు. రాఘవేంద్ర రావుకు ఒక వివాహిత కుమార్తె ఉన్నారు. ఇవీ చదవండి: పెళ్లికి పిలవలేదని.. పిల్లల ఆటను సాకుగా తీసుకుని.. సబ్ రిజిస్ట్రార్ లీలలు: ‘ఆచారి’ అక్రమాల యాత్ర -
మాకూ పింఛన్ ఇవ్వండి..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: బ్రిటిష్, నిజాం కాలం నుంచి గ్రామాల్లో రెవెన్యూ, శాంతిభద్రతలను చక్కదిద్దేందుకు గ్రామాల్లో పట్వారీ, పటేల్ వ్యవస్థ కొనసాగుతూ వచ్చింది. భూములకు సంబంధించిన కీలకమైన రెవెన్యూ రికార్డుల నిర్వహణతో పాటు గ్రామాల్లో శాంతిభద్రతలు కాపాడుతుండేవారు. 1984లో అప్పటి సీఎం ఎన్టీ రామారావు ఈ వ్యవస్థను రద్దు చేశారు. దీంతో వేలాది మంది ఉపాధి కోల్పోయారు. సుదీర్ఘ పోరాటం తర్వాత సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 1992లో తిరిగి వీరిలో అర్హులైన వారిని వీఏఓలుగా ప్రభుత్వం నియమించింది. అప్పట్లో రూ.600 గౌరవ వేతనంతో తాత్కాలిక ఉద్యోగులుగా పని చేశారు. చివరకు పదో తరగతి, ఇంటర్మీడియట్ చదివిన వారిని 2002 జనవరి ఒకటి నుంచి పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పే స్కేల్ ఇచ్చారు. వారిని వీఆర్వోలుగా, పంచాయతీ కార్యదర్శులుగా నియమించారు. 2002లో ప్రభుత్వ ఉద్యోగులుగా నియమితులై 2008 జూన్ 30లోగా ఉద్యోగ విరమణ పొందిన వారికి కనీసం ఏడేళ్ల సర్వీసు లేదంటూ పింఛన్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఇలాంటి వారు ఉమ్మడి ఏపీలో 2,225 మంది ఉన్నారు. తాము దాదాపు రెండు నుంచి మూడు దశాబ్దాలుగా సేవలందించామని, తమకు కనీస పింఛన్ మంజూరు చేసేందుకు గతంలో 1992 నుంచి 2002 మధ్య పని చేసిన కాలాన్ని కలపాలని ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్ ఆదేశాలు, 1980 ఆర్పీఆర్ జీవోలను పరిశీలించిన తర్వాత ఫైలు నం.28496/అ/2013 ప్రకారం పాత సర్వీసును పరిగణనలోకి తీసుకుని 2,225 మందికి కనీస పింఛన్ సౌకర్యం కల్పిస్తూ 2014 ఫిబ్రవరి 2న ఫైలుపై అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డి సంతకం చేశారు. ఏపీలో అమలు.. తెలంగాణలో ఎదురుచూపులు! ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని విభజన చట్టంలో పొందుపరిచిన మేరకు ఫైలు 28496/అ/2013 ప్రకారం ఏపీకి చెందిన 1,733 మందికి ఆ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ సౌకర్యం కల్పిస్తూ 2014 నవంబర్ 20న జీవో నంబర్ 388 జారీ చేసింది. దీంతో ఆ ప్రాంతంలోని రిటైర్డ్ వీఆర్వోలు పింఛన్ పొందుతున్నారు. అయితే తెలంగాణలోని 492 మందికి మాత్రం ఆరేళ్లకుపైగా ఎదురుచూపులు తప్పట్లేదు. ఆర్థిక, రెవెన్యూ శాఖల నుంచి అనుమతి లభించినా ఫైలు మాత్రం ముందుకు కదలలేదు. ఈ జాప్యానికి అధికారులే కారణమని రిటైర్డ్ వీఆర్వోలు ఆరోపిస్తున్నారు. ఈ ఫొటోలోని వ్యక్తి పేరు శ్రీనివాసరావు.. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలోని తాడిపర్తికి చెందిన ఈయన వీఆర్వోగా పనిచేస్తూ 2008లో రిటైర్ అయ్యారు. పింఛన్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. బీపీ, షుగర్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈయన ఇటీవల పెరాలసిస్ బారిన పడ్డారు. మందులు కొనుగోలు చేయలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ..ఇది ఒక్క శ్రీనివాసరావు దీనగాథ మాత్రమే కాదు. 2008 జూన్ 30లోపు ఉద్యోగ విరమణ పొందిన తెలంగాణలోని పలువురు వీఏఓలు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులందరూ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అటు ఉద్యోగానికి, ఇటు పింఛన్ కోసం కోర్టులు, ట్రిబ్యునళ్లను ఆశ్రయించి సుదీర్ఘ పోరాటం చేసి 2014లో విజయం సాధించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వారికి పింఛన్ అందుతుండగా.. తెలంగాణలో ఉన్న వారికి మాత్రం ఎదురుచూపులు తప్పట్లేదు. పైస్థాయి అధికారుల నిర్లక్ష్యంతోనే.. ఆరున్నరేళ్లుగా ఎదురుచూస్తున్నాం. వృద్ధాప్యంలో ఉన్న మేం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. పైస్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే జాప్యం జరుగుతోంది. – డీకే మోహన్రావు, అధ్యక్షుడు, తెలంగాణ వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శుల సంఘం సీఎం దృష్టికి తీసుకుపోనందుకే.. సీఎం కేసీఆర్ దృష్టికి అధికారులు మా సమస్యను తీసుకుని పోకపోవడం వల్లే జాప్యం జరుగుతోంది. ఆయనకు తెలిస్తే మా పింఛన్ ఫైల్పై సంతకం చేస్తారనే నమ్మకం ఉంది. – వి.నర్సింహారావు, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శుల సంఘం చచ్చే వరకైనా పింఛన్ వచ్చేనా? పింఛన్ కోసం ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం. ఇప్పటికే చాలా మంది చనిపోయారు. మిగిలిన వాళ్లు పింఛన్ వస్తుందో లేదోననే ఆందోళనలో ఉన్నారు. మేం చనిపోయే వరకైనా వస్తుందో రాదో కూడా తెలియట్లేదు. – ప్రకాశ్రావు, రిటైర్డ్ వీఆర్వో, గజ్వేల్, సిద్దిపేట -
జ్ఞాపకాలకు ‘సంకెళ్లు’
రాజకీయ నాయకులుగా, ఉన్నతాధికారులుగా దీర్ఘకాలం అధికారానికి సన్నిహితంగా మెలగిన వారు... కీలక బాధ్యతలు నిర్వర్తించినవారు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాక తమ జ్ఞాపకాలను ఏకరువు పెడుతూ రాసే పుస్తకాలకు మంచి గిరాకీ వుంటుంది. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలతో పోలిస్తే మన దేశంలో అలా రాయడానికి సిద్ధపడేవారు చాలా కొద్దిమంది. గత కొన్నాళ్లుగా ఆ ధోరణిలో ఎంతో కొంత మార్పు వచ్చిందనే చెప్పాలి. కానీ అలాంటివారిని సైతం నిరుత్సాహ పరిచేలా గత నెల 31న కేంద్ర సర్వీసుల(పింఛన్) నిబంధనలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటెలిజెన్స్, దేశ భద్రతకు సంబంధించిన సంస్థల్లో పనిచేసి రిటైరైన ఉన్నతా ధికారులు ఆ సంస్థల పరిధిలోకి రాగల అంశాలను ముందస్తు అనుమతి లేకుండా వెల్లడించరాదని సవరించిన నిబంధనల సారాంశం. ఈ సంస్థల్లో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా), ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), బీఎస్ఎఫ్, సీబీఐ తదితరాలు చాలావున్నాయి. రా లో పనిచేసి రిటైరైనవారు విదేశాల్లో ఆ సంస్థ కార్యకలాపాల గురించిన జ్ఞాపకాలను రాయదల్చుకుంటే ప్రస్తుత కార్యదర్శిని సంప్రదించి ఆయన అనుమతి తీసుకోవాలని... ఐబీలో రిటైరైన అధికారులు ఆ సంస్థ ప్రస్తుత డైరెక్టర్ నుంచి అనుమతి తీసుకోవాలని నిబంధనలు చెబుతున్నాయి. ఈ సంస్థల్లో పనిచేసేవారు ఎంతో నిబద్ధతతో, దేశం పట్ల అంకితభావంతో పనిచేస్తారన్న అభిప్రాయం వుంటుంది. వీరు దాదాపు ఎక్కడా కనబడరు. ప్రముఖంగా వార్తల్లో వుండరు. కానీ అధికారంలో వున్న నాయకత్వం తీసుకునే ఎలాంటి నిర్ణయంలోనైనా వీరి పాత్ర కీలకం. నిఘా సంస్థల్లో పనిచేసేవారు బాధ్యతలరీత్యా దేశంలో ఉద్రిక్తతలు చెలరేగే ప్రాంతాల్లో సంచరించాల్సి వస్తుంది. శత్రు దేశాల్లో సైతం తమ ఉనికి తెలియ కుండా అక్కడివారిలో చాకచక్యంగా కలిసిపోయి కీలక సమాచారాన్ని పొందవలసి రావొచ్చు. ఈ బాధ్యతల క్రమంలో ఒక్కోసారి ప్రాణాలకు కూడా ముప్పు రావొచ్చు. విదేశాల్లో తమ కోసం పని చేస్తూ పట్టుబడినవారిని రక్షించటం అమెరికావంటి అగ్రరాజ్యాలకు పెద్ద కష్టం కాదు. మనలాంటి దేశాలకు మాత్రం అసాధ్యం. అందుకే చేసింది ఇసుమంతైనా ఘనంగా చాటుకునే ఉబలాటం వుండేవారికి, తమ కోసమే ఎక్కువ ఆలోచించేవారికి ఆ సంస్థలు సరిపడవు. సవరించిన నిబంధనలు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పూర్తిగా కాలరాస్తున్నాయని చెప్పడానికి లేకుండా వాటిని రూపొందించినవారు జాగ్రత్తపడ్డారు. రిటైరైనవారు పుస్తకాలు రాయొద్దని ఆ నిబం ధనలు శాసించటం లేదు. అలా రాసినవాటిని ముందుగా అందజేసి అనుమతి తీసుకోవాలంటు న్నాయి. కానీ ఇలా ఉదారంగా కనబడుతున్న నిబంధలతో కొన్ని ఇబ్బందులున్నాయి. రిటైరైనవారి స్థానంలో వచ్చిన కొత్తవారు సాధారణంగా వారికి జూనియర్లే అయివుంటారు. గతంలో వారిద్దరి మధ్య వున్న సంబంధాల ప్రభావంతో పుస్తకంపై తుది నిర్ణయం తీసుకోవటంలో జాప్యం చేయొచ్చు. పాలకులకుండే అభ్యంతరాలు సరేసరి. అలాంటి పరిస్థితి ఏర్పడితే ఆ రిటైరైన ఉన్నతాధికారికి దిక్కేది? ఆయన మొర ఆలకించేదెవరు? ఎన్నాళ్లు ఎదురుచూసి, ఆయన కోర్టుకు పోవచ్చు? సహజం గానే నిబంధనల్లో వీటికి జవాబులు దొరకవు. రిటైరైనవారు ఇష్టానుసారం అన్నీ తేటతెల్లం చేస్తే దేశ భద్రతకు ముప్పు కలగదా అని ప్రశ్నించేవారుంటారు. దీర్ఘకాలం అంకితభావంతో పనిచేసి, సంస్థ లకు వన్నె తెచ్చినవారిని అలా ఆలోచించటం అన్యాయమే అవుతుంది. పాలకులు చెప్పింది చేయడం, వారి మెప్పు పొందటానికి ప్రయత్నించటం కాక... వారికి, దేశానికి ఏది గరిష్టంగా మేలు చేస్తుందో అంచనాకట్టి చెప్పటం అందరికీ సాధ్యం కాదు. అలా చెప్పేవారిలో కూడా తమ అనుభ వాలకు రూపుకట్టాలని, సంస్థ ఉన్నతికి దోహదపడాలని ఆలోచించేవారు తక్కువ. అలా అనుకునే వారిలో కూడా ఏ కొద్దిమందో రాయగలుగుతారు. అమెరికా, బ్రిటన్ వగైరాల్లో రిటైరైనవారు జ్ఞాపకాలను అక్షరబద్ధం చేయడం సర్వసాధారణం. మన దగ్గర అధికార చట్రాల్లో మౌలికంగానే పారదర్శకత తక్కువ. అలాంటిచోట దీర్ఘకాలం సేవలందించినవారు ఆ బాణీలోనే వుంటారు. అందుకే రచయితలైన మాజీ ఉన్నతాధికారులు చాలా స్వల్పం. బి. రామన్ (ద కావో బాయిస్ ఆఫ్ రా), ఏఎస్ దులత్ (ద స్పై క్రానికల్స్), శంతను సేన్ (కరప్షన్, సీబీఐ అండ్ ఐ... సీబీఐ ఇన్సైడర్ స్పీక్స్), జోగిందర్ సింగ్ (ఇన్సైడ్ సీబీఐ), బీఆర్ లాల్ (హూ ఓన్స్ సీబీఐ), డీడీ అగర్వాల్(సీబీఐ అండ్ పోలిసింగ్ ఇన్ ఇండియా)లాంటివారు కనబడ తారు. వీరిలో దులత్ కొంత ముందుకెళ్లారు. ఆయన పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మాజీ చీఫ్ అసద్ దురానీతో కలిసి ‘ద స్పై క్రానికల్స్’ రాశారు. దులత్ మాటేమోగానీ... పాక్లో ఆ తర్వాత దురానీకి సమస్యలెదురయ్యాయి. మనదగ్గర తాజా సవరణలకు దురానీ పుస్తకమే ప్రేరణ కావొచ్చు. అమెరికా వంటి దేశాల్లో నిర్ణీత కాలవ్యవధి తర్వాత అధికార రహస్యాలు బయటపెట్టొచ్చన్న నిబంధ నలున్నాయి. కానీ మన దగ్గర అటువంటిదేమీ లేదు. మన దేశ చరిత్రలో దశాబ్దాలక్రితం భద్రతా పరంగా ఎంతో ఉత్కంఠ రేపిన ఉదంతాల్లో కూడా వాస్తవాలేమిటో ఈనాటికీ తెలియదు. ప్రస్తుత నిబంధనలే అనేక విధాల ఆటంకాలవుతున్నాయంటే తాజా సవరణలు వాటి పరిధిని మరింత విస్తృతం, జటిలం చేశాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే పింఛన్ ఆపేస్తామని హెచ్చరించటం దీర్ఘకాలం చిత్తశుద్ధితో పనిచేసినవారిని, వారి సేవలను అవమానించటమే. భావవ్యక్తీకరణకు ఆటంకాలు కల్పించటమే. ఇలాంటి వైఖరి ప్రజాస్వామిక దేశంగా మన ప్రతిష్టను దిగజారుస్తుంది. -
పారాలింపియన్ దీపా మలిక్ వీడ్కోలు
న్యూఢిల్లీ: భారత పారాథ్లెట్, రియో పారాలింపిక్స్ షాట్పుట్ (ఎఫ్53) ఈవెంట్ రజత పతక విజేత దీపా మలిక్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించినట్లు సోమవారం అధికారికంగా ప్రకటించింది. అయితే తాను గతేడాది సెప్టెంబర్ 16వ తేదీనే ఆట నుంచి తప్పుకున్నానని, ఈ మేరకు భారత పారాలింపిక్ కమిటీకి లేఖ కూడా అందజేశానని తెలిపింది. నిబంధనల ప్రకారం ఆటకు వీడ్కోలు పలికాకే ఫిబ్రవరిలో జరిగిన భారత పారాలింపిక్ కమిటీ (పీసీఐ) అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొని విజేతగా నిలిచి ఆ పదవిని స్వీకరించినట్లు 49 ఏళ్ల దీపా స్పష్టం చేసింది. -
గ్రూప్1 అధికారిగా రిటైర్డ్ అయ్యి..తాను చదివిన పాఠశాలకు..
కష్టపడి చదివి.. ఉద్యోగం సాధించి.. కుటుంబం, పిల్లల ఉన్నతికి బాటలు వేసి.. ఉద్యోగ విరమణ అనంతరం ప్రశాంతంగా గడపవచ్చు. అయితే చివరకు వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితం ఇంతేనా అనిపించవచ్చు. అందుకే ఆయన ఉన్నత ఉద్యోగం చేసి రిటైర్డ్ అయినా ఇప్పటికీ సామాజిక సేవలోనే తరిస్తూనే ఉన్నారు. మంచి మనసుతో చేసే పనితో సమ సమాజ నిర్మాణం సాధ్యమని నిరూపిస్తున్నారు. సౌకర్యాలు లేని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సొంత నిధులు వెచ్చిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. – నంద్యాల సాక్షి, కర్నూలు: మారుమూల గ్రామంలో పేద కుటుంబంలో జన్మించి మొదట ఎస్ఐ ఉద్యోగం సాధించి అంచలంచెలుగా ఎదుగుతూ రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా, రాష్ట్ర ఇన్కంట్యాక్స్ జాయింట్ కమిషనర్గా పని చేసి ఉద్యోగ విరమణ అనంతరం జిల్లాలోని అనేక ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు. సంజామల మండలం నొస్సం గ్రామానికి చెందిన నాగస్వారం నరసింహులు ఒకటవ తరగతి నుంచి ఎంఏ పీహెచ్డీ వరకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలల్లోనే చదువుకున్నారు. తర్వాత 1983లో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం సాధించారు. ఎస్ఐగా ఉంటూ ఏపీటీఎస్సీ పరీక్షలు రాసి గ్రూప్–2 అధికారిగా ఎంపికయ్యారు. అనంతరం 1996లో గ్రూప్–1 ఉద్యోగం సాధించారు. 2005 నుంచి 2016 వరకు రాష్ట్ర ట్యాక్స్ జాయింట్ కమిషనర్గా, రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా కడపలో పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. గతంలో అతను చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో కనీస వసతులు లేకపోవడంపై నిత్యం తన స్నేహితులతో ఆవేదన వ్యక్తం చేసేవారు. దీంతో రిటైర్డ్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. పాఠశాల సమస్యలపై పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందిస్తూ పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హృదయాల్లో జల ప్రదాతగా పేరు తెచ్చుకున్నారు. పదవ తరగతిలో నాలుగుసార్లు ఫెయిల్ తల్లిదండ్రులు తడికెలు, గంపలు అల్లేవారు. వారికి తోడుగా నరసింహులు పని చేస్తూ ఇంటి వద్దనే గడిపేవాడు. ఈ క్రమంలో చదువుపై ఆసక్తి తగ్గింది. దీంతో పదవ తరగతి నాలుగుసార్లు ఫెయిల్ అయ్యారు. తర్వాత తల్లిదండ్రుల సూచన మేరకు పట్టుబట్టి పదవ తరగతి పాస్ అయ్యారు. అనంతరం ఎస్ఐ, గ్రూప్–2, గ్రూప్–1 స్థానానికి ఎదిగారు. చదువుకుంటున్న సమయంలోనే కళాశాల నుంచి జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ ఆటగాడిగా గుర్తింపు పొందారు. వాటిలో భాగంగా 2014–2016వ సంవత్సరంలో ఇండియా బాస్కెట్బాల్ టీంకు మేనేజర్గా వ్యవహరించారు. థాయిల్యాండ్, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, జపాన్ వంటి దేశాలకు ఇండియా టీం మేనేజర్గా వెళ్లారు. సేవతోనే ఆత్మసంతృప్తి ప్రభుత్వ పాఠశాలకు, పేద విద్యార్థులకు సేవ చేస్తున్నందుకు ఆత్మసంతృప్తి కలుగుతుంది. మేము చదువుకున్న సమయంలో పాఠశాలల్లో సౌకర్యాలు లేక ఇబ్బందులు పడ్డాం. ఇప్పటికే దాదాపు 80పాఠశాలల్లో నీటి బోర్లు వేయించి నీటి సమస్యను తీర్చడం చాలా ఆనందంగా ఉంది. టీవీల్లో, పేపర్లలో వచ్చే ప్రభుత్వ పాఠశాల సమస్యలపై స్పందిస్తూ పరిష్కారానికి కృషి చేస్తున్నాను. – నాగస్వారం నరసింహులు, మాజీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి సేవా కార్యక్రమాలు.. ⇔ డిసెంబర్ 2017లో చాగలమర్రి జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో బోరు ఏర్పాటు చేశారు. ⇔ చిలకలడోన కస్తూరిబా గాంధీ పాఠశాల బాలికలకు రూ.40వేలు విలువ గల క్రీడా సామగ్రి అందించారు. ⇔ పాణ్యం సమీపంలోని కస్తూర్భా గాంధీ పాఠశాలకు రూ.40వేలు విలువ చేసే వంట సామగ్రిని అందజేశారు. ⇔ ఎర్రగుంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరుగుదొడ్ల మరమ్మతులకు రూ.30వేలు చేయూతనిచ్చారు. ⇔ గోనెగండ్ల కస్తూర్భా గాంధీ పాఠశాలకు రూ.60వేలతో బోరు వేయించి పైపులైన్ సౌకర్యం కల్పించారు. ⇔ దీబగుంట్ల ప్రభుత్వ పాఠశాలకు ఉపాధ్యాయులు రికార్డులు భద్రంగా ఉంచేందుకు రూ.25వేల సేఫ్లాకర్ను అందించారు. ⇔ కర్నూలు పట్టణంలో ఇద్దరు అనాథలను పిల్లలను దత్తత తీసుకొని వారి చదువుకు అయ్యే ఖర్చులను భరిస్తున్నారు. ⇔ మాయలూరు జెడ్పీపాఠశాలలో రూ.40 వేలతో బోరు వేయించారు. ⇔ దిగువపాడు జెడ్పీ హైస్కూల్కు రూ.60వేలతో నీటి బోరు వేయించారు. ⇔ నంద్యాల జెడ్పీ బాలికల పాఠశాలలో రూ.55 వేలతో నీటి సౌకర్యం. వెంటనే స్పందించారు మా పాఠశాలలో నెలకొన్న నీటి సమస్యపై పత్రికలో వచ్చిన వార్తకు ఆయన వెంటనే స్పందించి మరుసటి రోజు మా పాఠశాలను సందర్శించారు. పాఠశాలల్లో రూ.50వేలతో నీటి బోరు వేయించి తాగునీటి సౌకర్యం కల్పించారు. ఇలాంటి మంచి మనసున్న వ్యక్తులు సమాజంలో చాలా తక్కువగా ఉంటారు. – సుబ్బన్న, ఉపాధ్యాయుడు, తిమ్మాపురం -
జస్టిస్ లోకూర్ పదవీవిరమణ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్.బి.లోకూర్ ఆదివారం పదవీవిరమణ చేశారు. ఈ ఏడాది జనవరిలో అప్పటి సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా వ్యవహారశైలికి వ్యతిరేకంగా మీడియా సమావేశం ఏర్పాటుచేసిన నలుగురు జడ్జీల్లో జస్టిస్ లోకూర్ ఉన్నారు. సుప్రీంకోర్టు జడ్జీలు, న్యాయవాదులు డిసెంబర్ 14నే జస్టిస్ లోకూర్కు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ ఆదివారంతో ఆయన పదవీకాలం పూర్తయింది. కేసుల కేటాయింపు విషయంలో అప్పటి సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా తీరును వ్యతిరేకిస్తూ ప్రస్తుత సీజేఐ జస్టిస్ గొగోయ్, అప్పటి జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ కురియన్ జోసెఫ్తో కలిసి లోకూర్ మీడియా సమావేశంలో నిర్వహించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు కీలక కేసుల్లో తీర్పును వెలువరించారు. 1953, డిసెంబర్ 31న జన్మించిన లోకూర్, 1977, జూలై 28న న్యాయవాదిగా పేరును నమోదు చేయించుకున్నారు. 2010–12 మధ్యకాలంలో గువాహటి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2012 జాన్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లోకూర్ పదోన్నతి పొందారు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)తో కలిసి 47 కేసుల్లో కీలక తీర్పులు ఇచ్చారు. -
హైకోర్టు రిజిస్ట్రార్ పదవీ విరమణ
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు రిజిస్ట్రార్ (ప్రోటోకాల్) సి.విద్యాధర్ భట్ పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు ఉద్యోగులు ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం భట్ మట్లాడుతూ, 1997లో ఉద్యోగుల సంఘం సాంస్కృతిక కార్యదర్శిగా ఉన్నప్పుడు చదువులో మంచి ప్రతిభ కనబరచిన ఉద్యోగుల పిల్లలకు ప్రతిభా అవార్డులు ప్రవేశపెట్టడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ అవార్డులకు ఆర్థిక సాయం చేస్తున్న ఉద్యోగి విరూపాక్ష రెడ్డిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. విరూపాక్ష రెడ్డి లాగే తాను కూడా రెండు పతకాలకు ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు. -
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ రేసులో బీజేపీ
భువనేశ్వర్: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి బీజేపీ కూడా అభ్యర్థిని బరిలోకి దించుతుందని పార్టీ సీనియర్ నేత ధర్మేంద్రప్రధాన్ తెలిపారు. ప్రస్తుత డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్నందున వచ్చే వర్షాకాల సమావేశాల్లో ఈ ఎన్నిక జరుగనుంది. ‘బీజేపీ తరఫున అభ్యర్థిని పోటీలో ఉంచుతాం. ముందుగా ఏకాభిప్రాయానికి ప్రయత్నిస్తాం. అవసరమైతే కాంగ్రెస్ మద్దతు తీసుకుంటాం’ అని ఆయన అన్నారు. ఆ పదవిని ఆశించే వారిలో ముఖ్యంగా బీజేడీ నేత ప్రసన్న ఆచార్య, తృణమూల్ నేత సుఖేందు శేఖర్ ఉన్నట్లు మీడియా వర్గాల సమాచారం. బీజేపీని దూరంగా ఉంచేందుకు బీజేడీ అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయని వార్తలు వెలువడ్డాయి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఎన్నికయ్యేందుకు 122 ఓట్లు అవసరం ఉంటుంది. రాజ్యసభలో బీజేపీకి 67 మంది సభ్యులు, కాంగ్రెస్కు 51 మంది, బీజేడీకి 9 మంది సభ్యుల బలముంది. -
రాజీనామా కాదు.. వీఆర్ఎస్ తీసుకుంటా
సాక్షి, హైదరాబాద్: మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇటీవల తీర్పునిచ్చి, అనంతరం తన పోస్టు కు రాజీనామా చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం జడ్జి కె.రవీందర్రెడ్డి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. రాజీనా మా విషయంలో పునరాలోచనలో పడ్డ ఆయన, సన్నిహితులతో చర్చించి.. తాను ఇచ్చిన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. రాజీనామా లేఖ స్థానంలో స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం తాజాగా హైకోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తు నిబంధనల మేర లేకపోవడంతో హైకోర్టు దానిని వెనక్కి ఇచ్చేసింది. నిర్దిష్ట ఫార్మాట్ ప్రకారం దర ఖాస్తు చేసుకోవాలని రవీందర్రెడ్డికి స్పష్టం చేసింది. వీఆర్ఎస్ నిర్ణయం దృష్ట్యా ఆయన గురువారం విధులకు హాజరయ్యారు. మక్కా మసీదు కేసులో ఉదయం తీర్పు వెలువరించిన రవీందర్రెడ్డి, సాయంత్రం కల్లా రాజీనామా చేయడం సంచలనం సృష్టించిం ది. అసలు ఆయన ఎందుకు రాజీనామా చేశారో ఇప్పటికీ బహిర్గతం కాలేదు. అవినీతి ఆరోపణల వల్లే రాజీనామా చేశారని జాతీయ మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చాయి. 2 రోజుల పాటు తర్జనభర్జన అనంతరం, రాజీనామా చేస్తే, ఇన్నేళ్ల సర్వీసు వృథా అవుతుందని, రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలేవీ దక్కవని సన్నిహితులు చెప్పడం తో ఆయన పునరాలోచనలో పడ్డారు. అనంతరం రాజీనామాను ఉపసంహరించుకుంటున్నానని, దాని స్థానంలో వీఆర్ఎస్కు అనుమతించాలని హైకోర్టును కోరారు. నిబంధనల ప్రకారం వీఆర్ఎస్కు 3 నెలల నోటీసు తప్పనిసరి. దీంతో ఆయన స్వయంగా హైకోర్టుకు వెళ్లి వీఆర్ఎస్ దర ఖాస్తును సమర్పించారు. పదవీవిరమణ (58 ఏళ్లు)కు సమీపంలో ఉన్న తనకు మరో రెండేళ్ల పొడిగింపు వచ్చే అవకాశం లేదన్న నిర్ణయానికి వచ్చిన తర్వాతే రవీందర్రెడ్డి వీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారని నాంపల్లి కోర్టు వర్గాలు చెబుతున్నాయి. 58 నుంచి 60 ఏళ్లకు పొడిగింపునిచ్చే విషయంలో హైకోర్టు పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. పొడిగింపును ఇవ్వదలచిన న్యాయాధికారి పనితీరు, నీతి నిజాయితీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటుంది. -
‘చీకటి రోజులు.. మోదీ విఫలం’
సాక్షి, న్యూఢిల్లీ : మైనర్ బాలికలపై అత్యాచారాలు, హత్య ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్న వేళ.. వేలాది మంది రోడ్డెక్కి.. లక్షలాది మంది సోషల్ మీడియా వేదికగా తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రిటైర్డ్ ఉన్నతాధికారుల బృందం కథువా-ఉన్నావ్ ఘటనలపై స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ఓ బహిరంగ లేఖ రాశారు. ‘దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. ప్రజలకు కనీస భద్రత కూడా ఇవ్వలేకపోతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. భారత రాజ్యాంగంలోని ప్రజాస్వామిక, లౌకికవాద, స్వేచ్ఛా విలువలు నానాటికీ క్షీణించిపోతున్నాయి. ఎనిమిదేళ్ల చిన్నారిపై కొందరు పశువుల్లా హత్యాచారానికి పాల్పడటం.. పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో తెలియజేస్తోంది. స్వాతంత్ర్యం తర్వాత మేం చూస్తున్న చీకటి రోజులు ఇవే. ఈ పరిస్థితులపై ప్రభుత్వం, బలహీనమైన రాజకీయ పార్టీలు, నేతలు స్పందించకపోవటం మేం గమనించాం’ అని లేఖలో వారు పేర్కొన్నారు. సుమారు 49 మంది సివిల్ సర్వీసెస్ మాజీ అధికారులు ఈ లేఖ రాసినట్లు సమాచారం. కథువా ఘటన.. పూర్తి కథనాలు అంతేకాదు ప్రస్తుత అధికార గణంపై వారు లేఖలో విరుచుకుపడ్డారు.‘వారు వారి విధులను సక్రమంగా నిర్వహించటంలో విఫలం అయ్యారు’అని లేఖలో మాజీ అధికారులు ప్రస్తావించారు. ఉన్నావ్, కథువా, అస్సాం, సూరత్.. ఇలా వరుస ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మరోవైపు మెట్రో నగరాలతోపాటు పలు పట్టణాల్లో కూడా ప్రజలు స్వచ్ఛందంగా నిరసనలు చేపడుతున్నారు. -
విశ్రాంత జీవనం.. ఆకుపచ్చని లోకం!
వ్యవసాయంలో ఎమ్మెస్సీ చదువుకున్న గుడిపాటి జీవన్రెడ్డి 35 ఏళ్లు బ్యాంకు ఉద్యోగం చేసిన తర్వాత.. తన ఇంటిపైనే ఆధునిక వసతులతో సేంద్రియ ఇంటి పంటలను సాగు చేస్తున్నారు. ఇనుప చువ్వల పందిరిపై గ్రీన్ షేడ్నెట్ వేసి.. 250కి పైగా కుండీలు, డ్రమ్స్, గ్రోబాగ్స్లో 15 రకాల కూరగాయలు, ఆకుకూరలు పుష్కలంగా పండించుకొని తింటూ ఇంటిల్లపాదీ ఆరోగ్యంగా జీవిస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సింగాపురానికి చెందిన జీవన్రెడ్డి ఆంధ్రా బ్యాంక్లో 35 ఏళ్లు సేవలందించి సీనియర్ మేనేజర్గా రిటైరైన తర్వాత.. హన్మకొండ బ్యాంక్ కాలనీలో 2012లో మూడంతస్థుల ఇల్లు నిర్మించుకున్నారు. తమ ఇంటిపైనే ఆరోగ్యదాయకమైన సేంద్రియ ఆకుకూరలు, కూరగాయల సాగుకు రెండేళ్ళ క్రితం శ్రీకారం చుట్టారు. విశ్రాంత జీవితంలో పచ్చని మొక్కలతోనే సహచర్యం చేస్తున్నారు. ఇంటిపంటల సాగు చక్కని వ్యాపకంతో పాటు రోజుకు 3 గంటల పాటు ఆనందదాయకమైన వ్యాయామంగా కూడా మారిందని ఆనందంగా చెబుతున్నారు.. కాలనీ అభివృద్ధి కమిటీ సంయుక్త కార్యదర్శిగా ఉంటూ.. నలుగురిలోనూ సేంద్రియ ఇంటిపంటల సాగుపై ఆసక్తిని రేకెత్తిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 250కి పైగా కుండీలు, డ్రమ్ములు.. మొదట్లో కొంచెం ఎక్కువ ఖర్చయినా పుష్కలంగా నిరంతరం ఆకుకూరలు, కూరగాయల దిగుబడి వచ్చేలా అత్యంత ప్రణాళికాబద్ధంగా, శాస్త్రీయంగా ఇంటిపంటలను సాగు చేస్తుండడం జీవన్రెడ్డి ప్రత్యేకత. ఎత్తుల వారీగా ఇనుప బెంచీలను తయారు చేయించి, వాటిపైన కుండీలను, డ్రమ్ములను ఉంచి ఆకుకూరలు, కూరగాయలు పెంచుతున్నారు. 40 కుండీల్లో టమాటాలు, 10 కుండీల్లో మిరపకాయలు, 30 కుండీల్లో వంకాయలు, 20 కుండీల్లో గోరుచిక్కుడు, 4 కుండీల్లో బంగాళదుంపలు, రెండు కుండీల్లో అల్లం సాగు చేస్తున్నారు. చిన్న కంటెయినర్లు, గ్రోబాగ్స్లో క్యాబేజి, కాలీఫ్లవర్ వేశారు.మార్కెట్లో దొరికే వాటర్ డ్రమ్ములు 15 తెచ్చి.. వాటిని నిలువుగా కోసి 30 కుండీలుగా మార్చి.. ఆకుకూరలు వేశారు. నీరు నిలబడకుండా అదనపు నీరు కిందికి వెళ్లిపోవడం కోసం డ్రమ్ము అడుగున ఒక చిన్న బెజ్జం పెట్టి.. దానిపైన చిప్స్, గండ్ర ఇసుక వేసి దానిపైన ఎరువు కలిపిన మట్టి మిశ్రమాన్ని నింపారు. పాలకూర 4, మెంతికూర 3, గోంగూర 3, ఉల్లి కాడలు 4, కొత్తిమీర 3 డ్రమ్ముల్లో వేశారు. ఆకుకూరల విత్తనాలు వేసిన నెలరోజుల్లో కోతకు వస్తాయి. 12–15 రోజుల వ్యవధిలో విత్తనాలు వేస్తూఉండటం వల్ల ఆకుకూరలు, కూరగాయలు సంవత్సరం పొడవునా లోటు లేకుండా చేతికి అందివస్తున్నాయని జీవన్రెడ్డి తెలిపారు. ఉదాహరణకు.. గత అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు టమాటా నారు 3 దఫాలుగా పోసి, మొక్కలు నాటుకున్నారు. డ్రమ్ముల్లో ప్రతి సారీ ఆకుకూర పంటల మార్పిడి పాటించడం వల్ల చక్కని పంట దిగుబడులు వస్తున్నాయన్నారు. మట్టిలో రసాయనిక అవశేషాలతో తిప్పలు.. హైబ్రిడ్ విత్తనాల కన్నా సేంద్రియ సాగులో దేశీ విత్తనాలే మంచి దిగుబడినిస్తున్నాయన్నారు. రెండు ట్రాక్టర్ల ఎర్రమట్టి తెప్పించి.. సగం మట్టి, సగం వర్మీకంపోస్టు, కొబ్బరిపొట్టు, పెరిలైట్ కలిపి తయారు చేసుకున్న మట్టిమిశ్రమంలో జీవన్రెడ్డి ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. రసాయనిక ఎరువులు వాడిన పొలాల్లో మట్టి తేవడం వల్ల తొలి ఏడాది ఇంటిపంటలు సక్రమంగా రాక నీరసం వచ్చిందన్నారు. మట్టి ఆరోగ్యం బాగుపడిన తర్వాత రెండో ఏడాది పంటలు బాగా వస్తున్నాయని ఉత్సాహంగా చెప్పారు. రాలిన ఆకులు, వంటింటి వ్యర్థాలతో తయారు చేసుకునే కంపోస్టు, వేపపిండిని నెలకోసారి కొంచెం కొంచెంగా వేస్తున్నారు. 10–12 రోజులకోసారి వేపనూనె పిచికారీ చేస్తున్నారు. మొక్కలు నాటిన లేదా మొలిచిన 2–3 రోజుల్లోనే వేపనూనె చల్లితే చీడపీడల బెడద అంతగా ఉండదన్నది తన అనుభవమని తెలిపారు. మొదట్లోనే ఆకులు తెంపెయ్యాలి.. జీవన్రెడ్డి మొక్కలకు రోజూ ఉదయం వేళలో స్వయంగా నీరు పోస్తుంటారు. డ్రిప్ ద్వారా నీరిస్తే ఐదు నిమిషాల్లో పని పూర్తవుతుందని, అయితే ఏ మొక్క ఎలా ఉందో మనకు తెలియదన్నారు. గోరుముద్దలు తినిపించే తల్లికి, బిడ్డకు మధ్య పెరిగే అనుబంధం, ఆనందం వంటిదే ఇది కూడానని జీవన్రెడ్డి మురిపెంగా చెప్పారు. ఉదయపు నీరెండలో అదే వ్యాయామంగా భావిస్తున్నారు.పురుగూ పుట్రా కనిపిస్తే ఏరోజుకారోజు చేతులతో ఏరేయడమే ఇంటిపంటలకు ఉత్తమ మార్గమని ఆయన అంటున్నారు. టమాటాకు ఆకుమచ్చ(లీఫ్మైనర్) సమస్య కనిపించిన తొలిదశలోనే ఆకులను తెంపి, నాశనం చేయడం ఉత్తమం. బెండలో పేనుబంకను గమనించిన వెంటనే వేళ్లతో తీసి నేలమీద వేయాలి. గట్టి వత్తిడితో నీటిని పిచికారీ చేసినా పేనుబంక పోతుంది. అంతగా అయితే వేపనూనె పిచికారీ చేయాలన్నారు. పాలకూరను ఆశించే గొంగళిపురుగులు సాయంత్రం 5 గంటల తర్వాత మట్టిలో నుంచి బయటకు వస్తాయని, ఆ వేళలో కాచుకొని చూస్తూ పురుగులను ఏరేయాలని సూచిస్తున్నారు. హన్మకొండలో జీవన్రెడ్డి ఇంటిపైకనువిందు చేస్తున్న ఇంటిపంటలు ప్రతి ఆదివారం ఉచిత శిక్షణ ఇస్తా.. బెంగళూరుకు చెందిన సేంద్రియ ఇంటిపంటల నిపుణుడు డా. విశ్వనాథ్ స్ఫూర్తితో నేను ఇంటిపంటల సాగుకు శ్రీకారం చుట్టాను. నాకు ఇంటిపంటల పనులు, కాలనీ అభివృద్ధి తప్ప మరే వ్యాపకమూ లేదు. గాఢమైన ఆసక్తి ఉంటే ఇంటిపంటల సాగు కష్టమనిపించదు. నాలా అందరూ ఇంత ఖర్చు పెట్టనక్కరలేదు. తక్కువ ఖర్చుతోనూ ప్రారంభించవచ్చు. మా కాలనీవాళ్లకు కూడా ఇదే చెప్తున్నాను. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మా ఇంటితోటలోనే ఉచితంగా శిక్షణ ఇవ్వదలచాను. ఆసక్తి ఉన్న వారెవరైనా ముందు నాకు ఫోన్ చేసి రావచ్చు. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇవ్వడానికి వాట్సాప్ గ్రూప్ను కూడా ఏర్పాటు చేశాను. – గుడిపాటి జీవన్రెడ్డి (99630 99830), బ్యాంక్ కాలనీ, హన్మకొండ పాడితోనే బాగుపడ్డాం.. క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే కుటుంబ నికరాదాయాన్ని పెంచుకోవడం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని మహిళా రైతు నాగిరెడ్డి విజయగౌరి అనుభవపూర్వకంగా చెబుతున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి రూరల్ మండలం రాజుపేట గ్రామానికి చెందిన విజయగౌరి పెద్దగా చదువుకోకపోయినా.. పాడి పశువుల పోషణకు సంబంధించి తెలుసుకున్న ప్రతి విషయాన్నీ ఆసక్తిగా నోట్స్ తయారు చేసుకుంటూ.. ఆ పనిని ప్రణాళికాయుతంగా చేపడుతూ ఉత్తమ పాడి రైతుగా పలు అవార్డులు, రివార్డులను అందుకున్నారు. 18 పాడి çపశువులను పెంచుతూ రోజూ విశాఖడైరీ పాలకేంద్రానికి 80 నుంచి 100 లీటర్ల పాలు పోస్తున్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి కుటుంబాన్ని ఆర్థికాభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. ఆమె మాటల్లోనే విందాం. ‘ఎనిమిదేళ్ల క్రితం కుటుంబం ఆర్థికంగా చితికిపోవడంతో పశువుల పెంపకంపై దృష్టిసారించాను. అప్పటి సీఎం రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన పశుక్రాంతి పథకం ద్వారా మూడు ఆవులతో డైరీ పెట్టాను. నా భర్త రామారావు సహకారంతో ప్రస్తుతం మొత్తం 15 ఆవులు 5 దూడలు పెంచుతూ పాల ఉత్పత్తి చేస్తున్నాను. రోజుకు సాధారణ స్థితిలో అయితే 80 నుంచి 100 లీటర్ల పాలు విశాఖ డైరీ పాలకేంద్రానికి అందిస్తున్నాం. పశువుల పేడతో గోబర్ గ్యాస్ తయారు చేసుకొని వాడుకుంటున్నాం. భర్తతో కలసి ఉదయం 3.30 గంటలకు నిద్ర లేచి రాత్రి 10 గంటల వరకు పనులు చేసుకుంటున్నాం. డైరీలో లీటరుకు రూ. 23, బయట రూ. 30 వస్తున్నది. పశువుల పెంపకం వలన మా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంది. నా కుమారుడు నాగేంద్రకుమార్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కుమార్తె యశోద ఇంజనీరింగ్ చదువుతున్నది’ అన్నారామె. – రంపా రాజమోహనరావు, సాక్షి, బొబ్బిలి రూరల్ నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ – కొల్ల కృష్ణకుమార్, సాక్షి, హన్మకొండ -
జడ్జీల కొరత తీవ్రతరం
సాక్షి, న్యూఢిల్లీ : న్యాయమూర్తుల కొరతతో పలు కేసులు పెండింగ్లో ఉంటున్న క్రమంలో ఈ ఏడాది ఏకంగా ఏడుగురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు రిటైర్ కానుండటంతో సమస్య మరింత జటిలం కానుంది. సర్వోన్నత న్యాయస్ధానం ఇప్పటికే ఆరుగురు న్యాయమూర్తుల కొరతతో సతమతమవుతోంది. ఇద్దరు న్యాయమూర్తుల నియామకం సత్వరమే చేపట్టాలన్న సూచన ఇంకా ప్రభుత్వం వద్ద పెండింగ్లోనే ఉంది. మార్చి 1న జస్టిస్ అమితవ రాయ్ పదవీవిరమణ చేయనుండగా, మే 4న జస్టిస్ రాజేష్ అగర్వాల్ రిటైర్ కానున్నారు. ఇక చీఫ్ జస్టిస్ తర్వాత సుప్రీం కోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జే . చలమేశ్వర్ జూన్ 22న, జస్టిస్ ఆదర్శ్ గోయల్ జులై 6న పదవీవిరమణ చేయనున్నారని సుప్రీం కోర్టు, న్యాయమంత్రిత్వ శాఖ వెబ్సైట్లు పేర్కొన్నాయి. ఇక సీజేఐ దీపక్ మిశ్రా అక్టోబర్ 2న, జస్టిస్ కురియన్ జోసెఫ్ నవంబర్ 29న, జస్టిస్ మదన్ బీ లోకూర్ డిసెంబర్ 30న పదవీవిరమణ చేయనున్నారు. న్యాయమూర్తులు పెద్దసంఖ్యలో రిటైర్ కానుండటం, ఇప్పటికే ఆరుగురు న్యాయమూర్తుల కొరత నెలకొనడంతో కొలీజియం జడ్జీల ఎంపికపై ఒత్తిడి ఎదుర్కోనుంది. న్యాయమూర్తుల నియామకంపై ప్రభుత్వం సత్వరమే స్పందించి పెండింగ్ కేసులు పేరుకుపోకుండా చూడాల్సిఉంది. -
గుడ్బై నెహ్రాజీ...
సాక్షి క్రీడావిభాగం :కొన్నాళ్ల క్రితం వరకు కూడా ఆశిష్ నెహ్రా అంటే కీలక సమయంలో పరుగులు ఇచ్చి భారత్కు విజయాన్ని దూరం చేయడం, తనకే సాధ్యమైన చెత్త ఫీల్డింగ్, వీటిపై ఇంటర్నెట్లో లెక్కలేనన్ని జోకులు... కానీ బుధవారం అతను సొంత మైదానంలో ఆఖరి మ్యాచ్ ఆడి హీరోలా రిటైరయ్యాడు. తనపై గౌరవంగా ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ క్రికెట్ సంఘం ఏర్పాటు చేసిన ‘ఆశిష్ నెహ్రా ఎండ్’ నుంచి బౌలింగ్ చేసే అదృష్టం దక్కించుకున్నాడు. గ్రౌండ్లో దూసుకొచ్చి నెహ్రా కాళ్లు మొక్కే అభిమాని కూడా ఉంటారా అని ఆశ్చర్యపోయే ఘటన కూడా ఈ మ్యాచ్లో మనకు కనిపించింది! దిగ్గజాలు సెహ్వాగ్కు, వీవీఎస్ లక్ష్మణ్కు, జహీర్ ఖాన్లకు కూడా సాధ్యం కాని ‘వీడ్కోలు మ్యాచ్’ నెహ్రాకు లభించింది. ఇన్నేళ్ల కెరీర్లో అతను అంతర్జాతీయ క్రికెట్లో పడగొట్టిన 235 వికెట్లే కాదు... మంచివాడుగా ఎందరినుంచో పొందిన అభిమానం కూడా అందుకు కారణం అంటే అతిశయోక్తి లేదు. ఎప్పుడో కొత్త మిలీనియంకు ముందు నెహ్రా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు క్రికెట్ ఎంతో మారింది. నెహ్రా స్వయంగా అజహర్తో మొదలు పెట్టి ఇంజమాముల్ హక్ (ఆసియా ఎలెవన్) నుంచి కోహ్లి వరకు ఏడుగురు కెప్టెన్ల ఆధ్వర్యంలో ఆడాడు. వేర్వేరు జట్లలో సభ్యుడిగా, తరాల అంతరాలకు వారధిగా నెహ్రా కొనసాగాడు. సుదీర్ఘ కెరీర్లో గాయాల పుస్తకంలో అన్ని పేజీలు చదివేసిన నెహ్రా ఇంత కాలం కొనసాగడం అతని పట్టుదలకు, ఆత్మ స్థైర్యానికి నిదర్శనం. ఎప్పుడూ ఇక నా పనైపోయిందనే ఆలోచన రాకుండా అతను సాగించిన ప్రయాణమే నెహ్రాను అనేక మంది కంటే భిన్నంగా, గొప్పగా నిలబెట్టింది. మధ్యలో సుదీర్ఘ విరామాలు రావడాన్ని పక్కన పెట్టి, ఓవరాల్గా తొలి మ్యాచ్కు, చివరి మ్యాచ్కు మధ్య కెరీర్ను చూస్తే 18 ఏళ్ల 250 రోజుల కెరీర్తో సుదీర్ఘకాలం ఆడిన భారత ఆటగాళ్లలో నెహ్రా నాలుగో స్థానంలో నిలుస్తాడు. నెహ్రా అరంగేట్రానికి కేవలం ఇద్దరు భారత లెఫ్టార్మ్ పేసర్లు మాత్రమే ఐదుకు మించి టెస్టు వికెట్లు పడగొట్టారు. అలాంటి సమయంలో నెహ్రా భిన్నమైన రనప్, యాక్షన్ కలగలిసిన తనదైన ప్రత్యేక శైలితో దూసుకొచ్చాడు. నెహ్రా అనగానే అందరికీ 2003 ప్రపంచకప్లో ఇంగ్లండ్తో 6/23 ప్రదర్శన మాత్రమే గుర్తుకొస్తుంది. అది మాత్రమే కాకుండా పాకిస్తాన్పై కరాచీ వన్డేలో, ఆ తర్వాత పాక్పైనే 2011 ప్రపంచ కప్ సెమీస్, గత ఏడాది టి20 ప్రపంచ కప్లో కుర్రాళ్లతో పోటీ పడి అతను చూపించిన ఆట కూడా నెహ్రా విలువేంటో చెబుతాయి. 36 ఏళ్ల వయసులో వృద్ధ సింహంలా టి20 క్రికెట్లోకి రావడం, 140 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరడం సాధారణ విషయం కాదు. ఐదేళ్ల తర్వాత జట్టులోకి తిరిగి వచ్చాక ‘ఇంత కాలం నా మొహం ఎవరికీ నచ్చలేదేమో’ అంటూ తనపైన జోకులు వేసుకోవడం...‘ఇప్పటికీ పాత నోకియా ఫోన్ను వాడుతున్న నన్ను సోషల్ మీడియా గురించి అడిగితే ఏం చెబుతాను’ అంటూ సరదాగా వ్యాఖ్యానించినా అది నెహ్రాకే చెల్లింది. కెమెరా కళ్లకు నెహ్రా పెద్ద స్టార్ కాకపోవచ్చు, అతని గణాంకాలు మరీ గొప్పగా లేకపోవచ్చు గానీ... ప్రతికూల పరిస్థితుల్లోనూ పోరాడగలిగిన, ఈతరం ఆటగాళ్లకు స్ఫూర్తినిచ్చే క్రికెటర్గా మాత్రం నెహ్రా ఎప్పటికీ గుర్తుండిపోతాడు. -
నయీ గాడీ
‘‘నీకు బండి అర్జెంట్గా కావాలి అంటున్నవ్.. ఉద్యోగం కోసం. చూడు షామీర్ భయ్యా! మా షోరూంలో ఇప్పుడు ఒక స్కీం వుంది. నెల నెలా పదమూడు వందలు కట్టాల. ప్రతినెలా చివరి ఆదివారం స్కీంలోని సభ్యులందరి పేరు మీద డ్రా తీస్తం. డ్రాల ఎల్తే మిగతా పైసల్ కట్టనవసరం లేదు. గిట్ల యాభై కిస్తీలు కట్టాల. డ్రాల ఎల్లకుంటే లాస్ట్ల బండి ఇస్త. ఇగ నువ్ అర్జెంట్ అంటున్నవ్ కనుక ఒక పదివేలు డౌన్ పేమెంట్ కింద కట్టి స్కీంల చేరు. బండి తీస్కో, మధ్యల ఎల్తే నీకు మంచిదే, ఎల్లకుంటే నెల నెలా పైసల్ కట్టుకో. ఏమంటావ్ షామీర్ వింటున్నవా..’’ ‘‘ఆ ఆ వింటున్న రమేష్ అన్న. ఇగ నాకు బండి జరూర్గా కావాల్నే.. మైక్రో ఫైనాన్సుల కలెక్షన్ బాయ్గా చేరాలంటే కచ్చితంగా బైక్ ఉంటేనే ఉద్యోగం ఇస్తా అని మేనేజర్ చెప్పిండు. ఇంట్లో నాన్న రిటైర్ అయ్యిండు. తన ఆరోగ్యం కూడా బాలేదు. నేను ఈ సమయంల ఉద్యోగం జరూర్గ చెయ్యాల్నే.సరే షామీర్ నువ్వు ఎప్పుడు పదివేలు తీసుకొని వస్తవో చెప్పు నేను బండి తెప్పిస్తా. కాగితాలు రెడీ చేసి పెడతా సరేనా! వెళ్ళొస్తా రమేష్ అన్న ..వీలైతే వచ్చే గురువారం తీసుకుంటా.. మళ్ళా లేట్ అయితే ఉద్యోగం వేరేవాళ్ళకు ఇస్తరు.’’ ∙∙ షోరూంలకెల్లి బైటికి రాంగనే ఎదురుగా మా చిన్నమామ లతీఫ్.‘‘సలామాలేకూం మామా’’ అన్నా. ‘‘వాలేకుం అసలాం.. క్యారే షామీర్.. రెండ్రోజుల నుండి రమేష్తో కనపడుతున్నవ్ బండి గిట్ల కొంటున్నవా!’’ నోట్లో వున్న జర్దాను తుపుక్కు తుపుక్కు అని కింద ఉమ్మేస్తూ ఒక వెకిలి నవ్వుతో మామ. ‘‘మామా.. మైక్రో ఫైనాన్సు ఆఫీస్లో కలెక్షన్ బాయ్ వుద్యోగం ఉంది. చేరాలంటే బండి కావాలంట. డిగ్రీ చేసిన వూరి పిల్లగానికే ఆ వుద్యోగం ఇస్తరంట. అందుకే రమేష్ అన్నతో మాట్లాడుతున్నా.’’అంతా విని మళ్ళీ తుపుక్కు అని ఉమ్మేసి.. ‘‘ఔరా! షామీర్ ఇంట్లో నాయన రిటైర్ అయ్యి మంచాల ఉన్నడు. నీకు వేరే వుద్యోగం యేది దొరకలేదార.. ఇప్పుడు బండెట్ల గొంటావ్? ఏదైనా సెకండ్ హ్యాండ్ పాత బండి గిట్ల చూడు!’’‘‘ముందు గదే చూసిన కాని అవి మంచిగ లేవు. వాటిని కొన్నంక మళ్ళా రిపేర్ చేయించాలె. ఒక పదివేలు కడితే కొత్త బండి ఇస్తా అన్నడు రమేష్ అన్న. మిగతా పైసల్ నెల నెలా జీతంలకెల్లి కడుతా.’’‘‘అబ్బో.. సరే నీ ఇష్టం.’’ అనేసి మామ పాన్ డబ్బా దగ్గరకు వెళ్ళాడు. ఇంటికొచ్చి నాయన పక్కన మంచంల కూర్చున్న.‘‘బేటా! వెళ్ళిన పని ఏమైంది. రమేష్ బండి ఇస్తా అన్నడా!’’‘‘పది వేలు డౌన్ పేమెంట్ కడితే గురువారం బండి తీసుకోమన్నడు.’’ ‘‘గిదీనికి, గంత ఆలోచన ఎందుకుర షామీర్! నేను ఇస్త కదా నీకు పదివేలు. బ్యాంకుల నా ఎకౌంట్ల మూడు లక్షలు ఉన్నయ్గదా.. అందులో ఒక పదివేలు తీసుకో! ఎలాగు నీకు వుద్యోగం బండి ఉంటే ఇస్తరు అంటున్నావు!’’అప్పుడే వచ్చిన అమ్మ కూడా నాన్న చెప్పినట్టు చెయ్యి’’ అని అంది.మధ్యతరగతి జీవితాలు ఇంతేనేమో! ఏది కొనాలన్నా అన్నీ ఆలోచించాలి. నాన్న బ్యాంకు అకౌంట్లో అక్క పెళ్లి కోసం దాచిన మూడు లక్షలు మాత్రమే ఉన్నాయి. రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బు ఇంటి రిపేర్కి, నాన్న జబ్బు తగ్గడానికి ఖర్చు చేసాము. నాన్నకు నేను, అక్క, ఇంకో చెల్లె. చిన్న కుటుంబమే అయినా నాన్న జీతం మిగిలేది కాదు. రిటైర్ అయ్యాక తన ఆరోగ్యం కరాబు కావడం, నా చదువు అయిపోవడం ఒకేసారి. అక్క పెళ్లి చేయాలనీ నాన్న సంబంధాలు చూస్తున్నారు. ఈ పరిస్థితిలో కొడుకుగా నేను నాన్నకు సాయం చేయాలి. సరిగ్గా ఇలాంటి సమయంలో అల్లాహ్ దయ వలన ఈ వుద్యోగం కోసం నా గురించి ఆ మేనేజర్కు నా దోస్తు చెప్పిండు. నా చదువు, కుటుంబ పరిస్థితి చూసి ఆ మేనేజర్ వుద్యోగం నాకే ఇస్తాను అన్నారు కాని బండి వుండాలని కండిషన్.ఎందుకంటే చుట్టూ వున్న ఒక ఇరవై ఊర్లలో వర్క్ కోసం తిరగాల్సి ఉంటుంది. అక్క పెళ్లి ఖాయం అయ్యేంతలో ఉద్యోగంలో చేరితే నాన్నకు ఆసరా ఉంటదని నా ఆలోచన. రమేష్ అన్నకు ఫోన్ చేసి చెప్పిన గురువారం బండి తీసుకుంటా అని. బ్లాక్ కలర్ స్ప్లెండర్. ఎప్పటి నుండో నేను కొనాలి అనుకుంటున్న బైక్ అది. ఆ రోజు గురువారం. నాన్నతో కలిసి బ్యాంకులో పదివేలు తీసుకొని నేరుగా హీరో షోరూంకు వెళ్ళిన. అప్పటికే బండితో రమేష్ అన్న ఎదురు చూస్తున్నాడు. పేపర్ వర్క్ అంతా చేసుకొని స్ప్లెండర్ బైక్ కీస్ నా చేతిలో పెట్టాడు. ఆనందంతో నా మొహం వెలిగింది. నాన్నను బండి మీద కూర్చోపెట్టుకొని రమేష్ కి నమస్తే చెప్పి ఇంటికి బయలుదేరా కొత్త స్ప్లెండర్ బండి మీద. ఇంటి దగ్గర అమ్మ, అక్క, చెల్లె ఎదురుచూస్తున్నారు. రాగానే అమ్మ నాతో... ‘‘షామీర్ అక్కతో కలిసి దర్గా వెళ్లి మొక్కి రారా.. అల్లాహ్ అంతా మంచి చేస్తడు.’’ అని చెప్పింది. దర్గా వెళ్లి దారిలో స్వీట్ షాప్లో ఒక అరకిలో లడ్డూ తీసుకొని ఇంటికి రాగానే.. అమ్మతో మాట్లాడుతూ లతీఫ్ మామ. ‘‘ఏమిరా షామీర్! మంచి జోష్ మీద ఉన్నావ్! బండి కొన్నావ్!’’ మామ మాటలకు నవ్వుతూ అమ్మ చేతిలో లడ్డూ పాకెట్ పెట్టి ఏం మాట్లాడకుండా ‘‘మా దోస్త్ రాము ఇంటికి వెళ్ళొస్తా’’ అని చెప్పి బండి స్టార్ట్ చేసినాను. జీవితం సాఫీగా గడుస్తుంది కొంచెం ఇప్పుడు. చూస్తుండగానే మూడు నెలలు గడిచిపోయాయి. మైక్రో ఫైనాన్సు మేనేజర్కి నా మీద మంచి అభిప్రాయం కలిగింది. మా ఇంటి పక్కన వుండే షేర్ సాహెబ్ మా అక్కకు ఒక మంచి సంబంధం చెప్పాడు. అబ్బాయి సింగరేణి బొగ్గు కంపెనీలో కాంట్రాక్టు ఫిట్టర్గా పనిచేస్తాడు. నెలకు పన్నెండు వేలు జీతం. ఇంకో రెండేళ్ళు చేస్తే పెర్మినెంట్ చేస్తారంట. ఒక్కడే కొడుకు. ఊర్లో సొంత ఇల్లు.అమ్మానాన్నలకు, నాకు ఈ సంబంధం నచ్చింది. పెళ్లి చూపులు ఆదివారం పెట్టుకున్నాము. అంతా సాఫీగా జరిగింది. పిల్లాపిల్లాడు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. రెండ్రోజుల తరువాత కట్నకానుకల కోసం వాళ్ళ ఇంటికి రమ్మన్నారు. ఆ రోజు పొద్దున్నే నాన్న, నేను మా లతీఫ్ మామ కట్నం కోసం మాట్లాడటానికి వెళ్లినాము. లతీఫ్ మామ స్వభావం నాకు తెలుసు. తను పుల్ల ఎలా పెట్టాలా అని చూసే రకం. తను రావడం నాకు ఇష్టం లేదు. కాని మామ పెద్దవాడు. ఇంకా పెళ్లి కొడుకు మేనమామ, లతీఫ్ మామ బచ్పన్ దోస్తులంట!అందరం కుర్చున్నాము వాళ్ళ ఇంట్లో. నాన్న పెళ్ళికొడుకు వాళ్ల నాన్నతో మాట్లాడుతున్నాడు. లతీఫ్ మామ.. పెళ్ళికొడుకు వాళ్ల మామతో ముచ్చట్లలో ఉన్నాడు. నేను దేవుడికి మనసులో దండం పెట్టుకుంటున్నాను.. కట్నం తక్కువ వుండాలని! ఒక లక్ష నగదు, మూడు తులాల బంగారం, ఇంకా పెళ్లికూతురు కోసం సామాను ఫర్నిచర్. నాన్న వాళ్ళతో చెప్పాడు ఇంతే ఇవ్వగలము అని. సరే అని అందరూ ఒప్పుకొన్నారు.ఇంతలో పెళ్లికొడుకు మేనమామ నాన్నతో, ‘‘చూడండి! ఇవ్వాళ అందరు పెళ్లిల బైక్ పెడ్తున్నారు కట్నం కింద. మీరు మా వాడికి బైక్ పెట్టాల్సిందే’’ అన్నాడు.నాన్న కుదరదు అని చెప్పాడు.మా లతీఫ్ మామ నాన్న తో.. ‘‘చూడు జహింగిర్ బావా! ఇంత దాకా వచ్చాక బండి కోసం పరేషాన్ ఎందుకు? మన షామీర్గాడిది కొత్త బండే కదా! కొని రెండు నెలలే ఐంది. అది ఇద్దాము కట్నం కింద’’ అన్నాడు. ఒక్కసారిగా నాకు ఏదోలా అయింది. సరే మేము వెళ్లి కబురు చేస్తాం అని ఇంటికి వచ్చాము. ఆ రోజు రాత్రి నాన్న, నేను ఆలోచనలో పడ్డాము.నేను నాన్నతో అన్నాను.. ‘‘నాన్నా! అక్క పెళ్లి ముఖ్యం మనకు. బండి ఏముంది మళ్లీ కొందాము’’ అన్నా. నాన్న నా తలమీద చేయి వేసి ‘‘మరి వుద్యోగం ఎలా?’’ అన్నాడు. నేను మేనేజర్ కాళ్ళు పట్టుకోవడానికైనా సిద్ధం అన్నాను. అక్కడే వున్న అక్క కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. తెల్లారగానే ఆఫీస్లో మేనేజర్ని కలిసి విషయం చెప్పినాను. తను నా సమస్యను అర్థం చేసుకొని ‘‘ప్రత్యామ్నాయం ఆలోచిస్తా. ఏం భయపడకు షామీర్! నీ వుద్యోగం నీదే’’ అన్నాడు. మేనేజర్కి దండం పెట్టి బండి స్టార్ట్ చేసి పనికి వెళ్ళిపోయాను. వచ్చే నెల పదో తారీకున పెళ్లి. పెళ్లి పనుల కోసం నాన్న, నేను తిరుగుతున్నాము. చూస్తుండగానే పెళ్లి రోజు రానే వచ్చింది. మా స్తోమత ప్రకారం అయినంతలో చాలా బాగా పెళ్లి జరిగింది. వెళ్ళేప్పుడు అక్క ఏడుపు ఆపుకోలేక పోయింది. నాకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. పెళ్లి కారు, సర్వీసు వెళ్ళే సరికి రాత్రి ఒంటిగంట అయ్యింది. అందరూ వెళ్ళాక దూరంగా లతీఫ్ మామ పెళ్ళికొడుకు మేనమామ నా బండి దగ్గర బీడీ తాగుతూ ఏదో మాట్లాడుతున్నారు. మా లతీఫ్ మామకు సలాం చెప్పి బండి స్టార్ట్ చేసి వాళ్ళ మామ నా దగరకు వచ్చి, ‘‘షామీర్! పెళ్లి మంచిగా చేసిండ్రు రా! ఇక బండి నేను తీసుకొని వెళ్తున్నా. నువ్ వలీమాకు వచ్చేటప్పుడు బండి పేపర్లు మర్చిపోకు. వెళ్తా మరి’’ అని నమస్తే చెప్పి నా బ్లాక్ స్ప్లెండర్ మీద వెళ్ళిపోయాడు.అలానే చూస్తూ ఉన్న నేను, ఏదో అలికిడి కావడంతో పక్కకు చూస్తే, మా లతీఫ్ మామ జర్దాను తుపుక్కు తుపుక్కు అని ఉమ్మేస్తూ నా వైపు వస్తున్నాడు.కొత్త బండి. అక్కతోపాటే వెళ్ళిపోయింది. అల్లా అంతా మంచే చేస్తాడు.‘‘నాన్నా! అక్క పెళ్లి ముఖ్యం మనకు. బండి ఏముంది మళ్లీ కొందాము’’ అన్నా. నాన్న నా తలమీద చేయి వేసి ‘‘మరి వుద్యోగం ఎలా?’’ అన్నాడు. నేను మేనేజర్ కాళ్ళు పట్టుకోవడానికైనా సిద్ధం అన్నాను. అక్కడే వున్న అక్క కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. ఆనంద్ కార్తీక్ -
తుది జట్టులో లేకపోవడం వల్లే...
సాక్షి, హైదరాబాద్: కెరీర్లో పలు మార్లు గాయాలు, ఫిట్నెస్ సమస్యలతో బాధ పడిన లెఫ్టార్మ్ పేసర్ ఆశిష్ నెహ్రా జట్టులోకి ఎన్నో సార్లు వచ్చి పోయాడు. కానీ ఏకంగా ఐదేళ్ళ విరామం తర్వాత 2016 జనవరిలో టి20 జట్టులోకి అతని పునరాగమనం ఆశ్చర్యం కలిగించింది. గత రెండేళ్ల కాలంలో అతనికి తుది జట్టులో చోటు లభించని మ్యాచ్ లేదు. ఇప్పుడు ఆసీస్తో తొలి రెండు మ్యాచ్లలో అతను ఆడలేదు. ఇప్పుడు ఇదే కారణంతో అతను రిటైర్మెంట్కు సిద్ధమయ్యాడు. నవంబర్ 1న సొంత మైదానం ఢిల్లీలో న్యూజిలాండ్తో జరిగే టి20 మ్యాచ్తో నెహ్రా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నాడు. 1999లో అరంగేట్రం చేసిన నెహ్రా కెరీర్ 18 ఏళ్లు సాగడం విశేషం. ఈ నేపథ్యంలో గురువారం ఉప్పల్ స్టేడియంలో పలు అంశాలపై మీడియాతో నెహ్రా వెలిబుచ్చిన అభిప్రాయాలు అతని మాటల్లోనే... ►ఈ సిరీస్కు ఎంపికయ్యాక బౌలింగ్ చేసేందుకు నేను పూర్తి సన్నద్ధతతో వచ్చాను. నా ఆలోచనలు కెప్టెన్, కోచ్తో పంచుకున్నాను. ఎందుకంటే నెహ్రా జట్టుతో ఉన్నాడంటే తుది జట్టులో కచ్చితంగా ఉంటాడు. గత రెండేళ్లలో నేను బయట కూర్చోవడం ఎప్పుడైనా చూశారా? ►అయితే ఏదో ఒక దశలో రిటైర్ కావాల్సి ఉంటుందని తెలుసు. ఇది ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం కాదు. ఎవరైనా ఇంకా ఎందుకు ఆడటం లేదు అంటే బాగుంటుంది కానీ ఇంకా ఆడుతున్నాడా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. అయితే ఏం కష్టపడినా భారత జట్టుకు ఆడటం కోసమే. కాబట్టి నేను ఐపీఎల్ వైపు తిరిగి కూడా చూడను. భారత్కు ఆడనప్పుడు ఐపీఎల్లో ఆడటం అనవసరం అనేది నా ఉద్దేశం. -
డబ్బు కోసమే హత్య
ఏఎస్పీ దామోదర్ వెల్లడి విశ్రాంత బ్యాంకు మేనేజర్ హత్యకేసు నిందితుల అరెస్ట్ కాకినాడ క్రైం : జల్సాలు, చెడు వ్యసనాలకు బానిసలుగా మారిన యువకులు డబ్బు కోసం నేర ప్రవృత్తిలోకి వెళ్తున్నారు. కష్టపడకుండా సులువుగా డబ్బు సంపాదించాలనే ప్రయత్నంలో చివరకు మనుషులను హత్యలు చేయడానికి కూడా వెనకాడటం లేదు. డబ్బు కోసం కాకినాడ అశోక్నగర్కు చెందిన ఓ విశ్రాంత బ్యాంకు మేనేజర్ను హత్య చేసిన సంఘటనలో పాల్గొన్న ముగ్గురు యువకులను కాకినాడ క్రైం పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం స్థానిక త్రీటౌన్ క్రైం పోలీస్స్టేçషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఏఎస్పీ ఏఆర్ దామోదర్ హత్యకేసు వివరాలను వెల్లడించారు. రామచంద్రపురం వెల్లరోడ్డు కాలువగట్టుకు చెందిన బల్లిపాటి వరప్రసాద్ (19) కాకినాడలో ఓ మెడికల్ షాపులో సేల్స్బాయ్గా, ఇదే గ్రామం కమ్మవారివీధి గుబ్బలవారిపేటకు చెందిన ఖండవల్లి సత్యప్రభుకిరణ్ (20) స్థానికంగా ఓ హొటల్లో పనిచేస్తున్నారు. అలాగే కోటవీధి రామకృష్ణనగర్కు చెందిన పూళ్ల కామేష్ (19) పనిలేకుండా ఖాళీగా తిరుగుతుంటాడు. వీరిలో ఏ1 ముద్దాయి బల్లిపాటి వరప్రసాద్ కాకినాడ భానుగుడి సెంటర్లోని ఓ ఫార్మసీలో ట్రయినర్గా పని చేస్తూంటాడు. కాకినాడ అశోక్నగర్కు చెందిన విశ్రాంత బ్యాంకు మేనేజర్ బులుసు సూరయ్య (75) అనారోగ్యంతో మెడికల్ షాపులో మందులు కొంటుండేవారు. ఒకట్రెండుసార్లు ఫోన్ చేసి మందులు పంపించాలని ఆర్డర్ ఇవ్వగా వరప్రసాద్ ఇంటికి తీసుకెళ్లి మందులు ఇచ్చేవాడు. ఆ సమయంలో ఇంటి వాతావరణాన్ని, ఇంట్లో ఉండేవారని, వారి ఆస్తులను పరిశీలించిన ప్రసాద్ డబ్బు కోసం వీరిని హతమార్చాలని నిర్ణయించుకుని ఈ విషయాన్ని తన స్నేహితులకు తెలిపాడు. వారు ఒక ప్రణాళిక వేసుకుని ఏప్రియల్ 23న సంఘటనా స్థలానికి వెళ్లగా, నాలుగో వ్యక్తి భయపడి వెనక్కివెళ్లిపోవడంతో 24వ తేదీ రాత్రి 7.45 గంటల సమయంలో ముగ్గురూ వెళ్లారు. ఇంటి ముందున్న టూలెట్ బోర్డును చూచి వచ్చామని, ఇల్లు చూపించాలంటూ వరప్రసాద్ మేడపైకి వెళ్లి విజయలక్ష్మిని కోరాడు. తనతో పాటూ తన స్నేహితులు వచ్చారని చెప్పాడు. ఇల్లు చూపించడానికి కింద ఇంటి తాళం తీసి గదులు చూపిస్తుండగా సూరయ్యను పేపర్ కట్టర్తో గొంతు కోసి హతమార్చారు. అనంతరం ఏమీ తెలియనట్లు పోర్షన్ గదికి తాళం వేసి మేడపైకి వెళ్లి భార్య విజయలక్ష్మిని కూడా హతమార్చి వంటిపై ఉన్న బంగారం, నగదును అపహరించాలని భావించారు. ఈ లోగా విజయలక్ష్మి భర్త ఎక్కడికెళ్లారంటూ ప్రశ్నించడం, బయటకు వెళ్లారని చెప్పడం, కాలనీ అంతా తిరగడం జరిగాయి. మళ్లీ వారు మేడపైకి వెళ్లి మంచినీరు కావాలని అడిగారు. ఈ లోగా వారు సెల్ఫోన్, ల్యాప్టాప్, కొడాక్ కెమేరా, రెండు బంగారు గాజులు తస్కరించారు. సెల్ఫోన్ కోసం వెతికిన విజయలక్ష్మి వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చి ఇంట్లోంచి బయటకు వచ్చి దొంగా దొంగా అని కేకలేయడంతో ముగ్గురూ అక్కడ నుంచి మోటార్బైక్పై పరారయ్యారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన క్రైం డీఎస్పీ ఎ.పల్లపురాజు ఆదివారం ఈ ముగ్గురినీ రామచంద్రపురం పూళ్ల కామేష్ ఇంటి వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి రెండు బంగారు గాజులు, కొడక్ కెమెరా, సెల్ఫోన్, మోటార్బైక్, బ్యాంకు పుస్తకం, ఐడీకార్డు, హత్యకు ఉపయోగించిన పేపర్ కట్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వీరిలో పూళ్ల కామేష్ తన ఇద్దరు స్నేహితులతో కలసి సొంత పెద్దమ్మ గుండు గంగాలక్ష్మికి మిరపకాయ బజ్జీలో మత్తు మందు పొడి కలిపి, ఆమె మెడలోని 3 కాసుల బంగారు తాడును దొంగిలించినట్లు తెలిపారు. వీటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును ఛేదించడంలో కృషి చేసిన క్రైం డీఎస్పీ పల్లపురాజు, క్రైం ఎస్సైలు రామారావు, హరీష్రావు, ఎంఎస్ పాషా, సత్తిరాజు, హెచ్సీ గోవిందరావు, పీసీలు చిన్న శ్రీరామ్, వర్మ, అజయ్, బాబు, రాము, మారుతిలను అభినందించారు. -
బ్యాంకు రిటైర్డ్ చీఫ్ మేనేజర్ దారుణ హత్య
ఇల్లు అద్దె కోసం వచ్చి హత్యకు పాల్పడిన యువకులు ∙ కాకినాడలో కలకలం రేపిన ఘటన కాకినాడ క్రైం : విశ్రాంత ఉద్యోగుల స్వర్గధామంగా పిలుచుకునే అశోక్నగర్–ఎస్బీఐ కాలనీలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న సంఘటన స్థానికుల్లో తీవ్ర కలకలం రేపింది. స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చీఫ్ మేనేజర్గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని హాయిగా భార్యతో జీవిస్తూ.. తన ఇద్దరు కుమారులు అమెరికాలో స్థిరపడటంతో.. ఖాళీగా ఉన్న ఇంటిని అద్దెకిచ్చేందుకు ఏర్పాటు చేసిన టూలెట్ బోర్డు కారణంగా తన ప్రాణం పోతుందని ఊహించలేక పోయాడా పెద్దాయన. అద్దె ఇల్లు కోసమంటూ వచ్చిన యువకులు బ్లేడ్ కట్టర్తో రిటైర్డు ఉద్యోగి గొంతు కోసి హతమార్చిన ఘటన ఆలస్యంగా మంగళవారం వెలుగులో కొచి్చంది. టూలెట్ బోర్డు చూసి.. కాకినాడ అశోక్నగర్ ఎస్బీఐ కాలనీకి చెందిన రిటైర్డ్ స్టేట్బ్యాంకు ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ బులుసు సూరయ్య (72) తన భార్య విజయలక్షి్మతో కలసి జీప్లస్ వ¯ŒS ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారులిద్దరూ ఆదిత్యదత్, సత్యవెంకట చంద్రమౌళిదత్లు అమెరికాలో స్థిరపడ్డారు. కనకవల్లి రాధిక, శ్రీపద్మలకు వివా హం కావడంతో పెద్ద కుమార్తె బెంగళూరు, చిన్నకుమార్తె హైదరాబాద్లో ఉంటున్నారు. జీప్లస్ వ¯ŒS గృహం పై అంతస్తులో భార్యా భర్తలిద్దరూ నివసిస్తున్నారు. గ్రౌండ్ఫ్లోర్ గత ఏడాది కాలంగా ఖాళీగా ఉండటంతో అద్దెకిచ్చేందుకు టూలెట్ బోర్డు పెట్టారు. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో గేటు దూకి ముగ్గురు యువకులుపై అంతస్తులోకి వచ్చి కాలింగ్ బెల్లు కొట్టి ఇల్లు అద్దెకు కావాలని కోరారు. విజయలక్ష్మి భర్త సూరయ్యకు కింద పోర్ష¯ŒS తాళాలిచ్చి పంపించింది. కిందక వెళ్లిన భర్త పైకిరాకపోవడంతో ఆమె కిందకు వచ్చింది. అప్పటికే సూరయ్యను గొంతు కోసేసి హత్యకు పాల్పడి, గదిలో పడేసి తాళాలు వేసేసి బయట నిలుచున్నారు. మా ఆయన ఎక్కడకు వెళ్లారని ఆమె ప్రశ్నించగా బయటకెళ్లారని సమాధానమిచ్చారు. కంగారుగా బయటకు వచ్చిన ఆమె ఆటో ఎక్కి పరిసరాలు గాలించింది. ఆ ముగ్గరు యువకులు ఆటో వెనుకే బైక్లపై వెళ్లి, తిరిగి ఆటోతో పాటు ఇంటికి వచ్చేశారు. దాహం వేస్తోంది. మంచినీళ్లు కావాలంటూ కోరడంతో ఆమె మేడపైకి వెళ్లి నీళ్లు తెచ్చి ఇచ్చింది. అనంతరం ఆ యువకులు టీపాయ్పై ఉన్న సెల్ఫోన్, పక్కనే ఉన్న ల్యాప్టాప్ను దొంగిలించారు. భర్త ఆచూకీ కోసం కాకినాడ శ్రీనగర్లో ఉంటున్న సోదరుడు వారణాసి హనుమంతుకి సమాచారం ఇచ్చేందుకు సెల్ఫో¯ŒS వెతకగా కనిపించలేదు. ల్యాప్ టాప్ కూడా కనిపించకపోయేసరికి ఆగంతకులపై అనుమా నం వచ్చింది. వెంటనే ఆమె దొంగ..దొంగా అంటూ బిగ్గరగా అరవడంతో వారు ముగ్గురూ అక్కడి నుంచి పరారయ్యారు. షాక్కు గురైన విజయలక్షి్మని చూసేందుకు స్థానికులు వచ్చి పరా మర్శించారు. సెల్ఫో¯ŒS సమాచారంతో సోదరి ఇంటికి చేరుకున్న హనుమంతు బావ కోసం చుట్టుపక్కల పరిసరాలను గాలించాడు. ఎంతకీ ఆచూకీ లభించకపోవడంతో సోమవారం అర్ధరాత్రి పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న టూటౌ¯ŒS సీఐ ఉమర్ వచ్చి తాళం తీసి పరిశీలించారు. పోర్ష¯ŒS ముందు గదిలో రక్తం మరకలు ఉండటం, రక్తం మరకల్లో పాదం గుర్తులు, అవి వంట గది వరకు ఉండడం గమనించారు. రక్తపు మడుగులో పడి ఉన్న సూరయ్యను గమనించారు. సీఐ మహ్మద్ ఉమర్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఏఎస్పీ ఏఆర్ దామోదర్, కాకినాడ క్రైం డీఎస్పీ ఎ.పల్లపురాజు, డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావులు మంగళవారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం బృందం, డాగ్స్కా్వడ్లను రప్పించి ఆధారాలు సేకరించారు. హత్యకు పాల్పడిన నిందితులను త్వరలో పట్టుకుంటామని ఏఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. కాకినాడ డీఎస్పీ వెంకటేశ్వరరావు, క్రైం డీఎస్పీ పల్లపురాజుల ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పోస్ట్మార్టం కోసం సూరయ్య మృతదేహాన్ని జీజీహెచ్కు తరలించినట్టు తెలిపారు. హత్యపై పలు అనుమానాలు డబ్బు, బంగారం కోసం ఆశపడి వచ్చిన దొంగలు అవేమి పట్టు కెళ్లకుండా కేవలం సెల్ఫోన్, ల్యాప్టాప్ తీసుకెళ్లడం, అకారణంగా ఇంటి యాజమానిని గొంతు కోసి హత్యకు పాల్పడటంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ల్యాప్టాప్ను ఎత్తుకెళ్లిన నిందితులు దానిని డ్రైనేజీ వద్ద పారేసి వెళ్లిపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ముగ్గురు నిందితుల్లో ఒకరిని విజయలక్ష్మి గుర్తించింది. ఇతను కరణంగారి సెంటర్లోని ఒక మెడికల్ షాపులో పనిచేసేవాడని, రెండు నెలల క్రితం మందులు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చినట్టు తెలిపింది. పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నా భర్తను చంపేసి మంచినీళ్లు అడిగారు నాభర్తను హత్య చేసి ఏమీ తెలియనట్టు నిందితులు పైకి వచ్చి మంచినీళ్లు కావాలని కోరారు. రెండు గ్లాసుల్లో మంచినీరు తీసుకొచ్చి ఇచ్చాను. మంచినీరు తాగేసి సెల్ఫోన్, ల్యాప్టాప్లను దొంగిలించారు. బంగారం, నగదు అడిగితే వెంటనే తీసి ఇచ్చేదాన్ని. నా భర్తను పొట్టన పెట్టుకున్నారంటూ విజయలక్ష్మి కన్నీటిపర్యంతమైంది. -
మాజీ సైనికులకు ‘డబుల్ పెన్షన్’
సీఎం కేసీఆర్ నిర్ణయం • వారి నివాస గృహాలకు ఆస్తి పన్ను మినహాయింపు • అమర సైనికుల కుటుంబాలకు పెన్షన్ రూ.6 వేలకు పెంపు సాక్షి, హైదరాబాద్: మిలటరీలో పని చేసి రిటైర్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో మరో ఉద్యోగం చేసిన వారికి డబుల్ పెన్షన్ విధానం అమలు చేయాలని సీఎం కె.చంద్ర శేఖర్రావు నిర్ణయించారు. మిలటరీ, ఉద్యోగు లు, అమర సైనికుల కుటుంబ సంక్షేమం, ఉద్యోగుల సంక్షేమం తదితర అంశాలపై ప్రగతి భవన్లో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్రావు, పోలీసు ఉన్నతాధికారులు నవీన్చంద్, ఎంకే సింగ్, టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్, అధ్యక్షు డు కారం రవీందర్రెడ్డి, ప్రధాన కార్య దర్శి ఎం.రాజేందర్ పాల్గొన్నారు. ‘మిలటరీలో పనిచేసి రిటైరై, మరో ఉద్యోగం చేసి విరమణ పొందిన వారికి కేవలం ఒకే పెన్షన్ పొందే అవకాశం ఇప్పటివరకు ఉంది. అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో మాజీ సైనిక ఉద్యోగు లు పనిచేస్తే, మిలటరీ ఇచ్చే పెన్షన్తో సంబం ధం లేకుండా రాష్ట్ర సర్వీసు నిబంధనలను అనుసరించి పెన్షన్ ఇవ్వాలి’ అని సీఎం అన్నారు. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దేశ రక్షణకు ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబాల పట్ల యావత్ సమాజం సానుభూతితో ఉండాలని, ఆ కుటుంబ పోషణ బాధ్యత దేశం స్వీకరించాలని అన్నారు. సైనికులు, మాజీ సైనికులు, అమర సైనికుల కుటుంబాల సంక్షేమానికి రాష్ట్ర పరిధిలోని అంశాల విష యంలో ప్రభుత్వం ఉదారంగా వ్యహరిస్తుందని అన్నారు. మూడు దశాబ్దాలకు పైగా సర్వీసులో ఉండి సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం విషయంలోనూ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని తెలిపారు. సైనికుల నివాస గృహాలకు ఆస్తి పన్ను మినహాయింపు సైనికులు నిర్మించుకున్న నివాసాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. సదరు నివాస గృహం సైనికుడి పేరు మీద ఉన్నా, సైని కుడి భార్య పేరు మీదున్నా, ఎన్ని అంత స్తులున్నా సరే ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వాలని సూచించారు. ఇందుకు సంబం ధించి వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని, అధికారులు ఆ ప్రకారం నడు చుకోవాలని ఆదేశించారు. అమర సైనికుల భార్య (యుద్ధంలో మరణించిన సైనికుల భార్యలు – వార్ విడో)లకు ప్రభుత్వం తరఫున ఇచ్చే పెన్షన్ రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచినట్లు సీఎం వెల్లడిం చారు. సైనికులు, మాజీ సైనికులు, అమర సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం మరిన్ని చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. -
విశ్రాంత లోకో పైలెట్ల ఆత్మీయ కలయిక
విజయవాడ: విశ్రాంత లోకో పైలెట్ల ఆత్మీయ కలయిక కార్యక్రమం కొత్త సంఘ్ కార్యాలయంలో ఆదివారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతి«థిగా సంఘ్ డివిజనల్ కార్యదర్శి బండ్రెడ్డి వెంకట చలపతిరావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ లోకో పైలెట్ విధులు నిర్వహించడం కత్తి మీదసాము లాంటిదన్నారు. పదవీ విరమణ చేసి నేడు వారంతా ఆత్మీయంగా కలవడం శుభపరిణామమన్నారు. ఈ సందర్భంగా లోకోపైలెట్గా విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన 80 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారిని ఈ సందర్భంగా సంఘ్ డివిజనల్కార్యదర్శి చలపతిరావు సన్మానించారు. కార్యక్రమంలో సంఘ్కేంద్ర కమిటీ సభ్యుడు యడ్ల నాగేంద్రబాబు, ఆరోగ్య కార్యదర్శి బి.సత్యనారాయణ, తిరుమలరావు, ప్రకాశ్ పాల్గొన్నారు. -
విమానం.. పడవ ప్రయాణం..!
గాల్లో ఎగరాల్సిన విమానం ఇలా నీటిపైకి వచ్చిందేంటి అని అనుకుంటున్నారా? మీకే కాదు.. చాలా మందికి ఈ డౌట్ వచ్చింది. అందుకే అందరూ నోరెళ్లబెట్టి చూడ్డం మొదలుపెట్టారు. ఇంతకీ విషయమేమిటంటే.. ఈ విమానానికి ముప్పై ఏళ్లొచ్చాయి. దీంతో మూలనపడింది. ఇన్నేళ్లు సర్వీసు చేసిన ఈ బోయింగ్ ప్రయాణికుల విమానం రిటైర్ కావడంతో డేవిడ్ మెక్ గోవెన్ అనే వ్యాపారవేత్త 16 వేల యూరోలు పెట్టి దీన్ని కొన్నాడు. ఐర్లండ్లోని షానోన్ ఎయిర్పోర్టు నుంచి స్లిగో పట్టణానికి తీసుకెళ్లాలనుకున్నాడు. ట్రక్కులో తీసుకెళ్దామనుకుంటే.. ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని అధికారులు అనుమతి నిరాకరించడంతో ఇలా జలమార్గాన్ని ఆశ్రయించాడు. దీన్ని తన రిసార్ట్లో ప్రత్యేక ఆకర్షణగా ఉపయోగించుకోవాలని డేవిడ్ యోచిస్తున్నాడు. -
ట్విట్టర్ సంచలన నిర్ణయం
మైక్రోబ్లాగింగ్ సైట్ డైరెక్ట్ మెసేజ్ బాట్ విధానానికి స్వస్తి పలుకుతూ సంచలనం నిర్ణయం తీసుకుంది. వినియోగదారులు ప్రత్యక్ష సందేశాలను (డీఎం), ప్రముఖుల ఖాతాలను అనుసరించడానికి, వారి ట్వీట్లను ఫాలో అవ్వడానికి, సిఫార్సులను పంపడానికి ఉపయోగడే ప్రభావవంతమైన బాట్ 'మ్యాజిక్ రెక్స్'కి గుడ్ బై చెప్పింది. ఈమధ్యే ట్విట్టర్ ద్వారా మెసేజ్ చేసే పదాల సంఖ్య పెంచిన ట్విట్టర్, హోంపేజిలోని డైరెక్ట్ మెసేజ్ సర్వీస్ 'మ్యాజిక్ రెక్స్ సర్వీస్' నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించింది. స్నేహితులకు, ఫాలోవర్స్కు వ్యక్తిగత సందేశాలను ట్వీట్ చేసేందుకు కల్పించిన డైరెక్ట్ మెసేజ్ (డీఎం) సర్వీస్లకు వీడ్కోలు పలికింది. 2013లో లాంచ్ చేసిన మ్యాజిక్ రెక్స్కి గుడ్ బై చెప్పినట్టు వెల్లడించింది. అయితే పుష్ నోటిఫికేషన్స్ సదుపాయం మాత్రం అందుబాటులో ఉంటుందని పేర్కొంది. గతంలో మ్యాజిక్ రిక్స్ నుంచి డైరెక్ట్ మెసేజ్ ద్వారా పంపిన సందేశాలను ఇక మీదట పుష్ నోటిఫికేషన్ ద్వారా పంపుకోవచ్చని ట్విట్టర్ ప్రతినిధి తెలిపారు. కొత్త ఆల్గరిథమ్తో ప్రముఖుల ఖాతాలు కనిపించే విధానం తీసుకురావడంతో పాటు డైరెక్ట్ మెసేజ్ సర్వీస్లో అక్షరాల పరిమితి వల్ల ఇబ్బందిని గుర్తించామంటూ అక్షరాల పరిమితిని ఈ ఏడాదే గణనీయంగా పెంచిన ట్విట్టర్ డైరెక్ట్ మెసేజ్ బాట్ కు వీడ్కోలు చెప్పడం సంచలనంగా మారింది. ఇటీవల సీఈవో జాక్ డోర్సే మాట్లాడుతూ వినియోగదారులను మరింత చేరువ కాడానికి ప్రయత్నిస్తున్నట్టు పాత, కొత్త యూజర్లను ఆకర్షించేందుకు సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. 2015 మూడో త్రైమాసికంలో కొత్త యూజర్లను ఆకర్షించడంలోవిఫలమై, అంచనాలకు మించి చతికిలబడ్డ ఈ సంస్థ తాజా నిర్ణయంతో మరిన్ని కష్టాలను కోరి తెచ్చుకుంటోందా.. వేచి చూడాలి -
సనోఫీ నుంచీ తప్పుకుంటున్న మాల్యా
న్యూఢిల్లీ: ఇటీవలే యునెటైడ్ స్పిరిట్స్ చైర్మన్ హోదా నుంచి వైదొలిగిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా తాజాగా సనోఫీ ఇం డియా చైర్మన్గా కూడా రిటైరవుతున్నట్లు బుధవారం తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగే కంపెనీ వార్షిక సర్వ సభ్య సమావేశంలో మరోసారి డెరైక్టర్గా ఎన్నికను కోరబోనని తెలిపారు. ‘నేను 42 ఏళ్ల పైగా కంపెనీకి డెరైక్టరుగాను, 32 ఏళ్లకు పైగా బోర్డు చైర్మన్గా వ్యవహరించాను. ఇక రిటైరవ్వదల్చుకున్నాను’ అంటూ సంస్థ బోర్డ్ ఆఫ్ డెరైక్టర్స్కు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. బుధవారం సమావేశమైన సనోఫీ ఇండియా బోర్డు .. మాల్యా నిర్ణయాన్ని ఆమోదించింది. సనోఫీ ఇండియా గతంలో హెక్ట్స్ ఫార్మాస్యూటికల్స్గా పేరొందింది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కి సంబంధించి రూ. 9,000 కోట్ల పైగా రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యా ప్రస్తుతం దేశం విడిచి వెళ్లిపోవడం తెలిసిందే. -
క్రికెట్కు శుక్లా గుడ్బై
బెంగాల్ వెటరన్ ఆల్రౌండర్ లక్ష్మీ రతన్ శుక్లా క్రికెట్కు గుడ్బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం ప్రకటించాడు. ‘గత నెల రోజులుగా నాకు సరైన ప్రోత్సాహం లభించడం లేదు. తిరిగి ఆడటానికి మానసికంగా సిద్ధంగా లేను. నిద్ర కూడా సరిగ్గా పోవడం లేదు. ఇప్పుడు వీడ్కోలు పలికాను కాబట్టి ప్రశాంతంగా పడుకుంటా’ అని 34 ఏళ్ల శుక్లా వెల్లడించాడు. తన సేవలు అవసరం అనుకుంటే బగాన్ క్లబ్ తరఫున పని చేస్తానన్నాడు. భారత్ తరఫున మూడు వన్డేలు ఆడిన శుక్లా 18 పరుగులు చేశాడు. -
మునిసిపల్ కార్మికుల సమ్మె విరమణ
-
రూ. 70 లక్షలకు రిటైర్డ్ అడిషనల్ డీజీ టోపీ!
హైదరాబాద్: ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానని మోసగించిన ఓ రిటైర్డ్ పోలీసు అధికారిపై బుధవారం కేసు నమోదు అయింది. వివరాలు.. ఓఎన్జీసీలో పనిచేస్తున్న ఉదయ్ కుమార్ అనే వ్యక్తి ఎంబీబీఎస్ సీటుకోసం రిటైర్డ్ అడిషనల్ డీజీ మదన్లాల్ను ఆశ్రయించాడు. రూ. 70 లక్షలు ఇస్తే మెడిసిన్ సీటు ఇప్పిస్తానని మదన్ లాల్ నమ్మబలికాడు. దాంతో ఉదయ్ కుమార్ అతడు అడిగిన మొత్తం రూ. 70 లక్షలను ముట్టజెప్పాడు. అయితే సీటు ఇప్పించకపోగా, తీసుకున్న డబ్బు వెనక్కి ఇవ్వమని అడిగితే నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీంతో బాధితుడు హైటెక్ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉదయకుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ 403, 406, 420, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిరాశా బడ్జెట్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జీతాల పెంపుతో సంతోషాల్లో మునిగితేలుతున్న ఉద్యోగులకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ పెద్ద షాక్ ఇచ్చారు. ఆదాయ పన్ను రాయితీని యథాయథంగా కొనసాగించడంతో జిల్లాలోని 90 శాతం ఉద్యోగులపై పన్ను భారం పడనుంది. 25 వేల రూపాయల పైచిలుకు జీతం తీసుకున్న ఉద్యోగులంతా ఆదాయపు పన్ను చెల్లించక తప్పదు. దీనివల్ల గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులే కాకుండా నాలుగో తరగతి ఉద్యోగులు సైతం పెద్ద ఎత్తున ఆదాయ పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో 35,222 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, 21,533 మంది రిటైర్డు ఉద్యోగులున్నారు. పెరిగిన వేతనాలతో వీరిలో 90 శాతం మందికిపైగా తాజాగా ఆదాయపు పన్ను పరిధిలోకి రానున్నారు. ఆదాయపు పన్ను రాయితీ పెంచితే కొంతమేరకైనా ఉపశమనం పొందుదామని భావించిన వీరందరికీ నిరాశే ఎదురైంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంపై ఆధారపడిన రైతాంగానికి పెద్దగా ప్రయోజనాలు కలిగించే అంశాలేవీ ఈ బడ్జెట్లో లేకపోవడం గమనార్హం. సిమెంట్ ధరల పెంపుతో తాజాగా ఇంటి నిర్మాణం భారం కానుంది. సొంతింటి కలను నిజం చేసుకోవాలని ఆశపడుతున్న మధ్యతరగతి వర్గాలకు ఇది మరింత భారం కానుంది. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలను తగ్గించిన కేంద్రం... వాటికి ఉపయోగించే కేబుల్, డీటీహెచ్, ఇతరత్రా సేవలను పెంచడంతో వాటిని ఉపయోగిస్తున్న జిల్లాల్లోని లక్షలాది మందిపై భారం పడనుంది. టీవీలు, ఎలక్ట్రానిక్స్ పరికరాల ధరలు తగ్గే అవకాశాలు ఉండటంతో ఈ మేరకు అమ్మకాలు పెరుగుతాయని వ్యాపారు లు భావిస్తున్నారు. ప్రస్తుతం 12 శాతం ఉన్న సే వా పన్నును తాజా బడ్జెట్లో 14 శాతానికి పెం చడంతో ఆ మేరకు భారం ప్రజలపై పడనుంది. చివరకు కుటుంబంతో, స్నేహితులతో కలిసి హోటల్కు వెళ్లి భోజనం చేయాలని ఆశపడే వా రు కూడా పెరిగిన సర్వీస్ ట్యాక్స్కు సరిపడా డ బ్బులున్నాయా? లేవా? చూసుకుని వెళ్లాల్సిందే. ప్రాణహితకు మోక్షం లేనట్లే! తెలంగాణకు మణిహారమైన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పిస్తామని హామీ ఇచ్చిన కేంద్రం బడ్జెట్లో ఆ ఊసే ప్రస్తావించలేదు. తద్వారా కరీంనగర్ జిల్లాలో 1,71,449 ఎకరాల ఆయకట్టును అందించే ఈ ప్రాజెక్టుకు ఇప్పట్లో మోక్షం కలిగే అవకాశాలే కన్పించడం లేదు. -
రియో ఒలింపిక్స్ తర్వాత రిటైర్: మేరీకోమ్
గువాహటి: వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్ తర్వాత తన కెరీర్కు గుడ్బై చెప్పే అవకాశం ఉందని బాక్సర్ మేరీ కోమ్ తెలిపింది. ‘ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ రియో ఒలింపిక్స్ అనంతరం బాక్సింగ్లో కొనసాగకపోవచ్చు. రిటైర్ అయ్యే అవకాశాలే ఎక్కువ. ప్రస్తుతానికైతే భారత్కు మరిన్ని పతకాలు అందించాలనే ఉద్దేశంతో కఠోరంగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ ఏడాది కొన్ని అంతర్జాతీయ ఇన్విటేషన్ టోర్నీలు ఆడతాను. ఈశాన్య రాష్ట్రాల్లో నైపుణ్యం కలిగిన ఆటగాళ్లున్నా పతకాలు సాధించలేకపోతున్నారు. ఇందుకోసం నా శాయశక్తులా సహకారం అందిస్తా’ అని మేరీ కోమ్ తెలిపింది. -
మళ్లీ టెస్టుల్లోకి వెటోరీ
వెల్లింగ్టన్: ఇక క్రికెట్ నుంచి రిటైర్ అవుతాడని అనుకుంటున్న సమయంలో న్యూజిలాండ్ స్పిన్నర్ వెటోరీ అనూహ్యంగా టెస్టు జట్టులోకి వచ్చాడు. రెండేళ్లుగా టెస్టులకు దూరంగా ఉంటూ కేవలం వన్డేలు, టి20లు ఆడుతున్న వెటోరీని... పాకిస్థాన్తో బుధవారం జరగనున్న మూడో టెస్టు కోసం న్యూజిలాండ్ సెలక్టర్లు ఎంపిక చేశారు. ముగ్గురు స్పిన్నర్లు జట్టులో ఉండాలని భావించిన సెలక్టర్లు... యూఏఈలోనే న్యూజిలాండ్ ‘ఎ’ జట్టుతో ఉన్న వెటోరీని పిలిపించింది. ఈ మ్యాచ్ ఆడితే న్యూజిలాండ్ తరఫున టెస్టు క్రికెట్ ఆడిన పెద్ద వయస్కుడిగా 35 ఏళ్ల వెటోరీ రికార్డు సృష్టిస్తాడు. -
భారంగా ఓ ఏడాది..!
ప్రియమైన సచిన్, అప్పుడే నువ్వు ఆటను వదిలేసి ఏడాది గడిచింది. ఇది జీర్ణించుకోవడం ఇంకా కష్టంగానే ఉంది. నీ ఆటను చూస్తూ పెరిగిన మాకు... ఈ ఏడాదంతా నీ జ్ఞాపకాలే సరిపోయాయి. నువ్వు రిటైరైన రోజే... భారతరత్న ప్రకటించగానే మా గుండె సంతోషంగా ఉప్పొంగింది. ఇక మైదానంలో నిన్ను చూడలేమనే బాధ ఆ ఆనందాన్ని మింగేసింది. పులి ఎక్కడున్నా పులే... సచిన్ ఆడినా ఆడకున్నా సచినే. అందుకే ఏడాదంతా నీ గురించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. 24 ఏళ్ల పాటు కుటుంబానికి దూరంగా ప్రపంచం అంతా తిరిగి మాకు వినోదాన్ని పంచిన నీకు ఇక విశ్రాంతి దొరుకుతుందిలే అనుకున్నాం. కానీ నువ్వు మాత్రం కాళ్లకు బలపాలు కట్టుకుని ప్రపంచం అంతా తిరుగుతున్నావ్. ఈ రోజు లండన్లో ఉంటే... ఉదయాన్నే కొచ్చిలో కనిపిస్తున్నావ్. ఆ మరుసటి రోజే మరో దేశంలో దర్శనమిస్తున్నావ్. ఇంకా ఇంత ఓపిక ఎక్కడిది. నీకు అలుపే రాదా? ఇప్పటికీ నీ ఇంటికి క్యూ కట్టే స్పాన్సర్లను చూస్తే ఎవరికైనా తెలుస్తుంది నీ విలువ ‘అమూల్యమని'. పార్లమెంట్కు రాలేదని గగ్గోలు పెట్టే విమర్శకులకేం తెలుసు... నువ్వు బయటే చాలా సేవ చేస్తున్నావని. ‘అప్నాలయా’లోని చిన్నారులకు తెలుసు నీ మనసేమిటో..! ‘యూనిసెఫ్’ అధికారులకు తెలుసు నీ సమయం ఎంత విలువైనదని. స్ఫూర్తి నింపడంలో నీకు నువ్వే సాటి. ప్రధాని ‘స్వచ్ఛ భారత్’ అనగానే... వెళ్లి చీపురు పట్టావ్. పుట్టిన రోజు నాడు విహారయాత్రను వదిలేసి వచ్చి మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటేసి... ఓటు విలువ ఎంతో చెప్పావ్. బైపాస్ సర్జరీ చేయించుకున్న సోదరుడికి సేవలు చేసి కుటుంబానికి అండగా నిలిచావ్. ‘ఎయిర్ఫోర్స్ డే’ వేడుకలకు వెళ్లి... దేశం కోసం కష్టపడేవాళ్లను సంతోషపెట్టావ్. ఈ ఏడాది మా రాష్ట్రాలకూ బాగానే వచ్చావ్. హైదరాబాద్ ప్యారడైజ్ హోటల్లో, విజయవాడలో మాల్ ఓపెనింగ్లో... నువ్వు ఎక్కడకు, ఎప్పుడు వచ్చినా మేం ఈగల్లా ముసురుకున్నాం. అయినా విసుక్కోలేదు. వీలైనంతగా మమ్మల్ని కలిసే ప్రయత్నం చేశావ్. అన్నింటికంటే ముఖ్యంగా మా తెలుగు గ్రామాన్నే దత్తత చేసుకున్నావ్. చాలామంది ఎంపీలు వాళ్ల రాష్ట్రంలోని గ్రామాలకే పరిమితమైతే... నువ్వు మా తెలుగు ప్రజల మీద ప్రేమ చూపించావ్. రిటైరయ్యాక ఎనిమిది నెలలకు లార్డ్స్లో నువ్వు మళ్లీ వన్డే ఆడితే మా మది పులకించింది. ఆ రోజు నువ్వు బ్యాటింగ్కు వస్తుంటే... ఇంగ్లండ్లో అభిమానులు నీకు ఇచ్చిన స్టాండింగ్ ఒవేషన్ చూసి... ఓ భారతీయుడిగా గర్వించా. ఈ దేశం నీ మీద చూపించిన ప్రేమకు రుణం తీర్చుకుంటున్నావ్ అనిపిస్తోంది. ఆటంటే క్రికెట్ ఒక్కటే కాదు... మిగిలిన ఆటలూ బాగా ఎదగాలన్న నీ తపన నీ మీద అభిమానాన్ని మరింత పెంచింది. ఫుట్బాల్ కోసం ‘ఐఎస్ఎల్’లో భాగం అయ్యావ్. హాకీ జట్టు క్యాంప్కు వెళ్లి వాళ్లలో స్ఫూర్తి పెంచావ్. ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన వారిని దగ్గరకు వెళ్లి అభినందించావ్. నీ కీర్తికిరీటంలో లేని అవార్డులేంటి? అయినా రిటైరయ్యాక నిన్ను పరాయి దేశస్థులూ సత్కరిస్తుంటే ముచ్చటేస్తోంది. ‘బ్రాడ్మన్ హాల్ ఆఫ్ ఫేమ్’లో నీకు చోటు దక్కింది. అందులో చోటు నీకు కాకుంటే ఇంకెవరికైనా దక్కుతుందా? నీకంటే అర్హులున్నారా? లేరు. ఇదుగో అదిగో అంటుండగానే నీ ఆత్మకథ వచ్చేసింది. గతంలో చాపెల్ అంటే మాకు మంచి అభిప్రాయం లేకపోయినా... ఎప్పుడూ వివాదాల జోలికి పోని నువ్వే చాపెల్ను విమర్శించావంటే... మేం అతడిని చీదరించుకున్నాం. నీ జీవితాన్ని తెరచిన పుస్తకం చేసి... నీ అనుభవాల పాఠాలను తర్వాతి తరానికి అందించావ్. ‘సచిన్ రిటైరయ్యాక మ్యాచ్లు చూడటం మానేశా’... ఇలాంటి మాటలనూ విన్నాం. నువ్వు లేని క్రికెట్ను చూడలేమని అనుకుంటూనే... ఆటపై అభిమానాన్ని చూపిస్తూనే ఉన్నాం. లార్డ్స్లో మనోళ్లు 28 ఏళ్ల తర్వాత టెస్టు గెలిస్తే సంబరపడ్డాం. రోహిత్ డబుల్ సెంచరీకి చిందులు వేశాం. ఇంగ్లండ్లో ఫామ్ కోల్పోయిన విరాట్ కోహ్లిని నువ్వు దగ్గరుండి పాఠాలు నేర్పించి మళ్లీ గాడిలో పెట్టావ్. అక్కడే మళ్లీ మరోసారి మా మనసు దోచుకున్నావ్. ఒక్క విరాట్కే ఎందుకు... మొత్తం భారత క్రికెట్కే సరైన నిర్దేశనం చేయొచ్చుగా. అర్జున్ను మైదానంలో చూడాలనుకుంటున్నాం. నీకంటే మార్గ నిర్దేశనం చేయగలవారెవ్వరు? కాస్త తన ఆట కోసం సమయం కేటాయించు. వీలైనంత త్వరగా మా ముందుకు తీసుకురా. కొంత విశ్రాంతి తర్వాతైనా... మళ్లీ నిన్ను మైదానంలో చూసే అవకాశం కల్పించు. భవిష్యత్లో భారత్ కోచ్గా నిన్ను చూడాలని ఉంది. నేను సాధారణ సచిన్నే అని నువ్వు చెప్పినా... మా క్రికెట్ దేవుడివి మాత్రం నువ్వే. నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. నువ్వు ఆటకు దూరమైనా మా మనసులో మాత్రం ఎల్లకాలం ఉంటావు. - నీ అభిమాని (గత ఏడాది సరిగ్గా ఇదే రోజు (నవంబరు 16) సచిన్ టెండూల్కర్ క్రికెట్కు వీడ్కోలు చెప్పాడు) -
ఎస్వీయూ నాక్ కో-ఆర్డినేటర్ రాజీనామా
యూనివర్సిటీ క్యాంపస్ : ఎస్వీ యూనివర్సిటీలో నాక్ కో-ఆర్డినేటర్గా పనిచేస్తున్న ప్రొఫెసర్ డీసీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఎస్వీయూ ఆక్వా కల్చర్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డీసీ రెడ్డి 2013 ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ చేశారు. అనంతరం నాక్ కో-ఆర్డినేటర్గా నియమితులై 20 నెలలపాటు పనిచేశారు. రెండు నెలలుగా రాజీనామా విషయమై తర్జనభర్జన పడుతున్నారు. ఎట్టకేలకు రెండు రోజుల క్రితం వీసీ రాజేంద్రను కలిసి రాజీనామా పత్రం సమర్పించారు. రాష్ట్రంలో పది సంవత్సరాల తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చింది. క్యాంపస్లోని టీడీపీ సానుభూతిపరులు పదవుల పట్ల ఆశలు పెట్టుకున్నారు. అప్పటి వరకు పదవుల్లో కొనసాగిన అధికారులు ఒక్కొక్కరే తప్పుకుంటున్నారు. ఫైనాన్స్ సలహాదారుగా ఉన్న ప్రొఫెసర్ వీ.కోదండరామిరెడ్డి జూలైలో రాజీనామా చేశారు. మీడియా డీన్గా పనిచేసిన ప్రొఫెసర్ పేట శ్రీనివాసులురెడ్డి గత నెలలో రాజీనామా చేశారు. ఇప్పుడు డీసీ రెడ్డి కూడా వారిబాటనే అనుసరించారు. మరికొంతమంది అధికారులు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు క్యాంపస్లో ప్రచారం జరుగుతోంది. కొత్త అధికారుల నియామకం ఎస్వీయూలో కొత్త అధికారుల నియామకం కొనసాగుతోంది. రిజిస్ట్రార్గా పనిచేసిన సత్యవేలురెడ్డి స్థానంలో ప్రొఫెసర్ ఎం.దేవరాజులు నియమితులయ్యారు. సీడీసీ డీన్గా పనిచేసిన శ్రీకాంత్రెడ్డి స్థానంలో త్యాగరాజు నియమితులయ్యారు. పరీక్షల విభాగం గౌరవ డెరైక్టర్గా ప్రొఫెసర్ కిరణ్కాంత్ చౌదరి, డీడీఈ ఆన్లైన్ ఎగ్జామ్స్, ఆన్లైన్ అడ్మిషన్ గౌరవ డెరైక్టర్గా ప్రొఫెసర్ పీ.గోవిందరాజులు నియమితులయ్యారు. ఈ ఇద్దరు ప్రొఫెసర్లు సర్వీసు నుంచి రిటైర్డ్ అయ్యారు. ఉచితంగా సేవ చేసేందుకు ముందుకు రావడంతో వారిని పై పదవుల్లో నియమించారు. మీడియా డీన్ పోస్టుకు తీవ్ర పోటీ ఎస్వీ యూనివ ర్సిటీలో మీడియా డీన్ పోస్టుకు తీవ్ర పోటీ నెలకొంది. ఈ పదవిలో కొనసాగిన పేట శ్రీనివాసులురెడ్డి గత నెలలో రాజీనామా చేశారు. ఈ పదవి కోసం పలువురు పోటీ పడుతున్నారు. అకడమిక్ స్టాఫ్ కళాశాలకు చెందిన వెంకటరమణ, ప్రాచ్య పరిశోధనకు చెందిన పీసీ.వెంకటేశ్వర్లు మధ్య పోటీ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. -
రిటైర్డ్ హబ్బీ సిండ్రోమ్!
నేర్చుకుందాం! మార్చుకుందాం! పదవీ విరమణ అనేది సాధారణ విషయం. అయితే ఆడవాళ్లకు మాత్రం ఇది అసాధారణ భయంగా మారుతుంది. రిటైర్ కాబోయే భర్తలను తలుచుకుంటూ భార్యలు గడగడలాడుతున్నారట. దీనికి కారణం పదవీ విరమణ పొందిన భర్తల నుంచి రకరకాలుగా ఇబ్బందులు ఎదురుకావడం. దీనివల్ల నిద్రలేమి, కృంగుబాటు... తదితర సమస్యలతో మహిళలు బాధపడుతున్నారు. పదవీ విరమణ పొందిన భర్త నుంచి భార్య ఎదుర్కొనే సమస్యను ‘రిటైర్డ్ హబ్బీ సిండ్రోమ్’ అని పిలుస్తున్నారు. ఉద్యోగం చేస్తున్నప్పటితో పోల్చితే, విరమణ తరువాత పురుషుల మానసిక స్థితిలో చాలా మార్పులు కనిపిస్తున్నాయట! చాలామంది పురుషులు తమ ఉద్యోగ విరమణ తాలూకు బాధను, అసంతృప్తిని రకరకాల మార్గాలలో స్త్రీలపై ప్రదర్శిస్తున్నారట. ‘‘ఉద్యోగం చేసే స్త్రీలపై ఈ సిండ్రోమ్ ప్రభావం అధికంగా ఉంది. ఒకవైపు ఉద్యోగం తాలూకు ఒత్తిడి, మరోవైపు పదవీ విరమణ పొందిన భర్త నుంచి రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు’’ అంటున్నారు ఇటాలియన్ పరిశోధకులు. ఇది కేవలం ఒకటి రెండు దేశాలకే పరిమితమైన సమస్య కాదని ‘ప్రపంచ సమస్య’ అని అంటున్నారు ‘పడోవ యూనివర్శిటీ’కి చెందిన డా. మార్క్ బెర్టోని అనే సామాజిక శాస్త్రవేత్త. ఈ నేపథ్యంలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, విరమణ తీసుకోనున్న వారి కోసం కొన్ని సూచనలు.... * ఎప్పుడూ తీరిగ్గా కూర్చుని, ఏదో ఆలోచించకుండా ఏదో ఒక పని చేస్తూ ఉండండి. దీనివల్ల శరీరం, మనస్సు చురుగ్గా ఉంటాయి. *ఉద్యోగం చేస్తున్న సమయంలో ఇంటిపనికి అవసరమైన టైమ్ కేటాయించడం కుదరకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు వీలైనంత ఎక్కువగా ఇంటిపనుల్లో పాలుపంచుకోండి. * పదవీ విరమణ అంటే ‘పదవి’కి మాత్రమే ‘విరమణ’, మనసుకు కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి మనసును ఎప్పుడూ ఉల్లాసంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. విహారయాత్రలకు ప్రాధాన్యత ఇవ్వండి. * పుస్తకాలు చదవడం, పాత సినిమాలు చూడడం, పజిల్స్ నింపడం ద్వారా ఉల్లాసంగా ఉండవచ్చు. * మీ మాటలతో భార్యను ఇబ్బంది పెట్టవద్దు. ఒకవేళ మాట తూలినా ‘సారీ’ చెప్పడం మరవకండి. -
టెస్టు క్రికెట్కు జయవర్ధనే గుడ్బై
పాకిస్థాన్తో సిరీసే ఆఖరు కొలంబో: శ్రీలంక సీనియర్ బ్యాట్స్మన్ మహేల జయవర్ధనే టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ కానున్నాడు. ఆగస్టులో పాకిస్థాన్తో జరగనున్న సిరీస్ అనంతరం అతడు టెస్టుల నుంచి తప్పుకోనున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే టి20 ఫార్మాట్కు గుడ్బై చెప్పిన 37 ఏళ్ల జయవర్ధనే.. వన్డేల్లో మాత్రం కొనసాగుతాడని తెలిపింది. 1997లో భారత్తో జరిగిన మ్యాచ్తో టెస్టుల్లో అరంగేట్రం చేసిన జయవర్ధనే కెరీర్లో145 మ్యాచ్లాడి 11,493 పరుగులు చేశాడు. ఇందులో 33 సెంచరీలు, 48 అర్ధసెంచరీలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా, పాకిస్థాన్లతో సిరీస్లను కలిపితే అతని టెస్టుల సంఖ్య 149కి చేరనుంది. 18 ఏళ్లపాటు దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం తన అదృష్టమని, కఠిన నిర్ణయమే అయినా.. రిటైర్మెంట్కు ఇదే సరైన సమయమని భావించినట్లు జయవర్ధనే తెలిపాడు. ఆమ్లా ‘కొత్త చరిత్ర’ గాలె: శ్రీలంక-దక్షిణాఫ్రికా మధ్య బుధవారం ప్రారంభం కానున్న తొలిటెస్టులో చరిత్రాత్మక దృశ్యం ఆవిష్కృతం కానుంది. దక్షిణాఫ్రికా జట్టుకు తొలిసారిగా శ్వేత జాతీయేతర ఆటగాడు హషీం ఆమ్లా పూర్తిస్థాయి కెప్టెన్గా సారథ్యం వహించనున్నాడు. -
సమస్యకు సామరస్య పరిష్కారం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన ఫిర్యాదులు రోజురోజుకు పెరుగుతున్న నే పథ్యంలో వాటి పరిష్కారానికి గుంటూరు నగరంలో ఉచిత న్యాయాధికార సంస్థ ఏర్పాటు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ సెంటరు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపనున్నారు. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు కానున్నదనే ప్రచారం జరుగుతుండటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం అనూహ్యంగా ఊపందుకుంది. ఇతర జిల్లాల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొనుగోలుదారులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆస్తుల క్రయవిక్రయాలు నిత్యం జరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు చదరపు గజం రూ.రెండు వేలు పలకని స్థలాల ధరలు రూ. పదివేలకు పెరిగాయి. దీంతో ఈ రంగానికి అన్ని వర్గాలు చేరువయ్యాయి. ప్రతీ గ్రామంలో కనీసం పది మంది వ్యక్తులు రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా అవతారమెత్తి ఆస్తుల క్రయ విక్రయాలను జరుపుతున్నారు. వీరికితోడు రాజకీయ నేతల ముఖ్య అనుచరులు, నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు ఈ వ్యాపారంలోకి ప్రవేశించడంతో అక్రమాలూ పెరిగాయి. ఒకే స్థలాన్ని ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు విక్రయించడం, విలువైన స్థలాలను కబ్జా చేయడం సర్వసాధారణమైంది. రిటైర్డ్ ఉన్నతాధికారుల స్థలాలను కూడా కబ్జా చేసే స్థాయికి ఈ అక్రమార్కులు పెరిగారు. 90 శాతం ఫిర్యాదులు భూములకు సంబంధించినవే.. ప్రతీ పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదుల్లో 90 శాతం స్థలాల కబ్జాలు, దొంగ రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్ ప్రకారం నగదు చెల్లింపులు జరగడం లేదనేవే ఎక్కువగా ఉంటున్నాయి. ఆ ఫిర్యాదులను స్వీకరించి బాధితుల నుంచి వివరాలు సేకరించడానికే పోలీసులకు సమయం సరిపోవడం లేదు. వీటిపై పూర్తి స్థాయి విచారణ జరిపి కేసులు పరిష్కరించేందుకు అవసరమైన సిబ్బంది, సమయం కూడా పోలీస్శాఖకు లేదు. వీటిలో జోక్యం చేసుకుంటే సివిల్ కేసుల్లో పోలీసుల జోక్యం పెరుగుతుందనే ఆరోపణలు వచ్చే అవకాశాలు ఉండటంతో పోలీస్ ఉన్నతాధికారులు ప్రి లిటిగేషన్ సెంటరు ఏర్పాటు చేయాలనే ఆలోచనకు వచ్చారు. అర్బన్ ఎస్పీ జెట్టి గోపీనాథ్ ఈ రంగంలో జరుగుతున్న అక్రమాలపై ఇప్పటికే ఒక అవగాహనకు రావడంతోపాటు స్పెషల్ బ్రాంచ్ ద్వారా పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఈ రంగానికి సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి చట్టపరంగా అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఉచిత న్యాయాధికార సంస్థ ఏర్పాటు ఆవశ్యకతను జిల్లా యంత్రాంగానికి వివరించనున్నారు. -
మలి వయసులో మారాజులా..
ఉద్యోగం నుంచి రిటైరయ్యాక ఒడిదుడుకుల్లేని జీవితం కోసం తప్పనిసరిగా పొదుపు చేయాలి, పెట్టుబడులు పెట్టాలి. ప్రస్తుత ఆదాయమెంత, అందులో ఎంత మొత్తాన్ని పొదుపు చేయగలరు, ఏ వయసులో రిటైర్ కావాలనుకుంటున్నారు, అప్పటికి మీకు ఎంత మొత్తం అవసరం అవుతుంది... తదితర అంశాలన్నిటినీ రిటైర్మెంట్ అనంతర ప్రణాళిక కోసం పరిగణనలోకి తీసుకోవాలి. వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, ఆరోగ్య సంరక్షణ ఖర్చుల అంచనాలను కూడా రూపొందించుకోవాలి. అప్పటికి ఎంత సొమ్ము అవసరమో మదింపు చేస్తే ఇప్పుడు ప్రతి నెలా లేదా ఏటా ఎంత పెట్టుబడి పెట్టాలో సుమారుగా తెలుసుకోవచ్చు. మాసిక లేదా వార్షిక పెట్టుబడి లెక్క పూర్తయిన తర్వాత, రిస్క్ ప్రొఫైల్, ఆదాయ అంచనాల ఆధారంగా వివిధ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లలో మీకు తగినదాన్ని ఎంచుకోవచ్చు. ప్రాచీన పెట్టుబడి సిద్ధాంతం ఏమిటంటే... ఓ వ్యక్తి యౌవనంలో ఉన్నపుడు రిస్కు ఉండే ఆస్తుల్లో ఇన్వెస్ట్ చేయాలి. వయసు పైబడిన వారైతే సురక్షిత ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టాలి. రిటైర్మెంటుకు దగ్గరపడిన వారు రిస్కులకు దూరంగా ఉండాలి. ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలోనే పొదుపు చేయడం ప్రారంభిస్తే... రిటైర్మెంటుకు దాదాపు 30 ఏళ్ల వ్యవధి ఉంటుంది కాబట్టి అప్పటికి భారీమొత్తం చేతికి అందుతుంది. ప్రతి వ్యక్తీ తన నికర ఆదాయంలో 20 శాతాన్ని పెట్టుబడులకు కేటాయించాలి. ఇందులో సగాన్ని రిటైర్మెంట్ తర్వాతి అవసరాలకు ఇన్వెస్ట్ చేయాలి. ఖర్చులు తగ్గించాలి... పెట్టుబడులు చేయడానికి ముందు మీ ఆదాయాన్నీ, ఖర్చులనూ 2 నెలలపాటు నిశితంగా పరిశీలించండి. ఏయే ఖర్చులను తగ్గించుకోవచ్చో గమనించండి. ఇప్పటి అవసరాల కంటే రిటైర్మెంట్ తర్వాత అవసరాలు ఎక్కువగా ఉంటాయని గుర్తుంచుకోండి. ఆసుపత్రి ఖర్చులు, తదితరాలు రిటైర్మెంట్ తర్వాత పెరుగుతాయి కదా. పదవీ విరమణ తర్వాత ఇల్లు కొనుక్కోవడం, దేశ విదేశీ పర్యటనలు వంటి ఆలోచనలుంటే మీ ప్లానింగ్ కూడా అందుకు తగినట్లుగా ఉండాలి. ముఖ్యమైన అంశాలు... సాధ్యమైనంత త్వరగా పొదుపు, పెట్టుబడులు ప్రారంభించాలి. అనవసర వ్యయాలకు కళ్లెం వేయాలి. రిటైర్మెంట్ తర్వాత ఎంత సొమ్ము అవసరమవుతుందో అంచనా వేయాలి. భవిష్యత్తులో ఊహించని కొన్ని ఖర్చులుంటాయి కాబట్టి వాటికీ కొంతమొత్తాన్ని కేటాయించాలి. రిటైర్మెంట్ ఫండ్ కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు మంచివేకానీ, వేటిల్లో పెట్టుబడులు చేశామన్నది నిరంతరం సమీక్షిస్తూ ఉండాలి, అవసరమైనపుడు మార్పులు చేయాలి. ఓ వ్యక్తి రిటైర్మెంట్ ప్లాన్ను ఇపుడు పరిశీలిద్దాం.. ప్రస్తుత వయసు 30 ఏళ్లు రిటైర్మెంట్ వయసు 55 ఏళ్లు ప్రస్తుత నెలవారీ ఖర్చులు రూ.30 వేలు రిటైరైన తర్వాత నెలవారీ ఖర్చులు రూ.1,28,756 ద్రవ్యోల్బణ రేటు 6 శాతం రిటైర్మెంట్ తర్వాత కావలసిన సొమ్ము రూ.3,70,93,740 (నోట్: ఈ వ్యక్తికి 90 ఏళ్లు వచ్చే వరకు అవసరమైన సొమ్ము ఇది. రిటైర్మెంట్ తర్వాత రీ-ఇన్వెస్ట్మెంట్ రేటును 8 శాతంగా లెక్కించాం) నెలవారీ చేయాల్సిన పెట్టుబడులు రాబడి నెలవారీ పెట్టుబడులు 8 శాతం రూ.39,004 10 శాతం రూ.27,957 12 శాతం రూ.19,743 -
అంతర్జాతీయ టి20లకు సంగక్కర గుడ్బై
ప్రపంచకప్ తర్వాత కొలంబో: ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ టి20ల నుంచి రిటైర్ కానున్నట్లు శ్రీలంక బ్యాట్స్మన్ కుమార సంగక్కర తెలిపాడు. బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ టోర్నీయే ఈ ఫార్మాట్లో తనకు చివరి అంతర్జాతీయ టోర్నీ అని సంగక్కర ప్రకటించాడు. అయితే ఐపీఎల్ వంటి లీగ్లలో మాత్రం టి20ల్లో ఆడతానని, వన్డేల్లో కనీసం వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచకప్ దాకా కొనసాగుతానని 36 ఏళ్ల సంగక్కర వెల్లడించాడు. ఇప్పటిదాకా 50 అంతర్జాతీయ టి20 మ్యాచ్లు ఆడిన సంగక్కర.. 32.77 సగటు, 120 స్ట్రైక్ రేట్తో 1311 పరుగులు సాధించాడు. వరుసగా ఐదు టి20 ప్రపంచకప్లలోనూ శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించిన ఈ మాజీ కెప్టెన్.. తమ జట్టు గత పొరపాట్లను ఈసారి పునరావృతం చేయబోదన్నాడు. 2009, 2012 ప్రపంచకప్లలో లంక ఫైనల్లో ఓడిన సంగతి తెలిసిందే. -
భూమి, బంగారం...ఏది బెటర్?
మావారు రెండు నెలల్లో రిటైర్ అవుతారు. ఉద్యోగ విరమణతో రూ. 20 లక్షలు వస్తాయి. ఆ డబ్బుతో భూమి కొనాలని ఆయన ఆలోచన. నాకు మాత్రం 4, 5 లక్షలతో బంగారు ఆభరణాలు చేయించుకోవాలని ఉంది. మా పుట్టింటివారు పెట్టిన బంగారం ఇంట్లో అవసరాలకు తాకట్టులోకి పోయి మాయం అయింది. నా ఒంటి మీద బంగారం లేక బంధువుల ఇళ్లల్లో వేడుకలకి కూడా వెళ్లేదాన్ని కాను. ఇప్పుడైనా నా కోరిక తీర్చుకోవడం న్యాయమే కదా! - అహల్యాబాయి, తిరుపతి స్త్రీ స్వాభావికంగా భద్రతకి ప్రాధాన్యత ఇస్తుంది. బంగారం వల్ల ఆర్థిక భద్రత వస్తుందని, అత్యవసర పరిస్థితుల్లో బంగారు ఆభరణాలు తాకట్టుపెట్టి అయినా డబ్బు తీసుకునే వీలుంటుందని ఆమె నమ్మకం. మీ ఆయన తన పేరుతో బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేస్తే వాటికి ఎప్పుడైనా రెక్కలొచ్చి ఎగిరిపోవచ్చు. అదే బంగారు ఆభరణాలు అయితే అందాన్నిచ్చే అత్యవసర నిధిగా మిమ్మల్ని విడిచిపోకుండా మీ ఒంటిమీద ఉంటాయి. ప్రభుత్వాలే బంగారు రిజర్వ్లను పెంచుకుంటున్నప్పుడు మీరు బంగారు ఆభరణాలు కోరుకోవడంలో తప్పు లేదు. అయితే రియల్ ఎస్టేట్ పెట్టుబడిలో సరైన ధరకి మంచి భవిష్యత్తు ఉన్న భూమి దొరికితే, మీరు మీ వారికి సహకరించడమూ అవసరమే. దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో నిర్ణయించుకోవడం మంచిది. బంగారం భారీగా పెరగకపోయినా భారీగా మాత్రం తగ్గదు. భూమి అలా కాదు. ఎక్కువ రేటు పెరుగుతుంది, పైగా ఎన్నటికీ తగ్గదు. కాబట్టి కొంత డబ్బు బంగారానికి వెచ్చిస్తూనే ఎక్కువ డబ్బు స్థలంపై పెట్టుకోవడం మంచిది. - వంగా రాజేంద్రప్రసాద్ -
జస్టిస్ రవిశంకర్ పదవీ విరమణ
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.రవిశంకర్ బుధవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. ఇందుకోసం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్జ్యోతి సేన్గుప్తా నేతృత్వంలో న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి, అదనపు ఏజీలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్తోపాటు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎ.గిరిధరరావు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. జస్టిస్ రవిశంకర్ న్యాయవ్యవస్థకు అందించిన సేవలను ఈ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ కొనియాడారు. అనంతరం రవిశంకర్ మాట్లాడుతూ ఇన్నేళ్ల తన న్యాయవ్యవస్థ ప్రస్థానంలో తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత న్యాయవాదుల సంఘం ప్రతినిధులు జస్టిస్ రవిశంకర్ దంపతులను ఘనంగా సన్మానించారు. వారికి ప్రధాన న్యాయమూర్తి జ్ఞాపికను బహూకరించారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు వేణుమాధవ్, కార్యదర్శులు పాశం కృష్ణారెడ్డి, డి.ఎల్.పాండు, సంయుక్త కార్యదర్శి పీఎస్పీ సురేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. జస్టిస్ రవిశంకర్ 1951 ఆగస్టు 16న గుంటూరులో జన్మించారు. 1975లో ఉస్మానియా వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1976లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. తన తండ్రి ఎన్.చంద్రమౌళి వద్ద జూనియర్గా చేరి వృత్తిలో మెళకువలు నేర్చుకున్నారు. కొంతకాలం హైకోర్టులో ప్రభు త్వ న్యాయవాదిగా పనిచేశారు. తర్వాత న్యాయాధికారిగా ఎంపికయ్యారు. 1995లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. 15.11.2000 సంవత్సరంలో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2012 జనవరి 19న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.