sedition case
-
బంగ్లా హిందూ నేతపై దేశ ద్రోహం కేసు
ఢాకా: బంగ్లాదేశ్లో దేశ ద్రోహం ఆరోపణలపై అరెస్టయిన హిందూ నేత చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారికి అక్కడి న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. దాస్ అరెస్ట్ను నిరసిస్తూ రాజధాని ఢాకా, చిట్టోగ్రామ్ తదితర ప్రాంతాల్లో హిందువులు నిరసన ప్రదర్శనలు జరిపారు. ఈ పరిణామాలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆయన అరెస్ట్ తర్వాత బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు పెరిగిపోయాయని తెలిపింది. ఇస్కాన్ మాజీ సభ్యుడు, సమ్మిళిత సనాతని జోత్ అనే హిందూ సంఘం నేత చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారి సోమవారం చిట్టోగ్రామ్కు వెళ్లేందుకు ఢాకా విమానాశ్రయానికి రాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చిట్టోగ్రామ్కు తరలించారు.చిట్టోగ్రామ్లోని లాల్డిగి మైదాన్లో అక్టోబర్ 25న హిందువులు నిర్వహించిన ర్యాలీ సందర్భంగా జాతీయ పతాకాన్ని అవమానపరిచారంటూ దాస్, మరో 18 మందిపై మాజీ ప్రధాని ఖలేదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పారీ్ట(బీఎన్పీ)నేత ఒకరు ఫిర్యాదు చేయడంతో చిట్టోగ్రామ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో దాస్ను పోలీసులు మంగళవారం ఆరో మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కాజీ షరీఫుల్ ఇస్లాం ఎదుట హాజరు పరిచారు. దాస్ బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన మేజి్రస్టేట్..చిట్టోగ్రామ్ వెలుపల ఈ అరెస్ట్ జరిగినందున నిబంధనల మేరకు 24 గంటలపాటు జ్యుడీíÙయల్ కస్టడీలో ఉండాల్సిందేనని ఆదేశించారు. దీంతో పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు.నిబంధనలకు లోబడి జైలులో మతాచారం ప్రకారం పూజాకార్యక్రమాలు జరుపుకోవచ్చన్నారు. దాస్ను జైలుకు తరలిస్తుండగా పెద్ద సంఖ్యలో మద్దతుదారులు నినాదాలు చేశారు. దాస్ను తరలిస్తున్న వ్యాన్ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జైలు వ్యానులో నుంచి విక్టరీ సింబల్ చూపుతూ దాస్ ప్రసంగించారు. తాము సమైక్య బంగ్లాదేశ్ను కోరుకుంటున్నామని చెప్పారు. దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని, డిమాండ్లు నెరవేరాదాకా శాంతియుత పోరాటం సాగించాలని మద్దతుదారులను దాస్ కోరారు. ఈ మేరకు ఒక వీడియో ఆన్లైన్లో వైరలవుతోంది. పోలీసులు లాఠీచార్జీ జరిపి ఆందోళనకారులను చెదరగొట్టారు. దాస్ అరెస్ట్పై నిరసనలు దాస్ అరెస్ట్ను నిరసిస్తూ ఢాకా, చిట్టోగ్రామ్, ఖుల్నా, దినాజ్పూర్, కాక్స్ బజార్ కుమిల్లా తదితర చోట్ల హిందువులు ర్యాలీలు చేపట్టారు. బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ దాస్ అరెస్ట్ను ఖండించింది. దాస్ అరెస్ట్పై భారత్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులు ఇతర మైనారిటీల భద్రతకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని బంగ్లా అధికారులను కోరింది. దాస్ అరెస్ట్ను ఇస్కాన్ ఉపాధ్యక్షుడు రాధా రామణ్ దాస్ ఖండించారు. బంగ్లాదేశ్ జాతీయ జెండా కంటే ఎత్తుగా మరో జెండాను ఎగరేయడాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, అంతే తప్ప అగౌరపర్చలేదని ఆయన పేర్కొన్నారు. -
‘ప్రధానిని తిట్టడం దేశద్రోహమేం కాదు!’
బెంగళూరు: దేశ ప్రధానిని తిట్టడం దేశద్రోహమేం కాదని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాగని రాజ్యాంగబద్ధమైన పదవిని కించపరిచేలా మాట్లాడడమూ మంచిది కాదని తెలిపింది. ఈ మేరకు ఓ స్కూల్ యాజమాన్యంపై దాఖలైన కేసును కొట్టేస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బీదర్లోని షాహీన్ స్కూల్ మేనేజ్మెంట్పై ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారనే అభియోగాల మీద దేశద్రోహం కేసు నమోదు అయ్యింది. చెప్పుతో కొడతామంటూ ఓ నాటకంలో పిల్లలతో చెప్పించారని న్యూటౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. తద్వారా మత సమూహాల మధ్య గొడవలు కలిగించేందుకు యత్నించారనే ఆరోపణలపై.. ఐపీసీ సెక్షన్ 153(ఏ) ప్రకారం దేశద్రోహం కేసు నమోదు చేశారు. అయితే ఇది దేశ ద్రోహం కిందకు రాదని కర్ణాటక హైకోర్టు కల్బుర్గి బెంచ్ స్పష్టం చేసింది. ‘‘ప్రధానిని చెప్పుతో కొడతానని అనడం ఆ హోదాని అవమానించడం మాత్రమే కాదు.. బాధ్యతారాహిత్యం కూడా. ఒక పద్దతి ప్రకారం చేసే విమర్శలకు సహేతుకత ఉంటుంది. అంతేగానీ.. ఇలా ఇష్టానుసారం మాట్లాడడం సరికాదు. అలాగని ప్రధానిని కించపర్చడం దేశద్రోహం కిందకు రాదు అని జస్టిస్ హేమంత్ చందన్గౌడర్ తీర్పు సందర్భంగా స్పష్టం చేశారు.. అయితే ఈ కేసు ఇప్పటిది కాదు.. 2020 నాటిది. ఆ సమయంల సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (CAA), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్(NRC)లకు వ్యతిరేకంగా స్కూల్లో 4,5,6వ తరగతి విద్యార్థులతో ఓ నాటకం ప్రదర్శించారు. ఆ నాటకంలోనే ప్రధాని మోదీని తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ డైలాగులు రాసి పిల్లలతో ప్రదర్శించారు. దీనిపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) నేత నీలేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో.. కాలేజీ మేనేజ్మెంట్లోని నలుగురిపై భారత శిక్షాస్మృతి(IPC) సెక్షన్ 504, 505(2), 124A(దేశద్రోహం), 153ఏ రీడ్ విత్ సెక్షన్ 34ల ఆధారగా కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రధాని వంటి రాజ్యాంగాధికారులను అవమానించవద్దని తీర్పు సమయంలో అభిప్రాయపడ్డ కోర్టు.. పిల్లలచేత రాజకీయ విమర్శలు చేయించడం సరికాదని, బదులుగా వాళ్ల అకడమిక్ ఇయర్కు సంబంధించిన అంశాలపై నాటకాలు వేయించడం మంచిదని స్కూల్ యాజమాన్యాన్ని సూచిస్తూ దేశద్రోహం కేసును కొట్టేసింది. ఇదీ చదవండి: రాజకీయాల్లో రాహుల్తో పోలికా? సరిపోయింది -
ప్రశ్నించే గొంతులకు సంకెళ్లా?
‘దేశద్రోహ’ నేరారోపణ అన్నది వలస పాలకుల దౌర్జన్య పాలనావసరాల కోసం ఏర్పరచుకున్న ప్రత్యేక నిబంధన. వలస పాలనానంతరం ఏర్పడిన ప్రజాస్వామ్య వ్యవస్థకు ఈ నిబంధన చేటు కలిగిస్తోంది. 2010 నుంచీ ఇప్పటివరకూ 800కు పైగా దేశద్రోహ కేసులు నమోదయ్యాయని ‘ఎ డికేడ్ ఆఫ్ డార్క్నెస్’ డేటాబేస్ చెబుతోంది. ఈ ప్రజా వ్యతిరేక చట్టాల కొనసాగింపు కేంద్రం వరకే పరిమితం కాలేదు. కొన్ని రాష్ట్రాల పాలకులు కూడా అదే ‘అలవాటు’లో ఉన్నారు. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం 150 మందికిపైగా పౌర హక్కుల ఉద్యమ నాయక, కార్యకర్తలపైన సాధికారత లేని ‘ఉపా’ కేసుల్ని మోపింది. భూస్వామ్య, ధనికవర్గ ప్రయోజనాల రక్షణే పాలకుల ప్రాధాన్యమా? ‘‘దేశంలో వలస పాలన అంతరించిన తరువాత కూడా, వలస పాలకులు స్వార్థ ప్రయోజనాల కోసం భారతదేశంలో పౌరులపైన, పౌర హక్కులపైన విధించిన ‘దేశద్రోహ’ చట్టంలోని ‘124–ఎ’ నిబంధన అమలు జరుగు తూండటం దారుణం. వలస పాలనానంతరం ఏర్పడిన ప్రజాస్వామ్య వ్యవస్థకు ఈ నిబంధన చేటు కలిగిస్తోంది. ఈ తప్పుడు నిబంధన సృష్టించిన సమస్యను ఏ భాషా మార్పు వల్లా, నిబంధనల సరళింపు వల్లా పరిష్కరించలేము. ఎందుకంటే ‘దేశద్రోహ’ నేరారోపణ అన్నది వలస పాలకుల దౌర్జన్య పాలనావసరాల కోసం ఏర్పరచుకున్న ప్రత్యేక నిబంధన. కనుకనే స్వతంత్ర భారత సుప్రీంకోర్టు ‘124–ఎ’ దేశద్రోహ నేరా రోపణ నిబంధన స్వతంత్ర భారతంలో చెల్లదని కేదార్నాథ్ వర్సెస్ బిహార్ (1962) కేసు విచారణ సందర్భంగా కొట్టివేసింది. ఈ అత్యు న్నత న్యాయస్థానం నిర్ణయాన్ని పాలకులు అమలు జరిపి ఉంటే – ప్రభుత్వాన్ని విమర్శించిన నేరానికి లేదా అలాంటి విమర్శను ప్రసారం చేసే వీడియోలు విన్న నేరానికి లేదా అలాంటి పాటలు విన్న నేరానికి దేశ పౌరులపైన దేశద్రోహ కేసులను పాలకులు మోపి ఉండేవారు కాదు. ఇప్పటిదాకా రాజ్యాంగంలోని 14వ అధికరణ కింద 2010 నుంచీ ఇప్పటి వరకూ 800కు పైగా దేశద్రోహ కేసులు నమోదయ్యాయి.’’ – లభ్యతి రంగరాజన్ (ఇప్పటివరకూ దేశంలో నమోదైన ‘దేశద్రోహ’ కేసులను పరిశీలించి, వాటిని ‘ఓ దశాబ్దపు చిమ్మ చీకటి’ (ఎ డికేడ్ ఆఫ్ డార్క్నెస్) పేరిట ఏర్పాటుచేసిన డేటాబేస్ సాధికారికంగా నమోదు చేసింది. దీనికి లభ్యతి రంగరాజన్ ఎడిటర్గా ఉన్నారు.) దేశ పాలకులూ, వారి ఇష్టానుసారం మెలగుతున్న పాలనా యంత్రాంగమూ పుర్రెకు పుట్టిన బుద్ధి ప్రకారం పౌర సమాజాన్ని ఇబ్బంది పెట్టవచ్చా? అనుకూలమైన వలస చట్టాల చాటున అనేక రకాల నిర్బంధాలకు గురి చేయవచ్చునని ‘పెగసస్’ విదేశీ స్పైవేర్ కొనుగోలు చేసినప్పుడే ఇది నిరూపితమైంది. ఈ ప్రజా వ్యతిరేక చట్టాల కొనసాగింపు కేంద్రం వరకే పరిమితం కాలేదు. అలాంటి చట్టా లపై ఆధారపడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు, పాలకులు కూడా అదే ‘అల వాటు’లో ఉన్నారు. ఉండబట్టే తాజా పరిణామాలలో భాగంగా దేశవ్యాప్తంగానూ, విదేశాల్లోనూ ఖ్యాతి పొందిన సుప్రసిద్ధ విద్యావేత్త, సంస్కర్త, పౌరహక్కుల ఉద్యమ నాయకులలో ఒకరు అయిన ప్రొఫె సర్ హరగోపాల్ సహా దాదాపు 150 మందికిపైగా పౌర హక్కుల ఉద్యమ నాయక, కార్యకర్తలపైన సాధికారత లేని ‘ఉపా’ కేసుల్ని మోపి పాలకులు తమ ‘చెవి దురద’ తీర్చుకున్నారు. ఆ ‘దురద’ను అంత త్వరగానూ తొలగ గొట్టుకోవడానికి తంటాలు పడ్డారు. ఏ ‘నేరం’పైన ఈ కుట్ర కేసు బనాయించవలసి వచ్చిందో స్పష్టత లేదు. కాగా, ఫక్తు తెలంగాణ వాసి, భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చినా ఆ వాసనకు దూరంగా ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించి, తాను పుట్టి పెరిగిన ఫ్యూడల్ సంప్రదాయాల్ని కాలదన్నిన వారు బి.నరసింగరావు. తెలంగాణలో తన ప్రజలు అనుభవించిన భూస్వామ్య దాష్టీకాలను కళ్లారా చూసి మనసు చెలించి, ‘దాసి’ చలన చిత్రం ద్వారా ధనిక వర్గ దుర్మార్గాన్ని ఎండగట్టి దేశంలోనే గాక అంతర్జాతీయంగానూ ఆయన ఖ్యాతి గడించారు. అలాంటి నేలతల్లి బిడ్డకు కూడా పాలకులు ‘ఇంటర్వ్యూ’ ఇవ్వడానికే జంకారు, కాదు భయపడ్డారు, లేదా బిడియపడ్డారు! ఎందుకు? నాటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లోనే తెలంగాణకు నిజమైన రక్షణ ఉందని ఆయన ప్రకటించినందుకు! పేరుకు తగ్గట్టే ఆయనది తెలంగాణలోని ‘ప్రజ్ఞాపురం’. వాస్తవం ప్రకటించినందుకు తనకు ఇంటర్వ్యూను నిరాకరించిన నేటి తెలంగాణ పాలకులను ప్రశ్నిస్తూ నరసింగరావు ఎక్కడ పుట్టిన ‘కమలం’ ఇది అని ప్రశ్నించడం కొంత బాధాకరమైనదైనా అది తనకు జరిగిన అవమానాన్ని వ్యక్తం చేయడానికి ఉద్దేశించింది మాత్రమేనని భావించాలి. భారత లౌకిక రాజ్యాంగం నిర్దేశించి నెలకొల్పిన సుసంప్ర దాయాలు ఎన్నో ఉన్నా వాటిని తృణీకరించి ప్రజా వ్యతిరేక పాలనను డొల్లించుకుపోతున్న పాలకులకు ‘ముగుదాడు’ వేయగల ప్రజా స్వామిక న్యాయ వ్యవస్థ ఇప్పుడు ఉన్నందున, పాలకులు, పాలనా వ్యవస్థ కొంతమేర అదుపులో ఉన్నట్టు కన్పిస్తోంది. కానీ లోపాయికారీ పద్ధతుల్లో దేశంలోని ఫెడరల్ వ్యవస్థ ప్రయోజనాల్ని దెబ్బతీయడానికి మరోవైపు నుంచి మతవాద, మితవాద శక్తులు చీలుబాటలవైపే ప్రయాణిస్తూ వ్యవస్థను అస్థిరం చేస్తున్నాయని మరచిపోరాదు. అంత కన్నా ఎన్నటికీ మరవరాని అంశం – రాజ్యాంగంలో పొందుపరచు కున్న ప్రజాహిత సూత్రాలను అమలు చేయించుకోగల హక్కును దేశ పౌరులకు లేకుండా చేశారు. కారణం స్పష్టమే. భూస్వామ్య, ధనికవర్గ ప్రయోజనాల రక్షణకే పాలకుల ప్రాధాన్యం. నేడు రాజ్యాంగమూ, దాని ప్రయోజనాలనూ కేవలం కొద్దిమంది కార్పొరేట్ అధిపతులు, వారికి కొమ్ముకాస్తూన్న పాలక వర్గమే అనుభవిస్తోందని ప్రజలు భావిస్తున్నారు. తొల్లింటి అరకొర ప్రజానుకూల ప్రణాళికా వ్యవస్థ కూడా ఈ రోజున కూలిపోయింది. అందుకే కూలిపోయే వ్యవస్థను కాపాడ్డానికే దాని రక్షకులైన పాలక వర్గాలు ‘కంకణం’ కట్టుకుంటారు. మహాకవి శ్రీశ్రీ దశాబ్దాల క్రితమే రానున్న పరిణామాల్ని గురించి ముందస్తు హెచ్చరిక చేశారు: ‘‘విభజన రేఖను రక్షించడానికే న్యాయస్థానాలు, రక్షక భట వర్గాలు చెరసాలలు, ఉరి కొయ్యలు’’ అని చెబుతూనే – ‘‘అభిప్రాయాల కోసం బాధలు లక్ష్యపెట్టనివాళ్లు మాలోకి వస్తారు అభిప్రాయాలు మార్చుకొని సుఖాలు కామించేవాళ్లు మీలోకి పోతారు’’ అనీ ప్రకటించారు! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
హరగోపాల్ పై ఉపా కేసు ఎత్తివేసిన తెలంగాణ ప్రభుత్వం
-
ప్రొఫెసర్ హరగోపాల్పై దేశద్రోహం కేసు
సాక్షి, హైదరాబాద్: విద్యావేత్త, చర్చా మేధావి.. ప్రొఫెసర్ హరగోపాల్పై దేశద్రోహం కేసు నమోదు అయ్యింది. ములుగు జిల్లా తాడ్వాయి మండల పీఎస్లో ఈ మేరకు ఆయనపై అధికారులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మావోయిస్టులకు సహయసహకారాలు అందిస్తున్నారని, బీరెల్లి కుట్రలో ఆయన భాగం అయ్యారని, పైగా నిషేధిత మావోయిస్టుల పుస్తకాల్లో ఆయన పేరు ఉందనే అభియోగాలు నమోదు అయ్యాయి. చట్ట వ్యతిరేకత కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా(UAPA యూఏపీఏ)తోపాటు ఆర్మ్ యాక్ట్, ఇంకా పలురాకల 10 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. బీరెల్లి కుట్ర కేసుకు సంబంధించి కిందటి ఏడాది ఆగస్టు 19వ తేదీనే తాడ్వాయి పీఎస్లో హరగోపాల్తో పాటు మరో 152 మందిపై కేసు నమోదు అయ్యింది. ప్రజాప్రతినిధులను చంపడానికి కుట్ర పన్నారన్నది ప్రధాన ఆరోపణ కాగా.. నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యుల పుస్తకాల్లో పేర్లు ఉన్నాయంటూ వాళ్లకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది కూడా. అయితే.. పీపుల్స్ డెమొక్రటిక్ మూవ్మెంట్ (పీడీఎం) అధ్యక్షుడు చంద్రమౌళిని రెండునెలల కింద పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా.. ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా అతడిపై మరిన్ని కేసులు ఉన్నట్లు బెయిల్పై విచారణ చేపట్టిన రంగారెడ్డి జిల్లా కోర్టుకు తెలిపారు పోలీసులు. అన్ని కేసుల వివరాలు అందజేయాలని కోర్టు ఆదేశించడంతో పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ను ప్రస్తావించడంతో హరగోపాల్ పై దేశద్రోహం కేసు వెలుగులోకి వచ్చింది. స్పందించిన ప్రొఫెసర్ రాజద్రోహం, దేశద్రోహం లాంటి కేసులు పెట్టొద్దని సుప్రీం కోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది. కాబట్టి, ప్రభుత్వం పెట్టిన ఈ కేసు నిలబడదు. మావోయిస్టులకు మా మద్దతు ఎందుకు? వాళ్లు మాలాంటి వాళ్ల మీద ఆధారపడరు.. అసలు వాళ్ల ఉద్యమం వేరు. 152 మందిపైనా ఏదో ఒక కేసు పెట్టడం విషాద పరిణామం. బాధ్యతరాహిత్యంగా కేసులు పెడుతున్నారు. నిజాయితీపరులపైనా.. ఆఖరికి చనిపోయిన వారిపై కూడా కేసులు పెట్టారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల తరుణంలో ఇలాంటి కేసులు పెట్టడం దురదృష్టకరం. పేర్లు రాసుకోవడం కాదు.. సరైన ఆధారాలు ఉండాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక చట్టాన్ని దురుపయోగం చేస్తున్నారు. ఇది ఈ వ్యవస్థలో ఉండాల్సింది కాదు. ఉపా చట్టాన్ని ఎత్తివేయాలి. ఇది ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధం. ఉపా చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ వాళ్లు. ఇప్పటికైనా తప్పైందని ఒప్పుకోవాలి. అందరిపై కేసులు ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూనే.. ఉపా చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమం జరగాలి. అందరం కలిసి మాట్లాడుకుని ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని అని ఆకాంక్షించారాయన. అలాగే.. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ అక్రమ కేసు ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. విద్యా సంఘాల ఖండన ప్రొఫెసర్ హరగోపాల్, పద్మజాషా లాంటి మేధావులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ ఎం.రాఘవాచారి డిమాండ్ చేశారు. మరోవైపు విద్యా మేధావులను ఇరికించడం వెనుక లోతైన కుట్ర ఉందని, కేసు వివరాలను బహిర్గత పర్చాలని విద్యా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
దేశద్రోహానికి ఏడేళ్ల జైలు శిక్ష
న్యూఢిల్లీ: దేశద్రోహం కేసుల్లో దోషులకు విధించే జైలుశిక్షను కనిష్టంగా మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ పెంచాలని భారత న్యాయ కమిషన్ సిఫార్సు చేసింది. దీనివల్ల నేర తీవ్రతను బట్టి శిక్ష విధించే అవకాశం న్యాయస్థానాలకు లభిస్తుందని వెల్లడించింది. ఈ మేరకు ఈ నివేదికను న్యాయ కమిషన్ చైర్మన్ జస్టిస్ రితూరాజ్ అవస్థీ (రిటైర్డ్) ఇటీవల కేంద్ర న్యాయ శాఖ మంత్రి మేఘ్వాల్కు సమర్పించారు. దేశద్రోహానికి జైలు శిక్షను ఏడేళ్లకు పెంచాలంటూ న్యాయ కమిషన్ సిఫార్సు చేయడాన్ని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ తప్పుబట్టారు. దేశద్రోహ చట్టాన్ని మరింత క్రూరంగా మార్చేయడానికి బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. మెక్సికోలో కలకలం.. -
రాజద్రోహం చట్టంపై కేంద్రం కీలక నిర్ణయం.. పార్లమెంటులో బిల్లు..!
న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాజద్రోహం చట్టంపై పునర్ సమీక్ష చేస్తామని కేంద్రం చెప్పింది. వచ్చే వర్షాకాల సమావేశాల్లో రాజ ద్రోహం చట్టం సవరణ బిల్లును పార్లమెంటు ముందుకు తెస్తామని సూచన ప్రాయంగా తెలిపింది. దీంతో రాజద్రోహం కింద నమోదైన కేసులను ఆగస్టు రెండో వారంలో విచారిస్తామని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. కాగా.. బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహ చట్టం చట్టబద్ధతను సవాల్ చేస్తూ ఎడిటర్స్ గిల్డ్ సహా మొత్తం 16 పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై కేంద్రం తన అభిప్రాయాన్ని తెలిపాలని గతేడాది మేలో సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజద్రోహం చట్టం, దీని కింద నమోదైన కేసులపై స్టే విధిందించి. అయితే ఈ చట్టాన్ని పునర్ పరిశీలించేందుకు మరింత గడువు కావాలని కేంద్రం గతేడాది అక్టోబర్ 31న కోరింది. ఇప్పుడు మళ్లీ మరింత సమయం కావాలని అడిగింది. దీంతో తదుపరి విచారణను ఆగస్టుకు వాయిదా వేసింది సర్వోన్నత న్యాయస్థానం. చదవండి: ఆర్నెళ్లు ఆగక్కర్లేదు.. విడాకులపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు -
100 మంది రైతులపై దేశ ద్రోహం కేసు
న్యూఢిల్లీ: దేశద్రోహం చట్టంపై భారతదేశ అత్యున్న న్యాయస్థానం సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బ్రిటీష్ పాలన కాలం నాటి ఈ చట్టం స్వతంత్ర భారతదేశంలో అవసరమా అని సుప్రీంకోర్టు గురువారం కేంద్రాన్ని ప్రశ్నించింది. ఓ వైపు దేశద్రోహం చట్టంపై నేడు సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేయగా.. నాలుగు రోజుల క్రితం దాదాపు 100 మందిపై దేశద్రోహం కేసు నమోదయ్యింది. రైతులపై దేశ ద్రోహం కేసు నమోదు చేయడం గమనార్హం. ఈ సంఘటన హరియాణాలో చోటు చేసుకుంది. బీజేపీ నాయకుడి వాహనంపై దాడి చేశారనే ఆరోపణలతో పోలీసులు అన్నదాతల మీద దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఆ వివరాలు.. కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దీర్ఘకాలంగా దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జూలై 11న హరియాణా రైతులు సిర్సాలో అధికార బీజేపీ-జేజేపీ కూటమి నేతలకు, నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనకి దిగారు. ఈ క్రమంలో ఆ మార్గంలో వచ్చిన రాష్ట్ర డిప్యూటీ స్పీకర్, బీజేపీ నాయకుడు రణ్బీర్ గంగ్వా వాహనాన్ని అడ్డుకున్నారు. దాంతో పోలీసులు రణబీర్ గంగ్వా అధికార వాహనాన్ని రైతులు అడ్డుకుని దాడికి ప్రయత్నించారని.. కారుని డ్యామేజ్ చేశారని ఆరోపిస్తూ అదే రోజున రైతు నేతలు హరిచరణ్ సింగ్, ప్రహ్లాద్ సింగ్తో పాటు 100 మంది అన్నదాతలపై దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. హర్యానా రైతు వ్యతిరేక బీజేపీ ప్రభుత్వ సూచనల మేరకు.. రైతులు, రైతు నాయకులపై పోలీసులు చేసిన తప్పుడు, దేశద్రోహ ఆరోపణలను సంయుక్త కిసాన్ మోర్చా తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. రైతులపై నమోదయిన కేసును కోర్టులో సవాల్ చేయడానికి రైతులు, రైతు నాయకులందరికీ సంయుక్త కిసాన్ మోర్చా సహాయం చేస్తుందని పేర్కొంది. -
సెక్షన్ 124ఏ అవసరమా..?
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటిష్ కాలం నాటి దేశద్రోహం చట్టాన్ని ఇప్పటికీ ఉపయోగిస్తుండటాన్ని, చాలా సందర్భాల్లో దీనిని దుర్వినియోగపర్చడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మహాత్మాగాంధీ, గోఖలే వంటి స్వాతంత్య్ర సమరయోధుల గొంతు నొక్కేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఈ దేశద్రోహం చట్టాన్ని ఉపయోగించిందని గుర్తు చేసింది. దీనికి సంబంధించిన ఐపీసీలోని 124ఏ సెక్షన్ను ఇంకా ఎందుకు రద్దు చేయలేదని, ఈ సెక్షన్ ప్రస్తుత కాలంలో అవసరమా అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ సెక్షన్ రాజ్యాంగ చెల్లుబాటుపై విచారణ చేస్తామని స్పష్టం చేసింది. సెక్షన్ 124ఏ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, విశ్రాంత సైనికాధికారి మేజర్ జనరల్ ఎన్జీ వోంబట్కెరే దాఖలు చేసిన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హృషీకేశ్రాయ్ల ధర్మాసనం గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. విచారణ సమయంలో ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. ఈ దేశద్రోహం చట్టం బ్రిటిష్ వారి నుంచి వలస తెచ్చుకున్న చట్టంగా అభివర్ణించింది. ప్రభుత్వాలపై విద్వేషం పెరిగేలా చేసే ప్రసంగాలు లేదా భావ ప్రకటనలను బెయిల్కు వీల్లేని నేరంగా పరిగణిస్తూ, ఈ సెక్షన్ కింద జీవితకాల జైలుశిక్ష విధించే అవకాశముంది. ‘ఈ చట్టం వలసరాజ్యం నాటి చట్టం. స్వేచ్ఛను అణచివేయడానికి, గాంధీ, తిలక్ వంటి వారి గొంతు నొక్కేందుకు ఈ చట్టాన్ని బ్రిటిష్వారు ప్రయోగించే వారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా ఈ చట్టం అవసరమా?’ అని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ను ధర్మాసనం ప్రశ్నించింది. ఈ తరహా కేసులు సుప్రీంకోర్టులో వేర్వేరు ధర్మాసనాల వద్ద పెండింగ్లో ఉన్న విషయాన్ని కేకే వేణుగోపాల్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఎడిటర్స్ గిల్డ్ తరఫు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ వాదనలు వినిపిస్తూ.. 124ఏ రాజ్యాంగ విరుద్ధమే కాకుండా ఏ విధంగా దుర్వినియోగం అవుతుందో పిటిషన్లో వివరించామన్నారు. ఈ సెక్షన్ను దుర్వినియోగం చేసిన కేసులే ఎక్కువని, కొయ్య మలచడానికి వడ్రంగికి రంపం ఇస్తే మొత్తం అడవినే నరికినట్లుగా ఉందంటూ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏ రద్దు చేసినప్పటికీ ఇప్పటికీ కేసులు నమోదు చేస్తున్న అంశాన్ని సీజేఐ ఉదహరించారు. చట్టం దుర్వినియోగం అవడంతో పాటు కార్యనిర్వాహక వ్యవస్థకు జవాబుదారీతనం లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని జస్టిస్ రమణ పేర్కొన్నారు. ఈ తరహా ఇతర కేసులు కూడా పరిశీలిస్తామన్న సీజేఐ.. అన్ని కేసులను ఒకే చోట విచారిస్తామన్నారు. కాలం చెల్లిన చట్టాలను చాలా వరకూ రద్దు చేస్తున్న కేంద్రం ఈ విషయాన్ని ఎందుకు పరిశీలించలేదని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ సెక్షన్ను కొట్టివేయాల్సిన అవసరం లేదని, చట్టపరమైన ప్రయోజనాల నిమిత్తం మార్గదర్శకాలు ఏర్పాటు చేస్తే సరిపోతుందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తెలిపారు. పిటిషనర్ ఆర్మీ మేజర్ జనరల్గా పనిచేశారని, ఆయన దేశం కోసం త్యాగం చేశారని, ఈ పిటిషన్ను ప్రేరేపిత పిటిషన్గా భావించలేమని ధర్మాసనం పేర్కొంది. ‘సెక్షన్ 124ఏ ను పేకాట ఆడేవారిపైనా ప్రయోగిస్తున్నారు. ప్రత్యర్థుల అణచివేతకు రాజకీయ నేతలు దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రత్యర్థులపై సెక్షన్ 124ఏ ప్రయోగించేలా ఫ్యాక్షనిస్టులు ప్రవర్తిస్తున్నారు. బెయిల్ రానివ్వకుండా ఈ సెక్షన్తో బెదిరిస్తున్నారు’ అని జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు. సెక్షన్ 124ఏ రద్దుపై వైఖరి తెలపాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. విపక్ష నేతల హర్షం దేశద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను పలువురు విపక్ష నేతలు, పౌర సమాజ కార్యకర్తలు స్వాగతించారు. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఒకవైపు, ఈ చట్టం దుర్వినియోగమవుతోందంటూ సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మరోవైపు బుధవారం హరియాణాలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న 100 మంది రైతులపై దేశద్రోహం సహా పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు. -
అయేషా సుల్తానాను ప్రశ్నించి వదిలేసిన లక్షద్వీప్ పోలీసులు
కోచి: దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొం టున్న సినీ దర్శకురాలు అయేషా సుల్తానాను లక్షద్వీప్ పోలీసులు ప్రశ్నించి వదిలేశారు. బీజేపీ నేత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కవరట్టి పోలీసులు ఆది, బుధ, గురు వారాల్లో ఆమెను ప్రశ్నించారు. గురువారం దాదాపు మూడు గంటలపాటు జరిగిన విచారణ అనంతరం అయేషా సుల్తానా మీడియాతో మాట్లాడుతూ..‘ఈ విషయం ముగిసింది. కోచి తిరిగి వెళ్తానని పోలీసులకు చెప్పాను. రేపు లేదా ఎల్లుండి కోచికి చేరుకుంటాను’అని అన్నారు. బుధవారం దాదాపు 8 గంటలపాటు జరిగిన విచారణలో తనకు విదేశాలతో ఏవైనా సంబంధాలున్నాయా అంటూ పోలీసులు ప్రశ్నించారని అంతకుముందు అయేషా చెప్పారు. తన వాట్సాప్, ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్ అకౌంట్లను పోలీసులు పరిశీలించారన్నారు. ఆదివారం పోలీసులు అయేషాను మూడు గంటలపాటు విచారించారు. ‘మలయాళం వార్తా చానెల్ జూన్ 7వ తేదీన నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆమె.. లక్షద్వీప్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం జీవాయుధాలను ప్రయోగించిందని ఆరోపించారంటూ బీజేపీ నేత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చదవండి: కోవాగ్జిన్కు మరోసారి చుక్కెదురు! -
దేశద్రోహం కేసులో ఆయేషాకు బెయిల్
కొచ్చి: లక్షద్వీప్ పోలీసులు నమోదు చేసిన దేశద్రోహం కేసులో సినీనటి, దర్శకురాలు ఆయేషా సుల్తానాకు ఊరట లభించింది. ఈ కేసులో ఒకవేళ అమెను అరెస్టు చేస్తే వారంరోజులపాటు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని లక్షద్వీప్లోని కవరత్తి పోలీసులను కేరళ హైకోర్టు ఆదేశించింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయేషా సుల్తానా దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం గురువారం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ కోసం జూన్ 20న తమ ఎదుట హాజరు కావాలంటూ లక్షద్వీప్లోని కవరత్తి పోలీసులు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆయేషా సుల్తానాకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అశోక్ మీనన్ సూచించారు. రూ.50 వేల పూచీకత్తు, ఇద్దరి హామీతో ఆయేషా సుల్తానాకు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వొచ్చని తెలిపారు. లక్షద్వీప్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం జీవాయుధాలను ప్రయోగిస్తోందని జూన్ 7న ఆరోపించిన ఆయేషా సుల్తానాపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: మాజీ ఎన్కౌంటర్ స్పెషలిస్టు ప్రదీప్ శర్మ అరెస్టు -
దేశద్రోహం కేసు, అయినా భయపడేది లేదు :నటి
తిరువనంతపురం: లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్ను జీవాయుధంతో పోల్చినందుకు గాను నటి, మోడల్, దర్శకురాలు ఆయేషా సుల్తానాపై దేశద్రోహం కేసు నమోదైంది. ప్రశాంతంగా ఉండే దీవిలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం, కరోనా కేసుల్ని అరికట్టడంలో విఫలమైనందుకు ప్రఫుల్ని కేంద్రం ప్రయోగించిన బయోవెపన్గా ఆమె అభివర్ణించారు. మలయాళం న్యూస్ చానల్ మీడియా వన్ టీవీ చర్చలో పాల్గొన్న ఆయేషా సుల్తానా లక్షద్వీప్పై కేంద్రం జీవాయుధాన్ని ప్రయోగించిందంటూ ఆరోపించారు. ‘‘లక్షద్వీప్లో గతంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఇప్పుడు రోజుకి 100 కేసులు నమోదవుతున్నాయి. కేంద్రం లక్షద్వీప్కి జీవాయుధాన్ని పంపింది. అందుకే కేసుల సంఖ్య పెరిగిపోతోంది’’అని సుల్తానా టీవీ చర్చలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. లక్షద్వీప్ బీజేపీ చీఫ్ సి.అబ్దుల్ ఖదేర్ హాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కవరట్టి పోలీసులు ఆమెపై రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 124 (ఏ) రాజద్రోహం, 153 బి (రెచ్చగొట్టే ప్రసంగాలు) కింద కేసు పెట్టారు. ఇప్పటికే ప్రఫుల్ తీసుకున్న నిర్ణయాలపై సర్వత్రా వ్యతిరేకత ఎదురవుతోంది. వెనక్కి తగ్గేది లేదు: ఆయేషా టీవీ చర్చల్లో తాను చేసిన వ్యాఖ్యల్ని ఆయేషా సుల్తానా సమర్థించుకున్నారు. రాజద్రోహం కేసు నమోదైనా భయపడేది లేదన్నారు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందన్న ఆమె తన జన్మ భూమి కోసం ఎంత పోరాటమైనా చేస్తానని చెప్పారు. తన గళం ఇంకా పెంచుతానంటూ ఫేస్బుక్లో ఒక పోస్టు ఉంచారు. -
Aisha Sultana: అయిషాపై దేశద్రోహం కేసు.. అదిరిపోయే ట్విస్ట్
లక్షద్వీప్ ఫిల్మ్ మేకర్ అయిషా సుల్తానాపై దేశ ద్రోహం కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో అదిరిపోయే ట్విస్ట్ చోటు చేసుకుంది. బీజేపీ అధ్యక్షుడి తీరును ఎండగడుతూ.. ఆమెకు మద్ధతుగా బీజేపీ నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. న్యూఢిల్లీ: లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్తో పాటు కేంద్ర ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిందన్న ఆరోపణలపై కేరళ ఫిల్మ్ మేకర్. నటి అయిషా సుల్తానాపై దేశ ద్రోహం కేసు నమోదైంది. లక్షద్వీప్ బీజేపీ యూనిట్ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ హాజీ ఫిర్యాదుతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో ఇప్పుడు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమెకు మద్దతుగా బీజేపీ నేతలు మూకుమ్మడి రాజీనామా చేశారు. అయిషాకు మద్దతుగా లక్షద్వీప్ బీజేపీ ప్రధాన కార్యదర్శితో పాటు కీలక నేతలు, కార్యకర్తలు మొత్తం 15 మంది రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖల్ని అబ్దుల్ ఖాదర్ హాజీకి పంపించారు. ‘‘లక్షద్వీప్లో ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ చేపడుతున్న చర్యలు బీజేపీకి కూడా తెలుసు. ఆయన విధానాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రఫుల్ వ్యవహారంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేసిన వాళ్లలో మీరూ(హాజీ) కూడా ఉన్నారు. ప్రఫుల్, జిల్లా కలెక్టర్ తప్పులను ఎండగట్టిన బీజేపీ నేతలు చాలామందే ఉన్నారు. ఇదే తరహాలో చెట్లాట్ నివాసి అయిన అయిషా.. తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకుంద’ని ఆ నేతలంతా అయిషాకు మద్దతుగా లేఖలో వ్యాఖ్యలు చేశారు. ఆమెపై(అయిషా) ఫిర్యాదు చేయడం తప్పు. ఒక సోదరి భవిష్యత్తును, ఆమె కుటుంబాన్ని నాశనం చేయాలని మీరు ప్రయత్నిస్తున్నారు.ఈ తీరును మేం తట్టుకోలేకపోతున్నాం. అందుకే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాం అని బీజేపీ కార్యదర్శి అబ్దుల్ హమీద్ తదితరులు ఆ లేఖలపై సంతకాలు చేశారు. కాగా, ఓ మలయాళ టీవీ చర్చాకార్యక్రమంలో పాల్గొన్న ఆయిషా.. లక్షద్వీప్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం కోవిడ్ -19ను ఒక జీవాయుధంగా ప్రయోగించిందని, ఇందుకోసం అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్ను వాడిందని పేర్కొంది. ప్రఫుల్ పటేల్ రాకముందు లక్షద్వీప్లో కరోనా కేసులు లేవని, ఆయన నిర్లక్క్ష్యం వల్లే కేసులు పుట్టుకొచ్చాయని ఆమె ఆ డిబెట్లో మాట్లాడింది. అయితే ఇవి కేంద్ర ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలంటూ లక్షద్వీప్ బీజేపీ యూనిట్ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ హాజీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అయిషాపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. చదవండి: నీటి అడుగున నిరసన చదవండి: హీరో పృథ్వీకి భారీ మద్ధతు -
డిబేట్లో సంచలన వ్యాఖ్యలు, నటిపై దేశద్రోహం కేసు
సినీనటి, దర్శకురాలు ఆయేషా సుల్తానాపై దేశద్రోహం కేసు నమోదైంది. కరోనా వైరస్ గురించి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆమె మీద ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ మలయాళ టీవీ చర్చాకార్యక్రమంలో పాల్గొన్న ఆయేషా.. లక్షద్వీప్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం కోవిడ్ -19ను ఒక జీవాయుధంగా ప్రయోగించిందని సంచలన ఆరోపణలు చేసింది. ఇందుకోసం అడ్మినిస్ట్రేటర్ ప్రఫూల్ ఖోడా పటేల్ను బయోవెపన్గా వాడిందని పేర్కొంది. ఆమె మాటలపై ఆగ్రహం వ్యక్తం చేసిన లక్షద్వీప్ బీజేపీ యూనిట్ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ ఇది కేంద్ర ప్రతిష్టను దిగజార్చడమేనని అభిప్రాయపడ్డాడు. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన ఆమెపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆయేషాపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. చదవండి: ప్రభాస్ సినిమాలో మెరవనున్న రాశీఖన్నా! -
గుజరాతీ ఎడిటర్పై దేశద్రోహం కేసు
అహ్మదాబాద్ : గుజరాత్లోని ఓ న్యూస్ పోర్టల్ ఎడిటర్పై దేశద్రోహం కేసు నమోదైంది. బీజేపీ అధిష్టానం గుజరాత్లో నాయకత్వ మార్పు చేసే అవకాశం ఉందనే వార్తకు సంబంధించి పోలీసులు ఈ కేసు నమోదుచేశారు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్కు చెందిన ఫేస్ ఆఫ్ నేషన్ అనే న్యూస్ పోర్టల్కు ధావల్ పటేల్ అనే వ్యక్తి ఎడిటర్గా ఉన్నారు. మే 7వ తేదీన ఆ న్యూస్ పోర్టల్లో ప్రచురితమైన ఓ ఆర్టికల్లో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని తొలగించి ఆయన స్థానంలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియాను నియమించే ఆలోచనలో బీజేపీ అధినాయకత్వం ఉందని పేర్కొన్నారు. కరోనాను అదుపు చేయడంలో విజయ్ రూపానీ విఫలం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలిపారు. అయితే ఈ వార్తలను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా ఖండించారు. (చదవండి : సుప్రీంకోర్టు సెలవుల రద్దు!) ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 124(ఏ) కింద ధావల్పై దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఈ మేరకు సోమవారం ధావల్ను అహ్మదాబాద్లోని ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్నారు. ‘ధావల్ తన వెబ్ పోర్టల్ ద్వారా రాష్ట్రంలో, సమాజంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రాథమిక దర్యాప్తు పూర్తిచేశారు. ఆ తర్వాత ధావల్పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు’ అని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ బీవీ గోహిల్ తెలిపారు. అయితే ధావల్పై పోలీసు చర్యను ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఖండించింది. దేశంలోని పలుచోట్ల జర్నలిస్టులను ఇబ్బంది పెట్టేలా క్రిమినల్ చట్టాలను దుర్వినియోగపరచడం పెరుగుతోందని ఎడిటర్స్ గిల్డ్ అభిప్రాయపడింది. (చదవండి : మొదటి రైలు: నిబంధనల ఉల్లంఘన) -
షార్జీల్ ఇమామ్పై కేసు.. చార్జిషీట్ దాఖలు
న్యూఢిల్లీ: రెచ్చగొట్టే ప్రసంగాలతో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో అల్లర్లకు కారణమయ్యారనే ఆరోపణలతో జేఎన్యూ పూర్వ విద్యార్థి షార్జీల్ ఇమామ్పై దేశద్రోహం కేసు నమోదైంది. డిసెంబరు 15న తన విద్వేషపూరిత వ్యాఖ్యలతో విద్యార్థులను రెచ్చగొట్టినందున ఆయనపై చార్జిషీట్ వేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. గతేడాది డిసెంబరులో పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులు గళమెత్తడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. యూనివర్సిటీకి సమీపంలో ఉన్న న్యూ ఫ్రెండ్స్ కాలనీ, జామియా నగర్ ప్రాంతాల్లో అలజడి సృష్టించిన అల్లరి మూకలు అనంతరం యూనివర్సిటీలో ప్రవేశించారని పోలీసులు పేర్కొన్నారు. (‘వీడియోతో.. వాళ్లకు వాళ్లుగా దొరికిపోయారు!’) ‘‘రాళ్లు రువ్వుతూ.. ఆయుధాలు చేపట్టి కొంత మంది అల్లర్లకు తెరతీశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను భారీగా ధ్వంసం చేశారు. ఎంతో మంది పోలీసులు, సామాన్య పౌరులకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో డిసెంబరు 13, 2019లో విద్వేషపూరిత ప్రసంగాలు ఇచ్చి అల్లర్లకు కారణమైన షార్జీల్ను అరెస్టు చేశాం. మా దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాల ఆధారంగా 124 ఏ ఐపీసీ, 153 ఏ ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. ఈ మేరకు సాకేత్ జిల్లా కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశాం’’ అని వెల్లడించారు. కాగా సీఏఏను వ్యతిరేకిస్తూ షాహిన్బాగ్లో చేపట్టిన నిరసనలో పాల్గొన్న షార్జీల్... అలీగడ్ ముస్లిం యూనివర్సిటీలో ఇచ్చిన ప్రసంగంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇక గతంలోనూ అస్సాం, ఈశాన్య రాష్ట్రాలను దేశం నుంచి వేరుచేస్తారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసినందుకు గానూ మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. -
‘పాకిస్తాన్ పాట పాడితే కాల్చి పారెయ్యండి’
బెంగుళూరు : పౌరసత్వ నిరసనకారులపై కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అప్పచ్చు రంజన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఏఏ నిరసనల పేరుతో పాకిస్తాన్ జిందాబాద్ అంటున్న వారిని కాల్చి చంపేందుకు చట్టం తేవాలని పేర్కొన్నారు. లేదంటే అలాంటి వారిని పాకిస్తాన్కు పంపించాలని అన్నారు. ‘భారత్లో ఉంటూ.. ఇక్కడి తిండి తింటూ.. పాకిస్తాన్ పాట పాడేవాళ్లను కాల్చి చంపాలి. లేదంటే వారిని పాకిస్తాన్కు తరిమేయాలి. అలాంటి వారిపట్ల సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. వారిపై నమోదైన కేసుల విషయంలో కూడా ఉదారత అవసం లేదు’అని కొడగులో సోమవారం ఆయన పేర్కొన్నారు. (చదవండి : అమూల్యకు 14 రోజుల కస్టడీ) కర్ణాటక వ్యవసాయశాఖ మంత్రి బీసీ పాటిల్ కూడా ఆదివారం ఇదేరకమైన కామెంట్లు చేశారు. పౌర నిరసనకారులు, పాకిస్తాన్ జిందాబాద్ కామెంట్లు చేసేవారిని కనిపిస్తే కాల్చండి (షూట్ ఎట్ సైట్) ఆర్డర్స్ ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం చట్టం తేవాలని పేర్కొన్నారు. ఈమేరకు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తానని అన్నారు. కాగా, ‘సేవ్ కాన్సిస్టిట్యూషన్’ పేరుతో గురువారం బెంగుళూరులో జరిగిన సీఏఏ నిరసన సభలో అమూల్య లియోన్ అనే యువతి ‘పాకిస్తాన్ జిందాబాద్’ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మరికొందరు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమూల్యపై దేశద్రోహం కేసు నమోదైంది. ఆమెను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. (చదవండి : నిరసనలో నిరసన.. అదుపులోకి మరో యువతి!) -
‘పాక్ జిందాబాద్’ నినాదాలు.. 14 రోజుల కస్టడీ
-
‘పాక్ జిందాబాద్’.. తగిన శిక్ష పడుతుంది!
బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) నిరసన కార్యక్రమంలో.. ‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ అంటూ నినాదాలు చేసిన అమూల్య అనే యువతిపై దేశద్రోహం కేసు నమోదైంది. ఈ క్రమంలో 14 రోజుల పాటు ఆమెను జ్యుడిషియల్ కస్టడీకి తీసుకోవాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. కాగా సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా గురువారం సాయంత్రం బెంగళూరు ఫ్రీడంపార్క్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సహా పలువురు ఈ ర్యాలీకి హాజరయ్యారు. ఈ క్రమంలో అమూల్య లియోన్ అనే యువతి వేదికపై పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసింది. దీంతో కంగుతిన్న నిర్వాహకులు ఆమె నుంచి మైక్ లాక్కుందామని ప్రయత్నించినా.. అమూల్య నినాదాలు కొనసాగించింది. ఈ నేపథ్యంలో అమూల్య తీరుపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. ఈ విషయం గురించి కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప మాట్లాడుతూ.. అమూల్యకు బెయిలు ఇవ్వకూడదని పేర్కొన్నారు. ఆమె తండ్రి సైతం తనను రక్షించేందుకు సిద్ధంగా లేనని చెప్పారన్నారు. ఆయన మాటల ద్వారా అమూల్యకు నక్సల్స్తో సంబంధం ఉందన్న విషయం స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. తనకు తప్పకుండా తగిన శిక్ష పడుతుందని తెలిపారు. ఇక అమూల్య వ్యాఖ్యలకు నిరసనగా.. శ్రీరామ్ సేన, హిందూ జాగృతి సమితిసభ్యులు ఆందోళన చేపట్టారు. అమూల్య క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.(సీఏఏ నిరసనల్లో ‘పాక్ జిందాబాద్’ నినాదాలు) ఇదిలా ఉండగా.. అమూల్య ఇంటిపై కొంతమంది వ్యక్తులు రాళ్లతో దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా అమూల్య వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఇక అమూల్యను చిక్కమగళూరు జిల్లా కొప్పా తాలూకా శివపుర గ్రామవాసిగా పోలీసులు గుర్తించారు. అలాగే అమూల్యను ఆ కార్యక్రమానికి ఎవరు ఆహ్వానించారు.. పాకిస్తాన్కు అనుకూలంగా నినాదాల వెనుక కారణాలేవైనా ఉన్నాయా? అన్న కోణాల్లో విచారణ జరుగుతోంది. -
మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్
సాక్షి, బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీదర్ మహిళలపై దేశద్రోహం కేసు పెట్టడాన్ని నిరసిస్తూ శనివారం ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద ఆందోళన చేసేందుకు ర్యాలీగా కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. రేస్కోర్స్ రోడ్ సమీపంలో సిద్ధరామయ్యతో పాటు దినేశ్ గుండురావు, రిజ్వాన్ అర్షద్, కె. సురేశ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ వ్యవస్థను యడియూరప్ప సర్కారు దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా విమర్శించారు. కర్ణాటకను పోలీస్ రాష్ట్రంగా మార్చిందని దుయ్యబట్టారు. బీదర్లోని షహీన్ పాఠశాలలో వేసిన నాటకంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయన్న కారణంతో తొమ్మిది నుంచి పన్నేండేళ్ల పిల్లలను ఐదు రోజులపాటు పోలీసులు ప్రశ్నించారు. అంతేకాకుండా ప్రధానోపాధ్యాయురాలు, ఓ విద్యార్థి తల్లిపై దేశ ద్రోహం కింద కేసు నమోదు చేశారు. కర్ణాటక పోలీసుల చర్యను ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు తీవ్రంగా ఖండించారు. నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నేతలను అదుపు చేస్తున్న పోలీసులు యెడ్డీని క్షమించరు ఇద్దరు మహిళలను దేశద్రోహం కేసు కింద బలవంతంగా అరెస్ట్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని సిద్ధరామయ్య అంతకుముందు పేర్కొన్నారు. కుమార్తె నుంచి తల్లిని వేరు చేసినందుకు రాష్ట్ర మహిళలు ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పను క్షమించరని వ్యాఖ్యానించారు. సీఎం యడియూరప్ప విచక్షణ కోల్పోయినట్టుగా కన్పిస్తున్నారని సిద్ధరామయ్య తన ట్విటర్లో విమర్శించారు. వందేళ్ల క్రితం చేసిన అరాచక ఐపీసీ చట్టాలను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరముందని ట్వీట్ చేశారు. (చదవండి: ఈ స్క్రిప్ట్ రాసిందెవరు..?) -
రాజ ద్రోహమా? రాజ్యాంగ ద్రోహమా?
మాకు జీతాలు పెంచండి అని అడిగారు ఇద్దరు కర్ణాటక పోలీసులు. కర్నాటక రాష్ట్రంలో అఖిల కర్ణాటక పోలీసు మహాసంఘ నాయకుడు శశిధర్ గోపాల్ పైన, కోలార్ కానిస్టేబుల్ బసవరాజ్ పైన 124ఎ కింద జూన్ 4, 2016న రాజద్రోహం కేసులను నమోదు చేశారు. ఉద్యమాన్ని ప్రభుత్వం అణచివేసింది. ఇటువంటి పాలకులుంటే భారత్ ముక్కలవుతుంది అని నినాదాలు చేసినందుకు కన్హయ్యా కుమార్ మీద రాజద్రోహం కేసు పెట్టారు. క్రికెట్ మ్యాచ్ నడుస్తూ ఉంటే పాకి స్తాన్ జట్టుకు మద్దతుగా మాట్లాడినందుకు రాజద్రోహం కేసును వాడారు. పాకిస్తాన్ క్రికెట్ క్రీడాకారుడిని పెళ్లాడిన భారతీయ మహిళపై రాజద్రోహం కేసు పెట్టనందుకు సంతోషించాలి. 2020 ఫిబ్రవరి 6న ఉత్తరప్రదేశ్లోని అజం ఘర్లో పౌరసత్వ చట్టం సవరణ సీఏఏను విమర్శించినందుకు 135 మంది మీద రాజద్రోహం కేసులుపెట్టారు. 20 మందిని అరెస్టు చేశారు. ఫిర్యా దులో పేర్కొన్న 35 మంది మీద, ఎవరో తెలియని 100 మంది మీద ఈ క్రిమినల్ కేసులుపెట్టడం విచిత్రం. రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు అనుసరించడం, భారత రాజ్యాంగ విలువలను తిలోదకాలిచ్చే చట్టాలు చేయడం, భారత ప్రజాస్వామ్య మౌలిక లక్షణాలను భంగపరిచే చట్టాలు తేవడాన్ని విమ ర్శిస్తే రాజ్య ద్రోహమంటున్నారు. రాజ్యాంగానికి ద్రోహం చేయడం రాజ ద్రోహం అవుతుంది కాని పాలకులను విమర్శిస్తే రాజ ద్రోహమా? వేలాది మందిపై కుప్పలుతెప్పలుగా కేసులు పెట్టేస్తున్నారు. ఈ చట్టంలో లోపాలను, అన్యాయాలను ఎండగట్టే వారిని జాతి వ్యతిరేకులంటున్నారు. దేశ ద్రోహులంటున్నారు. ఆర్టికల్ 19(1)(ఎ)లో చెప్పిన వాక్ స్వాతంత్య్రం కీలకమైనది. అది దేశద్రోహమా? రాజ్యాంగ వ్యతిరేక చట్టాలను నిరసించకపోవడమే దేశద్రోహం. అసలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టాలు చేసేవారే రాజ్యాంగ ద్రోహులు. అదీ రాజకీయం కోసం, ఓట్ల కోసం చేసేవారు స్వచ్ఛమైన రాజకీయాలకు కూడా ద్రోహం చేసినట్టే. జార్ఖండ్లో పదివేలమంది మీద ఒకసారి, మరో సారి 3వేల మందిపై రాజ ద్రోహం కేసులు పెట్టారు. ప్రభుత్వం మారడం మంచిదైంది. లేకపోతే వేలమంది ప్రజలు దేశ ద్రోహనేర నిందితులుగా కోర్టుల చుట్టూతిరుగుతూ అన్యాయమైపోయేవారు. బీదర్ పాఠశాలలో సీఏఏకు వ్యతిరేకంగా నాటకం ప్రదర్శించారు. ఏబీవీపీ కార్యకర్త పోలీసు స్టేషన్లో రాజ ద్రోహం కేసు పెట్టారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విచారణ మొదలుపె ట్టారు. హెడ్ మిసెస్ను అరెస్టు చేశారు. చిన్న పిల్ల లను గంటలకొద్దీ విచారించారు. తొమ్మిదేళ్ల అమ్మాయి తల్లిని అరెస్టు చేశారు. ఆ కూతురు పక్కింటి వారి దగ్గర తలదాచుకుంటున్నది. కోర్టు బెయిల్ ఇవ్వలేదు. పదిహేనురోజుల పైబడి వారికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. పౌరసత్వం వివరాలు అడిగితే చెప్పు చూపండి, అని ఆ నాటకంలో ఒక డైలాగ్ ఉందట. ప్రధాని చిత్రాన్ని చెప్పుతో కొట్టారనీ ఆరోపించారు. ఒకవేళ ఆవిధంగా జరిగితే ఖండించవలసిందే. కానీ మూడేళ్ల జైలు నుంచి యావజ్జీవ కారాగార శిక్ష విధించేంత ఘోరమైన రాజ ద్రోహ నేరమా? బాలలను అయిదారుగంటలపాటు పోలీసులు తమ ఖాకీ యూనిఫాంలో విచా రించడం, బాలల విషయంలో బాలల సంక్షేమ కమిటీని సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోవడం తీవ్ర మైన ఉల్లంఘనలని కర్ణాటక బాలల హక్కుల కమిషన్ విమర్శించింది. రెండు వందల ఏళ్ల కిందట దిష్టి బొమ్మను తగులబెట్టడం పెద్ద పరువునష్టంగా భావించి క్రిమినల్ కేసు పెట్టేవారు. ముర్దాబాద్ డౌన్ డౌన్ నినాదాలు చేస్తే క్రిమినల్ డిఫమేషన్ కేసులు పెట్టి జైలుకు పంపేవారు. ఆ కాలం మారింది. తీవ్రమైన అబద్ధపు విమర్శలు చేసినప్పుడే క్రిమినల్ కేసులు పెట్టాలని తరువాత తీర్పులు వివరిస్తున్నాయి. చీటికీమాటికీ వ్యతిరేకుల మీద, ఉద్యమకా రుల మీద రాజ ద్రోహం కేసులు పెట్టడం అన్యాయ మనీ, ఈ దుర్వినియోగాన్ని నిరోధించాలని ఎన్జీవో కామన్ కాజ్ పిల్ దాఖలు చేసింది. దీనిపై తీర్పు చెబుతూ ‘భారత రాజ్యాంగంలో ఉన్న ప్రతిపదం ఇప్పటికీ చెల్లుతుంది, ఏదీ మారలేదు, మారకూడద’ని ఆనాటి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా పేర్కొన్నారు. విమర్శకులమీద రాజకీయ వ్యతిరేకుల మీద ప్రభుత్వాలు రాజ ద్రోహం కేసు పెట్టకూడదని దీపక్ మిశ్రా 2016లో తీర్పుచెప్పారు. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
పౌర నిరసనలు: ‘ఈ స్క్రిప్ట్ రాసిందెవరు..?’
బెంగుళూరు : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనకారుల అరెస్టులు మనం చూస్తూనే ఉన్నాం..! అయితే, కర్ణాటకలోని బీదర్లో వెలుగుచూసిన ఓ ఘటన మాత్రం పోలీసుల అత్యుత్సాహానికి నిదర్శనంగా నిలిచింది. విద్యార్థులతో నాటక ప్రదర్శన పేరుతో పౌర చట్టంపై అనుచిత వ్యాఖ్యలు చేయించారని పేర్కొంటూ ఇద్దరు మహిళలపై రాజద్రోహం కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. అరెస్టైన వారిలో ఒకరు సదరు విద్యార్థి తల్లి కాగా, మరొకరు పాఠశాల ప్రిన్సిపల్. "వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం" అనే ఆరోపణల నేపథ్యంలో షాహీన్ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. బూటుతో కొట్టు..! బీదర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో జవనరి 21న విద్యార్థుల నాటక ప్రదర్శన పోటీలు జరిగాయి. అయితే, నాటక ప్రదర్శనలో 9వ తరగతి విద్యార్థి ఒకరు.. సీఏఏపై అనుచితంగా ఓ వ్యాఖ్య చేశాడు. ‘జూతే మారేంగే’ (బూటుతో కొడతా) అన్నాడు. ఈ వీడియో బయటపడటంతో సామాజిక కార్యకర్త నీలేష్ రక్షాల్ జనవరి 26న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. స్కూల్ యాజమాన్యంపై, ప్రిన్సిపల్, విద్యార్థి తల్లిపై కేసులు నమోదు చేశారు. ప్రతి రోజు 4 గంటల విచారణ..! డీఎస్పీ రోజూ మధ్యాహ్న 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యార్థులను ప్రశ్నలతో వేధిస్తున్నారని స్కూల్ సీఈవో తౌసిఫ్ మేదికేరి వాపోయారు. విద్యార్థి పొరపాటు మాటలపై దేశద్రోహం కేసు ఎందుకు పెట్టారో అర్థకావడం లేదని అన్నారు. ఈ మాటలు చెప్పుమన్నదెవరు..? ఈ స్క్రిప్ట్ రాసిందెవరు..? అని పదేపదే ప్రశ్నించి పోలీసులు పిల్లల్ని హింస పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే విద్యార్థి వ్యాఖ్యలపై క్షమాపణలు కోరామని చెప్పారు. ఇక బీదర్ పోలీసుల చర్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో.. భావ ప్రకటనా స్వేచ్ఛకు తూట్లు పొడుస్తున్నారని నెటిజన్లు, పేరెంట్స్ గ్రూపులు మండిపడుతున్నాయి.‘బీదర్ పోలీసులు చట్టవిరుద్ధ, అమానవీయ చర్యలకు పాల్పడుతున్నారు’అని పేరెంట్స్ ఫర్ పీస్, జస్టిస్ అండ్ ప్లులారిటీ గ్రూప్ విమర్శించింది. ప్రిన్సిపల్, విద్యార్థి తల్లిని విడుదల చేయాలని, వారిపై కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. -
పాఠశాలపై దేశద్రోహం కేసు
సాక్షి, బీదర్: కర్నాటకలోని బీదర్లో ఒక విచిత్రమైన కేసు నమోదైంది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కి వ్యతిరేకంగా వ్యవహరించారన్న ఆరోపణలతో ఒక పాఠశాలపై దేశద్రోహం కేసునమోదైంది. భారతీయ శిక్షాస్మృతిలోని 124 (ఎ), 153 (ఎ) సెక్షన్ల క్రింద "వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం" అనే ఆరోపణల నేపథ్యంలో కోసం షాహీన్ పాఠశాల యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. జనవరి 26 న సామాజిక కార్యకర్త నీలేష్ రక్షాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. జనవరి 21న పాఠశాల అధికారులు విద్యార్థులను నాటకం ప్రదర్శించడానికి 'ఉపయోగించారని' ఫిర్యాదుదారుడు ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), పౌరుల జాతీయ రిజిస్టర్ (ఎన్ఆర్సీ)ని తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్రీ మోదీని స్కూలు యాజమాన్యం అవమానించిందనేది ప్రధాన ఆరోపణ. విద్యార్థులను అడ్డం పెట్టుకుని, వారు ప్రదర్శించిన నాటకం ద్వారా ప్రధాని మోదీని దుర్భాషలాడారని నీలేష్ ఆరోపించారు. అయితే ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. దీంతో నరేంద్రమోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావాలనే విద్యార్థులను నాటకం ప్రదర్శించడానికి అనుమతించారనే ఆరోపణలతో దేశద్రోహ కేసు నమోదైంది. బీదర్ నగరంలోని షాహీన్ పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా, పాఠశాల విద్యార్థులు సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా చిన్న నాటకాన్ని ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎవరైనా మీ వద్దకు వచ్చి పత్రాల గురించి అడిగితే చెప్పులతో కొట్టండన్న డైలాగులు వివాదాన్ని సృష్టించాయి Recently on d anniversary of Shaheen's school in Bidar city, children played a short skid against CAA & NRC. & made a controversy by saying our beloved PM as a cheap teaseller, further in d play children said if the PM comes to u & ask about documents then beat him with chappals pic.twitter.com/LH9qjBpMoM — Enchanted_Virgo 🇮🇳 🚩 (@Snowflake_3925) January 27, 2020 -
సెలబ్రిటీలపై దేశద్రోహం కేసు; ట్విస్ట్
ముజఫర్పూర్: దేశంలో పెరుగుతున్న మూక దాడులను నిరసిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన 50 మంది ప్రముఖులపై నమోదైన దేశద్రోహం కేసు ఉపసంహరణకు ఆదేశాలు జారీ అయ్యాయి. వారిపై బిహార్లోని సర్దార్ పోలీస్ స్టేషన్లో నమోదైన దేశద్రోహం కేసును మూసివేయాలని ముజఫర్పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్కుమార్ సిన్హా బుధవారం ఆదేశాలిచ్చారు. నిరాధార ఆరోపణలు చేసిన ఈ ఫిర్యాదుదారుపై విచారణ సాగుతుందని ఓ పోలీసు అధికారి తెలిపారు. వేర్పాటు ధోరణులను బలపరిచేలా బహిరంగ లేఖ రాశారంటూ ముజఫర్పూర్కు చెందిన సుధీర్ కుమార్ ఓఝా అనే న్యాయవాది 50 మంది ప్రముఖులపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దేశంలో మూక దాడులు పెరుగుతుండటాన్ని నిరసిస్తూ మణిరత్నం, అపర్ణాసేన్, కొంకణాసేన్, ఆదూర్ గోపాలకృష్ణన్, రామచంద్ర గుహ, రేవతి, అనురాగ్ కశ్యప్, శ్యామ్బెనగల్ వంటి 50 మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు మోదీకి జూలైలో లేఖ రాసిన విషయం తెలిసిందే. కాగా, మోదీకి బహిరంగ లేఖ రాసిన 49 మంది ప్రముఖులపై దేశద్రోహం కేసు పెట్టడంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కేసును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్, వామపక్షాలు, డీఎంకే, ఆర్జేడీ సహా పలు పార్టీలు డిమాండ్ చేశాయి. దీంతో బిహార్ పోలీసులు వెనక్కుతగ్గారు. అయితే, ఈ కేసుతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. (చదవండి: ప్రముఖులపై రాజద్రోహం కేసు) -
రేపే నామినేషన్; ఏడాది జైలు, జరిమానా!
చెన్నై : రాజద్రోహం కేసులో మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం(ఎండీఎంకే) చీఫ్ వైగోనకు చెన్నై కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. అదే విధంగా 10 వేల రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ప్రత్యేక న్యాయస్థానం జడ్జి జె. శాంతి ఈ మేరకు తీర్పు వెలువరించారు. కాగా శనివారం రాజ్యసభ సభ్యత్వానికై నామినేషన్ వేసేందుకు వైగో సిద్ధపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు తీర్పు ఆయనను ఇరకాటంలో పడేసింది. అయితే ప్రజాప్రతినిధి చట్టం- 1951లో రాజద్రోహాన్ని నేరంగా పరిగణించే సెక్షన్లు లేవు కాబట్టి వైగో నామినేషన్ వేయవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కాగా 2009లో ఓ పుస్తకావిష్కరణ సందర్భంగా వైగో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఈలంకు ఏమైంది’ అనే అంశంపై ఆయన మాట్లాడుతూ.. శ్రీలంకలో ఎల్టీటీఈ పోరాటం ఆపకపోయినట్లైతే భారత్ ఒక్కటిగా కలిసి ఉండబోదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో వైగోపై రాజద్రోహం కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో 2017లో అరెస్టైన ఆయన నెలరోజుల పాటు జైలులో ఉన్న తర్వాత బెయిలుపై విడుదలయ్యారు. ఇక 1978 నుంచి 1996 మధ్య కాలంలో వైగో రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. తమ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే లేకపోయినప్పటికీ.. దాదాపు 23 ఏళ్ల తర్వాత డీఎంకే మద్దతుతో పెద్దల సభకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. జూలై 18న తమిళనాడులో ఇందుకు సంబంధించిన ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం కోర్టు తీర్పు వెలువడటం గమనార్హం. -
రాజద్రోహం కేసు ; ఆయనవల్లే బయటపడ్డా..!
రాయ్పూర్ : ఇన్వర్టర్ల తయారీ సంస్థలతో ప్రభుత్వం కుమ్మక్కైందంటూ ప్రభుత్వంపై విమర్శలకు దిగిన ఓ వ్యక్తిని ఛత్తీస్గఢ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేవిధంగా సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేశాడంటూ రాజనంద్గాం జిల్లాకు చెందిన మంగీలాల్ అగర్వాల్పై రాజద్రోహం కేసు నమోదు చేశారు. అయితే, ఈఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మంగీలాల్పై పెట్టిన రాజద్రోహం కేసును ఉపసంహరించుకొన్న పోలీసులు శనివారం ఆయనను విడుదల చేశారు. తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవడంలో ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ పాత్ర ప్రధానమైందని మంగీలాల్ చెప్పుకొచ్చారు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి : ప్రభుత్వంపై విమర్శలు; రాజద్రోహం కేసు, అరెస్టు) -
ఇన్వర్టర్ల అమ్మకాలు పెంచాలనే పవర్ కట్..
రాయ్పూర్ : కరెంటు కోతల గురించి ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని విమర్శించిన ఓ పౌరుడిని ఛత్తీస్గఢ్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేవిధంగా సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేశాడంటూ రాజద్రోహం కేసు నమోదు చేశారు. రాజనంద్గాం జిల్లాకు చెందిన మంగీలాల్ అగర్వాల్ పవర్కట్ను నిరసిస్తూ ఓ వీడియో రూపొందించారు. ఇన్వర్టర్ కంపెనీతో.. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న కారణంగా కరెంటు కోతలు విధిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నిర్వాకం వల్లే ప్రతీ రెండు గంటలకొకసారి 10 నుంచి 15 నిమిషాల పాటు కరెంటు పోతోందని పేర్కొన్నారు. ఇన్వర్టర్ల అమ్మకాలు పెంచుకునే క్రమంలో ఆయా ఉత్పత్తుల కంపెనీలు మరోసారి ప్రభుత్వాన్ని సంప్రదించే అవకాశం ఉందని.. కాబట్టి రానున్న రోజుల్లో ఈ సమస్య మరింత జటిలం కానుందని వ్యాఖ్యలు చేశారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారడంతో రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ పోలీసులను ఆశ్రయించింది. ప్రభుత్వ, ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన అగర్వాల్పై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం అతడిపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. దీంతో భూపేశ్ బఘేల్ ప్రభుత్వ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందంటూ బీజేపీ విమర్శించింది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అమాయకులను అరెస్టు చేసి ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడింది. -
మాజీ ఎంపీ రమ్యపై రాజద్రోహం కేసు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సోషల్ మీడియా చీఫ్, ప్రముఖ నటి, మాజీ ఎంపీ రమ్యకు(దివ్య స్పందన) భారీ షాక్ తగిలింది. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి రమ్య చేసిన ఓ ట్వీట్కు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదు మేరకు ఉత్తరప్రదేశ్లోని గోమతినగర్ పోలీసులు ఆమెపై రాజద్రోహం కింద కేసు నమోదు చేశారు. మోదీ తనను పోలిన మరో రూపంపై చోర్ అని రాసుకుంటున్నట్టు ఉన్న ఓ మార్ఫింగ్ ఫొటోను సోమవారం రోజున రమ్య ట్విటర్లో పోస్ట్ చేశారు. దీనిపై లక్నోకు చెందిన న్యాయవాది సయీద్ రిజ్వాన్ అహ్మద్ గోమతినగర్ పోలీసులను ఆశ్రయించారు. ‘దేశ ప్రధాని ఖ్యాతిని దిగజార్చేలా రమ్య ట్వీట్ చేశారు. ప్రధాని పట్ల వారికి గల ద్వేషాన్ని ఇది తెలియజేస్తుంది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ఓ నాయకుడిని, దేశ ప్రధానిని అంతర్జాతీయంగా చులకన చేసే విధంగా ట్వీట్ చేశార’ని రిజ్వాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు రమ్యపై ఐపీసీ సెక్షన్ 124-ఏ(రాజద్రోహం)తోపాటు, సెక్షన్ 67(ఐటీ యాక్ట్) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఆమెపై కేసు నమోదు అయినట్టు వచ్చిన ఓ వార్తపై స్పందించిన రమ్య ‘అయితే మంచిది’ అంటూ వ్యంగ్యంగా స్పందించారు. గత కొద్ది రోజులుగా రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై బీజేపీ, కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం కోనసాగుతున్న సంగతి తెలిసిందే. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో.. భాగస్వామిగా భారత్ సూచించిన రిలయెన్స్ కంపెనీని ఎంపిక చేయక తప్పలేదని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయీస్ హొలాండే ఇటీవల ఆరోపించారు. దీని తర్వాత బీజేపీపై కాంగెస్ మరింతగా మిమర్శల దాడిని పెంచింది. -
మరింత చిక్కుల్లో దినకరన్
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకేపై తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్న శశికళ మేనల్లుడు టీవీవీ దినకరన్కు ఊహించని పరిణామం ఎదురైంది. ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేసినట్లు సేలం పోలీసులు ప్రకటించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కరపత్రాలు పంచటమే అందుకు కారణమని తెలుస్తోంది. నీట్ పరీక్ష విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభించిన వైఖరిని తులనాడుతూ.. హత్యా ప్రభుత్వాలుగా అభివర్ణిస్తూ దినకరన్ వర్గానికి చెందిన నేతలు గత నెల 18న కరపత్రాలు పంచారు. ప్రభుత్వ వ్యతిరేక రాతలు రాయటం.. తద్వారా ప్రభుత్వంపై తిరుగుబాటు వేయాలంటూ ప్రజలకు దినకరన్ పిలుపునిచ్చారంటూ వినాయకమ్ అనే వ్యక్తి సేలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దినకరన్తోపాటు ఆయన మద్ధతుదారులు 16 మందిపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టయినవారిలో మాజీ మంత్రి సేఈ వెంకటాచలం కూడా ఉన్నట్లు సమాచారం. కాగా, తమదే అసలైన పార్టీ అని దినకరన్ వర్గం.. ఎలాగైనా అధికారం చేజార్చుకోనివ్వకుండా పళని-పన్నీర్ వర్గాలు పోటాపోటీగా తమ ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నాయి. ఓవైపు దినకరన్ గవర్నర్ను ఎప్పటికప్పుడు కలుస్తూ బలనిరూపణకు ప్రభుత్వాన్ని ఆదేశించాని కోరుతుండగా.. పార్టీకి వ్యతిరేకంగా రాజకీయాలు నడుపుతున్న వారికి అనర్హత వేటు ద్వారా చెక్ పెట్టాలని పళని ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 18న దినకరన్తోపాటు ఆయన సన్నిహితుడు, తిరుగుబాటు ఎమ్మెల్యేలో ఒకరైన వెట్రైవెల్ పై వేటు వేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది కూడా. ఇప్పటికే దినకరన్ పై మనీలాండరింగ్, ఈసీకి లంచం ఇవ్వజూపారన్న కేసులు నమోదైన విషయం తెలిసిందే. -
‘సిమి’ చీఫ్కు జీవితఖైదు
దేశద్రోహం కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు ఇండోర్: నిషేధిత ‘సిమి’ సంస్థ చీఫ్ సఫ్దార్ హుస్సేన్ నగోరి, మరో 10 మంది కార్యకర్తలకు 2008 నాటి దేశ ద్రోహం కేసులో ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. నగోరితో పాటు హఫీజ్ హుస్సేన్ , ఆమిల్ పర్వజ్, శివ్లి, కమృద్దీన్, షహ్దౌలి, కమ్రాన్ , అన్సార్, అహ్మద్ బైగ్, యాసిన్ , మున్రోజ్లకు జీవితఖైదు ఖరారు చేస్తూ ప్రత్యేక అదనపు సెషన్స్ జడ్జి బి.కె.పలోడా తీర్పు వెలువరిం చారు. భారత రాజ్యాంగం, చట్టాలపై దోషులకు విధేయత లేదని వారి చర్యల ద్వారా స్పష్టమైందని 84 పేజీల తీర్పులో కోర్టు అభిప్రాయపడింది. ‘దేశ సమైక్యత, సమగ్రతకు వ్యతిరేకంగా వారు ప్రవర్తించారు. మత విద్వేషాలను ప్రోత్స హించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు’ అని పేర్కొంది. మన్రోజ్ మినహా మిగిలిన 10 మంది నిందితులను అహ్మదాబాద్లోని సబర్మతి జైలులో ఉంచినట్లు ప్రభుత్వ న్యాయవాది విమల్ మిశ్రా తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీర్పు వివరాలను తెలియజేయాలన్న నిందితుల అభ్యర్థన మేరకు కోర్టు.. తీర్పు వివరాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారికి తెలియజేసింది. -
వైగో ద్రోహి కాదు
సాక్షి, చెన్నై: ఎండీఎంకే నేత వైగోకు దేశ ద్రోహం కేసు నుంచి విముక్తి లభించింది. ఆయన ద్రోహి కాదని తేల్చిన న్యాయస్థానం, ఆ కేసు నుంచి గురువారం విడుదల చేసింది.శ్రీలంకలో ఎల్టీటీఈలను లక్ష్యంగా చేసుకుని గతంలో సాగిన యుద్ధం గురించి తెలిసిందే. ఈలం తమిళుల్ని ఆదేశ సైన్యం పొట్టనపెట్టుకుంది. లక్షలాది మంది నిరాశ్రయలు కాగా, వేలాది మందిని బలవంతంగా హతమార్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు తగ్గట్టుగా 2008లో ఎండీఎంకే నేత వైగో చెన్నై వేదికగా జరిగిన ఓ సభలో తీవ్రంగానే విరుచుకుపడ్డారు. ‘శ్రీలంక’లో అసలు ఏమి జరిగిందంటే...అన్న నినాదంతో సాగిన ఈ కార్యక్రమంలో వైగో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ప్రజల్ని రెచ్చగొట్టడమే కాకుండా, భారత దేశ గౌరవాన్ని కించ పరిచే విధంగా వ్యాఖ్యలు చేశారన్న విషయాన్ని క్యూబ్రాంచ్ పరిగణలోకి తీసుకుంది. ఎల్టీటీఈలకు అనుకూలంగా ఆయన వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ, సెక్షన్ 124-ఏతో పాటు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న మరికొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. ఆ మేరకు దేశ ద్రోహం ముద్రతో కూడిన కేసులో ఆయన అరెస్టు కావాల్సి వచ్చింది. కొన్నాళ్లు జైల్లో ఉన్నా, మళ్లీ బయటకు వచ్చారు. తన మీద కక్ష సాధింపుగా ఈ కేసును అప్పటి డీఎంకే ప్రభుత్వం నమోదు చేసిందన్న ఆగ్రహాన్ని వైగో తరచూ వ్యక్తం చేస్తుంటారు. ఇక,ఈ కేసు విచారణ వాయిదాల పర్వంతో ఏళ్ల తరబడి సాగుతూ వచ్చింది. ఇప్పటి వరకు 112 వాయిదాలతో విచారణ సాగినట్టు సమాచారం. ఇక, ఆరుగురు న్యాయమూర్తులు కేసు విచారణలో మారి ఉండడం గమనార్హం. ఎట్టకేలకు తుది విచారణ ముగియడంతో, వైగో దేశద్రోహి అని నిరూపించేందుకు తగ్గ ఆధారాల సమర్పణలో క్యూబ్రాంచ్ విఫలం అయింది. ఆధారాలు లేని దృష్ట్యా, వైగో ద్రోహి కాదు అని, నిర్ధోషిగా పేర్కొంటూ చెన్నై మూడో అదనపు సెషన్స్ కోర్టు విడుదల చేసింది. కోర్టు తీర్పుతో ఎండీఎంకే వర్గాల్లో ఆనందం వికసించాయి. కోర్టు బయట వైగోను పూలమాలలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా మీడియాతో వైగో మాట్లాడుతూ తన మీద కక్ష సాధింపుగా డీఎంకే అధినేత కరుణానిధి దేశ ద్రోహం ముద్ర వేయించేందుకు యత్నించారని, అయితే, తాను నిర్ధోషిగా బయటకు రావడం ఆనందంగా ఉందన్నారు. తదుపరి సీపీఐ కార్యాలయానికి చేరుకున్న వైగో, కావేరి విషయంగా సీపీఐ, సీపీఎం నేతలు ముత్తరసన్, రామకృష్ణన్, వీసీకే నేత తిరుమావళవన్లతో సమీక్షించారు. చలో ఢిల్లీ పేరుతో శుక్రవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి వినతి పత్రం సమర్పించేందుకు వైగో నేతృత్వంలోని మక్కల్ ఇయక్కం నిర్ణయించింది. -
దేశద్రోహం కేసు పెట్టినా సెటైర్లు ఆపలేదు!
పట్నా: బిహార్పై వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూపై దేశద్రోహం అభియోగాలు నమోదయ్యాయి. అధికార జేడీయూ ఎమ్మెల్సీ, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీరజ్కుమార్ ఫిర్యాదు మేరకు శాస్త్రి నగర్ పోలీసు స్టేషన్లో ఆయనపై సెక్షన్ 124 ఏ (దేశద్రోహం) నమోదైంది. మరోవైపు ఓ లాయర్ కూడా ఆయనపై కేసు నమోదు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బిహార్ను తీసుకుంటామనే షరతు మీద కశ్మీర్ను పాకిస్థాన్కు ఇచ్చేందుకు సిద్ధమని, కశ్మీర్ను బిహార్తో కలిపి ప్యాకేజీగా ఇస్తామని, బిహార్ వద్దంటే కశ్మీర్ కూడా ఇవ్వబోమని జస్టిస్ కట్జూ తీవ్ర వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బిహార్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బిహార్ సీఎం నితీశ్కుమార్ సహా పలువురు నేతలు ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో తనవి సరదా వ్యాఖ్యలు మాత్రమేనని వివరణ ఇచ్చిన కట్జూ బుధవారం మళ్లీ తన పాత ధోరణిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తనపై కావాలంటే బిహారీలు ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేయవచ్చునని చమత్కరించారు. 'బిహార్కు నేను అమ్మనా, నాన్ననా అని నితీశ్కుమార్ ప్రశ్నిస్తున్నారు. బిహార్కు నేను అమ్మానాన్నను కాదు కానీ శకుని మామను' అంటూ పేర్కొన్నారు. 'వస్త్రాపహారణం జరుగుతుంటే ద్రౌపది గౌరవాన్ని కాపాడుకునేందుకు కృష్ణుణ్ని ప్రార్థించింది' అంటూ పరోక్షంగా నితీశ్పై విమర్శనాస్త్రాలు సంధించారు. -
ఆమ్నేస్టీ సంస్థపై రాజద్రోహం కేసు
బెంగళూరు: అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ (ఆమ్నేస్టీ)పై కర్ణాటకలో రాజద్రోహం కేసు నమోదు అయింది. కశ్మీర్లో మానవ హక్కులపై అమ్నేస్టీ సంస్థ శనివారం బెంగళూరులో సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో కశ్మీరీలు ఆజాదీ నినాదాలు చేశారు. దీంతో అమ్నేస్టీ సదస్సు జాతి వ్యతిరేకమంటూ ఏబీవీపీ ఫిర్యాదు చేసింది. దేశానికి వ్యతిరేకంగా కొందరు ప్రసంగాలు చేశారని ఏబీవీపీ తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో అమ్నెస్టీ సంస్థతో పాటు మరికొందరిపై కర్ణాటక పోలీసులు సోమవారం రాజద్రోహం కేసు నమోదు చేశారు. కాగా తమకు ఇంకా ఎఫ్ఐఆర్ కాపీ అందలేదని ఆమ్నేస్టీ కర్ణాటక విభాగం తెలిపింది. -
అమ్నెస్టీ పై దేశ ద్రోహ కేసు నమోదు
బెంగళూరు: అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ పై దేశ ద్రోహం కేసు నమోదైంది. ఆసంస్థ ఏర్పాటు చేసిన చర్చాకార్యక్రమంలో కొందరు దేశ ద్రోహ నినాదాలు చేయడమే ఇందుకు కారణం. బెంగళూరులో శనివారం కశ్మీర్ అంశంపై ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమం అస్తవ్యస్థంగా మారింది. చర్చా కార్యక్రమంలో కశ్మీర్ కు చెందిన విద్యార్థులు చొరబడి కశ్మీరీ పండిడ్ నాయకునితో వాదనకు దిగారు. ఇందులో భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జరిగిన సంఘటనపై విచారణ జరుపుతున్నట్టు కర్నాటక హోం మంత్రి జి. పరమేశ్వర తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఏబీవీపీ కార్యకర్త ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను వారికి సమర్పించారు. జమ్ము కశ్మీర్లోని బాధితులకు న్యాయం చేసేందుకే తాము చర్చా కార్యక్రమం నిర్వహించామని అమ్నెస్టీ స్ఫష్టం చేసింది. -
స్కూలు ప్రిన్సిపల్ పై దేశద్రోహం కేసు నమోదు
భోపాల్: భారతదేశ పటాన్ని తప్పుగా చిత్రీకరించినందుకు పాఠశాల ప్రిన్సిపల్ సహా ముగ్గురిపై దేశద్రోహం కేసు నమోదైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సదోల్ జిల్లాలో చోటుచేసుకుంది. పాఠశాల డైరీలో ఇండియా పటంలో కశ్మీర్ ను వేరే దేశం భూభాగంలో ఉన్నట్టు చిత్రీకరించారు. దీంతో పాఠశాల యాజమాన్యంపై బీజేపీ యువమోర్చా కార్యకర్త ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రీన్ బెల్స్ స్కూలు యజమాని మహ్మద్ షరీఫ్ ప్రిన్సిపల్ గోవింద్ చంద్ర దాస్, ప్రింటింగ్ ప్రెస్ ఓనర్ ఏకే అగర్వాల్ లపై దేశద్రోహం కేసును నమోదు చేసిన పోలీసులు వారిని జైలుకు తరలించారు. ‘భూ ఖగోళ ప్రాంత సమాచార నియంత్రణ బిల్లు-2016’ ప్రకారం భారతదేశ పటాన్ని తప్పుగా చిత్రీకరిస్తే కఠినశిక్ష విధించేలా ఇటీవల కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఈమధ్య కొన్ని సామాజిక మాధ్యమాల్లో జమ్మూ కశ్మీర్, అరుణాచల్ప్రదేశ్లను వరుసగా పాకిస్తాన్, చైనా భూభాగాలని సూచించడం వివాదస్పదమైన సంగతి తెలిసిందే. -
ఓవైసీ పై రాజ్యద్రోహం కేసు నమోదు
హైదరాబాద్: మజ్లిస్ ఇత్తెహాదులు ముస్లిమీన్ (ఎంఐఎం) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై దేశ ద్రోహం కేసు నమోదైంది. 11 వ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాల మేరకు ఐపీసీ సెక్షన్ 124(ఎ) ప్రకారం రాజ్యద్రోహం కేసును నమోదు చేసినట్టు ఎల్బీ నగర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. హైదరాబాద్ లో జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసిన ఉగ్రవాదులకు న్యాయ సహాయం అందిస్తామని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులను సమర్థిస్తూ మాట్లాడిన ఓవైసీ పై చర్యలు తీసుకోవాలని కరుణా సాగర్ అనే లాయర్ న్యాయస్థానంలో ప్రైవేట్ పిటిషన్ ను దాఖలు చేశారు. దీనిపై స్పందించిన కోర్టు ఓవైసీపై కేసు నమోదుకు పోలీసులను ఆదేశించింది. -
బెయిలొచ్చినా.. ఇంకా జైల్లోనే!
పటేళ్ల ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ కు రాజద్రోహం కేసులో బెయిల్ లభించినా.. అతడు మాత్రం ఇంకా కొన్నాళ్ల పాటు జైల్లోనే ఉండాల్సి వస్తోంది. రాజద్రోహం కేసులో మాత్రం అతడికి దాదాపు 9 నెలల తర్వాత బెయిల్ వచ్చింది. గుజరాత్ హైకోర్టు అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆరు నెలల పాటు గుజరాత్ వెలుపల ఉండాలని ఆదేశించింది. అంతవరకు బాగానే ఉన్నా.. హార్దిక్ పటేల్ మీద మరో కేసు ఉందని.. అందువల్ల ఆ కేసులో మాత్రం అతడు ఇంకా జైల్లోనే ఉండాల్సి వస్తుందని, అ కేసులో కూడా బెయిల్ వస్తేనే బయటకు రావడానికి వీలవుతుందని అతడి తరపు న్యాయవాది జుబిన్ భద్ర తెలిపారు. -
'కేసులతో అణగదొక్కలేరు'
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, నడుస్తున్న తెలంగాణ పత్రిక సంపాదకుడు కాశీంపై పెట్టిన రాజద్రోహం కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్లోని సోమాజీగూడ ప్రెస్క్లబ్లో కాశీంపై కేసు ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ 495 మంది కవులు, రచయితల సంతకాల సేకరణ పత్రాన్ని విడుదల చేశారు. రచయితలను పోలీసు కేసులతో అణగదొక్కలేరని మండిపడ్డారు. మావోయిస్టులకు లేఖలు రాశారనే అభియోగంతో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు పెట్టడం దారుణమని పేర్కొన్నారు. దీనిపై త్వరలోనే హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలసి వినతిపత్రం సమర్పిస్తామని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరించిన విధానాలనే తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తోందని కాశీం దుయ్యబట్టారు. -
ఈ విద్వేషాన్ని సహించగలమా?
దేశాన్ని అస్థిరపర్చేందుకు అసహనం అనే ఒక వైరస్ను ప్రవేశపెట్టి హిందుత్వంపై ద్వేషంతో భారతదేశంపై దాడి చేస్తున్నారు. నక్సలైట్లపై కేసులు పెట్టే మనం తిన్నింటి వాసాలు లెక్కపెట్టే జాతి వ్యతిరేకులపై కేసులు పెట్టకూడదా? ఎంఐఎం పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద ప్రసంగాలకు పెట్టింది పేరు. ఒక వ్యక్తినో, పార్టీనో, చివరకు వ్యవస్థనో విమర్శిస్తే, అలాంటి విమర్శ ద్వారా వివాదాన్ని సృష్టించి లబ్ధి పొందుదాం అనుకుంటే వేరు. ఆయన చేసే విమర్శ లకు ఆయా సంస్థలో, వ్యక్తులో సమాధానమిస్తారు. అక్కడితో అది సమసిపోతుంది. కానీ ఈసారి ఆయన హద్దు మీరారు. గొంతు మీద కత్తి పెట్టినా ‘భారత్ మాతా కీ జై’ అనేది లేదని ప్రకటించి ఒక పెద్ద వివాదానికి తెరతీశారు. ఏం చేసింది ఆ నినాదం? అందులో తప్పేముంది? స్వాతంత్య్ర సంగ్రామంలో అది కోట్లాదిమంది భారతీయులను ఏకం చేసిన నినాదం. స్వాతంత్య్రానంతరం ఈ దేశ పౌరుల ఐక మత్యాన్ని చాటుతున్న నినాదం. ‘తల్లి భారత దేశానికి జయం కలగాలి’ అన్నదే ఆ నినాదంలోని అంతరార్ధం. దేశానికి జయం కలగాలని కోరుకోవడమంటే దేశా భివృద్ధిని కాంక్షించడం. మన ఇల్లు, తల్లి బాగుండాలని కోరుకోవడం. అలా కోరుకోకపోవడమంటే బాహా టంగా దేశ వినాశనాన్ని, విచ్ఛిన్నాన్ని కోరుకోవడమే. భరతమాతకు ఎందుకు జై కొట్టాలి? భరత మాత విజయాన్ని ఎందుకు మనం కాంక్షించాలి? మన దేశంలో 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు వాటిలో ఎన్నో మతాలు, కులాలు, జాతులు, వందలాది భాషలు ఉన్నాయి. వీరందరినీ కడుపులో పెట్టుకుని కాపాడుతున్నది కాబట్టి జై కొట్టాలి. ఆమె విజయం సాధించటం అంటే.. వీరంతా సుఖ సంతోషాలతో, భోగ భాగ్యాలతో వర్థిల్లటమే కాబట్టి. సర్వేజనా స్సుఖినో భవంతు అని.. అంతా బాగుండాలని కోరుకునే మంచి తల్లి కాబట్టి. ఎన్నో ముస్లిం దేశాల్లో పేదరికం తాండవ మాడుతోంది. రెండు వర్గాలై ఘర్షణలు పడుతుండటం వల్ల చాలాచోట్ల అరాచకం రాజ్యమేలుతోంది. ఉగ్ర వాదం విస్తరిస్తోంది. ఒకే భాష, ఒకే దేశం, ఒకే మతం అయినా ఇలాంటి అనారోగ్యకరమైన పరిస్థితులు అక్క డున్నాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని నింపుకుని, 125 కోట్ల మందిని ఒకేతాటిపైకి తెచ్చి ముందుకు నడిపిస్తున్న మాత భరతమాత. ప్రపంచ వినువీధుల్లో ప్రతి భారతీ యుడూ గర్వంగా ఎలుగెత్తి చాటగల నినాదం. ఒవైసీ అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతానికో లేక పార్టీకో పరిమితమైతే జాతి వ్యతిరేకులపై ఏం చర ్యలు తీసుకోవాలో వాటిని ప్రభుత్వమే తీసుకుంటుంది. కానీ, ఒక వర్గానికి ప్రతినిధిగా ఆయన ఈ వైఖరిని ప్రచారం చేయాలనుకుంటే, దేశాన్ని అస్థిరపరచాలని చూస్తే మాత్రం భారతీయులు తిరగబడతారు. ఆయన ఆ ఒక్క మాట అని ఆగలేదు. పవిత్రమైన రాజ్యాంగాన్ని కూడా తన తప్పుడు ఆలోచనకు అడ్డం పెట్టుకున్నారు. రాజ్యాం గంలో చెప్పలేదు కాబట్టి భరతమాత వర్థిల్లాలని తాను నినదించనని ఆయన అన్నారు. అంటే, ఆయన చేస్తున్న దంతా రాజ్యాంగంలో పేర్కొన్నారా? ప్రసిద్ధ గేయ రచయిత జావేద్ అక్తర్ రాజ్యసభలో ప్రసంగించినట్లుగా.. కుర్తా, షేర్వాణీ వేసుకోమని, టోపీ పెట్టుకోమని ఒవైసీకి రాజ్యాంగంలో చెప్పారా? మరి ఆయన ఎందుకు అవి ధరిస్తున్నారు? మన ఇంట్లో ఎన్నో సమస్యలు ఉండవచ్చు. వాటిని పరిష్కరించుకోవటానికి కుటుంబ సభ్యులు విభేదించు కోవచ్చు. ఒక్కోసారి గొడవ పడటం కూడా సాధార ణమే! కానీ, కుటుంబాన్నే కూల్చాలని చూసే జాతి వ్యతి రేకులు ఈ మధ్యకాలంలో తయారయ్యారు. హింసకు పాల్పడటాన్ని పక్కన పెడితే నక్సలైట్లు దేశభక్తులే అనిపిస్తుంది. ఎందుకంటే వారు రాజ్యం మీద ఎదురు తిరుగుతున్నారు తప్ప జాతి వ్యతిరేకులు కాదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నక్సలైట్లపై కేసులు పెడుతున్న మనం జాతి వ్యతిరేకులపై ఎందుకు పెట్టకూడదు? తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్న వారు దేశద్రోహులు కాదా? దేశాన్ని అస్థిరపర్చేందుకు అసహనం పేరిట ఒక వైరస్ను ప్రవేశపెట్టారు. హిందుత్వంపై ద్వేషంతో భార తదేశంపై దాడి చేస్తున్నారు. జాతికి తూట్లు పొడవాలని చూస్తున్నారు. యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్య సించాల్సిన విద్యార్థులు నోటికొచ్చినట్లు మాట్లాడటమే ప్రజాస్వామ్యమా? వీరు చేసింది పక్కనపెట్టి వారిని హీరోలుగా తీర్చిదిద్దాలని చూస్తున్న వారు సెక్యుల రిస్టులు అవుతారా? రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్ ఆర్ఎస్ఎస్ను ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్తో పోల్చారు. దేశ ంలో కొన్నివేల పాఠశాలలు స్థాపించి, లక్షలాది మంది పిల్లలకు విద్యను అందిస్తూ, దేశానికి డాక్టర్లు, ఇంజనీర్లను అందిస్తున్న సంస్థను.. దేశంలో సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ జాతి ఐక్యతను కాపాడుతున్న సంస్థను.. మతం పేరుతో అరాచకం సృష్టిస్తూ మానవత్వమనేదే లేకుండా మానవ జాతిపై యుద్ధానికి దిగిన ఉగ్రవాద సంస్థతో పోల్చటం ఆయన పెద్దరికాన్ని దిగజారుస్తోంది. మెజార్టీ ఉంది కదా అని దేశాభివృద్ధికి పాటుపడే, ప్రజల సంక్షేమాన్ని చేపట్టే ముఖ్యమైన బిల్లులను అడ్డుకుంటూ.. ప్రభుత్వం పైన, ఆర్ఎస్ఎస్పైన అభాండాలు వేసి తప్పించుకో వాలని ఆయన చూస్తున్నారు. ఇలాంటివారిని ప్రజలు క్షమించరు. అయినా, హిందుత్వం పట్ల వారికెందుకంత అక్కసు? హిందుత్వం అనేది ఒక మతం కాదు. అదొక సంస్కృతి. ప్రపంచమంతా కుటుంబం అనుకునే ఒక భావన. హిందూ సంప్రదాయాన్ని అనుసరించటమే తమ సమస్యలకు పరిష్కారమని పాశ్చాత్యులు భావి స్తున్న నేపథ్యంలో భారతీయులు మాత్రం వ్యతిరేకిం చటం విడ్డూరం. మన సంప్రదాయాన్ని, సంస్కృతిని కించపర్చాలని చూసే కుహనా మేధావులు సిగ్గు పడాలి. తలదించుకోవాలి. భరత మాత వర్థిల్లాలి. భారతీయు లకు జయం కలగాలి. భారత్ మాతాకీ జై.. వ్యాసకర్త బీజేపీ నాయకుడు - పురిఘళ్ల రఘురామ్ ఈమెయిల్: raghuram.bjp@gmail.com -
బెయిల్ పై విడుదలైన కన్హయ్య కుమార్
న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులో అరెస్టయిన జేఎన్యూఎస్యూ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి విడుదలయ్యాడు. అనంతరం అక్కడి నుంచి నేరుగా జేఎన్యూకు వెళ్లాడు. వర్సిటీకి చేరుకున్న విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్యకు తోటి వర్సిటీ విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. కొద్దిసేపు అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఢిల్లీ హైకోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కన్హయ్యకు ఊరట కల్పిస్తూ జస్టిస్ ప్రతిభారాణితో కూడిన ధర్మాసనం ఆరు నెలల కాలానికి బెయిల్ మంజూరు చేసింది. ఆయన దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనరాదని, కేసు దర్యాప్తునకు సహకరించాలని కోర్టు నిర్దేశించింది. అవసరమైనపుడు అధికారుల ఎదుట ఆయన హాజరుకావాలని, కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. విడుదల కోసం రూ. 10 వేల వ్యక్తిగత బాండు, అంతే మొత్తానికి వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలంది. తాను భారత్కు వ్యతిరేకంగా ఎటువంటి నినాదాలూ చేయలేదంటూ కన్హయ్య బెయిల్కు దరఖాస్తు చేసుకోగా హైకోర్టు మంజూరు చేసింది. ఆరు నెలల బెయిల్ మంజూరు కావడంతో కొన్ని షరతులతో విడుదలయ్యాడు. ఫిబ్రవరి 12న కన్హయ్య అరెస్టయిన విషయం విదితమే. -
కన్హయ్యకు షరతులతో బెయిల్
విచారణకు సహకరించాలని ఢిల్లీ హైకోర్టు నిర్దేశం ♦ విచారణ కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లరాదు ♦ రూ. 10 వేల చొప్పున బాండు, పూచీకత్తు ఇవ్వాలి ♦ విద్యార్థుల సిద్ధాంతాలు ఏవైనా రాజ్యాంగానికి లోబడాలి న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులో అరెస్టయిన జేఎన్యూఎస్యూ అధ్యక్షుడు కన్హయ్యకు ఢిల్లీ హైకోర్టు బుధవారం షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. కన్హయ్యకు ఊరట కల్పిస్తూ జస్టిస్ ప్రతిభారాణితో కూడిన ధర్మాసనం ఆరు నెలల కాలానికి బెయిల్ మంజూరు చేసింది. ఆయన దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనరాదని, కేసు దర్యాప్తునకు సహకరించాలని నిర్దేశించింది. అవసరమైనపుడు అధికారుల ఎదుట ఆయన హాజరుకావాలని, కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. విడుదల కోసం రూ. 10 వేల వ్యక్తిగత బాండు, అంతే మొత్తానికి వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలంది. తాను భారత్కు వ్యతిరేకంగా ఎటువంటి నినాదాలూ చేయలేదంటూ కన్హయ్య బెయిల్కు దరఖాస్తు చేసుకోగా హైకోర్టు మంజూరు చేసింది. మిగతా ఇద్దరూ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. నా కుమారుడు ఉగ్రవాది కాదు: కన్హయ్య తల్లి ‘‘నా కుమారుడు ఉగ్రవాది కాదు. ఈ విషయాన్ని ప్రపంచమంతా త్వరలో తెలుసుకుంటుంది. అతడిపై నాకు విశ్వాసముంది. తనను ఇరికించిన ప్రత్యర్థులతో అతడు పోరాడుతాడు’’ అని కన్హయ్య తల్లి మీనాదేవి పేర్కొన్నారు. తన కుమారుడికి బెయిల్ మంజూరు కావటం పట్ల ఆమె బీహార్ నుంచి పీటీఐ వార్తా సంస్థతో ఫోన్లో మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. ‘‘ప్రతి తల్లికీ ఆమె బిడ్డ గొప్పే. అతడు తప్పు చేస్తే శిక్షించండి.. కానీ అతడిని ఉగ్రవాది అనొద్దు’’ అని చెప్పారు. కన్హయ్యకు బెయిల్ రావటం తమకు శుభవార్త అని.. వర్సిటీలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నామని జేఎన్యూ రిజిస్ట్రార్ భూపీందర్ జుట్షి బుధవారం పీటీఐతో పేర్కొన్నారు. జేఎన్యూ విద్యార్థుల హర్షాతిరేకాలు... కన్హయ్యకు బెయిల్ మంజూరైందన్న వార్త తెలియగానే.. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్స్టేషన్ ఎదుట గుమిగూడి ఉన్న జేఎన్యూ విద్యార్థులు, అధ్యాపకుల్లో ఆనందోత్సాహం వెల్లువెత్తింది. ఢిల్లీ హైకోర్టు తీర్పు ప్రకటన కోసం అక్కడే వేచిచూశారు. కన్హయ్యకు బెయిల్ గొప్ప ఊరట అని.. ఇంకా జైలులోనే ఉన్న ఉమర్, అన్బిరన్ల కోసం తమ పోరాటం కొనసాగిస్తామని జేఎన్యూఎస్యూ ఉపాధ్యక్షురాలు షీలారషీద్ పేర్కొన్నారు. దేశ వ్యతిరేక ర్యాలీపై తీవ్ర ఆగ్రహం పార్లమెంటు దాడి కేసులో దోషిగా నిర్ధారితుడై ఉరిశిక్షకు గురైన అఫ్జల్గురు, 1971లో విమానం హైజాక్ చేసిన కేసులో దోషిగా నిర్ధారితుడై ఉరిశిక్షకు గురైన మక్బూల్భట్ల ఫొటోలు, పోస్టర్లు ప్రదర్శిస్తూ విద్యార్థులు నిరసన చేపట్టిన తీరుపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఆ నినాదాల్లో ప్రతిఫలించిన విద్యార్థుల మనోభావాలపై.. ఆ ఫొటోలు, పోస్టర్లు పట్టుకుని ఫొటోల ద్వారా రికార్డుల్లో నమోదైన విద్యార్థి లోకం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరముందని వ్యాఖ్యానించింది. ‘‘కన్హయ్య జేఎన్యూలో పీహెచ్డీ చేస్తున్న మేధో వర్గానికి చెందిన వ్యక్తిగా కోర్టు గుర్తిస్తోంది. అతడు ఎటువంటి రాజకీయ సిద్ధాంతం లేదా అనుబంధాన్నయినా కలిగివుండొచ్చు.. అయితే అది భారత రాజ్యాంగ పరిధికి లోబడి ఉండాలి. భారత పౌరుల వాక్స్వాతంత్య్రం.. రాజ్యాంగంలోని 19(2) అధికరణ కింద సహేతుక నియంత్రణలకు లోబడి ఉంటుంది’’ అని ధర్మాసనం తన తీర్పులో స్పష్టంచేసింది. -
నన్ను చితక్కొట్టారు.. దుస్తులు ఊడదీశారు!
పోలీసుల ఎదుటే తీవ్రంగా కొట్టారు ♦ సుప్రీం కోర్టు విచారణ కమిటీకి చెప్పిన కన్హయ్య ♦ మీరుండగా దాడెలా జరిగింది?: మందలించిన సుప్రీం కమిటీ న్యూఢిల్లీ: పటియాలా హౌస్ కోర్టు ఆవరణలో ఫిబ్రవరి 17న పోలీసుల ఎదుటే తనను విపరీతంగా కొట్టారని జేఎన్యూఎస్యూ అధ్యక్షుడు కన్హయ్య కుమార్.. సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన విచారణ కమిటీకి తెలిపారు. ‘ఫిబ్రవరి 15న పోలీసులు నన్ను కోర్టు ఆవరణలోకి తీసుకురాగానే లాయర్ల దుస్తుల్లో ఉన్న కొందరు నాపై దాడి చేశారు. అంతే కాదు పక్కనున్నవారినీ పిలిచారు. నన్ను కాపాడేందుకు ప్రయత్నించిన పోలీసులకూ దెబ్బలు తప్పలేదు’ అని చెప్పారు. తెలిపారు. తనపై దాడి పూర్తిగా రాజకీయ ప్రభావిత వ్యక్తులు చేసిన దాడేనని.. పటియాలా కోర్టులో జరిగిన ఘటనను విచారించాలంటూ సుప్రీం కోర్టు కపిల్ సిబల్తోపాటు ఆరుగురు లాయర్లతో ఏర్పాటు చేసిన కమిటీకి వెల్లడించారు. 17న జరిగిన ఘటనలో.. విచారణకు మరికొంత సమయం ఉన్నందున పక్కనున్న గదిలో వేచి చూస్తుండగా ఓ లాయరు వచ్చి తనను కొట్టారన్నారు. కోర్టు గది ద్వారం గుండా వచ్చిన లాయర్లు తనపై దాడిచేసి దర్జాగా వెళ్లిపోతున్నా పోలీసులు పట్టించుకోలేదనిని చెప్పారు. ‘నేను ఈ దేశపు యువకుడిని. నాకు రాజ్యాంగంపై గౌరవం ఉంది. దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడను. బయట కొందరు వ్యక్తులు నన్ను దేశ ద్రోహి అంటున్నారు. మీడియాలో ఓవర్గం నన్ను ద్రోహిగా ముద్రవేసింది’ అని పేర్కొన్నారు. దీంతో డీసీపీ జతిన్ నర్వాల్ను పిలిపించిన సిబల్..‘ఇంతమంది పోలీసులున్నా కన్హయ్యపై దాడి ఎలా జరగనిచ్చారు’ అని అడిగారు. ‘మీరిప్పుడు ఢిల్లీ పోలీస్ చీఫ్ బస్సీ కింద పనిచేయటం లేదన్నది గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలి’ అని డీసీపీకి లాయర్ల బృందం హెచ్చరించింది. తనపై దాడి చేసిన లాయర్, ఆ సమయంలో ఉన్న పోలీసులను గుర్తు పట్టగలరని కన్హయ్య తెలిపారు. జేఎన్యూ వివాదాన్ని ఉగ్రవాద వ్యతిరేక ప్రత్యేక సెల్కు బదిలీ చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు. కాగా, ఫిబ్రవరి 9 జేఎన్యూలో వివాదాస్పద కార్యక్రమాన్ని నిర్వహించిన విద్యార్థులు ఉమర్, అనిర్బన్ భట్టాచార్యల పోలీసు కస్టడీని మరో రెండ్రోజులపాటు పొడగిస్తున్నట్లు ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. స్మృతిపై విపక్షాల హక్కుల తీర్మానం హెచ్సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకేసుకు సంబంధించి పార్లమెంటులో మంత్రి స్మృతి ఇరానీ చెప్పిన విషయాలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని విపక్షాలు మండిపడ్డాయి. ఇరానీపై హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కాంగ్రెస్, సీపీఎం, జేడీయూ నిర్ణయించాయి. -
కన్హయ్యను జైల్లో ఎలా చూస్తున్నారు?
దేశద్రోహం కేసులో అరెస్టయ్యి, ప్రస్తుతం రిమాండు ఖైదీగా తీహార్ జైల్లో ఉన్న జేఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ను అక్కడ జైల్లో ఎలా చూస్తున్నారు? అతడికి ఎలాంటి ఆహారం ఇస్తున్నారు.. ఈ వివరాలపై జాతీయ మీడియా దృష్టిపెట్టింది. తీహార్ జైలు అంటే దేశంలోనే అత్యంత పటిష్ఠమైన భద్రత కలిగినదని అంటారు. అక్కడ కూడా కన్హయ్య భద్రత విషయంలో మరిన్ని అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అక్కడ అతడిని ఒక ఐసోలేషన్ సెల్లో ఉంచారు. అంటే, ఆ సెల్లోకన్హయ్య తప్ప వేరెవ్వరూ ఉండరన్న మాట. అతడికి అందించే ఆహారాన్ని కూడా సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. పటియాలా హౌస్ కోర్టులో కన్హయ్యను ప్రవేశపెట్టే సమయంలో తీవ్ర ఘర్షణ జరిగిన నేపథ్యంలో తీహార్ జైల్లో కూడా అతడికి పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మూడో నెంబరు జైల్లో అతడిని పెట్టారు. జైలులో ఉండే సిబ్బందితో పాటు, ప్రత్యేకంగా తమిళనాడు పోలీసు సిబ్బంది బృందం 24 గంటలూ అతడిని కాపు కాస్తోంది. అతడి భద్రత విషయంలో చిన్న పొరపాటు కూడా జరగడానికి వీల్లేదని గట్టిగా ఉత్తర్వులిచ్చారు. ఇప్పటివరకు కన్హయ్య, ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య ముగ్గురినీ విడివిడిగా ప్రశ్నించిన పోలీసులు.. శుక్రవారం మాత్రం ముగ్గురినీ కలిపి విచారించారు. -
'అసలు మేమెందుకు సరెండర్ కావాలి?'
న్యూఢిల్లీ: అసలు తామెందుకు పోలీసులకు సరెండర్ కావాలని రాజద్రోహం కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ముగ్గురు జేఎన్యూ విద్యార్థులు ప్రశ్నించారు. ఇప్పటికే ముగ్గురు జేఎన్యూ విద్యార్ధులు జ్యుడిషియల్ కస్టడీలోకి వెళ్లగా వీరు మాత్రం తాము సరెండర్ అయ్యే సమస్యే లేదని అంటున్నారు. జేఎన్యూ విద్యార్థులు కన్హయ్య కుమార్ ను పోలీసులు అరెస్టు చేసిన అనంతరం ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య, రామనాగా, అశుతోష్ కుమార్ కనిపించకుండాపోయిన విషయం తెలిసిందే. అయితే, కోర్టు ఆదేశాలతో ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య పోలీసులకు లొంగిపోయారు. కానీ, జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్(జేఎన్యూఎస్యూ) జనరల్ సెక్రటరీ రామ నాగా, అశుతోష్ కుమార్, అనంత్ ప్రకాశ్ మాత్రం పోలీసులకు లొంగిపోయేందుకు నిరాకరించారు. 'మేం ఎందుకు సరెండర్ కావాలి? మేం పోలీసులకు హాస్టల్ నెంబర్ ఇచ్చాం. రూమ్ నెంబర్, కాంటాక్ట్ వివరాలు కూడా ఇచ్చాం. మేం క్యాంపస్లోనే ఉన్నాం. నిర్ణయించుకోవాల్సింది పోలీసులే' అంటూ ప్రకాశ్ మీడియా సమావేశంలో చెప్పాడు. -
లొంగుబాటు మీ ఇష్టారాజ్యం కాదు: హైకోర్టు
లొంగుబాటు విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం కుదరదని జేఎన్యూ విద్యార్థులకు ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. వాళ్లు కావాలనుకున్న పద్ధతిలో లొంగిపోయేందుకు అనుమతించేది లేదని తెలిపింది. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయని, వాటిని పాటించాల్సిందేనని జస్టిస్ ప్రతిభా రాణి తెలిఆపరు. తాము సురక్షితంగా బయటకు వెళ్లేందుకు అనుమతించాలని, తాము అనుకున్న ప్రదేశంలో మాత్రమే లొంగిపోతామని జేఎన్యూ విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య పెట్టుకున్న పిటిషన్ల విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే, తమను నేరుగా హైకోర్టే జ్యుడీషియల్ కస్టడీకి పంపాలి తప్ప.. పాటియాలా హౌస్ కోర్టు కాదని అడగడాన్ని కూడా ఆమె తప్పుబట్టారు. రిమాండు ప్రొసీడింగ్స్ అన్నీ విచారణ కోర్టు మాత్రమే జరపాలని, ఈ విషయంలో నిందితుల ఇష్టాయిష్టాలకు అనుగుణంగా చేయడానికి వీలుండదని తెలిపారు. నిందితులు అరెస్టయిన 24 గంటలలోగా విచారణ కోర్టులో వారిని ప్రవేశపెట్టాలని, అక్కడే వాళ్ల రిమాండు విషయం నిర్ణయం అవుతుందని చెప్పారు. తమ క్లయింట్లకు 'సేఫ్ పాసేజ్' ఇవ్వాలని విద్యార్థుల తరఫున వాదిస్తున్న న్యాయవాది కామిని జైస్వాల్ అడిగినప్పుడు 'మీరు ఏమనుకుంటున్నారు, నేను మీకు సేఫ్ పాసేజి ఇవ్వాలా? ఈ కోర్టు ఎందుకు? పద్ధతి ప్రకారమే వెళ్దాం' అని న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. -
నేను ముస్లింనే.. ఉగ్రవాదిని కాను
గడిచిన ఏడేళ్లుగా తాను జేఎన్యూ క్యాంపస్లో ఉన్నానని, అయితే ఈ ఏడేళ్లలో ఎప్పుడూ తనను తాను ముస్లింగా భావించలేదు గానీ, ఈ పది రోజుల్లో మాత్రం అలాగే అనుకునేలా చేశారని రాజద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమర్ ఖలీద్ అన్నాడు. జేఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ను పోలీసులు అరెస్ట్ చేసిన వెంటనే క్యాంపస్ నుంచి ఉమర్ అదృశ్యమయ్యాడు. ఫిబ్రవరి 9న జేఎన్ యూలో అఫ్జల్ గురుకు మద్దతుగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కన్హయ్య, ఉమర్ నాయకత్వం వహించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఎట్టకేలకు ఆదివారం నాడు ఉమర్ ఖలీద్ జేఎన్యూ క్యాంపస్కు మళ్లీ వచ్చాడు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధాలని చెప్పాడు. తాను ఉమర్నే గానీ, ఉగ్రవాదిని మాత్రం కాదని స్పష్టం చేశాడు. కేవలం మీడియా మాత్రమే తనపై ఉగ్రవాదిగా ముద్ర వేసిందని మండిపడ్డాడు. ఫిబ్రవరి 9వ తేదీన అఫ్జల్గురుకు మద్దతుగా కార్యక్రమం నిర్వహించడం వల్ల యూనివర్సిటీపై దాడి జరగలేదని.. ప్రభుత్వం తమపై దాడి చేయడానికి ఒక సాకు వెతుక్కుందని అన్నాడు. ఇదే సమయంలో మీడియా తన గురించి చాలా విషయాలు ప్రచారం చేసిందని, దీనివల్ల తన కుటుంబ సభ్యులు చాలా బాధపడ్డారని అన్నాడు. ఉమర్ ఖలీద్ క్యాంపస్ నుంచి కనిపించకుండా పోయిన తర్వాత అతడు జైషే-ఇ-మహ్మద్ సానుభూతిపరుడన్న ప్రచారం జరిగింది. తీవ్రవాదులతో అతడికి సంబంధాలున్నాయని పేర్కొన్నారు. ఫిబ్రవరి 9వ తేదీ కార్యక్రమానికి ముందు.. వారం వ్యవధిలో ఉమర్ గల్ఫ్ దేశాలకు లేదా కశ్మీర్ ప్రాంతానికి దాదాపు 800 ఫోన్ కాల్స్ చేసినట్టు అతడి ఫోన్ కాల్ డేటాలో వెల్లడైంది. దాన్ని కూడా ఉమర్ ఖండిస్తున్నాడు. తాను అసలు అన్ని కాల్స్ చేయనే లేదన్నాడు. మీడియా ఏం కావాలంటే అది రికార్డు చేసుకోవచ్చని, అయితే టేపులను మాత్రం మార్చి ప్రసారం చేయొద్దని కోరాడు. -
సారీ చెప్పే కాలం కాదిది
జాతిహితం జేఎన్యూ-కన్హయ్య-ఢిల్లీ పోలీసులు... సరిగ్గా 35 ఏళ్ల క్రితం నాటి భయా నకమైన 1981 రోజులను గుర్తుకు తెస్తున్నాయి. అప్పట్లో నేను, ఒకేసారి ఐదు చోట్ల తిరుగుబాట్లు చెలరేగుతున్న ఈశాన్యం వార్తా కథనాలను వెలువరిస్తూ ఉండే వాడిని. అధికారిక ప్రకటనల్లో జాతి వ్యతిరేక శక్తులు(ఏఎన్ఈ) అని మాత్రమే చెబుతూ తిరుగుబాటుదార్లను లేదా అజ్ఞాతంలో ఉన్నవారిని ఎంద రినైనా బంధించేవారు, విచారించేవారు, తరచుగా ఏదో ఒక పద్ధతిలో హత మార్చే వారు. రాజద్రోహ నేరం కేసు పెట్టడం అంటే మహా జంఝాటం, అంతకంటే ఇవన్నీ చేయడమే తేలిక. అయితే అది ఒక్కోసారి నమ్మశక్యం కానంతటి మూర్ఖత్వానికీ దారి తీసేది. అమాయక ప్రాణాలకు హానిని కలుగ జేయకపోతే అలాంటి సందర్భాలు గొప్ప హాస్యస్ఫోరకంగా కూడా ఉండేవి. అలనాటి మంచిరోజుల కథ ఆనాటి పరిస్థితుల్లో సైన్యం, పోలీసు, నిఘా విభాగాలలో పనిచేసేవారికి, విలేకరులకు మధ్య ఒక్కోసారి మైత్రీపూర్వకమైన, తరచుగా వైషమ్యపూరి తమైన అసాధారణ అనుబంధం ఉండేది. అయితే అనివార్యంగానే వారి మధ్య ఇచ్చిపుచ్చుకోవడం, సహకరించుకోవడం అనే అనుబంధం కూడా ఉండేది. ఈశాన్యంలో పనిచేసిన అత్యుత్తమ ఇంటెలిజెన్స్ అధికారులలో అజిత్ దోవల్ కాక, కోషీ కోషీ కూడా నాకు మిత్రులు. తిరుగుబాటుకు వార్తల సేకరణ గురించి తెలిసిన వారెవరికైనా విలేకరులు, ఇంటెలిజెన్స్ అధికారులు వాస్తవాలను సరిపోల్చి చూసుకుంటారని తెలిసి ఉంటుంది. అలాగే మేమి ద్దరం తరచుగా మా నోట్స్ను ఇచ్చిపుచ్చుకుంటూ ఉండేవాళ్లం. మరీ ముఖ్యంగా ప్రమాదరహితమైన ఉబుసుపోక కబుర్లు చెప్పుకునే వాళ్లం. ఏ బంద్ రోజునో నేను ఆయన కార్యాలయానికి వెళుతుండేవాడిని లేదా ‘‘బౌద్ధ భిక్షువు’’కు (ఓల్డ్ మాంక్ రమ్కు మేం పెట్టుకున్న పేరు) రోజువారీ నివాళు లర్పించడానికి కేపీఎస్ గిల్ ఇంట్లో సాయంకాలాలు కలుస్తూ ఉండేవాళ్లం. ఒక సాయంత్రం మహా ఉద్వేగంగా కోషీ, నన్ను ఉన్న పళాన తన కార్యాలయానికి రమ్మని పిలిచారు. గొప్ప కథనం ఉందని, కల్నల్ ఎక్స్కు (సైనిక నిఘా విభాగంలో కోషీకి సమాన స్థాయి వారు) పెద్ద తీవ్రవాది దొరి కాడని, కాకపోతే ‘‘జాతి వ్యతిరేక శక్తులలో అతని హోదా’’ ఏమిటో కనిపెట్ట డానికి నా మేధస్సును ఉపయోగించాలన్నారు. అదేదో నన్ను అడగమని ఆయనకు చెప్పారు. తామెన్నడూ విని ఉండని గ్రూపునకు చెందిన ఒక స్వయం ప్రకటిత నాగా లెఫ్టినెంట్ కల్నల్ను తమ కుర్రాళ్లు ‘‘పట్టుకు న్నార’’ని, కానీ తమ వద్ద ఉన్న జాబితాలో అతనెవరో గుర్తించలేకపోతు న్నామని ఆయన చెప్పారు. ఆ తీవ్రవాది మాత్రం తాను సాల్వేషన్ ఆర్మీ (పేదల సంక్షేమానికి కృషి చేసే క్రైస్తవ సంస్థ) లాంటి ఏదో గ్రూపునకు చెందినవాడినని పదేపదే చెబుతున్నాడన్నారు. దీంతో, సిరియన్ క్రిస్టియన్ ఆయిన కోషీ నిస్సహాయమైన ఓ నవ్వు నవ్వి, సదరు కల్నల్కు ఆ సాల్వేషన్ ఆర్మీ ఎంత నిరపాయకరమైనదో వివరించి, నిర్భాగ్యుడైన ఆ దైవ సైనికునికి క్షమాపణలు చెప్పి తక్షణమే విడుదల చేయమని చెప్పారు. తర్వాత ఓ గంటకల్లా ఆ పని జరిగిపోయింది. జీవితాంతం ఇతరులకు చెప్పాల్సిన కథగా అది మిగిలిపోయింది. అయితే, అవి మంచిరోజులు కాబట్టి అంత సమస్యాత్మక ప్రాంతంలోనూ ఆ కథ వెంటనే మర్యాదకరమైన, తార్కికమైన ముగింపునకు వచ్చేసింది. నేటి హాస్యాస్పద గాథ కన్హయ్య కుమార్ అరెస్టు విషయంలో జరిగింది కూడా సరిగ్గా అలాం టిదే, అంతగానూ హాస్యాస్పదమైనదే. కాకపోతే ప్రభుత్వమో లేదా కోర్టులో అతనిని విడుదల చేయమని చెప్పేవరకు వేచి ఉండాల్సి ఉంటుంది. హఫీజ్ సయీద్ పేరిట వెలువడ్డ ఒక నకిలీ ట్వీట్ , దేశంలోనే అత్యుత్తమమైన ఢిల్లీ పోలీసు యంత్రాంగాన్ని చవటాయలను చేసింది. అంతకంటే మరింత నకిలీ వీడియో దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఎన్నుకున్న అధ్యక్షునిపై రాజద్రోహ నేరం అభియోగాన్ని మోపేలా చేసింది. రాజద్రోహం అంటే దేశంపై యుద్ధం చేయడమని అర్థం. ఇప్పుడు, ఆయన్ను ఏం చేయాలో వాళ్లకు అర్థం కావడం లేదు. సామాజిక, సంప్రదాయక మీడియాలో ఢిల్లీ పోలీసు అధినేత సహా అత్యున్నత స్థాయిలలోని వారంతా కన్హయ్య దేశద్రోహా నికి పాల్పడ్డాడని చెప్పారు. కాబట్టి, గువాహతిలో నాడు సైనిక కల్నల్ ‘సారీ’ చెప్పి ఆ అభాగ్యుడ్ని వదిలి పెట్టేసినంత తేలిక వ్యవహారం కాదిది. పైగా అది దయాదాక్షిణ్యాలున్న కాలం. కాగా, నేడు మనం దేశ మస్తిష్కాన్ని సన్నీ డియో లైజేషన్ (దేశభక్తి అంటూ రంకెలేయడం) చేస్తున్న కాలంలో ఉన్నాం. ఈ సంస్కృతి నేడు నగ్నంగా నర్తిస్తోంది. కాబట్టి రోహిత్ వేముల ఆత్మహత్యపై వచ్చిన ఒత్తిడికి గురై ఉన్నప్పుడు, మొదట అతను దళితుడు కాదంటూ దాటవేయాలని చూసి, ఆ మీదట మొత్తం చర్చనంతా కులం మీదకు మరల్చారు. తర్వాత జేఎన్యూపై దాడితో చర్చను జాతీయవాదం కొరవడటంపైకి తిప్పారు. వామపక్ష చింతనకు కేంద్రంగా ఉన్న జేఎన్ యూలో గత పలు సంవత్సరాలుగా వామపక్ష విద్యార్థి సంఘాలకు, అఖిల భారత విద్యార్థి పరిషత్ వంటి మితవాద విద్యార్థి సంఘాలకు మధ్య సంఘ ర్షణ పెరుగుతోంది. ఆ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఎప్పుడు చూసినా విస్పష్ట రాజకీయాలు, భావజాల సంఘర్షణ దర్శనమిస్తూ ఉంటాయి. వాటిలోకెల్లా నాకు ఇష్టమైన పెద్ద గోడ చిత్రం... అటూ ఇటూ మార్క్స్, లెనిన్లూ మధ్య భగత్సింగ్ ఉన్నది. అది ఇప్పటికీ అక్కడే ఉన్నా ఎన్నడూ హింసకు దారితీయలేదు. భావజాల ఘర్షణ ఉన్నా ఆ విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యుత్తమ విద్వద్వంతులను తయారుచేసింది. ఈ మేధోపరమైన, భావజాలపరమైన ఘర్షణా అందుకు కారణమూ అయి ఉండవచ్చు. బీజేపీ జాతీయ స్థాయిలో అధికారంలోకి రావడంతో ఏబీవీపీ కూడా కాంగ్రెస్ అంతగానూ అసహనంగా తయారైంది. ప్రధానంగా వామపక్ష భావాల సానుభూతిపరులపట్ల అది అసహనంతో ఉంది. ప్రియుడు కొత్వాలయితే... ప్రభుత్వాధికారాన్ని ఉపయోగించుకుని ఎక్కువగా ‘‘వామపక్షీకరణ’’ చెందిన విశ్వవిద్యాలయాలపై ఏబీవీపీ ఆధిపత్యాన్ని సాధించాలని కోరుకుంటోంది. ‘ప్రియుడు కొత్వాలయితే (పోలీసు కమిషనర్) ఎవరైతే నాకేం లెక్క’ అన్నట్టు (హిందీ మాట్లాడే దేశ ప్రధాన భూభాగంలో ప్రాచుర్యంలో ఉన్న నానుడి) వ్యవహరిస్తోంది. హైదరాబాద్లోనూ, జేఎన్యూలోనూ ప్రభుత్వం దురదృష్టవశాత్తూ పక్షపాతియైన కొత్వాల్లా వ్యవహరిస్తోంది. ఫలితం ఒక దళిత విద్యార్థి విగత జీవి కావడం, పేద కుటుంబానికి చెందిన మరో విద్యార్థి కటకటాల పాలవడం. ఇంతా జరిగాక ఇప్పుడు వాళ్లకు ఏం చేయాలో తోచడం లేదు. మేం గందరగోళపడ్డామంటూ సారీ చెప్పాలి. లేదంటే ఎవరినో తప్పుపట్టి బలిపశువును చేసి, ఇతరుల సంగతి మరచిపోయి కన్హయ్యను విడుదల చేయాలి. అయితే అది హైదరాబాద్ తర్వాత వరుసగా రెండో ఓటమిని అంగీకరించినట్టవుతుంది. లేదంటే, రాజద్రోహ నేరానికి అతనిపై విచారణ జరిపించినట్టయితే ఉదారంగా పెద్ద వివాదాన్ని రాజేసినట్టవుతుంది. మొత్తా నికి కాస్త త్వరగానో లేక ఆలస్యంగానో ఏదో ఒక కోర్టు ఆయన్ను విడుదల చేయక తప్పదు. ప్రత్యేకించి రాజద్రోహ నేరం నిలిచే అవకాశం లేదు. ఏం చేసినా కన్హయ్య పొలిటికల్ స్టార్ అయిపోతాడు. కాబట్టి బీజేపీకి ఎంచుకోవ డానికి ఉన్న అవకాశాలు సరళమైనవే. ఇప్పుడిక వినమ్రంగా తప్పును అంగీకరించి నష్టాలను తగ్గించుకోవడం చేయాలి. లేదా సమర్థించుకోడానికి వీలే లేని దాని కోసం పోరాడి చివరికి అన్ని తప్పులకూ కలిసి ఒకేసారి లెంపలు వేసుకోవాల్సి ఉంటుంది. ఓపీ శర్మ లాంటి వాళ్లు విద్యార్థులను చితక బాదుతుంటే, పదవీ విరమణ చేయనున్న పోలీసు బాసులు వారికి రక్షణ కల్పించ నిరాకరించడాన్ని చూస్తుంటే... ఛాంద సులైన మామలు చెప్పినట్టు వినని పిల్లలపై యుద్ధం ప్రకటించినట్టుంది. పెద్దలకు, యువతరానికి మధ్య పోరాటం చివరకు అనివార్యంగా ఎలా ముగుస్తుందో మానవజాతి చరిత్ర బోధిస్తోంది. వాజపేయి అయితే ఏం చేసేవారు? ఒక మంచి ఆలోచన చెబుతా. సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు, ప్రత్యేకించి బీజేపీ ప్రభుత్వం అమలు చేయాల్సినది అది. మీరు చేస్తున్న చర్యలను వాజపేయి కొలబద్దతో పరీక్షించి చూసుకోవడం. ఈ పరిస్థితిలో అటల్ బిహారీ వాజపేయి అయితే ఎలా వ్యవహరించి ఉండేవారని యోచించండి. అప్పుడు మీ ముందు ఎంచుకోవడానికి చాలా అవకాశాలు లభిస్తాయి. అవి ఆయన వారసుల ప్రభుత్వం అనుసరిస్తున్న వాటికంటే పూర్తిగా భిన్నమైనవై ఉంటాయి. 1997 మొదట్లో, బీజేపీ-అకాలీదళ్ కూటమి అప్పుడే పంజాబ్లో అధికారంలోకి వచ్చింది (నేటి బీజేపీ-పీడీపీ కూటమిలాగా అందుకు కూడా నాడు అవకాశం లేదనే అనిపించింది). భింద్రన్వాలా అనుకూల అవాంఛ నీయ పరిణామాలు బద్దలై, స్వర్ణ దేవాలయానికీ వ్యాపించాయి. పంజాబ్ ఉగ్రవాదాన్ని సన్నిహితంగా పరిశీలించిన నేను బెంబేలెత్తిపోయాను. నేన ప్పుడు సంపాదకునిగా ఉన్న ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక ఆ పరిణామాలపై తీవ్ర దాడిని ప్రారంభించింది. అప్పటికింకా కేంద్రంలో ప్రతిపక్షంగానే ఉన్న బీజేపీ, అకాలీదళ్తో మైత్రిని పునరాలోచించాలని సైతం కోరింది. ఒకరోజు మధ్యాహ్నం, తన నివాసానికి రావాలని వాజపేయి నాకు కబురంపారు. అద్వానీ, మదన్లాల్ ఖురానాలు కూడా అక్కడున్నారు. తేనీరు సేవిస్తూ వాజపేయి నాకు ఉపన్యాసం ఇచ్చారు. ‘హిందువులు, సిక్కులు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు’ పంజాబ్లో గొంతులపైకి కత్తులు దూసుకుంటు న్నారు. సిక్కు మిలిటెంట్లు బీజేపీ నేతలను హతమారుస్తున్నారు. ఇప్పుడు బీజేపీ, అకాలీదళ్ చేతులు కలపడం పంజాబ్కు, భారత్కు మంచిదా, కాదా? పెద్దగా లెక్కచేయాల్సిన అవసరంలేని ఈ చికాకులను మనం విస్మరించాలి. సంపాదకులవారూ, మీరు కాస్త పరిణతి సాధించాలండీ! అన్నారు. ఈ పరిణామాలు అదుపు తప్పిపోతే ఏం జరుగుతుంది? ఆ చికాకులు కలిగిస్తున్న వారు అకాలీల మీద ఆధారపడటం లేదా? అని నేనడిగాను. ఆ విషయాలన్నీ ‘‘ఖురానా జీ చూసుకుంటారు... ఈ సమస్యలను పరిష్కరించగల దృఢ సంకల్పం ఆయనకుంది’’ అని బదులిచ్చారు. ఆయనైతే హైదరాబాద్ ఉదంతంతో ఎలా వ్యవహరించేవారో ఆలోచిం చించి చూడండి. ఆ విశ్వవిద్యాలయం వ్యవహారాలలో ఇద్దరు కేబినెట్ మంత్రులు ఏబీవీపీ పక్షం వహించారని గమనిస్తే ఆయన ఆగ్రహించి ఉండేవారు. వేముల ఆత్మహత్య చేసుకున్నప్పుడు, ఆయనే మొట్టమొదట ఆవేదనను, సహానుభూతిని వెల్లడించి ఉండేవారు. ఇక జేఎన్యూ విషయం లోనైతే... కుర్రాళ్లను మాట్లడనివ్వండి, వాళ్లే ఎదుగుతారు, రేపు ఐఏఎస్ క్యాడర్లో చేరుతారు అని సరిపెట్టుకునే వైఖరి చేపట్టేవారు. కశ్మీరీ సమస్యపై ప్రభుత్వం రాజ్యాంగ ప్రమాణాల ప్రాతిపదికపైనే మాట్లాడుతామని పట్టు బడుతుంటే తాము ఇక చర్చలు ఎలా జరుపుతామని కశ్మీర్ వేర్పాటువాదులు ప్రశ్నించినప్పుడు ఆయన ఎలా వ్యవహరించారో గుర్తు చేసుకోండి. రాజ్యాంగం ఎందుకు, మీతో నేను మానవతావాద ప్రమాణాలతో మాట్లాడు తానని వాజపేయి అన్నారు. సంఘర్షణను పరిష్కరించే వైఖరంటే అదీ. ఇటీవల మనం చూస్తున్నది సంఘర్షణను తెచ్చిపెట్టే వ్యూహాల కోసం సాగిస్తున్న అన్వేషణగానే ఎక్కువగా కనిపిస్తోంది. శేఖర్ గుప్తా Twitter@ShekarGupta -
వారంలో 800 ఫోన్ కాల్స్ చేశాడు!
న్యూఢిల్లీ: రాజద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్ యూ పీహెచ్ డీ విద్యార్థి ఉమర్ ఖలీద్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. కన్హయ్య కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసి వెంటనే జేఎన్ యూ క్యాంపస్ నుంచి ఉమర్ అదృశ్యమయ్యాడు. దీంతో ఒక సెక్షన్ మీడియా అతడిని జైషే-ఇ-మహ్మద్ సానుభూతిపరుడిగా ప్రచారం చేసింది. తీవ్రవాదులతో అతడికి సంబంధాలున్నాయని పేర్కొన్నాయి. 'కశ్మీర్ విశ్వాసఘాతకుడి'గా ఆరోపించారు. అతడు కశ్మీర్ వాసి కాదు. ఉమర్ తల్లిదండ్రులు ఢిల్లీలోని జామియా నగర్ లో నివసిస్తున్నారు. వారి స్వస్థలం మహారాష్ట్రలోని అమరావతి. 35 ఏళ్ల క్రితం ఢిల్లీకి వలసవచ్చారు. ఫిబ్రవరి 9న జేఎన్ యూలో అఫ్జల్ గురుకు మద్దతుగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కన్హయ్య, ఉమర్ నాయకత్వం వహించారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. జాతివ్యతిరేక నినాదాలు చేశారని వీరిపై అభియోగాలు మోపారు. కాగా, వారం వ్యవధిలో ఉమర్ 800 ఫోన్ కాల్స్ చేసినట్టు అతడి ఫోన్ కాల్ డేటాలో వెల్లడైంది. -
సుప్రీంకోర్టును ఆశ్రయించిన కన్హయ్య
న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులో అరెస్టైన జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కన్హయ్య కుమార్ తరపున వృందా గ్రోవర్ ఈ పిటిషన్ సమర్పించారు. పటియాలా కోర్టులో పిటిషన్ వేసే పరిస్థితులు లేనందున అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు ఆయన తెలిపారు. ఆర్టికల్ 32 కింద బెయిల్ కోసం కన్హయ్య సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని తెలిపారు. దీనిపై రేపు(శుక్రవారం) ఉదయం 10.30 గంటలకు విచారణ చేపడతామని జస్టిస్ జె. చలమేశ్వర్, జస్టిస్ అభయ మనోహర్ లతో కూడిన బెంచ్ పేర్కొంది. కాగా, కన్హయ్య కుమార్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయిస్తే తాము అడ్డుకోబోమని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ నిన్న ప్రకటించారు. మార్చి 2 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో కన్హయ్య కుమార్ ను నిన్న తీహార్ జైలుకు తరలించారు. -
'నా ప్రాణానికి ముప్పు.. జైల్లో పెట్టండి'
న్యూఢిల్లీ: తన ప్రాణానికి ముప్పు పొంచివుందని జేఎన్యూ విద్యార్థినేత కన్హయ్య కుమార్ ఆందోళన వ్యక్తం చేశాడు. తాను తప్పు చేస్తే జైల్లో పెట్టాలని, మీడియాలో తనకు వ్యతిరేకంగా వస్తున్న కథనాలకు అడ్డుకట్ట వేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకొచ్చిన కుమార్ పై న్యాయవాదులు దాడి చేశారు. తనపై దాడి చేసిన లాయర్లను న్యాయస్థానంలో అతడు గుర్తించాడు. దేశ సమగ్రతపై తనకు నమ్మకం ఉందని కుమార్ హిందీలో ఒక ప్రకటన విడుదల చేశాడు. అతడు బెయిల్ కు దరఖాస్తు చేసుకుంటే వ్యతిరేకించబోమని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. కుమార్ కు కోర్టు మార్చి 2 వరకు కస్టడీ విధించడంతో అతడిని తీహార్ జైలుకు తరలించారు. పటియాలా కోర్టులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాత్రి 7 గంటలకు అతడిని జైలుకు తీసుకెళ్లారు. తీహార్ జైల్లో అతడికి 3వ నంబర్ సెల్ కేటాయించారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కాగా, ఢిల్లీలో శాంతిభద్రతలు క్షీణించాయని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. దీన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయన అపాయింట్ మెంట్ కోరామని ట్విటర్ ద్వారా తెలిపారు. పటియాలా కోర్టులో చోటుచేసుకున్న ఘటనలపై మరోసారి నివేదిక కోరానని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. -
హార్దిక్కు మళ్లీ చుక్కెదురు
సూరత్: దేశద్రోహం కేసులో పటేళ్ల ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ కు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. ఆయన సూరత్ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. ఆయన బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. పటేళ్లకు ఓబీసీ కోటాలో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని గుజరాత్ కు చెందిన హార్ధిక్ పటేల్ పెద్ద మొత్తంలో ఉద్యమాన్ని లేవదీసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమంలో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉద్యమం ఆందోళన కరంగా మారి ఘర్షణలకు తావిచ్చింది. ఆస్తి నష్టం కూడా చోటుచేసుకుంది. ఆయనపై పలుచోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. అయితే, ప్రత్యేకంగా ఆత్మహత్యలు చేసుకోవడం ఎందుకు అవసరం అయితే ప్రాణాలు తీయాలని వ్యాఖ్యానించి ఆందోళనకారులను రెచ్చగొట్టాడు. ఉద్యమకారులారా ఆత్మహత్యలు వద్దు అవసరం అయితే పోలీసులను చంపేయండి అంటూ పరుష వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేసి గత నెల 16న లప్ పోర్ జైలులో వేశారు. దీంతో ఆయన సూరత్ జిల్లా సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. తనపై తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టారని అందులో పేర్కొన్నారు. కానీ కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అక్టోబర్ నుంచే హార్ధిక్ పై దేశ ద్రోహం కేసులు పలు చోట్ల నమోదయ్యాయి. -
హార్దిక్ పటేల్కు ఎదురుదెబ్బ
అహ్మదాబాద్: పటీదార్ అనామత్ ఆందోళన సమితి నేత హార్దిక్ పటేల్కు గుజరాత్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన దేశద్రోహం కేసును సవాల్ చేస్తూ హార్దిక్ వేసిన పిటీషన్ను హైకోర్టు తిరస్కరించింది. సూరత్లో హార్దిక్పై దేశద్రోహం కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పటేల్ యువకులు ఎవరూ ఆత్మహత్య చేసుకోరాదని, అవసరమైతే ఇద్దరు పోలీసులను చంపాలంటే హార్దిక్ చేసిన వ్యాఖ్యలపై సూరత్ పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఇక రాజ్కోట్లో జరిగిన భారత్, దక్షిణాఫ్రికాల వన్డే సందర్భంగా జాతీయ జెండాను అవమానించాడంటూ మరో కేసు నమోదైంది. దీన్ని సవాల్ చేస్తూ హార్దిక్ హైకోర్టును ఆశ్రయించగా.. పిటిషన్ను కొట్టివేసింది. -
హార్దిక్ వివాదాస్పద వ్యాఖ్యలు.. కేసు నమోదు
సూరత్: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హార్దిక్ పటేల్పై గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు. రిజర్వేషన్ల ఉద్యమం కోసం పటేల్ యువకులు ఎవరూ ఆత్మహత్య చేసుకోరాదని, అవసరమైతే పోలీసులను చంపాలని హార్దిక్ ఈ నెల 3న సూరత్లో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు హర్దిక్పై విద్రోహం కింద కేసు నమోదు చేసినట్టు సూరత్ డీసీపీ మార్లండ్ చౌహాన్ చెప్పారు. పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని హర్దిక్ పటేల్ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. గుజరాత్లో పటేల్ కులస్తుల మెగా ర్యాలీ సందర్భంగా భారీ హింస చెలరేగింది. ఆదివారం రాజ్కోట్లో జరిగిన భారత్-దక్షిణాఫ్రికా క్రికెట్ మ్యాచ్ సందర్భంగా నిరసన తెలపాలని పిలుపునివ్వడంతో.. మ్యాచ్కు ముందు పోలీసులు హార్దిక్ను అదుపులోకి తీసుకున్నారు.