Selva Raghavan
-
'యుగానికి ఒక్కడు' రీ-రిలీజ్.. సీక్వెల్లో హీరో ఎవరో తెలుసా..?
కోలీవుడ్ హీరో కార్తీతో పాటు ఆండ్రియా, రీమాసేన్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ఆయిరత్తిల్ ఒరువన్ (యుగానికి ఒక్కడు). ఇప్పుడు ఈ చిత్రం మరోసారి థియేటర్లోకి రానుంది. విజువల్ వండర్గా ఈ చిత్రాన్ని దర్శకుడు సెల్వరాఘవన్ తెరకెక్కించారు. 2010లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా సినిమా ఉండటంతో తమిళ్తో పాటు తెలుగులో కూడా మంచి విజయాన్ని నమోదుచేసింది. హీరో కార్తీకి ఈ సినిమాతో పాపులారటీ వచ్చింది.యుగానికి ఒక్కడు(Yuganiki Okkadu) సినిమా రీరిలీజ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 15 ఏళ్ల తర్వాత చోలాస్ మళ్లీ తిరిగి వస్తున్నారని వారు ఒక పోస్టర్ విడుదల చేశారు. ఎపిక్ ఫాంటసీ మాస్టర్ పీస్ చూసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, అమెరికాలో మార్చి 14న ఈ చిత్రం రీరిలీజ్ కానుందని ప్రకటించారు. అయితే, ఇప్పటికే ఈ సినిమా తెలుగు వర్షన్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళ్ వర్షన్ సన్నెక్ట్స్లో అందుబాటులో ఉంది.యుగానికి ఒక్కడు సీక్వెల్ ప్లాన్‘యుగానికి ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ ప్రకటన కూడా వచ్చేసింది. ఈ చిత్రానికి కొనసాగింపు ఉంటుందని దర్శకుడు సెల్వ రాఘవన్ అధికారికంగా గతంలోనే ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ధనుష్ హీరోగా నటించనున్నాడని కూడా ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్ట్పై ధనుష్ కూడా స్పందించారు. ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఆలస్యమైనా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఆయన అన్నారు. యుగానికి ఒక్కడు కోసం రూ. 18 కోట్లు బడ్జెట్ అయింది. సీక్వెల్ కోసం సుమారు రూ. 150 కోట్లు దాటొచ్చని అంచనా ఉంది. -
భార్యతో తిట్లు తిన్న ప్రముఖ డైరెక్టర్.. వీడియో వైరల్!
కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్లలో సెల్వరాఘవన్ ఒకరు. స్టార్ హీరోలందరితో ఆయన పలు సినిమాలు చేశారు. కాదల్ కొండేన్ సినిమాతో సెల్వరాఘవన్ దర్శకుడిగా పరిచయమయ్యారు. అయితే అప్పట్లో సూపర్ హిట్గా నిలిచిన 7/జీ బృందావన కాలనీ హీరోయిన్ను 2006లో పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఏడాది తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన గీతాంజలిని 2011లో రెండో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తాజాగా డైరెక్టర్ సెల్వ రాఘవన్ తన భార్యతో గొడవ పడిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన భార్య తిడుతున్న వీడియోను పోస్ట్ చేయడంతో కొద్ది క్షణాల్లోనే వైరల్గా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సెల్వరాఘవన్ ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. కానీ సతీమణితో గొడవ పడిన విషయాన్ని నెట్టింట పోస్ట్ చేయడంతో ఎంతటి వారైనా భార్య చేతిలో తిట్లు తప్పవని నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోలో సెల్వ రాఘవన్ కూడా నేనేం చేశాను.. నన్ను ఎందుకు తిట్టావు.. అంటూ ఫన్నీగా మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరలవుతోంది. కాగా.. సెల్వ రాఘవన్ ప్రస్తుతం ధనుష్ చిత్రంలో 'రాయాన్' ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. View this post on Instagram A post shared by Selvaraghavan (@selvaraghavan) -
తమ్ముడి డైరెక్షన్లో అన్న.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!
స్టార్ హీరో ధనుష్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. పేరుకే తమిళ నటుడు కానీ తెలుగు, హిందీలోనూ బోలెడంత క్రేజ్ సంపాదించాడు. ధనుష్లో గాయకుడు, లిరిక్ రైటర్, దర్శకుడు కూడా ఉన్నాడు. నటుడిగా కోలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి చేరిన ధనుష్ ఎదుగుదలలో ఆయన సోదరుడు, దర్శకుడు సెల్వరాఘవన్ పాత్ర ఎంతో ఉంది. తాజాగా అన్న సెల్వ రాఘవన్ గురించి ధనుష్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. (ఇదీ చదవండి: ప్రముఖ నిర్మాతకి బ్రేకప్ చెప్పిన భార్య.. విడాకుల తీసుకోబోతున్నారా?) ధనుష్ తొలి చిత్రం 'తళ్లువదో ఇళమై' సినిమాని తీసిన సెల్వరాఘవన్నే. ఈ చిత్రం విజయం వీరిద్దరి ఫేట్ మార్చేసింది. ఆ తర్వాత కాదల్ కొండేన్, పుదుపేట్టై వంటి హిట్ చిత్రాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి. కాగా ధనుష్ తన 50వ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తీస్తున్నాడు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం.. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. దీనికి 'రాయన్' టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో నటీనటులను పరిచయం చేస్తూ ఒక్కో పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో ధనుష్ అన్న సెల్వరాఘవన్ కూడా క్రేజీ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించిన ధనుష్.. 'మిమ్మల్ని(సెల్వరాఘవన్ ) డైరెక్ట్ చేస్తానని ఊహించలేదు సర్' అని ఎమోషనల్ అయిపోయాడు. దీనికి బదులిచ్చిన సెల్వరాఘవన్.. తనకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు దర్శకుడు సార్, మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సంభాషణ వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: నన్ను చూసి అబ్బాయిలు కన్నుకొడుతూనే ఉంటారు: నరేశ్) Never thought I’ll direct you someday sir 🙏🙏 @selvaraghavan pic.twitter.com/X1TnkaGqAR — Dhanush (@dhanushkraja) February 22, 2024 -
సెల్వతో పనిచేయడం ఇష్టమే.. మాజీ భర్త సినిమాపై సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు
ఉత్తరాది భామ సోనియా అగర్వాల్ గురించి సినీ వర్గాల్లో తెలియని వారుండరు. ఎందుకంటే అంత సంచలన నటి ఈ భామ. ధనుష్ సరసన కాదల్ కొండేన్, పుదుపేటఐఅట, రవికృష్ణకు జంటగా 7/జీ బృందావన్ కాలనీ వంటి విజయవంతమైన చిత్రాల్లో కథానాయికిగా నటించారు. ఈ మూడు చిత్రాలకు దర్శకుడు సెల్వరాఘవనే. ఆ సమయంలో సెల్వరాఘవన్, నటి సోనియా అగర్వాల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి దాంపత్య బంధం ఎక్కువ కాలం సాగలేదు. విభేదాలు కారణంగా విడిపోయారు. ఆ తరువాత ఎవరి వృత్తిని వారు కొనసాగిస్తున్నారు. అయితే ఆ తరువాత ఈ ఇద్దరిలో ఎవరికీ సరైన హిట్స్ లేకపోవడం గమనార్హం. కాగా ఇటీవల నటుడిగానూ అవతారం ఎత్తిన సెల్వరాఘవన్ తాజాగా ఆ వృత్తికి ఫుల్స్టాప్ పెట్టి మళ్లీ దర్శకత్వంపై దృష్టి పెట్టారు. తను ఆదిలో తెరకెక్కించి సంచలన విజయాన్ని కొట్టిన 7/జీ బృందావన్ కాలనీ చిత్రానికి సీక్వెల్ తీయనున్నారు. ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది. కాగా ఆయన ఇంతకు ముందు దర్శకత్వం వహించిన మరో సూపర్ హిట్ పుదుపేట్టై చిత్రానికి సీక్వెల్ చేస్తానని ప్రకటించారు. అదీ ఈ ఏడాదిలోనే మొదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా పుదుపేట్టై చిత్రంలో ధనుష్ సరసన నటి సోనియా అగర్వాల్, స్నేహా నటించారు. దీంతో పుదుపేట్టై– 2 చిత్రంలో మీరు నటిస్తారా? అన్న ప్రశ్నకు నటి సోనియా అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. సెల్వరాఘవన్ తో కలిసి పని చేయడానికి తనకెలాంటి సమస్య లేదన్నారు. నటన తన వృత్తి అని, పుదుపేట్టై– 2 చిత్రంలో నటించడం తనకు ఇష్టమేనన్నారు. అయితే ఆ చిత్రంలో నటించే విషయమై తనను ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు. అసలు ఆ చిత్రంలో ఎవరెవరు నటిస్తున్నారో కూడా తెలియదని నటి సోనియా అగర్వాల్ పేర్కొన్నారు. -
హీరోయిన్గా ప్రముఖ డైరెక్టర్ కూతురు.. కీలక పాత్రలో టాలీవుడ్ నటుడు!!
దర్శకుడు సెల్వరాఘవన్ నటుడిగా బిజీ అవుతున్నారు. చిన్న పాత్రలతో ప్రారంభమైన ఆయన నట జీవితం ఇప్పుడు హీరో స్థాయికి చేరుకుంది. తాజాగా పాన్ ఇండియా చిత్రంలో ప్రధానపాత్రను పోషిస్తున్నారు. మూమెంట్ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై జీఎం.హరికృష్ణన్, దుర్గాదేవి హరికృష్ణన్ నిర్మిస్తన్న ఈ చిత్రంలో నటుడు యోగిబాబు, టాలీవుడ్ నటుడు సునీల్, జేడీ చక్రవర్తి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!) ఈ చిత్రంలో కొరియోగ్రాఫర్, దర్శకుడు రాజీవ్ మీనన్ వారసురాలు సరస్వతి మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రంగనాథన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 1990 ప్రాంతంలో దర్శకుడు కే.భాగ్యరాజ్ రూపొందించిన చిత్రాలు తమిళంలో విజయవంతమవడంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో రీమేక్ అయి హిట్ అయ్యాయని, అలాంటి కథతో రూపొందించనున్న చిత్రమని దర్శకుడు తెలిపారు. కథ, కథనాలు కొత్తగా ఉంటాయని, పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఈ చిత్ర కథను విన్న సెల్వరాఘవన్కు నచ్చడంతో ఇందులో ప్రధాన పాత్రలో నటించడానికి అంగీకరించారని అన్నారు. ఈ చిత్ర షూటింగ్ను ప్రస్తుతం దిండుగళ్ ప్రాంతంలో 1000 మంది సహాయ నటీనటులు పాల్గొంటున్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు. చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుందని తెలిపారు. (ఇది చదవండి: సమంతలాగే అరుదైన వ్యాధితో బాధపడుతున్న నటి) View this post on Instagram A post shared by Saraswathi Menon (@sarasmenon) -
బంగారం.. ఏమని చెప్పను.. ఐ లవ్ యూనే..
విశాల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మార్క్ ఆంటోని’. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్. ఎస్జే సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఎస్. వినోద్ కుమార్ నిర్మించిన ఈ సినిమా వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఐ లవ్ యూ నే..’ అంటూ సాగే లిరికల్ సాంగ్ని రిలీజ్ చేశారు. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను రామ్ మిరియాల పాడారు. ‘‘హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ‘మార్క్ ఆంటోని’. ఈ చిత్రంలో విశాల్ లుక్ సరికొత్తగా ఉంటుంది. ‘ఐ లవ్ యూ నే..’ పాటలో హీరోహీరోయిన్ల మాస్ స్టెప్స్, అందుకు తగ్గట్టుగా వస్తున్న ఫాస్ట్ బీట్ ఆకట్టుకుంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. -
7జి బృందావన కాలనీ సీక్వెల్లో ఆ మలయాళ హీరోయిన్?
తుళ్లువదో ఇళమై.. ఈ సినిమాతో సెల్వరాఘవన్ దర్శకుడిగా, ధనుష్ హీరోగా పరిచయమయ్యాడు. వీరిద్దరూ తొలి చిత్రంతోనే అనూహ్య విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ధనుష్ హీరోగా కాదల్ కొండేన్ చిత్రం చేసి మరోసారి సక్సెస్ అందుకున్నాడు. కాగా సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన మూడవ చిత్రం 7 జీ రెయిన్బో కాలనీ. 2004లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. నిర్మాత ఏఎం రత్నం వారసుడు రవికృష్ణ కథానాయకుడిగా పరిచయమయ్యాడు. ఆయనకు జంటగా నటి సోనియా అగర్వాల్ నటించింది. ఈమెకు ఇదే తొలి చిత్రం. వైవిధ్యభరిత ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని ఏఎం.రత్నం నిర్మించారు. ఈ సినిమా సూపర్ హిట్టయింది. సుమారు రెండు దశాబ్దాల తర్వాత 7జీ రెయిన్బో కాలనీ(7జి బృందావన కాలనీ) చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించడానికి సెల్వరాఘవన్ సిద్ధమయ్యాడు. ఈ చిత్రాన్ని ఏఎం రత్నమే నిర్మించనున్నట్లు తాజా సమాచారం. కాగా ఈ చిత్రంలో నటి సోనియా అగర్వాల్కు బదులుగా మలయాళం హీరోయిన్ అనశ్వర రాజన్ నటించనున్నట్లు తెలిసింది. ఈమె బాలనటిగా రంగ ప్రవేశం చేసి ఆ తర్వాత పలు చిత్రాల్లో వివిధ పాత్రలో నటిస్తూ గుర్తింపు పొందింది. ఇటీవల త్రిష కథానాయికగా నటించిన రాంగీ చిత్రంలోనూ ముఖ్యపాత్రను పోషించింది. అదేవిధంగా థగ్స్ , హిందీ చిత్రం యారియన్ 2 తదితర చిత్రాల్లోనూ నటించి మంచి పేరు తెచ్చుకుంది. కాగా యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ నెలలో సెట్ పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం. నటుడు రవి కష్ణ కూడా ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా రీఎంట్రీ ఇవ్వనున్నారు. View this post on Instagram A post shared by S H E ♾️ (@anaswara.rajan) చదవండి: థియేటర్లో రిలీజైన వారం రోజులకే ఓటీటీలోకి.. మరో మూడు సినిమాలు స్ట్రీమింగ్.. ఎక్కడంటే? -
అలాంటి వ్యక్తి నా జీవితంలో లేనట్లే.. ముఖం కూడా చూడను: సోనియా అగర్వాల్
సోనియా అగర్వాల్ టాలీవుడ్లో చేసింది తక్కువ సినిమాలే అయినా కుర్రకారులో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. 2004లో విడుదలైన '7/జీ బృందావన కాలనీ' అప్పట్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. ప్రముఖ నిర్మాత ఎంఎం రత్నం కుమారుడు రవికృష్ణ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో సోనియా అగర్వాల్ హీరోయిన్ నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. తర్వాత ఇక్కడ అంతగా అవకాశాలు రాకపోవడంతో తమిళ్, కన్నడ సినిమాలపై ఫోకస్ పెట్టి అక్కడ మంచి విజయాలే అందుకుంది. తాజాగ '7/జీ బృందావనీ కాలనీ' సీక్వెల్ తీస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: చంద్రయాన్ విజయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ హీరోయిన్) తమిళంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలోనే హీరో ధనుష్ అన్నయ్య అయిన దర్శకుడు సెల్వ రాఘవన్ను 2006లో వివాహమాడి ఆపై 2010లో విడాకులు తీసుకుంది. తర్వాత సెల్వరాఘవన్ 2011లో మళ్లీ పెళ్లి చేసుకున్నా.. సోనియా ఒంటరిగానే జీవిస్తోంది. తాజాగ ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను ఇలా పంచుకున్నారు. 'దర్శకుడిగా సెల్వరాఘవన్ మొండి పట్టుదలగలవాడు. కానీ వ్యక్తిగత జీవితంలో అలాంటి వ్యక్తి కాదు. చాలా ప్రశాంతమైన వ్యక్తి, ఎల్లప్పుడూ బిజీగా ఉంటారు. రచన వగైరాలతో ఎప్పుడూ తనదైన లోకంలో ఉండేవాడు. కానీ తనతో వైవాహిక జీవితం గురించి ఇక మాట్లాడే ప్రసక్తే లేదు. మేం ఎందుకు విడిపోయామో అతనికి, నాకు తెలుసు. ప్రస్తుతం ఆయన వెళ్తున్న దారిలో ఎంత సంతోషంగా ఉన్నారో.. నేను కూడా అంతే సంతోషంగా ఉన్నాను.' అని సోనియా అన్నారు. జీవితంలో భార్యాభర్తలుగా కలిసి ఉన్నవాళ్లు విడిపోయిన తర్వాత కూడా స్నేహితులుగా ఎలా ఉంటున్నారో తనకు అర్థం కావడం లేదని తెలిపింది. తన వరకు అయితే అది సాధ్యం కాదని చెప్పింది. అలాంటి పని మాత్రం చేయలేనని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అతను తన కంటికి మళ్లీ స్నేహితుడిగా కనిపించడని పేర్కొంది. ప్రేమ చనిపోయిన తర్వాత స్నేహితుడిలా చూడలేమని తెలిపింది. జీవితంలో మళ్లీ తన ముఖం చూడనని, అలాంటి వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ లేనట్లేనని సోనియా అగర్వాల్ అన్నారు. పెళ్లి తర్వాత తన సినిమా కెరీర్ ఆశించిన స్థాయిలో సాగలేదని సోనియా పేర్కొంది. (ఇదీ చదవండి: రాజమౌళి- మహేశ్బాబు సినిమాపై అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది) పెళ్లి జరిగిన సమయం నుంచే నటించకూడదని సెల్వ కుటుంబం అభ్యంతరం చెప్పిందని ఆమె గుర్తుచేసుకుంది. అందుకే ఆ సమయంలో బ్రేక్ తీసుకున్నానని తెలిపింది. అయితే 2010లో భర్త నుంచి విడిపోయిన తర్వాత, తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినట్లు సోనియా చెప్పింది. ఆ తర్వాత ఆమె కన్నడ,తమిళ్లో పలు సినిమాలతో బిజీగానే ఉంటుంది. ఇప్పుడు '7/జీ బృందావన కాలనీ' సీక్వెల్తో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఆమె ప్రకటించింది -
మేనల్లుడి కోసం ధనుష్, అనిరుధ్ మాస్టర్ ప్లాన్ ?
సౌత్ ఇండియాలో స్టార్ హీరోగా ధనుష్ కొనసాగుతున్నారు. 'సార్' విజయం తర్వాత ఆయన మరింత జోరుగా సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తోన్న 'కెప్టెన్ మిల్లర్' చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. పీరియాడికల్ వార్ డ్రామాగా ఆయన కెరీర్లోనే భారీ బడ్జెతో రానుంది. తర్వాత తన మైల్స్టోన్ 50వ చిత్రానికి కూడా ప్లాన్ చేస్తున్నాడు. అయితే ధనుష్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించకుండా అతిధి పాత్రలో మాత్రమే కనిపించనున్నాడు. కానీ ఇందులో ముఖ్య విషయం ఏమిటంటే ఈ మూవీని ఆయనే డైరెక్ట్ చేయనున్నారు. (తల్లి విజయలక్ష్మి, అక్కలు విమల గీత (కుడి), కార్తీక (ఎడమ)తో ధనుష్) పవర్ పాండి తర్వాత ధనుష్ దర్శకత్వం వహించిన రెండవ చిత్రం ఇది. ఇందులో S.J సూర్య,సందీప్ కిషన్, అపర్ణ బాలమురళి, అనిఖా సురేంద్రన్, దుషార విజయన్, సెల్వరాఘవన్లు ఉండగా కీలక పాత్ర కోసం మట్టి కుస్తి హీరో విష్ణు విశాల్ను తీసుకున్నాడు. ఇదిలా ఉండగా తన మూడవ చిత్రాన్ని కూడా ధనుస్ లైన్లో పెట్టాడట. ఈ సినిమాతో అతని మేనల్లుడు ఆరంగేట్రం చేస్తున్నాడట. ధనుష్, సెల్వరాఘవన్లకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. డాక్టర్ విమల గీత, డాక్టర్ కార్తీక వారిద్దరూ చెన్నైలో ఒక ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. వారిలో ధనుష్ అక్క అయిన విమల గీత కుమారుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు. అందుకోసం అతను ఇప్పటికే శిక్షణ కూడా ప్రారంభించాడట. ఇదే నిజమైతే ధనుష్ల ఫాలోయింగ్తో అతని ఎంట్రీ కూడా భారీ రేంజ్లో ఉంటుందని అభిమానులు పేర్కొంటున్నారు. (ధనుష్ అక్క విమల గీత ఫ్యామిలీ) మేనల్లుడికి ఇండస్ట్రీలో మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని అందుకు కావాల్సిన కథను ఇప్పటికే రెడీ చేశాడట. ఈ సినిమా కోసం మ్యూజిక్ కింగ్ అనిరుధ్ రవిచందర్ను ఏర్పాటు చేస్తున్నాడట. ఈ సినిమాతో పాటు శేఖర్ కమ్ములతో 'D51' కూడా జరుగుతుంది. -
సూపర్ హిట్ లవ్ స్టోరీకి సీక్వెల్ రెడీ.. హీరోయిన్ ఎవరంటే..?
కోలీవుడ్లో 'తుళ్లువదో ఇళమై' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన సెల్వరాఘవన్ తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత కాదల్కొండేన్, 7జీ రెయిన్బో కాలనీ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం నటుడిగా బిజీ అవుతున్న ఈయన మళ్లీ దర్శకత్వం వహించడానికి సిద్ధం అయ్యారు. ఈయన ఇంతకుముందు కోలీవుడ్లో దర్శకత్వం వహించిన సక్సెస్ఫుల్ చిత్రం 7జీ రెయిన్బో కాలనీ తెలుగులో 7/G బృందావన్ కాలనీగా విడుదలైంది. (ఇదీ చదవండి: చిత్తూరు నుంచి బాలీవుడ్నే ఏలిన అంకుశం రామిరెడ్డి ఎలా మరణించారో తెలుసా?) తెలుగు వెండితెరపై ఎన్నో సూపర్ హిట్ లవ్ స్టోరీస్ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. అందులో 7/G బృందావన్ కాలనీ ఒకటి. రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ సెల్వ రాఘవన్ తెరకెక్కించిన ఈ మూవీ 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అప్పట్లో ఈ సినిమాకు యువతలో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఈ సినిమా సాంగ్స్కు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. తాజాగా ఈ మూవీకి సీక్వెల్ను తెరకెక్కించేందకు ప్లాన్ చేస్తున్నారు సెల్వరాఘవన్. తొలి భాగంలో నిర్మాత ఏఎం.రత్నం వారసుడు రవికృష్ణ కథానాయకుడిగా పరిచయం అయ్యారు. తరువాత ఆయన నటించిన పలు చిత్రాలు ఆశించిన విజయాలను సాధించకపోవడంతో నటనకు దూరంగా ఉంటున్నారు. అలాంటిది 7/G బృందావన్ కాలనీ చిత్రం ద్వారా రీ ఎంట్రీకి సిద్ధం అవుతున్నాడు. (ఇదీ చదవండి: BRO Twitter Review ‘బ్రో’ మూవీ ట్విటర్ రివ్యూ) కాగా ఇందులో నటించే కథానాయకి పాత్ర కోసం నటి అదితి శంకర్, ఇవనాలలో ఒకరిని నటింపజేయడానికి దర్శకుడు సెల్వరాఘవన్ చర్చలు జరుపుతున్నట్లు టాక్. వీరిలో ఆ లక్కీ నటి ఎవరనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. అదితిశంకర్ నటించిన మావీరన్ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అధర్వ తమ్ముడు ఆకాశ్ మురళీకి జంటగా నటిస్తున్నారు. ఇకపోతే లవ్ టుడే చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న నటి ఇవనా నటుడు హరీశ్ కల్యాణ్కు జంటగా నటించిన ఎల్జీఎం చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. కాగా 7/G బృందావన్ కాలనీ చిత్రానికి సీక్వెల్ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
సీన్ రివర్స్.. ధనుష్ డైరెక్షన్లో నటించనున్న సెల్వ రాఘవన్!
బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయన్నది సామెత మాత్రమే కాదు.. జీవిత సత్యం కూడా. దర్శకుడు సెల్వ రాఘవన్, నటుడు ధనుష్ల కథ ఇంచుమించు ఇలాంటిదే. వీరిద్దరూ అన్నదమ్ములు అన్న విషయం తెలిసిందే! ఇద్దరు ఒకేసారి సినీ ప్రయాణం ప్రారంభించారు. తుళ్లువదో ఇళమై చిత్రంతో సెల్వరాఘవన్ దర్శకుడుగా, ధనుష్ నటుడుగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం తర్వాత కాదల్ కొండాన్, పుదుపేట్టై, మయక్కం వంటి ఎన్నో చిత్రాలు రూపొందించి మంచి విజయాలను అందుకున్నారు. ఆ తర్వాత సెల్వరాఘవన్, ధనుష్ ఎవరి బాటలో వారు ప్రయాణించారు. చాలా కాలం తర్వాత ఇటీవల 'నానే వరువేన్' చిత్రంతో మళ్లీ కలిశారు. అయితే ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ విషయాన్ని పక్కన పెడితే ధనుష్ కథానాయకుడిగా చాలా ఎత్తుకు ఎదిగిపోయారు. దర్శకుడిగా, నిర్మాతగా విజయాలను అందుకున్నారు. కాగా ఇప్పుడు దర్శకుడు సెల్వరాఘవన్ కూడా నటుడిగా అవతారం ఎత్తారు. ఈయన సాని కాగితం చిత్రంలో ప్రధాన పాత్రను పోషించి ప్రశంసలను అందుకున్నారు. అదేవిధంగా బీస్ట్, నానేవరువేన్ చిత్రాలలో కీలకపాత్రలను పోషించారు. రుద్ర తాండవం చిత్రంలో కథానాయకుడిగానూ నటించారు. తాజాగా సెల్వ రాఘవన్.. తాను కథానాయకుడిగా పరిచయం చేసిన తన సోదరుడు ధనుష్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ధనుష్ తన 50వ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తూ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో సెల్వ రాఘవన్ ముఖ్యపాత్రను పోషిస్తున్నట్లు తాజా సమాచారం. నటి దుషారా నాయకిగా నటిస్తున్న ఇందులో ఎస్ జే సూర్య, సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం, అపర్ణ బాలమురళి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇది ఉత్తర చైన్నె నేపథ్యంలో తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టార్ కథా చిత్రం అని తెలిసింది. చదవండి: భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్న కీర్తి సురేశ్.. ఎంతంటే? మిథునం రచయిత కన్నుమూత -
సీక్వెల్.. మార్పుల్...
కథ పెద్దదైతే సినిమా రెండు భాగాలవుతుంది.. ఒక్కోసారి మూడు కూడా అవుతుంది. ఇప్పుడలాంటి కథలతో రూపొం దుతున్న సీక్వెల్స్ కొన్ని ఉన్నాయి. అయితే ఒకటో భాగంలో నటించిన నటీనటులు, తెరకెక్కించిన దర్శకుడు రెండో భాగంలో కంటిన్యూ కావడంలేదు. ఒకటీ హీరో మారుతున్నారు.. లేదా డైరెక్టర్ మారుతున్నారు... లేదా హీరోయిన్ మారుతున్నారు... ఇక మార్పుల్తో రూపొందుతున్న సీక్వెల్స్ గురించి తెలుసుకుందాం. హిట్: ది థర్డ్ కేస్ తెలుగు చిత్ర పరిశ్రమలో ‘హిట్’ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’, ‘హిట్: ది సెకండ్ కేస్’ చిత్రాలు సూపర్ హిట్స్గా నిలిచాయి. ఈ రెండు చిత్రాలను నిర్మించింది హీరో నాని కావడం విశేషం. కాగా తొలి రెండు భాగాలు నిర్మించిన నాని థర్డ్పార్ట్ ‘హిట్: ది థర్డ్ కేస్’లో హీరోగా నటించనుండటం విశేషం. ‘హిట్: ది ఫస్ట్ కేస్’ (2020) చిత్రంలో విశ్వక్ సేన్ హీరోగా నటించారు. క్రైమ్ థ్రిల్లర్గా రూపొం దిన ఈ చిత్రంలో హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ను (హిట్) లీడ్ చేసే పోలీస్ ఆఫీసర్ రుద్రరాజుపాత్రలో నటుడిగా విశ్వక్ సేన్కి మంచి మార్కులే పడ్డాయి. ఈ మూవీ మంచి హిట్గా నిలిచింది. కాగా హిట్ ఫ్రాంచైజీలో రెండో భాగం ‘హిట్: ది సెకండ్ కేస్’లో హీరోగా అడివి శేష్ని తీసుకున్నారు శైలేష్. ఎస్పీ కృష్ణదేవ్పాత్రలో అడివి శేష్ తనదైన శైలిలో నటించి, మెప్పించారు. ఈ సినిమా కూడా హిట్. ఇక మూడో భాగం ‘హిట్: ది థర్డ్ కేస్’లో హీరో నాని నటించనున్నట్లు ‘హిట్: ది సెకండ్ కేస్’ చివర్లో రివీల్ చేశారు. పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్పాత్రలో నాని నటిస్తారు. కాగా హిట్ ఫ్రాంచైజీలో మొత్తం 7 భాగాలుంటాయని శైలేష్ కొలను గతంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. చంద్రముఖి–2 ‘చంద్రముఖి’ (2005)లో ‘లక లక లక..’ అంటూ హీరో రజనీకాంత్ రాజు గెటప్లో విలనిజమ్ పండించి, డాక్టర్ ఈశ్వర్గా మంచితనం కనబరిస్తే ప్రేక్షకులు కాసుల వర్షం కురిపించారు. పి. వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్, నయనతార జంటగా జ్యోతిక, ప్రభు కీలకపాత్రలు చేశారు. ‘చంద్రముఖి’ విడుదలైన 18 ఏళ్లకు సీక్వెల్కి శ్రీకారం చుట్టారు పి. వాసు. ‘చంద్రముఖి 2’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో రజనీ ప్లేస్లోకి లారెన్స్ వచ్చారు. అలాగే కంగనా రనౌత్ ప్రధానపాత్రలో నటించారు. ఇంకా వడివేలు, లక్ష్మీ మీనన్, రాధిక తదితరులు నటించారు. ఇటీవల మైసూర్లో జరిగిన షెడ్యూల్తో ఈ మూవీ పూర్తయింది. తమిళ, తెలుగు భాషల్లో సెప్టెంబర్ 15న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి స్వరకర్త. యుగానికి ఒక్కడు–2 వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించారు దర్శకుడు సెల్వ రాఘవన్. ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఆయిరత్తిల్ ఒరువన్’ (తెలుగులో యుగానికి ఒక్కడు –2010) ఎంత హిట్ అయిందో చెప్పక్కర్లేదు. కార్తీ హీరోగా, ఆండ్రియా, రీమా సేన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి సీక్వెల్గా ‘ఆయిరత్తిల్ ఒరువన్ 2’ (యుగానికి ఒక్కడు 2) తెరకెక్కించనున్నారు సెల్వ రాఘవన్. అయితే ఈ సినిమాలో తన సోదరుడు, హీరో ధనుష్ని లీడ్ రోల్కి తీసుకున్నారాయన. కార్తీ స్థానంలో ధనుష్ కనిపిస్తారని కొందరు అంటుంటే.. అలాంటిదేం లేదు.. కార్తీ కూడా ఉంటారు.. సీక్వెల్లో ధనుష్పాత్ర యాడ్ అయిందని మరికొందరు అంటున్నారు. మరి ‘యుగానికి ఒక్కడు 2’లో కార్తీపాత్ర ఉంటుందా? లేదా? అనేది చూడాలి. జెంటిల్మన్–2 అర్జున్, మధుబాల జంటగా శంకర్ దర్శకత్వంలో కేటీ కుంజుమోన్ నిర్మించిన ‘జెంటిల్మేన్’ (1993) చిత్రం సూపర్హిట్గా నిలిచింది. దాదాపు ముప్పైఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ ‘జెంటిల్మన్ 2’ని నిర్మిస్తున్నారు కుంజుమోన్. అయితే రెండో భాగంలో దర్శకుడు, హీరో, సంగీత దర్శకుడు ముగ్గురూ మారడం విశేషం. గోకుల్ కృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ సీక్వెల్లో ‘మంత్ర–2, రాజుగారి గది, పెళ్లికి ముందు ప్రేమకథ’ వంటి చిత్రాల్లో నటించిన చేతన్ చీను హీరోగా నటించనున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొం దనున్న ఈ చిత్రం కన్నడ, మలయాళ భాషల్లో డబ్బింగ్ కానుంది. టిల్లు స్క్వేర్ ‘డీజే టిల్లు పేరు వీని స్టయిలే వేరు..’ అంటూ హీరో సిద్ధు జొన్నలగడ్డ స్పెప్పులేస్తే ప్రేక్షకులు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు. విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం ‘డీజే టిల్లు’. రొమాంటిక్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్గా సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా గత ఏడాది విడుదలై సూపర్హిట్గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్గా ‘టిల్లు స్క్వేర్’ మూవీ తెరకెక్కుతోంది. అయితే సీక్వెల్కి అటు డైరెక్టర్, ఇటు హీరోయిన్ ఇద్దరూ మారడం విశేషం. ‘టిల్లు స్క్వేర్’కి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే తొలి భాగంలో నేహా శెట్టి హీరోయిన్గా నటించి గ్లామర్తో మెప్పించారు. అయితే సీక్వెల్లో మాత్రం అనుపమా పరమేశ్వరన్ని హీరోయిన్గా తీసుకున్నారు. ఈ సినిమాని సెప్టెంబర్ 15న విడుదల చేయాలనుకుంటున్నారు. జిగర్తండా–2 సిద్ధార్థ్, బాబీ సింహా, లక్ష్మీ మీనన్ కీలకపాత్రల్లో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జిగర్తండా’ (2014) తమిళంలో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా ‘గద్దలకొండ గణేష్’గా రీమేక్ అయి, ఇక్కడా ఘనవిజయం సాధించింది. కాగా ‘జిగర్తండా’ విడుదలైన దాదాపు తొమ్మిదేళ్లకు ‘జిగర్తండా డబుల్ ఎక్స్’ పేరుతో కార్తీక్ సుబ్బరాజ్ సీక్వెల్ తీశారు. ఇందులో రాఘవ లారెన్స్, ఎస్జే సూర్య లీడ్ రోల్స్లో నటించారు. గ్యాంగ్స్టర్ డ్రామా నేపథ్యంలో కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ దీపావళికి విడుదల కానుంది. -
సంచలనం సృష్టించిన..7/G బృందావన్ కాలనీ సీక్వెల్
-
హీరోయిన్తో విడాకులు..ఒంటరిగా ఉండమని సలహా ఇచ్చిన ధనుష్
సినిమా ఇండస్ట్రీలో ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడాకులు తీసుకుంటారు. ఒకప్పుడు బెస్ట్ కపుల్ అనిపించుకున్న వారే ఆ తర్వాత విడాకులు తీసుకొని షాక్ ఇచ్చిన జంటలు చాలానే ఉన్నాయి. వారిలో తమిళ స్టార్ డైరెక్టర్ సెల్వరాఘవన్- హీరోయిన్ సోనియా అగర్వాల్ కూడా ఉన్నారు. 7/G బృందావన్ కాలనీతో టాలీవుడ్కు పరిచయమైన బ్యూటీ సోనియా అగర్వాల్. ఆ సినిమా సమయంలోనే డైరెక్టర్ సెల్వరాఘవన్తో ప్రేమలో పడిన ఆమె హీరోయిన్గా పీక్ టైంలో ఉండగానే అతడిని 2006లో పెళ్లాడింది. అయితే మనస్పర్థల కారణంగా వీరు 2010లో విడాకులు తీసుకున్నారు. తాజాగా ఈ విషయంపై సెల్వ రాఘవన్ ఓ తమిళ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ''కొన్ని కారణాల వల్ల నేను, సోనియా విడాకులు తీసుకున్నాం. అప్పుడు నా తమ్ముడు ధనుష్ ఒక మాట అన్నాడు.. దీని గురించి త్వరగా బయటపడు. దేవుడు నీకు సరైన అవకాశం ఇస్తాడు. అప్పుటిదాకా ఒంటరిగా ఉండు అని. నిజంగానే విడాకుల తర్వాత చాలా మానసిక క్షోభకు గురయ్యాను. కానీ సరైన సమయంలో నా జీవితంలోకి గీతాంజలి వచ్చింది. ఆమె వల్ల నా జీవితంలో పెను మార్పు చోటుచేసుకుంది. ఇప్పుడు ఇద్దరం సంతోషంగా ఉన్నాం'' అంటూ చెప్పుకొచ్చారు. సెల్వ రాఘవన్ 2011 లో గీతాంజలి రామన్ ను రెండో వివాహం చేసుకోగా సోనియా మాత్రం సింగిల్గానే ఉంటోంది. -
బకాసురన్.. కూతురి కోసం పోరాడే తండ్రి కథ!
చిత్రాలను ప్రయోగాత్మకం, ప్రయోజనాత్మకం, ప్రజానందాత్మకం అంటూ మూడు భాగాలుగా విభజిస్తే బకాసురన్ చిత్రం ప్రయోజనాత్మకం కేటగిరీలో చేరుతుంది. సమాజానికి అవసరమైన కంటెంట్తో చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు మోహన్.జి. ఇంతకుముందు పళయ వన్నారపేట్టై, ద్రౌపది, రుద్ర తాండవం వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను రూపొందించారు. తాజాగా శ్రీ దర్శకత్వంలో జీఎం ఫిలిం కార్పొరేషన్ పతాకంపై నిర్మించిన చిత్రం బకాసురన్. దర్శకుడు సెల్వరాఘవన్ కథానాయకుడిగా నటించిన ఇందులో నటరాజన్, కే రాజన్, మన్సూర్ అలీఖాన్, నటి తారాక్షి, లావణ్య మాణిక్యం, దేవదర్శిని, పి.ఎల్ తేనప్పన్, గుణానిధి, రామ్, శశిలైలా రిచా, కూల్ జయంత్, అరుణోదయన్, కుట్టి గోపి ముఖ్యపాత్రలు పోషించారు. దీనికి శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, ఫరూక్ బాషా చాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని జీటీఎం సంస్థ శుక్రవారం విడుదల చేసింది. దర్శకుడు మోహన్.జి ఈ చిత్రానికి సమాజంలో జరుగుతున్న ప్రస్తుత విషయాలను ఇతివృత్తంగా తీసుకున్నారు. కొన్ని యధార్థ సంఘటనలను చిత్రంలో వాడుకున్నారు. ముఖ్యంగా విద్యార్థినుల భవిష్యత్తులతో విద్యాసంస్థల అధినేతలు ఎలా ఆడుకుంటున్నారు?, పరిస్థితుల ప్రభావం కారణంగానో, మరి ఇతర కారణాల వల్లో యువతులు వ్యభిచార కూపంలో చిక్కుకుని ఎలా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు? అందుకు కొందరు యువకులు ఆధునిక పరిజ్ఞానాన్ని ఎలా వాడుకుంటున్నారు? వంటి అంశాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కించిన కథ చిత్రం బకాసురన్. ఇందులో వీధి భాగోతం కళాకారుడుగా దర్శకుడు సెల్వరాఘవన్ నటించారు. మాజీ సైనికుడిగా నటరాజన్, విద్యాసంస్థ అధినేతగా రాధారవి నటించారు. వీరి మధ్య జరిగే కథే బకాసురన్. అయితే ఇందులో బకాసురన్ ఎవరనేదే చిత్రంలో ఆసక్తికరమైన అంశం. కూతురి తండ్రిగా భీమరాజ్ పాత్రలో సెల్వరాఘవన్ నటన హైలైట్గా ఉంటుంది. ఆయన అలుపెరుగని పోరా టమే బకాసురన్ చిత్రం. -
గీతా ఆర్ట్స్ బ్యానర్లో ధనుశ్ ‘నేనే వస్తున్నా’.. టీజర్ విడుదల
తమిళ స్టార్ హీరో ధనుశ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘నానే వరువెన్’(తెలుగులో నేనే వస్తున్నా). సెల్వ రాఘవన్ దర్శకత్వం తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల షూటింగ్ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ సమర్పిస్తుండటం విశేషం. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టీజర్ను విడుదల చేసింది చిత్ర బృందం. 1 నిమిషం 40 సెకన్ల నిడివితో ఉన్న ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఇందులో ధనుశ్ క్లాస్, రస్టిక్ రోల్స్తో ద్విపాత్రాభినయం చేసినట్లు తెలుస్తోంది. ఈ టీజర్కు యువన్ శంకర్ రాజా అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ థ్రిల్లింగ్గా ఉంది. ‘కాదల్ కొండేన్’, ‘పుదుపేట్టై’, ‘మయక్కం ఎన్న’ తర్వాత ధనుశ్-సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న నాలుగవ చిత్రమిది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో కమెడియన్ మోగి బాబు, ఇందుజా రవిచంద్రన్, ఎల్లి అవ్రాయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
గీతా ఆర్ట్స్ బ్యానర్లో ధనుశ్ ‘నేనే వస్తున్నా’ చిత్రం
తమిళ స్టార్ హీరో ధనుశ్ తాజా చిత్రం ‘నానే వరువేన్’. ధనుశ్ సోదరుడు, డైరెక్టర్ సెల్వరాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ‘కాదల్ కొండేన్’, ‘పుదుపేట్టై’, ‘మయక్కం ఎన్న’ తర్వాత ధనుశ్-సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న నాలుగవ చిత్రమిది. ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని తెలుగులో నేనే వస్తున్నా పేరుతో విడుదల చేస్తున్నారు. చదవండి: రణ్వీర్ చెంప చెల్లుమనిపించిన బాడిగార్డ్! అసలేం జరిగిందంటే.. అయితే ఈ సినిమాను తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్తో కలిసి కలై పులి ఎస్ తను ఈ సినిమాను సమర్నిస్తున్నట్లు తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చారు. తాజాగా నిర్మాత కలై పులి గీతా అర్ట్స్ అధినేత అల్లు అరవింద్ను కలిశారు. ఈ సందర్భంగా నేను వస్తున్నా పోస్టర్ రిలీజ్ చేశారు. అనంతరం నిర్మాత మీడియాతో మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని ఈ నెలలో(సెప్టెంబర్) విడుదల చేస్తామని, త్వరలోనే రిలీజ్ డేట్ను ప్రకటిస్తామని తెలిపారు. కాగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కమెడియన్ మోగి బాబు, ఇందుజా రవిచంద్రన్, ఎల్లి అవ్రాయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
పగ, ప్రతీకారంతో రగిలిన కీర్తి సురేష్ 'చిన్ని' మూవీ రివ్యూ
టైటిల్: చిన్ని నటీనటులు: కీర్తి సురేష్, సెల్వ రాఘవన్, మురుగదాస్, కన్నా రవి, లిజీ అంటోని తదితరులు కథ, దర్శకత్వం: అరుణ్ మాథేశ్వరన్ నిర్మాత: డి. ప్రభాకరన్, సిద్ధార్థ్ రావిపాటి సంగీతం: సామ్ సీఎస్ సినిమాటోగ్రఫీ: యామిని యజ్ఞమూర్తి ఎడిటింగ్: నాగూరన్ రామచంద్రన్ విడుదల తేది: మే 6, 2022 (అమెజాన్ ప్రైమ్ వీడియో) 'మహానటి' కీర్తి సురేష్ డీ గ్లామరైజ్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'చిన్ని'. 'సాని కాయిధం' అనే తమిళ చిత్రాన్ని తెలుగులో 'చిన్ని' పేరుతో మే 6న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల చేశారు. ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సోదరుడు, డైరెక్టర్ సెల్వ రాఘవన్ కూడా ఓ కీలక పాత్రలో నటించారు. అయితే ఓవైపు కమర్షియల్ మూవీస్ చేస్తూనే మరోవైపు హీరోయిన్ సింట్రిక్ ఫిలీంస్తో అలరిస్తోంది కీర్తి సురేష్. అలా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిన్ని సినిమా కథేంటి ? ఇందులో కీర్తి సురేష్ నటన ఎలా ఉంది ? సెల్వ రాఘవన్ పాత్ర ఏంటి ? అనే తదితర విషయాలను రివ్యూలో చూద్దాం. కథ: భర్త మారప్ప, ఐదేళ్ల కూతురు ధనతో కానిస్టేబుల్గా జీవితం సాగిస్తుంటుంది చిన్ని (కీర్తి సురేష్). గ్రామంలోని రైస్ మిల్లులో పని చేస్తున్న మారప్ప స్థానిక ఎన్నికల్లో పోటీ చేయలనుకుంటాడు. అది మారప్ప పని చేసే మిల్లు ఓనర్కు నచ్చదు. ఈ క్రమంలో మిల్లు ఓనర్తో జరిగిన గొడవ అతనిపై మారప్ప చేయిచేసుకునే వరకు వెళ్తుంది. దీన్ని పెద్ద అవమానంగా భావించిన మిల్లు ఓనర్, అతడి స్నేహితులు మారెప్ప కుటుంబాన్ని నాశనం చేయాలని అనుకుంటారు. చిన్ని కుటుంబాన్ని మిల్లు ఓనర్ ఏం చేశాడు ? దానికి చిన్ని ఏం చేసింది ? వారిపై ఎలా ప్రతికారం తీర్చుకుంది ? చిన్నికి రంగయ్య (సెల్వ రాఘవన్)కు ఉన్న సంబంధం ఏంటి ? అనే విషయాలే సముహారమే 'చిన్ని' సినిమా. విశ్లేషణ: చిన్ని సినిమా స్టోరీ అంతా 1989 నాటి కాలంలో సాగుతుంది. అప్పటి సమాజంలో అగ్రవర్ణాలవారు పేదవారిని ఎలా చూసేవారనేది కథగా తెరకెక్కించాడు డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్. ఇలాంటి రివేంజ్ డ్రామా కథలు ఇప్పటివరకు మనం చాలానే చూశాం. అయితే కథలో ఎంత భావోద్వేగపు సన్నివేశాలు ఉంటే ప్రేక్షకులు అంతగా ఆ సీన్లకు కనెక్ట్ అవుతారు. ఈ విషయంలో డైరెక్టర్ సఫలం అయ్యారనే చెప్పవచ్చు. చిన్ని కుటుంబంపై మిల్లు ఓనర్ చేసే దారుణాలు ఆడియెన్స్ను ఎమోషనల్ అయ్యేలా చేస్తాయి. సినిమాను బ్లాక్ అండ్ వైట్ థీమ్తో మొదలు పెట్టి, గతంలో జరిగిన విషయాలకు కనెక్ట్ అయ్యేలా ఆ సీన్లను కలర్లో చూపించడం బాగుంది. రివేంజ్ డ్రామా కాబట్టి ఈ మూవీలో సన్నివేశాలన్ని ప్రేక్షకుడు ఊహించినట్లే సాగుతాయి. చిన్ని, రంగయ్య చేసే హత్యలు హింసాత్మకంగా ఉన్నా ఆకట్టుకుంటాయి. ఈ సన్నివేశాలను ఆసక్తికరంగా, ఉత్కంఠగా తీర్చిదిద్దడంలో దర్శకుడు సక్సెస్ సాధించారనే చెప్పవచ్చు. కాకపోతే ఈ సీన్లు రియాల్టీకి దూరంగా ఉంటాయి. సినిమా పూర్తిగా లాజిక్గా దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. సినిమాలో ప్రతి పాత్రను వివరంగా చూపించే క్రమంలో సాగాదీసినట్లుగా ఉంటుంది. ఇలాంటి స్టోరీలో పాటలు లేకుండా ప్రేక్షకుడి సహనానికి పరీక్షపెట్టలేదనే చెప్పవచ్చు. క్రైమ్ థ్రిల్లర్ను ఎంజాయ్ చేసే సినీ ప్రియులకు 'చిన్ని' కచ్చితంగా నచ్చుతుంది. ఈ వారంలో ఓటీటీలో టైంపాస్కు సినిమా చూడాలనుకనే వారికి 'చిన్ని' ఒక బెటర్ ఆప్షన్. ఎవరెలా చేశారంటే: 'మహానటి' సినిమా తర్వాత కీర్తి సురేష్ 'పెంగ్విన్', 'మిస్ ఇండియా', 'గుడ్లక్ సఖి' వంటి లేడి ఒరియంటేడ్ మూవీస్కే ఓటు వేసింది. అయితే కీర్తి సురేష్కు అవి అంతగా గుర్తింపు తీసుకురాలేకపోయాయి. కానీ 'చిన్ని'తో తన నటనలోని కొత్తదనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసినట్లయింది. కుటుంబంతో కలిసి బతకాలన్న ఆశయం కలిగిన కానిస్టెబుల్గా 'చిన్ని' పాత్రలో కీర్తి సురేష్ ఆకట్టుకుంది. పగ, ప్రతీకారం తీర్చుకుంటునే తనను తాను కాపాడుకునే మహిళగా తాను చేసిన నటన ఎంతో అలరిస్తుంది. ఇక రంగయ్య పాత్రలో సెల్వరాఘవన్ ఒదిగిపోయారు. నటనలో ఆయన మార్క్ను చూపించారు. తదితర నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పవచ్చు. ఈ సినిమాకు సంగీతం ప్రధాన బలంగా అనిపిస్తుంది. సామ్ సీఎస్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంతో ఆకట్టుకుంటుంది. దీంతో ప్రేక్షకుడిని కథలో లీనమయ్యేలా చేస్తుంది. అయితే ఫైనల్గా డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కించిన ఈ చిన్ని మూవీ కథ కొత్తేమి కాకున్నా తీర్చి దిద్దిన విధానం బాగుంది. స్క్రీన్ప్లే స్లోగా కాకుండా ఉంటే ప్రేక్షకుడికి సాగదీసినట్లుగా అనిపించేది కాదు. కాబట్టి స్లోగా ఉన్నా మంచి రివేంజ్ డ్రామా చూడాలనుకుంటే 'చిన్ని' మూవీని ట్రై చేయవచ్చు. -
24 హత్యలు చేసిన కీర్తి సురేష్.. ఆసక్తిగా ట్రైలర్
Keerthy Suresh As Killer In Chinni Movie And Trailer Released: 'మహానటి' కీర్తి సురేష్ తాజాగా నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. ఇందులో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ మే 12న విడుదల కానుంది. అయితే ఈ సినిమా కంటే ముందే మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది కీర్తి సురేష్. అయితే ఈ మూవీ థియేటర్లలో కాకుండా ఓటీటీ వేదికగా సందడి చేయనుంది. 'సాని కాయిధం' అనే తమిళ చిత్రాన్ని 'చిన్ని' పేరుతో తెలుగులోనూ విడుదల చేయనున్నారు. ఇందులో కీర్తి సురేష్ ఒక గ్రామీణ యువతిగా డీ గ్లామరైజ్డ్ పాత్రలో అలరించనుంది. ఈ మూవీలో ధనుష్ సోదరుడు, డైరెక్టర్ సెల్వ రాఘవన్ కీలక పాత్ర పోషించాడు. ఇది వరకు రిలీజైన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేశారు. 'ఎన్ని మర్డర్లు చేశావని' రంగయ్య అనే వ్యక్తిని పోలీసులు అడగడంతో మూవీ ట్రైలర్ ప్రారంభమైంది. కీర్తి సురేష్, సెల్వ రాఘవన్ తాము చేసిన హత్యల గురించి చెప్పే పద్ధతి ఉత్కంఠంగా ఉంది. వీరిద్దరి యాక్టింగ్ సూపర్బ్ అనేలా ఉంది. 24 మందిని చంపి తాను చేయబోయే 25వ హత్య గురించి చెప్పడం క్రూరంగా ఆకట్టుకునేలా ఉంది. ఈ మూవీ పగ, ప్రతికారం, క్రైమ్ నేపథ్యంగా తెరకెక్కినట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్గా పని చేసిన చిన్ని ఎందుకు ఇన్ని హత్యలు చేయాల్సి వచ్చిందో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వ వహించిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్లో మే 6 నుంచి ప్రసారం కానుంది. చదవండి: కృతిశెట్టి నో చెప్పిన ప్రాజెక్ట్కు ‘మహానటి’ గ్రీన్ సిగ్నల్ 'కళావతి సాంగ్'పై కళావతి స్టెప్పులు.. నెట్టింట వైరల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నేరుగా ఓటీటీలోకి కీర్తి సురేష్ సినిమా.. ఎప్పుడు ? ఎక్కడంటే ?
Keerthy Suresh Selva Raghavan Chinni Movie Release Date: 'ప్రతీకారం తీర్చుకోవడం అంటే ఏంటీ ? ఎవరైనా మన మీద రాయి విసిరితే.. తిరిగి మనమూ విసరాలి. మనమీద ఉమ్మేస్తే.. మనమూ ఉమ్మేయ్యాలి. మనల్ని కొడితే మనమూ కొట్టాలి' అని ఆవేశంగా అంటోంది కీర్తి సురేష్. 'మహానటి' కీర్తి సురేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తుంది. 'మహానటి' సినిమా తర్వాత కీర్తి సురేష్కు ఏ మూవీ అంతగా సక్సెస్ను ఇవ్వలేదు. ఇప్పుడు తన తదుపరి చిత్రాలపైనే ఆశలు పెట్టుకుంది కీర్తి సురేష్. 'సర్కారు వారి పాట' చిత్రం మే 12న విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ముందే కీర్తి సురేష్ మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఆ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడదల కానుంది. కీర్తి సురేష్ తాజాగా నటించిన చిత్రం 'సాని కాయిదమ్'. ఈ చిత్రాన్ని తెలుగులో 'చిన్ని' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అమేజాన్ ప్రైమ్ వీడియో వేదికగా మే 6న 'చిన్ని' మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ శుక్రవారం (ఏప్రిల్ 22) విడుదల చేశారు. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్తోపాటు ధనుష్ అన్న, డైరెక్టర్ సెల్వ రాఘవన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. పగ, ప్రతీకారం నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. టీజర్లో కీర్తి సురేష్ ఎమోషనల్గా చెప్పిన డైలాగ్లు ఆకట్టుకుంటున్నాయి. చదవండి: ఆ పాట ఓ ప్రయోగంలా అనిపించింది: కీర్తి సురేష్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అన్నదమ్ములకు సోకిన కరోనా.. సినిమా షూటింగ్కు బ్రేక్
Hero Dhanush Tests Positive For Covid 19: తమిళ స్టార్ హీరో ధనుష్కు కోలీవుడ్లోనే కాకుండా టాలీవుడ్లో కూడా అభిమానులు ఉన్నారు. ఈ క్రేజ్తోనే తెలుగులో నేరుగా ధనుష్ ఒక సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పేరే 'సార్'. వెంకీ అట్లూరీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళం రెండు భాషల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవలే చిత్రీకరణ మొదలైన ఈ చిత్రాన్ని తమిళంలో 'వాత్తి' పేరుతో విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ధనుష్ సోదరుడు డైరెక్టర్ సెల్వ రాఘవన్కు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా ధనుష్ కూడా కరోనా బారిన పడ్డారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ధనుష్ కొవిడ్ పరీక్షలు చేయించుకోవడంతో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో 'సార్' సినిమా షూటింగ్కు బ్రేక్ పడింది. ధనుష్కు కరోనా అని తేలగానే 'సార్' చిత్రీకరణ ఆపేశారు. ప్రస్తుతం ధనుష్ హోం ఐసోలేషన్లో వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నారు. వారం, పదిరోజుల వరకూ ధనుష్ 'సార్' చిత్రీకరణలో పాల్గొనే అవకాశం లేదు. అయితే ఇటీవలే హైదరాబాద్లో షూటింగ్ ప్రారంభించిన చిత్రబృందం ఈ షెడ్యూల్ను భారీగా ప్లాన్ చేశారని టాక్. ఎక్కువ సీన్లు ధనుష్పైనే ఉండటంతో ఆయన పూర్తిగా కోలుకునే వరకు ఈ సినిమా షూటింగ్ ముందుకు వెళ్లనట్లే అని సమాచారం. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫొర్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ధనుష్ టీచర్గా కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
ధనుష్ కుటుంబంలో కరోనా కలకలం..
Dhanush Brother Director Selva Raghavan Tests Positive Covid 19: కరోనా మహమ్మారి విజృంభణ అస్సలు తగ్గేలా లేదు. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ సినీ పరిశ్రమలను తన పంజాతో భయపెడుతోంది. ఇప్పటివరకు ఎంతో మంది నటీనటులు కొవిడ్ బారిన పడ్డారు. తాజాగా తమిళ డైరెక్టర్, హీరో ధనుష్ సోదరుడు సెల్వ రాఘవన్కు జనవరి 23న కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నానని పేర్కొన్నారు. గత కొద్దిరోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారు కూడా కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని కోరారు. అలాగే వైద్యుల సలహాలు పాటించాలని సెల్వ రాఘవన్ విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించి కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. ఇటీవల తెలుగు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అలాగే మలయాళ స్టార్ మమ్ముట్టి, ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్లకు కూడా కొవిడ్ పాజిటివ్ వచ్చింది. 🙏🏼🙏🏼 pic.twitter.com/jqqPQVEVOT — selvaraghavan (@selvaraghavan) January 23, 2022 -
ఓటీటీకి కీర్తి సురేశ్ మూవీ
మహనటి కీర్తీ సురేశ్ ప్రస్తుతం సర్కారి వారి పాట మూవీ షూటింగ్తో బిజీగా ఉంది. దీనితో పాటు ఆమె తమిళంలో ‘సాని కాయిదమ్’ అనే వైవిధ్యమైన చిత్రంలో నటించింది. 1980 కాలం నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ మూవీగా దర్శకుడు మహేశ్వర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుని గుమ్మడి కాయ కూడా కొట్టెసింది. ఈ నేపథ్యంలో నిన్న(అగష్టు 19) ఈ మూవీ ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో కీర్తి ఒక పెల్లెటూరి అమ్మాయిగా ఢిగ్లామర్తో కనిపించగా ఆమె పక్కనే ఆమె పక్కనే దర్శకుడు సెల్వరాఘవన్ లుక్ ఆసక్తిగా ఉంది. ఇందులో ఆయన చేతులకు రక్తంతో ఉండటం మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ చిత్రంలో సెల్వ రాఘవన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. సాయి కానిదమ్ అద్భుతమైన జర్నీ అని, ఈ మూవీ ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నామని ఈ సందర్భంగా సెల్వ రాఘవన్ అన్నాడు. పొస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్దమైంది. దీంతో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ మూవీని థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని వినికిడి. కీర్తిసురేశ్ ఇంతకుముందు చేసిన ‘పెంగ్విన్’ కూడా ఓటీటీలోనే విడుదలైంది. అలాగే ‘సానికాయిధమ్’ కూడా ఓటీటీలోనే రానుందని అంటున్నారు. సర్కారి వారి పాట మూవీతో పాటు కీర్తి సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నాత్తై మూవీలో నటిస్తోంది. ఇందులో ఆమె రజనీకి సోదరిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. -
విజయ్కి విలన్గా ప్రముఖ దర్శకుడు
కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ ‘సాని కాయిదమ్’ చిత్రంతో యాక్టర్గా మారిన సంగతి తెలిసిందే. ఇందులో కీర్తీ సురేష్ మరో ప్రధాన పాత్రధారి. తాజాగా సెల్వరాఘవన్ ‘బీస్ట్’ సినిమాలో నటించేందుకు పచ్చజెండా ఉపారు. విజయ్ హీరోగా నెల్సన్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. ‘బీస్ట్’ సినిమాలో నటించే కొందరి యాక్టర్స్ పేర్లను శనివారం అధికారికంగా ప్రకటించారు. సెల్వరాఘవన్తో పాటు యోగిబాబు, వీటీవీ గణేష్, లిల్లీపుట్ ఫరూకీ, షైన్ టామ్ చాకో, అపర్ణాదాస్, అంకుర్ అజిత్ వికాల్లు కీలక పాత్రలు పోషించనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. కాగా ఈ చిత్రంలో సెల్వరాఘవన్ విలన్ రోల్ చేయనున్నారని టాక్. ఇక దర్శకుడిగా ‘నానే వరువేన్’, ‘యుగానికి ఒక్కడు 2’ చిత్రాలను సెల్వరాఘవన్ తెరకెక్కించనున్నారు. తెలుగులో వెంకటేశ్ హీరోగా ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’కి సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
మా ఇంటికి సంతోషం వచ్చింది
తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ ఇంట్లో సంతోషం నెలకొంది. ఆయన మూడోసారి తండ్రి అయ్యారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు సెల్వరాఘవన్, గీతాంజలి. వీరికి ఒక పాప, బాబు (లీలావతి, ఓంకార్) ఉన్నారు. తాజాగా ఓ బాబుకి జన్మనిచ్చారు గీతాంజలి. ఈ బాబుకి రిషికేశ్ సెల్వరాఘవన్ అని పేరు పెట్టారు. ‘‘మేం ఐదుగురం అయ్యాం. రిషికేశ్ గురువారం ఉదయమే ఈ ప్రపంచంలోకి వచ్చాడు. సంతోషం తెచ్చాడు. మా కుటుంబానికి ప్రేమతో శుభాకాంక్షలు చెప్పిన అందరికీ ధన్యవాదాలు. బాబు ఆరోగ్యంగా ఉన్నాడు’’ అని పేర్కొన్నారు ఈ దంపతులు. 2010లో సెల్వరాఘవన్, గీతాంజలి వివాహం చేసుకున్నారు. ‘‘7/జీ బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, యుగానికి ఒక్కడు’ వంటి సినిమాలను రూపొందించారు సెల్వరాఘవన్. -
తండ్రైన ప్రముఖ దర్శకుడు
సాక్షి చెన్నై: ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ దంపతులు సంతోషంలో మునిగి తేలుతున్నారు.తమకు కుమారుడు జన్మించాడంటూ రాఘవన్ భార్య గీతాంజలి తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అప్పుడే ఈ బుడ్డోడికి రిషికేష్ అనే పేరు కూడా పెట్టేశారు. గురువారం ఉదయం "రిషికేశ్ సెల్వరాఘవన్’’ తమ జీవితాల్లోకి ఎనలేని ఆనందాన్నితీసుకొచ్చాడంటూ గీతాంజలి ఇన్స్టా ద్వారా వెల్లడించారు. ఈ సంతోషకరమైన వార్తను అందరితో పంచుకోవడం ఆనందంగా ఉందని, తాము క్షేమంగా ఉన్నామని తెలిపారు. అలాగే తమకు శుభాకాంక్షలు అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. దీంతో తమిళ చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు వీరికి విషెస్ అందిస్తున్నారు. కాగా సెల్వరాఘవన్ తమిళ హీరో ధనుష్ సోదరుడు. 2006లో నటి సోనియా అగర్వాల్ను వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరూ 2010లో విడాకులు తీసుకున్నారు. అనంతరం తన సహాయ దర్శకురాలు గీతాంజలిని సెల్వ రాఘవన్ పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరికీ పిల్లలు లీలావతి, ఓంకార్ ఉన్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే గీతాంజలి, గత ఏడాది నవంబర్ నుంచి తన ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ ఫోటోలను షేర్ చేస్తూ వచ్చారు. -
సీక్వెల్ మూవీ: హీరోని మార్చిన డైరెక్టర్
తమిళ హీరో కార్తీ నటించిన యుగానికి ఒక్కడు సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. తమిళంలో తెరకెక్కిన ఆయిరత్తిల్ ఒరువన్ సినిమాకు తెలుగు అనువాదమే యుగానికి ఒక్కడు. ‘7/జి బృందావన్ కాలనీ’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ లాంటి హిట్ సినిమాలను అందించిన దర్శకుడు సెల్వ రాఘవన్ ఈ సినిమాను తెరకెక్కించారు. 2010లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రసంశలు అందుకుంది. తాజాగా సినిమాకు సీక్వెల్ని ప్రకటించాడు డైరెక్టర్ సెల్వ రాఘవన్. అయితే ఈ సినిమాలో మాత్రం కార్తి హీరోగా నటించడం లేదు. కారణం ఏంటో తెలియదు కానీ.. కార్తి స్థానంలో ధనుష్ హీరోగా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని ధనుష్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఆయిరత్తిల్ ఒరువన్ 2 కోసం పూర్తి స్థాయిలో కష్ట పడతామని ధనుష్ ట్వీట్ చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశాడు. ఓ యువకుడు కొండ పైనుండి కింద ఉన్న పర్వతాలను చూస్తుంటాడు. తొలిభాగమైన యుగానికి ఒక్కడు సినిమాకు ఇది కొనసాగింపుగా ఉంటుందనడానికి ఇదే ప్రూఫ్గా కనిపిస్తోంది. 2024లో ఈ సినిమా విడుదల కానుంది. A magnum opus !! The pre production alone will take us a year. But a dream film from the master @selvaraghavan ! The wait will be long. But we will give our best to make it all worth it. AO2 ..The Prince returns in 2024 https://t.co/HBTXeN66iA — Dhanush (@dhanushkraja) January 1, 2021 -
సరికొత్త కాంబినేషన్
శనివారం కీర్తీ సురేష్ ఓ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. అయితే ఇందులో ఓ విశేషం ఉంది. ఈ చిత్రంలో ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ ముఖ్య పాత్ర చేయనున్నారు. ‘7/జి బృందావన్ కాలనీ’, ‘యుగానికి ఒక్కడు, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు ఆయన. ఇప్పుడు సెల్వ రాఘవన్, కీర్తీ సురేష్ ముఖ్య పాత్రల్లో ‘సాని కాయిదం’ అనే తమిళ చిత్రం తెరకెక్కనుంది. అరుణ్ మాతేశ్వరన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా పోస్టర్ ను విడుదల చేశారు. ‘‘దర్శకుడు సెల్వ రాఘవన్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషం’’ అన్నారు కీర్తీ సురేష్. ‘‘మరో కొత్త అధ్యాయం ప్రారంభం’’ అన్నారు సెల్వ రాఘవన్. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. -
నాలుగోసారి!
సెల్వరాఘవన్– ధనుష్ కాంబినేషన్కు తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ అన్నదమ్ములిద్దరూ తమ కాంబినేషన్ కుదిరిన ప్రతిసారీ ఓ డిఫరెంట్ సినిమాను ప్రేక్షకులకు అందించారు. ‘కాదల్ కొండేన్ (తెలుగులో ‘అల్లరి’ నరేశ్ చేసిన ‘నేను’), పుదుపేటై్ట, మయక్కం ఎన్న’ సినిమాలు వీరి కాంబినేషన్లో వచ్చి, పెద్ద హిట్స్గా నిలిచాయి. ఇప్పుడు వీరిద్దరూ నాలుగోసారి సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ధను ష్ ‘అసురన్’ అనే సినిమా, దురై సెంధిల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాల తర్వాత అన్న సెల్వరాఘవన్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తారు. ఈ మూడు సినిమాలనూ కలైపులి యస్.థాను నిర్మిస్తుండటం విశేషం. -
‘ఎన్జీకే’ రిజల్ట్పై సూర్య స్పందన
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన డిఫరెంట్ మూవీ ఎన్జీకే. పొలిటికల్ సెటైర్గా రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైంది. అయితే ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్సాన్స్ రాలేదు. కథా కథనాలు ఆకట్టుకునేలా లేకపోవటంతో.. ఎన్జీకే, సూర్య కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ ఫలితంపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న సూర్య, తాజాగా సోషల్ మీడియాలో స్పందించారు. ‘ఎన్జీకే విషయంలో ప్రేక్షకులు చూపించిన ప్రేమ, అభిప్రాయాలను నేను స్వాగతిస్తున్నా. మా ప్రయత్నాన్ని, నటీనటుల కష్టాన్ని విశ్లేషించి, ప్రశంసించిన అందరికీ కృతజ్ఞతలు. ఎన్జీకే తెరకెక్కించేందకు శ్రమించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశారు సూర్య. I humbly accept all the love,views and opinions about NGK with utmost humility and thank the masterminds ;) who decoded and appreciated the different attempt, and the actors performances!! Thanks to the entire cast & crew for making this happen #NGK @selvaraghavan @prabhu_sr — Suriya Sivakumar (@Suriya_offl) 7 June 2019 -
అది నిజం కావాలి
‘‘నేను షూటింగ్ లొకేషన్కి వెళ్లే రోజు ఓ కొత్త ఎగై్జట్మెంట్ ఉండాలి. రెగ్యులర్గా కాకుండా నేనేదో కొత్తగా చేస్తున్నాను అనే ఫీల్ కలగాలి. అలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతాను’’ అని రకుల్ప్రీత్ సింగ్ అన్నారు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య, సాయిపల్లవి, రకుల్ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా రూపొందిన తమిళ చిత్రం ‘ఎన్జీకే’ (నందగోపాలకృష్ణ). ఎస్ఆర్. ప్రభు నిర్మించిన ఈ సినిమాను తెలుగులో కేకే రాధామోహన్ విడుదల చేస్తున్నారు. ఈ నెల 31న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా రకుల్ప్రీత్ సింగ్ చెప్పిన విశేషాలు. ► పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ఇది. వానతి అనే ఇండిపెండెంట్, పవర్ ఉమెన్ క్యారెక్టర్ చేశాను. ఇలాంటి క్యారెక్టర్ నేను ఇంతవరకు చేయలేదు. సూర్య మంచి కో–స్టార్. మంచి ప్రతిభాశాలి. సాయిపల్లవి టాలెంటెడ్ యాక్టర్. హీరో క్యారెక్టర్ పాలిటిక్స్లోకి వస్తున్నప్పుడు హీరోయిన్లుగా నేను, పల్లవి ఏం చేశామన్నది కథలో కీలకం. ► చాలా సినిమాలు చేసిన తర్వాత సెట్లో ఓ ధోరణికి అలవాటు పడిపోతాం. కానీ సెల్వసార్ సెట్లో అలా ఉండదు. ఒకవేళ మనం ఏదైనా హోమ్వర్క్ చేసి ఓ మైండ్ సెట్తో సెట్లోకి వెళితే అంతా క్యాన్సిల్. అక్కడ అంతా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే హోమ్వర్క్ అంతా సెల్వసార్ చేసేస్తారు. యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ పట్ల ఆయన ఫుల్ క్లారిటీగా ఉంటారు. మల్టీఫుల్ థింగ్స్ని బ్రెయిన్లో పెట్టుకుని యాక్ట్ చేయాలి. సెల్వసార్తో వర్క్ చేయడం కొత్త ఎక్స్పీరియన్స్. యాక్ట ర్గా మరింత ఇంప్రూవ్ కావొచ్చు. ► ప్రస్తుతం ఇండియాలో అందరూ పాలిటిక్స్ గురించే మాట్లాడుతున్నారు. బాధ్యతాయుతమైన పౌరులుగా మనం దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎమ్బీఏ, ఇంజినీరింగ్ చేయాలంటే ఏం చేయాలో తెలుసు మనకు. పాలిటిక్స్లో జాయిన్ అవ్వడానికి ఒక ప్రత్యేకమైన విధానం అంటూ ఏం లేదు. ప్రపంచంలో ఏం జరుగుతుంది? అనే విష యాలను నేటి యువత ఆసక్తికరంగా తెలుసుకుంటున్నారు. కామన్పీపుల్, చదువుకున్నవారు రాజకీయాలను ఎంచుకోవడం మంచిదే. చదువుకున్నవారి సంఖ్య పెరిగితే దేశంలోని సగం సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నది ► ఈ ఏడాదిలో నావి దాదాపు అరడజను సినిమాలు రీలీజ్ అవుతాయి. వీటి షూటింగ్కి ఎక్కువ టైమ్ పట్టింది. ‘దే దే ప్యార్ దే’ సినిమాకు దాదాపు ఏడు నెలల సమయం పట్టింది. అంత టైమ్ తీసుకున్నాం కాబట్టే ఆ సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతున్నారు. బాలీవుడ్లో రకుల్కు మంచి భవిష్యత్ ఉందని అజయ్ దేవగణ్ అన్నారంటే చాలా సంతోషంగా ఉంది. అది నిజం కావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే తమిళంలో 3 సినిమాలు చేశాను. ► సినిమా అంతా ఒక హీరోయిన్ ఉంటేనే ఉమెన్ సెంట్రిక్ సినిమాలు కాదు. ‘రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయక, దే దే ప్యార్ దే’ సినిమాల్లో హీరోయిన్ పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంది. ► బయోపిక్ చాన్స్ వస్తే నేను తప్పకుండా చేస్తాను. బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్లో నటించాలనుకున్నాను. కాస్టింగ్ అయిపోయింది. కొత్త కాన్సెప్ట్ ఉన్న వెబ్ సీరిస్లో నటించడానికి రెడీ. ► ప్రస్తుతం నాగార్జునగారి ‘మన్మథుడు 2’ సినిమా చేస్తున్నాను. హిందీలో చేసిన ‘మర్జవాన్’ సినిమా అక్టోబర్లో విడుదల కానుంది. -
నేను పర్ఫెక్ట్ మ్యాన్ను కాదు : ధనుష్
నేను ఫర్ఫెక్ట్ మ్యాన్ను కాదంటున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. ఏంటీ? నటుడిగా దక్షిణాదిలోనే కాకుండా, బాలీవుడ్, హాలీవుడ్ స్థాయికి చేరుకున్న ఈ స్టార్ నటుడు పర్ఫెక్ట్ మ్యాన్ను కాదంటున్నారేమిటని ఆశ్చర్య పోతున్నారా? మీరేమైనా అనుకోండి ధనుష్ పర్ఫెక్ట్ మ్యాన్ కాదన్న మాట వాస్తవం. సరిగ్గా 17 ఏళ్ల క్రితం 2002, మే 17న ధనుష్ కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం తుళ్లువదో ఇళమై తెరపైకి వచ్చింది. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అంతే కాదు ధనుష్ జీవితాన్నే మార్చేసిన చిత్రం తుళ్లువదో ఇళమై. ఆయన సోదరుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. నటుడిగా ధనుష్ వయసు 17 ఏళ్లు అన్నమాట. దీంతో ఆయన అభిమానులు ఆ చిత్ర పోస్టర్లను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి పండగ చేసుకుంటున్నారు. వారి అభిమానానికి స్పందించిన ధనుష్ ట్విట్టర్లో పేర్కొంటూ తుళ్లువదో ఇళమై చిత్రం విడుదలై 17 ఏళ్లు అయ్యిందన్న విషయాన్ని నమ్మలేకపోతున్నాను. ఏమీ తెలియని చిన్న కుర్రాడిగా ఉన్న నాకు మీ గుండెల్లో చోటు ఇచ్చారు. నటుడిని అవలేనని భావించిన నన్ను ఒక స్టార్ను చేశారు. అంతా నిన్న జరిగినట్లు ఉంది. నా జయాపజయాలన్నింటిలోనూ మీరు ఉన్నారు. నిజం చెప్పాలంటే నేను పర్ఫెక్ట్ మ్యాన్నే కాదు. అయితే మీ ప్రేమాభిమానాలే నన్ను పరిపూర్ణ వ్యకిగా తీర్చిదిద్దాయి. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా తొలి చిత్రం విడుదలై 17 ఏళ్లు అయ్యిందన్నది మీరు పోస్ట్ చేసిన పోస్టర్లు చూసి నేను మరింత ఉత్తేజం పొందాను. ఈ అభిమానం ఎల్లప్పుడు ఉండాలి. ప్రేమను వ్యాప్తి చేయండి, ప్రేమ మాత్రమే ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తుంది అని ధనుష్ పేర్కొన్నారు. ఈ 17 ఏళ్లలో ధనుష్ ఒక నటుడిగా, గాయకుడిగా, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా మలచుకుని ప్రముఖ కథానాయకుడిగా రాణిస్తున్నారు. -
సూర్య, కార్తీ కలిసి నటిస్తే!
జయాపజయాలను పక్కన పెడితే సెల్వరాఘవన్ చిత్రాలు ఇతర చిత్రాలకు కచ్చితంగా భిన్నంగా ఉంటాయన్నది ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. అయితే ఈ మధ్య కాస్త వెనుకపడ్డ మాట వాస్తవమే. తాజాగా ఎన్జీకే చిత్రంతో మరోసారి తనదైన దర్శక శైలితో సత్తా చాటడానికి వస్తున్నారు. నటుడు సూర్య కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో సాయిపల్లవి, రకుల్ప్రీత్సింగ్ నాయకిలుగా నటించారు. డ్రీమ్ వారియర్స్ ఫిలింస్ పతాకంపై ఎస్ఆర్.ప్రకాశ్, ఎస్ఆర్.ప్రభు నిర్మించిన ఎన్జీకే చిత్రం ఈ నెల 31వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇప్పుటికే చిత్ర పాటలు, ప్రచార చిత్రం విడుదలై మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ సందర్భంగా ఒక భేటీలో దర్శకుడు సెల్వరాఘవన్ మాట్లాడుతూ ఈ చిత్రానికి మంచి టీమ్ లభించడం చాలా సంతోషకరమైన విషయం అని పేర్కొన్నారు. 2010లో తన దర్శకత్వంలో రూపొంది విడుదలైన ఆయిరత్తిల్ ఒరువన్ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టినా, అది కమర్షియల్గా సక్సెస్ కాలేదన్నారు. ఆ చిత్రం విమర్శకులను మెప్పించినా, జనాల మధ్యకు చేరలేకపోయిందన్నారు. అందుకే ఆ చిత్రాన్ని మళ్లీ విడుదల చేయబోతున్నట్లు చెప్పారు. ఇకపోతే ఆయిరత్తిల్ ఒరువన్–2 చేస్తే అందులో సూర్య, కార్తీ కలిసి నటిస్తారా? అన్న ప్రశ్నకు వారిద్దరూ కలిసి నటిస్తే చాలా బాగుంటుందని అన్నారు. అయితే దీని గురించి తాను చెప్పడం కంటే మీరే వారితో చెబితే ఇంకా బాగుంటుందని సెల్వరాఘవన్ పేర్కొన్నారు. మరి ఈ విషయంపై సూర్య, కార్తీలు ఎలా స్పందిస్తారో చూడాలి. -
అదరగొడుతున్న ‘ఎన్జీకే’ ట్రైలర్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సెల్వరాఘవన్ (శ్రీ రాఘవ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఎన్జీకే. నంద గోపాల కృష్ణ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాను తెలుగులోనూ అదే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య సరసన సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను మే 31న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ట్రైలర్లో సూర్య యాక్టింగ్ హైలెట్గా నిలుస్తోంది. అంతేకాదు తెలుగులోనూ సూర్యనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవటం విశేషం. యువన్ శంకర్ రాజా నేపథ్యం సంగీతం కూడా సూపర్బ్ అనిపించేలా ఉంది. ఇప్పటికే 4 మిలియన్ల(40 లక్షల)కు పైగా వ్యూస్ సాధించిన ఈ ట్రైలర్ టాప్ లో ట్రెండ్ అవుతోంది. -
యన్జీకే రెడీ అవుతున్నాడు
రాజకీయాల్లో సరికొత్త మార్పు తీసుకురావడానికి నంద గోపాల కుమారన్ (యన్జీకే) సిద్ధమయ్యాడు. మరి అతని ప్రయత్నాలు సఫలమయ్యాయో? లేదో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. సూర్య హీరోగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యన్జీకే’ (తెలుగులో ‘నంద గోపాల కృష్ణ’). పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై యస్ఆర్ ప్రభు నిర్మించారు. సాయి పల్లవి, రకుల్ప్రీత్ సింగ్ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. సినిమాలో యువ రాజకీయనాయకుడిగా సూర్య ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తారని ఈ చిత్రం టీజర్ చూస్తే అర్థం అవుతోంది. ‘‘యన్జీకే’ డబ్బింగ్ పనులు మొదలెట్టాం. వచ్చే వారంలో విడుదల తేదీని తెలియజేస్తాం’’ అని యస్ఆర్ ప్రభు పేర్కొన్నారు. ప్రస్తుతం కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాప్పాన్’ సినిమాలో నటిస్తున్నారు సూర్య. ఇందులో సాయేషా కథానాయికగా నటిస్తున్నారు. ఆ నెక్ట్స్ ‘గురు’ ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. -
‘ఎన్జీకే’ టీజర్ రెడీ అవుతోంది!
కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ తన సత్తా చాటుతున్న హీరో సూర్య. గతేడాది బాలీవుడ్ రీమేక్గా తెరకెక్కిన గ్యాంగ్ సినిమాతో పలకరించగా.. ఈ ఏడాది ‘ఎన్జీకే’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రేమికుల రోజు కానుకగా.. ఈ మూవీ టీజర్ను రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ‘ఎన్జీకే’ టీజర్ను చిత్రయూనిట్ జాగ్రత్తగా దగ్గరుండి కట్ చేయిస్తుందని సమాచారం. ఈ టీజర్కు సంబంధించిన డబ్బింగ్ను సూర్య పూర్తి చేశారు. ప్రస్తుతం సూర్య డబ్బింగ్ చెబుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్న ఈ మూవీకి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో రకుల్ప్రీత్ సింగ్, సాయి పల్లవి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా సమ్మర్లో రానుంది. -
ప్రేమికులరోజు శాంపిల్
‘ఎన్జీకే’ (నంద గోపాల కుమరన్) ఎలా ఉంటాడో ఫస్ట్ లుక్లో చూశాం. మరి.. ఏం చేస్తుంటాడు? అతని లక్ష్యాలు ఏంటి? అనే విషయాలు గురించి హింట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు ‘ఎన్జీకే’ టీమ్. అంటే శాంపిల్గా ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేస్తారు. సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఎన్జీకే’. ఇందులో సాయి పల్లవి, రకుల్ ప్రీత్సింగ్ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా టీజర్ను ప్రేమికుల రోజు (ఫిబ్రవరి 14న) విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో శక్తివంతమైన రాజకీయ నాయకుడి పాత్రలో సూర్య కనిపిస్తారని సమాచారం. జగపతిబాబు, ఇళవరసు, రామ్కుమార్ గణేశన్ కీలక పాత్రలు చేశారు. ఈ సినిమా సమ్మర్లో రానుంది. -
వరుస సినిమాలతో స్టార్ హీరో సందడి
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలతో సందడి చేయనున్నాడు. ఇప్పటికే సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్జీకే సినిమా షూటింగ్ పూర్తి చేసిన సూర్య, ప్యారలల్గా మరో సినిమాను కూడా పూర్తి చేస్తున్నాడు. వీడొక్కడే, బ్రదర్స్ లాంటి సినిమాలను తెరకెక్కించిన కేవీ ఆనంద్ దర్శకత్వంలో కాప్పాన్ అనే సినిమా చేస్తున్నాడు సూర్య. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 30 శాతానికి పైగా పూర్తయ్యింది. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న కాప్పాన్లో సూర్య ఎన్ఎస్జీ కమాండోగా కనిపించనున్నాడు. మాలీవుడ్ సూపర్స్టార్ మోహన్ లాల్, తమిళ యంగ్ హీరో ఆర్యలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అఖిల్ ఫేం సయేషా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో అనన్య మరో ఇంపార్టెంట్ రోల్లో కనిపించనుంది. -
జనవరి 26న ‘ఎన్జీకే’ రిలీజ్
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఎన్జీకే. ఈ సినిమాకు సెల్వ రాఘవన్ దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ మరో వారం రోజుల్లో పూర్తి కానుంది. ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో చిత్ర నిర్మాతలు రిలీజ్పై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. వీలైనంత త్వరగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్లోనే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్సింగ్, సాయి పల్లవిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నారు. -
పండగకి టైమ్ ఉంది
అభిమాన నటుడి సినిమా రిలీజ్ అంటే ఆ హీరో అభిమానులకు పండగే. కరెక్ట్గా పండగ సమయంలో రిలీజ్ ఫిక్స్ చేస్తే సంబరాలు డబుల్ అవుతాయి. కానీ ఈసారి సూర్య అభిమానులకు డబుల్ సంబరాలు మిస్. సూర్య హీరోగా తెరకెక్కుతున్న ‘ఎన్జీకే’ దీపావళికి రావాలి. కానీ ఈ సినిమా దీపావళి తర్వాత రిలీజ్ అవుతుందని చిత్రబృందం తెలిపింది. సూర్య హీరోగా దర్శకుడు సెల్వ రాఘవన్ తెరకెక్కిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘ఎన్జీకే’(నంద గోపాల కుమారన్ అని అర్థం). యస్.ఆర్ ప్రభు, యస్. ఆర్ ప్రకాశ్బాబు నిర్మిస్తున్నారు. సూర్య ఇందులో ఎమ్మెల్యేగా కనిపించనున్నారని సమాచారం. తొలుత ఈ సినిమాను దీపావళి స్పెషల్గా రిలీజ్ చేద్దాం అని ప్లాన్ చేసింది చిత్రబృందం. అయితే దర్శకుడు సెల్వ రాఘవన్ స్వల్ప అనారోగ్యానికి గురి కావడంతో షూటింగ్ డిలే అయింది. దాంతో దీపావళికి రావడం లేదని అనౌన్స్ చేశారు. ‘‘మా ప్రొడక్షన్ హౌస్ చేస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఎన్జీకే’. అద్భుతమైన ఎంటర్టైనర్ ఇవ్వబోతున్నాం అనే నమ్మకం మాకుంది. ప్రాజెక్ట్ బాగా రావడానికి మా టీమ్ రేయి, పగలు కష్టపడుతున్నాం. కరెక్ట్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. సో.. సూర్య ఫ్యాన్స్ పండగ చేసుకోవడానికి ఇంకా టైమ్ ఉందన్న మాట. -
మరో పీరియాడిక్ డ్రామాలో సూర్య!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. ప్రస్తుతం సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఎన్జీకే సినిమాలో నటిస్తున్న సూర్య, ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే కేవీ ఆనంద్ దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లండన్లో జరగుతోంది. త్వరలో మరో సినిమాను మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు సూర్య. ఎన్జీకే షూటింగ్ పూర్తయిన వెంటనే కేవీ ఆనంద్ సినిమాతో పాటు ఓ మహిళ దర్శకురాలితో కలిసి పనిచేసేందుకు సూర్య ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. మాధవన్ హీరోగా సాలా ఖదూస్ సినిమాను రూపొందించిన సుధా కొంగర దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టులో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సూర్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ జానర్లో తెరకెక్కనుందన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల సూర్య హీరోగా తెరకెక్కిన గ్యాంగ్ కూడా పీరియాడిక్ జానర్లో తెరకెక్కి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. -
మరో క్రేజీ ప్రాజెక్ట్లో జగ్గుభాయ్
విలన్ గా టర్న్ అయిన తరువాత సీనియర్ నటుడు జగపతి బాబు ఫుల్ బిజీ అయ్యారు. నెగెటివ్ రోల్స్ తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ దూసుకుపోతున్నారు. అడపాదడపా లీడ్ రోల్స్లోనూ సత్తా చాటుతున్నారు. అంతేకాదు పరభాషా ప్రేక్షకులను కూడా తనదైన నటనతో ఆకట్టుకుంటున్నాడు జగ్గుభాయ్. ఇప్పటికే మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన పులిమురుగన్, విజయ్ హీరోగా తెరకెక్కిన భైరవ, సూపర్ స్టార్ రజనీకాంత్ లింగ సినిమాల్లో నటించిన జగపతి బాబు మరో క్రేజీ ప్రాజెక్ట్ కు ఓకె చెప్పారు. కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఎన్జీకే. విభిన్న చిత్రాల దర్శకుడు సెల్వ రాఘవన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే జగ్గుభాయ్కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ కూడా ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో జగపతిబాబు చేస్తోంది సపోర్టింగ్ రోలా..? లేక ప్రతినాయక పాత్రా.? అన్న సంగతి తెలియాల్సి ఉంది. -
రాజకీయ నాయకుడిగా సూర్య
కోలీవుడ్ స్టార్హీరో సూర్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఎన్జీకే. విలక్షణ చిత్రాల దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. సందేశాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడట. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ జరుపుకున్న ఈసినిమా ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైంది. సూర్య క్యూబా విప్లవకారుడు చేగువరాల కనిపించిన లుక్కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. సూర్య సరసన రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్రాజా సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమా ను దీపావళి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
ఎన్జీకే అంటే?
... ప్రస్తుతం సూర్య కొత్త టైటిల్ చూసినవారందరికీ వచ్చిన డౌట్ ఇది. ఆ డౌట్ తీరాలంటే దీపావళి వరకు ఆగాల్సిందే అంటోంది చిత్రబృందం. సూర్య హీరోగా రకుల్ప్రీత్ సింగ్, సాయి పల్లవి కథానాయికలుగా సెల్వ రాఘవన్ డైరెక్షన్లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. సోమవారం దర్శకుడు సెల్వ రాఘవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు ‘ఎన్జీకే’ అనే టైటిల్ను ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్ను రిలీజ్ చేసింది చిత్రబృందం. లుక్ సమ్థింగ్ డిఫరెంట్గా ఉంది కదూ. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్. ఫ్రభు, ఎస్.ఆర్. ప్రకాష్బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
ఫస్ట్ లుక్ : అచ్చం చెగువేరాలా ఉన్నాడే!
సాక్షి, సినిమా : కోలీవుడ్ టాలెంటెడ్ హీరో సూర్య.. కొత్త చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి ఎన్జీకే అన్న టైటిల్ను ఫిక్స్ చేశారు. సూర్యకు ఇది 36వ చిత్రం. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్లో సూర్య చెగువేరా స్టైల్లో ఉన్న వేషాధారణ ఆకట్టుకునేలా ఉంది. పోస్టర్ బ్యాక్ గ్రౌండ్లో విప్లవ నేపథ్యం ఉన్న థీమ్ ఉండటం విశేషం. వైవిధ్యభరితమైన చిత్రాలను తెరకెక్కిస్తాడన్న పేరున్న సెల్వరాఘవన్.. సూర్యతో ప్రయోగం చేయబోతున్నాడని పోస్టర్తో అర్థమౌతోంది. సూర్యకు తెలుగులో మంచి క్రేజ్ ఉండటం.. పైగా ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవిలు హీరోయిన్లుగా నటిస్తుండటంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఎన్జీకే దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. Dear all! Need your love for #NGK Director @Selvaraghavan !! A very Happy birthday!!#NGKdiwali2018 #Suriya36@Sai_Pallavi92 @Rakulpreet @thisisysr @prabhu_sr @RelianceEnt @DreamWarriorPic pic.twitter.com/uVb42EJOgb — Suriya Sivakumar (@Suriya_offl) 5 March 2018 -
సూర్య జోడిగా మల్లార్ బ్యూటీ
తమిళ సినిమా: కోరికలు అంత ఈజీగా నెరవేరవు. ఒక వేళ అలా జరిగితే అంతకంటే అదృష్టం ఉండదు. అయితే అనుకోకుండానే అందలం ఎక్కేసిన నటి సాయిపల్లవి. మలయాళంలో ప్రేమమ్ చిత్రంలో మలర్ టీచర్గా నటించి ఒక్క కేరళ ప్రేక్షకులనే కాకుండా ఇరుగు, పొరుగు రాష్ట్రాలు తమిళనాడు, ఆంధ్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే తెలుగులో ఫిదా చిత్రంతో ప్రేక్షకుల మనసుల్సి కొల్లగొట్టేసిన సాయిపల్లవి టాలీవుడ్లో మంచి గుర్తింపు పొందింది. త్వరలో కరు చిత్రంతో కోలీవుడ్ ప్రేక్షకుల మదిని దోచుకోవడానికి సిద్ధం అవుతోంది. అయితే ఆ చిత్రం విడుదలకు ముందే మరో భారీ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుందన్నది తాజా సమాచారం. ఈ అమ్మడింతకు ముందొక భేటీలో తనకు నటుడు సూర్య అంటే చాలా ఇష్టం అని, ఆయనతో నటించే అవకాశం వస్తే వదులుకునేది లేదని వెల్లడించింది. అయితే అలాంటి అవకాశం ఇంత తొందరగా వస్తుందని బహూశ సాయిపల్లవి ఊహించి ఉండదు. అలాంటి తన కోరిక తీరే తరుణం వచ్చేసింది. సూర్య తాజాగా తానా సేర్న్దకూట్టం చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. నటి కీర్తీసురేశ్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది. సంక్రాంతికి ఆయన అభిమానులకు కానుకగా విడుదలకు ముస్తాబవుతోంది. ఇక సూర్య తదుపరి చిత్రానికి రెడీ అయిపోతున్నారు. దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించనున్నట్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు సూర్య. ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ప్రీత్సింగ్ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ఏమిటంటే ఇందులో మరో నాయకిగా సాయిపల్లవి నటించనుంది. ఈ విషయమై దర్శకుడు సెల్వరాఘవన్ ఇప్పటికే సాయిపల్లవితో చర్చలు జరిపారని, తనూ నటించడానికి అంగీకరించిందని కోలీవుడ్ వర్గాల సమాచారం. డ్రీమ్ వారియర్ ఫిలిం స్ సంస్థ నిర్మించనున్న ఈ భారీ చిత్రం జనవరి రెండవ భాగంలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం సెల్వరాఘవన్ సంతానం హీరోగా మన్నవన్ వందానడి చిత్రాన్ని పూర్తి చేయనున్నారు. -
త్వరలోనే నేర్చుకుంటా!
నటి రితికాసింగ్కు కలిగిన ఆశ ఏమిటో తెలుసా? ఇరుదు చుట్రు చిత్రంతో ఏక్ ధమ్గా హిందీ, తెలుగు భాషల్లో కథానాయకిగా, అదీ తన చుట్టూ తిరిగే కథా పాత్రతో పరిచయమైన ఉత్తరాది లక్కీ నటి రితికాసింగ్. అంతే కాదు తొలి చిత్రంతోనే జాతీయ అవార్డును పొందడంతో పాటు, అదే చిత్ర రీమేక్తో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలాంటి అవకాశం ఎంతమందికి దక్కుతుంది. రితికాసింగ్ నటించిన తెలుగు చిత్రం గురు త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇక తమిళంలో రాఘవ లారెన్స్తో జత కట్టిన శివలింగ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం సెల్వ రాఘవన్ దర్శకత్వంలో అరవిందస్వామి కి జంటగా నటిస్తోంది. ఈ సందర్భంగా రితికాసింగ్ను పలకరిస్తే బోలెడు కబుర్లు చెప్పుకొచ్చింది. అవేమిటో చూద్దాం. నా జీవితం బాక్సింగ్ మైదానంలోనే మగ్గిపోతుందని భావించాను. అలాంటిది భగవంతుడు శుభ (ఇరుదు చుట్రు చిత్ర దర్శకురాలు)అనే దేవతను పంపి నా జీవితాన్ని మార్చేశాడు. నాకు తమిళ భాష నేర్చుకోవాలనే ఆసక్తి బాగా పెరిగింది. అందుకు తమిళ చిత్రాలు అధికంగా చూస్తున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో లంగా ఓణి ధరించిన అమ్మాయిలను చూసి చాలా ఆశ్చర్యపోయాను. నేను అలా జీవించలేకపోయినా కనీసం అలాంటి పాత్రల్లో లంగా ఓణి ధరించి నటించాలని ఆశపడుతున్నాను. అంతగా తమిళ సంస్కృతి, ఇక్కడి ప్రజలు నచ్చారు. ఇకపోతే తమిళ భాషను నేర్చుకుంటున్నాను. సాధ్యమైనంత వరకూ సహచరులతో తమిళంలోనే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. అలా తప్పుల తడకతో మాట్లాడడానికి కష్టపడుతున్నా త్వరలోనే తమిళ భాషను నేర్చుకుని పక్కాగా మాట్లాడతాననే నమ్మకం ఉంది. అదేవిధంగా తొలి చిత్రమే నన్ను జాతీయ అవార్డు స్థాయికి తీసుకెళ్లడంతో పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. -
సరదాగా అన్నాను
సరదాగా అన్నాను. అది అంత దూరం తీసుకెళుతుందని ఊహించలేదు అంటోంది నటి రెజీనా. ఇంతకీ ఈ అమ్మడు ఏ విషయం గురించి మాట్లాడుతుందనేగా మీ సందేహం. రెజీనా కోలీవుడ్ తెరపై కని పించి చాలా కాలమే అయ్యింది. అలాగని పూర్తిగా తెరమరుగైపోయిందనే నిర్ణయానికి వచ్చేయకండి. టాలీవుడ్లో మంచి మార్కెట్ను సంపాదించుకుంది. అక్కడ మంచి విజయాలను కూడా చవిచూసిన రెజీ నా తాజాగా కోలీవుడ్పై దండెత్తడానికి సిద్ధమవువుతోంది. ప్రస్తుతం తమిళంలోనే నెంజం మరప్పదిల్లై, మానగరం, శరవణన్ ఇరుక్క భయమేన్, జెమినీ గణేన్ సురుళీరాజనుమ్, మడై తిరందు వంటి ఐదు చిత్రాల్లో నటిస్తున్న ఆ బ్యూటీ త్వరలో బాలీవుడ్ రంగప్రవేశం చేయనుంది. ఈ సందర్భంగా రెజీనా చెప్పిన ముచ్చట్లు.. ప్ర: సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించిన అనుభవం గురించి? జ: నెంజం మరప్పదిలె్లౖ చిత్రం ద్వారా తొలిసారిగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటిస్తున్నాను. ఎస్జే.సూర్య కథానాయకుడు. మరో నాయకిగా నందిత నటిస్తున్నారు. ఇందులో నటించడానికి అంగీకరించినప్పుడు సెల్వరాఘవన్ చిత్రంలో నటించడం కష్టం అని చాలా మంది భయపెట్టారు. అయితే నేను వాటిని పట్టించుకోలేదు. పాత్రను వివరించి, సరైన నటనను రాబట్టుకోవడంలో సెల్వరాఘవన్ చాలా సహనశీలి. షూటింగ్లో ఆయన్ని నేను ఒక అధ్యాపకుడిగానే చూశాను. చిత్రాన్ని పూర్తిగా చూసినప్పుడు నేనేనా అలా నటించింది అని ఆశ్చర్యపోయాను. ఇది దెయ్యం కథా చిత్రం కాదు. అయితే నా పాత్ర దెయ్యమా? మామూలు అమ్మాయా? అన్నది చివరి వరకూ తెలియదు. ఇప్పటి వరకూ నేను నటించిన చిత్రాల్లో నెంజం మరప్పదిలె్లౖ ప్రత్యేకంగా ఉంటుంది. ప్ర: తెలుగు, తమిళ భాషల్లో బిజీగా నటిస్తున్నట్లున్నారు? జ: ఈ విషయంలో ఒక ప్రణాళిక అంటూ ఏమీ లేదు. అలా కుదురుతోంది అంతే. మానగరం, మడై తిరం దు చిత్రాలు ఏక కాలంలో రెండు భాషల్లోనూ తెరకెక్కుతున్నాయి. నాకు రెండు భాషల్లోనూ మార్కెట్ ఉంది. అదే విధంగా నేను తమిళంలో నటించిన చిత్రాలు తెలుగులో అనువాదమవుతున్నాయి. ప్ర: తమిళంలో చాలా గ్యాప్ రావడానికి కారణం? జ: తెలుగులో ఆశించిన అవకాశాలు వస్తుండడంతో పూర్తి గా అక్కడే శ్రద్ధ పెట్టాను. తమిళంలో అవకాశాలు వస్తున్నా, కాల్షీట్స్ సర్దుబాటు చేయలేని పరిస్థితి. అంతేగాకుండా తమిళంలో ఒక చిత్రం చేసినా వైవిధ్యంగా ఉండాలి. ప్రేక్షకుల మనస్సుల్లో గుర్తిండిపోవాలని కోరుకున్నాను. ప్రస్తుతం చేస్తున్నవి అలాంటి చిత్రాలే. ప్ర: రెండు భాషల ప్రేక్షకుల గురించి? జ: తెలుగు ప్రేక్షకులు ఎప్పటి విజయాలను అప్పుడే ఎం జాయ్ చేస్తారు. తాజా చిత్రాల పాత్రలనే గుర్తుంచుకుం టారు. ఆ తరువాత వాటిని మరచిపోతారు. తమిళ ప్రేక్షకులు అలా కాదు. ఇక వైవిధ్యభరిత పాత్ర, అద్భుతమైన పాత్రలో నటిస్తే దాన్ని చాలా కాలం తరువాత కూడా అభినందిస్తూనే ఉంటారు. కేడిబిల్లా కిలాడిరంగా చిత్రంలో నేను నటించిన పాప్పా పాత్రకు విశేష ఆదరణ లభించింది. ఇప్పటికీ నేను ఇతర ప్రాంతాలకు షూటింగ్కు వెళ్లినప్పుడు పాప్పా అని అభిమానంగా పిలుస్తుంటారు. ప్ర: బాలీవుడ్ రంగప్రవేశం చేయనున్నారట? జ: అవును. ఒక హిందీ చిత్రంలో నటించనున్నాను. ముగ్గురు అంధులు బ్యాంక్ రాబరింగ్ చేసి కోట్ల రూపాయలు దోచుకునే ఇతివృత్తంతో తెరపైకి వచ్చిన చిత్రం ఆంఖే. దానికి సీక్వెల్గా రూపొందనున్న చిత్రంలో నటించనున్నాను. ఇది ముగ్గురు అంధులు ఒక పేకాట క్లబ్లో ఎలా దోచుకుంటారన్న ఇతివృత్తంతో తెరకెక్కనుంది. ఇందులో అమితాబ్ బచ్చన్, అనిల్కపూర్ తదితర ప్రముఖ నటులు నటించనున్నారు. ఈ చిత్రం జనవరిలో ప్రారంభం కానుంది. ప్ర: వివాహ వదంతుల గురించి? జ: అదా సరదాగా అన్నాను. అది అంత దుమారం రేపుతుందని భావించలేదు. సోషల్మీడియా ద్వారా నా అభిమానులకు చిన్న షాక్ ఇవ్వాలని త్వరలో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నానని పోస్ట్ చేశాను. అందుకు రియాక్ష¯ŒS ఎలా ఉంటుందో టెస్ట్ చేద్దామనుకుంటే నిప్పంటించిన అడవిలా పెద్ద కలకలాన్నే సృష్టించింది. ప్ర: సరే, మరి పెళ్లెప్పుడూ? జ: నాకు ఏ విషయంలోనూ ముందుగా ప్రణాళిక ఉండదు. అయినా ఏదైనా విధిని బట్టే జరుగుతుంది. పెళ్లి ఎప్పుడు జరగాలని రాసిపెట్టి ఉంటే అప్పుడే జరుగుతుంది. ఎప్పుడు జరిగినా నాది ప్రేమ వివాహమే అవుతంది. -
తమిళ దర్శకుడితో తెలుగు నిర్మాత
14 రీల్స్ బ్యానర్లో భాగస్వామిగా ఉన్న అనీల్ సుంకర, తన సొంత నిర్మాణ సంస్థ ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై పలు చిత్రాలను నిర్మించి మంచి విజయాలు సాధించారు. ఈ దసరాకు ఈడు గోల్డ్ ఎహే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తొలిసారిగా ఓ తమిళ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అది కూడా కోలీవుడ్, టాలీవుడ్లలో మంచి పేరున్న సెల్వరాఘవన్ దర్వకత్వంలో కావటం మరో విశేషం. ప్రస్తుతం ఎస్ జె సూర్య లీడ్ రోల్లో తెరకెక్కిన నెంజం మరప్పుదిల్లై సినిమా పనుల్లో బిజీగా ఉన్న సెల్వ.. ఆ సినిమా తరువాత ఓ వెరైటీ సినిమాకు రెడీ అవుతున్నాడు. హీరోగా మారిన కమెడియన్ సంతానం ప్రధాన పాత్రలో ఓ కామెడీ ఎంటర్టైనర్ను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను లోబడ్జెట్లో కేవలం మూడు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నాడు సెల్వ. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాకు ఏకె ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత అనీల్ సుంకర నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనున్నాడు. -
కొత్త అవతారంలో సూర్య
రాక్ స్టార్లా కనిపిస్తున్న ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా..? ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ హీరో కం డైరెక్టర్ పేరు తెగ వినిపిస్తోంది. ఓ స్టార్ హీరో సినిమాను డైరెక్ట్ చేసే చాన్స్ వచ్చినట్టుగానే వచ్చి మిస్ అయ్యింది. అదే సమయంలో మరోస్టార్ హీరో సినిమాలో విలన్గా నటించనున్నాడు. ఇలా టాప్ స్టార్స్తో డీల్ చేస్తున్న ఈ ఆర్టిస్ట్ ఎవరో కాదు.. తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య. ఎస్ జె సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన నెంజం మరప్పదిల్లై సినిమా పోస్టర్ ఇది. వర్ణ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సెల్వ, సౌత్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ జానర్ అనిపించుకున్న హర్రర్ థ్రిల్లర్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎస్ జె సూర్యతో డిఫరెంట్ గెటప్ వేయించి సెల్వ ఆ లుక్తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. మరో దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎస్ జె సూర్య సరసన రెజీనా హీరోయిన్గా నటిస్తోంది. -
ఈ పోస్టర్లోని నటుణ్ని గుర్తుపట్టగలరా..?
రాక్ స్టార్లా కనిపిస్తున్న ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా..? ప్రస్తుతం టాలీవుడ్ ఈ హీరో కం డైరెక్టర్ పేరు తెగ వినిపిస్తోంది. ఓ స్టార్ హీరో సినిమాను డైరెక్ట్ చేసే చాన్స్ వచ్చినట్టుగానే వచ్చి మిస్ అయ్యింది. అదే సమయంలో మరోస్టార్ హీరో సినిమాలో విలన్గా నటించనున్నాడు. ఇలా టాప్ స్టార్స్తో డీల్ చేస్తున్న ఈ ఆర్టిస్ట్ ఎవరో కాదండి తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య. ఎస్ జె సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన నెంజం మరప్పదిల్లై సినిమా పోస్టర్ ఇది. వర్ణ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సెల్వ, సౌత్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ జానర్ అనిపించుకున్న హర్రర్ థ్రిల్లర్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎస్ జె సూర్యతో డిఫరెంట్ గెటప్ వేయించి సెల్వ ఆ లుక్తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. మరో దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎస్ జె సూర్య సరసన రెజీనా హీరోయిన్గా నటిస్తోంది. -
మరో తమిళ దర్శకుడితో చైతూ
అక్కినేని నట వారసుడు నాగచైతన్య ఇప్పుడు యమా స్పీడు మీదున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలను సెట్స్ మీద ఉంచిన చైతూ, మరో రెండు సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో నటిస్తున్న నాగచైతన్య, ఆ సినిమాతో పాటు మళయాల సూపర్ హిట్ ప్రేమమ్ను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమాకు కార్తీకేయ ఫేం చందూ మొండేటి దర్శకుడు. ఈ రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే మరో రెండు సినిమాలను ఫైనల్ చేయడానికి రెడీ అవుతున్నాడు. నాగార్జున హీరోగా సోగ్గాడే చిన్ని నాయనా లాంటి భారీ బ్లాక్ బస్టర్ అందించిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో పాటు 7జి బృందావన్ కాలనీ, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే లాంటి సినిమాలతో టాలీవుడ్లో కూడా గుర్తింపు తెచ్చుకున్న తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ డైరెక్షన్లో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. -
శింబుతో మరోసారి?
సంచలన జంట శింబు, త్రిష మరోసారి కలసి నటించడానికి సిద్ధం అవుతున్నారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్లో అవుననే సమాధానం వస్తోంది. శింబు, త్రిష హిట్ పెయిర్ కూడా. విన్నై తాండి వరువాయా చిత్రం వీరి కెరీర్లో మంచి చిత్రంగా నిలిచిపోయింది. అలాంటి ఈ సంచలన జంటను మరోసారి కలిపే ప్రయత్నం చేస్తున్నారు వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు సెల్వరాఘవన్. త్రిష, సెల్వరాఘవన్ కాంబినేషన్ కూడా హిట్టే. వీరిద్దరి కలయికలో రూపొందిన తెలుగు చిత్రం ఆడవారిమాటలకు అర్థాలే వేరులే ఘన విజయం సాధించింది. తమిళంలో తాజాగా శింబు, త్రిష, సెల్వరాఘవన్ కాంబినేషన్లో ఒక విభిన్న ప్రేమకథా చిత్రం తెరకెక్కడానికి సిద్ధం అవుతోంది. సెల్వరాఘవన్ గత చిత్రం ఇరండాం ఉలగం నిరాశ పరచింది. దీంతో ఈ దర్శకుడు పలు విమర్శనలకు గురయ్యారు. అంతేకాదు కొంతకాలంగా సినిమాకు దూరంగా వున్న సెల్వరాఘవన్ మళ్లీ మెగాఫోన్ పట్టడానికి సమాయత్తం అవుతున్నారు. శింబు హీరోగా నటించనున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా త్రిష, తాప్సీ నటించనున్నట్లు సమాచారం. దీని గురించి సెల్వరాఘవన్ తెలుపుతూ శింబుతో చిత్రం చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నానన్నారు. ఇవాళ్టికి అది తెరరూపం దాల్చనున్నం దుకు సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అం దించనున్నారని తమ ముగ్గురి కలయికలో ప్రా రంభం కానున్న ఈ చిత్రం కోసం చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నట్లు అన్నారు. అయితే ఇందులో నటించే హీరోయిన్ల గురించి త్రిష, తాప్సీలతో చర్చలు జరుగుతున్నాయని వివరించా రు. అందువలన వారు ఈ చిత్రం లో నటించే విషయంపై ఇంకా నిర్ణ యం జరగలేదని అ న్నారు. మరో విష యం ఏమిటంటే తన చిత్రా ల్లో కథా నా యకుడితో పాటు నాయికలకు ప్రాధాన్యత ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నా రు. ఈ సంచలన కథా చిత్రం ఏప్రిల్లో సెట్పైకి రానున్నట్లు సమాచారం. -
శింబూ సరసన!
తెలుగులో నాలుగైదు చిత్రాల్లో నటించిన దీక్షాసేథ్ ‘రాజపాట్టై’ చిత్రం ద్వారా తమిళ తెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రం విడుదలై, మూడేళ్లకు పైనే అవుతున్నా దీక్షాకి తమిళంలో అవకాశాలు రాలేదు. ఇప్పుడో అవకాశం దక్కించుకున్నారని సమాచారం. ‘7/జి బృందావన కాలనీ’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ తదితర చిత్రాల ద్వారా దర్శకునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సెల్వరాఘవన్ ఓ తమిళ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. శింబు హీరోగా రూపొందనున్న ఈ చిత్రంలో దీక్షాని కథానాయికగా తీసుకున్నారట.