shutdown
-
అమెరికాకు తప్పిన షట్డౌన్ గండం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాకు షట్డౌన్ గండం తప్పింది. కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లుపై అమెరికా కాంగ్రెస్లోని ప్రతినిధుల సభ చివరి నిమిషంలో ఆమోదముద్ర వేసింది. వాస్తవానికి శుక్రవారం రాత్రిలోగా బిల్లు ఆమోదం పొందకపోతే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యేవి. అయితే, గడువుకు కొన్ని గంటల ముందు స్పీకర్ మైక్ జాన్సన్ ప్రవేశపెట్టిన కొత్త బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. అనంతరం ఈ బిల్లును సెనేట్కు పంపించారు. సెనేట్ సైతం ఆమోదించింది. దీంతో షట్డౌట్ గండం నుంచి అమెరికా తప్పించుకుంది. ఈ బిల్లును అధ్యక్షుడు జో బైడెన్కు పంపించారు.ఆయన సంతకం చేస్తే బిల్లు చట్టరూపం దాల్చనుంది. జో బైడెన్ ప్రభుత్వం తీసుకొచి్చన ద్రవ్య వినిమయ బిల్లును కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టిగా వ్యతిరేకించారు. దీంతో వచ్చే ఏడాది మార్చి 14 వరకు ప్రభుత్వ అవసరాలకు, విపత్తుల్లో సహాయక చర్యలకు నిధులు సమకూర్చేలా ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. రుణాలపై సీలింగ్ను రెండేళ్లపాటు రద్దు చేయడం సహా ట్రంప్ లేవనెత్తిన పలు డిమాండ్లను ఇందులో చేర్చారు. గతంలో ట్రంప్ ప్రభుత్వ పాలనలో అమెరికాలో 35 రోజులపాటు షట్డౌన్ కొనసాగింది. అమెరికా చరిత్రలో ఇదే సుదీర్ఘమైన షట్డౌన్గా చెబుతుంటారు. షట్డౌన్ వల్ల లక్షల మంది ఉద్యోగులకు జీతాలు అందలేదు. -
మూడు ప్లాంట్ల మూసివేత.. 10 వేల మందికి ఉద్వాసన!
జర్మనీకి చెందిన ఆటోమొబైల్ తయారీ సంస్థ వోక్స్వ్యాగన్ తన ప్లాంట్లను మూసివేయాలని యోచిస్తోంది. దాంతోపాటు కాస్ట్ కటింగ్ ప్రణాళికలో భాగంగా మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10,000 మందిని తొలగించనున్నట్లు కంపెనీ వర్క్స్ కౌన్సిల్ హెడ్ డానియెలా కావల్లో తెలిపారు. అంతర్జాతీయంగా కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గడంతో ఈ పరిస్థితి నెలకొందని చెప్పారు.ఈ సందర్భంగా డానియెలా కావల్లో మాట్లాడుతూ..‘యూరప్లో వోక్స్వ్యాగన్ సంస్థ తన తయారీ యూనిట్ల సంఖ్యను తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కంపెనీ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గిపోతోంది. దాంతో యూరప్లో మూడు ప్లాంట్లను మూసివేయాలని నిర్ణయించాం. అయితే ఏ ప్లాంట్లను నిలిపేయాలో ఇంకా స్పష్టత రాలేదు. కంపెనీలో పని చేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10,000 మందిని కొలువుల నుంచి తొలగించనున్నాం. జర్మనీలోని వోక్స్వ్యాగన్ గ్రూప్లో దాదాపు 3,00,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు’ అని చెప్పారు.ఇదీ చదవండి: ఉద్యోగులకు టీ, కాఫీ నిలిపివేత!వోక్స్వ్యాగన్ కంపెనీ ఉత్పత్తులకు ప్రధాన కొనుగోలుదారులుగా ఉన్న చైనా, యూరప్ నుంచి డిమాండ్ తీవ్రంగా పడిపోయింది. దానికితోడు నిర్వహణ ఖర్చులు పెరగడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోనూ కంపెనీ ఉత్పత్తులకు వినియోగదారుల నుంచి ఆదరణ కరవైంది. దాంతో చేసేదేమిలేక చివరకు ఉద్యోగుల తగ్గింపునకు పూనుకున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
లఢక్లో రాష్ట్ర హోదా రగడ
లఢఖ్: రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ లఢఖ్లో నిరసనలు మిన్నంటాయి. ప్రధానంగా నాలుగు అంశాలను నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. లడఖ్కు రాష్ట్ర హోదా, గిరిజన హోదా, స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించడం, లడఖ్, కార్గిల్కు ఒక్కో పార్లమెంటరీ సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. లఢఖ్ అంతటా పూర్తి బంద్కు పిలుపునిచ్చారు. శనివారం లడఖ్లోని లేహ్ జిల్లాలో భారీ నిరసన ర్యాలీలు చేశారు. లేహ్ అపెక్స్ బాడీ (LAB), కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (KDA) ఈ ప్రాంతంలో బంద్కు పిలుపునిచ్చింది. లడఖ్కు రాష్ట్ర హోదా, గిరిజన హోదాను డిమాండ్ చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు మెమోరాండం కూడా జనవరి 23నే సమర్పించారు. లడఖ్కు రాష్ట్ర హోదా కల్పించడానికి 2019 నాటి జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించే బిల్లు ముసాయిదాను కూడా ప్రతినిధులు సమర్పించారు. లేహ్ అపెక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ న్యాయ సలహాదారు హాజీ గులాం ముస్తఫా మాట్లాడుతూ.. " లడఖ్ యూటిగా మారినప్పటి నుండి అపెక్స్ బాడీ, కేడీఏ నాలుగు రకాల డిమాండ్లను లేవనెత్తింది. ఇక్కడ మా అధికారాలు బలహీనపడ్డాయి. జమ్మూ కాశ్మీర్లో భాగంగా ఉన్నప్పుడు మాకు అసెంబ్లీలో నలుగురు, శాసన మండలిలో ఇద్దరు సభ్యులు ఉన్నారు. ఇప్పుడు మాకు అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేదు." అని అన్నారు. లడఖ్ - లేహ్, కార్గిల్లోని రెండు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు సంస్థల ప్రతినిధులతో హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నందున క్రమంలో ఈ నిరసనలు వెల్లువెత్తాయి. డిసెంబరు 4న జరిగిన చివరి భేటీలో రెండు సంస్థల నుంచి డిమాండ్ల జాబితాను మంత్రిత్వ శాఖ లిఖితపూర్వకంగా కోరింది. ఇదీ చదవండి: బలపరీక్షలో సోరెన్ పాల్గొనవచ్చు -
సంక్షోభంలో ఆకాశ ఎయిర్, మూసివేత? సీఈవో స్పందన ఇదీ
Akasa Air Crisis మరో బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ సంక్షోభంలో చిక్కుకుంది. దివంగత రాకేష్ ఝన్ఝన్వాలా ప్రధాన వాటాదారుగా గత ఏడాది సేవలను ప్రారంభించిన అకాశ ఎయిర్కు పైలట్ల సెగ తగిలింది. ఆకస్మాత్తుగా సంస్థకు గుడ్ బై చెప్పడంతో కొన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ఆకాశ ఎయిర్ కూడా మూత పడనుందనే వదంతులు మార్కెట్ వర్గాల్లో వ్యాపించాయి. పైలట్ రాజీనామా ఆందోళనల మధ్య ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దుబే ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. విశ్వసనీయతను నిర్ధారించడానికే విమానాలను తాత్కాలికంగా తగ్గిస్తుంది తప్ప మరేమీ కాదంటూ మూసివేత రూమరన్లు ఖండించారు. కొద్ది మంది పైలట్లు ఉన్నట్టుండి రిజైన్ చేయడంతో కొన్ని తమ విమాన సర్వీసులను రద్దు చేసినట్టు ప్రకటించారు. పైలట్లు చట్టవిరుద్ధంగా తప్పనిసరి ఒప్పంద నోటీసు వ్యవధిని అందించకుండానే వెళ్లిపోయారంటూ దూబే తెలిపారు. దీనికి పైలట్లపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు ఉద్యోగులకు అందించిన ఇమెయిల్లో వెల్లడించారు. సంస్థ దీర్ఘకాల కార్యకలాపాలపై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. (చంద్రయాన్-3 సక్సెస్: వాళ్ల ఏడుపు చూడలేకే, ఇడ్లీ బండి నడుపుకుంటున్నా!) దాదాపు 43 మంది పైలట్ల ఆకస్మిక నిష్క్రమణ కారణంగా స్వల్పకాలంలో తమ సేవలకు అంతరామమని దూబే ఉద్యోగులకు అందించిన ఇమెయిల్ సమాచారం తెలిపారు. కొంతమంది పైలట్ల నిర్ణయం కారణంగా జూలై, సెప్టెంబర్ మధ్య విమానాలకు అంతరాయం ఏర్పడిందనీ, చివరి నిమిషంలో రద్దు చేయవలసి ఇచ్చిందని పేర్కొన్నారు. అంతేకాదు కస్టమర్ల కోసం అత్యుత్తమ విమానయాన సంస్థను నిర్మించామనీ, తమ ప్లాన్ ప్రకారం ప్రతి మైలురాయిని అధిగమించాని చెప్పారు. దీర్ఘకాలం సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ దూబే వివరణ ఇచ్చారు. (మరో భారీ బ్యాంకు స్కాం: ఏకంగా రూ.3847 కోట్లకు ముంచేశారు) కాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తాజా డేటా ప్రకారం, Akasa మార్కెట్ వాటా ఆగస్టులో 5.2 శాతం నుండి 4.2 శాతానికి పడిపోయింది. గత ఏడాది ఆగస్టులో దేశీయంగా తొలి విమానాన్ని నడిపిన ఆకాశ ఎయిర్ ఆ తరువాత అంతర్జాతీయ విమానాలను నడిపేందుకు అర్హత సాధించింది. ఆగస్టు 1న బోయింగ్ 20వ B737 మ్యాక్స్ విమానాన్ని అందుకుంది. (జ్యూస్ అమ్ముకునే స్థాయినుంచి రూ.5 వేల కోట్ల దాకా: ఎవరీ సౌరభ్?) -
మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. 30 ఏళ్లుగా అందిస్తున్న సేవలకు గుడ్బై!
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. 30 ఏళ్లుగా యూజర్లకు సేవలందిస్తున్న వర్డ్ ప్యాడ్కు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించింది. భవిష్యత్లో విడుదల కానున్న విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో వర్డ్ ప్యాడ్ అనే ఫీచర్ ఇక కనపించదని స్పష్టం చేసింది. మైక్రోసాఫ్ట్ 1995లో విండోస్ 95 అనే ఆపరేటింగ్ సిస్టం (OS) ను విడుదల చేసింది. కొత్తగా విడుదలైన ఈ ఓఎస్లో వర్డ్ ప్యాడ్ అనే వర్డ్ ప్రాసెసింగ్ టూల్ను సైతం అందుబాటులోకి తెచ్చింది. వర్డ్ ప్యాడ్లో రెజ్యూమ్, లెటర్స్ను తయారు చేయడం, టేబుల్స్ క్రియేట్ చేయడంతో పాటు ఫోటోలను సైతం జత చేసుకోవచ్చు. నోట్ ప్యాడ్లో లేని ఇటాలిక్,అండర్ లైన్, బుల్లెట్ పాయింట్స్, నెంబరింగ్, టెక్ట్స్ ఎలైన్మెంట్స్ వంటి అడ్వాన్స్ ఫీచర్లను సైతం ఉపయోగించుకునేలా వెసలు బాటు కల్పించింది. వర్డ్ ప్యాడ్ కనుమరుగు అయితే, ఈ తరుణంలో 30 ఏళ్లుగా వినియోగదారులకు సేవలందిస్తున్న వర్డ్ ప్యాడ్ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. వర్డ్ ప్యాడ్కు ప్రత్యామ్నాయంగా ఆఫీస్ 365 పెయిడ్ సబ్స్క్రిప్షన్లో ఉన్న మైక్రోసాఫ్ట్ వర్డ్ను ఉపయోగించుకోవాలని కోరింది. రిచ్ టెక్స్ డాక్యుమెంట్స్ కోసం మైక్రోసాఫ్ట్ వర్డ్, డీవోసీ అండ్. ఆర్టీఎఫ్,ప్లెయిన్ టెక్ట్స్ డాక్యుమెంట్ కోసం విండోస్ నోట్ప్యాడ్లను వినియోగించుకోవచ్చని తెలిపింది. అదే సమయంలో మైక్రోసాఫ్ట్ నోట్ప్యాడ్లో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఆటోసేవ్, ఆటో రీస్టోర్ ట్యాబ్స్కు సపోర్ట్ చేస్తుంది. భవిష్యత్లో ఎవరికైనా అవసరం అనిపిస్తే వర్డ్ ప్యాడ్ బదులు మైక్రోసాఫ్ట్ వర్డ్లో పనికొస్తుందని మైక్రోసాఫ్ట్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. చాట్జీపీటీకి అనువుగా కోర్టానా మైక్రోసాఫ్ట్ చివరిగా విండోస్7 విడుదల సందర్భంగా కొన్ని మేజర్ అప్డేట్ చేసింది. 1990లలో మైక్రోసాఫ్డ్ వర్డ్, వర్డ్ స్టార్లలో యూజర్లు సులభంగా సెర్చ్ చేసేలా బటన్స్, డ్రాప్ డౌన్ లిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వాటిని గుర్తించేలా రిబ్బోన్ యూఐని విడుదల చేసింది. తాజాగా, ఆ యూఐ రిబ్బోన్ (Ribbon UI) స్థానంలో యూఐని తెచ్చింది. మైక్రోసాఫ్ట్ ఇటీవలే వర్చువల్ అసిస్టెంట్ కోర్టానా ( Cortana ) యాప్ను మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజిన్ బింగ్కు అనుకూలంగా చాట్జీపీటీని అందిచంనుంది. నివేదికల ప్రకారం మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం విండోస్ 11కు లేటెస్ట్ వెర్షన్ విండోస్12 ఓఎస్పై పనిచేస్తుంది. దీనిని వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు పలు నివేదికలు హైలెట్ చేశాయి. చదవండి👉 నోరు పారేసుకున్న యాంకర్..కౌంటర్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా -
మీకు తెలుసా! ఆ చారిత్రాత్మక రెస్టారెంట్ హఠాత్తుగా మూతపడుతోంది!
యూకే రాజధాని లండన్లో భారత్కి చెందిన ఓ ఐకానిక్ రెస్టారెంట్ మూతపడుతోంది. దీన్ని "ఇండియా క్లబ్" అని కూడా పిలుస్తారు. ఇది సెంట్రల్ లండన్లో రద్దీగా ఉండే రహదారిలో హోటల్ స్ట్రాండ్ కాంటినెంటల్ లోపల ఉంది. ఇది దశాబ్దాలుగా నగరంలోని దక్షిణాసియా ప్రజలకు బాగా సుపరిచితమైనది. ఎన్నో రకాల దక్షిణ భారతదేశ వంటకాలను సుపరిచితం చేసిన ఈ రెస్టారెంట్ అనూహ్యంగా మూతపడుతోంది. స్వాతంత్య్రం కోసం పోరాడిని ఎందరో త్యాగధనులకు ఆతిధ్యం ఇచ్చింది. భారతదేశ స్వాతంత్య్రానికి సంబంధించిన చరిత్రకు నిలువెత్తు నిదర్శనం అయిన ఈ రెస్టారెంట్ ఎందుకు మూతపడనుందంటే.. నిజానికి 1950 దశకంలో భారతీయ వలసదారులను కలుసుకునేందుకు ఓ ప్రదేశం ఏర్పాటయ్యింది. ఇది సెంట్రల్ లండన్లో రద్దీగ ఉండే రహదారిలో హోటల్ స్ట్రాండ్ కాంటినెంటల్ లోపల ఉంది. దీన్ని ఇండియా లీగ్ సభ్యులు ప్రారంభించారు. బ్రిటన్కు చెందిన ఓ సంస్థ 1900లలో ఈ క్లబ్లో భారతదేశానికి స్వాతంత్య్రం కోసం ప్రచారం చేసింది. అలాగే భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రు ఈ క్లబ్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. 1990లలో పరిపాలనాధికారులు దీన్ని లీజుకు కొనుగోలు చేశారు. స్వాతంత్య్ర కార్యకర్తలు దీన్ని సమావేశ స్థలంగా ఉపయోగించుకున్నారు. 1950, 60లలో భారతీయులు తమ భాష మాట్లాడే వారు, తమ దేశ ఆహారం తినడం కోసం ఇక్కడకు వచ్చేవారని క్రమం తప్పకుండా సందర్శించే చరిత్రకారురాలు కసూమ్ వడ్గామ చెప్పారు. ప్రజలు పుట్టిన రోజులు, వివాహాలు, దీపావళి వంటి పండుగలను జరుపుకోవడానికి తరుచుగా ఇక్కడకు వచ్చేవారు. వడ్గామా తూర్పు ఆఫ్రికా వలస పాలనలో పెరిగారు. చదువుకోవడానికి యూకే వెళ్లారు. భారతదేశం స్వాతంత్య్రం పొందిన తరువాత సంవత్సరాలలో చాలామంది ప్రజలు యూకేకి వలస వచ్చారు. అయితే లండన్లో భారతీయ ప్రవాసుల కోసం సాంస్కృతిక సంస్థలు ఏవీ లేవు. ఆ లోటును ఈ ఇండియన్ క్లబ్ పూరించింది. ఈ రెస్టారెంట్లో దోశలు, పప్పులతో చేసే మసాల కర్రీలు, బట్టర్ చికెన్, కూరగాయాల వడలు, కాఫీ, మసాలా చాయ్ తదితర భారతీయ వంటకాలను అందించేది. ఈ క్లబ్ ఇంటీరియర్ కూడా భారతదేశంలోని కాఫీ షాపులను అనుకరించేలా రూపొందించారు. 70 ఏళ్ల క్రిత ఏర్పాటు చేసిన స్ట్రెయిట్ బ్యాక్డ్ కుర్చీలనే వాడుతున్నారు. ఇంకా మారలేదు. అంతేగాదు నాటి సామాజికి రాజకీయ చరిత్రకు గుర్తుగా గోడలపై భారతీయ బ్రిటీష్ వ్యక్తుల చిత్రాలు ఉన్నాయి. దాదాభాయ్ నౌరోజీ నుంచి తత్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్ వరకు, జర్నలిస్ట్లు, వలసదారులకు ప్రసిద్ధమైన ప్రాంతంగా ఉంది. ఎందుకు మూతపడుతోందంటే.. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న అలాంటి క్లబ్ మూతపడుతోంది. ఆ భవనం ఉన్న ప్రదేశంలోని యజమానులు నిర్మాణంలో కొంత భాగాన్ని కూల్చివేయాలని కోరుతున్నారు. మరింత ఆధునికరించిన హోటల్గా మార్చాలని డిసైడ్ అయ్యారు. క్లబ్ని మూసివేయడం వల్ల నగర చరిత్రలో కొంత భాగాన్ని కోల్పోతుందని చాలామంది ఆవేదనగా చెబుతున్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు కూడా. ఆ క్లబ్ యజానులు యాద్గార్ మార్కర్, అతని కుమార్తె ఫిరోజా ఈ స్థలాన్ని కాపాడేందుకు మద్దతు కోసం వేలాది మంది నుంచి సంతకాలను తీసుకుని కూల్చివేత పోరాటంలో విజయం సాధించారు కూడా. అయితే గతవారమే వారు క్లబ్ తెరిచి ఉండటానికి సెప్టెంబర్ 17 చివరి రోజు అని ఆవేదనగా ప్రెస్తో చెప్పడం గమనార్హం. (చదవండి: మహిళ మెదడులో.. కొండచిలువలో ఉండే..) -
ఫేస్బుక్ మూత పడనుందా? కోర్టు సంచలన వ్యాఖ్యలు
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్పై కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర పోలీసులతో ఫేస్బుక్ సహకరించకపోతే, ఇండియా అంతటా తన సేవలను మూసివేసే అంశాన్ని పరిశీలిస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. (సూపర్ ఆఫర్: రూ. 2749 కే యాపిల్ ఐఫోన్ 11!) సౌదీ జైలులో ఉన్న భారతీయుడి కేసు దర్యాప్తుపై రాష్ట్ర పోలీసులకు సహకరించడం లేదని ఆరోపించిన నేపథ్యంలో ఫేస్బుక్ కార్యకలాపాలను మూసివేసేలా ఆర్డర్ జారీ చేయడాన్ని పరిశీలిస్తామని కర్ణాటక హైకోర్టు బుధవారం ఫేస్బుక్ను హెచ్చరించింది. దక్షిణ కన్నడ జిల్లా నివాసి కవిత పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. వారంలోగా అవసరమైన సమాచారంతో కూడిన పూర్తి నివేదికను కోర్టు ముందుంచాలని ధర్మాసనం ఫేస్బుక్ను ఆదేశించింది. తప్పుడు కేసులో అరెస్టు చేసిన కేసులో ఏ చర్య తీసుకున్నారో కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం బాధాకరం. మంగళూరు పోలీసులు కూడా తగు విచారణ చేపట్టి నివేదిక సమర్పించాల్సి ఉంటుందన్న కోర్టు, విచారణను జూన్ 22కి వాయిదా వేస్తూ కోర్టు పేర్కొంది. (అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!) తన భర్త శైలేష్ కుమార్ (52) సౌదీ అరేబియాలోని ఒక కంపెనీలో 25 సంవత్సరాలు పనిచేశారని, తాను పిల్లలతో తన స్వగ్రామంలో నివసిస్తున్నారని కవిత తన పిటిషన్లో తెలిపారు.2019లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ)కి మద్దతుగా ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాడనే అభియోగంతో సౌదీ పోలీసులు శైలేష్ కుమార్ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. (చైనా స్మార్ట్ఫోన్ మేకర్కి ఎదురుదెబ్బ: సీఈవో గుడ్బై, ప్రత్యర్థికి సై!?) అయితే గుర్తు తెలియని వ్యక్తులు తన పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరిచి రాజుపై అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ కవిత మంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫేస్బుక్కు లేఖ రాసి, నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరిచినట్లు సమాచారం అందించారు. అయితే ఫేస్బుక్ దీనిపై స్పందించలేదు. విచారణలో జాప్యాన్ని ప్రశ్నిస్తూ పిటిషనర్ 2021లో హైకోర్టును ఆశ్రయించారు. తన భర్తను విడుదలకు సాయం చేయాలని కవిత కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాశారు. మరిన్ని బిజినెస్వార్తలు, ఇంట్రస్టింగ్అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
‘సింహాద్రి’లో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత
పరవాడ(అనకాపల్లి జిల్లా): సింహాద్రి ఎన్టీపీసీ ప్లాంట్లో 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండో యూనిట్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. విద్యుత్ సరఫరాకు తగినంత డిమాండ్ లేని కారణంగా (రిజర్వు షట్డౌన్) రెండో యూనిట్ నుంచి విద్యుత్ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశారు. విద్యుత్కు తగినంత డిమాండ్ లేకపోవడం వల్ల శుక్రవారం ఉదయం సంస్థలో 3, 4 యూనిట్లలో ఉత్పత్తిని నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మొదటి యూనిట్ నుంచి 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే జరుగుతుంది. అవసరాలను బట్టి 2, 3, 4 యూనిట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరిస్తామని సంస్థ అధికారులు తెలిపారు. అయితే, విద్యుత్ ఉత్పత్తికి డిమాండ్ లేని కారణంగా మొదటి యూనిట్ను కూడా త్వరలో తాత్కాలికంగా నిలిపివేసే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. -
సిలికాన్ వ్యాలీ బ్యాంకు సెగ: లక్ష ఉద్యోగాలు, 10వేల స్టార్టప్లకు గండం
న్యూఢిల్లీ: సిలికాన్ వేలీ బ్యాంక్ (ఎస్వీబీ) మూసివేత వల్ల దానితో ముడిపడి ఉన్న అంకుర సంస్థల్లో ఆందోళన నెలకొంది. తక్షణ ఆర్థిక అవసరాలకు కావాల్సిన నిధుల కోసం అవి వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎస్వీబీలో డిపాజిట్లు ఉన్న దాదాపు 10,000 చిన్న సంస్థలు .. వచ్చే 30 రోజుల్లో తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో విఫలమయ్యే అవకాశం ఉందని అమెరికా ప్రభుత్వానికి సమర్పించిన పిటీషన్లో వై కాంబినేటర్ (వైసీ) తెలిపింది. దీని వల్ల 1 లక్ష పైగా ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు పేర్కొంది. (ఇంటింటికి వెళ్లి కత్తులమ్మి..ఇపుడు కోట్లు సంపాదిస్తున్న అందాల భామ) ఇలాంటి పరిణామాలు తలెత్తకుండా కట్టడి చేయకపోతే .. యావత్ అమెరికా టెక్నాలజీ పరిశ్రమపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. 3,500 మంది పైచిలుకు సహ వ్యవస్థాపకులు, సీఈవోలు, రెండు లక్షల మంది పైగా స్టార్టప్ సంస్థల ఉద్యోగులు ఈ పిటీషన్పై సంతకం చేశాయి. వీటిలో పేవో, సేవ్ఇన్, శాలరీబుక్ వంటి భారతీయ సంస్థలు కూడా ఉన్నాయి. ఇన్క్యుబేటర్ సంస్థ అయిన వై కాంబినేటర్ కమ్యూనిటీలోని మూడో వంతు స్టార్టప్లకు ఎస్వీబీలో మాత్రమే ఖాతాలు ఉన్నాయి. (ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ వచ్చేసింది! భారీ డిస్కౌంట్ కూడా) ఎస్వీబీలో భారీగా డిపాజిట్లు ఉన్న కొన్ని బడా టెక్ సంస్థలకు (వై కాంబినేటర్తో సంబంధమున్నవి) అమెరికాతో పాటు భారత్లోనూ కార్యకలాపాలు ఉన్నాయని ఫిన్టెక్ కంపెనీ రికర్ క్లబ్ సీఈవో ఏకలవ్య గుప్తా తెలిపారు. దేశీయంగా గిఫ్ట్ సిటీలో అకౌంట్లు తెరిచేందుకు ఆయా స్టార్టప్లకు తాము సహాయం అందిస్తున్నట్లు వివరించారు. మరోవైపు, గతంలోలాగా ఎస్వీబీని ప్రభుత్వం బెయిలవుట్ చేయబోదని అమెరికా ఆర్థిక మంత్రి జేనెట్ యెలెన్ స్పష్టం చేశారు. అయితే, డిపాజిటర్లందరికీ వారి సొమ్ము తిరిగి అందేలా చూసేందుకు చర్యలపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. 15 ఏళ్ల క్రితం నాటి ఆర్థిక సంక్షోభానికి నేటి పరిస్థితులకు వ్యత్యాసం ఉందని, అప్పటితో పోలిస్తే ఇప్పుడు అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థ మరింత పటిష్టంగా ఉందని చెప్పారు. సత్వర టేకోవర్కు ఆస్కారం.. ఈ సమస్య స్వల్పకాలికమైనదే కావచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. క్లయింట్ల సొమ్మును తిరిగిచ్చేందుకు సరిపడేంత అసెట్లు ఎస్వీబీ దగ్గర ఉండటంతో పాటు, పలు ప్రముఖ సంస్థల ఖాతాలూ ఉన్న నేపథ్యంలో బ్యాంకును సత్వరమే ఏదో ఒక సంస్థ టేకోవర్ చేయొచ్చని తెలిపాయి. రాబోయే వారం రోజుల్లోనే ఇది జరగవచ్చని ఇన్మొబి గ్రూప్ సహ వ్యవస్థాపకుడు అభయ్ సింఘాల్ చెప్పారు. స్వల్పకాలికంగా ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపు కోసం 7-8 బిలియన్ డాలర్ల నిధులు అవసరం కావచ్చని, అవి అందితే ప్రస్తుతానికి సమస్య పరిష్కారం కావచ్చని పేర్కొన్నారు. ఏవో కొన్నింటిపై మినహా మిగతా స్టార్టప్లపై ఎస్వీబీ సంక్షోభ ప్రభావం ఉండకపోవచ్చని జెన్ప్యాక్ట్ వ్యవస్థాపకుడు ప్రమోద్ భాసిన్ అభిప్రాయపడ్డారు. ఈ సమస్య స్థానికమైందే తప్ప అంతర్జాతీయ మైంది కాదన్నారు. భారతీయ స్టార్టప్లకు ఎస్వీబీతో చెప్పుకోతగ్గ స్థాయిలో లావాదేవీలేమీ లేవు కాబట్టి అవి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదని పరిశ్రమ నిపుణుడు, 5ఎఫ్ వరల్డ్ చైర్మన్ గణేష్ నటరాజన్ చెప్పారు. ఎస్వీబీతో లావాదేవీలు జరిపే సంస్థలు కూడా కాస్త ఓపిక పడితే తమ సొమ్మును తిరిగి పొందడానికి వీలుంటుందన్నారు. మరోవైపు, తమ రెండు అనుబంధ సంస్థలకు (కిడోపియా, మీడియా వర్కజ్క్) ఎస్వీబీలో సుమారు రూ. 64 కోట్లు ఉన్నాయని గేమింగ్, స్పోర్ట్స్ మీడియా ప్లాట్ఫామ్ సంస్థ నజారా టెక్నాలజీస్ వెల్లడించింది. అయితే, వాటి చేతిలో తగినన్ని నిధులు ఉన్నాయని, ఎస్వీబీ పరిణామం వల్ల వాటి వ్యాపారంపై ప్రభావమేమీ పడబోదని పేర్కొంది. అంకురాలతో భేటీ కానున్న కేంద్ర మంత్రి.. దేశీ సంస్థలపై ఎస్వీబీ పరిణామాల ప్రభావాన్ని అంచనా వేయడంపై కేంద్రం దృష్టి సారించింది. దీనిపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ వారంలో దేశీ స్టార్టప్ల ప్రతినిధులతో భేటీ కానున్నారు. దేశ నిర్మాణంలో కీలకంగా ఎదుగుతున్న అంకుర సంస్థలకు ప్రభుత్వం ఏ విధంగా తోడ్పాటు అందించగలదన్నది తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. -
సంక్షోభంతో అల్లాడుతున్న పాక్కు షాక్: మరో ప్లాంట్ షట్డౌన్
న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్తాన్కు మరో షాక్ తగిలింది. సరఫరా గొలుసులో తీవ్ర అంతరాయం ఏర్పడిందని పేర్కొంటూ మరో కార్ల తయారీ సంస్థ హోండా తన ప్లాంట్ను మూసివేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇప్పటికే ప్రముఖ కంపెనీలు పాక్కు గుడ్బై చెబుతుండగా, ఈ జాబితాలో తాజాగా ఆటోమొబైల్ దిగ్గజం హోండా కూడా చేరింది. ప్రస్తుతం పాక్లోని హోండా అట్లాస్ కార్స్ పేరుతో కార్లను అసెంబుల్ చేస్తోంది. దేశంలోని ప్రస్తుత ఆర్థిక పరిస్థితులే మూసివేతకు కారణమని ప్రకటించింది. జియో న్యూస్ ప్రకారం మార్చి 9 నుంచి 31 వరకు హోండా తన ఫ్లాంట్ను మూసివేయనుంది. పాక్ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఉత్పత్తిని కొనసాగించలేని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి స్టాక్ఎక్స్ఛేంజ్కు అందించిన సమాచారంలో కంపెనీ తెలిపింది. ప్రభుత్వం పూర్తి నాక్-డౌన్ కిట్ల దిగుమతి కోసం లెటర్ ఆఫ్ క్రెడిట్ నిషేధం, ముడిసరుకు, విదేశీ చెల్లింపుల స్తంభన లాంటి చర్యలతో సరఫరా గొలుసు తీవ్రంగా దెబ్బతిందని కంపెనీ తెలిపింది. కాగా అధిక ద్రవ్యోల్బణం, పాక్ కరెన్సీ క్షీణత, దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన పాకిస్తాన్ ఆటో పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుందని జియో న్యూస్ నివేదించింది. వాణిజ్య లోటును నియంత్రించేందుకు సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిగుమతుల ఆంక్షలతో ఆటో పరిశ్రమ కూడా దెబ్బతిన్నదని వ్యాఖ్యానించింది. ఉత్పత్తి కార్యకలాపాలు దెబ్బతినడమే కాకుండా కంపెనీలు తమ సీకేడీ మోడళ్ల ధరలను కూడా పెంచాయి, ఇది ఇప్పటికే ప్రజల కొనుగోలు శక్తిని ప్రభావితం చేసిందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పాక్లోని టయోటా-బ్రాండ్ ఆటోమొబైల్స్కు చెందిన సుకుజీ మోటార్ కంపెనీ (PSMC) ఇండస్ మోటార్ కంపెనీ (IMC) అసెంబ్లర్లు కూడా తమ ఉత్పత్తి ప్లాంట్లను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. -
అమెజాన్లో ఏం జరుగుతోంది? భారత్లో మరో బిజినెస్ మూసివేత!
దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ దేశాల్లో రెసిషన్ భయాలు వెంటాడుతున్న తరుణంలో భారత్లో ఏ మాత్రం లాభసాటి లేని బిజినెస్లను షట్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే వారం రోజుల వ్యవధిలోనే అమెజాన్ తన ఫుడ్ డెలివరీ,ఎడ్యుకేషన్ సర్వీస్ను మూసిసేంది. తాజాగా మరో బిజినెస్కు స్వస్తి పలికినట్లు సమాచారం. అమెజాన్ దేశీయంగా డిస్ట్రిబ్యూషన్ సేవల్ని అందిస్తుంది. డిస్ట్రిబ్యూషన్ యూనిట్ కంపెనీల నుండి వినియోగదారులకు, రీటైలర్లకు సంబంధిత ప్రొడక్ట్లను డెలివరీ చేస్తుంది. అయితే ఆర్థిక మందగమనం నేపథ్యంలో డిస్టిబ్యూషన్ సర్వీస్ సేవల్ని నిలిపివేస్తున్నట్లు చెప్పింది. కంపెనీ ఇప్పుడు ప్రధాన వ్యాపారాలపై మరింత దృష్టి పెడుతుందని పేర్కొంది. అమెజాన్ అకాడమీ టూ అమెజాన్ ఫుడ్ అమెజాన్ ఇండియా తన వార్షిక నిర్వహణ ప్రణాళిక సమీక్ష ప్రక్రియలో భాగంగా ఫుడ్ డెలివరీ సర్వీసుల్ని నిలిపివేసింది. వారం రోజుల ముందు ఎడ్ టెక్ సర్వీస్, అమెజాన్ అకాడమీని సైతం షట్ డౌన్ చేసింది. ముఖ్యంగా కోవిడ్ -19 లాక్డౌన్ సమయంలో బైజూస్, అన్ అకాడమీ, వేదాంతు’లు భారీ లాభాల్లో గడిస్తున్న సమయంలో అమెజాన్ అకాడమీని ప్రారంభించిన విషయం తెలిసిందే. చదవండి👉 ‘మీతో పోటీ పడలేం!’,భారత్లో మరో బిజినెస్ను మూసేస్తున్న అమెజాన్ -
పేటీఎం సేవల్లో అంతరాయం, యాప్లో మీ డబ్బులు ఆగిపోయాయా?
దేశ వ్యాప్తంగా ప్రముఖ ఫిన్ టెక్ దిగ్గజం పేటీఎం సేవలు స్తంభించిపోయాయి. యాప్లో లాగిన్ సమస్యలు ఉత్పన్నం కావడంతో యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంస్థ యాప్లో,వెబ్సైట్లో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని, ఆటోమెటిక్గ్గా లాగవుట్ అవుతుందని ట్విట్టర్లో పేటీఎంకు ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలో పేటీఎం యూజర్లు మనీ ట్రాన్స్ఫర్ విషయంలో జాగ్రత్తలు వహించాలని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సంస్థకు సంబంధించిన సేవల అంతరాయాల్ని గుర్తించే డౌన్ డిక్టేటర్ సైతం దేశ వ్యాప్తంగా యూజర్లు పేటీఎం యాప్ నుంచి సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. దేశంలో ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరులలో పేటీఎం యాప్ పని తీరు మందగించినట్లు తన నివేదికలో పేర్కొంది. Due to a network error across Paytm, a few of you might be facing an issue in logging into the Paytm Money App/website. We are already working on fixing the issue at the earliest. We will update you as soon as it is resolved — Paytm Money (@PaytmMoney) August 5, 2022 నెట్వర్క్ ఎర్రర్ పేటీఎం సేవల్లో అంతరాయం కలగడంపై ఆ సంస్థ యాజమాన్యం స్పందించింది. నెట్ వర్క్ ఎర్రర్ వల్లే ఈ సమస్య ఏర్పడిందని తెలిపింది. అయితే ఇప్పుడా నెట్ వర్క్ ఇష్యూని పరిష్కరించామని పేటీఎం ట్వీట్ చేసింది. ఐటీ సిబ్బంది ఈ సమస్య నుంచి గట్టెక్కించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు ట్వీట్ చేసింది. We understand that few of our Trading & F&O users would have faced real issues with their trades & positions. In our continued efforts to always have your back & to be fair & transparent, we request you write to us over email at exg.support@paytmmoney.com with your concerns (2/5) — Paytm Money (@PaytmMoney) August 5, 2022 ఆ ఫిర్యాదుల్ని పరిగణలోకి తీసుకోలేం యూజర్ల అంతరాయానికి చింతిస్తున్నాం. యాప్, వెబ్ సైట్లలో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నాం. యాప్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే సమయంలో నెట్ వర్క్ సమస్య, మనీ స్ట్రక్ అవ్వడంతో పాటు ఇతర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వినియోగదారులు ట్వీట్లు చేస్తున్నారు.ఈ క్లిష్ట సమయాల్లో ఆ ట్వీట్లను పరిగణలోకి తీసులేం. తమకు ఫిర్యాదు చేయాలనుకుంటే 'సపోర్ట్@పేటీఎంమనీ.కాం.' కు మెయిల్ చేయాలని కోరింది. -
Digital Emergency: కనెక్షన్ కట్.. 2012 నుంచి 665 సార్లు.. టాప్ ప్లేస్లో భారత్!
డిజిటల్ ఎమర్జెన్సీ. ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయడం. ఈ ధోరణి భారత్లో రానురాను బాగాపెరిగిపోతోంది. ఎక్కడ ఏ చిన్న ఆందోళన జరిగినా, ఉద్రిక్తత తలెత్తినా ప్రభుత్వాలు తీసుకునే తొలి చర్య నెట్ కనెక్షన్ కట్ చేయడమే. ఇది వివాదానికి కూడా దారి తీస్తోంది. ఇంటర్నెట్ షట్డౌన్లలో నాలుగేళ్లుగా ప్రపంచంలో భారతే టాప్ ప్లేస్లో ఉంది! అగ్నిపథ్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అగ్గి రాజుకున్నా, ప్రవక్తపై వ్యాఖ్యల కారణంగా రాజస్థాన్లో జరిగిన హత్యపై ఉద్రిక్తతలు తలెత్తినా, సాగు, పౌరసత్వ సవరణ చట్టాలపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటినా... ప్రభుత్వం విధిగా తీసుకున్న తొలి చర్య ఇంటర్నెట్ షట్డౌనే. ఇంటర్నెట్ లేకుండా అడుగు తీసి అడుగు ముందుకు వెయ్యలేని కాలమిది. ఏ ఉద్యమమైనా సోషల్ మీడియా వేదికలను వినియోగించుకునే వ్యూహాలు పన్నుతున్నారు. ఆ సాంకేతిక బాసట లేకుండా చేసేందుకు ప్రభుత్వాలు వెంటనే ఇంటర్నెట్ సర్వీసుల్ని నిలిపేస్తున్నాయి. శాంతిభద్రతల కారణంతో ఒకప్పుడు కశ్మీర్కే పరిమితమైన ఈ ధోరణి ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్నిచోట్లకూ విస్తరించడం వివాదాస్పదమవుతోంది. కరోనా అనంతరం వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ క్లాసులు, డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయిన నేపథ్యంలో ఇంటర్నెట్ లేకుండా పూట గడవని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి హెచ్చరికలూ లేకుండా ఉన్నట్టుండి నెట్ సర్వీసులు నిలిపివేస్తుండటంతో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎంతోమంది జీవనోపాధిపైనా దెబ్బ పడుతోంది. 6 నెలల్లో 59 సార్లు... భారత్లో ఇంటర్నెట్ షట్డౌన్స్పై అధ్యయనం చేస్తున్న సాఫ్ట్వేర్ ఫ్రీడమ్ లా సెంటర్ (ఎస్ఎఫ్ఎల్సీ) ప్రకారం 2012 నుంచి ఇప్పటివరకు ఏకంగా 665సార్లు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. గళమెత్తే గొంతుకల్ని అణిచివేయడానికి నెట్ నిలిపివేతను ఆయుధంగా వాడుతున్న దేశాల్లో భారత్ ప్రపంచంలోనే టాప్లో ఉందని సంస్థ చెబుతోంది. ఈ ఏడాదిలోనే జూన్ నాటికి దేశంలో ఏకంగా 59 సార్లు నెట్ కనెక్షన్ కట్ అయింది! జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు సమయంలో విధించిన ఇంటర్నెట్ షట్డౌన్ దేశంలోనే అత్యంత సుదీర్ఘమైనది. కశ్మీర్ ప్రజలు ఏకంగా 552 రోజుల పాటు నెట్ సౌకర్యానికి దూరమయ్యారు. తరచూ నెట్ను నిలిపేస్తున్న రాష్ట్రాల జాబితాలో కశ్మీర్ తర్వాత రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. పౌర హక్కులకు భంగమేనా? ఇలా చీటికీమాటికీ ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం పౌరులకు రాజ్యాంగమిచ్చిన ప్రాథమిక హక్కులకు భంగకరమేనని ఇంటర్నెట్ ఫ్రీడం ఫౌండేషన్ (ఐఎఫ్ఎఫ్) అనే న్యాయవాదుల గ్రూపు వాదిస్తోంది. దీనిపై ఈ సంస్థ పలుమార్లు కోర్టుకెక్కింది కూడా. ఇంటర్నెట్ సదుపాయముంటే విద్వేష ప్రసంగాలు, తప్పుడు వార్తలు వ్యాప్తి చెందుతాయని ప్రభుత్వాలు భావిస్తున్నాయే తప్ప, అది ఉంటే వారు వాస్తవాలు తెలుసుకునే అవకాశమూ ఉంటుందని ఆలోచించలేకపోతోందన్నది దాని వాదన. ప్రభుత్వాలేమంటున్నాయి... సామాజిక మాధ్యమాల వాడకం బాగా పెరిగిన నేపథ్యంలో తప్పుడు సమాచారం, వదంతులు వాటి ద్వారా విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయన్నది ప్రభుత్వాల వాదన. ఉద్రిక్త పరిస్థితులకు ఇవి ఆజ్యం పోస్తాయి కాబట్టే నెట్ కట్ చేస్తున్నట్టు అవి చెబుతున్నాయి. ప్రజల భద్రత దృష్ట్యా టెలికాం నిబంధనల ప్రకారం ఇంటర్నెట్ సేవల్ని తాత్కాలికంగా నిలిపేసే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ప్రమాదకర పరిస్థితులు తలెత్తినప్పుడు నెట్ సేవలను నిలిపేసే అధికారం 2017 దాకా సీఆర్పీసీ సెక్షన్ 144 ప్రకారం జిల్లా జడ్జిలకు ఉండేది. ఇంటర్నెట్ సేవలు ఆపేయడం తప్పనిసరైతే మధ్యేమార్గంగా వదంతులను వ్యాప్తి చేసే ఫేస్బుక్, వాట్సాప్, ట్విటర్ వంటి సోషల్ ప్లాట్ఫారంలను ఆపేసి మిగతావి కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్థికంగానూ ప్రభావమే... ఇంటర్నెట్ షట్డౌన్లు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావమే చూపుతున్నాయి. 2019లో 4 వేల గంటల పాటు దేశంలో నెట్ సేవలు ఆగిపోవడంతో 130 కోట్ల డాలర్లకు పైగా నష్టం కలిగిందన్నది ప్రపంచ బ్యాంకు అంచనా. ఇంటర్నెట్ లేక తాను పత్రికను ప్రింట్ చేసుకోలేకపోతున్నానని, మరెందరో జీవనోపాధి కోల్పోతున్నారని కశ్మీర్కు చెందిన అనూరాధా భాసిన్ అనే జర్నలిస్టు సుప్రీంకోర్టుకెక్కారు. నిరవధికంగా ఇంటర్నెట్ సేవలు నిలిపేయడం ఆమోదయోగ్యం కాదని ఆమె పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు పేర్కొంది కూడా. అంతేకాదు, ‘వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ, వృత్తి, వ్యాపారాలను నిర్వహించుకునే హక్కులను రాజ్యాంగంలోని 19(1)(ఎ), ఆర్టికల్ 19(1)(జి) ఆర్టికళ్లలో పేర్కొన్న మేరకు పరిరక్షించాల్సిందే’ అని ఆదేశించింది. అయినప్పటికీ తాత్కాలికం అన్న పేరు చెబుతూ ఎక్కడికక్కడ ప్రభుత్వాలు ఇంటర్నెట్ను నిలిపివేస్తున్నాయి. అలా పొడిగించుకుంటూ వెళుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అనూహ్య నిర్ణయం! ఏటీఎంలు అన్నీ బంద్..!
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ క్రిప్టోకరెన్సీలు బిట్కాయిన్, ఈథిరియం, డోజీకాయిన్ విలువ గణనీయంగా పెరిగాయి. దీంతో ఆయా క్రిప్టోకరెన్సీలు మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ కూడా అమాంతం పెరిగాయి. ఇదిలా ఉండగా బిట్కాయిన్ క్రిప్టో కరెన్సీ ఏటీఎంలపై యుకే ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. చట్ట విరుద్దమైనవే..! యూకేలోని క్రిప్టోకరెన్సీ ఇన్వెస్టర్లకు ఆ దేశ ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీ (ఎఫ్సీఏ) గట్టి షాక్ను ఇచ్చింది. క్రిప్టో ఎక్సేఛేంజ్స్పై కొత్త ఉత్తర్వులను జారీ చేసింది. క్రిప్టో ఏటీఎం ఆపరేటర్లు వారి మెషీన్లు క్లోజ్ చేయాలని ఆదేశించింది. లేదంటే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. కొత్త రూల్స్ ప్రకారం క్రిప్టో ఎక్స్చేంజ్ సర్వీసులు అందించే క్రిప్టో కరెన్సీ ఏటీఎంలు అన్నీ ఎఫ్సీఏ వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే క్రిప్టో ఏటీఎంలు అన్నీ యూకే మనీ ల్యాండరింగ్ నిబంధనలకు అనుగుణంగానే పని చేయాల్సి ఉంటుంది. చట్టవిరుద్దంగా క్రిప్టో కరెన్సీ ఏటీఎం సర్వీసులు అందిస్తే మాత్రం కఠినమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలను జారీ చేసింది. క్రిప్టో లావాదేవీలు సులువు..! యుకేతో పాటుగా పలు దేశాల్లో ఇన్వెస్టర్లకు సులవుగా క్రిప్టోలను కొనుగోలు లేదా సేల్ చేసేందుకుగాను క్రిప్టో ఎటీఎంలను ఎక్సేఛేంజ్స్ ఏర్పాటుచేశాయి. ఇవి సాధారణ ఎటీఎం వలె కన్పిస్తాయి. ప్రజలు తమ బ్యాంక్ కార్డ్లను ఉపయోగించి బిట్కాయిన్ వంటి క్రిప్టో-కరెన్సీ కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తాయి.కాగా యుకేలోని క్రిప్టో-కరెన్సీ సేవలను అందించే ఏ కంపెనీకి క్రిప్టో-ATMని ఆపరేట్ చేయడానికి లైసెన్స్ లేదు. క్రిప్టో ఏటీఎం డైరెక్టరీ కాయిన్ ఎటీఎం రాడార్ ప్రకారం..యుకేలో సుమారుగా 81 ఫంక్షనల్ క్రిప్టో ఎటీఎంలు ఉన్నాయి.ఎఫ్సీఏ నిర్ణయంతో ఆ దేశ క్రిప్టో ఇన్వెస్టర్లకు కొత్త చిక్కులను తెచ్చిపెట్టనుంది. చదవండి: 40 ఏళ్ల తరువాత కేంద్రం షాకింగ్ నిర్ణయం..! కారణం అదేనట..? -
China Power Crisis: చైనాలో చీకట్లు !
షెన్యాంగ్: చైనాలో స్మార్ట్ ఫోన్ వెలుగులో ప్రజలు బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారు. చాలా నగరాల్లో విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలనే లక్ష్యాలను చేరుకోవడానికి విద్యుత్ కోతలు అమలు చేశారని కొందరు ఆర్థిక వేత్తలు విశ్లేషిస్తూ ఉంటే , ఇటీవల కాలంలో బొగ్గు ధరలు ఆకాశాన్నంటడంతో డిమాండ్కి తగ్గ సప్లయ్ చేయలేమని విద్యుత్ కంపెనీలు చేతులెత్తేసినట్టు వార్తలు వస్తున్నాయి. చైనాలో కొన్ని ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఫలితంగా స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభావం పడుతుందనే ఆందోళనలు మొదలయ్యాయి. ఇటీవల చైనా విద్యుత్ వినియోగం రెట్టింపు అయింది. దీంతో కర్బన ఉద్గారాలు అధిక స్థాయిలో వెలువడి వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది. ఐక్యరాజ్య సమితి పర్యావరణ సదస్సు అక్టోబర్ 12–13 తేదీల్లో చైనాలోని కన్మింగ్లో జరగనుంది. ఆతిథ్య దేశంగా ఉంటూ ఈ స్థాయిలో ఇంధనాన్ని వినియోగిస్తే అంతర్జాతీయంగా విమర్శలు వస్తాయి. దీంతో అధ్యక్షుడు జిన్ పింగ్పై సంప్రదాయ ఇంధన వినియోగాన్ని తగ్గించాలనే ఒత్తిడి పెరుగుతోంది. ఆ లక్ష్యాలను చేరుకోవడానికే భారీగా విద్యుత్ కోతలు విధించారని తెలుస్తోంది. చైనాలో దాదాపుగా 20 ప్రాంతాల్లో అత్యధికంగా ఇంధనాన్ని వినియోగిస్తూ, ఉత్పత్తులు భారీగా చేపట్టడంతో కాలుష్యం పెరిగిపోయింది. చైనాలోని ఓ ఇంట్లో సెల్ఫోన్ వెలుగులో భోజనం చేస్తున్న కుటుంబ సభ్యులు -
వీటిలో ఇంటర్నెట్ సేవలు బంద్..!
రేపటి నుంచి అనగా సెప్టెంబర్ 30 నుంచి పలు డివైజ్ల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోనున్నట్లు తెలుస్తోంది. Let’s Encrypt’sకు చెందిన IdentTrust DST Root CA X3 సర్టిఫికెట్ గడువు రేపటితో ముగియనుంది. దీంతో పలువురు ఈ సర్టిఫికేట్లను కల్గిన డివైజ్లో వరల్డ్ వైడ్ వెబ్సేవలను పొందలేరని టెక్నికల్ నిపుణులు పేర్కొన్నారు. లెట్స్ ఎన్క్రిప్ట్ (Let's Encrypt) అనేది నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్. మొబైల్, ల్యాప్టాప్, పర్సనల్కంప్యూటర్స్ వంటి పరికరాల మధ్య ఇంటర్నెట్ కనెక్షన్ని ఈ ఆర్గనైజేషన్ ఎన్క్రిప్ట్ చేస్తుంది. ఈ సర్టిఫికేషన్ సహాయంతో మనం వాడే డివైజ్లకు ఏలాంటి హాని లేకుండా, సురక్షితమైన ఇంటర్నెట్ సేవలు అందుతాయి. అంతేకాకుండా మీ పర్సనల్ డేటాను హ్యక్ కాకుండా చూస్తోంది. మనం బ్రౌజింగ్ చేసేటప్పుడు యూఆర్ఎల్ అడ్రస్లో మొదట హెఛ్టీటీపీఎస్తో ఆయా వెబ్సైట్ వస్తోంది. ఈ విషయాన్ని మనలో కొంత మంది గమనించే ఉంటాం. హెఛ్టీటీపీఎస్ ప్రారంభమయ్యే వెబ్సైట్ అత్యంత సురక్షితమని అర్థం. ఈ ప్రాసెస్ పూర్తిగా IdentTrust DST Root CA X3 సర్టిఫికెట్ సహాయంతోనే జరుగుతుంది. చదవండి: Jeans Could Get Pricey: జీన్స్, టీషర్ట్స్ లవర్స్కు షాకింగ్ న్యూస్...! ప్రభావం ఎక్కువగా వీటిపైనే..! IdentTrust DST Root CA X3 సర్టిఫికెట్ ఆప్డేట్ అయిన డివైజ్లకు ఏలాంటి ప్రాబ్లమ్ లేదు. ఏళ్ల తరబడి ఎలాంటి ఆప్డేట్కు నోచుకొని డివైజ్ల్లో ఇంటర్నెట్ సేవలు ముగియనున్నాయి. టెక్ క్రచ్ నివేదిక ప్రకారం...మాక్ఓఎస్ 2016 వర్షన్, పలు ఓల్డ్ ఐఫోన్స్, విండోస్ ఎక్స్పీ(విత్ సర్వీస్ పాక్ 3), ప్లే స్టేషన్ కన్సోల్ 3. ప్లేస్టేషన్ 4 వంటి అప్గ్రేడ్ కాని వాటిలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతాయి. ఇలా చేస్తే బెటర్ సర్టిఫికెట్ గడువు ముగిసిన తర్వాత 7.1.1 కంటే పాత వెర్షన్లను కలిగి ఉన్న అన్ని ఆండ్రాయిడ్ డివైజ్ లలో ఇంటర్నెట్ పని చేయదు. ఐవోఎస్ 10 కంటే పాత వెర్షన్లను కలిగి ఉన్న ఐఫోన్లలో కూడా ఇంటర్నెట్ సేవలు పని చేయవు. మీ డివైజ్ లలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే, వెంటనే మీ ఫోన్ లో చెక్ చేసి, పాత వర్షన్ ఉంటే వెంటనే అప్డేట్ చేయండి. ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ వర్షన్ ఉన్న స్మార్ట్ఫోన్ యూజర్లు మోజిలా ఫైర్ఫాక్స్ బ్రౌజర్ను ఉపయోగిస్తే ఇంటర్నెట్ సేవలను పొందవచ్చునని తెలుస్తోంది. చదవండి: భారీ డిస్కౌంట్లతో ముందుకువస్తోన్న షావోమీ..! సుమారు రూ. 75 వేల వరకు తగ్గింపు..! -
టీవీ సీరియల్స్కు బ్రేక్.. షూటింగ్లు రద్దు
ముంబై : దేశ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసులు అధికమవుతుండటంతో మహమ్మారి కట్టడికి ప్రభుత్వం ఇప్పటికే మినీ లాక్ డౌన్ (పాక్షిక లాక్ డౌన్)ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉదయం సెక్షన్ 144, నైట్ కర్ఫ్యూతోపాటు వీకెండ్లో అంటే వచ్చే శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి సోమవారం ఉదయం ఏడు వరకు (శని, ఆది) సంపూర్ణ లాక్డౌన్ను విధించింది.తాజాగా కరోనాను అదుపుచేసే చర్యల్లో భాగంగా రాష్ష్ర్ట ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలో టీవీ సీరియళ్ల షూటింగ్లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే మినీ లాక్డౌన్లో భాగంగా ఇప్పటికే హోటళ్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, ధార్మిక, దర్శనీయ స్థలాలు, మైదానాలు, జిమ్లు, సెలూన్లు మూసి వేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,45,384 కొత్త కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే కరోనాతో 794 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1, 32,05,926కు చేరుకుంది. కాగా మొత్తం మరణాల సంఖ్య 1,68,436కి చేరుకుంది.నిన్న కరోనా నుంచి కోలుకుని 77,567 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 19,90,859 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ సంఖ్య 10,46,631కి చేరుకుంది. చదవండి: మహారాష్ట్రలో మినీ లాక్డౌన్ సంపూర్ణ లాక్డౌన్: 9 నుంచి 19 వరకు మొత్తం బంద్ -
ఆ బిల్లు తెస్తే అర్ధగంటలో దేశం అంధకారం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సవరణ బిల్లు-2021ను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెడితే.. విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల జాతీయ సమన్వయ కమిటీ పిలుపు మేరకు విద్యుత్ ఉద్యోగులందరూ మెరుపు సమ్మెకు దిగుతారని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.రత్నాకర్రావు హెచ్చరించారు. లోక్సభ వెబ్సైట్లో బిల్లును లిస్టింగ్ చేసిందని, బిల్లును ఎప్పుడు ప్రవేశపెడతారో మూడు రోజుల ముందు వరకు కూడా తెలియనుందన్నారు. తమ వ్యతిరేకతను పట్టించుకోకుండా బిల్లును తెస్తే అర్ధగంటలో యావత్ దేశం అంధకారమవుతుందని హెచ్చరించారు. గతంలో మాదిరి కాకుండా ఈసారి విద్యుదుత్పత్తి కేంద్రాలు, లోడ్ డిస్పాచ్ సెంటర్లు వంటి అత్యవసర విభాగాల ఉద్యోగులందరూ సమ్మెకు దిగుతారని చెప్పారు. 12 తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు, కార్మిక సంఘాల నేతలతో కలసి బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. బడా పారిశ్రామికవేత్తలకు విద్యుత్ సంస్థల ఆస్తులను దోచిపెట్టడానికే కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తోందని ఆరోపించారు. లైసెన్స్ లేకుండా విద్యుత్ పంపిణీ రంగంలో వ్యాపారం చేసేందుకు ప్రైవేటు వ్యాపారులకు అవకాశం కల్పించడానికి ఈ బిల్లును తీసుకువస్తున్నారని ఆరోపించారు. వినియోగదారులు, విద్యుత్ ఉద్యోగులతోపాటు విద్యుత్ సంస్థలకు ఈ బిల్లు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గృహ వినియోగదారులకు ప్రస్తుతమున్న రాయితీలు ఇక ముందు లభించవని, ప్రైవేటు కంపెనీలు మాఫియాగా ఏర్పడి విద్యుత్ చార్జీలు భారీగా పెంచేస్తాయన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని పరిస్థితి ఉత్పన్నం అవుతుందని, వ్యవసాయ పంప్సెట్లకు సైతం మీటర్లు బిగించనున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఈ బిల్లును వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు విద్యుత్ బిల్లును వ్యతిరేకించే పార్టీలకే విద్యుత్ ఉద్యోగుల మద్దతు ఉంటుందని రత్నాకర్రావు తెలిపారు. విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తూ శాసనసభలో సీఎం కేసీఆర్ తీర్మానం చేశారని, ఈ నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు తొలి ప్రాధాన్యత ఓటు వేయాలని విద్యుత్ ఉద్యోగులను కోరారు. విశాఖ ఉక్కు కోసం పోరాడుతున్న వారికి మద్దతు తెలిపారు. సమావేశంలో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్, తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్, తెలంగాణ ఎలక్ట్రిసిటీ అకౌంట్స్ స్టాఫ్ అసోసియేషన్, 1104 యూనియన్, 1535 యూని యన్, టీవీఈఏ, టీఈడబ్ల్యూఈఏ, బీసీ/ ఎస్సీ, ఎస్టీ/ ఓసీ/ ఎస్టీ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. -
నేషనల్ 'షాక్' ఎక్స్చేంజ్!
ముంబై: దేశీయంగా ప్రధాన స్టాక్ ఎక్సే్చంజీల్లో ఒకటైన ఎన్ఎస్ఈ బుధవారం ట్రేడర్లకు చెమట్లు పట్టించింది. సాంకేతిక సమస్య కారణంగా ఎన్ఎస్ఈలో దాదాపు రోజంతా ట్రేడింగ్ నిల్చిపోయింది. ఎఫ్అండ్వో ఎక్స్పైరీకి సరిగ్గా ముందు రోజు ఇలా జరగడంతో ట్రేడింగ్ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. టెక్నికల్ సమస్య పరిష్కారమయ్యాక చివర్లో అసాధారణంగా ట్రేడింగ్ వేళలు సాయంత్రం అయిదింటి దాకా పొడిగించడం కొంత ఊరటనిచ్చింది. టెలికం కనెక్టివిటీపరమైన అంశాలే సాంకేతిక సమస్యలకు కారణమంటూ ఎన్ఎస్ఈ పేర్కొనగా.. దీనిపై సమగ్రంగా వివరణ ఇవ్వాలంటూ ఎక్సే్చంజీని సెబీ ఆదేశించింది. ఏం జరిగిందంటే... నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్ఎస్ఈ) మరోసారి సాంకేతిక లోపాలతో కుదేలైంది. బుధవారం ఉదయం దాదాపు 10 గం.ల ప్రాంతంలో నిఫ్టీతో పాటు ఇతర ఎన్ఎస్ఈ సూచీల టికర్లు సరిగ్గా పనిచేయడం లేదంటూ డీలర్లు ఫిర్యాదు చేయడంతో సమస్య వెలుగులోకి వచ్చింది. చివరికి సాంకేతిక సమస్యల కారణంగా క్యాష్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగాల్లో ట్రేడింగ్ నిలిపివేస్తున్నట్లు 11.40 గం.లకు ఎన్ఎస్ఈ వెల్లడించింది. ఆ తర్వాత సాయంత్రం 3.30 గం.ల దాకా ట్రేడింగ్ నిల్చిపోయింది. గురువారంతో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టుల మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉండటంతో ట్రేడర్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో అసాధారణంగా ట్రేడింగ్ వేళలను పొడిగించారు. సాధారణ ట్రేడింగ్ సమయం సాయంత్రం 3.30 గం.లకు ముగిసిపోయాక 3.45 గం.ల నుంచి ట్రేడింగ్ మళ్లీ ప్రారంభమై సాయంత్రం 5 దాకా సాగింది. దీనికనుగుణంగా బీఎస్ఈ, మెట్రోపాలిటన్ ఎక్సే్చంజీ ఆఫ్ ఇండియా ట్రేడింగ్ వేళలను కూడా సాయంత్రం 5 దాకా పొడిగించారు. కనెక్టివిటీ సమస్యలే కారణం.. టెలికం కనెక్టివిటీపరమైన అంశాలే సాంకేతిక సమస్యకు కారణమని ఎన్ఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఎన్ఎస్ఈకి రెండు సర్వీస్ ప్రొవైడర్ల నుంచి అనేక టెలికం లింకులు ఉన్నాయి. తమ టెలికం లింకుల్లో సమస్యలు ఉన్నాయంటూ అవి మాకు సమాచారం ఇచ్చాయి. ఇది ఎన్ఎస్ఈ సిస్టమ్పై ప్రతికూల ప్రభావం చూపింది‘ అని వివరించింది. వివరణ కోసం సెబీ ఆదేశం.. ఎన్ఎస్ఈలో సాంకేతిక లోపాల వ్యవహారాన్ని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తీవ్రంగా పరిగణించింది. కనెక్టివిటీ సమస్యలు తలెత్తుతున్నప్పుడు ట్రేడింగ్ను డిజాస్టర్ రికవరీ సైట్కు ఎందుకు మళ్లించలేదని ప్రశ్నించింది. సత్వరం దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. అలాగే, ’ట్రేడింగ్ హాల్ట్’కి మూలకారణాలపై కూలంకషంగా అధ్యయనం చేయాలని సూచించింది. అనూహ్య సమస్యలు తలెత్తినప్పుడు కార్యకలాపాలపై ప్రభావం పడకుండా ప్రత్యామ్నాయంగా డిజాస్టర్ రికవరీ సిస్టమ్ ఉపయోగపడుతుంది. ఇక ఎన్ఎస్ఈ వర్గాలతో కలిసి పరిస్థితిని సమీక్షించిన ట్లు సెబీ అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిణామాలను మార్కెట్ వర్గాలకు తెలియజేయాలంటూ ఎన్ఎస్ఈకి సూచించినట్లు పేర్కొన్నారు. ఇదే మొదటిసారి కాదు.. ఎన్ఎస్ఈ ఇలా సాంకేతిక సమస్యలు ఎదుర్కొనడం ఇదే తొలిసారి కాదు. 2020 జూన్లో బ్యాంక్ ఆప్షన్ సెగ్మెంట్ ధరలు ఎక్సే్చంజీలోని టెర్మినల్లో ప్రతిఫలించలేదు. 2019 సెప్టెంబర్లో.. ట్రేడింగ్ చివర్లో సిస్టమ్ పనిచేయలేదు. 2017లోనూ ఇలాంటి సమస్యే వచ్చి దాదాపు 5 గంటల పాటు ట్రేడింగ్ ఆగిపోయింది. దీంతో ప్రత్యామ్నాయ ప్రణాళికలను పటిష్టం చేసుకోవాలంటూ అప్పట్లోనే ఎన్ఎస్ఈకి సెబీ గట్టిగా ఆదేశాలు ఇచ్చింది. కానీ నాలుగేళ్లు తిరగకుండానే ఎన్ఎస్ఈ మళ్లీ అలాంటి సమస్యలోనే చిక్కుకుంది. బీఎస్ఈలో యథావిధిగా ట్రేడింగ్.. ఎన్ఎస్ఈ డౌన్ అయినప్పటికీ బీఎస్ఈలో యథావిధిగానే పనిచేసింది. అయితే, బ్రోకర్లంతా పొలోమంటూ బీఎస్ఈకి మళ్లడంతో ట్రేడింగ్ వాల్యూమ్ .. రోజువారీ సాధారణ స్థాయికన్నా తొమ్మిది రెట్లు పైగా పెరిగింది. ట్రేడర్లు తమ పొజిషన్లను స్క్వేర్ ఆఫ్ చేసుకునేందుకు హడావుడి పడటంతో సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. కొన్ని స్టాక్స్ హఠాత్తుగా లోయర్ సర్క్యూట్లకు కూడా పడిపోయాయంటూ పలువురు ట్రేడర్లు తెలిపారు. తాము తీసుకున్న పొజిషన్ల పరిస్థితి ఏమిటన్నది తెలియక వారిలో గందరగోళం నెలకొంది. మిగతా దేశాల్లోనూ... ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లోని ఎక్సే్చంజీల్లోనూ గతంలో ఇలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఆస్ట్రేలియా సెక్యూరిటీస్ ఎక్సే్చంజ్ (2020) ట్రేడింగ్ సిస్టమ్ను అప్డేట్ చేసిన తర్వాత ఒక్కసారిగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో స్థానిక సమయం ప్రకారం ఉదయం 10.24 గం.లకు ట్రేడింగ్ ఆగిపోయింది. సమస్య పరిష్కారం కాకపోవడంతో మిగతా రోజంతా కూడా నిలిపివేశారు. టోక్యో స్టాక్ ఎక్సే్చంజ్ (2020) మార్కెట్ వివరాలను రిలే చేసే హార్డ్వేర్లో సమస్యలు తలెత్తడంతో స్థానిక సమయం ప్రకారం ఉదయం 9 గం.లకు ట్రేడింగ్ నిల్చిపోయింది. బ్యాకప్ వ్యవస్థ కూడా విఫలం కావడంతో మిగతా రోజంతా కూడా ట్రేడింగ్ సాగలేదు. న్యూయార్క్ స్టాక్ ఎక్సే్చంజ్ (2018) సాంకేతిక సమస్యల కారణంగా అమెజాన్, ఆల్ఫాబెట్ సహా అయిదు దిగ్గజ కంపెనీల షేర్లలో పూర్తి రోజంతా ట్రేడింగ్ నిలిపివేశారు. న్యూయార్క్ స్టాక్ ఎక్సే్చంజ్ (2015) చాలా భారీ సాంకేతిక లోపం తలెత్తడంతో అన్ని షేర్లలో ట్రేడింగ్ నిల్చిపోయింది. దాదాపు నాలుగు గంటల పాటు ఈ పరిస్థితి కొనసాగింది. అంతర్గతంగా సాంకేతిక సమస్య ఇందుకు కారణమంటూ ఎన్వైఎస్ఈ తెలిపింది. లండన్ స్టాక్ ఎక్సే్చంజ్ (2008) సాంకేతిక సమస్య కారణంగా దాదాపు రోజంతా ట్రేడింగ్ నిల్చిపోయింది. మార్కెట్ ప్రారంభమైన అరగంట తర్వాత అమ్మడానికి, కొనడానికి షేర్ల ధరలు కనిపించడం లేదంటూ ట్రేడర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ట్రేడింగ్ నిలిపివేశారు. దాదాపు 7 గంటల తర్వాత ముగింపు సమయానికి అరగంట ముందు తిరిగి ప్రారంభమైంది. మళ్లీ 52 వేల పైకి సెన్సెక్స్ ముంబై: నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీలో నెలకొన్న సాంకేతిక అంతరాయం దేశీయ మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేయలేకపోయింది. ఆర్థిక రంగ షేర్లు రాణించడంతో బుధవారం మార్కెట్ భారీ లాభాలను మూటగట్టుకుంటుంది. సెన్సెక్స్ 1,030 పాయింట్లు పెరిగి తిరిగి 50 వేల పైన 50,782 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇంట్రాడేలో 15 వేల స్థాయిని అందుకున్నప్పటికీ.., ఈ స్థాయిని నిలుపుకోవడంలో విఫలమైంది. చివరకు 274 పాయింట్లు లాభంతో 14,982 వద్ద నిలిచింది. మొదటి సెషన్లో సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. సాంకేతిక అంతరాయం తొలగి మార్కెట్ తిరిగి ప్రారంభమైన తర్వాత ఒక్క ఐటీ తప్ప అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సూచీలు దూసుకెళ్లాయి. నేడు (గురువారం) ఎఫ్అండ్ఓ ముగింపు నేప«థ్యంలో ట్రేడర్లు షార్ట్ కవరింగ్తో పాటు తమ పోజిషన్లను రోలోవర్ చేసుకోవడంతో సూచీలు ర్యాలీ చేసినట్లు నిపుణులు తెలిపారు. ప్రభుత్వ అధికారిక లావాదేవీలు, పన్నుల వసూళ్లకు సంబంధించి ప్రభుత్వ బ్యాంకులతో పాటు ఇకపై అన్ని ప్రైవేటు బ్యాంకులనూ అనుమతిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా బ్యాంకింగ్ రంగ షేర్లు భారీగా లాభపడ్డాయి. సంపద రూ.2.60 లక్షల కోట్లు అప్ మార్కెట్ 2% లాభంతో ఇన్వెస్టర్లు రూ.2.60 కోట్లు ఆర్జించారు. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపద భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.203 లక్షల కోట్లకు చేరింది. -
కరోనా వేళ.. క్రిస్మస్ ఎలా..!
క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల ఉత్సాహం కరోనా పుణ్యమా అని మసకబారుతోంది. ఒకపక్క ఈ మహమ్మారికి టీకా అందుబాటులోకి వచ్చిందని సంతోషించేలోగానే, కొత్త రూపు సంతరించుకొని దాడి చేయడం ఆరంభించింది. దీంతో పలు దేశాలు క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నాయి. కొన్ని దేశాలు కఠినమైన నిబంధనలు అమల్లోకి తీసుకురాగా, కొన్ని దేశాలు తేలికపాటి ఆంక్షలు తెచ్చాయి. ప్రజలు సమూహంగా గుమిగూడటం నుంచి విందు భోజనాల వరకు అనేక అంశాలపై పరిమితులు విధించాయి. నూతన సంవత్సర వేడుకల్లో కొత్తరూపంలో కరోనా దాడి చేయకుండా దేశాల మధ్య ప్రయాణాలపై నిషేధాజ్ఞలు పెరిగాయి. యూరప్ దేశాలైతే దాదాపు భయం గుప్పిట్లోకి జారాయి. ఆయా దేశాల వాతావరణ, భౌగోళిక, సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఆంక్షలు విధించుకున్నాయి. –లండన్ బ్రిటన్లో షట్డౌన్ నిన్నమొన్నటి వరకు క్రిస్మస్ సమయంలో ఆంక్షలన్నీ రద్దు చేయాలని బ్రిటన్ భావించింది. వ్యాక్సినేషన్ కూడా ఆరంభించింది. అయితే ఒక్కమారుగా కొత్త స్ట్రయిన్ బయటపడడంతో ఉలిక్కిపడింది. ప్రస్తుతం పాత ప్లాన్లన్నీ రద్దు చేసి పలు ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐలాండ్ల్లో వివిధ రూపాల్లో లాక్డౌన్ను పునఃప్రారంభించారు. లండన్లోనైతే ఇంట్లో కూడా సామూహిక వేడుకలు వద్దని ప్రభుత్వం తేల్చిచెప్పింది. మరోవైపు డజన్ల కొద్దీ దేశాలు బ్రిటన్కు విమానాలు నిలిపివేశాయి. లెబనాన్ తీరేవేరు ఆర్థికంగా కూనారిల్లుతున్న ఎకానమీని గట్టెక్కించడానికి విదేశీ మారక ద్రవ్యార్జనే మార్గమని భావించిన లెబనాన్ చాలా ఆంక్షలు ఎత్తివేసింది. నైట్క్లబ్బులు తెరిచిఉంచేందుకు అనుమతినిచ్చింది. అయితే క్లబ్బుల్లో డ్యాన్సులను నిషేధించింది. అమెరికాలోరాష్ట్రాలదే నిర్ణయం అమెరికా ప్రభుత్వం దేశవ్యాప్తం ప్రయాణాలపై జాతీయ స్థాయిలో నిషేధం విధించలేదు. ఆయా రాష్ట్రాలే ఈ విషయంపై నిర్ణయం తీసుకునే వీలు కల్పించింది. కానీ వీలయినంత వరకు ఇంట్లోనే ఉండమని ప్రజలకు సూచించింది. దక్షిణాఫ్రికాలో మందు బం§Š క్రిస్మస్ రోజు దేశంలో మందు అమ్మకాలను దక్షిణాఫ్రికా నిలిపివేసింది. దేశంలో పలు చోట్ల నైట్కర్ఫ్యూ విధించింది. క్రిస్మస్, న్యూఇయర్ రోజును బీచ్లు మూసివేస్తున్నట్లు తెలిపింది. సామూహికంగా తిరగవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇంట్లో మాత్రం 100 మంది వరకు కలుసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే కొన్ని దేశాలు దక్షిణాఫ్రికాకు విమానాలు నిలిపివేస్తున్నాయి. బ్రెజిల్లో మీ ఇష్టం ఆది నుంచి కరోనాపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బోల్సెనారో ప్రభుత్వం క్రిస్మస్ సమయంలో ఎలాంటి కొత్త ఆంక్షలు లేవని తెలిపింది. సోపౌలో నగర గవర్నర్ మాత్రం స్వల్ప ఆంక్షలు విధించారు. సోపౌలో, రియో, సాల్వ డార్లో డిసెంబర్ 31న బాణసంచా కాల్చడాన్ని నిలిపివేశారు. జర్మనీలో పాటలు నిషిద్ధం వచ్చే నెల 10వరకు కొత్త ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 24–26 మధ్య మాత్రం స్వల్ప సడలింపులుంటాయని తెలిపింది. మ తపరమైన సమావేశాలు జరపవచ్చని, కానీ పాటలు మాత్రం నిషిద్ధమని తెలిపింది. ఇతర దేశాల్లో... ► పెరూలో క్రిస్మస్ రోజు కారు డ్రైవింగ్ను నిషేధించారు. ► ఫ్రాన్స్లో సామూహిక విందు భోజనాల్లో పాల్గొనేవారి సంఖ్యను ఆరుకు పరిమితం చేశారు. వచ్చే నెల వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లోకి తెచ్చారు. ► చిలీలో విందు భోజనాలకు 15మంది వరకు అనుమతినిస్తున్నారు. ► ఇటలీలో వచ్చే రెండువారాల వరకు ప్రయాణాలు నిషేధించారు. ► పోర్చుగల్లో క్రిస్మస్కు కొంతమేర సడలింపులిచ్చి న్యూఇయర్కు కఠిన ఆంక్షలు విధించనున్నారు. ► స్పెయిన్లో స్వల్ప సడలింపులతో వేడుకలకు అనుమతించారు. ► దక్షిణ కొరియాలో వచ్చే నెల 3వరకు ఐదుగురి కన్నా ఎక్కువమంది గుమిగూడడంపై ఆంక్షలు తెచ్చారు. ► రష్యాలో వచ్చేనెల 15వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. -
25న షట్డౌన్కు రైతు సంఘాల పిలుపు
అమృత్సర్ : వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించిన నేపథ్యంలో పంజాబ్, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈనెల 25న పంజాబ్ షట్డౌన్కు 31 రైతు సంఘాలు పిలుపు ఇచ్చాయి. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ అమృత్సర్లో రైలు పట్టాలపై కూర్చుని రైల్ రోకో ఆందోళనకు శ్రీకారం చుట్టాయి. అమృత్సర్తో పాటు ఫిరోజ్పూర్లోనూ రైతులు రైల్ రోకోలో పాల్గొని రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని, బిల్లులకు అనుకూలంగా ఓటు వేసిన వారిని బాయ్కాట్ చేయాలని రైతు సంఘాల నేతలు పిలుపు ఇచ్చారు. బర్నాలా, సంగ్రూర్లో భారతీయ కిసాన్ యూనియన్ కార్యకర్తలు రైలు పట్టాలపై ఆందోళన చేపట్టారు. ఇక రైతుల ఆందోళనతో ప్రత్యేక రైళ్లను రైల్వేలు రద్దు చేశాయి. మూడు రోజుల పాటు 14 ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్టు రైల్వేలు ప్రకటించాయి. ప్రయాణీకుల భద్రత, రైల్వే ఆస్తుల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. కాగా వ్యవసాయ బిల్లులు పార్లమెంట్ ఆమోదం పొందడంతో కనీస మద్దతు ధర వ్యవస్ధ కుప్పకూలుతుందని, బడా కార్పొరేట్ వ్యాపారుల దయాదాక్షిణ్యాలపై తాము ఆధారపడాల్సి వస్తుందనే భయం పంజాబ్ రైతులను వెంటాడుతోంది. మరోవైపు వ్యవసాయ బిల్లులతో రైతాంగానికి మేలు జరుగుతుందని, కనీస మద్దతు ధర విధానం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం రైతులకు భరోసా ఇస్తోంది. చదవండి : బిల్లులపై రైతుల ఆందోళన ఎందుకు ?! -
పబ్లకు తాళం వేయకుంటే..
బెంగళూర్ : పబ్లు యువతను నాశనం చేస్తున్నాయని దక్షిణ కన్నడ జిల్లాలో పబ్లన్నింటినీ మూసివేయాలని కర్ణాటక బీజేపీ చీఫ్ నళిన్ కుమార్ కతీల్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో వీటిపై న్యాయపరమైన చర్యలు చేపట్టాలని తాను తమ పార్టీ యువజన విభాగాన్ని కోరతానని ఆయన స్పష్టం చేశారు. కతీల్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పబ్లు, క్లబ్లు యువతను నాశనం చేస్తున్నాయని దక్షిణ కన్నడ జిల్లాలో వీటిని మూసివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుంటే న్యాయస్ధానాలను ఆశ్రయించాలని పార్టీ యువజన విభాగాన్ని కోరతానని చెప్పుకొచ్చారు. కరోనా కట్టడికి విధించిన సుదీర్ఘ లాక్డౌన్ అనంతరం అన్లాక్ 4 మార్గదర్శకాలకు అనుగుణంగా కర్ణాటకలో బార్లు, రెస్టారెంట్లు తెరుచుకున్న నేపథ్యంలో కతీల్ ఈ వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 1 నుంచి మద్యం విక్రయాలకు అనుమతించడంతో కర్ణాటకలోని పబ్లు, క్లబ్ల్లో మద్యం అమ్మకాలు విపరీతంగా సాగుతున్నాయి. ఇక 9366 తాజా కరోనా వైరస్ కేసులతో కర్ణాటకలో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 5,00,000కు చేరువైంది. ఇక మరణాల సంఖ్య 7629కి ఎగబాకింది. బెంగళూర్ నగరంలోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,84,082కు ఎగబాకింది. చదవండి : దొరికాడ్రా కొడుకు, ఉతుకుడే ఉతుకుడు! -
టిక్టాక్ : ట్రంప్ తాజా డెడ్లైన్
వాషింగ్టన్ : చైనాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా యాప్ ‘టిక్టాక్’ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెడ్ లైన్ ఫిక్స్ చేశారు. అమెరికాకు చెందిన ఏదైనా కంపెనీకి విక్రయించాలని, లేనట్లయితే ఆ యాప్ను తమ దేశంలో నిషేధిస్తామని ఇప్పటికే స్పష్టం చేసిన ఆయన తాజాగా మరో హెచ్చరిక జారీ చేశారు. (మైక్రోసాఫ్ట్ ‘టిక్టాక్’ షో!) టిక్ టాక్ అమెరికా కార్యకలాపాలను ఒక అమెరికన్ కంపెనీకి విక్రయించడానికి ఆరు వారాల గడువు ఇచ్చారు. సెప్టెంబర్ 15వ తేదీ లోపు ఏదో ఒకటి తేల్చుకోవాలని లేదంటే నిషేధం తప్పదని స్పష్టం చేశారు. మైక్రోసాఫ్ట్ , లేదా మరో పెద్ద సంస్థ ఏదైనా తనకు అభ్యంతరం లేదు కానీ సురక్షితమైన అమెరికన్ సంస్థ కావాలి అని ట్రంప్ అన్నారు. భద్రతతో తమకు ఎటువంటి సమస్య ఉండకూడదని తెలిపారు. అలాగే ఈ ఒప్పందం నుండి ప్రభుత్వం ఆర్థిక ప్రయోజనం కోరుకుంటుందని చెప్పారు. మరోవైపు టిక్ టాక్ ను కొనుగోలు చేయనున్నట్టు ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ప్రకటించింది. దీనికి సంబంధించిన చర్చలను సెప్టెంబర్ 15 కల్లా పూర్తి చేస్తామని, సమాచార భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కరోనా : వజ్రాల పరిశ్రమ మూసివేత
అహ్మదాబాద్ : సూరత్లోని వజ్రాల పరిశ్రమలో కరోనా కేసులు అంతకంతకూ పెరుతూనే ఉన్నాయి. దీంతో ఆయా సంస్థలను మూసివేయాలని శనివారం సూరత్ మునిసిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసి) తెలిపింది. మిగతా సిబ్బంది కూడా 14 రోజుల పాటు ఇంట్లోనే క్వారంటైన్లో ఉండాలని సూచించింది. దేశంలోని అతిపెద్ద డైమండ్ కటింగ్, పాలిషింగ్ హబ్లుగా పేరున్న సూరత్లోని వజ్రాల పరిశ్రమలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. (‘పిల్ల’ దొరికిందని 1.55లక్షలు అప్పు ఇస్తే.. ) గత మూడు రోజుల్లోనే ఎనిమిది డైమండ్ యూనిట్లలో 23 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఈ ఎనిమిది యూనిట్లను మూసివేస్తున్నట్లు ఎస్ఎంసి డిప్యూటీ మునిసిపల్ కమిషనర్ ఆశిష్ నాయక్ శనివారం తెలిపారు. అంతేకాకుండా సామాజిక దూరం పాటించని యూనిట్లకు ఒక్కొక్కరికి రూ. 10,000 జరిమానా విధించారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి సామాజిక దూరం, ఫేస్ మాస్క్ , శానిటైజేషన్ లాంటి నిబంధనలు పాటిస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు వజ్రాల యూనిట్లను తనిఖీ చేస్తామని పేర్కొన్నారు. సూరత్లో సుమారు 6,000 డైమండ్ యూనిట్లు ఉండగా, దాదాపు 6.5 లక్షలమంది కార్మికులు పనిచేస్తుంటారు. జూన్ 1న పరిశ్రమలు తెరిచేందుకు కేంద్రం అనుమతివ్వడంతో తిరిగి పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఈ యూనిట్లలో 2 నుంచి 2.25 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. (సరిహద్దులో పాక్ కవ్వింపు చర్యలు..) -
3 జిల్లాల్లో షట్డౌన్ ఎత్తివేత: డీజీపీ
ఒడిశా, భువనేశ్వర్: రాష్ట్రంలోని 3 జిల్లాల్లో షట్డౌన్ ఎత్తివేస్తున్నట్లు డీజీపీ(డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) అభయ్ ఆదివారం ప్రకటించారు. ఉదయం నుంచే జాజ్పూర్, భద్రక్, బాలాసోర్ జిల్లాల్లో కొనసాగుతున్న షట్డౌన్ తొలగించినట్లు ఆయన పేర్కొన్నారు. కరోనా పాజిటివ్ రోగుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగిపోవడంతో ఆయా ప్రాంతాల్లో 60 గంటల షట్డౌన్కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అసిత్కుమార్ త్రిపాఠి నుంచి ఉత్తర్వులు అందాయని, ఈ మేరకు గురువారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు షట్డౌన్ అమలు చేసినట్లు ఆయన వివరించారు. అయితే షట్డౌన్ కాల వ్యవధిలో ప్రజల నుంచి అందిన సహకారం మరువలేనిదని డీజీపీ సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఆయా ప్రాంతాల్లో లాక్డౌన్ మాత్రం యథాతథంగా కొనసాగుతుందని ఆయన తెలిపారు. లోగడ జారీచేసిన నిబంధనలకు అనుగుణంగా ప్రజలంతా భౌతికదూరం పాటిస్తూకరోనా నియంత్రణకు సహకరించాలని పిలుపునిచ్చారు. -
చైనా ఆర్థిక వ్యవస్థకు 6.8 శాతం నష్టం
బీజింగ్ : చైనాలో కరోనా వైరస్ కారణంగా దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోవడంతో ఆర్థిక వ్యవస్థకు గతేడాదితో పోలిస్తే జీడీపీలో 6.8 శాతం నష్టం వాటిల్లింది. మార్చి నెల నాటికి త్రైమాసిక ఫలితాలు వెలువడడంతో ఈ నష్టం వివరాలు స్పష్టమయ్యాయని అధికార వర్గాలు శుక్రవారం తెలిపాయి. దేశంలో మార్కెట్ తరహా ఎకానమీ విధానాలు ప్రవేశపెట్టిన 1979 సంవత్సరం నుంచి ఇంతటి నష్టం వాటిల్లడం ఇదే మొదటి సారి. దేశంలోని వుహాన్ పట్టణంలో ఉద్భవించిన కరోనా వైరస్ కట్టడికి చైనా అంతట లాక్డౌన్ ప్రకటించడం, పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, మాల్స్,మార్కెట్లను మూసివేసిన విషయం తెలిసిందే. (భార్యలను వేధించే భర్తలకు షాక్..) దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు జరిగే నష్టాన్ని ముందే ఊహించిన చైనా, ఒక్క వుహాన్లో మినహా మార్చి నెలలోనే లాక్డౌన్ ను పూర్తిగా ఎత్తివేసింది. దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మూడో వారం లేదా నాలుగోవారంలో కోలుకుంటుందని భావిస్తున్నట్లు బీజీంగ్లోని రుషి ఫైనాన్స్ ఇనిస్టిట్యూట్కు చెందిన ఝూ జెక్క్సిన్ తెలిపారు.దీంతో పెట్టుబడిదారుల్లో కొత్త ఆశలు చిగురించడంతో ఈ రోజు ఆసియా స్టాక్ మార్కెట్ లాభాల దిశగా దూసుకుపోయింది. చైనా రిటేల్ అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 19 శాతం పడిపోగా, ఎప్పుడూ వద్ధి రేటును మూటగట్టుకునే ఫ్యాక్టరీల్లో పెట్టుబడులు, రియల్ ఎస్టేట్, ఫిక్స్›్డలతో కూడిన ప్రధాన రంగం 16.1 శాతం పడి పోయింది. మరో పక్క పర్యాటక రంగం కూడా దెబ్బతిన్నది. సినిమాలు, హేర్ సాలూన్లు, ఇతర వినోద కార్యకలాపాలు ఇప్పటికీ నిలిచిపోయే ఉన్నాయి. చైనాలో మొత్తం కరోనా వైరస్ బారిన 82,367 మంది పడగా, 3,342 మంది మరణించారు. -
కరోనా దెబ్బకు గ్లోబ్ షట్ డౌన్
-
వాహనాల తయారీకి వైరస్ బ్రేక్..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధక చర్యల్లో భాగంగా ఆటోమొబైల్ దిగ్గజాలు ఉత్పత్తి కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయి. ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) గురుగ్రామ్, మానెసర్లోని (హరియాణా) తమ ప్లాంట్లలో తక్షణం ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఈ రెండు ప్లాంట్లలో ఏటా 15.5 లక్షల వాహనాలు ఉత్పత్తవుతాయి. అటు రోహ్తక్లోని పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని కూడా మూసివేస్తున్నట్లు పేర్కొంది. షట్డౌన్ ఎన్నాళ్ల పాటు ఉంటుందనేది ప్రభుత్వ విధానంపై ఆధారపడి ఉంటుందని వివరించింది. అటు హోండా కార్స్ ఈ నెలాఖరు దాకా తమ రెండు ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. తప్పనిసరి సర్వీసుల విభాగాల సిబ్బంది మినహా మిగతా ఉద్యోగులంతా ఇళ్ల నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తారని హెచ్సీఐఎల్ ప్రెసిడెంట్ గకు నకానిషి తెలిపారు. మరోవైపు, మహీంద్రా అండ్ మహీంద్రా కూడా మహారాష్ట్రలోని ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నాగ్పూర్ ప్లాంట్లో ఇప్పటికే ఆపివేశామని, చకన్ (పుణే), కాండివిలి (ముంబై) ప్లాంట్లలో సోమవారం నుంచి నిలిపివేస్తామని పేర్కొంది. అటు ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ సైతం తమ ప్లాంట్లో ఈ నెలాఖరుదాకా ఉత్పత్తి కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఎంజీ మోటార్ ఇండియా సంస్థ గుజరాత్లోని హలోల్ ప్లాంటును మార్చి 25 దాకా మూసివేస్తున్నట్లు తెలిపింది. ఇతర దేశాల్లోనూ..: హీరో మోటోకార్ప్ ఉద్యోగుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్తో పాటు కొలంబియా, బంగ్లాదేశ్ తదితర విదేశీ ప్లాంట్లలో కూడా కార్యకలాపాలు తక్షణమే నిలిపివేస్తున్నట్లు ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ వెల్లడించింది. మార్చి 31 దాకా ఇది అమలవుతుందని పేర్కొంది. జైపూర్లోని సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ సహా ఇతర ప్రాంతాల్లోని ఉద్యోగులు నివాసాల నుంచే విధులు నిర్వర్తిస్తారని వివరించింది. అత్యవసర సర్వీసుల సిబ్బంది మాత్రమే కార్యాలయాలకు హాజరవుతారని పేర్కొంది. హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) భారత్లోని మొత్తం నాలుగు ప్లాంట్లలోనూ కార్యకలాపాలు తక్షణమే నిలిపివేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. మహీంద్రా ఫండ్... మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కొద్ది వారాల పాటు లాక్డౌన్ చేయాలంటూ ప్రతిపాదించారు. పెద్ద ఎత్తున తాత్కాలిక ఆస్పత్రుల ఏర్పాటు అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం, ఆర్మీకి తమ గ్రూప్ ప్రాజెక్ట్ టీమ్ పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సిద్దమని చెప్పారు. ‘మా మహీంద్రా హాలిడేస్ సంస్థ తరఫున రిసార్ట్లను తాత్కాలిక వైద్య కేంద్రాలుగా మార్చి, సేవలు అందించేందుకు కూడా సిద్ధం‘ అని ఆనంద్ మహీంద్రా తెలిపారు. వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉన్నందున.. తమ ప్లాంట్లలో వాటి తయారీపై తక్షణం కసరత్తు ప్రారంభించామని తెలిపారు. అత్యంత ప్రతికూల ప్రభావాలెదుర్కొనే చిన్న వ్యాపార సంస్థలు, స్వయం ఉపాధి పొందేవారికి తోడ్పాటు అందించేందుకు మహీంద్రా ఫౌండేషన్ ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తుందని మహీంద్రా చెప్పారు. తన పూర్తి వేతనాన్ని ఫండ్కు విరాళమిస్తున్నట్లు.. ఇతర ఉద్యోగులు స్వచ్ఛందంగా విరాళమివ్వొచ్చన్నారు. -
కరోనా పరిణామాలే కీలకం..!
న్యూఢిల్లీ: కోవిడ్–19 (కరోనా) వైరస్ ధాటికి ప్రపంచం దాదాపుగా స్తంభించిపోయింది. దేశాలకు దేశాలు షట్డౌన్ ప్రకటిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో పడిపోయింది. వైరస్ వ్యాప్తి వేగం తగ్గకపోతే ఎకానమీ మాంద్యంలోకి జారిపోయే ప్రమాదం ఉందని ఆర్థిక వేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం కరోనా వైరస్ పరిణామాలు మాత్రమే ఈ వారంలో దేశీ స్టాక్ మార్కెట్కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. వైరస్ విస్తృతి ఆధారంగానే ఈ వారంలో సూచీల కదలికలు ఉండనున్నాయని మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ విశ్లేషకులు చందన్ తపారియా అన్నారు. మార్కెట్లో ఒడిదుడుకులను సూచించే వోలటాలిటీ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) జీవితకాల గరిష్టస్థాయికి చేరినందున భారీ హెచ్చుతగ్గులకు అవకాశం ఉందని విశ్లేషించారు. వైరస్ ఇబ్బందుల దృష్ట్యా వీలైనంత త్వరలో ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇవ్వడం వంటి ఆశాజనక వార్తలు రిలీఫ్ ర్యాలీకి ఆస్కారం ఇచ్చినప్పటికీ.. వైరస్ వ్యాప్తి అంశమే అత్యంత కీలకంకానుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. మార్చి సిరీస్ ముగింపు ఈవారంలోనే.. గురువారం (26న) మార్చి నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్ అండ్ ఓ) సిరీస్ ముగియనుంది. ఈ సిరీస్లో సూచీలు 35 శాతం నష్టపోయాయి. వోలటాలిటీ 72 శాతానికి చేరుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో షార్ట్ రోలోవర్స్ కొనసాగుతున్నాయని, నిఫ్టీ 7,800–8,000 పాయింట్ల స్థాయికి పడిపోతే ట్రేడర్లు పొజిషన్లను క్లోజ్ చేసే అవకాశం ఉందని ఐసీఐసీఐ డైరెక్ట్ అనలిస్ట్ అమిత్ గుప్తా విశ్లేషించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు పెరిగితే సూచీలు కుప్పకూలి పోతాయని చెప్పడంలో సందేహం లేదని ట్రేడింగ్బెల్స్ సీనియర్ అనలిస్ట్ సంతోష్ మీనా వ్యాఖ్యానించారు. మరణాలు ఆగితేనే మార్కెట్ నిలబడుతుందని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అన్నారు. షార్ట్ సెల్లింగ్పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పరిమితులను విధించిన నేపథ్యంలో ఎఫ్ అండ్ ఓలోని 10–12 శాతం షేర్లపై ఈ ప్రభావం ఉందనుందని సామ్కో సెక్యూరిటీస్ అనలిస్ట్ జిమీత్ మోడీ అన్నారు. ఎక్సే్ఛంజీలు పనిచేస్తాయ్.. దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలు సోమవారం యథావిధిగా పనిచేస్తాయని సెబీ ప్రకటించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై షట్డౌన్లో ఉన్నప్పటికీ.. స్టాక్ ఎక్సే్ఛంజీలు, క్లియరింగ్ కార్పొరేషన్లు, డిపాజిటరీలు మాత్రం పనిచేస్తాయని స్పష్టంచేసింది. బోంబే స్టాక్ ఎక్సే్ఛంజ్లోని అన్ని విభాగాలు సోమవారం యథావిధిగా పనిచేస్తాయని బీఎస్ఈ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆశిష్కుమార్ చౌహాన్ ప్రకటించారు. నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ కూడా ఇదే ప్రకటన చేసింది. స్టాక్ బ్రోకర్లకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలభ్యం కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ఈ వైరస్ కారణంగా భారత్లో మృతిచెందిన వారి సంఖ్య ఇప్పటికే ఏడుకు చేరింది. ఇటువంటి పరిస్థితుల్లో స్టాక్ బ్రోకర్లకు ఇంటి వద్ద నుంచి పని చేసే సౌలభ్యం కల్పించినట్లు దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలు ప్రకటించాయి. ఈనెల 30 వరకు ఈ ఫెసిలిటీని ఇస్తున్నట్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు స్పష్టంచేశాయి. ఈ క్రమంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా బ్రోకర్ల వద్ద నుంచి వారి టెర్మినల్ లొకేషన్ల అడ్రస్లను సేకరిస్తున్నట్లు వివరించాయి. ఈ నెలలో రూ. లక్ష కోట్లు వెనక్కి.. భారత క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) ఈ నెల్లో రూ. 1,08,697 కోట్లను ఉపసంహరించుకున్నారు. డిపాజిటరీల డేటా ప్రకారం.. మార్చి 2–20 మధ్యలో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ. 56,248 కోట్లను, డెట్ మార్కెట్ నుంచి రూ. 52,449 కోట్లను వెనక్కు తీసుకున్నారు. కరోనా వైరస్ కారణం గా దేశీ మార్కెట్ల నుంచి ఎఫ్పీఐలు భారీ స్థాయిలో పెట్టుబడులను వెనక్కు తీసుకుంటున్నారని మార్నింగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సీనియర్ అనలిస్ట్ హిమాన్షు శ్రీవాస్తవ విశ్లేషించారు. -
కరోనా ఎఫెక్ట్: దేశంలో తొలిసారి ఓ రాష్ట్రం షట్డౌన్
జైపూర్: కరోనా వైరస్ పంజా విసురుతున్న వేళ దేశంలో తొలిసారిగా ఒక రాష్ట్రం పూర్తిగా షట్ డౌన్ అయింది. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా రాజస్థాన్ రాష్ట్రాన్ని మార్చి 31 వరకు షట్ డౌన్ చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శనివారం ప్రకటించారు. దీంతో దేశంలో కరోనా వైరస్ ప్రభావంతో పూర్తిగా నిర్బంధంలోకి వెళ్లిన తొలి రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. ప్రజలందరూ పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వానికి సహకరించాలని సీఎం అశోక్ గెహ్లాట్ కోరారు. శనివారం అర్ధరాత్రి నుంచి రవాణా వ్యవస్థను కూడా పూర్తిగా నిలిపివేస్తున్నట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి ప్రకటించారు. చదవండి: జనతా కర్ఫ్యూ: ఆ 14 గంటలు ఏం జరగబోతుంది? అత్యవసర సేవలు తప్ప అన్నీ బంద్ అవుతాయని స్పష్టం చేశారు. పేదలకు ఆహార పొట్లాలు సరఫరా చేస్తామని వెల్లడించారు. ఇందుకోసం ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013 ప్రకారం అర్హులైన వారందరికీ గోధుమలను ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఈ మహమ్మారిని నివారించే క్రమంలో తీసుకున్న చర్యలకు మీ అందరి సహకారం కావాలి. ప్రజలు ఇళ్లకే పరిమితమై ఉండటం కరోనా వైరస్ నియంత్రణలో అతి ముఖ్యమైన చర్య’ అని అశోక్ గెహ్లాట్ అన్నారు. కాగా.. రాజస్థాన్లో శనివారం కొత్తగా 6 కరోనా పాజిటవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 23కు పెరిగింది. చదవండి: తెలంగాణలో ప్రారంభమైన జనతా కర్ఫ్యూ -
కరోనా ఎఫెక్ట్ : సిలికాన్ వ్యాలీ షట్డౌన్
సాక్షి, కాలిఫోర్నియా : అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ వణికిస్తోంది. శుక్రవారానికి దాదాపు 11,500 కేసులు నమోదవడంతో దాదాపు సగం రాష్ట్రాల్లో ప్రజలను ఇళ్లకే పరిమితం చేశారు. భారతీయులు ముఖ్యంగా తెలుగువారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో భారతీయ దుకాణాలు మూసి ఉండటంతో నిత్యావసర వస్తువులు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిలికాన్ వ్యాలీగా పిలిచే శాన్ఫ్రాన్సిస్కో, శాన్జోస్ (కాలిఫోర్నియా) పూర్తిగా మూతపడింది. కొద్ది సంఖ్యలో వ్యాపార సంస్థలు తెరిచి ఉంటున్నా వాటిలో నిత్యావసర వస్తువులు దొర కడం లేదు. గూగుల్, ఫేస్బుక్, యాపిల్, అమెజాన్ సహా వందలాది కంపెనీల్లో పనిచేసే వేలాది మంది ఉద్యోగులు ఇళ్ల నుంచే విధులు నిర్వహిస్తున్నారు. (విదేశాల నుంచి వచ్చినవారు 69వేలు) ప్రజలు వీధుల్లోకి రావొద్దని హెచ్చరికలు ప్రపంచ వాణిజ్య కేంద్రాల్లో అగ్రగామి న్యూయార్క్ పూర్తిగా స్తంభించింది. పొరుగునే ఉన్న న్యూజెర్సీ, కనెక్టికట్ రాష్ట్రాల్లో ప్రజలను ఇళ్లకే పరిమితం చేశారు. న్యూయార్క్లో కేసులు పెరుగుతుండటంతో అధికా రులు ప్రజలను వీధుల్లోకి రావొద్దని హెచ్చరించారు. నైట్ క్లబ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. వాషింగ్టన్, ఫ్లోరిడా, ఇల్లినాయీ, షికాగో, లూసియానా, జార్జియా, టెక్సాస్ వంటి రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలను ఇళ్లకు పరిమితం చేయాలని స్థానిక ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రారంభ దశలో వాషింగ్టన్, న్యూయార్క్, కాలిఫోర్నియా రాష్ట్రాలకే పరిమితమైన వైరస్... ఇప్పుడు మరికొన్ని రాష్ట్రాలను తాకింది. అత్యధికంగా న్యూయార్క్లో 4,152 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి దాకా వాషింగ్టన్లో 1,228, కాలిఫోర్ని యాలో 1,044, న్యూజెర్సీలో 742 కేసులు నమోదయ్యాయి. న్యూజెర్సీలో ఒకే కుటుం బానికి చెందిన నలుగురు వైరస్ బారిన పడి మృతి చెందారు. వంద అంతకంటే ఎక్కువ కేసులు నమోదైన రాష్ట్రాల్లో విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, టెక్సాస్, కొలరాడొ, మసాచ్యూసెట్స్, లూసియానా, ఇల్లినాయీ, జార్జియా, ఫ్లోరిడా ఉన్నాయి. వాటిలో కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీలలో భారతీయులు అందులోనూ తెలుగువారు లక్షల్లో నివసిస్తున్నారు. నిత్యావసరాల కోసం భారీ క్యూలు... కరోనా వైరస్ దృష్ట్యా ఇళ్లకే పరిమితం కావాలని కాలిఫోర్నియా ప్రభుత్వం హెచ్చరించడంతో శాన్ఫ్రాన్సిస్కో, లాస్ఏంజిలెస్, శాన్జోస్ నగరాలు నిర్మానుష్యంగా మారాయి. భారతీయులు ఆధారపడే దుకాణాలు మూసి ఉండటంతో వేలాది మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరీ ఇబ్బందుల్లో ఉన్న వారి కుటుంబాలకు తోటి భారతీయులు తమ దగ్గర ఉన్న నిత్యావసరాల్లో కొన్నింటిని అంద జేస్తున్నారు. ఈ పరిస్థితి మారడానికి భారతీయ దుకా ణాలను తెరిపించాలని, అక్కడ నిత్యావసర వస్తువులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సిలికాన్ వ్యాలీ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు కాలిఫోర్నియా గవర్నర్ను కోరారు. న్యూజెర్సీలో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకొనేందుకు తెలుగు సంఘాలు ప్రత్యేక వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేశాయి. కాలిఫోర్నియాలోనూ ఈ తరహా గ్రూపులు ఏర్పాటు చేస్తున్నామని సిలికాన్ వ్యాలీ తెలుగు అసోసియేషన్కు చెందిన మందడి రాకేశ్రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. (జనతా కర్ఫ్యూని పాటించండి) జాగ్రత్తలు తప్పనిసరి... అమెరికాలో ఉండే తెలుగువారు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇళ్లకే పరిమితం కావాలని తెలుగు అసోసియేషన్లు విజ్ఞప్తి చేశాయి. నిత్యావసర వస్తువుల కోసం బయటకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాయి. భారతీయ స్టోర్లలో నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ తెలుగు సంఘాలు అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో దేశీయ, విదేశీ ప్రయాణాలు చేయొద్దని, 60 ఏళ్లకు పైబడిన భారతీయ తల్లిదండ్రులు ఇల్లు దాటి బయటకు రావద్దని నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ తరుణంలో స్వదేశానికి వెళ్లాలన్న ఆలోచన మానుకోవాలని సూచించింది. -
భారత్లో నాలుగో మరణం
న్యూఢిల్లీ: భారత్లో కరోనా మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. పంజాబ్కు చెందిన ఒక వ్యక్తి గురువారం కోవిడ్తో మృతి చెందాడు. ఆ వ్యక్తి వృద్ధుడని, అతడికి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా వైరస్ సోకినవారి సంఖ్య భారత్లో గురువారానికి 173కి చేరింది. ఇందులో 20కి పైగా కేసులు కొత్తగా నిర్ధారణ అయినవే. ఛత్తీస్గఢ్, చండీగఢ్ల్లో గురువారం తొలి కేసులు నమోదయ్యాయి. మార్చి 22 నుంచి వారం రోజుల పాటు అన్ని అంతర్జాతీయ విమానాలు భారత్లో దిగవద్దని కేంద్రం నిషేధం విధించింది. అత్యవసరంకాని సేవల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసుకునే వెసులుబాటు కల్పించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరింది. ప్రజా రవాణా బంద్ పలు రాష్ట్రాలు దాదాపు లాక్డౌన్ స్థాయిలో ఆంక్షలు విధించాయి. కశ్మీర్లోని శ్రీనగర్లో ప్రజా రవాణాను నిషేధించారు. పంజాబ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్పై నిషేధం విధించింది. రెస్టారెంట్లు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లను మూసేయాలని ఆదేశించింది. హోం డెలివరీ, టేక్ అవే సర్వీసులకు మాత్రం మినహాయింపునిచ్చింది. 20కి మించిన సంఖ్యలో ప్రజలు గుమికూడదని స్పష్టం చేసింది. ఢిల్లీ ప్రభుత్వం కూడా రెస్టారెంట్లు మూసేయాలని ఆదేశించింది. అత్యవసరంకాని విధులను వాయిదా వేసుకోవాలని అన్ని ప్రభుత్వ, స్వతంత్ర సంస్థలకు, పీఎస్యూలకు విజ్ఞప్తి చేసింది. అత్యవసరం కాని ప్రభుత్వ సేవలను కూడా శుక్రవారం నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలోని ప్రముఖ సుందర్ నగర్ మార్కెట్ను కూడా మూసేయాలని వ్యాపారులు నిర్ణయించారు. ముంబైలోని ప్రముఖ భోజన సరఫరాదారులైన ‘డబ్బావాలాలు’ కూడా తమ సేవలను శుక్రవారం నుంచి మార్చి 31 వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. భారత్లో కరోనా వైరస్ సోకిన 173 మందిలో 25 మంది విదేశీయులు ఉన్నారు. గురువారం నాటికి మహారాష్ట్రలో 45, కేరళలో 27, హరియాణాలో 17, కర్ణాటకలో 14, రాజస్తాన్లో 7, లద్దాఖ్లో 8 కేసులు నమోదయ్యాయి. పలు ఇతర రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ నుంచి రక్షణ పొందేందుకుగాను ప్రజలు రోజూ కనీసం 15 నిమిషాలపాటు ఎండలో గడపాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అశ్విని కుమార్ చౌబే సూచించారు. సూర్య రశ్మి ద్వారా శరీరానికి కావాల్సినంత విటమిన్ డీ లభిస్తుందని, తద్వారా శరీరరోగ నిరోధక శక్తి పెరిగి కరోనా వంటి వైరస్లను నిరోధించే అవకాశాలు పెరుగుతాయని అన్నారు. -
కరోనా కలకలంతో స్కూల్ మూసివేత..
సాక్షి, న్యూఢిల్లీ : ఓ విద్యార్థి తండ్రికి కరోనా వైరస్ పాజిటివ్గా తేలడంతో నోయిడాలోని ఓ ప్రైవేట్ స్కూల్ మూడు రోజుల పాటు మూతపడింది. గత శుక్రవారం ఆగ్రాలో ఆ వ్యక్తి ఇచ్చిన బర్త్డే పార్టీలో స్కూల్ విద్యార్ధులకు సంబంధించిన పలు కుటుంబాలు పాల్గొనడంతో కరోనా వ్యాప్తిపై ఆందోళన నెలకొంది. సదరు వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో హైస్కూల్ విద్యార్ధులకు పరీక్షలను రద్దు చేసిన పాఠశాల యాజమాన్యం స్కూల్ పరిసరాలను పరిశుభ్రం చేయడంతో పాటు పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేసింది. కాగా బర్త్డే పార్టీలో పాల్గొన్న వారిలో ఆరుగురికి జ్వరం రావడంతో కరోనా నిర్ధారణ కోసం వారి రక్త నమూనాలను పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. మరోవైపు ఆ ఆరుగురితో సన్నిహితంగా మెలిగిన వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యారోగ్య అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా, చైనాతోపాటు ప్రపంచ దేశాలను భయపెడుతున్న కోవిడ్-19 (కరోనా వైరస్) బాధితులు లక్షకు చేరువవడంతో డెడ్లీ వైరస్ వ్యాప్తిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 2019, డిసెంబర్ 31వ తేదీన చైనాలో తొలి కేసు బయట పడగా, నేటికి ఒక్క అంటార్కిటికా మినహా ప్రతి ఖండానికి వైరస్ విస్తరించింది. చదవండి : అక్కడ తప్ప.. అంతా ‘కరోనా కల్లోల్లం’ -
పౌర రగడ : ఇంటర్నెట్ నిలిపివేత
లక్నో : పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు కొనసాగుతున్న క్రమంలో శుక్రవారం ప్రార్థనల దృష్ట్యా యూపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీని నిలిపివేసి నిరసనలను పర్యవేక్షించేందుకు డ్రోన్లను రంగంలోకి దింపింది. పశ్చిమ యూపీలోని బిజ్నోర్, బులంద్ షహర్, ముజఫర్నగర్, మీరట్, ఆగ్రా, ఫిరోజాబాద్, సంభల్, అలీగఢ్, ఘజియాబాద్, రాంపూర్, సీతాపూర్, కాన్పూర్ జిల్లాల్లో ఇంటర్నెట్ను అధికారులు నిలిపివేశారు. కాగా ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న రాష్ట్ర రాజధాని లక్నోలో మాత్రం ఈ దిశగా చర్యలు చేపట్టలేదు. ఆగ్రాలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఇంటర్నెట్ను నిలిపివేస్తున్నట్టు ఏఎస్పీ రవి కుమార్ వెల్లడించారు. బులద్షహర్లో శనివారం ఉదయం ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. సోషల్ మీడియా కంటెంట్ను సైతం పరిశీలిస్తామని పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను పెంచడంతో పాటు నిరసనలపై డ్రోన్లతో పర్యవేక్షణ చేపడతామని అధికారులు చెప్పారు. -
మార్కెట్లకు నేడు సెలవు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లకు నేడు (మంగళవారం) సెలవు. గురునానక్ జయంతి సందర్భంగా మార్కెట్లు పనిచేయవు. గురు నానక్ 550 జయంతి సందర్భంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఇ) , నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఇ) నవంబర్ 12 న మూసివేయబడతాయి. బులియన్తో సహా, ఫారెక్స్ , కమోడిటీ ఫ్యూచర్ మార్కెట్లలో కూడా వాణిజ్య కార్యకలాపాలు ఉండవు. బుధవారం తిరిగి యధాతథంగా పనిచేస్తాయి. కాగా నిన్న (నవంబర్ 11) సెన్సెక్స్ 21.47 పాయింట్ల స్వల్ప లాభంతో 40,345.08 వద్ద ముగియగా, నిఫ్టీ 5.30 పాయింట్లు పెరిగి 11,913.50 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. -
నేడు తెలంగాణ బంద్
-
పరిశ్రమలు మూత!
సాక్షి, రంగారెడ్డి : జిల్లాలో పరిశ్రమలు ఒక్కొక్కటిగా దివాళా తీస్తున్నాయి. వందల మందికి ఉపాధి కల్పిస్తున్న కంపెనీలు మూతపడుతున్నాయి. పరిశ్రమల యాజమాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు ఏళ్లుగా అందకపోవడంతో నిర్వహణ భారం తడిసిమోపడువుతోంది. మరోపక్క రుణం ఇచ్చిన బ్యాంకులకు క్రమం తప్పకుండా అప్పుతో కలిపి వడ్డీలు చెల్లించాల్సి వస్తోంది. దాదాపు ఆరేడు కేటగిరీల్లో సబ్సిడీ విడుదలకాకపోవడంతో పరిశ్రమల యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి. ప్రత్యామ్నాయం లేకపోవడంతో కొన్ని పరిశ్రమలు మూతపడగా.. మరికొన్ని అతికష్టం మీద నెట్టుకొస్తున్నాయి. నూతన పరిశ్రామిక పాలసీ వచ్చిన తొలి రెండేళ్లలో అధిక సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ, రీయింబర్స్మెంట్ విడుదల తీరును చూసి పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని పలువురు పారిశ్రామికవేత్తలు పేర్కొంటున్నారు. ఆకర్షించిన ప్రోత్సాహకాలు.. రాష్ట్ర ప్రభుత్వం 2014లో తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అనుమతులు, స్వీయ ధ్రువీకరణ విధానానికి (టీఎస్–ఐపాస్) ఆకర్షితులై చాలా మంది ఔత్సాహికులు, పారిశ్రామికవేత్తలు జిల్లాలో అధిక సంఖ్యలో పరిశ్రమలు నెలకొల్పారు. 15 రోజుల్లోనే అనుమతులు ఇవ్వడంతోపాటు పారిశ్రామిక పెట్టుబడి ప్రోత్సాహకాలు అందజేస్తామని ప్రకటించడంతో స్థానిక, దేశీయ, బహుళ జాతీయ కంపెనీలు సైతం రాష్ట్రానికి వరుసకట్టాయి. పరిశ్రమలు నెలకొల్పేందుకు టీ–ఐడియా కింద జనరల్, టీ–ప్రైడ్ కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రాయితీలు ఇస్తున్నారు. పెట్టుబడి, పావలా వడ్డీ సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ, పన్నులు, భూమి ధర, భూ మార్పిడి, విద్యుత్ ఛార్జీల రీయింబర్స్మెంట్ తదితర ప్రోత్సాహకాలు ప్రకటించడంతో సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా, భారీ, మెగా తరహా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. టీఎస్–ఐపాస్ అమల్లోకి వచ్చాక జిల్లాలో రూ.41,580 కోట్ల అంచనా వ్యయంతో 855 పరిశ్రమల స్థాపనకు ఆన్లైన్ దరఖాస్తులు అందాయి. ఇందులో ఇప్పటివరకు రూ.10,200 కోట్ల పెట్టుబడితో 511 పరిశ్రమలు తమ ఉత్పత్తులను మొదలు పెట్టాయి. రూ.230 కోట్ల మేర బకాయిలు.. జిల్లాలో పరిశ్రమల యాజమాన్యాలకు ప్రభుత్వం నుంచి దాదాపు రూ.230 కోట్ల సబ్సిడీ, రీయింబర్స్మెంట్ రావాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ పారిశ్రామికవేత్తలకు అడపాదడపా సబ్సిడీ విడుదల చేస్తున్న ప్రభుత్వం.. జనరల్ కేటగిరీ విషయంలో కరుణించడం లేదు. ఈ కేటగిరీ పారిశ్రామికవేత్తలకు 2014, 2015 నుంచి సబ్సిడీలో ఒక్క పైసా కూడా విడుదల చేయకపోవడం గమనార్హం. విద్యుత్ ఛార్జీల రీయింబర్స్మెంట్ చివరిసారిగా 2015 వరకు అందజేశారు. 2016 నుంచి ఇప్పటివరకు దిక్కులేదు. అలాగే 2014 నుంచి సేల్స్ ట్యాక్స్, పావలావడ్డీ సబ్సిడీ, పెట్టుబడి సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ రీయింబర్స్మెంట్ విడుదల కాకపోవడం గమనార్హం. ఎస్సీ, ఎస్టీలకు చివరిసారిగా 2017 సెప్టెంబర్లో సబ్సిడీ అందజేసింది. ప్రతినెలా ఎదురుచూస్తున్న ఈ పారిశ్రామికవేత్తలు సబ్సిడీ విడుదలపై ఆశలు వదులుకుంటున్నారు. ప్రభుత్వం మీద నమ్మకంతో సబ్సిడీ ద్వారా కొంత భారమైనా తగ్గుందని భావించి పరిశ్రమలు స్థాపిస్తే.. ఇప్పుడు కష్టాలు పడుతున్నామని పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజువారీ నిర్వహణ భారం, బ్యాంకులకు అప్పుతో సహా వడ్డీ చెల్లింపులు తలకు మించిన భారంగా మారుతున్నాయంటున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు నష్టాల బాటలో నడుస్తున్నాయి. ఈ తరహా కొన్ని పరిశ్రమలు రాష్ట్రంలో ఇటీవల కాలంలో పదుల సంఖ్యలో మూతపడ్డాయి. మూసివేతే శరణ్యం! ‘పరిశ్రమల స్థాపనలో మొదటిస్థానంలో ఉన్నామని ప్రభుత్వం చెబుతోంది. ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఎంటర్ప్రైజెస్ స్థాపన విధానం సరళతరం చేశామని ప్రకటిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. సబ్సిడీ విడుదలలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా జాప్యం జరుగుతోంది. ఈ కారణంగా మా లాంటి సూక్ష్మ, మధ్య తరహా పారిశ్రామికవేత్తలకు పరిశ్రమలు మూతవేయడమే శరణ్యంగా మారుతోంది. సబ్సిడీని నమ్ముకుని చేతిలో డబ్బులు లేకున్నా అప్పు తెచ్చి ప్రాజెక్ట్ మొదలు పెట్టాం. ఐదేళ్లుగా సబ్సిడీగా విడుదల కాకుంటే ఎలా నడిపిస్తాం. తెచ్చిన అప్పుకు పెరుగుతున్న వడ్డీని తలుచుకుంటే ఏం పాలుపోవడం లేదు. సబ్సిడీ, రీయింబర్స్మెంట్ విడుదల చేస్తేనే పరిశ్రమలకు మళ్లీ జీవం వస్తుంది. లేదంటే మూసివేతే శరణ్యం’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ పారిశ్రామికవేత్త ‘సాక్షి’తో తన ఆవేదనను పంచుకున్నారు. -
జెట్పై బ్యాంకుల కసరత్తు
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ప్రైవేట్ రంగ జెట్ ఎయిర్వేస్ను గట్టెక్కించడంపై బ్యాంకులు కసరత్తు కొనసాగిస్తున్నాయి. సంస్థను పునరుద్ధరించే దిశగా త్వరలోనే మరిన్ని నిధులు సమకూర్చే అవకాశాలపై చర్చలు జరుపుతున్నాయి. సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు ఈ విషయాలు వెల్లడించారు. జెట్ ఎయిర్వేస్పై దివాలా కోడ్ కింద చర్యలు తీసుకునేలా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ను (ఎన్సీఎల్టీ) ఆశ్రయించేందుకు ఇది సరైన సమయం కాదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘జెట్ను పునరుద్ధరించేందుకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికైతే ఇంకా ఏ ప్రణాళికా ఖరారు కాలేదు‘ అని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ సునీల్ మెహతా తెలిపారు. మరోవైపు, జెట్కు రుణాలిచ్చిన సంస్థల ప్రతినిధులు కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్తో కూడా భేటీ అయ్యారు. రూ.8,000 కోట్ల పైగా రుణభారం ఉన్న జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు కంపెనీ 123 ఎయిర్క్రాఫ్ట్లను నడపగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 5కు పడిపోయింది. సంస్థ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్.. డైరెక్టర్ల బోర్డు నుంచి తప్పుకున్నారు. రుణాలిచ్చిన బ్యాంకులు.. కంపెనీ యాజమాన్య అధికారాలను తమ చేతుల్లోకి తీసుకున్నాయి. సంస్థకు అత్యవసరంగా రూ.1,500 కోట్ల మేర నిధులను సమకూర్చేలా ప్రతిపాదనలు చేశాయి. 75 శాతం దాకా వాటాలను విక్రయించేందుకు బిడ్స్ కూడా ఆహ్వానించాయి. దీంతో కంపెనీలో వాటాలు దక్కించుకునేందుకు నరేష్ గోయల్ కూడా బిడ్ వేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, బిడ్డింగ్లో పాల్గొనరాదని ఆయన నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి. సంక్షోభంపై కేంద్రం సమీక్ష... జెట్ ఎయిర్వేస్ సంక్షోభం, పెరుగుతున్న విమాన చార్జీలు, ఫ్లయిట్స్ రద్దు తదితర అంశాలపై సమీక్ష జరపాల్సిందిగా కేంద్ర పౌర విమానయాన మంత్రి సురేష్ ప్రభు అధికారులను ఆదేశించారు. ప్రయాణీకుల భద్రత, హక్కులను కాపాడేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలాకు సూచించారు. ఈ మేరకు మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్లో ఆయన పోస్ట్ చేశారు. జెట్ వివాదంపై సమీక్షకు ఆదేశించినట్లు ప్రభు ప్రకటించడం వారం రోజుల్లో ఇది రెండోసారి. తక్షణ సాయం కోసం నిధులు అందించాలంటూ బ్యాంకులను జెట్ ఎయిర్వేస్ కోరినట్లు ఖరోలా తెలిపారు. సంస్థ ప్రస్తుతం అయిదు విమానాలు మాత్రమే నడుపుతున్నట్లు పేర్కొన్నారు. 10 రూట్లలో చార్జీల తగ్గింపుపై డీజీసీఏ దృష్టి జెట్ ఎయిర్వేస్ ఫ్లయిట్స్ రద్దు నేపథ్యంలో చార్జీలను రోజువారీ సమీక్షించడం కొనసాగుతోందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సీనియర్ అధికారి తెలిపారు. అలాగే, సత్వరం తగు చర్యలు తీసుకునేందుకు ఎయిర్లైన్స్తో సంప్రతింపులు జరుగుతున్నాయని వివరించారు. ఎయిర్లైన్స్ ప్రతినిధులతో మంగళవారం జరిగిన సమావేశంలో .. రద్దీ ఎక్కువగా ఉండే 40 రూట్లలో చార్జీలు సమీక్షించినట్లు ఆయన పేర్కొన్నారు. పది రూట్లలో చార్జీలు 10–30 శాతం దాకా పెరిగాయని గుర్తించినట్లు .. వాటిని సముచిత స్థాయికి తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఎయిర్లైన్స్కు సూచించినట్లు ఖరోలా చెప్పారు. ఏప్రిల్ 18న విమానయాన సంస్థలు, విమానాశ్రయాల ప్రతినిధులతో పౌర విమానయాన శాఖ సమావేశం కానున్నట్లు మరో అధికారి పేర్కొన్నారు. మంగళవారం జెట్ ఎయిర్వేస్ షేరు బీఎస్ఈలో సుమారు 8 శాతం మేర క్షీణించి రూ. 241.85 వద్ద క్లోజయ్యింది. -
యూఎస్కు తప్పిన మరో షట్డౌన్ ముప్పు
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వానికి నిధులు మంజూరు చేసి తద్వారా మరో షట్డౌన్ను నివారించడంపై డెమొక్రాట్లు, రిపబ్లికన్లు సోమవారం సాయంత్రం సూత్రప్రాయంగా ఓ ఒప్పందానికి వచ్చారు. అమెరికా–మెక్సికో సరిహద్దులో గోడను నిర్మించేందుకు 5.7 బిలియన్ డాలర్ల నిధులు కావాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన డిమాండ్ను వారు పక్కనబెట్టారు. ట్రంప్ అడిగినట్లుగా కాకుండా కేవలం 1.375 బిలియన్ డాలర్లనే ఇచ్చేందుకు వారు అంగీకరించారు. ఈ ఒప్పందం కుదరకపోయుంటే శుక్రవారం నుంచి అమెరికాలో మళ్లీ షట్డౌన్ ప్రారంభమై ఉండేది. వాషింగ్టన్లో సోమవారం సాయంత్రం ఇరు పార్టీలకు చెందిన చట్ట సభ్యులు రహస్య సమావేశంలో పాల్గొన్నారు. ఒప్పందం గురించిన విషయాలను అధికారికంగా వెల్లడించలేదు. గోడ విషయంలో డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య తీవ్ర విభేదాలు వచ్చిన కారణంగా ఇటీవలే అమెరికా ప్రభుత్వం 30 రోజులకు పైగా షట్డౌన్ కావడం తెలిసిందే. -
గోడకు నిధులిస్తే.. డ్రీమర్లకు గడువిస్తా
వాషింగ్టన్: అమెరికాలో కొనసాగుతున్న షట్డౌన్కు ముగింపు పలికేందుకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజీ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. డెమొక్రాట్లు మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి ఆమోదం తెలిపితే, దాదాపు 7 లక్షల మంది డ్రీమర్లకు(బాల్యంలోనే అమెరికాకు అక్రమంగా వచ్చినవారు) మూడేళ్ల పాటు తాత్కాలిక రక్షణ హోదా కల్పిస్తామని ట్రంప్ ప్రకటించారు. వైట్హౌస్ నుంచి శనివారం(స్థానిక కాలమానం) ప్రజలు, రాజకీయ నేతలనుద్దేశించి ప్రసంగించిన ట్రంప్.. ‘వాషింగ్టన్లోని రెండు పక్షాలు(రిపబ్లికన్లు, డెమొక్రాట్లు) ఓ అంగీకారానికి రావాల్సిన అవసరం ఉంది. దేశంలోని 7,00,000 మంది డ్రీమర్లకు మరో మూడేళ్ల పాటు తాత్కాలిక రక్షణ హోదా(టీపీఎస్) కల్పిస్తాం. స్వదేశాల్లో హింస, అంతర్యుద్ధం కారణంగా అమెరికాలో ఉంటున్న 3 లక్షల మంది విదేశీయులకు టీపీఎస్ను మూడేళ్ల పాటు పొడిగిస్తాం. ఇందుకు ప్రతిగా అమెరికా–మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది’ అని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా–మెక్సికో సరిహద్దులో గోడ కోసం 5.7 బిలియన్ డాలర్లు(రూ.40,615 కోట్లు) ఇవ్వాలని ట్రంప్ కోరుతున్న సంగతి తెలిసిందే. అధ్యక్షుడి ప్రతిపాదన ఆచరణసాధ్యం కాదని డెమొక్రటిక్ నేత, ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని షట్డౌన్ చేయడాన్ని ట్రంప్ గర్వంగా భావిస్తున్నారనీ, దీనిని ఎత్తివేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. -
వారి కోసం పిజ్జా డెలివరీ బాయ్గా జార్జ్ బుష్!
వాషింగ్టన్ : వలసదారులను అడ్డుకునేందుకు అమెరికా- మెక్సికో సరిహద్దు వెంబడి గోడ నిర్మాణానికి నిధుల విషయమై ప్రతిపక్ష డెమోక్రాట్లతో విభేదాల కారణంగా ప్రారంభమైన అమెరికా షట్డౌన్ 27వ రోజుకు చేరుకుంది. అమెరికా చరిత్రలో అత్యధిక రోజుల పాటు కొనసాగుతున్న షట్డౌన్ ఇదే. ఈ క్రమంలో సుమారు 8 లక్షల మంది ఉద్యోగులకు జీతాలు అందడం లేదు. ముఖ్యంగా 6 వేల మంది సీక్రెట్ సర్వీసు ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారయ్యింది. ఈ నేపథ్యంలో పే చెక్కులు లేకుండా నిరంతరం శ్రమిస్తున్న తన సిబ్బంది పట్ల అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ కృతఙ్ఞత చాటుకున్నారు. శుక్రవారం వారి కోసం పిజ్జాలు స్వయంగా డెలివరీ చేసి ట్రంప్ ప్రభుత్వానికి, ప్రతిపక్ష డెమోక్రాట్ల తీరును పరోక్షంగా విమర్శించారు. మీ అందరికీ ధన్యవాదాలు ‘వేతనం లేకుండా దేశం కోసం పనిచేస్తున్న సీక్రెట్ సర్వీస్ సిబ్బంది(నాయకులకు భద్రతా సిబ్బంది)కి, ఫెడరల్ ఉద్యోగులకు నేను, లారా బుష్ ధన్యవాదాలు తెలుపుతున్నాం. వారికి మద్దతుగా నిలుస్తున్న పౌరులకు కూడా. రాజకీయాలను పక్కనబెట్టి ప్రభుత్వం, ప్రతిపక్ష నేతలు షట్డౌన్కు ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది’ అంటూ సొంత పార్టీకి చెందిన రిపబ్లికన్లు, ప్రతిపక్ష డెమోక్రాట్ల తీరును సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. కాగా బుష్ పాలనా కాలంలో(2001- 2009) అమెరికాలో ఒక్కసారి షట్డౌన్ కాకపోవడం విశేషం. ఇక1995-96లో బిల్ క్లింటన్ హయాంలో 21 రోజుల పాటు కొనసాగిన షట్డౌన్ రికార్డును ట్రంప్ ప్రభుత్వం అధిగమించింది. View this post on Instagram @LauraWBush and I are grateful to our Secret Service personnel and the thousands of Federal employees who are working hard for our country without a paycheck. And we thank our fellow citizens who are supporting them. It’s time for leaders on both sides to put politics aside, come together, and end this shutdown. A post shared by George W. Bush (@georgewbush) on Jan 18, 2019 at 12:58pm PST -
ప్రపంచ పరిణామాలు కీలకం..!
న్యూఢిల్లీ: అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) వడ్డీ రేట్లను పావు శాతం పెంచడం, ప్రభుత్వ షట్డౌన్ వంటి ప్రతికూల పరిణామాలు గతవారంలో అంతర్జాతీయ మార్కెట్లను కుంగదీశాయి. డౌజోన్స్ ఇండస్ట్రీయల్ యావరేజ్ గతవారంలో 1,655 పాయింట్లు (6.8 శాతం) పతనంకాగా, నాస్డాక్ 8.3 శాతం మేర పడిపోయింది. ఈ నేపథ్యంలో దేశీ సూచీలు సైతం భారీ పతనాన్ని నమోదుచేశాయి. శుక్రవారం ట్రేడింగ్లో నిఫ్టీ 198 పాయింట్లు నష్టపోయి 10,754 వద్ద ముగిసింది. 10,800 మార్కును కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఈవారం ప్రధాన సూచీలు ఏ దిశగా ప్రయాణం చేస్తాయనే అంశంపై మార్కెట్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వ పాలన మరోసారి పాక్షికంగా స్తంభించడం.. అక్కడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించకుండా, మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం వెల్లడికాకుండానే కాంగ్రెస్ వాయి దా పడడం వంటి ప్రతికూలతలు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసే విధంగా ఉన్నట్లు దలాల్ స్ట్రీట్ పండితులు చెబుతున్నారు. వృద్ధి రేటు మందగించవచ్చని కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పోవెల్ చేసిన వ్యాఖ్యలు, ట్రంప్కు కాంగ్రెస్కు మధ్య కొనసాగుతున్న విభేదాలు, అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు కనిపించకపోవడం వంటి ప్రతికూలతలు ఈవారంలో ప్రభావం చూపనున్నట్లు భావిస్తున్నారు. ఇక గురువారం వెల్లడికానున్న నవంబర్ నెల గృహ నిర్మాణ, అమ్మకాల సమాచారం మరో కీలక అంశంగా ఉందని చెబుతున్నారు. కాగా, 25న(మంగళవారం) క్రిస్మస్ సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు. సానుకూలంగా దేశీ పరిణామాలు అంతర్జాతీయ పరిణామాలు పూర్తి ప్రతికూలంగా ఉన్నప్పటికీ.. దేశీయంగా మాత్రం సానుకూల అంశాలు కొనసాగుతున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ అన్నారు. ‘ముడిచమురు ధరలు గతవారం 11 శాతం పతనం కావడం వల్ల కరెంట్ ఖాతా లోటు భారాన్ని తగ్గిస్తుంది. పారిశ్రామికోత్పత్తి ఊపందుకుంది. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచకుండా ఉండేందుకు సహకరిస్తోంది. ఈ పరిణామాలతో ఆర్బీఐ సైతం కఠిన వైఖరి నుంచి తటస్థ వైఖరికి మారింది. ఈ అంశాలు సూచీలకు సానుకూలంగా ఉన్నాయి.’ అని వ్యాఖ్యానించారు. క్రిస్మస్ కానుక కింద మధ్య తరగతి ప్రజలు వినియోగించే 23 వస్తు, సేవలపై పన్నును జీఎస్టీ మండలి తగ్గించడం మరో పాజిటివ్ అంశమన్నారాయన. అయితే, మరోవైపు డిసెంబర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఈ గురువారం ముగియనున్న కారణంగా అధిక ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 10,550 వద్ద కీలక మద్దతు.. ఈవారంలో నిఫ్టీకి 10,550 పాయింట్ల వద్ద కీలక మద్దతు స్థాయి ఉందని ప్రభుదాస్ లీలాధర్ టెక్నికల్ విశ్లేషకులు వైశాలి పరేఖ్ అన్నారు. ఈసూచీ కీలక నిరోధం 10,930 పాయింట్ల వద్ద ఉందని విశ్లేషించారు. ఎఫ్పీఐల నికర పెట్టుబడి రూ.4,000 కోట్లు డిసెంబర్ 3–21 మధ్యకాలంలో ఎఫ్పీఐలు రూ.3,884 కోట్లను నికరంగా పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీల సమాచారం ద్వారా వెల్లడైంది. రూ.1,332 కోట్లను ఈక్విటీలో నికరంగా ఇన్వెస్ట్చేసిన వీరు రూ.2,552 కోట్లను డెట్ మార్కెట్లో పెట్టుబడిపెట్టినట్లు డేటా ద్వారా వెల్లడైంది. ముడి ధరలు తగ్గడం, డాలరుతో రూపాయి మారకం విలువ బలపడిన కారణంగా విదేశీ నిధుల ప్రవాహం పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలు ఇదే విధంగా కొనసాగితే, ఏడాది చివర్లో ఎఫ్పీఐ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
ఇంటర్నెట్ షట్డౌన్ కలకలం
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 48 గంటలపాటు ఇంటర్నెట్ ఆగిపోతుందంటూ శుక్రవారం ఓ వార్త కలకలం రేపింది. డీఎన్ఎస్ఎస్ఈసీ (డొమైన్ నేమ్ సిస్టమ్ సెక్యూరిటీ ఎక్స్టెన్షన్స్) అప్డేషన్ కారణంగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతాయంటూ రష్యాటుడే అనే వెబ్సైట్ పేర్కొంది. అప్డేషన్ను చేపట్టే ఐసీఏఎన్ఎన్ (ఇంటర్నెట్ కార్పొరేషన్ ఆఫ్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్) మాత్రం ఈ వార్తలను ఖండించింది. సైబర్ దాడులు, మోసాలు పెరిగిపోతున్నందున మరింత భద్రమైన ఇంటర్నెట్ సౌకర్యాలను అందించేందుకు అప్డేట్ను చేపడుతున్నారు. ఇది సాధారణంగా జరుగుతున్న నిర్వహణ పనేనని ఐసీఏఎన్ఎన్ వెల్లడించింది. ఎక్కువమంది పాఠకులు తమ వార్త చదివేలా చేసి, తద్వారా ఆదాయం పొందేందుకు రష్యా టుడే వెబ్సైట్ ఈ వార్తకు తప్పుదారి పట్టించే శీర్షికను పెట్టడం కారణంగానే గందరగోళం తలెత్తిందని ఐసీఏఎన్ఎన్ ఆక్షేపించింది. గురువారమే మొదలైంది: ఐసీఏఎన్ఎన్ డీఎన్ఎస్ఎస్ఈసీని అప్డేట్ చేయడం గురువారమే మొదలైందనీ, ఇప్పటికే ఓ రోజు గడిచినా అక్కడక్కడా చిన్న చిన్న అంతరాయాలు తప్పించి ఇంటర్నెట్ వినియోగదారులకెవ్వరికీ ఇబ్బంది కలగలేదని ఐసీఏఎన్ఎన్ చెప్పింది. భద్రమైన, స్థిరమైన డీఎన్ఎస్ కోసం ఈ నిర్వహణ పనులు తప్పవని సమాచారాల నియంత్రణ ప్రాధికార సంస్థ (సీఆర్ఏ) ఓ ప్రకటనలో తెలిపింది. ‘ప్రాథమిక పరీక్షలు జరిపిన అనంతరం ఎన్క్రిప్షన్ కీ అప్డేట్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కేవలం 1 శాతం (దాదాపు 3.5 కోట్లు) మందికే ఇంటర్నెట్ సేవల్లో అంతరాయాలు తలెత్తే అవకాశం ఉందని గుర్తించాం. మిగతా 99 శాతం మందిపై ప్రభావం పెద్దగా ఉండదు. డీఎన్ఎస్లోని అన్ని వెబ్ అడ్రస్లకు ఎన్క్రిప్షన్ కీని ఒకేసారి కాకుండా, వివిధ విడతల్లో చేపడుతున్నాం. కాబట్టి ఇంటర్నెట్ మొత్తం ఒక్కసారిగా ఆగిపోదు. ఒక్కో సమయంలో కొన్ని వెబ్సైట్లు ప్రభావమవుతాయి. ఎన్క్రిప్షన్ కీ అప్డేట్ అయ్యాక ఇంటర్నెట్ సరఫరాదారులు అందుకు తగ్గట్టుగా తగిన మార్పులు చేసుకోవాలి. ఈ మార్పులు చేయడంలో వారు ఆలస్యం చేస్తే ఆయా సరఫరాదారుల వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తే చాన్సుంది. ఈ అప్డేట్ గురించి ఇంటర్నెట్ సరఫరాదారులకు ముందే సమాచారం ఇచ్చినందున వారూ సిద్ధంగానే ఉన్నారు. ఎవరికీ సమస్య లేదు’ అని ఐసీఏఎన్ఎన్ వివరించింది. భారత్పై ప్రభావమేదీ లేదు ఎన్క్రిప్షన్ కీ కారణంగా భారత్లో ఇంటర్నెట్ సేవలపై ప్రభావమేదీ లేదని జాతీయ సైబర్ భద్రత సమన్వయకర్త గుల్షన్ రాయ్ చెప్పారు. ‘అన్ని ఏర్పాట్లూ చేశాం. కొన్ని వెబ్సైట్లలో వస్తున్నట్లుగా భారత్లో ఇంటర్నెట్ ఆగిపోయే సమస్యే లేదు’ అని ఆయన స్పష్టం చేశారు. క్రిప్టోగ్రాఫిక్ కీస్ను అప్గ్రేడ్ చేస్తామని 2016 జూలైలోనే ఐసీఏఎన్ఎన్ ప్రకటించింది. గతేడాది అక్టోబరు 11న ఈ అప్డేట్ను పూర్తి చేయాలని తొలుత భావించినా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. గురువారం ఈ ప్రక్రియ మొదలైంది. దీని ప్రభావం ఒక శాతం మంది ఇంటర్నెట్ వినియోగదారులపై ఉండొచ్చని ఐఏసీఎన్ఎన్ అంచనా వేసినా, అది కేవలం 0.05 శాతమేనని ఆసియా పసిఫిక్ ప్రాంత రీజనల్ ఇంటర్నెట్ రిజిస్ట్రీ మరో అంచనాగా చెప్పింది. -
రానున్న 48 గంటల్లో ఇంటర్నెట్ సేవలకు బ్రేక్
-
ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న ఇంటర్నెట్
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రధాన సర్వర్ నిర్వహణ పనుల నేపథ్యంలో రానున్న 48 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలగనుంది. రొటీన్ మెయింటినెన్స్లో భాగంగా ప్రధాన సర్వర్, దానికి సంబంధించిన కనెక్షన్లను నిలిపివేయనున్నారని.. ఫలితంగా ఇంటర్నెట్ సేవలకు కొద్దిసేపు ఆటంకం కలుగుతుందని ‘రష్యా టుడే’ వెల్లడించింది. ప్రధాన సర్వర్ నిర్వహణను ఇంటర్నెట్ కార్పొరేషన్ ఆఫ్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్(ఐసీఏఎన్ఎన్) చేస్తుంది. ఇందులో భాగంగా క్రిప్టోగ్రాఫిక్ కీని మారుస్తుంది. దీనివల్ల ఇంటర్నెట్ అడ్రస్ బుక్ లేదా డొమైన్ నేమ్ సిస్టమ్ (డీఎన్ఎస్) భద్రంగా ఉంటుంది. ఇటీవల ఎక్కువైన సైబర్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రధాన సర్వర్ నిర్వహణ పనులు నిర్వహణ పనులు తప్పనిసరని ఐసీఏఎన్ఎన్ పేర్కొంది. ‘సురక్షితమైన, స్థిరమైన డీఎన్ఎస్ను పొందడం కోసం కొద్దిసేపు ప్రపంచ నెట్వర్క్ను షట్డౌన్ చేయడం అవసరం. అందువల్ల రానున్న 48 గంటల్లో వెబ్ పేజీలను యాక్సెస్ చేయయంలో, ట్రాన్సాక్షన్స్ జరపడంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంద’ని కమ్యూనికేషన్ రెగ్యులేటరీ అథారిటీ(సీఆర్ఏ) ప్రకటించింది. అవుట్డేటెడ్ ఐఎస్పీ(ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్) వాడకందారులు ఈ అసౌకర్యాన్ని చవి చూస్తారని వెల్లడించింది. -
కాకినాడలో కొనసాగుతోన్న బంద్
-
ఎట్టకేలకు ముగిసిన అమెరికా షట్డౌన్!
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక నిధుల (ఫండింగ్) బిల్లుపై సంతకం చేయడంతో మూడురోజులపాటు కొనసాగిన ప్రభుత్వ కార్యకలాపాల స్తంభన (షట్డౌన్) అధికారికంగా ముగిసిపోయింది. ఫిబ్రవరి 8వ తేదీ వరకు ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులు అందించేందుకు, అలాగే ప్రముఖ పిల్లల ఆరోగ్య బీమా పథకానికి 8 ఏళ్లపాటు నిధులు సమకూర్చేందుకు ఈ బిల్లు అనుమతినిస్తుంది. అయితే, ఒబామా హయాంనాటి డీఏసీఏ (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్వుడ్ అరైవల్స్) పథకాన్ని మాత్రం ఈ బిల్లులో చేర్చలేదు. అమెరికాకు తల్లిదండ్రులతోపాటు వచ్చిన డ్రీమర్స్ హక్కుల కోసం ఉద్దేశించిన ఈ పథకాన్ని బిల్లులో చేర్చాలని ప్రతిపక్ష డెమొక్రాట్లు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి తాత్కాలికంగా నిధులు సమకూర్చే బిల్లును మొదట అమెరికా సెనేట్ ఆమోదించి.. పెద్దల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటివ్)కు పంపింది. పెద్దలసభ 266-150 తేడాతో ఈ బిల్లును ఆమోదించగా.. అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేయడంతో బిల్లు చట్టంగా మారింది. దీంతో సోమవారం ఉదయం నుంచి అమెరికా ప్రభుత్వం మళ్లీ యథాతథంగా కార్యకలాపాలు ప్రారంభించింది. వలసదారుల విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ.. ప్రభుత్వానికి నిధులు సమకూర్చే బిల్లును సెనేటర్లు తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికా ప్రభుత్వం స్తంభించిపోయి మూడురోజుల పాటు కుప్పకూలిపోయింది. ప్రభుత్వ ఏజెన్సీలు, ఉద్యోగులపై ఈ ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా మూడు వారాలపాటు ప్రభుత్వం నడిచేందుకు వీలుగా అధికార రిపబ్లికన్లతో డెమొక్రాట్లు తాత్కాలిక రాజీ కుదర్చడంతో ఈ బిల్లు ఆమోదం పొందింది. ఈ క్రమంలో కొత్త వలసదారుల బిల్లు వచ్చేనెలలోగా ఆమోదం పొందనుందని ట్రంప్ ప్రభుత్వం చెప్తోంది. అయితే, డిపోర్టేషన్ (తిరిగి స్వదేశానికి పంపబడే) ముప్పు ఎదుర్కొంటున్న 8 లక్షలమంది వలసదారులను కాపాడే విషయంలో డెమొక్రాట్లు, రిపబ్లికన్లు తాత్కాలికంగా రాజీకి వచ్చినట్టు తెలుస్తోంది. -
షట్డౌన్కు తెర:మార్కెట్ల జోష్
రిపబ్లికన్, డెమోక్రాట్ల మధ్య సయోధ్య నేపథ్యంలో అమెరికాలో షట్డౌన్ వివాదానికి తెరపడింది. అమెరికా ప్రతినిధుల సభ ఫిబ్రవరి 8 న ఫెడరల్ ప్రభుత్వానికి నిధులు సమకూరుస్తూ సెనేటర్లు తమ ఆమోదంతెలిపారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయనున్నామని ప్రకటించడంతో మూడురోజుల ప్రభుత్వ షట్డౌన్కు ముగింపు పడింది. దీంతో అమెరికా ప్రభుత్వ సేవలు ప్రారంభమవుతాయని వైట్హౌస్ అధికారులు తెలిపారు. యూఎస్ సెనేటర్లు ఫెడరల్ ప్రభుత్వ , మూడు రోజుల షట్డౌన్కు స్వస్తి పలుకుతూ 266-150 ఓట్లతో డీల్కు ఒకే చెప్పారు. ఫిబ్రవరి 8వరకూ అవాంతరాలు లేకుండా ప్రభుత్వం నడిచేందుకు వీలుగా ఫండింగ్ లెజిస్లేషన్కు మద్దతును ప్రకటిచారు. ముఖ్యంగా చిల్డ్రన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ (చిప్) ను ఆరు సంవత్సరాల పొడిగింపు సహా ఇతరాలతో స్టాప్ గ్యాప్ బిల్లును ఆమోదించింది. కానీ డెమొక్రాట్ల "డ్రీమర్" వలసదారులకు రక్షణకు సంబంధించిన బిల్లు పెండింగ్లో ఉంది. దీంతో అమెరికా మార్కెట్లలో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. సోమవారం డోజోన్స్ 66 పాయింట్లు(0.25 శాతం) పురోగమించి 26,137 వద్ద ముగియగా.. ఎస్అండ్పీ 13 పాయింట్లు(0.5 శాతం) బలపడి 2,824 వద్ద స్థిరపడింది. నాస్డాక్ సైతం 49 పాయింట్లు(0.7 శాతం) పురోగమించి 7,385 వద్ద ముగిసింది. మరోవైపు దేశీయస్టాక్మార్కెట్లు కూడా లాభాలతో ట్రేడింగ్ను ఆరంభించాయి. సెన్సెక్స్ డబుల్ సెంచరీ లాభాలతో 36వేల కీలక స్థాయిని అధిగమించగా, నిఫ్టీ కూడా చరిత్రలో తొలిసారి 11వేల మార్క్ను దాటి రికార్డ్ హైని నమోదు చేసింది. అటు జపాన్ మార్కెట్ నిక్కీ కూడా మంగళవారం గరిష్ట స్థాయిలోనే ముగిసింది. -
అగ్రరాజ్యం ఆగింది
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం అధికారికంగా మూతపడింది. అమెరికా పాలనా యంత్రాంగాన్ని నడిపేందుకు అవసరమైన ఖర్చులను నిర్దేశించే ‘వినిమయ బిల్లు’ను సెనెట్ తిరస్కరించటంతో షట్డౌన్ మొదలైంది. అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వానికి ఇది ఎదురుదెబ్బే. సెనెట్లో డెమొక్రాట్లకు కొందరు రిపబ్లికన్ ప్రతినిధులు తోడవటంతో ఈ బిల్లు వీగిపోయింది. శుక్రవారం అర్ధరాత్రి 12.01 నిమిషం (స్థానిక కాలమానం)తో షట్డౌన్ మొదలైంది. దీంతో పెంటగాన్, ఇతర కేంద్ర సంస్థలు పనిచేసేందుకు అవసరమైన నిధులు తాత్కాలికంగా ఆగిపోతాయి. గతంలో 2013 అక్టోబర్లో 16 రోజుల పాటు, 1996లో 21 రోజుల పాటు షట్డౌన్ కొనసాగింది. అయితే.. సెనెట్, వైట్హౌస్ ఒకే పార్టీ ఆధిపత్యంలో ఉన్న సమయంలో షట్డౌన్ కావటం మాత్రం అమెరికా చరిత్రలో ఇదే ప్రథమం. 50–48తో వీగిపోయిన బిల్లు డెమొక్రాట్లు కావాలనే ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చాలని చూస్తున్నారని ట్రంప్ విమర్శించారు. పన్ను తగ్గింపు విజయాన్ని తగ్గించి చూపేందుకే డెమొక్రాట్లు కుట్ర పన్నారన్నారు. ఫిబ్రవరి 16 వరకు ప్రభుత్వ నిర్వహణకు అవసరమైన నిధులు ఇచ్చే ఈ బిల్లు 50–48 తేడాతో వీగిపోయింది. సోమవారం నుంచి తీవ్ర ఇబ్బందులు తప్పవు. దాదాపు 8 లక్షల మంది ప్రభుత్వోద్యోగులు వేతనాల్లేకుండానే సెలవులో ఉంటారు. వైద్యం, పోలీసు వంటి అత్యవసర సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయి. 2013 కన్నా తక్కువ ప్రభావం ఉండేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని బడ్జెట్ నిర్వహణ కార్యాలయం తెలిపింది. ‘ ప్రజలను ఇబ్బంది పెట్టే పనులేమీ చేయం. మిలటరీ సరిహద్దులను కాపలాకాస్తుంది. పార్కులు, పోస్టాఫీస్లు తెరిచే ఉంటాయి. ఎక్కడా ప్రజలు డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండబోదు’ అని బడ్జెట్ నిర్వహణ కార్యాలయం డైరెక్టర్ మిక్ ముల్వనే పేర్కొన్నారు. ట్రంప్ దావోస్ పర్యటనకు నో ప్రాబ్లమ్ వినియమ బిల్లును సెనెట్ తిరస్కరించిన నేపథ్యంలో ఫ్లోరిడాలోని మారాలాగోలో నిర్ణయించిన వారాంతపు పర్యటనను ట్రంప్ విరమించుకున్నారు. అయితే వచ్చేవారం స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో మాత్రం ఆయన పాల్గొంటారని వైట్హౌస్ వర్గాలు వెల్లడించాయి. ‘పుంజుకుంటున్న అమెరికా ఆర్థికాభివృద్ధిని డెమొక్రాట్లు అడ్డుకోలేకపోతున్నారు. అందుకే షట్డౌన్ ద్వారా ప్రభుత్వం జోరుకు సంకెళ్లు వేద్దామనుకుంటున్నారు’ అని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అక్రమంగా అమెరికాలో నివాసముంటున్న తల్లిదండ్రుల వెంట అమెరికా వచ్చిన పిల్లల (స్వాప్నికులు) విషయంలో పునరాలోచించే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. సెనెట్లో డెమొక్రాట్ల పక్ష నేత చెక్ షుమర్ పేరుతో ఈ షట్డౌన్ను రిపబ్లికన్లు ‘షుమర్ షట్డౌన్’ అని పిలుస్తున్నారు. షట్డౌన్ ప్రభావమెంత? అత్యవసరసేవలు మినహా అన్ని ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం కలిగించే షట్డౌన్ ప్రారంభమైంది. దీని కారణంగా వివిధ శాఖల్లో పనిచేసే దాదాపు 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను అత్యవసరం కాని కార్మికులుగా పరిగణించి వారికి వేతనంలేని సెలవులు సోమవారం నుంచి మంజూరుచేయడంతో ఉత్పాదకత పడిపోతుంది. రక్షణశాఖలోని 7,40,000 మంది కార్మికులకు ఈ షట్డౌన్ వర్తిస్తుంది. సైనికసిబ్బంది వేతనాలకు కాంగ్రెస్ ఆమోదముద్ర అవసరం. అమెరికా పౌరసత్వ, వలససేవల విభాగానికి కాంగ్రెస్ నుంచి నిధుల ప్రవాహం ఉండనందున ప్రభుత్వ మూసివేత ప్రభావం ఉండదు. సిబ్బందికి వీసాల మంజూరు కోరే కంపెనీలకు దీని వల్ల ఇబ్బందులు తప్పవు. కాన్సులేట్లకూ ఇబ్బందే షట్డౌన్ దీర్ఘ కాలం కొనసాగితే విదేశాల్లోని అమెరికా కాన్సులేట్ల నిర్వహణ కష్టమౌతుంది. షట్డౌన్ ముగిసేంత వరకు వివిధ వీసాలపై అమెరికా వెళ్లేవారు తమ ప్రయత్నాన్ని మానుకోక తప్పదు. లక్షా 15వేల మంది పనిచేసే న్యాయశాఖ అత్యవసర సర్వీసు కావడంతో ఇందులోని 20,000 మందికి సెలవిచ్చారు. స్టాక్మార్కెట్లను నియంత్రించే సెక్యూరిటీస్ అండ్ ఎక్చ్సేంజ్ కమిషన్ కొన్ని రోజులే పనిచేయగలదు. పన్ను వసూలు చేసే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ నుంచి ప్రజలు, సంస్థలకు పన్ను రిఫండ్ నిలిచిపోతుంది. పార్కులు, మ్యూజియంలూ బంద్ రోజూ పది లక్షల మంది సందర్శించే 417 జాతీయ పార్కులు, ప్రపంచ ప్రసిద్ధిపొందిన 19 స్మిత్సానియన్ మ్యూజియంల గేట్లకూ తాళాలు వేశారు. ఫలితంగా వీటినుంచి వచ్చే కోట్లాది డాలర్ల ఆదాయం కోల్పోయినట్లే. 2020 జనాభా లెక్కల సేకరణలో ఇప్పటికే నత్తనడక నడుస్తున్న అమెరికా సెన్సస్ బ్యూరో కార్యకలాపాలు ఇక ముందుకు సాగవు. బాలల ఆరోగ్య బీమా పథకం వర్తించే దాదాపు కోటి మంది పిల్లల ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమం కూడా గందరగోళంలో పడుతుంది. అదనపు నిధులు లేకుండా సుప్రీంకోర్టు సహా ఫెడరల్ కోర్టులు మూడు వారాల వరకూ పనిచేయగలవు. ఈ లోగా సమస్య పరిష్కారం కాకుంటే కోర్టుల కార్యకలాపాలూ ఆగిపోతాయి. ఆదాయ, సామాజిక భద్రతా నంబర్ల ధ్రువీకరణ వంటి ప్రభుత్వ సేవలు లభ్యంకాకపోతే సాధారణ రుణాలు, గృహరుణాల మంజూరు సాధ్యంకాదు. -
షట్డౌన్తో మనకేం ఇబ్బంది లేదు
న్యూఢిల్లీ : అమెరికాలో తాజాగా ఏర్పడ్డ షట్డౌన్ పరిస్థితుల వల్ల భారత వియానయాన రంగానికి కొత్తగా వచ్చే ఇబ్బందులు ఏమీ లేవని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకూ భారత్ నుంచి అమెరికా వెళ్లే ఒక్క విమాన సర్వీసు కూడా రద్దు కాలేదని విమానయాన రంగానికి చెందిన అధికారులు చెబుతున్నారు. షట్డౌన్ ప్రభావం ప్రయాణికులు మీద ఇప్పటికిప్పుడు పడదని కాక్స్ అండ్ కిక్స్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అయితే ఈ పరిస్థితి సుధీర్ఘకాలం కొనసాగితే మాత్రం ప్రభావం ఉంటుందని ఆయన చెప్పారు. అమెరికా ప్రభుత్వం షట్డౌన్ ప్రకటించిన తరువాత కూడా విమానయాన రంగం మీద ఎటువంటి ప్రభావం పడలేదని చెప్పారు. విమానాలన్నీ షెడ్యూల్ టైమ్కు బయలుదేరుతున్నాయని, ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ అధికారులు తమ సేవలను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఇదిలావుంటే.. సమీప భవిష్యత్తులో మాత్రం అమెరికాలో పర్యటించాలనుకునేవారు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని యాత్రాడాట్కామ్ సీఓఓ శరత్ దాల్ తెలిపారు. భారత ప్రభుత్వ వియానయాన సంస్థ ఎయిర్ ఇండియా మాత్రం అమెరికాకు వియానయాన సేవలు కొనసాగిస్తామని ప్రకటించింది. అమెరికాలోని ప్రధాన పట్టణాలైన శాన్ ఫ్రాన్సిస్కో, చికాగో, వాషింగ్టన్, న్యూయార్క్లకు విమానాలను నడుపుతోంది. -
ఇంటర్నెట్ షట్డౌన్కు మార్గదర్శకాలు
ఈ పదం ఇటీవల మన దేశంలో బాగా సాధారణ మైపోయింది. కొన్ని సమస్యాత్మక పరిస్థితుల్లో ప్రతికూల వార్తలు వ్యాపించకుండా ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడమే ‘ఇంటర్నెట్ షట్డౌన్’. కేంద్ర ప్రభుత్వం తొలిసారి దీనికి సంబంధించి మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. ప్రజా భద్రత లేదా ప్రజల అవసరాల రీత్యా టెలికాం సర్వీసుల తాత్కాలిక నిలిపివేత మార్గదర్శకాలు–2017 ప్రకారం.. ♦ జిల్లా కలెక్టర్లు, మేయర్లు వంటి స్థానిక నిర్ణయాధికారులు ఇంటర్నెట్ షట్డౌన్కు ఆదేశాలు ఇవ్వడానికి అవకాశం లేదు. ♦ కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర హోంశాఖ కార్యదర్శి మాత్రమే ఉత్తర్వులు జారీ చేయాలి. ♦ అత్యవసరం అయితే కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనుమతి పొందిన సంయుక్త కార్యదర్శి, ఆ పైస్థాయి అధికారి మాత్రమే ఈ ఉత్తర్వులు ఇవ్వగలరు. అయితే వీటిని 24 గంటల్లోగా హోం శాఖ కార్యదర్శి తప్పకుండా సమీక్షించాలి. ♦ రాష్ట్రస్థాయిలో అయితే సెక్రటరీ టు ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ది హోం డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీ చేయాలి. అత్యవసరంలో అయితే రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి అనుమతి పొందిన సంయుక్త కార్యదర్శి, ఆపై స్థాయి అధికారి మాత్రమే ఆర్డర్స్ ఇవ్వగలరు. వీటిని సైతం 24 గంటల్లో హోం శాఖ కార్యదర్శి తప్పకుండా సమీక్షించాలి. ♦ ఇంటర్నెట్ షట్డౌన్ ఉత్తర్వులు ఎస్పీ స్థాయి పోలీసు అధికారికి మాత్రమే ఇవ్వాలి. -
కేజీబీవీల్లో దాహం దాహం
అల్లాడుతున్న విద్యార్థినులు, ఉద్యోగులు మూడు రోజులకోసారి స్నానం..దుస్తులు ఉతుక్కోవడమూ కష్టమే నీటి కొరతతో మరుగుదొడ్లు బంద్ హిందూపురంలోని కస్తూరిబా బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో 200 మంది విద్యార్థినులతో పాటు 15 మంది దాకా సిబ్బంది ఉన్నారు. తాగునీటి కోసం రెండు బోర్లు వేయించారు. ఒక బోరులో నీళ్లు అరకొరగా వస్తున్నాయి. మరో బోరు చెడిపోయింది. దీంతో తాగేందుకు, ఇతర అవసరాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో మునిసిపల్ ట్యాంకర్లతో నీటిని తెప్పించుకుంటున్నారు. ఆ నీళ్లు ఏ మాత్రమూ చాలడం లేదు. ఇలాంటి పరిస్థితే జిల్లా వ్యాప్తంగా చాలా కేజీబీవీల్లో ఉంది. వేసవి ప్రారంభమైంది. దీంతో పాటే జిల్లాలోని చాలా కేజీబీవీల్లో నీటి కష్టాలూ మొదలయ్యాయి. జిల్లాలో 62 కేజీబీవీలు ఉన్నాయి. దాదాపు 30 చోట్ల నీటి సమస్య ఉంది. వర్షాభావం వల్ల భూగర్భజలాలు అడుగంటాయి. దీంతో బోర్లు ఒట్టిపోతున్నాయి. అసలే ఎండాకాలం. ఒకరోజు స్నానం చేయకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చాలామంది ఉదయం, రాత్రి రెండు పూటలా స్నానం చేసి ఉపశమనం పొందుతున్నారు. అలాంటిది నీటి కొరతతో కొన్ని కేజీబీవీల్లో మూడు రోజులకోసారి స్నానం చేయాల్సిన దుస్థితి నెలకొంది. రోజూ కనీసం కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా నీళ్లు లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. బ్రహ్మసముద్రం, కనగానపల్లి, హిందూపురం, పరిగి, తనకల్లు, కుందుర్పి, అగళి కేజీబీవీల్లో నీటి సమస్య మరీ జఠిలంగా మారింది. ఒక మనిషికి రోజుకు కనీసం 70 లీటర్ల నీరు అవసరం. అయితే కేజీబీవీల్లో విద్యార్థినులకు ఇందులో సగం కూడా అందడం లేదు. రోజూ స్నానం చేయకపోవడంతో తరగతి గదిలో చమట వాసన భరించలేకపోతున్నామని విద్యార్థినులు వాపోతున్నారు. అలాగే దుస్తులు ఉతుక్కోవడం లేదు. మాసిన దుస్తులను అలాగే వేసుకుంటున్నారు. నీటి సమస్య ఉంది కదా.. ‘సర్దుకోవాలి’ అంటూ సిబ్బంది సలహా ఇస్తున్నారు. మరి కొన్ని కేజీబీవీల్లో మరుగుదొడ్లు ఉపయోగించడం లేదు. నీరులేక అవి నిరుపయోగంగా మారాయి. విద్యార్థినులు బహిర్భూమికి వెళ్లాల్సి వస్తోంది. ఊరి శివారు ప్రాంతాల్లో కేజీబీవీలు ఉండటంతో విద్యార్థినుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. నీటి సమస్య గురించి సంబంధిత అధికారులకు తెలిసినా ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థినులు, తల్లిదండ్రులు, సిబ్బంది వాపోతున్నారు.కనీసం ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అధిగమిస్తాం – వాణీదేవి, గర్ల్చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ (జీసీడీఓ), సర్వశిక్షా అభియాన్ విద్యార్థినులెవరూ ఇబ్బంది పడకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకోవాలని ఆదేశించాం. ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించాం. కేజీబీవీల్లో పర్యటించి నీటి సమస్య ఉన్నచోట అధిగమించేందుకు చర్యలు తీసుకుంటాం. ఏ ఒక్క విద్యార్థినీ ఇబ్బంది పడకుండా చూస్తాం. -
రింగింగ్ బెల్స్ కథ ఇక కంచికేనా?
నోయిడా: ప్రపంచంలో అతి చవకైన ఫోన్ అంటూ ప్రకంపనలు పుట్టించిన రింగింగ్ బెల్స్ మరోసారి వార్తల్లో నిలిచింది. రూ.251కే ఫ్రీడం 251 స్మార్ట్ ఫోన్ అంటూ దిగ్గజ మొబైల్ కంపెనీలకు ముచ్చెమటలు పోయించిన సంస్థ సంస్థ వ్యవస్థాపకుడు, ఎండీ మోహిత్ గోయల్ సంస్థ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. అన్నదమ్ములు మోహిత్, అన్మోల్ మధ్య ఇటీవల చెలరేగిన విభేదాల నేపథ్యంలో మోహిత్ తో పాటు సంస్థ సీఈవో, మోహిత్ భార్య ధార్న గోయల్ కూడా సంస్థకు రాజీనామా చేశారు. దీంతో 2016 ఆరంభంలో(ఫిబ్రవరి)లో అలజడి రేపిన రింగింగ్ బెల్స్ కథ 2016 తో పాటే ముగిసిపోనుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం రింగింగ్ బెల్స్కు మరో డైరెక్టర్ , మోహిత్ సోదరుడు అన్మోల్ కంపెనీ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే అశోక్ చడ్దా కన్సల్టింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగనున్నట్టు తెలిపింది. తమ సంస్థ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని అన్మోల వెల్లడించారు. తమ స్పష్టమైన వ్యాపార లక్ష్యాలకు కట్టుబడి వున్నామని వ్యవస్థాపక నిర్వాహకుడైన అన్ మోల్ తెలిపారు. మరోవైపు కంపెనీ నుంచి బయటకు వచ్చిన మోహిత్ ఎండీఎం ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక నూతన సంస్థను ప్రారంభించ బోతున్నట్టు సమాచారం. కాగా అతి చవగ్గా స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్టు రింగింగ్ బెల్స్ ప్రకటించడంతో దాదాపు ఏడుకోట్లకు పైగా ఈ మొబైల్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. దీంతో ఏకంగా కంపెనీ అధికారిక వెబ్ సైట్ కూడా క్రాష్ అయింది. అనంతరం సీబీఐ దాడులు,ఆందోళన తదితర పరిణామాలు తెలిసిన విషయాలే. అయితే బుక్ చేసుకున్నవాళ్లల్లో ఎంతమందికి ఈ ఫోన్లను అందించిందీ స్పష్టత లేదు. -
బ్యాంకులు, పోస్టాఫీసులు, ఆర్టీసీకి మినహాయింపు
కరెన్సీ కష్టాలకు వ్యతిరేకంగా జరుగు తున్న బంద్ కాబట్టి బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద ఎలాంటి ఆందోళనలు చేయకూడ దని విపక్షాలు నిర్ణరుుంచాయి. ఆర్టీసీ బస్సులు యథాతథంగా తిరగనున్నా యి. ప్రజలు యథావిధిగా బ్యాంకులు,పోస్టాఫీసుల్లో కార్యకలాపాలు ప్రకటించింది. ప్రతిపక్షాలు, వామపక్షాల నేతృత్వంలో సామాన్య ప్రజలు తమ ధిక్కార స్వరాన్ని వినిపించనున్నారు. నల్లధనాన్ని వెలికి తీయడానికంటూ కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసి నేటికి సరిగ్గా ఇరవై రోజులు. ఈ ఒక్క నిర్ణయం దేశ వ్యాప్తంగా పెనుసంచలనమవ్వడంతోపాటు జనానికి కష్టాలు మొదలయ్యారుు. కొద్ది రోజులే కదా సర్దుకుంటుంది అనుకున్నా సమస్య పెద్దదైంది తప్ప సద్దుమణగలేదు. ముందు చూపు లేకపోవడంతో ఏటీఎంలు మొరారుుస్తున్నారుు. నగదు ఉపసంహరణకు పరిమితి విధించడంతో చిన్న వాళ్ల పనులు ఆగిపోయారుు. జిల్లా వ్యాప్తంగా 738 బ్యాంక్ బ్రాంచ్ల వద్ద జనం బారులుదీరారు. గంటలు, రోజులపాటు నోట్ల మార్పిడి కోసం పడిగాపులు కాస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు, బాలింతలు నరకం చూస్తున్నారు. చివరికి ఈ సమస్య ఎంత తీవ్రంగా మారిందంటే శుభకార్యాలు రద్దు చేసుకునే వరకూ వెళ్లింది. చిరు వ్యాపారాలు కుదేలయ్యారుు. సామాన్య మధ్యతరగతి వారికి ఇల్లు గడవడమే కష్టంగా మారింది. ఇదే అదనుగా కొందరు స్వార్ధ పరులు నోట్ల మార్పిడికి అడ్డ దారులు చూపిస్తామంటూ సొమ్ము చేసుకోవడం ప్రారంభించారు. ఆర్టీసీ, రైల్వే, పెట్రోల్ బంక్లలో పాత నోట్లు అనుమతిస్తారన్నప్పటికీ చిల్లర లేకపోవడంతో అక్కడా ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. ఈ కష్టాలు ఎప్పటికి తీరుతాయో స్పష్టత కూడా లేదు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై జనం మండిపడుతున్నారు. గడిచిన 20 రోజుల్లో ఒక్క నల్ల కుబేరుడైనా బ్యాంకుల వద్ద క్యూలో నిలబడ్డాడా అని ప్రధాని మోదీని ప్రశ్నిస్తున్నారు. వారి ఆవేదనకు ప్రతీకగా నేడు జిల్లా వ్యాప్తంగా విపక్షాలు ఆందోళనలు నిర్వహించనున్నారుు. -
ఎన్కౌంటర్కు నిరసనగా నవంబర్ 3న బంద్
హైదరాబాద్: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో అక్టోబర్ 24న జరిగిన ఎన్కౌంటర్కు నిరసనగా సీపీఐ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటి నవంబర్ 3న బంద్కు పిలుపునిచ్చింది. ఎన్కౌంటర్ను కోవర్ట్ ఆపరేషన్గా పేర్కొంటూ.. ఈ బంద్ను తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని సీపీఐ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటి అధికార ప్రతినిధి జగన్ పత్రికా ప్రకటనలో పిలుపునిచ్చారు. -
తాండూరులో కొనసాగుతున్న బంద్
రంగారెడ్డి జిల్లాను యధాతథంగా ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం పిలుపుమేరకు మంగళవారం తాడూరు బంద్ జరుగుతోంది. వ్యాపారసంస్థలు, దుకాణాలు మూతపడ్డాయి, ఆర్టీసీ బస్సులు తిరగలేదు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు. -
మూడో రోజూ చేవేళ్ల బంద్
- భారీగా పోలీసు బలగాల మోహరింపు - పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చేవెళ్ల(రంగారెడ్డి జిల్లా) చేవెళ్లను జిల్లాకేంద్రం చేయాలని చేపట్టిన బంద్ ఆదివారం మూడోరోజూ కూడా కొనసాగింది. వ్యాపార సంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. రెండురోజులుగా చేవెళ్ల పట్టణంలోని హైదరాబాద్- బీజాపూర్ ప్రధాన రహదారి, ముంబై-బెంగళూరు జాతీయ లింకు రహదారిలో ఆందోళనకారులు వాహనాల రాకపోకలను నియంత్రించడం, అడ్డుకోవడంతో ఆదివారం పోలీసు బందోబస్తును భారీస్థాయిలో ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలవరకే జిల్లాలోని పశ్చిమ రంగారెడ్డి జిల్లాలోని పలు పోలీస్స్టేషన్ల నుంచి అదనపు బలగాలు, సిబ్బందిని రప్పించారు. అఖిలపక్షం నాయకులు, జిల్లా సాధనసమితి ఆధ్వర్యంలో పలు గ్రామాలనుంచి ఉదయం 9 గంటలకే మండల కేంద్రానికి చేరుకొని ఆందోళనను ప్రారంభించారు. మొదటగా బస్స్టేషన్ , మార్కెట్యార్డు, పోలీస్స్టేషన్ , శంకర్పల్లి చౌరస్తాలకు ర్యాలీగా వెళ్లి అక్కడక్కడ తెరిచి ఉంచిన దుకాణాలను మూసి వేయించారు. అనంతరం హైదరాబాద్- బీజాపూర్ రహదారిపై ఉదయం నుంచి సాయంత్రం 4 గంటలవరకు రాస్తారోకో చేశారు. ఆందోళనకారులు టైర్లను రోడ్లపైకి తెచ్చి అంటించడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. అయినా కిరోసిన్ పోసిన టైర్లను ట్రాక్టర్లో తెచ్చి అంటించడంతో సాయంత్రం వరకు రోడ్డుపై కాలుతూనే ఉన్నాయి. దీంతో ఆందోళనకారులకు, పోలీసులకు తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఆందోళనకారులు రోడ్డుమీదే వంటావార్పు నిర్వహించి సహపంక్తి భోజనాలు చేశారు. మొత్తం మీద చెవెళ్ల బంద్ మూడోరోజు కూడా విజయవంతం అయింది. -
కల్లూరులో స్వచ్ఛంద బంద్
రాజకీయాలు ఎన్నికలకే పరిమితం రెవెన్యూ డివిజన్ కోసం పోరాడుదాం: సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర కల్లూరు : కల్లూరును రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. కల్లూరులో బుధవారం నిర్వహించిన బంద్లో ఆయన పాల్గొన్నారు. నిరాహారదీక్ష శిబిరాన్ని సందర్శించి ప్రసంగించారు. రాజకీయాలు ఎన్నికలకే పరిమితమన్నారు. రెవెన్యూ డివిజన్ కేంద్రం ప్రకటన వరకు కలిపి పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. భౌగోళిక స్వరూపాన్ని మార్చి చూపించడం వల్లనే శాస్త్రీయత లోపించిందన్నారు. ఇది కాస్త రెండు ప్రాంతాల ప్రజల మధ్య భేదాభిప్రాయాలకు దారితీసే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40 కి.మీ పరిధిలో రెవెన్యూ డివిజన్ కేంద్రం ఉండాలనే నిబంధన ఉన్నా వైరాను ఎందుకు ఎంచుకున్నట్లు అని ప్రశ్నించారు. కల్లూరు అన్ని మండలాలకు సమానదూరంలో ఉంటుందన్నారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందన్నారు. దీనిపై జిల్లా మంత్రి తుమ్మల, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, జిల్లా కలెక్టర్ లోకేష్కుమార్, జేసీ దివ్యను కలిసి వినతిపత్రాలు సమర్పించామన్నారు. హేతుబద్ధత గల భౌగోళిక స్వరూపాన్ని పరిశీలించి ప్రభుత్వం కల్లూరులో రెవెన్యూ డివిజన్ కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే సండ్రతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూసంపూడి రవీందర్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసి రాష్ట్ర నాయకులు గోకినపల్లి వెంకటేశ్వరరావు, అఖిలపక్షం నాయకులు పెద్దబోయిన దుర్గాప్రసాద్, కాటమనేని వెంకటేశ్వరరావు, కర్నాటి అప్పిరెడ్డి, ఎ. వెంకన్న, గొర్రెపాటి రాధయ్య, గంగుల పుల్లారావు, జాస్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు. – బంద్ సందర్భంగా వ్యాపార, విద్యాసంస్థలు, హోటళ్లు మూసివేశారు. -
కాశ్మీర్లో కొనసాగుతున్న కర్ఫ్యూ
-
జమ్మూకశ్మీర్లో కొనసాగుతున్న ఆంక్షలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో వేర్పాటువాదులు తమ ఆందోళనను పొడిగించారు. ఆగస్ట్ 5 వరకు బంద్ కొనసాగతుతుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు.. కర్ఫ్యూ, ఆంక్షలు కొనసాగుతాయని ప్రకటించారు. పుల్వామా, కుల్గాం, షోపియాన్లతో పాటు కశ్మీర్ వ్యాలీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోందని సీనియర్ పోలీస్ అధికారి ఆదివారం వెల్లడించారు. శ్రీనగర్ ఓల్డ్ సిటీ ప్రాంతంలో సైతం ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. భద్రతా బలగాలు శాంతిభద్రతల అంశంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయని పోలీసు అధికారులు వెల్లడించారు. తీవ్రమైన హింస, ప్రజాధనాన్ని ధ్వసం చేసే చర్యలను అడ్డుకోవడానికే ఆంక్షలను పొడిగిస్తున్నట్లు వారు తెలిపారు. -
సర్వర్తో సర్వం బంద్
ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో పనిచేయని సాఫ్ట్వేర్ గిరిజన పట్టభద్రులకు తప్పని ఇక్కట్లు.. రెండు నెలలుగా ఇదే పరిస్థితి.. పట్టించుకోని అధికారులు.. ఉన్నత లక్ష్యంతో నెలకొల్పిన ఎంప్లాయిమెంట్ కార్యాలయం లక్ష్యాలను చేరుకోవటంలో విఫలమవుతోంది. సరిగా పనిచేయని సాఫ్ట్వేర్తో సిబ్బంది సతమతమవుతున్నారు. గిరిజన అభ్యర్థులు రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. కనీసం సాఫ్ట్వేర్ మరమ్మతులకు కూడా బడ్జేట్ లేకపోవడం విచారకరం. రెండు నెలలుగా ఈ పరిస్థితి కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవటం శోచనీయం. ఇకనైనా పీఓ రాజీవ్ దీనిపై దష్టి సారించాల్సి ఉంది. భద్రాచలం : ఏజెన్సీ ప్రాంత గిరిజన అభ్యర్థులు తమ విద్యార్హతలను నమోదు చేసుకునేందుకు భద్రాచలం ఐటీడీఏలోనే ఎంప్లాయిమెంట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. నిర్లక్ష్యరాస్యులు మొదలుకొని, ఉన్నత విద్యనభ్యసించిన వారు కూడా ఇక్కడ తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. గతంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాల భర్తీ భద్రాచలం ఎంప్లాయిమెంట్ ద్వారానే చేసేవారు. ఇక్కడ పేరు నమోదు చేసుకుంటే చాలు, నేరుగా ఇంటికి కాల్ లెటర్లు వచ్చిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. విద్య, వైద్య, రెవెన్యూ తదితర శాఖలోని ఉద్యోగాల ¿¶ ర్తీకి ఐటీడీఏ కేంద్రంగానే ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేవి. నిరుద్యోగుల సంఖ్య పెరగడంతో ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యింది. ప్రస్తుతం దీని ద్వారా ఎటువంటి ఉద్యోగాల భర్తీ జరుగటం లేదు. కానీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే పోటీ పరీక్షలు, ఉద్యోగాల భర్తీకి తప్పనిసరిగా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో పేరు నమోదు చేసుకోవాలనే నిబంధన ఉంది. దీనికోసం గిరిజన అభ్యర్థులు క్వూ కడుతున్నారు. తరచూ మొరాయిస్తున్న సాఫ్ట్వేర్.. ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో గత కొన్ని రోజులుగా సాఫ్ట్వేర్ పనిచేయటం లేదని అభ్యర్థులు చెబుతున్నారు. హైదరాబాద్లోని ఉపాధి కల్పన కార్యాలయం అనుసంధానంతో ఏ రోజుకారోజు ఉపాధి గుర్తింపు కార్డులను జారీ చేయాల్సి ఉంది. కానీ రెండు నెలలుగా కంప్యూటరైజ్డ్ గుర్తింపు కార్డులను ఇవ్వటం లేదు. కార్డులు అత్యవసమైనటువంటి వారికి కూడా ప్రత్యేకంగా రూపొందించిన నమూనాలో విద్యార్హతలను రాసి ఇస్తున్నారు. దీనిని కొన్ని సందర్భాల్లో అనుమతించటం లేదని గిరిజన నిరుద్యోగులంటున్నారు. రోజు వంద మంది వరకూ నిరుద్యోగులు వస్తుంటారు. కానీ ఇక్కడ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. కంప్యూటర్ హార్డ్డిస్క్ హైదరాబాద్ తీసుకెళ్లి మరమ్మతులు చేయించుకునేందుకు కూడా ఎటువంటి బడ్జెట్ లేకపోవటంతో రోజుల తరబడి అవి మూలనపడి ఉంటున్నాయి. 52వేల మంది నమోదు.. ఇప్పటి వరకూ ఇక్కడ 52వేల మంది అభ్యర్థులు తమ పేర్లును నమోదు చేసుకున్నారు. పదో తరగతి విద్యార్హతతో 20,515 మంది, ఇంటర్తో 12,745 మంది, డిగ్రీ (బీఏ)విద్యార్హతతో 3వేలు, బీఎస్సీతో 2వేలు, బీకాంతో 2,432, బీఈడీతో 2,215, టీటీసీ 466, ఐటీఐ ఎలక్ట్రీషియన్ 1,663, ఐటీఐ ఫిట్టర్ 714, పదో తరగతి లోపు 2,204, కంప్యూటర్ కోర్సులతో 854, ఏఎన్ఎంలతో 608, జీఎన్ఎంలతో 185 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. నిర్లక్ష్యరాస్యులు సైతం ఏదో ఒక పని ఇప్పించాలంటూ 608 మంది అర్జీ పెట్టుకున్నారు. ఈ సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గిరిజన తెగల్లో కూడా నిరుద్యోగులు పెరగటంతో వారికి ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఐటీడీఏలో ప్రత్యేకంగా భవిత సెల్ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా వివిధ నగరాల్లో ఉన్న ప్రైవేటు కంపెనీల్లో గిరిజన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా ప్రస్తుత పీఓ రాజీవ్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. అయితే ఎంప్లాయిమెంట్ కార్యాలయాన్ని ప్రక్షాళన చేసి, దీని ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే బాగుంటుందని గిరిజన యువత అంటున్నారు. ఆ దిశగా ఐటీడీఏ అధికారులు ఆలోచన చేయాలని కోరుతున్నారు. సమస్యలపై దష్టి సారించాం.. జయదేవ్ అబ్రహం, డిప్యూటీ డైరక్టర్, టీడబ్ల్యూ ఎంప్లాయిమెంట్ కార్యాలయంపై దష్టి సారించాం. అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా సరిపడా సిబ్బందిని నియమించేలా ఏర్పాట్లు చేశాం. సాఫ్ట్వేర్ ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే. దానిని హైదరాబాద్ తీసుకెళ్లి మరమ్మతులు చేయించాలి. అక్కడికి పంపించాం. -
ఆగస్టు 1న విద్యాసంస్థల బంద్
ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాల మూసివేతను ఉపసంహరించుకోవాలని, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆగస్టు 1న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చింది. స్థానిక ప్రెస్క్లబ్లో మంగళవారం జేఏసీ ఆధ్వర్యాన బంద్ వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. కేజీనుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని, రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్గా తీర్చుదిద్దుతామని ప్రకటనలు చేస్తూనే చంద్రబాబు ప్రభుత్వం మరోవైపు హేతుబద్ధీకరణ పేరుతో పాఠశాలలు, హాస్టళ్లను మూసివేస్తోందన్నారు. ఏడు ప్రధాన డిమాండ్లతో చేపడుతున్న బంద్ను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రామకృష్ణ, రవిచంద్ర (పీడీఎస్యూ), ఎన్.కోటి (ఎస్ఎఫ్ఐ), షేక్ బాజీసైదా (పీడీఎస్ఓ), సీహెచ్.రఘువీరా, షెహెన్షా (ఏఐఎస్ఎఫ్) పాల్గొన్నారు. -
ఇల్లందులో కొనసాగుతున్న బంద్
ఇల్లందు కేంద్రంగా జిల్లా ఏర్పాటుచేయాలన్న డిమాండ్తో అఖిలపక్షం ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం ఇల్లందు బంద్ కొనసాగుతోంది. దుకాణాలు తెలుచుకోలేదు. విద్యాసంస్థలు మూతపడ్డాయి. బంద్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. -
రెండు రాష్ట్రాల బంద్కు మావోయిస్టుల పిలుపు
ఖమ్మం: ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 4, 5 తేదీల్లో రెండు తెలుగు రాష్ట్రాల బంద్కు మావోయిస్టులు పిలుపు ఇచ్చారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా సీపీఐ మావోయిస్టుల కమిటీ మంగళవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ప్రజలపై, విప్లవోద్యమాలపై ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. తెలంగాణ సీఎం హిందూ పాసిస్టులతో కుమ్మక్కై భూ స్వామ్య, నల్లదొరల పాలన కొనసాగిస్తున్నారని విమర్శించింది. పోలవరం ప్రాజెక్టుల నిర్వాసిత మండలాల పీడిత ప్రజలకు అన్యాయం చేస్తున్న పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. -
భారత్ లో ఫేస్ బుక్ ఫ్రీ బేసిక్స్ బంద్
న్యూఢిల్లీ: వివిధ వెబ్సైట్లకు వివిధ రకాల చార్జీలు విధించకుండా నెట్ న్యూట్రాలిటీకి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ మద్దతు పలికిన దరిమిలా.. వివాదాస్పదమైన తమ ఫ్రీ బేసిక్స్ సర్వీసులను భారత్లో నిలిపివేయాలని ఫేస్బుక్ నిర్ణయించింది. భారత్లో యూజర్లకు ఫ్రీ బేసిక్స్ ఇకపై అందుబాటులో ఉండదని ఫేస్బుక్ ప్రతినిధి తెలిపారు. డేటా చార్జీల ప్రసక్తి లేకుండా నిర్దిష్ట వెబ్సైట్లను ఉచితంగా అందించేలా రిలయన్స్ కమ్యూనికేషన్స్తో కలిసి ఫేస్బుక్ తలపెట్టిన ఈ సర్వీసులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. కంటెంట్ను బట్టి చార్జీలు విధించడం సరికాదంటూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేయగా, ట్రాయ్ కూడా ఇందుకు అనుకూలంగా నిబంధనలు ప్రకటించింది. ‘వలసవాద’ కామెంట్లపై ఆంద్రీసెన్ సారీ .. వలసవాద వ్యతిరేక భావజాలం పేరిట ప్రతీదాన్ని వ్యతిరేకించడం వల్లే భారత్ నష్టపోతోందంటూ చేసిన వ్యాఖ్యలపై ఫేస్బుక్ బోర్డు సభ్యుడు మార్క్ ఆంద్రీసెన్ క్షమాపణ చెప్పారు. భారత రాజకీయాలు, ఆర్థికాంశాలపై ట్వీటర్లో తాను చేసిన వ్యాఖ్యలు అవగాహనారాహిత్యంతో కూడుకున్నవని పేర్కొన్నారు. తాను నూటికి నూరు శాతం వలసవాదానికి వ్యతిరేకినని, భారత్ సహా ప్రతి దేశంలోనూ స్వాతంత్య్రం.. స్వేచ్ఛకే తన మద్దతు అని ఆంద్రీసెన్ వివరించారు. ఫ్రీ బేసిక్స్ వంటి పథకాలకు వ్యతిరేకంగా ట్రాయ్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆంద్రీసెన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ ... ఆంద్రీసెన్ వ్యాఖ్యలతో కంపెనీకి సంబంధం లేదన్నారు. భారతదేశమన్నా, భారతీయులన్నా తనకు అపార గౌరవమని, అనేక సంవత్సరాలుగా వారు తనను ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. -
కేటీపీపీలో విద్యుదుత్పత్తికి అంతరాయం
గణపురం(వరంగల్): వరంగల్ జిల్లా గణపురం మండలం చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం (కేటీపీపీ)లో 600 మెగావాట్ల ప్లాంట్లో మంగళవారం మధ్యాహ్నం ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ప్లాంట్లోని బాయిలర్లో సాంకేతికలోపం తలెత్తడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఇంజనీర్లు ప్లాంట్ను షట్డౌన్ చేసి మరమ్మతులు మొదలు పెట్టారు. -
ఆసిఫాబాద్ను జిల్లా కేంద్రంగా చేయాలి
ఆసిఫాబాద్ మండలంను ఆదిలాబాద్ జిల్లాకేంద్రంగా చేయాలంటూ అఖిలపక్షం ఇచ్చిన బంద్ విజయవంతం అయింది. అంతరాష్ట్ర రహదారిపై అన్ని పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రాస్తారోకోకు దిగారు. ఆసిఫాబాద్ను వెంటనే జిల్లాకేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
నేడు హైదరాబాద్ జేఎన్టీయూ బంద్
సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలకు మద్దతుగా శుక్రవారం బంద్ పాటించాలని జేఎన్టీయూ విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. యూనివర్సిటీతోపాటు అనుబంధ కళాశాలల్లోనూ తరగతులు బహిష్కరించాలని కోరాయి. బంద్లో భాగంగా యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ధర్నాలో పాల్గొనాలని కోరాయి. -
ఇంటి పన్నులు తగ్గించాలని జమ్మికుంట బంద్
ఇంటి పన్నులు 50 శాతం మేర తగ్గించాలని డిమాండం చేస్తూ అభిలపక్షాల పిలుపు మేరకు సోమవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బంద్ కొనసాగుతోంది. ఉదయం నుంచి దుకాణాలు, వ్యాపారసంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోలేదు. ఆర్టీసీ బస్సులు కూడా తిరగలేదు. అఖిలపక్షాల నేతలు బంద్ను పర్యవేక్షిస్తున్నారు. -
వాయు సేన దాడులపై మావోల నిరసన
చత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు మంగళవారం రాత్రి 25 వాహనాలను దగ్ధం చేశారు. వాయుసేన దాడులను నిరసిస్తూ మావోయిస్టులు బుధవారం దండకారణ్య బంద్కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో హాహాల్ది ఐరన్ఓర్ మైన్స్పై సుమారు 150 మంది సాయుధ మావోయిస్టులు దాడి చేశారు. మైన్లోని డీప్లాంట్లో ఉన్న డంపర్లు, మిక్సర్లు, లోడర్లు, జీపులు, పొక్లెయిన్లను మావోయిస్టులు తగులబెట్టారు. -
జాబు ఏది బాబూ..!
ఏపీపీఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని అనంతపురం శ్రీకృష్ణదేవరాయ వర్సిటీలో విద్యార్థులు బుధవారం బంద్ పాటించారు. స్కూల్ అసిస్టెంట్లను జూనియర్ లెక్చర్ర్లగా పదోన్నతి ఇవ్వడాన్ని విద్యార్థులు వ్యతిరేకించారు. ఉద్యోగ ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఎన్నో ఆశలు కల్పించి గద్దెనెక్కిన చంద్రబాబు ఇచ్చిన హామీలను మరవడం దారుణమన్నారు. -
తండ్రీకొడుకుల హత్యకు నిరసనగా బంద్
శ్రీనగర్: ఓ తండ్రి అతడి మూడేళ్ల బాలుడి హత్యా ఘటనకు సంబంధించి ఆదివారం కాశ్మీర్లోయలో బంద్ పాటిస్తున్నారు. ఎక్కడికక్కడ దుకాణాలు మూసివేశారు. రోడ్లతోపాటు పలు ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. బషీర్ అహ్మద్ అనే వ్యక్తి గతంలో కొన్ని తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డాడు. అనంతరం అలాంటి పనులకు స్వస్తి పలికి తిరిగి మారిపోయి జైలు శిక్షను పూర్తి చేసి వచ్చిన క్రమంలో ఆయనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేశారు. అనంతరం అతడి మూడేళ్ల కూమారుడిని కూడా చంపేశారు. ఈ ఘటన బారాముల్లా జిల్లాలో సోపోర్ పట్టణంలో చోటు చేసుకుంది. దీంతో హర్పియత్ కాన్ఫరెన్స్కు చైర్మన్ సయ్యద్ అలీ జిలానీ ఈ బంద్కు పిలుపునిచ్చాడు. -
'24 గంటల్లోగా బ్యూటీ పార్లర్లు మూసేయాలి'
జమ్ము: అప్పుడెప్పుడో ఆఫ్ఘనిస్థాన్ కొండల్ని దాడి కశ్మీర్లోయలోకి ప్రవేశించిన తాలిబన్ విష సంస్కృతి మళ్లీ బుసలు కొడుతోంది. మహిళలు, విద్యార్థినుల వస్త్రధారణ, నడతను నిర్దేశిస్తూ ఉగ్రవాదులు జారీచేసిన హెచ్చరికల రూపంలో అది మరోసారి బయటపడింది. 'అమ్మాయిలెవ్వరూ బురఖా ధరించకుండా బయటికి రావద్దు. అది లేకుండా బడికి, కాలేజీకి వచ్చేవాళ్లను ఉపేంక్షిచొద్దు' అంటూ హిజబుల్ ముజాహిద్దీన్ సంస్థ పేరుతో పుల్వామా పట్టణంలోని అన్ని విద్యాసంస్థలవద్ద వాల్ పోస్టర్లు వెలిశాయి. ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న బ్యూటీపార్లర్లన్నీంటినీ 24 గంటల్లోగా మూసేయాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని కూడా ఉగ్రవాదులు హెచ్చరించారు. ఇక మగవాళ్లు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఇప్పటికే మద్యం, డ్రగ్స్ తీసుకునే అలవాట్లున్నవాళ్లు వెంటనే మానేయాలని పిలుపునిచ్చారు. కలకలంరేపిన ఈ పోస్టర్ల ఉదంతంపై దర్యాప్తు ప్రారంభించామని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే పనులు ఎవరు చేసినా ఆక్షేపణీయమేనని పుల్వామా సీనియర్ ఎస్పీ తేజిందర్ సింగ్ అన్నారు. నిందుతుల్ని త్వరలోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కాగా, కశ్మీర్ లో ఇలా మహిళల వస్త్రధారణను నిర్ధేశిస్తూ పోస్టర్లు అంటించిన ఉదంతాలు గతంలోను పలుమార్లు వెలుగులోకి వచ్చాయి. -
నేటి అర్ధరాత్రి నుంచి ఆటోల బంద్
సాక్షి, హైదరాబాద్: ఆటోడ్రైవర్లు బంద్కు పిలుపునిచ్చారు. తనిఖీల పేరిట ఆర్టీఏ, ట్రాఫిక్ సిబ్బంది ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం అర్ధరాత్రి (ఈ నెల 27) నుండి నిరవధిక ఆటోబంద్కు తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ పిలుపునిచ్చింది. బుధవారం హైదరాబాద్లోని హైదర్గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్, జాయింట్ కన్వీనర్లు జె.రవీందర్, లక్ష్మీనర్సయ్యలు మాట్లాడారు. ఈ నెల 28న ఉదయం 11 గం టలకు ట్రాన్స్పోర్ట్ భవ నం ముట్టడి కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు నిరవధిక బంద్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
బంద్ నేపథ్యంలో శ్రీనగర్ లో ఆంక్షలు విధింపు
శ్రీనగర్: సెక్యూరిటీ సిబ్బంది కాల్పుల్లో ఇద్దరు యువకులు మరణించిన నేపథ్యంలో ఆందోళనకారులు బంద్ ప్రకటించిన నేపథ్యంలో శ్రీనగర్ పట్టణంలో భద్రతాపరమైన ఆంక్షలు బుధవారం కూడా కొనసాగుతునే ఉన్నాయి. బడ్గమ్ జిల్లాలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు యువకులు మరణించిన సంగతి తెలిసిందే. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జిల్లాలోని నోగామ్, సఫకదల్, రేయిన్ వారి, ఎం.ఆర్ గంజ్, నోవ్ హట్టా, ఖన్యార్ లో బుధవారం కూడా ఆంక్షలు విధించామని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. -
నోకియా మూసివేత
‘కనెక్టింగ్ ద పీపుల్’ అనే నినాదంతో వచ్చిన నోకియా డిస్కనెక్టింగ్ ద ఎంప్లాయిస్గా వ్యవహరించింది. నోకియా తమిళనాడు విభాగంలో పనిచేస్తున్న 20 వేల మంది జీవితాలను రోడ్డుపాలు చేయడం ద్వారా తానిచ్చిన నినాదానికి విరుద్ధంగా వ్యవహరించింది. విధులకు హాజర య్యేందుకు శనివారం యథావిధిగా పరిశ్రమ వద్దకు వచ్చిన ఉద్యోగులను వెళ్లిపొమ్మంది. చెన్నై, సాక్షి ప్రతినిధి : ముంబై తరువాత పారిశ్రామిక ప్రగతికి నోచుకుంటున్న తమిళనాడు ఫిన్లాండ్ దేశానికి చెందిన నోకియా సంస్థకు సైతం ఆహ్వానం పలికింది. ప్రభుత్వ ఆహ్వానం మేరకు 2006లో 50 కోట్ల డాలర్ల పెట్టుబడితో నగర శివార్లలోని శ్రీపెరంబుదూర్లో పరిశ్రమను స్థాపించింది. ఈ పరిశ్రమలో శాశ్వత ప్రాతిపదిక కింద 8 వేల మంది ఉద్యోగులను, కార్మికులను చేర్చుకుంది. ఇదే విభాగంపై పరోక్షంగా ఆధారపడి మరో 12 వేల మంది జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్లపాటూ లాభాలబాటలో నడిచిన చెన్నై నోకియా భారీగా పన్నుల బకాయిలు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు గత ఏడాది ఆకస్మికంగా నోకియా లెక్కలు తనిఖీ చేసి వివిధ పన్నుల రూపేణా రూ.2,400 కోట్లు చెల్లించాలని నోటీసులు జారీచేశారు. అలాగే ఒక కేసు కింద రూ.3,500 కోట్లు చెల్లించాలని మద్రాసు హైకోర్టు తీర్పు చెప్పింది. ఒక్క చెన్నైలోని పరిశ్రమకేగాక అన్నిచోట్ల నష్టాలబాట పట్టిందో ఏమో నోకియా యాజమాన్యం అమ్మకానికి పెట్టింది. ప్రసిద్ధ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ వారు నోకియాను అంతర్జాతీయ స్థాయిలో అన్ని యూనిట్లను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. భారీ లాభాల బాటలో పయనిస్తున్న మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయడం వల్ల తమ బతుకులు మరింతగా వెలిగిపోతాయని చెన్నై యూనిట్ ఉద్యోగులు, కార్మికులు సంబరపడిపోయారు. ఈ క్రమంలో చెన్నై యూనిట్ వివాదాల్లో కూరుకుపోయినట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ కనుగొంది. ఈ ఏడాది ప్రథమార్థంలో నోకియా సంస్థ కొనుగోలు ఒప్పందం చేసుకునే సమయంలో చెన్నై యూనిట్ను నిరాకరించింది. అన్ని నోకియా యూనిట్లు మైక్రోసాఫ్ట్లో విలీనమైపోగా, శ్రీపెరంబుదూర్లోని యూనిట్ మిగిలిపోవడంతో నవంబరు 1న మూసివేస్తున్నట్లు యాజమాన్యం మూడు నెలల క్రితం ప్రకటించింది. తమ గతేంటని ఆందోళనకు దిగిన ఉద్యోగ, కార్మిక సంఘాలతో నోకియా యాజమాన్యం చర్చలు ప్రారంభించింది. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పొందిన వారికి పెద్ద మొత్తాలు ఇస్తామంటూ ఆశచూపింది. రిటైరైనపుడు దక్కే మొత్తానికి అదనంగా రూ.2లక్షలు కలిపి చెల్లిస్తామని నమ్మబలికింది. ఈ నిర్ణయాన్ని కొందరు అంగీకరించగా, మరికొందరు వ్యతిరేకించారు. దీంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. అడపాదడపా చర్చలు సాగుతుండగానే మూసివేత గడువు ముంచుకు రావడంతో శనివారం యూనిట్ ప్రధాన గేటుకు తాళాలు వేసింది. చర్చలు సాగుతున్నాయి కదా అని యథాప్రకారం ఉదయాన్నే విధుల్లోకి వచ్చిన ఉద్యోగులు తాళం వేసి ఉన్న గేట్లు చూసి విస్తుపోయారు. ఉద్యోగులు, కార్మికులు జొరబడకుండా ఒక డీఎస్పీ, 5 మంది ఇన్స్పెక్టర్లు, 50 మంది కానిస్టేబుళ్లతో యాజమాన్యం భారీ పోలీస్ బందోబస్తును సిద్దం చేసింది. ఇక చేసేదిలేక సంస్థ ముందు కొద్ది సేపు నినాదాలు చేసి, ఇళ్లకు వెళ్లిపోయారు. రాష్ట్రంలోని అన్నాడీఎంకే ప్రభుత్వమే ఇక్కడి నోకియా యూనిట్ను స్వాధీనం చేసుకుని ‘అమ్మ సెల్ఫోన్’ను ఉత్పత్తి చేయవచ్చు కదా అని ఓ వామపక్షనేత చమత్కరించారు. -
కోలార్ కలెక్టర్ బదిలీ
ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపినందుకు బహుమానం ఒత్తిళ్లకు తలొగ్గిన సర్కార్ కోలార్ ప్రజల నిరసన నేడు జిల్లా బంద్ కోలారు : అవినీతికి తలొంచకుండా, ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపిన ఐఏఎస్ అధికారికి రాష్ట్ర ప్రభుత్వం బదిలీని కానుకగా అందజేసింది. ఇసుక మాఫియాతో పాటు స్థానిక నేతల ఒత్తిళ్లకు రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గింది. కోలారు జిల్లాలోని ఇసుక మాఫియాను అరికట్టడంలో తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్లిన కలెక్టర్ డీకే రవిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్ రవిని రాష్ట్ర వాణిజ్య పన్నుల అదనపు కమిషనర్గా నియమించింది. బీబీఎంపీలో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి కేవీ తిలక్చంద్రను కోలారు కలెక్టర్గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో కోలారు సీఈవో వినోత్ ప్రియను బదిలీ చేసి సకాల అదనపు డెరైక్టర్గా నియమించింది. కోలారు సీఈవోగా మంజునాథ్ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పంతం నెగ్గించుకున్న ప్రజాప్రతినిధులు కలెక్టర్ రవి తమకు కొరకాని కొయ్యగా తయారయ్యాడని భావించిన కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు కలెక్టర్ను బదిలీ చేయించడానికి కంకణం కట్టుకుని ఎట్టకేలకు విజయం సాధించారు. ఇసుక మాఫియాను అరిక ట్టడంతో పాటు భూ మాఫియాపై ఉక్కుపాదం మోపి ఆక్రమణలు తొలగిస్తూ వస్తున్న కలెక్టర్ చర్యలు కొంతమందికి నచ్చలేదు. కలెక్టర్ వద్ద తమ మాట చెల్లుబాటు కాదని భావించిన నాయకులు ఆయనను ఇక్కడి నుంచి బదిలీ చేయించడానికి పెద్ద ఎత్తున కుట్రలు చేశారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు కొంతమంది ముఖ్యమంత్రి వద్ద కలెక్టర్ను బదిలీ చేయాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చి సఫలమయ్యారు. గత కొద్ది రోజుల క్రితమే కోలారు కలెక్టర్ను బదిలీ చేసేది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య మాటలు వ్యర్థ మయ్యాయి. కలెక్టర్ను జిల్లా నుంచి బదిలీ చేయ కూడదని ప్రజా సంఘాలు, రైతు సంఘాలు పెద్ద ఎత్తున చేపట్టిన ఆందోళనకు విలువ లేకుండా పోయింది. అవినీతికి తావు లేకుండా.... కోలారు కలెక్టర్గా గత సంవత్సరం ఆగస్టు నెలలో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే కలెక్టర్ రవి అవినీతికి తావులేని పారదర్శక మైన పాలనను అందించేందుకు కృషి చేశారు. జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారు. కలెక్టర్ తీసుకున్న చర్యల వల్ల జిల్లాలో పూర్తిగా ఇసుక అక్రమ రవాణా నిలిచి పోయింది. దీన్ని జీర్ణించుకోలేని ఇసుక మాఫియా అప్పుడే కలెక్టర్ను బదిలీ చేయించడానికి ప్రయత్నాలు చేసి భంగపడ్డారు. పాలనను ప్రజలకు చేరువ చేయలనే సదుద్దేశంతో కలెక్టర్ రవి జిల్లాలో రెవెన్యూ అదాలత్ , పోడి అదాలత్ తదితర వినూత్న కార్యక్రమాలను ప్రారంభించి రైతుల భూ సమస్యలను సత్వరమే పరిష్కరించారు. కలెక్టర్ ప్రారంభించిన ఈ కార్యక్రమం జిల్లా ప్రజలను ఎంతగానో ఆకర్షించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి ప్రశంసలు అందాయి. భూమాఫియాపై కన్నెర్ర : ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకున్న భూ మాఫియాపై కన్నెర్ర చేసిన కలెక్టర్ రవి ఆక్రమణల స్వాధీనానికి నడుం బిగించారు. ఇదే కలెక్టర్ బదిలీకి కారణ మయిందని చెప్పవచ్చు. బంగారు పేటలో కాన్ఫిడెంట్ గ్రూప్ సంస్థ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని గోల్ఫ్కోర్సును నిర్మించిందని ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి ఆక్రమణ దారులకు నోటీసులు జారీ చేశారు. ఇది సహించని భూ మాఫియాదారులు తమ ప్రభావాన్ని చూపించారు. ప్రజా ప్రతి నిధులపై తీవ్ర ఒత్తిడి తీసుకు వచ్చి కలెక్టర్ను బదిలీ చేయించారు. కలెక్టర్ను బదిలీ చేస్తే ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని భావించిన ప్రభుత్వం కలెక్టరే బదిలీ కోరుతూ ఉత్తరం రాశారని ప్రచారం చేయించడం గమనార్హం. నేడు కోలార్ జిల్లా బంద్ జిల్లా కలెక్టర్ డీ కే రవిని ప్రభుత్వం బదిలీ చేయడాన్ని నిరసిస్తూ వివిధ సంఘాలకు చెందిన కార్యకర్తలు బుధవారం సాయంత్రం నగరంలోని బస్టాండు సర్కల్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కలెక్టర్ బదిలీకి కారకులైన ప్రజా ప్రతినిధులను దుమ్మెత్తి పోశారు. ప్రభుత్వం వెంటనే కలెక్టర్ బదిలీ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఆందోళనను తీవ్ర తరం చేస్తామన్నారు. కలెక్టర్ బదిలీని నిరసిస్తూ అన్ని సంఘటనలు కలిసి గురువారం జిల్లా బంద్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆందోళనలో బీజేపీ నాయకులు, సీపీఐ, సీపీఎం, కేపీఆర్ఎస్, రైతు సంఘం, రక్షణా వేదిక, వివిధ సంఘటనలకు చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు . -
12 గంటల బెంగళూరు బంద్
-
బంద్ విజయవంతం
ముందస్తు సెలవు ప్రకటించిన ఐటీ, బీటీ, ప్రైవేట్ కంపెనీలు పరిమిత సంఖ్యలో సంచరించిన బీఎంటీసీ, ఆర్టీసీ బస్సులు బోసిపోయిన విధానసౌధ చిన్నపాటి ఘటనలు మినహా బంద్ ప్రశాంతం భారీగా మొహరించిన బలగాలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో పెరిగిపోతున్న అత్యాచారాలకు నిరసనగా సుమారు 50 కన్నడ సంఘాలు ఇచ్చిన ‘12 గంటల బెంగళూరు బంద్’కు మిశ్రమ స్పందన లభించింది. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వహించిన ఈ బంద్కు స్వచ్ఛంద మద్దతు లభించింది. ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలు మూతపడ్డాయి. వ్యాపారులు, హోటళ్ల యజమానులు బంద్కు మద్దతు ప్రకటించారు. ఆటో, టాక్సీ సంఘాల్లోని ఓ వర్గం బంద్కు మద్దతునిచ్చాయి. బీఎంటీసీ, ఆర్టీసీ బస్సులు పరిమిత సంఖ్యలోనే తిరిగినా, ప్రయాణికుల రద్దీ చాలా తక్కువగా కనిపించింది. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు పని చేసినా ఉద్యోగులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. సందర్శకులు, ఉద్యోగులు పెద్దగా రాకపోవడంతో సచివాలయం విధాన సౌధ బోసిపోయింది. ఐటీ, బీటీ కంపెనీలు సహా అనేక ప్రైవేట్ కార్యాలయాలు సెలవు ప్రకటించాయి. నగరంలో నిత్యం రద్దీగా ఉండే వాణిజ్య ప్రాంతాలు, కూడళ్లు బోసిపోయి కనిపించాయి. చందాపుర, టానరీ రోడ్డుల్లో రెండు బీఎంటీసీ బస్సులపై ఎవరో ఆకతాయిలు రాళ్లు రువ్వడం మినహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. దీంతో పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులకు కూడా పెద్దగా పని లేకుండా పోయింది. ఆందోళన చేపట్టిన వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడకుండా శాంతియుతంగా బంద్ నిర్వహించడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బంద్లో పాల్గొనడం లేదని కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలి ప్రకటించినప్పటికీ, ఒకటి, రెండు మినహా థియేటర్లన్నీ మూతపడ్డాయి. అనేక థియేటర్లలో మార్నింగ్ షో, మ్యాట్నీలను రద్దు చేశారు. ఆరు గంటల తర్వాత కొన్ని థియేటర్లలో ఫస్ట్ షో ప్రారంభమైనప్పటికీ, పది శాతం మంది కూడా ప్రేక్షకులు రాలేదు. జన జీవనంపై బంద్ ప్రభావం నిత్యం రద్దీగా ఉండే హైకోర్టు, సిటీ సివిల్ కోర్టు, ఎంఎస్ బిల్డింగ్, విశ్వేశ్వరయ్య టవర్స్ తదితర చోట్ల తక్కువ సంఖ్యలో జనం కనిపించారు. బంద్ గురించి ముందు నుంచే ృస్తత ప్రచారం చేయడంతో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఆర్టీసీ బస్సులు సుమారు 40 శాతం, బీఎంటీసీ సుమారు 25 శాతం సంచరించ లేదు. ఫ్రేజర్ టౌన్లో ఓ యువతిపై, విబ్గ్యార్ స్కూలులో ఆరేళ్ల బాలికపై సామూహిక అత్యాచారాలు జరిగినప్పటి నుంచి నగర ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తదుపరి కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోడంతో బంద్కు ప్రజల నుంచి స్వచ్ఛందంగా మద్దతు లభించింది. ఆస్పత్రులు, మందుల దుకాణాలు, పాల పంపిణీ తదితర అత్యవసర సేవలను బంద్ నుంచి మినహాయించారు. -
బెంగళూరు బంద్ వాయిదా
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో పెరిగిపోతున్న అత్యాచార ఘటనలను ఖండిస్తూ ఈ నెల 26న కన్నడ సంఘాలు తలపెట్టిన బంద్ వాయిదా పడింది. ఇదే కార్యక్రమాన్ని ఈ నెల 31న చేపట్టాలని నిర్ణయించినట్లు కన్నడ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు వాటాళ్ నాగరాజ్ బుధవారం ఇక్కడ తెలిపారు. కన్నడ సంఘాలతో పాటు చలన చిత్ర పరిశ్రమ, రచయితలు, సాహితీవేత్తలు, పౌర సంఘాలు సహా అందరూ బంద్ విజయం కోసం శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు.