sydney test
-
BGT 2024-25: సిడ్నీ పిచ్పై ఆస్ట్రేలియన్ల మౌనమేల..?
భారత్లో స్పిన్కు అనుకూలించే పిచ్లపై ఆడలేక గగ్గోలు పెట్టే ఆస్ట్రేలియన్లు.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్లో పేస్ బౌలింగ్ కి అనుకూలించిన పిచ్ పై మాత్రం మౌనం వహించారు. గత ఆదివారం ముగిసిన ఈ టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఆరు వికెట్ల తేడాతో పరాజయంపాలవ్వడంతో 1-3 తేడాతో ఆసీస్కు సిరీస్ను కోల్పోయింది.ఈ నేపథ్యంలో ఓ ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గళమెత్తడం అభినందనీయం. ఆస్ట్రేలియా మాజీ వికెట్కీపర్ టిమ్ పెయిన్ సిడ్నీ పిచ్ ని దుమ్మెత్తి పోయడం విశేషం."ఈ టెస్ట్ రెండున్నర రోజుల్లోనే ముగిసింది. ఏ జట్టూ 200 పరుగుల మార్కును చేరుకోలేదు. ఈ మ్యాచ్ కి ఉపయోగించిన పిచ్ ఉపరితలం బాగానే ఉంది. కానీ పగుళ్లు రావడంతో అస్థిరమైన బౌన్స్ తో బ్యాట్స్మన్ ఇబ్బంది పడ్డారు.ఈ పిచ్పై బ్యాట్స్మన్లు వ్యక్తిగత నైపుణ్యం కంటే అదృష్టంపై ఎక్కువగా ఆధారపడినట్లు స్పష్టమైంది. ఈ పిచ్ కి అంతర్జాతీయ క్రికెట్ అధికారులు సంతృప్తికరమైన రేటింగ్ ఇచ్చినప్పటికీ, నేను మాత్రం దానికి సాధ్యమైనంత తక్కువ రేటింగ్ ఇస్తాను. వాళ్ళు మళ్ళీ ఇలాంటి పిచ్ ని రూపొందించినట్టయితే చర్యలు తప్పవని ఘాటుగా హెచ్చరించేవాడ్ని.ఇలాంటి హెచ్చరిక వల్ల సిడ్నీ అధికారులు భవిష్యత్తులో ఇలాంటి పిచ్ ని తయారు చేయకుండా జాగ్రత్త వహిస్తారు. దీనివల్ల వాళ్ళు అలాంటి పిచ్ ని రూపొందించినట్టయితే అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెన్షన్ ఎదుర్కోవాల్సి ఉంటుందని కనీసం భయపడతారు" అని పెయిన్ తన కాలమ్లో రాశాడు."గతంలో ఐసిసి సిడ్నీ పిచ్ కు ‘సంతృప్తికరంగా’ రేటింగ్ ఇచ్చింది. ఇది రెండో అత్యధిక రేటింగ్ . సిడ్నీ పిచ్ అరిగిపోయి స్పిన్ బౌలింగ్ కి అనుకూలంగా మారే ముందు కొద్దిగా బౌన్స్ అవుతుంది. అయితే ఈ పిచ్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకు ఉత్తేజకరమైన ముగింపును అందించింది. ఇది వచ్చే సీజన్ లో జరిగే యాషెస్ సిరీస్ కి శుభసూచకమని," క్రికెట్ ఆస్ట్రేలియా క్రికెట్ ఆపరేషన్స్ అండ్ షెడ్యూలింగ్ హెడ్ పీటర్ రోచ్ అన్నారు.స్వదేశం లో సిరీస్ లు జరిగినప్పుడు ఆతిధ్య జట్లు పిచ్ లు తమ బౌలర్లకు అనుకూలంగా రూపాందించుకోవడం ఆనవాయితీ. అయితే విదేశీ పర్యటనలకు వచినప్పుడు మాత్రం వాళ్ళ ఆటగాళ్లు విఫలమైనప్పుడు ఆతిధ్య జట్టు పై దుమ్మెత్తి పోయడం మాత్రం సరికాదు. ఇది ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి జట్లు గుర్తుంచుకోవాలి! -
నిజమైన నాయకుడు.. అసలైన లెజెండ్: సురేశ్ రైనా
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా(Suresh Raina) ప్రశంసలు కురిపించాడు. నిజమైన, దిగ్గజ నాయకుడు అంటూ హిట్మ్యాన్ను కొనియాడాడు. జట్టు ప్రయోజనాల కోసం తనంతట తానుగా తప్పుకోగలిగిన నిస్వార్థపరుడంటూ రోహిత్ శర్మకు కితాబులిచ్చాడు.ఐదు టెస్టుల సిరీస్స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్టుల్లో 3-0తో వైట్వాష్కు గురైన రోహిత్ సేన.. తదుపరి ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా కంగారూ జట్టుతో ఐదు టెస్టులు ఆడుతోంది. అయితే, పెర్త్లో జరిగిన తొలి టెస్టుకు పితృత్వ సెలవుల కారణంగా రోహిత్ శర్మ దూరం కాగా.. అతడి స్థానంలో జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) కెప్టెన్గా వ్యవహరించాడు.ఈ మ్యాచ్లో టీమిండియా 295 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అయితే, రెండో టెస్టు నుంచి జట్టుతో చేరిన రోహిత్ శర్మ.. బ్యాటర్గా, సారథిగా విఫలమయ్యాడు. అడిలైడ్, బ్రిస్బేన్, మెల్బోర్న్ టెస్టుల్లో కలిపి కేవలం 31 పరుగులే చేసిన రోహిత్.. వీటిలో ఒక్క మ్యాచ్లోనూ టీమిండియాను గెలిపించలేకపోయాడు. ఫలితంగా సిరీస్లో భారత జట్టు 1-2తో వెనుకబడింది.చావో రేవో తేల్చుకునేందుకుఈ క్రమంలో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగే ఐదో టెస్టులో టీమిండియా తప్పక గెలవాల్సిన స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తేనే సిరీస్ను డ్రా చేసుకోవడం సహా.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్-2025 అవకాశాలను భారత్ సజీవం చేసుకోగలుగుతుంది.ఇంతటి కీలక మ్యాచ్కు ముందు రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సిడ్నీలో జరిగే ఆఖరి టెస్టులో బెంచ్కే పరిమితమయ్యాడు. ఫామ్లేమి దృష్ట్యా స్వయంగా తుదిజట్టు నుంచి తప్పుకొని.. శుబ్మన్ గిల్కు లైన్ క్లియర్ చేశాడు. ఈ విషయం గురించి తాత్కాలిక కెప్టెన్ బుమ్రా మాట్లాడుతూ.. జట్టు ప్రయోజనాల కోసమే రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పాడు.డ్రింక్స్ బ్రేక్ సమయంలో ఇక జట్టులో స్థానం లేకపోయినా.. సిడ్నీ టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా రోహిత్ శర్మ డగౌట్లో చురుగ్గా కనిపించాడు. డ్రింక్స్ బ్రేక్ సమయంలో ఆటగాళ్ల దగ్గరికి వచ్చి వ్యూహాల గురించి చర్చించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను సురేశ్ రైనా షేర్ చేస్తూ.. రోహిత్ శర్మ వ్యక్తిత్వాన్ని కొనియాడాడు.నిజమైన నాయకుడు.. అసలైన లెజెండ్‘‘తన నిజాయితీ, నిస్వార్థగుణం ద్వారా నాయకుడంటే ఎలా ఉండాలో రోహిత్ శర్మ నిరూపిస్తున్నాడు. వ్యక్తిగతంగా కఠిన సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలోనూ.. జట్టు విజయానికే అతడు మొదటి ప్రాధాన్యం ఇచ్చాడు. అవసరమైన సమయంలో స్వయంగా తానే తప్పుకొన్నాడు.టీమిండియా జోరుఈ టెస్టు సిరీస్లో రోహిత్ శర్మ భారత జట్టు సక్సెస్ కోసం కనబరుస్తున్న అంకిత భావం చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఆటలో అతడొక నిజమైన దిగ్గజం’’ అని సురేశ్ రైనా రోహిత్ శర్మను ప్రశంసించాడు. ఇదిలా ఉంటే.. సిడ్నీ టెస్టులో టీమిండియా జోరు కనబరుస్తోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బుమ్రా సేన.. తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులకు ఆలౌట్ అయింది.ఈ క్రమంలో ఆసీస్ను మొదటి ఇన్నింగ్స్లో 181 పరుగులకే కట్టడి చేసింది. భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, నితీశ్ రెడ్డి చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.ఇక శనివారం నాటి రెండో రోజు పూర్తయ్యేసరికి తమ రెండో ఇన్నింగ్స్లో టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్తో కలిపి ఆసీస్ కంటే 145 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మూడో రోజు గనుక కాస్త ఓపికగా ఆడి.. కనీసం మరో వంద పరుగులు జమచేస్తే ఆతిథ్య జట్టు ముందు మెరుగైన లక్ష్యం ఉంచగలుగుతుంది. రెండో రోజు ఆట ముగిసేసరికి క్రీజులో ఉన్న స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా(8*), వాషింగ్టన్ సుందర్(6*)లపైనే టీమిండియా ఆశలు పెట్టుకుంది.చదవండి: IND Vs AUS: 'టెస్టు క్రికెట్ చరిత్రలోనే పంత్ ఒక అద్బుతం'Rohit Sharma exemplifies leadership through honesty and selflessness. Despite personal challenges, he prioritizes team success, stepping aside when necessary. His leadership in the current Test series reflects his unwavering dedication to India’s success. A true legend of the… pic.twitter.com/L3rPlMlRT6— Suresh Raina🇮🇳 (@ImRaina) January 4, 2025 -
వారెవ్వా!.. యశస్వి జైస్వాల్ ప్రపంచ రికార్డు
సిడ్నీ టెస్టు సందర్భంగా టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో తొలి ఓవర్లో అత్యధిక పరుగులు రాబట్టిన భారత్ బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలో విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టాడు. అంతేకాదు ఓ ప్రపంచ రికార్డునూ తన ఖాతాలో వేసుకున్నాడు.ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)తో టీమిండియా ప్రస్తుతం బిజీగా ఉంది. ఈ సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా తొలి టెస్టులో గెలిచిన భారత్.. అనంతరం అడిలైడ్లో ఓడి, బ్రిస్బేన్లో మ్యాచ్ను డ్రా చేసుకుంది. అనంతరం మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 184 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి.. 1-2తో వెనుకబడింది.ఈ క్రమంలో చావో రేవో తేల్చుకునేందుకు సిడ్నీ వేదికగా ఆసీస్తో ఈ సిరీస్లో ఆఖరిదైన ఐదో టెస్టు శుక్రవారం మొదలుపెట్టింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 185 పరుగులకు ఆలౌట్ అయింది. శనివారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా కంగారూలను 181 పరుగులకే కట్టడి చేసి.. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.స్టార్క్కు చుక్కలు చూపించిన జైసూఇక వచ్చీ రావడంతో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc)కు చుక్కలు చూపించాడు. టీమిండియా రెండో ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన అతడి బౌలింగ్లో చితకబాదాడు. మొదటి బంతికి పరుగులేమీ రాబట్టలేకపోయిన జైసూ.. తర్వాత వరుసగా మూడు బంతులను బౌండరీకి తరలించాడు. తద్వారా పన్నెండు పరుగులు పించుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఐదో బంతిని వదిలేశాడు.మళ్లీ ఓవర్లో ఆఖరి బంతికి మాత్రం జైస్వాల్ తన ప్రతాపం చూపించాడు. వైడ్ ఆఫ్ దిశగా వచ్చిన బంతిని ఎక్స్ ట్రా కవర్ వేదికగా ఫోర్ బాదాడు. ఈ క్రమంలో మొదటి ఓవర్లోనే జైస్వాల్ పదహారు పరుగులు రాబట్టాడు. తద్వారా టెస్టుల్లో తొలి ఓవర్లో అత్యధిక పరుగులు(ఆరు బంతుల్లో 16 పరుగులు) చేసిన తొలి భారత బ్యాటర్గా చరిత్రకెక్కాడు.ఆల్టైమ్ రికార్డు బ్రేక్అంతకుముందు 2005లో వీరేంద్ర సెహ్వాగ్ తొలి ఓవర్లో 13 పరుగులు రాబట్టాడు. అనంతరం.. 2023లో రోహిత్ శర్మ సెహ్వాగ్ రికార్డును సమం చేశాడు. అయితే, సిడ్నీ టెస్టు సందర్భంగా జైస్వాల్ వీరిద్దరి పేరిట సంయుక్తంగా ఉన్న ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.అంతేకాదు ఓ ప్రపంచ రికార్డునూ తన ఖాతాలో వేసుకున్నాడు జైస్వాల్. టెస్టుల్లో తొలి ఓవర్లోనే నాలుగు ఫోర్లు బాదిన క్రికెటర్గా మైకేల్ స్లాటర్, క్రిస్ గేల్ సరసన నిలిచాడు.టెస్టుల్లో తొలి ఓవర్లోనే అత్యధిక ఫోర్లు బాదిన క్రికెటర్లుగా ప్రపంచ రికార్డు👉మైకేల్ స్లాటర్- 2001లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్- బర్మింగ్హామ్- నాలుగు ఫోర్లు- 18 పరుగులు👉క్రిస్ గేల్- 2012లో వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్, ఆంటిగ్వా- నాలుగు ఫోర్లు- 16 పరుగులు👉యశస్వి జైస్వాల్- 2024లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, సిడ్నీ- నాలుగు ఫోర్లు- 16 పరుగులు.పంత్ దూకుడు.. రెండో రోజు పరిస్థితి ఇదీఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో రెండో రోజు ఆట పూర్తయ్యే సరికి టీమిండియా 32 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో వచ్చిన నాలుగు పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని ఓవరాల్గా 145 పరుగుల లీడ్లో ఉంది. జైస్వాల్ 35 బంతుల్లో 22 పరుగులు సాధించగా.. కేఎల్ రాహుల్(13), శుబ్మన్ గిల్(13), విరాట్ కోహ్లి(6) మరోసారి విఫలమయ్యారు.ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న రిషభ్ పంత్ ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 29 బంతుల్లోనే యాభై పరుగులతో మెరుపు అర్ధ శతకం సాధించాడు. మొత్తంగా 33 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో చెలరేగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 61 పరుగులు చేశాడు. కమిన్స్ బౌలింగ్లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.ఇక పంత్ అవుటైన తర్వాత టీమిండియా ఇన్నింగ్స్ నెమ్మదించింది. నితీశ్ రెడ్డి నాలుగు పరుగులకే నిష్క్రమించగా.. రవీంద్ర జడేజా(39 బంతుల్లో 8), వాషింగ్టన్ సుందర్(17 బంతుల్లో 6) పరుగులతో అజేయంగా ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ నాలుగు, కమిన్స్, బ్యూ వెబ్స్టర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. చదవండి: IND vs AUS: పంత్ సరి కొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా రికార్డుSometimes JaisWall, sometimes JaisBall! 🔥Another #YashasviJaiswal 🆚 #MitchellStarc loading? 🍿👀#AUSvINDOnStar 👉 5th Test, Day 2 | LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/W4x0yZmyO9— Star Sports (@StarSportsIndia) January 4, 2025 -
Bumrah-Konstas: పిచ్చి పనులు మానుకోండి: రోహిత్ శర్మ ఫైర్
టీమిండియా ఆటగాళ్లు మైదానంలో ఎంతో హుందాగా ఉంటారని కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అన్నాడు. కానీ అదే పనిగా సహనాన్ని పరీక్షిస్తే మాత్రం ప్రత్యర్థులకు చేదు అనుభవం తప్పదని పేర్కొన్నాడు. తమ జోలికి వచ్చిన వాళ్లకు సరైన రీతిలో బదులివ్వడంలో ఎలాంటి తప్పులేదని బుమ్రా సేనను సమర్థించాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడుతున్న విషయం తెలిసిందే.ఈ సిరీస్లో ఇప్పటికి రెండు మ్యాచ్లు ఓడిపోయి, ఒక టెస్టు డ్రా చేసుకున్న టీమిండియా.. 1-2తో వెనుకబడి ఉంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం సిడ్నీ వేదికగా ఆఖరిదైన ఐదో టెస్టు మొదలైంది. గెలిస్తేనే కనీసం డ్రాఇందులో గెలిస్తేనే టీమిండియా సిరీస్ను కనీసం డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఫామ్లేమి, వరుస ఓటముల నేపథ్యంలో రోహిత్ శర్మ విశ్రాంతి పేరిట తనంతట తానే సిడ్నీ టెస్టు నుంచి తప్పుకొన్నాడు.ఈ నేపథ్యంలో పెర్త్లో తొలి టెస్టుకు టీమిండియాకు సారథ్యం వహించిన జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) మరోసారి పగ్గాలు చేపట్టాడు. ఇక ఐదో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి రోజు ఆటలో భాగంగా 185 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్లో ఆలౌట్ అయింది. రిషభ్ పంత్(40), రవీంద్ర జడేజా(26), జస్ప్రీత్ బుమ్రా(22), శుబ్మన్ గిల్(20) రాణించారు.బుమ్రాపైకి దూసుకు వచ్చిన ఆసీస్ బ్యాటర్ఈ క్రమంలో తొలిరోజే ఆస్ట్రేలియా బ్యాటింగ్ మొదలుపెట్టగా యువ ఓపెనర్ సామ్ కొన్స్టాస్(Sam Konstas) కాస్త అతి చేశాడు. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా బుమ్రా బౌలింగ్ను ఎదుర్కొనే సమయంలో కాస్త ఆగమని చెప్పాడు. ఇందుకు బుమ్రా కాస్త అసహనంగా కదలగా.. కొన్స్టాస్ ఏంటీ అన్నట్లుగా బుమ్రా వైపు దూసుకువచ్చాడు. దీంతో బుమ్రా కూడా బదులిచ్చేందుకు సిద్ధం కాగా.. అంపైర్ జోక్యం చేసుకుని నచ్చజెప్పాడు.అనంతరం బౌలింగ్ చేసిన బుమ్రా ఖవాజా వికెట్ తీసి .. కొన్స్టాస్తో.. ‘‘చూశావా? నాతో పెట్టుకుంటే ఎలా ఉంటదో?’’ అన్నట్లు తన ముఖకవళికల ద్వారా మనసులోని భావాలను కాస్త దూకుడుగానే వ్యక్తం చేశాడు. అలా ఆఖరి బంతికి వికెట్ తీసి టీమిండియా తొలిరోజు ఆట ముగించింది.ఈ ఘటనపై రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా స్పందించాడు. బ్రాడ్కాస్టర్లతో మాట్లాడుతున్న సమయంలో బుమ్రా- కొన్స్టాస్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘మా వాళ్లు నిర్ణీత సమయం వరకు ఓపికపడతారు. కానీ సహనాన్ని పరీక్షించాలని చూస్తే మాత్రం ఊరుకోరు.పిచ్చి పనులు మానుకోండిఅనవసరంగా గొడవ పెట్టుకోవాలని చూస్తే.. అంతే ధీటుగా బదులిస్తారు. మేము ఇక్కడకు వచ్చింది క్రికెట్ ఆడటానికి మాత్రమే’’ అని బుమ్రా చర్యను సమర్థించాడు. అంతేకాదు.. ‘‘దయచేసి ఇలా చెత్తగా వ్యవహరించకండి. పిచ్చి పనులు మానుకోండి. ఇలాంటివి చూడటానికి అస్సలు బాగోదు’’ అంటూ కంగారూలకు రోహిత్ కౌంటర్ ఇచ్చాడు.అదే విధంగా.. ‘‘మా వాళ్లు క్లాసీగా ఉంటారు. ఆటపైనే వారి దృష్టి మొత్తం కేంద్రీకృతమై ఉంటుంది. ఇక శుక్రవారం ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెంచడంలో సఫలమై వికెట్ తీయడం సంతోషకరం’’ అని రోహిత్ శర్మ తమ జట్టును అభినందించాడు. చదవండి: CT 2025: వన్డే కెప్టెన్గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథిగా అతడే! -
భేష్.. ప్రాణం పెట్టి మరీ ఆడాడు: పంత్పై ప్రశంసలు
టీమిండియా స్టార్ రిషభ్ పంత్పై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించాడు. ప్రాణం పెట్టి మరీ సిడ్నీ టెస్టులో జట్టును పటిష్ట స్థితిలో నిలిపేందుకు కృషి చేశాడని కొనియాడాడు. పదునైన బంతులు శరీరానికి గాయం చేస్తున్నా పట్టుదలగా నిలబడ్డ తీరు ప్రశంసనీయమని పేర్కొన్నాడు.చావో రేవోకాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియాతో టీమిండియా ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ సిరీస్లో ఇప్పటికే 1-2తో వెనుకబడి ఉన్న భారత్.. చావో రేవో తేల్చుకునేందుకు సిడ్నీ వేదికగా శుక్రవారం ఆఖరిదైన ఐదో టెస్టు మొదలుపెట్టింది.ప్రఖ్యాత సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) సారథ్యంలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే, ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు త్వరత్వరగానే పెవిలియన్ చేరారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(10), కేఎల్ రాహుల్(4) పూర్తిగా విఫలం కాగా.. శుబ్మన్ గిల్(20) ఫర్వాలేదనిపించాడు.;పంత్ పోరాటంఅయితే, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి(17) మాత్రం మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant).. రవీంద్ర జడేజాతో కలిసి పోరాడే ప్రయత్నం చేశాడు. ఆసీస్ బౌలర్ల నుంచి దూసుకువస్తున్న బంతుల కారణంగా శరీరానికి గాయాలవుతున్నా.. పట్టుదలగా నిలబడ్డాడు. మొత్తంగా 98 బంతులు ఎదుర్కొన్న పంత్ మూడు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 40 పరుగులు చేశాడు.అయితే, దురదృష్టవశాత్తూ స్కాట్ బోలాండ్ బౌలింగ్లో కమిన్స్కు క్యాచ్ ఇవ్వడంతో పంత్ ఇన్నింగ్స్కు తెరపడింది. మిగిలిన వాళ్లలో జడ్డూ 26 పరుగులు చేయగా.. నితీశ్ రెడ్డి డకౌట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ 14, ప్రసిద్ కృష్ణ 3, కెప్టెన్ బుమ్రా 22, సిరాజ్ 3* పరుగులు చేశారు. ఫలితంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులకు ఆలౌట్ అయింది.అనంతరం ఆసీస్ బ్యాటింగ్కు దిగి ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి కేవలం తొమ్మిది పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. పంత్ పోరాట పటిమను ప్రశంసించాడు. ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ ఆడాడు‘‘రిషభ్ పంత్ ఆట గురించి మనం చాలానే మాట్లాడేశాం. అయితే, ఐదో టెస్టులో మాత్రం అతడి అద్భుత, కీలకమైన ఇన్నింగ్స్ను కొనియాడకతప్పదు. అలాంటి పరిస్థితుల్లో అంతసేపు బ్యాటింగ్ చేయడం సులువుకాదు. భారత బ్యాటర్లలో ఒక్కరూ కనీసం 30 పరుగుల మార్కును చేరుకోలేదు. పంత్ ఒక్కడు మాత్రం 40 రన్స్తో టాప్ స్కోరర్ అయ్యాడు. పదే పదే బంతులు అతడి శరీరానికి తగిలాయి.అయినా.. సరే పంత్ వెనక్కి తగ్గలేదు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పటికే అతడిపై మానసికంగా ఒత్తిడి ఉంది. ఈ రోజు మ్యాచ్లో శరీరం కూడా గాయపడింది. అయినా అద్బుతంగా పోరాడాడు. అత్యద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు’’ అని ఇర్ఫాన్ పఠాన్ కొనియాడాడు. రోహిత్ దూరంకాగా ఆసీస్తో తొలి నాలుగు టెస్టుల్లో పంత్ నిరాశపరిచాడు. కుదురుకుంటాడనుకున్న సమయంలో నిర్లక్ష్యపు రీతిలో వికెట్ పారేసుకుని విమర్శలు మూటగట్టుకున్నాడు. అయితే, సిడ్నీ టెస్టులో మాత్రం అద్భుత పోరాటం కనబరిచాడు. ఈ మ్యాచ్కు విశ్రాంతి పేరిట రోహిత్ శర్మ దూరంగా ఉండగా.. బుమ్రా సారథ్యం వహిస్తున్నాడు.చదవండి: CT 2025: వన్డే కెప్టెన్గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథిగా అతడే! -
తప్పుడు నిర్ణయం.. రోహిత్నే పక్కన పెడతారా?
సిడ్నీ టెస్టు నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ను తప్పించడం పట్ల భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు ఆగ్రహం వ్యక్తం చేశాడు. సారథినే పక్కనపెట్టడం ద్వారా మేనేజ్మెంట్ ఆటగాళ్లకు తప్పుడు సంకేతాలు ఇస్తోందని పేర్కొన్నాడు. భారత క్రికెట్ చరిత్రలో ఇలాంటి సంఘటన మునుపెన్నడూ జరుగలేదంటూ బీసీసీఐ నిర్ణయాన్ని తప్పుబట్టాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో కంగారూ జట్టుతో తొలి టెస్టుకు పితృత్వ సెలవుల కారణంగా రోహిత్ శర్మ దూరమయ్యాడు. అతడి స్థానంలో భారత జట్టును ముందుండి నడిపించిన బుమ్రా.. పెర్త్ టెస్టులో విజయాన్ని అందించాడు.రోహిత్ శర్మ తిరిగి వచ్చిన తర్వాత అయితే, రెండో టెస్టు నుంచి రోహిత్ శర్మ తిరిగి వచ్చిన తర్వాత టీమిండియా వరుసగా వైఫల్యాలే ఎదురయ్యాయి. అడిలైడ్లో ఓడిపోయిన భారత్.. బ్రిస్బేన్లో డ్రా చేసుకున్నా.. మెల్బోర్న్లో ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. ఫలితంగా సిరీస్లో 1-2తో వెనుకబడింది.బ్యాటర్గానూ విఫలంఇక బ్యాటర్గానూ రోహిత్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. మొత్తంగా ఐదు ఇన్నింగ్స్ ఆడి మొత్తంగా కేవలం 31 పరుగులే చేశాడు. ముఖ్యంగా అనవసరపు షాట్లకు పోయి అతడు వికెట్ పారేసుకున్న తీరు విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో పాటు రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో ఆసీస్తో ఆఖరిదైన ఐదో టెస్టుకు రోహిత్ శర్మ దూరమయ్యాడు. ఈ విషయం గురించి తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) మాట్లాడుతూ.. జట్టు ప్రయోజనాల కోసం విశ్రాంతి పేరిట రోహిత్ స్వయంగా తప్పుకొన్నాడని తెలిపాడు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి, సునిల్ గావస్కర్ వంటి వాళ్లు రోహిత్ నిర్ణయాన్ని సమర్థించగా.. నవజ్యోత్ సింగ్ సిద్ధు మాత్రం భిన్నంగా స్పందించాడు.తప్పుడు నిర్ణయం.. రోహిత్నే పక్కన పెడతారా?‘‘ఇది చాలా ఆశ్చర్యకరంగా, వింతగా ఉంది. ఎందుకంటే భారత క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. అతడిని కెప్టెన్ను ఎందుకు చేశారు?.. అయినా సారథిగానే కాకుండా కీలక ఆటగాడిగా భారత క్రికెట్కు అతడు ఇప్పటికే ఎంతో సేవ చేశాడు.అలాంటి ఆటగాడి ఫామ్ బాగున్నా.. లేకున్నా అదేమీ పెద్ద విషయం కాదు. ఎందుకంటే అతడు కెప్టెన్. జట్టు ప్రయోజనాల కోసం తనను తాను బెంచ్కే పరిమితం చేసుకోవడం ఏమిటి? ఇలా చేయడం ద్వారా టీమిండియా మేనేజ్మెంట్ తప్పుడు సంకేతాలు ఇస్తోంది.అతడిపై వేటు వేయడమో.. లేదంటే తనకు తానుగా తప్పుకొనేలా చేయడమో సరికాదు. జట్టును నిర్మించిన సారథి అతడు. యువ ఆటగాళ్లలో చాలా మంది అతడిని తమ తండ్రి సమానుడిలా భావిస్తారు. వాళ్ల నుంచి అతడు అంతటి గౌరవాన్ని పొందాడు. ఏ కెప్టెన్ అయినా నౌకను మధ్యలోనే వీడి వెళ్లిపోడు. అది మునిగిపోతుందని తెలిసినా గట్టెక్కించే ప్రయత్నమే చేస్తాడు గానీ.. తానే ముంచేయాలని చూడడు. అతడొక గౌరవప్రదమైన వ్యక్తి. కానీ మీరు మాత్రం అతడి విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. రోహిత్ పట్ల గౌరవంగా వ్యవహరించాల్సింది. అతడిపై నమ్మకం ఉంచాల్సింది’’ అని నవజ్యోత్ సింగ్ సిద్ధు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. సిడ్నీలో తొలి రోజు ముగిసిందిలాకాగా ఆసీస్తో సిడ్నీలో జరుగుతున్న ఐదో టెస్టు తొలి రోజు ఆటలో టీమిండియా ఫర్వాలేదనిపించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 185 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆసీస్కు ఆదిలోనే షాకిచ్చింది. శుక్రవారం నాటి తొలిరోజు ఆట పూర్తయ్యేసరికి ఒక వికెట్ నష్టానికి ఆసీస్ తొమ్మిది పరుగులు చేసింది.చదవండి: కొన్స్టాస్ ఓవరాక్షన్.. బుమ్రా ఆన్ ఫైర్!.. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది! -
కొన్స్టాస్ ఓవరాక్షన్.. వైల్డ్ ఫైర్లా బుమ్రా!.. నాతోనే పెట్టుకుంటావా..?
టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు తొలిరోజు ఆట రసవత్తరంగా సాగింది. నువ్వా- నేనా అన్నట్లుగా ఇరుజట్ల క్రికెటర్లు పోటీపడ్డారు. అయితే, ఆట ముగిసే సమయంలో ఆఖరి బంతికి చోటు చేసుకున్న పరిణామాలు టీమిండియా అభిమానులకు మాంచి కిక్కిచ్చాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..?!బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy) 2024-25లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెర్త్లో బుమ్రా కెప్టెన్సీలో గెలిచిన టీమిండియా.. అనంతరం రోహిత్ శర్మ సారథ్యంలో అడిలైడ్లో ఓడిపోయి.. బ్రిస్బేన్లో జరిగిన మూడో టెస్టును డ్రా చేసుకుంది.రోహిత్ లేకుండానేఅయితే, మెల్బోర్న్ టెస్టులో కనీసం డ్రా చేసుకునే అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోలేక ఓటమిని మూటగట్టుకుంది. ఈ క్రమంలో బ్యాటర్గా, కెప్టెన్గా విఫలమైన రోహిత్ శర్మ(ఐదు ఇన్నింగ్స్లో కలిపి 31 రన్స్) ఆఖరిదైన సిడ్నీ టెస్టు నుంచి తప్పుకొన్నాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్నాడు.ఇక ఆసీస్తో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బుమ్రా.. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, టాపార్డర్ విఫలమైన కారణంగా భారత్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేయలేకపోయింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(10), కేఎల్ రాహుల్(4)తో పాటు శుబ్మన్ గిల్(20), విరాట్ కోహ్లి(17) నిరాశపరిచారు.పంత్ పోరాటం.. బుమ్రా మెరుపులుమిడిలార్డర్లో రిషభ్ పంత్(40), రవీంద్ర జడేజా(26) రాణించగా.. నితీశ్ రెడ్డి(0) పూర్తిగా విఫలమయ్యాడు. ఇక వాషింగ్టన్ సుందర్(14), ప్రసిద్ కృష్ణ(3) కూడా స్వల్ప స్కోర్లకే వెనుదిరగగా.. పదో స్థానంలో వచ్చిన బుమ్రా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 17 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 22 పరుగులు సాధించాడు.185 పరుగులకు ఆలౌట్ఇక బుమ్రా మెరుపుల కారణంగానే టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 185 పరుగుల మేర గౌరవప్రదమైన స్కోరు చేసి ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ నాలుగు, మిచెల్ స్టార్క్ మూడు, ప్యాట్ కమిన్స్ రెండేసి వికెట్లు కూల్చగా.. నాథన్ లియాన్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.కొన్స్టాస్ ఓవరాక్షన్ఈ క్రమంలో తొలిరోజు ఆటలోనే తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. సిడ్నీలో శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి మూడు ఓవర్లలో వికెట్ నష్టానికి తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే, ఆట ముగిసే సమయంలో ఆఖరి బంతి పడటానికి ముందు ఆసీస్ యువ ఓపెనర్ సామ్ కొన్స్టాస్(Sam Konstas) ఓవరాక్షన్ చేశాడు.బుమ్రా బౌలింగ్కు వస్తున్న సమయంలో క్రీజులో ఉన్న మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కాస్త ఆగమన్నట్లుగా సైగ చేయగా.. బుమ్రా కాస్త అసహనం వ్యక్తం చేశాడు. దీంతో నాన్- స్ట్రైకర్ ఎండ్లో ఉన్న కొన్స్టాస్ బుమ్రాను చూస్తూ ఏదో అనగా అతడు సీరియస్ అయ్యాడు. వైల్డ్ ఫైర్లా బుమ్రా.. ఓ రేంజ్లో టీమిండియా సంబరాలుఈ క్రమంలో కొన్స్టాస్ అతి చేస్తూ బుమ్రా వైపు రాగా.. బుమ్రా కూడా అంతే ధీటుగా బదులిచ్చాడు. దీంతో అంపైర్ జోక్యం చేసుకుని ఇద్దరికీ నచ్చజెప్పాడు. అయితే, ఈ సంఘటన జరిగిన వెంటనే తన అద్భుత బంతితో ఖవాజా(2)ను అవుట్ చేశాడు. బుమ్రా బౌలింగ్లో ఖవాజా ఇచ్చిన క్యాచ్ను స్లిప్లో ఉన్న కేఎల్ రాహుల్ క్యాచ్ పట్టగానే టీమిండియా సంబరాల్లో మునిగిపోయింది. ‘‘నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది’’ అన్నట్లుగా బుమ్రా కొన్స్టాస్ వైపునకు రాగా.. అక్కడే ఉన్న యువ పేసర్ ప్రసిద్ కృష్ణ కూడా కొన్స్టాస్కు కౌంటర్ ఇచ్చాడు. దీంతో ముఖం మాడ్చుకున్న 19 ఏళ్ల ఈ టీనేజర్ ఆట ముగిసిన నేపథ్యంలో నిరాశగా మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆఖరి బంతికి అద్భుతం చేశావు భయ్యా అంటూ టీమిండియా ఫ్యాన్స్ బుమ్రాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా కొన్స్టాస్కు ఇలాంటి ఓవరాక్షన్ కొత్తేం కాదు. మెల్బోర్న్లో తన అరంగేట్ర టెస్టులో కోహ్లితో గొడవ పెట్టుకున్న కొన్స్టాస్కు.. బుమ్రా తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. ఈసారి తనతో నేరుగా పెట్టుకున్నందుకు.. ఆసీస్ను దెబ్బతీసేలా వికెట్తో బదులిచ్చాడు.చదవండి: CT 2025: వన్డే కెప్టెన్గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథిగా అతడే!Fiery scenes in the final over at the SCG! How's that for a finish to Day One 👀#AUSvIND pic.twitter.com/BAAjrFKvnQ— cricket.com.au (@cricketcomau) January 3, 2025 -
స్మిత్, లబుషేన్ మైండ్గేమ్.. ఇచ్చిపడేసిన గిల్! కానీ మనోడికే..
సిడ్నీ టెస్టులోనూ టీమిండియా బ్యాటింగ్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా బౌలర్ల దూకుడు కారణంగా భారత ఓపెనర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. కేఎల్ రాహుల్ 14 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్లో నిష్క్రమించాడు.పట్టుదలగా నిలబడ్డ గిల్, కోహ్లిఇక మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 26 బంతుల్లో పది పరుగులు చేసి స్కాట్ బోలాండ్కు వికెట్ సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ శుబ్మన్ గిల్(Shubman Gill).. నాలుగో స్థానంలో వచ్చిన విరాట్ కోహ్లి(Virat Kohli)తో కలిసి ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. అయితే, కంగారూ జట్టు స్పిన్నర్ నాథన్ లియాన్ ఈ జోడీని విడదీశాడు. మొత్తంగా 64 బంతులు ఎదుర్కొన్న గిల్ రెండు ఫోర్ల సాయంతో 20 పరుగులు చేసి బోలాండ్ బౌలింగ్లో స్టీవ్ స్మిత్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.నిజానికి తన ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు పన్నిన వ్యూహంలో చిక్కిన గిల్.. ఒత్తిడిలోనే వికెట్ కోల్పోయాడని చెప్పవచ్చు. భారత తొలి ఇన్నింగ్స్ 25వ ఓవర్ను బోలాండ్ వేశాడు. ఐదో బంతికి షాట్ ఆడేందుకు ప్రయత్నించి గిల్ విఫలమయ్యాడు. గిల్ను స్లెడ్జ్ చేసిన స్మిత్, లబుషేన్అనంతరం గిల్ పిచ్ మధ్యలోకి వచ్చి బ్యాట్ను టాప్ చేస్తూ కాస్త అసహనం ప్రదర్శించాడు. ఈ క్రమంలో మార్నస్ లబుషేన్.. ఈజీ.. ఈజీగానే క్యాచ్ పట్టేయవచ్చు అని పేర్కొన్నాడు. ఇందుకు స్టీవ్ స్మిత్ స్పందిస్తూ.. ‘బుల్షిట్.. ఆట మొదలుపెడితే మంచిది’ అని గిల్ను ఉద్దేశించి అన్నాడు. ఇచ్చి పడేసిన గిల్!ఇందుకు బదులిస్తూ.. ‘‘నీ టైమ్ వచ్చినపుడు చూసుకో స్మితీ.. నీ గురించి ఇప్పుడు ఎవరూ ఏమీ మాట్లాడలేదే’’ అని గిల్ పేర్కొనగా.. ‘‘నువ్వైతే ఆడు’’ అని స్మిత్ గిల్తో అన్నాడు.కానీ మనోడికే భంగపాటుదీంతో 25వ ఓవర్లో ఆఖరి బంతిని ఎదుర్కొనేందుకు గిల్ సిద్ధం కాగా.. అప్పటికే మాటలు మొదలుపెట్టిన లబుషేన్.. ‘‘స్మిత్.. నీ టైమ్ వచ్చింది చూడు’’ అని అరిచాడు. ‘‘నేను అలాగే చేస్తాను చూడు’’ అని చెప్పిన స్మిత్.. గిల్ ఇచ్చిన క్యాచ్ను ఒడిసిపట్టాడు. అలా శుబ్మన్ గిల్ ఇన్నింగ్స్కు తెరపడింది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా గిల్ అవుటైన కాసేపటికే కోహ్లి(69 బంతుల్లో 17) కూడా నిష్క్రమించగా.. రిషభ్ పంత్(40), రవీంద్ర జడేజా(26) కాసేపు పోరాటం చేశారు. బుమ్రా మెరుపులుఆఖర్లో కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా మెరుపు ఇన్నింగ్స్(17 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్) కారణంగా టీమిండియా గౌరవప్రదమైన స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో పేసర్లు బోలాండ్ నాలుగు, స్టార్క్ మూడు, కమిన్స్ రెండు వికెట్లు దక్కించుకోగా.. స్పిన్నర్ నాథన్ లియాన్ ఒక వికెట్ తీశాడు. ఇదిలా ఉంటే.. వరుస వైఫల్యాల నేపథ్యంలో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆసీస్తో ఆఖరిదైన ఐదో టెస్టుకు దూరంగా ఉన్నాడు. అతడి స్థానంలో బుమ్రా సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.చదవండి: CT 2025: వన్డే కెప్టెన్గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథిగా అతడే! View this post on Instagram A post shared by Fox Cricket (@foxcricket) -
IND Vs AUS: పంత్ మోచేతికి గాయం.. అయినా సరే! వీడియో వైరల్
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్(Rishabh pant) అద్బుతమైన పోరాటం కనబరిచాడు. ఆసీస్ ఫాస్ట్ బౌలర్లు బౌన్సర్లతో ముప్పుతిప్పులు పెడుతున్నప్పటికీ.. పంత్ మాత్రం తన విరోచిత ఇన్నింగ్స్ను కొనసాగించాడు.ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన ఓ బంతి పంత్ మోచేతికి బలంగా తాకింది. దెబ్బకు మోచేతిపై కాస్త వాపు వచ్చింది. వెంటనే ఫిజియోలు వచ్చి అతడికి చికిత్స అందించారు. నొప్పిని భరిస్తూనే ఆసీస్ బౌలర్లను రిషబ్ చాలాసేపు సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు.ఈ ఒక్కటే కాకుండా తర్వాత చాలా బంతులు పంత్ శరీరానికి బలంగా తాకాయి. అయినప్పటకి రిషబ్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. రవీంద్ర జడేజాతో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే దురదృష్టవశాత్తూ 40 పరుగుల వ్యక్తిగతస్కోరు వద్ద ఐదో వికెట్గా వెనుదిరిగాడు.తుది జట్లుఆస్ట్రేలియా: సామ్ కాన్స్టాస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్స్టర్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), ప్రసిద్ద్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ చదవండి: IND vs AUS: మళ్లీ అదే తప్పు చేసిన విరాట్ కోహ్లి.. వీడియో వైరల్ Rishabh Pant facing some serious punishment from the Australian bowlers. Taking some heavy blows. #AUSvIND #Rishabpant #BorderGavaskarTrophy #ToughestRivalry https://t.co/QiLSnpRbYE— 𝕊𝕙𝕒𝕙𝕚𝕕 𝕌𝕝 𝕀𝕤𝕝𝕒𝕞 (@Shahid_shaban) January 3, 2025 -
Ind vs Aus: అతడు లేని లోటు సుస్పష్టం.. సిడ్నీలో భారత్ రికార్డు?
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్ చివరి దశకి చేరుకుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాతో శుక్రవారం ప్రారంభం కానున్న ఐదో టెస్టు ఈ సిరీస్లో ఆఖరిది. ఈ మ్యాచ్లో విజయం సాధించి ఆసీస్తో సిరీస్ను 2-2తో డ్రాగా ముగించాలని భారత్ ఆశిస్తోంది.సిడ్నీలో టీమిండియా రికార్డు ఎలా ఉంది?అయితే, సిడ్నీలో భారత్ రికార్డు అంతగా ఆత్మవిశ్వాసాన్ని కలిగించే రీతిలో లేదు. ఈ వేదిక మీద భారత్ ఇంతవరకు పదమూడు టెస్ట్ మ్యాచ్లు ఆడి ఒక్కసారి మాత్రమే గెలుపొందింది. ఏడు సార్లు ఆస్ట్రేలియా విజయం సాధించగా.. మిగిలిన అయిదు మ్యాచ్లు డ్రాగా ముగిశాయి.ప్రస్తుత సిరీస్లో పెర్త్లో జరిగిన తొలి టెస్ట్ తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir).. భారత్ సెలెక్టర్లని ఛతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara)ని ఆస్ట్రేలియాకి పంపించాల్సిందిగా కోరినట్టు వార్తలు వచ్చాయి. మెల్బోర్న్లో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ టెస్టులో ఆసీస్ చేతిలో 184 పరుగుల తేడాతో పరాజయం చవిచూసిన నేపథ్యంలో భారత్ జట్టులో ఐకమత్యం లోపించిందని వాటి సారాంశం.అతడు లేని లోటు సుస్పష్టంఈ సంగతిని పక్కనపెడితే.. ప్రస్తుతం టీమిండియాలో పుజారా వంటి బ్యాటర్లేని లోటు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. టెస్టులో పుజారా రికార్డ్ అటువంటిది మరి. ఆస్ట్రేలియాలో 47.28 సగటుతో 11 మ్యాచ్లలో అతడు.. 993 పరుగులు చేసి ఆస్ట్రేలియా బౌలర్లకు సింహస్వప్నంగా నిలిచాడు.అంతేకాదు.. సిడ్నీ వేదిక పైన పుజారా 2018-19 టెస్ట్లో ఏకంగా 193 పరుగులు సాధించి టెస్టును డ్రాగా ముగించాడు. ప్రస్తుత భారత్ జట్టులో అటువంటి పోరాట పటిమ కలిగిన బ్యాటర్లు ఒక్కరూ కన్పించడం లేదు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేసినా పట్టించుకోకుండా పుజారా నిబ్బరంగా బ్యాటింగ్ చేసి ఏకంగా 1258 బంతులని ఎదుర్కొన్నాడు.పుజారాతో కలిసి పంత్ కూడాజట్టులోని ప్రధాన ఆటగాడు అంత అద్భుతంగా బ్యాటింగ్ చేస్తే, మిగిలిన ఆటగాళ్లందరిలో అదే ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. నాటి ఈ మ్యాచ్లో వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ 169 పరుగులు సాధించి అజేయంగా నిలవడం ఇందుకు నిదర్శనం. పుజారా తో కలిసి అతడు 148 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం గమనార్హం.భారత జట్టు పుజారా బ్యాటింగ్ నుంచి నేర్చుకోవాల్సి ఎంతో ఉంది. టెస్టు మ్యాచ్లలో బ్యాటింగ్ చాలా భిన్నంగా ఉంటుంది. పుజారా లాగా ప్రత్యర్థి బౌలర్లను నిబ్బరంగా ఎదుర్కొనే ధైర్యం ప్రస్తుత భారత్ బ్యాటర్లలో కొరవడిందని నిర్వివాదాంశం. ఏది ఏమైనా ప్రస్తుత భారత్ జట్టులో పుజారా వంటి బ్యాటర్ లేని లోటు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇదే ఆస్ట్రేలియా ఆటగాళ్లు కోరుకునేది.కనీసం డ్రా అయినాకెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పేలవమైన ఫామ్.. టీమిండియా మేనేజ్మెంట్ చేసిన తప్పిదాలు ఆస్ట్రేలియాకి బాగా కలిసి వచ్చాయి. కనీసం చివరి టెస్టులోనైనా భారత ఆటగాళ్లు తమ తడబాటు ధోరణి తగ్గించుకొని టెస్ట్ మ్యాచ్కి అనుగుణంగా బ్యాటింగ్ చేస్తే.. ఈ సిరీస్ని డ్రా చేసుకున్న తృప్తి అయినా మిగులుతుంది.చదవండి: కెప్టెన్ కంటే బెటర్.. అతడిని మాత్రం తప్పించకండి: భారత మాజీ క్రికెటర్ -
సిడ్నీ టెస్టుకు భారత తుదిజట్టు ఇదే! అతడి ఎంట్రీ ఫిక్స్!
ఆస్ట్రేలియాతో ఐదో టెస్టు నేపథ్యంలో భారత తుదిజట్టులో రెండు మార్పులు చేటుచేసుకున్నట్లు సమాచారం. కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) విశ్రాంతి పేరిట ఈ మ్యాచ్కు దూరంగా ఉండాలని భావించగా.. శుబ్మన్ గిల్కు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. ఆకాశ్ దీప్ స్థానంలో యువ పేసర్మరోవైపు.. ఆకాశ్ దీప్ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా.. ఓ యువ పేసర్ ఏడాది కాలం తర్వాత పునరాగమనం చేయనున్నట్లు సమాచారం. అదే విధంగా రోహిత్ శర్మ గైర్హాజరీలో ప్రధాన పేసర్, వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత నాలుగు పర్యాయాలుగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకున్న భారత జట్టు.. ఈసారి మాత్రం అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోతోంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపుతోంది. కోహ్లి, రోహిత్ విఫలంఆసీస్తో ఐదు టెస్టుల్లో భాగంగా ఇప్పటికి నాలుగు పూర్తి కాగా.. తొలి మ్యాచ్లో శతకం సాధించడం మినహా కోహ్లి పెద్దగా రాణించలేకపోతున్నాడు. ముఖ్యంగా ఆఫ్ సైడ్ బంతుల్ని ఎదుర్కొనే క్రమంలో పదే పదే తప్పుల్ని పునరావృతం చేస్తూ వికెట్ పారేసుకుంటున్నాడు.మరోవైపు.. రోహిత్ సారథిగా, బ్యాటర్గా విఫలమవుతున్నాడు. అడిలైడ్లో జరిగిన రెండో టెస్టుతో జట్టులోకి వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఐదు ఇన్నింగ్స్లో కలిపి మరీ దారుణంగా31 పరుగులే చేశాడు. ఇక అతడి సారథ్యంలో రెండో టెస్టులో ఓడిన భారత్, బ్రిస్బేన్ టెస్టును డ్రాగా ముగించగలిగింది. అయితే, మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం 184 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది.సిడ్నీ టెస్టు నుంచి వైదొలిగిన రోహిత్!ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించే సమయం ఆసన్నమైందని.. అతడు వెంటనే తప్పుకొని యువకులకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆసీస్తో ఆఖరి టెస్టు ముగిసిన తర్వాత రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడిస్తాడనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తనకు తానుగా సిడ్నీ టెస్టు నుంచి వైదొలగాలని అతడు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో యశస్వి జైస్వాల్తో ఓపెనింగ్ జోడీగా కేఎల్ రాహుల్ మరోసారి బరిలోకి దిగనుండగా.. శుబ్మన్ గిల్(Shubhman Gill) మూడో స్థానంలో ఆడనున్నట్లు సమాచారం. అదే విధంగా గాయపడిన పేసర్ ఆకాశ్ దీప్ స్థానంలో ప్రసిద్ కృష్ణ తుదిజట్టుకు ఎంపికైనట్లు తెలుస్తోంది. రెండే మార్పులుఈ రెండు మార్పులు మినహా.. పాత జట్టుతోనే భారత్ సిడ్నీ టెస్టుకు సన్నద్ధమైనట్లు సమాచారం. కాగా శుక్రవారం నుంచి మంగళవారం(జనవరి 3-7) వరకు ఆసీస్- భారత్ మధ్య ఐదో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులో గెలిస్తేనే టీమిండియా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్ను 2-2తో డ్రా చేసుకోగలుగుతుంది. అదే విధంగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025 అవకాశాలు కూడా సజీవంగా ఉంటాయి.ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్టుకు భారత తుదిజట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.చదవండి: కెప్టెన్ కంటే బెటర్.. అతడిని మాత్రం తప్పించకండి: భారత మాజీ క్రికెటర్ -
రోహిత్, బుమ్రా కాదు!.. సిడ్నీ టెస్టులో టీమిండియా కెప్టెన్ అతడే!
ఆస్ట్రేలియాతో టీమిండియా ఆఖరి టెస్టుకు సమయం ఆసన్నమైంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో శుక్రవారం ఈ మ్యాచ్ మొదలుకానుంది. ఇందుకోసం ఇరుజట్లు ఇప్పటికే పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాయి. సిడ్నీలో గెలిచి ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 2-2తో డ్రా చేసుకోవాలని భారత్ భావిస్తోంది.మరోవైపు.. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)ని తామే కైవసం చేసుకోవాలని ఆసీస్ పట్టుదలగా ఉన్నాయి. ఫలితంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు మరింత రసవత్తరంగా మారనుంది. అయితే, ఈ కీలక టెస్టుకు ముందు టీమిండియా డ్రెసింగ్రూమ్లో విభేదాలు తలెత్తాయనే వార్తలు అభిమానులను కలవరపెడుతున్నాయి.హెడ్కోచ్ గౌతం గంభీర్తో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు సమన్వయం కుదరడం లేదని.. అదే విధంగా ఆటగాళ్ల తీరు పట్ల కోచ్ అసంతృప్తితో ఉన్నాడనే వదంతులు వచ్చాయి. అయితే, గౌతీ మాత్రం ఇవన్నీ అబద్దాలేనని కొట్టిపారేశాడు. అయినప్పటికీ, టీమిండియా కెప్టెన్ మార్పు అంశం మీద మాత్రం ఊహాగానాలు ఆగటం లేదు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదో టెస్టుకు ముందు కెప్టెన్గా రోహిత్పై వేటు పడనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అతడి గైర్హాజరీలో పెర్త్లో టీమిండియాను గెలిపించిన జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) పగ్గాలు చేపట్టడం లాంఛనమేనని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, బెంగాల్ మాజీ క్రికెటర్, ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడిన శ్రీవత్స్ గోస్వామి మాత్రం భిన్నంగా స్పందించాడు.సిడ్నీ టెస్టులో టీమిండియా కెప్టెన్ అతడే!‘‘టీమిండియాలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే.. సిడ్నీ టెస్టులో గిల్ కెప్టెన్గా వ్యవహరించునున్నాడని అనిపిస్తోంది. తదుపరి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ సైకిల్ కోసం మేనేజ్మెంట్ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదెంతో ఆసక్తికరంగా ఉంది’’ అని శ్రీవత్స్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.సరైన నాయకుడు బుమ్రానేఅయితే, మెజారిటీ మంది నెటిజన్లు మాత్రం శ్రీవత్స్ అభిప్రాయంతో విభేదిస్తున్నారు. గిల్కు తుదిజట్టులోనే చోటు దక్కనపుడు కెప్టెన్ ఎలా అవుతాడని ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో గిల్కు పగ్గాలు ఇచ్చే అవకాశం ఉందని.. ఇప్పుడు మాత్రం బుమ్రాకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాకు ప్రస్తుత పరిస్థితుల్లో బుమ్రానే సరైన నాయకుడు అని పేర్కొంటున్నారు. ఏదేమైనా శుక్రవారం సిడ్నీ టెస్టు మొదలైన తర్వాతే ఈ ఊహాగానాలకు చెక్ పడుతుంది.ఇదిలా ఉంటే.. ఐదు టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న టీమిండియాకు సానుకూల ఫలితాలు రావడం లేదు. పెర్త్లో గెలిచిన భారత జట్టు.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. బ్రిస్బేన్లో జరిగిన మూడో టెస్టులో వర్షం వల్ల డ్రాతో గట్టెక్కగలిగింది. అయితే, మెల్బోర్న్ వేదికగా నాలుగో టెస్టులో మాత్రం ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.రోహిత్ వైఫల్యాల వల్లే ఇలాఈ బాక్సింగ్ డే టెస్టులో ఆతిథ్య ఆసీస్ చేతిలో 184 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి.. సిరీస్లో 1-2తో వెనుకబడింది. ఈ సిరీస్లో రోహిత్ శర్మ సారథిగా, బ్యాటర్గా విఫలం అవుతుండటంతో అతడు వెంటనే రాజీనామా చేసి.. రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త కెప్టెన్ అంశం తెరమీదకు వచ్చింది.చదవండి: లవ్ యూ కాంబ్లీ.. త్వరలోనే వచ్చి కలుస్తా: టీమిండియా దిగ్గజం భరోసా -
రోహిత్ శర్మపై వేటు
-
భావోద్వేగంతో వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ
కొత్త సంవత్సరం వచ్చేసింది. నవ వసంతాన్ని తెచ్చింది. చేదు జ్ఞాపకాలను వదిలేసి.. మధురానుభూతులను పదిలం చేసుకుంటూ ముందుకు సాగిపొమ్మంటోంది. ఇక నూతన సంవత్సరం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి.ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) 2024-25 కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత క్రికెట్ జట్టు అక్కడే కొత్త ఏడాదికి స్వాగతం పలికింది. ఐదో టెస్టు కోసం మంగళవారమే సిడ్నీకి చేరుకుని న్యూ ఇయర్కి గ్రాండ్గా వెల్కమ్ చెప్పింది.అనుష్కతో విరాట్ఇక భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన సతీమణి అనుష్క శర్మ(Viat Kohli- Anushka Sharma)తో పాటు దేవ్దత్ పడిక్కల్, ప్రసిద్ కృష్ణతో కలిసి కొత్త సంవత్సర వేడులకు హాజరయ్యాడు. మరోవైపు.. యువ ఆటగాళ్లు రిషభ్ పంత్, శుబ్మన్ గిల్, మహ్మద్ సిరాజ్ తదితరులు కూడా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.భావోద్వేగంతో వీడ్కోలు పలికిన రోహిత్ శర్మఇదిలా ఉంటే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) 2024కు భావోద్వేగ వీడ్కోలు పలికాడు. ‘‘ఎన్నో ఎత్తు-పళ్లాలు.. అయినప్పటికీ ప్రతి ఒక్కటి గుర్తుండిపోతుంది. థాంక్యూ 2024’’ అంటూ గతేడాదికి సంబంధించిన జ్ఞాపకాలను వీడియో రూపంలో షేర్ చేశాడు.టీ20 ప్రపంచకప్ గెలిచిన సారథిగాకాగా 2024 రోహిత్ శర్మకు ఎన్నో ఆనందాలతో పాటు కొన్ని చేదు జ్ఞాపకాలను ఇచ్చింది. కెప్టెన్గా టీ20 ప్రపంచకప్-2024 గెలవడం రోహిత్ కెరీర్లోనే అత్యంత గొప్ప విషయం. అయితే, ఈ మెగా టోర్నీలో టీమిండియా చాంపియన్గా నిలవగానే హిట్మ్యాన్ అంతర్జాతీయ టీ20ల నుంచి రిటైర్ అయ్యాడు.ఐపీఎల్లో మాత్రం పరాభవంఇక అంతకంటే ముందే.. అంటే ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మను తొలగించారు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆడిన రోహిత్ బ్యాటర్గా ఆకట్టుకోలేకపోయాడు. జట్టు కూడా పాయింట్ల పట్టికలో అట్టడుగన పదో స్థానంలో నిలిచి ఘోర పరాభవం చవిచూసింది. అయితే, ఆ తర్వాత ప్రపంచ కప్ గెలుపు రూపంలో రోహిత్కు ఊరట దక్కింది.అదొక మాయని మచ్చగాఅనంతరం.. స్వదేశంలో న్యూజిలాండ్తో స్వదేశంలో టెస్టు సిరీస్లో టీమిండియా క్లీన్స్వీప్ కావడం రోహిత్ శర్మ కెప్టెన్సీ కెరీర్లోనే ఓ మాయని మచ్చగా మిగిలింది. సొంతగడ్డపై ఇంతకు మునుపెన్నడూ భారత టెస్టు జట్టు ప్రత్యర్థి చేతిలో ఇలా 3-0తో వైట్వాష్ కాలేదు. అలా అత్యంత చెత్త కెప్టెన్సీ రికార్డు 2024లో రోహిత్ పేరిట నమోదైంది.కుమారుడి రాకఇదిలా ఉంటే.. వ్యక్తిగత జీవితంలోనూ రోహిత్ శర్మకు 2024 మరుపురానిదిగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే.. గతేడాదే రోహిత్- రితికా జంట తమ రెండో సంతానం కుమారుడు అహాన్ శర్మకు జన్మనిచ్చారు. ఇక ఈ శుభవార్త తర్వాత ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన రోహిత్ శర్మకు అక్కడ మాత్రం గడ్డు పరిస్థితులే ఎదురయ్యాయి. బ్యాటర్గా, సారథిగానూ అతడు విఫలమయ్యాడు.అడిలైడ్ పింక్బాల్ టెస్టులో రోహిత్ సేన 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అనంతరం.. బ్రిస్బేన్ టెస్టును డ్రా చేసుకున్నా.. మెల్బోర్న్లో నాలుగో టెస్టులో మాత్రం 184 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.ఇక ఆఖరిదైన సిడ్నీ టెస్టు(జనవరి 3-7)లో గెలిస్తేనే బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్తో ఐదు టెస్టుల సిరీస్ను టీమిండియా 2-2తో డ్రా చేసుకోగలుగుతుంది. అదే విధంగా.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025 ఫైనల్ అవకాశాలను సజీవం చేసుకుంటుంది. చదవండి: అతడి కోసం పట్టుబట్టిన గంభీర్.. లెక్కచేయని సెలక్టర్లు? త్వరలోనే వేటు? View this post on Instagram A post shared by Rohit Sharma (@rohitsharma45) -
BGT: ఆసీస్తో ఆఖరి టెస్టు.. రోహిత్, కోహ్లిలపై వేటు?!
భారత్ జట్టును తమ భుజస్కంధాలపై నడిపించిన ఇద్దరు బ్యాటింగ్ అతిరథుల టెస్ట్ క్రికెట్ జీవితానికి త్వరలో తెరపడనుందా? ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy) సిరీస్ లో కెప్టెన్ రోహిత్ శర్మ , మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీల బ్యాటింగ్ ప్రదర్శన చూస్తే అది నిజమే అనిపిస్తుంది.పెర్త్లో జగిన తొలి టెస్టులోని రెండో ఇన్నింగ్స్లో సెంచరీతో అజేయంగా నిలిచిన 36 ఏళ్ళ కోహ్లి ఆ తర్వాత చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేకపోయాడు. ఇక వ్యక్తిగత కారణాల వల్ల తొలి టెస్టుకి దూరమైన రోహిత్ శర్మ ఈ సిరీస్లో దారుణంగా విఫలమవుతున్నాడు.వేటు వేయక తప్పదా?అద్భుత బ్యాటింగ్తో జట్టును ముందుంచి నడిపించించల్సిన ఈ ఇద్దరు అగ్రశేణి ఆటగాళ్లు వరుసగా విఫలమవడం, అదీ ఆస్ట్రేలియా వంటి కీలకమైన సిరీస్లో మరీ పేలవంగా ఆడటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సిడ్నీలో జరగనున్న ఆఖరిదైన ఐదో టెస్టులో వారిద్దరిని జట్టులో కొనసాగించడం అనుమానాస్పదంగానే కనిపిస్తోంది.నిజానికి... కోహ్లి- రోహిత్(Virat Kohli- Rohit Sharma) దశాబ్దానికి పైగా భారత బ్యాటింగ్ను తమ భుజాలపై మోస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. ఈ ఇద్దరు సూపర్స్టార్లు టెస్టుల్లో ఆడటం ఇక కష్టమే అనిపిస్తోంది. ఇక సోమవారం మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టులో ఓటమితో భారత్ వచ్చే ఏడాది లార్డ్స్లో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించడం కష్టంగానే కనిపిస్తోంది.తలకు మించిన భారంఏదో అద్భుతం జరిగితే తప్ప ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు భారత్ అర్హత సాధించడం దాదాపులేనట్టే. నాలుగో టెస్టులో ఓటమితో భారత్ అవకాశాలు దాదాపు మృగ్యమయ్యాయనే చెప్పాలి. ఈ నేపథ్యంలో రోహిత్, కోహ్లిలను జట్టులో కొనసాగించడం జట్టు మేనేజ్మెంట్కు తలకు మించిన భారం కావచ్చు. కనీసం చివరి టెస్టులో విజయం సాధిస్తే, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించడానికి భారత్ కి కొద్దిపాటి అవకాశమన్నా ఉంటుంది.సిడ్నీ టెస్టుకు దూరంఈ పరిస్థితుల్లో ఫామ్లేమితో సతమతమవుతున్న రోహిత్- కోహ్లిలను సిడ్నీ టెస్టుకు దూరంగానే ఉంచనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ ఆటతీరు మరీ పేలవంగా సాగడం అతడిపై వేటుకు కారణం కావొచ్చని తెలుస్తోంది. మెల్బోర్న్లో రెండో ఇన్నింగ్స్ లో 40 బంతుల్లో 9 పరుగులు చేసిన రోహిత్, ఈ సిరీస్ లో మొత్తం ఐదు ఇన్నింగ్స్లో 6.20 సగటుతో మొత్తం 31 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ నేపథ్యంలో రోహిత్పై వేటు తప్పనిసరిగా కనిపిస్తోంది.కోహ్లికి రవి శాస్త్రి మద్దతుఅయితే, కోహ్లికి కొద్దిగా మినహాయింపు కల్పించవచ్చు. భారత్ మాజీ కెప్టెన్, మాజీ కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) ఈ విషయాన్నే చెప్పాడు. రవిశాస్త్రి కోహ్లికి మద్దతు తెలియజేశాడు. "విరాట్ కోహ్లీ మరికొంత కాలం టెస్టుల్లో ఆడతాడనే నేను భావిస్తున్నాను" అని శాస్త్రి వ్యాఖ్యానించాడు. "విరాట్ కొంతకాలం ఆడతాడు, ఈ రోజు అతను అవుట్ అయిన విధానాన్ని త్వరగా మర్చిపోయి సిడ్నీ టెస్టులో రాణిస్తాడని భావిస్తున్నాను" అని శాస్త్రి అన్నాడు.రోహిత్కు కష్టమే.. ఇదే చివరి సిరీస్!అయితే రోహిత్ని మాత్రం శాస్త్రి సమర్ధించలేకపోయాడు. "ఇక రోహిత్ విషయానికి వస్తే, ఇదే బహుశా అతని చివరి టెస్ట్ సిరీస్ కావచ్చు. ఓపెనింగ్ బ్యాటర్గా వస్తున్న రోహిత్ ఫుట్వర్క్ ఎలా ఉందో చూసాం. అతను క్రీజులో కాస్త మందకొడిగా కదులుతున్నాడు. దీనివల్ల బహుశా కొన్నిసార్లు రోహిత్ బంతిని ఎదుర్కోవడంలో ఒకింత ఆలస్యం చేస్తున్నాడు. ఆస్ట్రేలియా వంటి బౌలర్లతో ఇది కష్టమే’’ అని శాస్త్రి అన్నాడు.ఇక సిడ్నీ టెస్టులో ఓపెనర్గా కేఎల్ రాహుల్ బ్యాటింగ్ కి వచ్చే అవకాశముంది. పెర్త్ లో జరిగిన తొలి టెస్టులో యశస్వి జైస్వాల్తో కలిసి ఓపెనింగ్ కి వచ్చిన రాహుల్ చక్కగా రాణించాడు. వీరిద్దరూ ఆ టెస్ట్ లోని రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా తొలి వికెట్ కి ఏకంగా 201 పరుగుల భాగస్వామ్యంతో భారత్ విజయానికి దోహదం చేసారు.రోహిత్ తిరిగి జట్టులోకి రావడంతోఅయితే, రోహిత్ తిరిగి జట్టులోకి రావడంతో అతను గబ్బా టెస్టులో మిడిల్-ఆర్డర్ బ్యాటర్గా విఫలమైన తర్వాత రాహుల్ని మూడవ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చాడు. ఈ చర్య రాహుల్ కి మాత్రమే కాక భారత్ జట్టుని కూడా దెబ్బ తీసింది. దీని కారణంగా అడిలైడ్ లో జరిగిన రెండో టెస్ట్లో భారత్ భారీ పరాజయాన్ని చవిచూసింది. ఇప్పుడు మెల్బోర్న్ టెస్టులో కూడా ఓటమి చవిచూడడంతో రోహిత్ సిడ్నీ టెస్టు నుంచి స్వచ్ఛందంగా తప్పుకొని.. జస్ప్రీత్ బుమ్రాకి జట్టు నాయకత్వం అప్పగిస్తే అది భారత్కు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.చదవండి: WTC 2025: భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. అదొక్కటే దారి! -
నాడు అశ్విన్-విహారి.. ఏడాది తర్వాత బ్రాడ్-అండర్సన్..
Ashes 4th Test: యాషెస్ సిరీస్ 2021-22లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టెయిలెండర్లు స్టువర్ట్ బ్రాడ్(35 బంతుల్లో 8 నాటౌట్)-ఆండర్సన్(6 బంతుల్లో 0 నాటౌట్)లు అద్భుతమైన పోరాట పటిమను కనబర్చడంతో ఆతిధ్య ఆసీస్ డ్రాతో సరిపెట్టుకుంది. 358 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. మ్యాచ్ మరో పది ఓవర్లలో ముగుస్తుందన్న సమయానికి 270 పరుగులకు 9 వికెట్లు కోల్పోయి పరాజయం అంచున నిలిచింది. బ్రాడ్ తో కలిసి ఏడు ఓవర్ల పాటు పోరాడి మరో మూడు ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుందన్న తరుణంలో జాక్ లీచ్(26) ఔటవ్వడంతో ఇంగ్లండ్ శిబిరంలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఈ సమయంలో బ్రాడ్, అండర్సన్లు తమ అనుభవాన్నంతా రంగరించి ఆసీస్ విజయానికి అడ్డుగా నిలిచారు. స్మిత్ వేసిన ఆఖరి ఓవర్ ఆడిన అండర్సన్.. ఆసీస్కు వికెట్ దక్కనివ్వలేదు. ఫలితంగా మ్యాచ్ డ్రా అయ్యింది. కాగా, సరిగ్గా ఏడాది కిందట ఇదే మైదానంలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్-హనుమ విహారి సైతం ఇదే తరహాలో పోరాడి ఆసీస్కు విజయాన్ని దక్కనీయకుండా అడ్డుపడ్డారు. 2021 జనవరిలో సిడ్నీ వేదికగా ఆసీస్తో జరిగిన మూడో టెస్ట్లో అశ్విన్ (128 బంతుల్లో 39 నాటౌట్), విహారి (161 బంతుల్లో 23 నాటౌట్)లు భీకరమైన ఆసీస్ పేసర్లను ఎదుర్కొని ఆసీస్ విజయానికి అడ్డుగోడలా నిలిచారు. బంతులు విసిరివిసిరి ఆసీస్ బౌలర్లు అలసిపోయారే కానీ ఈ ఇద్దరు క్రీజ్ను వీడలేదు. ఫలితంగా టీమిండియా ఆ మ్యాచ్ను డ్రాగా ముగించింది. చదవండి: IND Vs SA 3rd Test: సిరాజ్ స్థానంలో ఎవరంటే..? -
రవిశాస్త్రి వ్యాఖ్యలు కలచివేశాయి.. బస్సు కిందకు తోసేసినట్లు అనిపించింది..!
Ravichandran Ashwin: భారత జట్టు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రిపై టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతంలో ఆసీస్ పర్యటన సందర్భంగా రవిశాస్త్రి.. సహచర ఆటగాడు కుల్దీప్ యాదవ్పై ప్రశంసలు కురిపిస్తూ.. పరోక్షంగా తనను కించపరిచే వ్యాఖ్యలు చేశాడని అన్నాడు. రవిశాస్త్రి చేసిన ఆ వ్యాఖ్యలు తనను తీవ్రంగా కలచివేశాయని, కదిలే బస్సు కింద తోసేసినట్లు అనిపించిందని వాపోయాడు. తాజాగా ఓ ప్రముఖ క్రీడా ఛానల్తో మాట్లాడుతూ.. అశ్విన్ తన మనసులోని బాధను వెల్లగక్కాడు. వివరాల్లోకి వెళితే.. 2018 ఆసీస్ పర్యటనలో భాగంగా జరిగిన సిడ్నీ టెస్ట్(నాలుగో టెస్ట్)లో కుల్దీప్ యాదవ్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శన అనంతరం రవిశాస్త్రి మీడియాతో మాట్లాడుతూ.. విదేశాల్లో కుల్దీప్ భారత నంబర్వన్ స్పిన్నర్ అని కొనియాడాడు. రవిశాస్త్రి చేసిన ఈ వ్యాఖ్యలే తనను తీవ్రంగా బాధించాయని, బస్సు కింద తోసేసినట్లు అనిపించిందని అశ్విన్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అయితే, తాను బాధపడింది కుల్దీప్ను పొగిడినందుకు కాదని, ఆసీస్ గడ్డపై తనకు ఐదు వికెట్లు దక్కనందుకేనని చెప్పుకొచ్చాడు. కుల్దీప్ ప్రదర్శన పట్ల మనస్పూర్తిగా సంతోషించానని.. అయితే టీమిండియా గెలుపులో తన పాత్ర లేకపోవడం బాధించిందని, అందుకు తాను జట్టు గెలుపు సంబరాల్లో కూడా పాల్గొనకూడదని అనుకున్నట్లు వివరించాడు. ఆ సందర్భంలో తాను క్రికెట్కు గుడ్బై చెప్పే ఆలోచన కూడా చేసినట్లు అశ్విన్ పేర్కొన్నాడు. చదవండి: దక్షిణాఫ్రికా పర్యటనకు అతన్ని ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యపరిచింది.. -
ఆటగాళ్లపై జాత్యాహంకార వ్యాఖ్యలు నిజమే
సాక్షి. న్యూఢిల్లీ: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇటీవల ముగిసిన సిడ్నీ టెస్టులో భారత ఆటగాళ్లు జాతి వివక్షను ఎదుర్కొన్న మాట వాస్తవమేనని క్రికెట్ ఆస్ట్రేలియా అంగీకరించింది. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించింది. భారత ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్లు మైదానంలో ఫీల్డింగ్ చేస్తుండగా ఆసీస్ అభిమానులు జాత్యహంకార వ్యాఖ్యలు చేశారని టీమిండియా మేనేజ్మెంట్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ చేపట్టింది. చదవండి: చెన్నై వేదికగా ఐపీఎల్ 2021 మినీ వేలం సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిని గుర్తించామని.. నిబంధనల ప్రకారం నిందితులను మైదానంలోకి అడుగుపెట్టకుండా దీర్ఘకాల నిషేధం విధిస్తామని సీఏ అధికారులు వెల్లడించారు. ఈ మ్యాచ్లో భారత్ ఆటగాళ్లు పుజారా, విహారి, అశ్విన్, పంత్లు గాయాల బారిన పడినప్పటికీ సమయోచితంగా పోరాడి మ్యాచ్ను డ్రాగా ముగించడంలో సఫలమయ్యారు. ఇక ఆఖరిదైన నాలుగో టెస్టులో భారత ఆటగాళ్లు మరోసారి చెలరేగి ఆసీస్ గడ్డపై చారిత్రక సిరీస్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. -
‘దురదృష్టవశాత్తూ పంత్ అవుట్ అయ్యాడు’
న్యూఢిల్లీ: ‘‘నిజానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్యాడ్స్ కూడా కట్టుకున్నాను. ఇంజక్షన్ తీసుకున్నాను. కనీసం 10- 15 ఓవర్లపాటు క్రీజులో ఉండాలని మానసికంగా సిద్ధమైపోయాను. ఎలాంటి షాట్లు ఆడాలి, ఫాస్ట్ బౌలర్స్ను ఎలా ఎదుర్కోవాలి. క్రీజులో ఎలా నిలదొక్కుకోవాలి అనే ఆలోచనలతోనే నా మెదడు నిండిపోయింది. నిజానికి గాయం కారణంగా అన్ని షాట్లు ఆడలేం కదా! అయితే పుజారా, పంత్ మంచి భాగస్వామ్యం నమోదు చేశారు. కానీ దురదృష్టవశాత్తూ పంత్ అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా చేజారిపోయింది. మేం మ్యాచ్ డ్రా చేసుకోవాల్సి వచ్చింది’’ అంటూ టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సిడ్నీ టెస్టు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు.(చదవండి: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్: పూర్తి షెడ్యూల్ ఇదే!) కాగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భాగంగా జడేజా గాయపడిన విషయం తెలిసిందే. అతడి బొటనవేలు విరిగి పోవడంతో సర్జరీ చేసిన వైద్యులు సుమారు ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. కానీ రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ పట్టు బిగించడంతో ఎలాగైనా జట్టును గెలిపించాలనే ఉద్దేశంతో గాయంతోనైనా సరే ఆడేందుకు సిద్ధమయ్యానని జడేజా చెప్పుకొచ్చాడు. స్పోర్ట్స్ టుడేతో మాట్లాడిన అతడు..‘‘బ్యాటింగ్ చేస్తున్న సమయంలో నా బొటనవేలు ఫ్రాక్చర్ అయింది. కానీ నేను ఆ విషయాన్ని గ్రహించనే లేదు. టెయిలెండర్స్తో కలిసి ఎలా పరుగులు రాబట్టాలా అన్న అంశం మీదే నా దృష్టి ఉంది. నిజానికి నా వేలు విరిగిపోయింది. మైదానం వీడి స్కానింగ్ చేయించుకున్న తర్వాతే ఈ విషయం తెలిసింది. అయినా సరే తప్పనిసరి అయితే బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాను. అయితే, అశ్విన్, విహారి(ఇద్దరూ కలిసి 256 బంతులు ఎదుర్కొన్నారు) మ్యాచ్ను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. పట్టుదలగా నిలబడ్డారు. టెస్టు క్రికెట్లో ప్రతిసారీ పరుగులు రాబట్టడమే ముఖ్యం కాదు. పరిస్థితికి తగ్గట్లు మారుతూ ఉండాలి. మొత్తానికి సమిష్టి కృషితో మేం మ్యాచ్ను కాపాడుకోగలిగాం’’ అని జడేజా సహచర ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించాడు. కాగా సిడ్నీ టెస్టును రహానే సేన డ్రాగా ముగించిన విషయం తెలిసిందే. ఇక అంతకుముందు పింక్బాల్ టెస్టులో ఆసీస్ చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి బదులు తీర్చుకున్న టీమిండియా, బాక్సింగ్ డే టెస్టులో విజయం సాధించి సిరీస్ను 1-1తో సమం చేసింది. అయితే, ఆసీస్కు మంచి రికార్డు ఉన్న గబ్బా మైదానంలో వారిని మట్టికరిపించి, అద్భుతమైన ఛేజింగ్తో చారిత్రక గెలుపును సొంతం చేసుకుని 2-1తో బోర్డర్ గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకుంది. ఇక ఇంగ్లండ్తో జరిగే టెస్టు సిరీస్కు గాయం కారణంగా జడేజా దూరమైన సంగతి తెలిసిందే. -
‘స్లెడ్జింగ్ మొదలు పెట్టగానే విషయం తెలిసింది’
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో భారత జట్టు పోరాటపటిమ, అద్భుత ప్రదర్శన ఎప్పటికీ మరిచిపోలేనిది. ముఖ్యంగా సిడ్నీ టెస్టును అశ్విన్, విహారి కలిసి కాపాడుకున్న తీరు అసమానం. ఈ పర్యటనలో తాను ఆడిన తొలి మూడు టెస్టులకు సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, జట్టు ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్తో కలిసి పంచుకున్నాడు. మైదానంలో అశ్విన్, విహారి పోరాడుతున్న సమయంలో కోచ్లుగా తమ పరిస్థితి ఎలా ఉందో శ్రీధర్ గుర్తు చేసుకున్నాడు. ‘పుజారా అవుటయ్యాక ఆందోళన పెరిగిపోయింది. విహారికి కండరాలు పట్టేయడం కూడా రవిశాస్త్రికి ఆగ్రహం తెప్పించింది. ఒక్క సింగిల్ తీస్తేనే ఇలా జరుగుతుందా అని అతను కోప్పడ్డాడు. ఇక అశ్విన్, విహారి డిఫెన్స్ మొదలయ్యాక ప్రతీ బంతికి అతనిలో ఉత్కంఠ కనిపించింది. ఒక్క బంతి ఆడగానే సీట్లోంచి లేవడం, శభాష్ అంటూ మళ్లీ కూర్చోవడం...ఇలా ఇలా 249 బంతుల పాటు సాగింది. మ్యాచ్ ముగిసేవరకు ఈ భావోద్వేగాలు కొనసాగాయి’ అని శ్రీధర్ చెప్పాడు. అశ్విన్ కూడా విహారితో తన భాగస్వామ్యం గురించి చెప్పుకొచ్చాడు. ‘నేను స్పిన్ను సమర్థంగా ఆడతాను కాబట్టి లయన్ను ఎదుర్కోవాలని, పేసర్లను విహారి ఆడాలనేది ప్లాన్. అయితే ఒక దశలో సింగిల్ కారణంగా లెక్క మారిపోయింది. కమిన్స్ బౌలింగ్లో దెబ్బలు తినకుండా ఆడటం అసాధ్యం. అదే నాకు జరిగింది. మధ్యలో శార్దుల్ ఠాకూర్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి పరుగెత్తుకొచ్చాడు. ఏదో సందేశం ఉందని మేం భావిస్తే... హెడ్ కోచ్ మీకు ఏవేవో సూచనలు ఇవ్వమని నాకు చెప్పి పంపించాడు. అయితే నేను మాత్రం అవేమీ మీకు చెప్పను. మీరు ఎలా ఆడుతున్నారో అలాగే ఆడండి అని చెప్పి వెళ్లిపోయాడు. ఇది చెప్పడానికి నువ్వు రావాలా అన్నాను. ఆసీస్ పేలవ వ్యూహాలు కూడా మాకు మేలు చేశాయి. నేను వంగడం కష్టమై నిటారుగా నిలబడుతుంటే నాకు బౌన్సర్లు వేశారు. అదే ముందుకొచ్చి ఆడేలా చేస్తే నేను బాగా ఇబ్బంది పడేవాడిని. పైన్ స్లెడ్జింగ్ మొదలు పెట్టగానే మమ్మల్ని అవుట్ చేసే విషయంలో వారు చేతులెత్తేశారని మాకు అర్థమైపోయింది’ అని అశ్విన్ వివరించాడు. అడిలైడ్లో ఘోర పరాభవం తర్వాత అదే రోజు అర్ధరాత్రి సమావేశంలోనే మెల్బోర్న్ టెస్టు కోసం వ్యూహరచన చేశామని శ్రీధర్ వెల్లడించాడు. 36కు ఆలౌట్ అయిన తర్వాత బ్యాటింగ్ను పటిష్టం చేయడంపై దృష్టి పెట్టకుండా అదనపు బౌలర్ను తీసుకోవాలనే ఆలోచన బాగా పని చేసిందని, జడేజా అద్భుతంగా ఆడాడని అతను కితాబునిచ్చాడు. పైగా ఆసీస్ బౌలర్లు ఒకే లైన్లో బంతులు వేస్తున్న విషయంపై చర్చించి ఎడమ చేతివాటం ఆటగాడు ఉంటే బాగుంటుందని భావించి పంత్ను తుది జట్టులోకి తీసుకున్నట్లు చెప్పాడు. జూలైలోనే వ్యూహరచన ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆఫ్సైడ్ వైపు ఆడే అవకాశాలు బాగా తగ్గిస్తే తాము పైచేయి సాధించవచ్చనే ప్రణాళికను సిరీస్కు చాలా రోజుల ముందుగా వేసినట్లు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ వెల్లడించాడు. సిరీస్లో లెగ్ సైడ్ ఆడబోయి కీలక ఆటగాళ్లు స్మిత్, లబ్షేన్ వికెట్లు కోల్పోవడంతో భారత్కు పట్టు చిక్కింది. ‘స్మిత్, లబ్షేన్ ఎక్కువగా కట్, పుల్ షాట్లతో పాటు ఆఫ్ సైడ్ పరుగులు సాధించే బ్యాట్స్మెన్. అయితే న్యూజిలాండ్ పేసర్ వాగ్నర్ కొద్ది రోజుల ముందు లెగ్ సైడ్ బౌలింగ్ చేసి స్మిత్ను బాగా ఇబ్బంది పెట్టాడు. ఇది చూసి పన్నిన వ్యూహం అద్భుతంగా పని చేసింది’ అని అరుణ్ వివరించారు. ఆస్ట్రేలియా పర్యటనలో లభించిన ఆణిముత్యం సిరాజ్ అని హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించారు. వ్యక్తిగత బాధను దిగమింగి అతను జట్టు కోసం చేసిన ప్రదర్శనను ఎంత ప్రశంసించినా తక్కువేనని అభిప్రాయపడ్డాడు. మరోవైపు ఒక రోజు ఆలస్యంగా శుక్రవారం అశ్విన్, వాషింగ్టన్ సుందర్ స్వస్థలం చెన్నై చేరుకొని రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆరు రోజులు క్వారంటైన్కు వెళ్లిపోయారు. -
మంత్రి కేటీఆర్ను కలిసిన హనుమ విహారి
సాక్షి, హైదరాబాద్: టీమిండియా ఆటగాడు హనుమ విహారి సోమవారం తెలంగాణ ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ను ప్రగతిభవన్లో మర్యాదపూర్వకంగా కలిశాడు. సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో అశ్విన్తో కలిసి హనుమ విహారి కడదాకా నిలిచి మ్యాచ్ను డ్రాగా ముగియడంలో కీలకపాత్ర పోషించాడు. ఆసీస్ బౌలర్లు వరుస బౌన్సర్లతో బెంబెలెత్తించిన.. ఈ ఇద్దరు మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా బ్యాటింగ్ చేసి జట్టును ఓటమినుంచి గట్టెక్కించారు. హనుమ విహారి ప్రదర్శనపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా ప్రత్యేకంగా అభినందించిన సంగతి తెలిసిందే. అయితే తొడకండరాల గాయం కారణంగా విహారి ఆఖరిదైన నాలుగో టెస్టుకు దూరంకావడంతో ఇటీవల స్వదేశానికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం విహారి కేటీఆర్ను కలిశాడు. ఈ సందర్భంగా ఆసీస్ గడ్డపై చిరస్మరణీయ ప్రదర్శన చేసిన విహారిని మంత్రి కేటీఆర్ శాలువాతో సన్మానించారు. ఆసీస్ పర్యటనకు సంబంధించిన విషయాలను విహారీ కేటీఆర్కు వివరించాడు. కేటీఆర్ను కలవడం, క్రికెట్ గురించి ఇద్దరి మధ్య ఆసక్తికర చర్చ జరగడం ఆనందంగా ఉందని విహారి పేర్కొన్నాడు. అనంతరం కేటీఆర్తో దిగిన ఫొటోలను విహారి ట్విటర్లో షేర్ చేశాడు. టీమ్ ఇండియా బ్యాట్స్మన్ @Hanumavihari మంత్రి @KTRTRS ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆసీస్ గడ్డపై చిరస్మరణీయ ప్రదర్శన చేసిన విహారిని మంత్రి కేటీఆర్ శాలువాతో సన్మానించారు. pic.twitter.com/Lz96cnEWVw — KTR News (@KTR_News) January 18, 2021 -
సిరాజ్కు సారీ చెప్పిన డేవిడ్ వార్నర్!
సిడ్నీ: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రసవత్తర టెస్టు సిరీస్ సమరంలో జాతివివక్ష వ్యాఖ్యలు కలవరం పుట్టించాయి. ఇప్పటికే పూర్తయిన వన్డే సిరీస్ను ఆతిథ్య జట్టు, టీ20 సిరీస్ను భారత్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. టెస్టు సిరీస్ విషయానికి వస్తే తొలి టెస్టులో ఆస్ట్రేలియా, రెండో టెస్టులో భారత్ విజయం సాధించి సమంగా నిలిచాయి. ఈసమయంలో సిడ్నీ జరిగిన మూడో టెస్టు మూడో రోజున ఆస్ట్రేలియాకు చెందిన కొంతమంది ఆకతాయిలు బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మహ్మద్ సిరాజ్పై జాతివివక్ష వ్యాఖ్యలు చేయడంతో టీమిండియా క్రికెట్ ఆస్ట్రేలియాకు ఫిర్యాదు చేసింది. నాలుగో రోజు కూడా అలాంటి సీనే రిపీట్ అయింది. ఈసారి బుమ్రాను జాతి వివక్ష వ్యాఖ్యలతో ఆసీస్ మూకలు ఇబ్బందులు పెట్టడంతో మరోసారి టీమిండియా ఫిర్యాదు చేయక తప్పలేదు. ఈ ఘటనపై తాజాగా ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మన్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. జాతి వివక్ష వ్యాఖ్యలపై సిరాజ్కు, బుమ్రాకు, టీమిండియాకు క్షమాపణలు చెప్పాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆయన వెల్లడించాడు. జాతి వివక్ష వ్యాఖ్యలపై విచారిస్తున్నానని అన్నాడు. అలాంటి వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాడు. భారత ఆటగాళ్లపై ఆకతాయిల వైఖరి తీవ్ర నిరాశకు గురి చేసిందని వాపోయాడు. నిందితులపై క్రికెట్ ఆస్ట్రేలియా చర్యలు తీసుకుటుందని స్పష్టం చేశాడు. మరోసారి అలాంటి ఘటనలు రిపీట్ కావని ఆశిస్తున్నట్టు వార్నర్ తన పోస్టులో చెప్పుకొచ్చాడు. (చదవండి: 'అశ్విన్పై చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నా') గబ్బా స్టేడియంలో జరిగే ఫైనల్ టెస్టుకు రెడీ అవుతున్నామని పేర్కొన్నాడు. అలాగే, సిడ్నీ టెస్టులో గొప్పగా రాణించి మ్యాచ్ను నిలుపుకున్న భారత ఆటగాళ్ల పోరాట పటిమను వార్నర్ ప్రశంసించాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు బాగా ఆడుతున్నారని కొనియాడాడు. కాగా, జాతి వివక్ష వ్యాఖ్యలపై క్రికెట్ ఆస్ట్రేలియా సంజాయిషీ ఇచ్చుకుంది. మరోసారి అలా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, ఆ ఆకతాయిలను గుర్తించి పోలీసులకు అప్పగిస్తామని హామీ ఇచ్చింది. ఐసీసీ కూడా జాతి వివక్ష వ్యాఖ్యల్ని ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) -
సహచరునిపై అశ్విన్ ప్రశంసల వర్షం
సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్లో ఆసీస్ బౌలర్ల పాలిట కొరకరాని కొయ్యలా మారి, మ్యాచ్ను వారికి దక్కకుండా చేసిన తెలుగు కుర్రాడు హనుమ విహారిని సహచర ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలతో ముంచెత్తాడు. మ్యాచ్ను డ్రాగా ముగించే క్రమంలో విహారి సాధించిన అజేయమైన 23 పరుగులు శతకంతో సమానమని, తాను చూసిన మేటి ఇన్నింగ్స్ల్లో ఇది కూడా ఒకటి అని అశ్విన్ పేర్కొన్నాడు. గాయంతో బాధపడుతూనే ఆటను కొనసాగించిన విహారి.. 161 బంతులను ఎదుర్కొని మ్యాచ్ను చేజారకుండా వీరోచితమైన ఇన్నింగ్స్ను ఆడాడని ప్రశంసించాడు. అతని ప్రదర్శన యావత్ భారతావనిని గర్వపడేలా చేసిందని కొనియాడాడు. విహరి ఇన్నింగ్స్ టీమిండియా మాజీ ఆటగాడు 'ది వాల్' రాహుల్ ద్రవిడ్ ప్రదర్శనను గుర్తుచేసిందని పేర్కొన్నాడు. అతను ప్రదర్శించిన పోరాట పటిమ సహచర సభ్యుల్లో ఎంతో స్పూర్తిని నింపిందని, ఆఖరి టెస్టులో విజయం సాధించడానికి ఇది తమకు తోడ్పడుతుందని అశ్విన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, 98/2 ఓవర్నైట్ స్కోరుతో ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. ఆరంభంలోనే రహానే (18 బంతుల్లో 4 పరుగులు) వికెట్ను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడగా, రిషబ్ పంత్ 118 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 97 పరుగులు సాధించి భారత్ శిబిరంలో విజయంపై ఆశలు రేకెత్తించాడు. ఇక పుజారా 205 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 77 పరుగులు సాధించి మ్యాచ్ను డ్రాగా ముగించడంలో తన వంతు సహకారాన్ని అందించాడు. విహారికి జతగా అశ్విన్ 128 బంతుల్లో 7 ఫోర్లతో 39 పరుగులు సాధించి సమయోచితమైన ఇన్నింగ్స్ను ఆడాడు. వీరిద్దరూ కలిసి 257 బంతులను ఎదుర్కొని ఆసీస్ విజయానికి అడ్డుగోడలా నిలిచారు. తొలి ఇన్సింగ్స్లో 338 పరుగులు చేసి భారత్ను 238 పరుగులకు కట్టడి చేసిన ఆతిథ్య జట్టు.. రెండో ఇన్సింగ్స్లో మరింత మెరుగ్గా ఆడిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్లో 94 పరుగుల ఆధిక్యం లభించడంతో రెండో ఇన్సింగ్స్ను 312 పరుగుల వద్ద ఆసీస్ డిక్లేర్ చేసింది. 407 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఐదు వికెట్ల నష్టానికి 334 పరుగులు సాధించి మ్యాచ్ను డ్రాగా ముగించింది. -
భారత ఆటగాళ్లపై జాతి వివక్ష వ్యాఖ్యలు
సిడ్నీ: ప్రపంచం ఓ వైపు వైరస్తో పోరాడుతోంది. మరోవైపు జాతి వివక్షపై చేయిచేయి కలుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆస్ట్రేలియా మూకలు బరితెగించాయి. చిత్తుగా తాగిన మద్యం మత్తులో భారత క్రికెటర్లపై చెత్త వాగుడుకు దిగాయి. జాత్యాహంకార దూషణకు తెగబడి టెస్టు మ్యాచ్లో అలజడి రేపాయి. శనివారమే (మూడో రోజు ఆటలో) ఇది భారత ఆటగాళ్లను తాకింది. ఆదివారమైతే శ్రుతి మించింది. దీంతో టీమిండియా ఫిర్యాదు చేసింది. అంపైర్లు వెంటనే స్పందించారు. తర్వాత ఇరు దేశాల క్రికెట్ బోర్డులు కూడా సమస్యపై దృష్టి పెట్టాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అయితే ‘వివక్ష’పై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)ను నివేదిక కోరింది. భారత ఆటగాళ్లు దీనిపై ఉక్కుపిడికిలి బిగించాల్సిందేనన్నారు. అసలేం జరిగింది? బుమ్రా, సిరాజ్లపై శనివారం ఆసీస్ ఆకతాయి ప్రేక్షకులు జాత్యహంకార మాటలతో హేళన చేశారు. ఆదివారం వీరిచేష్టలు మరింత శ్రుతిమించాయి. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ సమయంలో స్క్వేర్ లెగ్ బౌండరీ వద్ద ఉన్న మూకలు అసలే తండ్రిని కోల్పోయి బాధలో ఉన్న సిరాజ్ను లక్ష్యంగా చేసుకొని ‘బ్రౌన్ డాగ్’, ‘బిగ్ మంకీ’ అంటూ దూషించారు. దీనిని గమనించిన ఆటగాళ్లంతా సిరాజ్ను అనునయించారు. 86వ ఓవర్ ముగిశాక భారత ఆటగాళ్లంతా ఓ చోట చేరుకున్నారు. ఏం చేశారు? ఐసీసీ సీరియస్ క్రికెట్లో జాతి వివక్షను ఉపేక్షించబోమని ఐసీసీ తెలిపింది. సిడ్నీ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఉదంతంపై సీఏ వివరణ కోరామని, నివేదిక వచ్చాక పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఐసీసీ పేర్కొంది. సీఏ క్షమాపణ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) జరిగిన సంఘటనపై విచారం వెలిబుచ్చింది. భారత ఆటగాళ్లను, క్రికెట్ బోర్డును క్షమాపణ కోరింది. ‘ఇంతటితో దీన్ని విడిచిపెట్టం. ఆకతాయిలను ఇప్పటికే గుర్తించాం. సీఏ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇకపై వారిని మైదానాల్లోకి అనుమతించకుండా నిషేధిస్తాం. చట్టపరమైన చర్యల కోసం న్యూసౌత్వేల్స్ పోలీసులకు అప్పగిస్తాం’ అని సీఏ ఉన్నతాధికారి సీన్ కారల్ అన్నారు. బీసీసీఐ కార్యదర్శి జై షా ‘మన సమాజంలో, క్రీడల్లో జాత్యహంకారానికి చోటులేదు. ఇప్పటికే సీఏతో సంప్రదించాం. దోషులపై చర్యలు తీసుకోవాలని గట్టిగా కోరాం’ అని ట్వీట్ చేశారు. నాకు ఇది నాలుగో ఆసీస్ పర్యటన. గతంలో ప్రత్యేకించి సిడ్నీలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. నేనూ బాధితుణ్నే. బౌండరీలైన్ వద్ద ఉండే క్రికెటర్లకు ఇలాంటి దూషణలు పరిపాటి. ఇవి పునరావృతం కాకుండా ఉండాలంటే ఉక్కుపిడికిలి బిగించాల్సిందే. – భారత సీనియర్ స్పిన్నర్ అశ్విన్ జాత్యహంకారాన్ని సహించేది లేదు. మైదానాల్లో ఇలాంటి రౌడీ మూకల ప్రవర్తన ఆటగాళ్లను బాధిస్తోంది. నేను 2011–12లో ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాను. దీన్ని తీవ్రంగా పరిగణించాలి. కఠిన చర్యలు తీసుకోవాలి. – విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ -
బుమ్రా చేసిన పనికి షాక్ తిన్న అంపైర్
సిడ్నీ: ఆసీస్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ముందు 407 పరుగులు భారీ లక్ష్యం ఉన్న సంగతి తెలిసిందే. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. పుజారా 9, కెప్టెన్ రహానే 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ గెలవాలంటే ఇంకా 309 పరుగులు చేయాల్సి ఉంది. ఈ సంగతి కాసేపు పక్కనబెడితే.. ఆసీస్ ఇన్నింగ్స్ సమయంలో టీమిండియా స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా చేసిన పని ఇప్పుడు నవ్వు తెప్పిస్తుంది. ఆసీస్ 259 పరుగుల ఆధిక్యంలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్టీవ్ స్మిత్ 51 పరుగులు, కామెరాన్ గ్రీన్ 10 పరుగులతో ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ బాదిన స్మిత్ రెండో ఇన్నింగ్స్లోనూ శతకం సాధించే పనిలో ఉన్నాడు. అయితే టీమిండియా జడేజా గైర్హాజరీలో నలుగురు బౌలర్లతో మాత్రమై బౌలింగ్ చేయాల్సి వచ్చింది. జట్టుకు కీలక బౌలర్గా వికెట్ తీయాల్సిన ఒత్తిడి బుమ్రాపై మరింత ఎక్కువైంది. మరో సీనియర్ అశ్విన్ ఒకవైపు బౌలింగ్ చేస్తున్నా వికెట్లు మాత్రం పడడం లేదు.(చదవండి: టీమిండియాకు క్రికెట్ ఆస్ట్రేలియా క్షమాపణలు) దీంతో బుమ్రాకు చిర్రెత్తికొచ్చిందేమో తనలో ఎప్పుడు చూడని ఒక కోణాన్ని చూపించాడు. బంతి వేయడానికి బౌలింగ్ ఎండ్వైపు సాగుతున్న బుమ్రా నాన్స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న స్మిత్ను చూస్తూ బెయిల్స్ను బంతితో కిందకు విసురుకుంటూ వెళ్లిపోయాడు. స్మిత్ ఇంక ఎంతసేపు ఆడుతావు.. తొందరగా ఔట్ అవ్వు అన్నట్లుగా బుమ్రా సంకేతం ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. అయితే బుమ్రా చర్యతో ఫీల్డ్ అంపైర్ పాల్ రిఫీల్ షాక్ తిన్నాడు. బుమ్రా బెయిల్స్ పడేయగానే.. అతను ఎందుకిలా చేశాడు అనే కోణంలో రిఫీల్ చూస్తూ ఒక నిమిషం పాటు అలాగే నిలుచుండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ట్విటర్లో షేర్ చేయగా వైరల్గా మారింది. బుమ్రా చేసిన పనికి అంపైర్ ఇచ్చిన స్టిల్ నవ్వు తెప్పిస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. (చదవండి: 'నన్ను తిడతావేంటి... ఆ నిర్ణయం థర్డ్ అంపైర్ది') Look at Paul Reiffel's reaction after Bumrah knocks the bails over 😂 #AUSvIND pic.twitter.com/294ChqKBB0 — 7Cricket (@7Cricket) January 10, 2021 -
ఆసీస్పై రోహిత్ సెంచరీ సిక్సర్ల రికార్డు
సిడ్నీ: రోహిత్ శర్మ అంటేనే భారీ సిక్సర్లకు పెట్టింది పేరు.. ఒక్కసారి మైదానంలో పాతుకుపోయాడంటే సిక్సర్ల వర్షం కురిపిస్తాడు. ఆసీస్ టూర్కి కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన హిట్మ్యాన్ వచ్చీ రావడంతోనే ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియాపై అన్ని ఫార్మాట్లు కలిపి 100 సిక్సర్లు కొట్టిన ఏకైక టీమిండియా ఆటగాడిగా రికార్డు సొంతం చేసుకున్నాడు.(చదవండి: ఆసీస్ క్రికెటర్పై షేన్ వార్న్ అసభ్యకర వ్యాఖ్యలు) సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఇన్నింగ్స్ 16వ ఓవర్లో నాథన్ లయన్ బౌలింగ్లో లాంగాన్ మీదుగా కొట్టిన సిక్స్ ద్వారా ఈ ఘనత సాధించాడు. రోహిత్ ఆసీస్పై కొట్టిన వంద సిక్సర్లలో 63 సిక్స్లు వన్డేల్లోనే రావడం విశేషం.తాజాగా మూడో టెస్టులో కొట్టిన సిక్స్తో అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మ సిక్సర్ల సంఖ్య 424కు చేరింది. ఇప్పటి వరకూ చూసుకుంటే టీమిండియాలో ఏ క్రికెటర్కూ ఆసీస్పై ఇన్ని సిక్సర్లు బాదిన ఘనత లేదు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన వారిలో రోహిత్ కంటే ముందు ఇద్దరు మాత్రమే ఉన్నారు. అందులో ఒకరు విండీస్ విధ్వంసక బ్యాట్స్మన్ క్రిస్ గేల్ (534 సిక్సర్లు) కాగా.. మరొకరు పాకిస్థాన్ బ్యాట్స్మన్ షాహిద్ అఫ్రిది (476 సిక్సర్లు). ఒక ప్రత్యర్థిపై వంద సిక్స్లు కొట్టిన రెండో ప్లేయర్ రోహిత్. ఇంతకుముందు ఇంగ్లండ్పై అన్ని ఫార్మాట్లలో కలిపి గేల్ 140 సిక్సర్లు కొట్టాడు. రోహిత్కు ఆస్ట్రేలియాపై మంచి రికార్డు ఉంది. వన్డేల్లో తన తొలి డబుల్ సెంచరీ చేసింది ఆస్ట్రేలియాపైనే. 2013లో బెంగళూరులో జరిగిన వన్డేలో 209 పరుగులు చేయగా.. అందులో ఏకంగా 16 సిక్సర్లు ఉండటం విశేషం. ఆసీస్ పేరు చెబితేనే పూనకం వచ్చిన వాడిలా చెలరేగిపోయే హిట్మ్యాన్ ఆస్ట్రేలియాపై ఇప్పటివరకు 8 సెంచరీలు బాదాడు.(చదవండి: నా ఫోకస్ మొత్తం అశ్విన్పైనే) International six No.424 for Rohit Sharma! Live #AUSvIND: https://t.co/xdDaedY10F pic.twitter.com/nypB41kYvB — cricket.com.au (@cricketcomau) January 8, 2021 -
ఆసీస్ క్రికెటర్పై షేన్ వార్న్ అసభ్యకర వ్యాఖ్యలు
సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ క్రికెటర్గా ఎంత పేరు సంపాదించాడో.. వివాదాల్లోనూ అంతే పేరు మూటగట్టుకున్నాడు. తాజాగా సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో రెండో రోజు మొదటి సెషన్లో వార్న్ మరో మాజీ ఆటగాడు ఆండ్రూ సైమండ్స్తో కలిసి కామెంటరీ చేశాడు. ఈ సందర్భంగా ఆసీస్ బ్యాట్స్మన్ మార్నస్ లబుషేన్పై వార్న్ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. లబుషేన్ క్రీజులో చూపిస్తున్న మేనరిజమ్స్పై సైమండ్స్ ఏదో చెప్పగా..వార్న్ దానికి అడ్డుపడుతూ..'జీసస్..చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంది..మొదట బ్యాట్ను సరిగా పట్టుకోమను' అంటూ దూషించాడు. లబుషేన్పై వార్న్ చేసిన వ్యాఖ్యలను సైమండ్స్ సమర్థిస్తూ ఒక బూతు పదాన్ని ఉపయోగించాడు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణను లెన్నీ పిలిఫ్స్ తన ట్విటర్లో షేర్ చేశాడు. వార్న్కు ఎవరైనా ఒక్కటే.. తనకు నచ్చకపోతే ప్రత్యర్థి ఆటగాళ్లను ఎంతలా ద్వేషిస్తాడో.. సహచర క్రికెటర్లను కూడా అదే తీరుతో చూస్తాడంటూ కామెంట్లు పెడుతున్నారు.(చదవండి: 'తొందరపడ్డావు.. కొంచెం ఆగుంటే బాగుండేది') Ahh Kayo, thank you for this pic.twitter.com/Jy6PfTpvYK — Lenny Phillips (@lenphil29) January 8, 2021 లెజెండరీ స్పిన్నర్గా పిలవబడే వార్న్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో చాలా ముందుంటాడు. తాను క్రికెట్ ఆడే సమయంలో స్టీవ్ వా, పాంటింగ్ కెప్టెన్సీలో ప్రత్యర్థి ఆటగాళ్లపై బాహంటగానే స్లెడ్జింగ్కు దిగేవాడు. ప్రొఫెషనల్గా మాత్రమే గాక వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నోసార్లు వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు. ఈ మధ్యనే టీమిండియా, ఆసీస్ల మధ్య తొలి టెస్టు సమయంలో చతేశ్వర్ పుజారాను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. పుజారా పేరు పలకడం తనకు ఇబ్బందిగా ఉంటుందని.. అందుకే అతన్ని స్టీవ్ అని పిలుస్తానని చెప్పాడు. దీనిపై సోషల్ మీడియాలో షేన్ వార్న్ను నెటిజన్లు ఒక రేంజ్లో ఆడుకున్నారు. దీంతో షేన్ వార్న్ దెబ్బకు దిగివచ్చి తాను చేసిన పనికి క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది.(చదవండి: రిషభ్ పంత్పై ట్రోలింగ్.. సైనీ తొలి వికెట్) -
జడ్డూ లేట్ చేసి ఉంటే కథ వేరే ఉండేది
సిడ్నీ: టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అంటేనే మెరుపు ఫీల్డింగ్కు చిరునామా. మైదానంలో పాదరసంలా కదిలే జడేజా సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో స్మిత్ను రనౌట్ చేసిన తీరు అద్భుతమని చెప్పొచ్చు. స్మిత్ను రనౌట్ చేయడం ద్వారా జడేజా తన ఫీల్డింగ్ విలువేంటో మరోసారి చూపించాడు. ఆసీస్ ఇన్నింగ్స్లో కడదాకా నిలిచి టెస్టుల్లో 27వ సెంచరీ నమోదు చేసిన స్మిత్ టీమిండియాకు కొరకరాని కొయ్యగా మారాడు.(చదవండి: సెంచరీలు సమం చేసి.. పరుగుల్లో దాటేశాడు!) అతని ఒక్క వికెట్ పడితే ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసినట్లే. ఈ దశలో 131 పరుగులు చేసిన స్మిత్ బుమ్రా బౌలింగ్లో బ్యాక్వర్డ్ స్వ్కేర్లో షాట్ ఆడాడు. రెండో పరుగు తీసి స్ట్రైకింగ్ తీసుకుందామని యత్నించే క్రమంలో స్మిత్ రనౌట్గా నిష్క్రమించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. అయితే స్మిత్ను జడేజా రనౌట్ చేసిన తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బ్యాక్వర్డ్ స్వేర్ లెగ్ నుంచి బంతిని అందుకున్న జడేజా బుల్లెట్ వేగంతో స్టైకింగ్ ఎండ్వైపు బంతిని విసరగా అది నేరుగా వికెట్లను గిరాటేసింది. ఒకవేళ జడేజా ఈ రనౌట్ చేయకుంటే స్మిత్ డబుల్ సెంచరీ కూడా చేసేవాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా స్మిత్ సెంచరీతో ఆసీస్ తొలిసారి టెస్టు సిరీస్లో 300 మార్కును అధిగమించింది. మరోవైపు సిడ్నీ టెస్టులో నాలుగు వికెట్లతో చెలరేగిన జడేజా విదేశీ గడ్డపై మూడో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. ఇంతకముందు దక్షిణాఫ్రికాపై జోహెన్నెస్ బర్గ్లో 138 పరుగులకే 6 వికెట్లతో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేయగా.. కొలంబొ వేదికగా 152 పరుగులకే 5 వికెట్లు తీసిన జడేజా విదేశీ గడ్డపై రెండో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు.శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. రెండో రోజు ఆటముగిసే సమయానికి పుజారా(9 బ్యాటింగ్), రహానే(5 బ్యాటింగ్)లు క్రీజ్లో ఉన్నారు. ఓపెనర్లు రోహిత్(26;77 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్) , శుబ్మన్ గిల్(50;101 బంతుల్లో 8 ఫోర్లు) ల వికెట్లను భారత్ చేజార్చుకుంది. Smith run out by sir jadeja...@ItsYashswiniR @secret_parii @Shersinghzn @RishabhPant17 @RickyPonting @sachin_rt @ShreyasIyer15 @yuzi_chahal @Sir_Jaddu pic.twitter.com/ElFIT6MV6j — Naveen (@Naveen99688812) January 8, 2021 -
ఈ మ్యాచ్లో నా ఫోకస్ మొత్తం అశ్విన్పైనే..
సిడ్నీ : ఆసీస్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్లో తన ఫోకస్ మొత్తం అశ్విన్పైనే ఉంటుందని స్మిత్ తెలిపాడు. మూడో టెస్టులో భాగంగా తొలిరోజు ఆట ముగిసిన అనంతరం వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా స్మిత్ మీడియాతో మాట్లాడాడు. మొదటి రెండు టెస్టుల్లో నా నుంచి ఆశించిన ప్రదర్శన రాలేదు. కానీ మూడో టెస్టు మ్యాచ్కు వచ్చేసరికి నా బ్యాటింగ్లో కొంత మార్పు కనిపించింది. మొదటిరోజు ఆటలో చివరి సెషన్ వరకు నిలిచి లబుషేన్తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పడం సంతృప్తినిచ్చింది. అయితే ఈ సిరీస్లో అశ్విన్పై ఒత్తిడి పెంచడంలో విఫలమయ్యాను.. కానీ ఈ మ్యాచ్లో మాత్రం అశ్విన్ను ఒత్తిడిలో పడేసే దానిపైనే ప్రత్యేక దృష్టి సారించాను. ఆరంభంలో బంతులను ఎదుర్కోవడంలో కాస్త తడబడ్డా పిచ్ పరిస్థితిపై ఒక అంచనాకు వచ్చాక బౌండరీలతో పరుగుల రాబట్టడంలో సక్సెస్ అయ్యాను. ఇదే టెంపోనూ రెండో రోజు ఆటలోనూ కొనసాగించాలని అనుకుంటున్నా. ఇప్పటికైతే రెండు సెషన్లు కలుపుకొని మేమే పైచేయి సాధించామని పేర్కొన్నాడు. (చదవండి: ఆయన కల నెరవేరింది.. కానీ ఈరోజు బతికిలేరు) కాగా వన్డే సిరీస్లో దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్న స్మిత్ మొదటి రెండు టెస్టుల్లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. రెండు టెస్టులు కలిపి 10 పరుగులు చేసిన స్మిత్ రెండుసార్లు అశ్విన్ బౌలింగ్లోనే ఔట్ కావడం విశేషం.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 55 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. లబుషేన్ 67 పరుగులతో, స్టీవ్ స్మిత్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా మొదటి సెషన్లో ఆసీస్ 7 పరుగులు చేసిన తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో ఒక సెషన్ మొత్తం తూడిచిపెట్టుకుపోయింది. (చదవండి: 'టీమిండియాను వదిలి రావడం బాధగా ఉంది') -
ఆయన కల నెరవేరింది.. కానీ ఈరోజు బతికిలేరు
సిడ్నీ : ఆసీస్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో బౌలర్ మహ్మద్ సిరాజ్ కంటతడి పెట్టిన సంగతి తెలిసిందే. 26 ఏళ్ల సిరాజ్ కంటతడి వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది. కాగా సిరాజ్ కంటతడి పెట్టడానికి గల కారణాన్ని మ్యాచ్ అనంతరం వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా పంచుకున్నాడు.(చదవండి: 'తొందరపడ్డావు.. కొంచెం ఆగుంటే బాగుండేది') 'జాతీయగీతం ఆలపించే సమయంలో మా నాన్న గుర్తుకు వచ్చాడు. ఆయన నన్ను ఒక క్రికెటర్గా చూడాలని ఎప్పుడూ అంటుంటేవాడు.. స్వతహగా మా నాన్నకు టెస్టు క్రికెట్ అంటే చాలా ఇష్టం. దీంతో దేశం తరపున ఒక్క టెస్టు మ్యాచ్లో నేను ప్రాతినిధ్యం వహిస్తే చూడాలని ఉండేదని నాతో చాలాసార్లు అనేవాడు. ఆరోజు రానే వచ్చింది.. ఆసీస్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.. కానీ నా ఆటను చూడడానికి మా నాన్న ఈరోజు బతికిలేడు. అందుకే అదంతా గుర్తుకువచ్చి కాస్త ఎమోషనల్ అవడంతో కన్నీళ్లు ఉబికి వచ్చాయంటూ' బాధగా చెప్పుకొచ్చాడు. (చదవండి : మహ్మద్ సిరాజ్ కంటతడి) కాగా మెల్బోర్న్ టెస్టు ద్వారా అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసిన సిరాజ్ తొలి మ్యాచ్లోనే రెండు ఇన్నింగ్స్లు కలిపి 5 వికెట్లు తీయడం ద్వారా ఆకట్టుకున్నాడు. అంతేగాక మెల్బోర్న్ టెస్టులో టీమిండియా విజయం సాధించడంతో సిరాజ్ తన తొలి టెస్టునే మధురానుభూతిగా మలుచుకోవడంలో సక్సెస్ అయ్యాడు. Mohammed Siraj provided a glimpse of what it means to represent your country in international cricket ✨#AUSvINDpic.twitter.com/HpL94QH5pr — ICC (@ICC) January 7, 2021 -
'తొందరపడ్డావు.. కొంచెం ఆగుంటే బాగుండేది'
సిడ్నీ: టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 3వ ఓవర్లోనే ఔట్అయిన సంగతి తెలిసిందే. 5 పరుగులు చేసిన వార్నర్ సిరాజ్ బౌలింగ్లో పుజారాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వార్నర్ అవుట్ కావడంపై ఆసీస్ మాజీ ఆటగాడు మార్క్వా అసంతృప్తి వ్యక్తం చేశాడు.వార్నర్ ఔట్ అయిన విధానం నాకు నచ్చలేదు. ఒక లూజ్ షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. మ్యాచ్ ఆరంభమైన 20 నిమిషాలకే ఆ షాట్ ఎందుకు ఆడాడో అర్థం కాలేదు. టెస్టు మ్యాచ్లో ఆరంభం నుంచి దూకుడు అవసరం లేదనే విషయం వార్నర్కు తెలుసు... అయినా తొందరపడ్డాడు. కాస్త ఓపికగా వ్యవహరించి ఉంటే బాగుండేది. ఆఫ్స్టంప్కు దూరంగా వెళ్తున్న బంతిని వదిలేయకుండా ఒక లూజ్ షాట్ ఆడి వికెట్ సమర్పించుకోవడం కరెక్ట్ కాదు అంటూ మార్క్వా చెప్పుకొచ్చాడు. (చదవండి: రిషభ్ పంత్పై ట్రోలింగ్.. సైనీ తొలి వికెట్!) మరో మాజీ ఆటగాడు మైకెల్ హస్సీ కూడా వార్నర్ షాట్పై పెదవి విరిచాడు. వార్నర్ బాడీ లాంగ్వేజ్లో చాలా తేడా కనిపించింది. అతను వంద శాతం ఫిట్గా లేకున్నా మ్యాచ్లోకి బరిలోకి దిగాడనిపిస్తుంది. షాట్ ఎంపికలో వార్నర్ పొరపాటు స్పష్టంగా తెలుస్తుందంటూ తెలిపాడు. కాగా టీమిండియాతో జరిగిన రెండో వన్డే అనంతరం గాయపడిన వార్నర్ చివరి వన్డేతో పాటు మూడు టీ20ల సిరీస్కు దూరమయ్యాడు. మొదట టెస్టు సిరీస్కు అందుబాటులో ఉంటాడని భావించినా గాయం తీవ్రత తగ్గకపోవడంతో తొలి రెండు టెస్టులకు దూరంగా ఉన్నాడు.(చదవండి: మహ్మద్ సిరాజ్ కంటతడి) అయితే మూడో టెస్టుకు ఎంపిక చేసే సమయానికి వార్నర్ 100శాతం ఫిట్గా లేకున్నా క్రికెట్ ఆస్రేలియా అతన్ని తుది జట్టులోకి తీసుకోవడంపై విమర్శలు వచ్చాయి. తాజాగా వార్నర్ మూడో టెస్టులో త్వరగా ఔట్ కావడంతో మరోసారి అతని ఫిట్నెస్పై సందేహాలు తలెత్తాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆస్ట్రేలియా 55 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. లబుషేన్ 67 పరుగులతో, స్టీవ్ స్మిత్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. -
మహ్మద్ సిరాజ్ కంటతడి
సిడ్నీ : టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ గురువారం కన్నీటి పర్యంతమయ్యాడు. గురువారం ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయగీతం ఆలపిస్తుండగా సిరాజ్ కంట తడిపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఇటీవలె సిరాజ్ తండ్రి అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. క్వారంటైన్ నిబంధనల కారణంగా భారత్కి తిరిగి వెళ్లే అవకాశం లేనందన టెస్టుల్లో ఆడేందుకే సుముఖత చూపించాడు. రెండో మ్యాచ్లో సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీకి గాయం కారణంగా సిరాజ్కు అవకాశం లభించిన సంగతి తెలిసిందే. (ఎంపీఎల్లో కోహ్లి పెట్టుబడులు) ఈ నేపథ్యంలో గురువారం టెస్టు ప్రారంభానికి ముందు జాతీయగీతం ఆలపించే సందర్భంలో తండ్రిని గుర్తుచేసుకొని సిరాజ్ భావోధ్వేగానికి లోనయ్యాడు. ఇక మూడో టెస్టులో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(5)ను తక్కువ స్కోరుకే మహ్మద్ సిరాజ్ పెవిలియన్కు పంపాడు. పుజారాకు క్యాచ్ ఇచ్చి వార్నర్ ఔటయ్యాడు. (న్యూజిలాండ్ నంబర్వన్) ✊ #AUSvIND pic.twitter.com/4NK95mVYLN — cricket.com.au (@cricketcomau) January 6, 2021 -
వార్నర్ ఔట్; మ్యాచ్కు వర్షం అంతరాయం
సిడ్నీ: భారత్తో జరుగుతున్న మూడో టెస్టులో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(5)ను తక్కువ స్కోరుకే మహ్మద్ సిరాజ్ పెవిలియన్కు పంపాడు. పుజారాకు క్యాచ్ ఇచ్చి వార్నర్ ఔటయ్యాడు. ఆస్ట్రేలియా 7 ఓవర్లలో 21/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. వర్షం కారణంగా ఆటకు మరోసారి అంతరాయం కలిగింది. అంతకుముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన్ ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే వర్షం కారణంగా మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. కాగా, మళ్లీ మ్యాచ్ ఆరంభమైన తర్వాత వర్షం పడటంతో మరొకసారి నిలిచిపోయింది. 7.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 21 పరుగుల వద్ద ఉండగా మళ్లీ వర్షం పడటంతో మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది. షైనీ ఆరంగ్రేటం హిట్మన్ రోహిత్ శర్మ జట్టులోకి వచ్చాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్కు జట్టులో స్థానం దక్కలేదు. గాయపడిన ఉమేశ్ యాదవ్ స్థానంలో నవదీప్ షైనీని జట్టులోకి తీసుకున్నారు. టెస్టుల్లో భారత్ తరపున 299వ ఆటగాడిగా షైనీ ఆరంగ్రేటం చేశాడు. సహచర ఆటగాళ్ల అభినందనల నడుమ సీనియర్ బౌలర్ బుమ్రా చేతుల మీదుగా టెస్ట్ జట్టు క్యాప్ను షైనీ అందుకుకున్నాడు. ఆస్ట్రేలియా తరపున విల్ పకోవ్స్కీ టెస్టుల్లో ఆరంగ్రేటం చేశాడు. Congratulations @navdeepsaini96. He realises his dream of playing Test cricket for #TeamIndia today. A proud holder of 🧢 299 and he receives it from @Jaspritbumrah93. #AUSvIND pic.twitter.com/zxa5LGJEen — BCCI (@BCCI) January 6, 2021 భారత్ (తుది జట్టు): రహానే (కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, పుజారా, విహారి, పంత్, జడేజా, అశ్విన్, సిరాజ్, బుమ్రా, సైనీ. ఆస్ట్రేలియా (అంచనా): పైన్ (కెప్టెన్), వార్నర్, పకోవ్స్కీ, స్మిత్, లబ్షేన్, వేడ్, గ్రీన్, కమిన్స్, స్టార్క్, హాజల్వుడ్, లయన్. చదవండి: ఐసీసీ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్లో తొలిసారి అగ్రస్థానంలోకి -
'టీమిండియాను వదిలి రావడం బాధగా ఉంది'
మెల్బోర్న్: ఆసీస్తో మూడో టెస్టు ఆడేందుకు సిద్ధమవుతున్న టీమిండియాకు యువ బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ బుధవారం ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ట్విటర్ వేదికగా టీమిండియాకు తన సందేశాన్ని అందించాడు. ' బ్యాడ్లక్.. గాయంతో స్వదేశానికి తిరుగుపయనం కావాల్సి వచ్చింది. ఈ సమయంలో టీమిండియాను వదిలి రావడం కాస్త బాధ కలిగించింది. అయినా సరే మిగిలిన రెండు టెస్టులు భారత్ బాగా ఆడాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా' అంటూ ట్వీట్ చేశాడు. కాగా కేఎల్ రాహుల్ శనివారం(జనవరి 2న) మైదానంలో ప్రాక్టీస్ చేస్తుండగా.. అతని ఎడమచేతి మణికట్టుకు గాయమైంది. దీంతో రాహుల్ స్వదేశానికి చేరుకున్నాడు. కాగా రాహుల్ పూర్తిగా కోలుకోవడానికి మూడు వారాల సమయం పడుతుందని, బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో అతడు చికిత్స పొందుతాడని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా వన్డే సిరీస్లో మెరుగ్గా రాణించిన కేఎల్ రాహుల్(మొత్తంగా 93 పరుగులు).. పొట్టి ఫార్మాట్లో(81 పరుగులు)నూ తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. ఇక తొలి రెండు టెస్టుల తుది జట్టులో అతడికి స్థానం దక్కకపోయినప్పటికీ నెట్స్లో తీవ్రంగా శ్రమించాడు.(చదవండి: 'ఛీ.. స్కూల్ లెవల్ కన్నా దారుణం') మూడో టెస్టుకు హనుమ విహారి స్థానంలో తుది జట్టులో ఉంటాడని అంతా భావించారు. కానీ అనూహ్యంగా రాహుల్ గాయపడ్డాడు. ఇప్పటికే షమీ, ఉమేశ్లు గాయాలతో సిరీస్కు దూరమవగా.. తాజాగా రాహుల్ కూడా దూరమయ్యాడు. అయితే రోహిత్ శర్మ చేరికతో టీమిండియా జట్టు బలోపేతంగా కనిపిస్తుంది. జనవరి 7 నుంచి జరగనున్న మూడో టెస్టు కోసం నేడు బీసీసీఐ తుది జట్టు ప్రకటించగా.. మయాంక్ స్థానంలో రోహిత్ను ఎంపిక చేయగా.. నవదీప్ సైనీ తుది జట్టులోకి వచ్చాడు. -
వాళ్లన్నట్టుగానే సైనీ కే ఓటు పడింది!
న్యూఢిల్లీ: ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన అనుభవం లేని నటరాజన్ను సిడ్నీ టెస్టులో ఆడించడం సరైన నిర్ణయం కాదని వెటరన్ ఆటగాళ్ల అభిప్రాయం కాబోలు నవదీప్ సైనీకే బీసీసీఐ జై కొట్టింది. గురువారం నుంచి ప్రారంభం కావాల్సిన మూడో టెస్టుకు నవదీప్ సైనీకి అవకాశం కల్పించింది. సిడ్నీ టెస్టుకు సంబంధించి తుది జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఇక గత మ్యాచ్లలో పెద్దగా ఆకట్టుకోని మయాంక్ అగర్వాల్ స్థానంలో రోహిత్ను తీసుకుంది. కాగా, గాయపడ్డ ఉమేష్ యాదవ్ స్థానంలో నటరాజన్ను తీసుకునేందుకు జట్టు యాజమాన్యం యోచించగా.. ఇండియన్ వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా వంటివారు పెదవి విరిచిన సంగతి తెలిసిందే. నటరాజన్ బదులు నవదీప్ సైనీని తుది జట్టులోకి తీసుకుని అరంగేట్రం చేయించాలని నెహ్రా మంగళవారం పీటీఐతో మాట్లాడుతూ అన్నాడు. లిస్ట్-ఏ మ్యాచ్లు ఆడడంతోపాటు, సిడ్నీ ఫ్లాట్ వికెట్పై సైనీ ఎక్స్ట్రా పేస్ బౌలింగ్ టీమిండియాకు పనికొస్తుందని పేర్కొన్నాడు. గాయపడిన మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్ స్థానాల్లో శార్దూల్ ఠాకూర్, నటరాజన్ వచ్చారని, సైనీని నేరుగా తీసుకున్నారని గుర్తు చేశాడు. అందుకనే మూడో పేసర్గా తొలి ప్రాధాన్యం సైనీకే ఇవ్వాలని సూచించాడు. అతని తర్వాత స్థానాల్లో శార్దూల్ ఠాకూర్, నటరాజన్ ఉంటారని నెహ్రా తెలిపాడు. ఇక మెల్బోర్న్ టెస్టులో అరంగేట్రం మ్యాచ్లోనే ఐదు వికెట్లతో ఆకట్టుకున్న మహ్మద్ సిరాజ్పై అతను ప్రశంసలు కురిపించాడు. తొలి మ్యాచ్లోనే ఎంతో అనుభవమున్న ఆటగాడిలా సిరాజ్ బౌలింగ్ చేశాడడని నెహ్రా కొనియాడాడు. కాగా, నెట్ బౌలర్గా కెరీర్ ప్రారంభించిన తమిళనాడు సేలంకు చెందిన టి.నటరాజన్ ఐపీఎల్ 2020లో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించి నిరూపించుకున్నాడు. యార్కర్ స్పెషలిస్టుగా పేరు తెచ్చుకుని ఆస్ట్రేలియా పర్యటనలో టీ20, వన్డేల్లో అరంగేట్రం చేశాడు. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఈనెల 7 నుంచి సిడ్నీ వేదికగా మూడో టెస్టు జరుగనుంది. ప్రస్తుతం ఇరు జట్లు 1-1 తో సమంగా ఉన్నాయి. ఇదిలాఉండగా.. తొలి టెస్టు తర్వాత రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి స్వదేశానికి తిరిగి రాగా.. మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్ గాయాల బారిన పడి జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. -
'ఐదు రోజులు ఒక్కపాటనే వినిపించారు'
సిడ్నీ : 2003-04 ఆసీస్ టూర్ తనకు చాలా ప్రత్యేకమని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చాలాసార్లు పేర్కొన్నాడు. సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో 241 పరుగుల సచిన్ నాకౌట్ ఇన్నింగ్స్ను ఎవరు మరిచిపోలేరు. మాస్టర్ ఇన్నింగ్స్తో మ్యాచ్ డ్రా అవడమే కాకుండా సిరీస్ కూడా 1-1తే సమం అయింది. తాజాగా సచిన్ మరోసారి 241 పరుగుల ఇన్నింగ్స్ను గుర్తు చేసుకుంటూ ఆ సందర్భంలో జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. '2004లో సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో 241 పరుగులు ఇన్నింగ్స్ను పక్కనపెడితే.. మ్యాచ్ జరిగిన ఐదు రోజులు ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బ్రియాన్ ఆడమ్స్ పాడిన సమ్మర్ ఆఫ్ 69 అనే పాటను ఐదు రోజుల పాటు ప్లే చేశారు. ఈ పాట మేము ఎంతలా వినాల్సి వచ్చిందంటే... గ్రౌండ్లో అడుగుపెడుతున్నప్పుడు, డ్రెస్సింగ్ రూమ్, ప్రాక్టీస్ సమయం, లంచ్, టీ బ్రేక్ ఇలా ఎక్కడికి వెళ్లినా అదే పాటను ప్లే చేశారు. ఆఖరికి మ్యాచ్ ముగిసిన తర్వాత హోటల్ రూంకు వెళ్లేటప్పుడు కూడా ఇదే పాటను మారుమోగించారు. ఆ పాట ప్రభావం ఎంత ఉండేదంటే.. ఆటోమెటిక్గా లిరిక్స్ నా నోటి నుంచి వచ్చేవి. ఇలాంటి సంఘటనే మళ్లీ 2003 ప్రపంచకప్లలో చోటుచేసుకుంది. నేను ఎక్కడికి వెళ్లినా లక్కీ అలీ "సర్ ఆల్బమ్" పాటను వినిపించేవారు.' అని చెప్పుకొచ్చాడు.(చదవండి : ఆ మూడు ఇన్నింగ్స్లు ఇప్పటికీ చూస్తుంటా) కాగా సిరీస్లో మొదటి మూడు టెస్టుల్లో సచిన్ ఘోరంగా విఫలమయ్యాడు. బ్రిస్బేన్, అడిలైడ్, మెల్బోర్న్ వేదికగా జరిగిన మొదటి మూడు టెస్టులు కలిపి 0,1,37,0,44 పరుగులు చేశాడు. ఇదే సిడ్నీ వేదికకు మరో విశేషం కూడా ఉంది. 2008లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో ఆండ్రూ సైమండ్స్- హర్భజన్ల మధ్య జరిగిన మంకీ గేట్ వివాదం క్రికెట్ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోయింది.(చదవండి : డ్రింక్స్ తాగడానికే ఐపీఎల్కు వచ్చేవాడు : సెహ్వాగ్) -
ఓవైపు నాన్నకు ఆపరేషన్.. మరోవైపు బ్యాటింగ్
రాజ్కోట్ : గత నెలలలో ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్ను సొంతం చేసుకుని టీమిండియా చరిత్ర సృష్టించింది. తన టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిచి 72 ఏళ్ల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకుంది. అద్వితీయ ఆటతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన క్లాసిక్ ఓపెనర్ చతేశ్వర్ పుజారా మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా ఎంపికయ్యాడు. ఇక చివరిదైన నాలుగో టెస్టులో పుజారా 193 పరుగులు చేసి తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశం కోల్పోయిన సంగతి తెలిసిందే. అటు అభిమానులు, ఇటు పుజారా ద్విశతకానికి ఏడు పరుగుల దూరంలో అవుటవ్వడంతో నిరాశచెందారు. మనందరికీ తెలియని ఇంకో విషయమేమిటంటే.. పుజారా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో (టెస్టు మొదటి రోజు) అతని తండ్రి అరవింద్ ఆస్పత్రిలో ఉన్నాడు. ఓవైపు తండ్రికి హార్ట్ సర్జరీ కొనసాగుతుండగానే.. పుజారా తన ఆటను కొనసాగించాడు. జట్టుకు భారీ స్కోరునందించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. (పుజారా డబుల్ సెంచరీ మిస్) ‘నాన్నకు ఆపరేషన్ జరగుతుండడంతో కొంత ఆందోళన చెందాను. కానీ, ఆయనకేం పరవాలేదు. ఆపరేషన్ సక్సెస్ అవుంతుందని డాక్టర్లు భరోసా ఇచ్చారు. దాంతో కొంత ధైర్యం వచ్చింది. అప్పటికే గత మ్యాచ్లలో పరుగులు సాధించడం. సిడ్నీ మైదానంలో ప్రాక్టిస్ చేసి ఉండడం కలిసొచ్చింది. దాంతో ఆటపై దృష్టిపెట్టాను. దేవుడి దయవల్ల నాన్న కోలుకున్నారు’అని పుజారా తన సిడ్నీ టెస్టు అనుభవాలను పంచుకున్నారు. ‘ఆపరేషన్కు ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు నాన్న మా ఆట చూశారు. నా ఆటచూసి హ్యాపీగా ఫీలయ్యారు. అక్కడి డాక్టర్లు కంగ్రాట్స్ కూడా చెప్పారు. అయితే, 7 పరుగులతో డబుల్ సెంచరీ మిస్ కావడంపై.. నాన్న స్పందిస్తూ.. మరేం పరవాలేదు. డబుల్ సెంచరీ అనేది ఒక నెంబర్ మాత్రమే. జట్టుకు మంచి స్కోరు అందించావ్. బాధపడొద్దు’ అని తనకు మరింత ధైర్యం ఇచ్చారని పుజారా చెప్పుకొచ్చారు. మొత్తంగా ఈ బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో పుజారా ఏకంగా 30 గంటలకు పైగా బ్యాంటింగ్ చేసి 1258 బంతులు ఎదుర్కొన్నాడు. ఏడు ఇన్నింగ్స్లలో 521 పరుగులు చేశాడు. ఫ్రాంచైజీల ట్రెండ్తో.. నోట్ల వర్షమే పరమావధిగా సాగుతున్న టీ20ల కాలంలో.. నిజంగా పుజారా ఆట వెరీ క్లాసిక్ కదా..!! -
ప్రీతి జింటా మేడమ్.. ఇలా అయితే ఎలా?
ముంబై: ఆస్ట్రేలియాలో తొలిసారి టెస్టు సిరీస్ను సాధించిన భారత క్రికెట్ జట్టును అభినందించే క్రమంలో బాలీవుడ్ నటి, ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా ‘తప్పు’లో కాలేశారు. టెస్టు సిరీస్ విజయం అని అనకుండా టెస్టు మ్యాచ్ విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. ‘ఆస్ట్రేలియాపై ‘టెస్ట్ మ్యాచ్’ నెగ్గిన తొలి ఆసియా జట్టుగా రికార్డులకెక్కిన బాయ్స్ ఇన్ బ్లూకు అభినందనలు. టీమిండియా విజయంలో చతేశ్వర్ పుజారా కీలక పాత్ర పోషించాడు’ అని ట్వీట్ చేసింది. దీనిపై నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు ప్రీతి జింటా. అలాగే, ‘బాయ్స్ ఇన్ బ్లూ’ అని వాడడంపైనా మండిపడ్డారు. టీమిండియా ఆటగాళ్లు పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రమే బ్లూ జెర్సీ ధరిస్తారని అది కూడా తెలియదా? అని ఎద్దేవా చేశారు. సగం తెలివి చాలా ప్రమాదకరం అని దుమ్మెత్తిపోశారు. నెటిజన్ల కామెంట్లతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రీతి తన ట్వీట్ను డిలీట్ చేసింది. -
చరిత్ర సృష్టించిన కోహ్లీ సేన
-
ఇంతగా ఎప్పుడూ గర్వపడలేదు
ఆటగాడిగా, కెప్టెన్గా ఎన్నో విజయాలు సాధించిన కోహ్లి ఆస్ట్రేలియాపై గెలుపు తర్వాత కొత్తగా కనిపించాడు. సిరీస్ విజయం ఇచ్చిన అమితానందంతో అతను ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. సిడ్నీ టెస్టు తర్వాత భావోద్వేగభరితమైన అతను పలు అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘నా కెరీర్లో ఇదే అతి పెద్ద ఘనత. అన్నింటికంటే అగ్రస్థానం ఇదే విజయానికి ఇస్తాను. 2011లో ప్రపంచకప్ గెలిచిన జట్టులో నేను జూనియర్ సభ్యుడిని. అంతకుముందు వరల్డ్కప్ గెలవలేకపోయిన బాధ ఏమీ లేదు కాబట్టి విజయం తర్వాత కూడా కొందరు సీనియర్లలా నేను భావోద్వేగానికి గురి కాలేదు. అది మంచి విజయమే అయినా ఇక్కడ నేను చాలా భావోద్వేగానికి లోనవుతున్నాను. వరుసగా మూడోసారి పర్యటించాను కాబట్టి ఇక్కడ గెలుపు ఎంత ప్రత్యేకమో చెప్పగలను. ఈ సిరీస్ విజయం భారత జట్టును కొత్తగా చూపిస్తుంది. జట్టులో సభ్యుడిగా నేనెప్పుడూ ఇంతగా గర్వపడలేదు. ఇలాంటి టీమ్ను నడిపించడం గౌరవంగా భావిస్తున్నా. నాలుగేళ్ల క్రితం ఇక్కడే తొలిసారి కెప్టెనయ్యాను. ఇప్పుడు ఇక్కడే సిరీస్ గెలవడం మధురానుభూతి. గత 12 నెలలుగా మేం పడిన కష్టానికి ఇది ప్రతిఫలం.’ ‘సాంప్రదాయ శైలిలో టెస్టు క్రికెట్ మూలాలకు కట్టుబడి బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. అద్భుతంగా ఆడిన పుజారాను ప్రత్యేకంగా ప్రశంసించాలి. మయాంక్ చాంపియన్లా ఆడాడు. బ్యాట్స్మెన్ అంతా తమ వంతు పాత్ర పోషించారు. నా దృష్టిలో మెల్బోర్న్లో ఓపెనర్గా హనుమ విహారి దాదాపు 70 బంతులు ఆడటం కూడా సెంచరీతో సమానం. మన బౌలర్లు ఇంతగా ఆటను శాసించిన తీరును గతంలో ఎప్పుడూ చూడలేదు. వారి సన్నద్ధత, ఫిట్నెస్, ఆలోచనా ధోరణి అన్నీ గొప్పగా ఉన్నాయి. వారు పిచ్ను చూసి మాకు అనుకూలిస్తుందా అని ఎప్పుడూ ఆలోచించలేదు. జట్టు కోసం ఏదైనా చేసేందుకు వారు సిద్ధమయ్యారు. ఇది ఇంకా ఆరంభం మాత్రమే.’ ‘దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్లలో కూడా మమ్మల్ని మేం నమ్మాం. అక్కడి పరాజయాలు మేం తప్పులు దిద్దుకునేలా చేశాయి. మనం సరైన దిశలో పని చేస్తే దేవుడు కూడా సహకరిస్తాడు. ఒక టెస్టులో గెలిస్తే చాలదని, సిరీస్ నెగ్గాలని మేం భావించాం కాబట్టి ఈ గెలుపు ఎంతో ప్రత్యేకం. మేం ఏదైనా చేయగలమని ఈ జట్టు నిరూపించింది. ఈ విజయం తర్వాతి తరం టెస్టులపై ఆసక్తి కనబర్చేందుకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశిస్తున్నా. వేడుకలు జరుపుకునే అర్హత మాకుంది. ఇవి సుదీర్ఘంగా సాగుతాయని మాత్రం చెప్పగలను. అభిమానులు కూడా అండగా నిలిచారు. విదేశీ గడ్డపై ఆడుతున్నట్లుగా అనిపించనే లేదు.’ ►1 కెరీర్లో తొలిసారి పుజారా ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెల్చుకున్నాడు. ►3 దక్షిణాఫ్రికాలోనూ భారత్ గెలిస్తే... తొమ్మిది వేర్వేరు దేశాలపై వారి గడ్డపైనే టెస్టు సిరీస్లు గెలిచిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సరసన చేరుతుంది. ► 4 కోహ్లి సారథ్యంలో భారత జట్టు విదేశాల్లో నాలుగో సిరీస్ నెగ్గింది. తాజా విజయంతో సౌరవ్ గంగూలీ (4 సిరీస్లు) పేరిట ఉన్న రికార్డును కోహ్లి సమం చేశాడు. ► 5 ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ విజయాలు సాధించిన జట్ల సంఖ్య. ఇంగ్లండ్ (13 సార్లు), వెస్టిండీస్ (4 సార్లు), దక్షిణాఫ్రికా (3 సార్లు), న్యూజిలాండ్, భారత్ (ఒక్కోసారి) ఈ ఘనత సాధించాయి. -
‘మా బౌలర్లను మోకరిల్లేలా చేశాడు’
సిడ్నీ: టీమిండియా ఆటగాడు చతేశ్వర్ పుజారా అద్భుతమైన ఆట తీరుతో తమ బౌలర్లను మోకరిల్లేలా చేశాడని ఆసీస్ దిగ్గజ ఆటగాడు ఇయాన్ చాపెల్ పేర్కొన్నాడు. కోహ్లి కింగ్డమ్లో అసాధారణ బ్యాటింగ్తో పుజారా ఆకట్టుకున్నాడంటూ చాపెల్ ప్రశంసించాడు. నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్ను టీమిండియా 2-1తో సొంతం చేసుకుని ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా చాపెల్ మాట్లాడుతూ.. ‘భారత క్రికెట్లో ఇప్పుడు విరాట్ కోహ్లి రాజు కావొచ్చు. కానీ.. ఆ రాజ్యంలో పుజారా కూడా ఎన్నో గౌరవాలకి అర్హుడని నిరూపించాడు. ఈ సిరీస్లో టీమిండియాకు ఎంతో మంచి జరిగింది. సిరీస్ చేజిక్కించుకోడమే కాదు.. పుజారాలోని పట్టుదల, క్రమశిక్షణ, ఓపిక విలువ తెలిసింది’ అని కొనియాడాడు. ‘పుజారా అద్భుత బ్యాటింగ్ నుంచి మా జట్టు చాలా నేర్చుకుని ఉంటుంది. సుదీర్ఘ సమయం క్రీజులో నిలిచిన పుజారా.. భీకరమైన ఆస్ట్రేలియా బౌలర్లని సైతం అసహనంతో మోకాళ్లపై కూలబడేలా చేశాడు. ఆస్ట్రేలియాలో మూడు సెంచరీలు చేసిన అతడు సునీల్ గావస్కర్ రికార్డును సమం చేశాడు. ఆసీస్ గడ్డపై ఏడు ఇన్నింగ్స్ల్లో మూడు సెంచరీలు సాధించి 521 పరుగులు చేయడం అంటే సాధారణ విషయం కాదు. పటిష్టమైన మా బౌలింగ్ లైనప్ను కకావికలం చేసి మరీ శతకాలపై శతకాలు సాధించాడు’ అని చాపెల్ ప్రశంసలు కురిపించాడు. -
విరాట్ కోహ్లి మరో ఘనత
సిడ్నీ: ఆస్ట్రేలియాతో వారి దేశంలో జరిగిన టెస్టు సిరీస్ను కైవసం చేసుకోవడంతో భారత్ తరపున ఆ ఘనత సాధించిన తొలి కెప్టెన్గా రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లి.. మరో రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచిన తొలి ఆసియా కెప్టెన్గా కూడా కోహ్లి రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియాలో సిరీస్ సాధించిన విదేశీ జట్ల జాబితాలో ఇప్పటివరకూ ఏ ఒక్క ఆసియా జట్టు కూడా లేదు. అంతకుముందు ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలు మాత్రమే ఆసీస్ను వారి గడ్డపై ఓడించి సిరీస్ సాధించిన జట్లు. ఇందులో ఇంగ్లండ్ 13 సార్లు సిరీస్ సాధించగా, విండీస్ నాలుగు సందర్భాల్లో సిరీస్లు సాధించింది. ఇక దక్షిణాఫ్రికా మూడు సార్లు, న్యూజిలాండ్లు ఒకసారి ఆసీస్ను వారి దేశంలో సిరీస్ సాధించిన జట్లు. మరొకవైపు కెప్టెన్గా కోహ్లికి విదేశాల్లో నాల్గో సిరీస్ విజయం. 2015లో శ్రీలంకలో 2-1తో సిరీస్ గెలిచిన విరాట్ సేన.. 2016లొ వెస్టిండీస్లో 2-0తో సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. 2017లో మరొకసారి శ్రీలంకపై సిరీస్ను కైవసం చేసుకుంది కోహ్లి అండ్ గ్యాంగ్. ఆ సిరీస్ను భారత్ 3-0తో సాధించింది. ఆపై ఆసీస్ను వారి గడ్డపైనే ఓడించి సిరీస్ను సాధించడంతో కోహ్లి నేతృత్వంలోని టీమిండియా కొత్త అధ్యాయాన్ని లిఖించింది. అడిలైడ్లో జరిగిన తొలి టెస్ట్లో 31 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించగా, పెర్త్లో జరిగిన రెండో టెస్టులో 146 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఆపై మెల్ బోర్న్ టెస్ట్లో 137 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి ఆధిక్యంలో నిలిచింది. చివరి టెస్టు డ్రా ముగియడంతో సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో చతేశ్వర్ పుజారా 521 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, బౌలింగ్ విభాగంలో బుమ్రా (21 వికెట్లు) అగ్రస్థానంలో నిలిచాడు. ఇక మహ్మద్ షమీ 16 వికెట్లు, ఇషాంత్ శర్మ 11 వికెట్లు తీశారు. -
అనుష్కతో కలిసి కోహ్లి విక్టరీ వాక్
సిడ్నీ: ఆస్ట్రేలియాలో తొలిసారి చారిత్రక టెస్టు సిరీస్ను టీమిండియా సాధించిన తరుణంలో జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి.. భార్య అనుష్క శర్మతో కలిసి గ్రౌండ్లో సందడి చేశాడు. చివరి టెస్టు డ్రాగా ముగిసిన నేపథ్యంలో సిరీస్ భారత్ వశమైంది. ఈ సిరీస్ విజయాన్ని అనుష్కతో కలిసి పంచుకున్నాడు కోహ్లి. సిడ్నీ గ్రౌండ్లో భార్య అనుష్కతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టు డ్రాగా ముగియడంతో గావస్కర్ - బోర్డర్ ట్రోఫీని భారత్ 2-1తో సొంతం చేసుకుంది. ఫలితంగా 72 ఏళ్ల చిరకాల స్వప్నాన్ని, గతంలో దిగ్గజాలకు కూడా సాధ్యం కాని ఘనతను కోహ్లి సేన సాకారం చేసింది. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ వర్షం పదే పదే కురువడంతో పూర్తి ఆట సాధ్యం కాలేదు. భారత్ తొలి ఇన్నింగ్స్లో 622/7 డిక్లేర్ చేయగా, ఆసీస్ తన మొదటి ఇన్నింగ్స్లో 300 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలోనే ఆసీస్ ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. కాగా, ఆదివారం నాల్గో రోజు ఆటలో ఆసీస్ వికెట్ కోల్పోకుండా ఆరు పరుగుల వద్ద ఉన్న సమయంలో వర్షం పడింది. చివరి రోజు ఆటకు సైతం వరుణుడు అడ్డుపడటంతో ఒక్క బంతి కూడా పడలేదు. దాంతో మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. భారీ శతకం సాధించిన పుజారా(193) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. View this post on Instagram Winning couple💏💏💏. @virat.kohli @anushkasharma #viratkohli #anushkasharma #virushka #virataddicted A post shared by Virat Addicted 👑🔥♥️ (@virataddicted.01) on Jan 6, 2019 at 8:40pm PST -
పుజారా డ్యాన్స్ చూశారా..!
సిడ్నీ: ఆసీస్ గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ విజయాన్ని సాధించి కొత్త చరిత్రను సృష్టించిన సంగతి తెలిసిందే. నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా ఆఖరి టెస్టు డ్రాగా ముగియడంతో భారత్ 2-1తో గావస్కర్-బోర్డర్ ట్రోఫీని అందుకుంది. చివరి టెస్టు మ్యాచ్కు పలుమార్లు వర్షం అంతరాయ కల్గించడంతో భారత్కు మరో విజయం దూరమైంది. అయినప్పటికీ సిరీస్ను సాధించడంతో విరాట్ సేన మంచి జోష్తో సంబరాలు చేసుకుంది. గ్రౌండ్లో డ్యాన్స్ చేస్తూ విజయాన్ని ఆస్వాదించింది టీమిండియా క్రికెట్ జట్టు. అయితే ఈ సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న చతేశ్వర్ పుజారా మాత్రం డ్యాన్స్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు. అంతా డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తుంటే పుజారా మాత్రం తన కాలును కదిలించకుండా కేవలం చప్పట్లతో సరిపెట్టబోయాడు. అయితే వెనుక నుంచి మిగతా సభ్యులు పుజారాను ముందుకు తోయడంతో రిషభ్ పంత్తో కలిసి డ్యాన్స్ చేయకతప్పలేదు. అలా పుజారా ఇబ్బంది పడుతూనే మిగతా సభ్యులతో భాగస్వామయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. పుజారా బ్యాటింగ్ చేయగలడు కానీ.. డ్యాన్స్ చేయలేడు అంటూ క్యాప్షన్లో చమత్కరించింది. Cheteshwar Pujara: can bat, can't dance? 🤣🤣 Celebrations have well and truly begun for Team India! #AUSvIND pic.twitter.com/XUWwWPSNun — cricket.com.au (@cricketcomau) 7 January 2019 చరిత్ర సృష్టించిన కోహ్లి సేన ఇంత గొప్పగా ఎప్పుడూ ఫీల్ కాలేదు: కోహ్లి -
ఇంత గొప్పగా ఎప్పుడూ ఫీల్ కాలేదు: కోహ్లి
సిడ్నీ: ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ను గెలవడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి హర్షం వ్యక్తం చేశాడు. ఇదొక మధురమైన జ్ఞాపకంగా పేర్కొన్న కోహ్లి.. తాము అన్ని విభాగాల్లోనూ సమష్టిగా రాణించడంతోనే ఆసీస్ను వారి దేశంలో ఓడించామన్నాడు. నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా చివరి టెస్టు డ్రాగా ముగియడంతో కోహ్లి సేన సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. దీనిలో భాగంగా మాట్లాడిన కోహ్లి.. ‘ప్రస్తుత జట్టును చూసి చాలా గర్వంగా ఉంది. ఈ సిరీస్ను సాధించడం నిజంగా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నా. గత 12 నెలల నుంచి మా జట్టు అద్భుతమైన విజయాలు సాధిస్తూ చక్కటి పునాది వేసుకుంది. ఏడాది కాలంగా జట్టులో వచ్చిన సమతుల్యతోనే ఆసీస్ను వారి గడ్డపై ఓడించాం. అంతకుముందు జరిగిన రెండు విదేశీ పర్యటనల్లో కూడా మా జట్టు సత్తా చాటింది. భారత క్రికెట్ జట్టు ఈ స్థాయి ప్రదర్శనను నేను ఎప్పుడూ చూడలేదు. నలుగురు పేసర్లతో విదేశీ పర్యటనకు వెళ్లడం కూడా నా అనుభవంలో ఎదురుకాలేదు. ఇది జట్టు సభ్యులందరూ సాధించిన అద్భుతమైన ఘనత. ప్రధానంగా ఫిట్నెస్ స్థాయిని కాపాడుకోవడం వల్లే ఆసీస్లో విజయాలు సాధించాం. దీనికి జట్టు సభ్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. హ్యాట్సాఫ్ టు టీమ్ మెంబర్స్. మన తలంపు ఎప్పుడైతే సరైన రీతిలో ఉంటుందో అప్పుడు అద్భుతమైన ఫలితాలు సాధిస్తాం. భారత క్రికెట్ను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడమే మా ముందున్న లక్ష్యం’ అని కోహ్లి అన్నాడు. అదే సమయంలో భారత్ వరల్డ్కప్ సాధించిన క్షణాల్ని కూడా కోహ్లి ఒకసారి నెమరవేసుకున్నాడు. 2011 వరల్డ్కప్ సాధించిన భారత జట్టులో తాను జట్టు సభ్యుడినని పేర్కొన్న కోహ్లి.. అదొక చిరస్మరణీయమైన జ్ఞాపకంగా పేర్కొన్నాడు. కాకపోతే ఆ సమయంలో తానొక యువ క్రికెటర్ను మాత్రమేనని, ఆ వరల్డ్కప్ గెలిచిన ఆనంద క్షణాల్ని జట్టు సభ్యులు ఆస్వాదించడాన్ని స్వయంగా చూశానన్నాడు. కానీ వారు ఎలా ఫీలయ్యారో తనకు అప్పుడు తెలియదన్న కోహ్లి.. ఇప్పుడు కెప్టెన్గా చారిత్రక సిరీస్ను గెలిచిన సందర్భాన్ని విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నానన్నాడు. ఇంత గొప్పగా తాను ఎప్పుడూ ఫీల్ కాలేదని కోహ్లి తెలిపాడు. తాము ఏదైతే వ్యూహంతో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లామో దాన్ని కచ్చితంగా అమలు చేసి సక్సెస్ అయ్యామన్నాడు. ప్రధానంగా తమ బ్యాటింగ్ విభాగానికి బౌలర్ల జోష్ కూడా తోడవడంతో విజయం సునాయాసమైందన్నాడు. ప్రతీ ఒక బౌలర్ తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదని కోహ్లి ప్రశంసలు కురిపించాడు. చరిత్ర సృష్టించిన కోహ్లి సేన -
తొలిసారి ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిచిన టీమిండియా
-
చరిత్ర సృష్టించిన కోహ్లి సేన
సిడ్నీ : భారత క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర అధ్యాయాన్ని లిఖించింది. తన టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిచిన టీమిండియా కొత్త చరిత్ర సృష్టించింది. విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు ఈ ఘనతను సాధించింది. నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టు డ్రాగా ముగియడంతో గావస్కర్ - బోర్డర్ సిరీస్ను భారత్ 2-1తో సిరీస్ను సొంతం చేసుకుంది. ఫలితంగా 72 ఏళ్ల చిరకాల స్వప్నాన్ని, గతంలో దిగ్గజాలకు కూడా సాధ్యం కాని ఘనతను కోహ్లి సేన సాకారం చేసింది. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ వర్షం పదే పదే కురువడంతో పూర్తి ఆట సాధ్యం కాలేదు. భారత్ తొలి ఇన్నింగ్స్లో 622/7 డిక్లేర్ చేయగా, ఆసీస్ తన మొదటి ఇన్నింగ్స్లో 300 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలోనే ఆసీస్ ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. కాగా, ఆదివారం నాల్గో రోజు ఆటలో ఆసీస్ వికెట్ కోల్పోకుండా ఆరు పరుగుల వద్ద ఉన్న సమయంలో వర్షం పడింది. చివరి రోజు ఆటకు సైతం వరుణుడు అడ్డుపడటంతో ఒక్క బంతి కూడా పడలేదు. దాంతో మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. భారీ శతకం సాధించిన పుజారా(193) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. అడిలైడ్లో జరిగిన తొలి టెస్ట్లో 31 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించగా, పెర్త్లో జరిగిన రెండో టెస్టులో ఆసీస్ 146 పరుగుల తేడాతో గెలుపును అందుకుంది. ఆపై మెల్ బోర్న్ టెస్ట్లో 137 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్లో చతేశ్వర్ పుజారా 521 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, బౌలింగ్ విభాగంలో బుమ్రా (21 వికెట్లు) అగ్రస్థానంలో నిలిచాడు. ఇక మహ్మద్ షమీ 16 వికెట్లు, ఇషాంత్ శర్మ 11 వికెట్లు తీశారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సిడ్నీ టెస్ట్ : ముగిసిన నాలుగో రోజు ఆట
సిడ్నీ: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఆఖరి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. వెలుతురు లేమి, వర్షం కారణంగా తొలుత తాత్కాలికంగా మ్యాచ్ నిలిపేసిన అంపైర్లు.. పరిస్థితి మెరుగుపడకపోవడంతో నాలుగోరోజు ఆటను ముగిస్తున్నట్లు ప్రకటించారు. తొలి ఇన్నింగ్స్లో 322 పరుగులు వెనకబడిన ఆతిథ్య జట్టు ఫాలో ఆన్ ఆడుతోంది. ప్రస్తుతం క్రీజులో ఉస్మాన్ ఖవాజా(4), మార్కస్ హారిస్(2)లు ఉన్నారు. ఆట ముగిసే సమయానికి నాలుగు ఓవర్లకు వికెట్ కోల్పోకుండా ఆసీస్ 6 పరుగులు చేసింది. ఇక భారీ ఆధిక్యం సాధించిన భారత్కు విజయం ఖాయం అనుకుంటున్న సందర్భంలో వరుణుడు అడ్డంకిగా మారాడు. వర్షం కారణంగానే నాలుగో రోజు ఆట ఆలస్యంగా ప్రారంభం కాగా.. చివరకు వెలుతురు లేమితో మ్యాచ్ను ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాలుగో రోజు కేవలం 25.2 ఓవర్లే ఆటనే జరిగింది. ఇక చివరిదైన ఐదో రోజు వాతావరణం సహకరిస్తేనే భారత్ గెలుపు లాంఛనం కానుంది. -
30 ఏళ్ల తర్వాత ఆసీస్..!
సిడ్నీ : భారత్తో జరుగుతున్న ఆఖరి టెస్ట్లో ఆస్ట్రేలియా ఓటమి దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో 300 పరుగులకే కుప్పకూలి ఫాలోఆన్ను తప్పించుకోలేకపోయింది. ఇలా సొంతగడ్డపై ఆసీస్ ఫాలోఆన్ ఆడటం 30 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. 1988లో సొంత గడ్డపై చివరిసారి ఇదే సిడ్నీ మైదానంలో ఇంగ్లండ్తో ఫాలో ఆన్ ఆడిన ఆసీస్.. మ్యాచ్ను డ్రా చేసుకుంది. ఇక విదేశాల్లో 2005లో చివరగా ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో ఫాలో ఆన్ ఆడిన ఆసీస్ పరాజయం పాలైంది. తాజా టెస్ట్లో వరణుడు పదే పదే అడ్డుపడటంతో మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపే అవకాశం కనబడుతోంది. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 300 పరుగులుకే ఆలౌట్ కావడంతో పర్యాటక జట్టుకు 322 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆతిథ్య జట్టు.. వర్షం అంతరాయంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. ఇంకా ఒకరోజు ఆట మిగిలి ఉంది. వరుణుడు కరుణిస్తే భారత్ విజయం దాదాపు ఖాయమే. ఇప్పటికే 2-1తో సిరీస్లో ఆధిక్యం సాధించిన కోహ్లిసేన.. ఈ మ్యాచ్ డ్రా అయినా సిరీస్ సొంతం చేసుకోనుంది. తద్వారా ఆసీస్ గడ్డపై టెస్ట్ సిరీస్ నెగ్గిన భారత జట్టుగా రికార్డు సృష్టించనుంది. -
సిడ్నీ: ఫాలోఆన్లో ఆస్ట్రేలియా
-
సిడ్నీ టెస్ట్ : ఆసీస్ 300 ఆలౌట్
సిడ్నీ : భారత్తో జరుగుతున్న ఆఖరి టెస్ట్లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 300 పరుగుల వద్ద ముగిసింది. దీంతో భారత్కు 322 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. వర్షం అంతరాయంతో నాలుగో రోజు ఆట ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ ఆసీస్ ఇన్నింగ్స్ ఎంతో సేపు కొనసాగలేదు. 236/6 ఓవర్నైట్ స్కోర్తో బరిలోకి దిగిన ఆసీస్ ఆదిలోనే కమిన్స్ (25) వికెట్ కోల్పోయింది. ఆపై హ్యాండ్స్ కోంబ్ (37)ను బుమ్రా బౌల్డ్ చేయగా.. నాథన్ లయన్(0)ను కుల్దీప్ పెవిలియన్ చేర్చాడు. ఇక కుల్దీప్ బౌలింగ్లో హజల్వుడ్ ఇచ్చిన సునాయస క్యాచ్ను హనుమ విహారి జారవిడచడంతో భారత బౌలర్లు చివరి వికెట్ కోసం మరికొద్ది సేపు నిరీక్షించాల్సి వచ్చింది. విహారి క్యాచ్ చేజార్చడంతో చివరి వికెట్ కోసం భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కుల్దీప్ మరోసారి తన స్పిన్ మాయాజాలంతో హజల్వుడ్ (21)ను పెవిలియన్ చేర్చడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ పోరాటం ముగిసింది. దీంతో ఆతిథ్య జట్టు ఫాలో ఆన్ తప్పించుకోలేకపోయింది. స్టార్క్, హజల్ వుడ్లు చివరి వికెట్కు 42 పరుగల భాగస్వామ్యం నెలకొల్పడం గమనార్హం. స్టార్క్ (29) నాటౌట్గా నిలిచాడు. కుల్దీప్ ఐదు వికెట్లతో చెలరేగగా.. జడేజా, మహ్మద్ షమీలు రెండు వికెట్లు పడగొట్టారు. బుమ్రాకు ఒక వికెట్ దక్కింది. భారత్ తొలి ఇన్నింగ్స్ 622/7 డిక్లేర్డ్ ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 300 ఆలౌట్ -
సిడ్నీ టెస్ట్: నాలుగో రోజు ఆట ప్రారంభం
సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి టెస్టు నాలుగో రోజు ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. 236/6 ఓవర్ నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ ఆదిలోనే వికెట్ కోల్పోయింది. మహ్మద్ షమీ బౌలింగ్లో ప్యాట్ కమిన్స్ (25) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అంతకు ముందు ఆటకు వరుణుడు అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్ను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో ఆట చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. ప్రస్తుతం క్రీజులో హ్యాండ్స్కోంబ్(28), స్కార్క్ (0)లు ఉన్నారు. ఇక తొలి ఇన్నింగ్స్ను 622/7 స్కోర్ వద్ద డిక్లెర్డ్ చేసిన భారత్.. గెలుపు దిశగా పయనిస్తోంది. అయితే మ్యాచ్కు పదేపదే వర్షం అంతరాయం కలిగిస్తుండటం.. భారత విజయవకాశాలపై ప్రభావం చూపనుంది. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా గా ముగిసినప్పటికి భారత్ 2-1తో సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించనుంది. భారత్ తొలి ఇన్నింగ్స్ 622/7 డిక్లెర్డ్ -
‘ఎంఎస్ ధోనిని దాటేస్తాడు’
సిడ్నీ: టీమిండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్పై ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. రిషభ్ పంత్లో అపారమైన నైపుణ్యం దాగుందనడానికి ఆసీస్తో నాల్గో టెస్టులో అతను సాధించిన భారీ సెంచరీనే చక్కటి ఉదాహరణ అని కొనియాడాడు. రిషభ్ పంత్ కేవలం తొమ్మిది టెస్టుల్లోనే రెండు సెంచరీలు సాధించడంతో పాటు కొన్ని సందర్భాల్లో తొంభైల దగ్గర ఔటైన విషయాన్ని పాంటింగ్ ప్రస్తావించాడు. ‘భారత్ క్రికెట్లో ఎంఎస్ ధోని ప్రభావం గురించే మాత్రమే ఇప్పటివరకూ మాట్లాడుకున్నాం. ఇక నుంచి రిషభ్ పంత్ గురించి మాట్లాడుకుంటా. ధోని ఎక్కువ కాలం టెస్టు క్రికెట్ ఆడినా ఈ ఫార్మాట్లో కేవలం ఆరు సెంచరీలు మాత్రమే సాధించాడు. అదే సమయంలో ఎన్నో ఘనతలు ధోని సొంతం. కానీ ఈ యువ వికెట్ కీపర్ కచ్చితంగా ధోనిని దాటేస్తాడు. పరిస్థితులకు తగ్గట్టు ఆడే నైపుణ్యం రిషభ్కు ఉంది. అతనిలో అసాధారణ ప్రతిభ దాగి ఉంది. బంతిని స్టైక్ చేసే విధానం చూడ ముచ్చటగా ఉంది. అతను బ్యాటింగ్ చేసేటప్పుడు ఆడమ్ గిల్క్రిస్ట్ను గుర్తుకు తెస్తున్నాడు. ప్రస్తుతం 21 ఒడిలో ఉన్న రిషభ్ సుదీర్ఘ కాలం భారత్ జట్టుకు సేవలందించడం ఖాయం’ అని పాంటింగ్ పేర్కొన్నాడు. -
శభాష్ కేఎల్ రాహుల్: అంపైర్ ప్రశంస
సిడ్నీ: గత కొంతకాలంగా పేలవ ఫామ్తో విమర్శలు పాలవుతూ వస్తున్న టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్.. ఇప్పడు అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. నిన్న మొన్నటి వరకూ తన ఆటతో విపరీతమైన విమర్శలు పాలైన రాహుల్ తాజాగా ప్రశంసించబడటానికి అతనే నిజాయితీనే కారణం. రాహుల్ పట్టిన ఒక క్యాచ్ విషయంలో అతను క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడంతో ఒక్కసారిగా ‘సీన్’ మారిపోయింది. నాలుగో టెస్టు మూడో రోజు 15వ ఓవర్ను రవీంద్ర జడేజా వేశాడు. మొదటి బంతికే ఆసీస్ ఓపెనర్ హారిస్ మిడాన్ దిశగా షాట్ కొట్టాడు. అది నేరుగా ఫీల్డర్ కేఎల్ రాహుల్ వైపు వెళ్లింది. వెంటనే రాహుల్ అద్భుతమైన రీతిలో డైవ్ కొట్టి క్యాచ్ పట్టాడు. అందరూ అది ఔట్ అని అనుకున్నారు. కానీ, క్యాచ్కు ముందు బంతి నేలను తాకిన విషయాన్ని గ్రహించిన రాహుల్ అది క్యాచ్ కాదంటూ చేతులను ఊపుతూ సిగ్నల్ ఇచ్చి నిజాయతీని చాటుకున్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న బుమ్రా.. రాహుల్ వద్దకు వచ్చి తలపై తడుతూ మెచ్చుకున్నాడు. ఫీల్డ్ అంపైర్ ఇయాన్ గౌల్డ్ కూడా రాహుల్ నిజాయతీకి మెచ్చి.. ‘శభాష్ రాహుల్.. ఇది క్రీడా స్ఫూర్తి. కీప్ ఇట్ అప్’ అంటూ వికెట్ల వద్ద నుంచే రాహుల్ను కొనియాడాడు. రాహుల్ క్రీడాస్ఫూర్తికి పలువురు క్రికెట్ అభిమానులు కూడా ఫిదా అయ్యారు. రాహుల్ తన నిజాయతీని చాటుకున్నాడంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ‘రాహుల్ క్రీడా స్ఫూర్తి మిగతా ఆటగాళ్లకు అనుసరణీయం’ అని ఒక అభిమాని ప్రశంసించగా, ‘చీటింగ్కు పాల్పడే ఆటగాళ్లు రాహుల్ నుంచి ఎంతో నేర్చుకోవాలి’ అని మరొకరు పేర్కొన్నారు. ‘అంపైర్ సమయాన్ని వృథా చేయకుండా వెంటనే రాహుల్ స్పందించడం నిజంగా గ్రేట్’ అని మరొక అభిమాని కొనియాడాడు. ఇలా రాహుల్ విమర్శల బాట నుండి ప్రశంసలు అందుకోవడం టీమిండియా శిబిరంలో జోష్ నింపింది. -
శభాష్ కేఎల్ రాహుల్: అంపైర్ ప్రశంస
-
ముగిసిన మూడో రోజు ఆట.. రేపు ఎక్స్ట్రా టైమ్
సిడ్నీ: టీమిండియా-ఆసీస్ల మధ్య జరుగుతున్న చివరి టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. వర్షం కారణంగా మ్యాచ్ను సుమారు గంటన్నర ముందుగానే నిలిపేశారు. దీంతో ఆట ముగిసే సమయానికి ఆసీస్ 236/6 పరుగులు చేసింది. మూడో రోజు మ్యాచ్లో టీమిండియా బౌలర్లు విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్ ఆసీస్ విలవిల్లాడింది. దీంతో మూడో రోజు ఆటలో టీమిండియా పైచేయి సాధించింది. హ్యాండ్స్కాంబ్(28 బ్యాటింగ్), ప్యాట్ కమిన్స్( 25 బ్యాటింగ్)లు క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ కోల్పోయిన ఆరు వికెట్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు సాధించగా, జడేజా రెండు వికెట్లు తీశాడు. మహ్మద్ షమీకి వికెట్ దక్కింది. తొలుత మ్యాచ్ను వెలుతురు లేమి కారణంగా నిలిపివేయగా, ఆపై వర్షం పడింది. దాంతో మూడో రోజు ఆట పూర్తిగా జరగలేదు. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్ను 622/7 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇంకా రెండు రోజులు ఆట మిగిలి ఉండటంతో మ్యాచ్పై భారత్ పట్టు సాధించింది. ప్రస్తుతం ఆసీస్ 386 పరుగులు వెనుకబడి ఉంది. కాగా, ఆసీస్ ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే ఇంకా 187 పరుగులు చేయాలి. ఆదివారం నాల్గో రోజు ఆట ముందుగానే ప్రారంభం కానుంది. భారత్ కాలమాన ప్రకారం ఉదయం గం.04.30 ని.లకు మ్యాచ్ను ఆరంభించనున్నారు. మూడో రోజు ఆటను ముందుగానే మ్యాచ్ నిలిపివేయాల్సి రావడంతో నాల్గో రోజు ఆటకు ఎక్స్ట్రా టైమ్ను కేటాయించారు. -
కోహ్లికి అవమానంపై క్రికెట్ ఆస్ట్రేలియా ఆగ్రహం
సిడ్నీ: అడిలైడ్లో జరిగిన తొలి టెస్టు సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని ఆసీస్ ప్రేక్షకులు తమ వెకిలి చేష్టలతో అవమానించారు. తాజాగా సిడ్నీ వేదికగా జరుగుతున్న నాల్గో టెస్టులోనూ కోహ్లీకి అటువంటి అనుభవమే ఎదురైంది. కోహ్లి బ్యాటింగ్కు దిగుతున్నప్పుడు ఆసీస్ అభిమానులు అతడిని వెక్కిరిస్తూ విపరీత వ్యాఖ్యలు చేసి అనుచితంగా ప్రవర్తించారు. ఈ రెండు ఘటనలపై క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక ఆతిథ్య జట్టుకు కనీస గౌరవం ఇవ్వాలనే విషయాన్ని మరచిపోతే ఎలా అంటూ సదరు అభిమానులపై మండిపడింది. ఇది ఆస్ట్రేలియా క్రికెట్కు ఒక మచ్చగా మిగిలిపోతుందని అభిప్రాయపడింది. దయచేసి ఇక నుంచి అటువంటి అనుచిత ప్రవర్తనను కట్టిపెట్టి మర్యాదగా ప్రవర్తించాలని ఆసీస్ అభిమానులకు విజ్ఞప్తి చేసింది. ‘ దేశానికి వచ్చిన అతిథులను ఇలా అవమానించడం సరికాదు. అతిథులను గౌరవించడం నేర్చుకోవాలి. మనందరికంటే ఆట గొప్పది. అతిథులను మనం గౌరవించాలి. మన దేశానికి వచ్చినప్పుడు వారికి అందమైన అనుభవం ఇవ్వాలి. అయితే, మైదానంలో మాత్రం కలబడాలి’ అని ఆస్ట్రేలియా సీఈవో కెవిన్ రాబర్ట్స్ పేర్కొన్నాడు. ఇలాంటి చర్యలను పునరావృతం చేయవద్దని అభిమానులకు హితవు పలికాడు. -
భారత్-ఆసీస్ మ్యాచ్కు అంతరాయం!
సిడ్నీ: భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న చివరిదైన నాల్గో టెస్టు మ్యాచ్ బ్యాడ్లైట్ కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయింది. శనివారం మూడో రోజు ఆటలో బ్యాడ్లైట్తో మ్యాచ్కు అంతరాయం కల్గింది. ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ను కొనసాగించే సమయంలో వెలుతురు మందగించడంతో మ్యాచ్ను నిలిపేయాల్సి వచ్చింది. మ్యాచ్ నిలిచే సమయానికి ఆసీస్ ఆరు వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. హ్యాండ్స్కాంబ్(28 బ్యాటింగ్), ప్యాట్ కమిన్స్( 25 బ్యాటింగ్)లు క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు 24/0 ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్.. భారత బౌలర్లకు దెబ్బకు విలవిల్లాడింది. 198 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓవర్నైట్ ఆటగాడు ఉస్మాన్ ఖవాజా(27) తొలి వికెట్గా పెవిలియన్ చేరారు. తొలి సెషన్లో భారత్కు పరీక్షగా నిలిచిన ఖావాజాను కుల్దీప్ యాదవ్ బోల్తా కొట్టించడంతో ఆసీస్ తొలి వికెట్ను కోల్పోయింది. ఆ తరుణంలో మార్కస్ హారిస్కు జత కలిసిన లబుస్కాంజ్ ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టాడు. వీరిద్దరూ 56 పరుగులు జోడించిన తర్వాత హారిస్(79) పెవిలియన్ చేరాడు. రవీంద్ర జడేజా బౌలింగ్లో హారిస్ బౌల్డ్ కావడంతో 128 పరుగుల వద్ద ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. ఆపై స్పల్ప వ్యవధిలో షాన్ మార్ష్(8), లబూస్కాంజ్(38)లు ఔట్ కావడంతో ఆసీస్ 152 పరుగులకే నాలుగు వికెట్లను చేజార్చుకుంది. షాన్ మార్ష్ను జడేజా ఔట్ చేయగా, లబూస్కాంజ్ను షమీ పెవిలియన్ చేర్చాడు. మరో 40 పరుగుల వ్యవధిలో ట్రావిస్ హెడ్(20) సైతం పెవిలియన్ బాట పట్టడంతో 192 పరుగుల వద్ద ఆసీస్ ఐదో వికెట్ను నష్టపోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో రిటర్న్ క్యాచ్ ఇచ్చిన ట్రావిస్ హెడ్ ఐదో్ వికెట్గా ఔటయ్యాడు. టీ విరామం తర్వాత టిమ్ పైన్(5)ను కుల్దీప్ ఔట్ చేయడంతో ఆసీస్ మరింత కష్టాల్లోకి వెళ్లింది. ఆసీస్ కోల్పోయిన ఆరు వికెట్లలో్ కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు సాధించగా, జడేజా రెండు వికెట్లు తీశాడు. మహ్మద్ షమీకి వికెట్ లభించింది. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్ను 622/7 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
భారత బౌలర్ల విజృంభణ: కష్టాల్లో ఆసీస్
సిడ్నీ; భారత్తో జరుగుతున్న చివరిదైన నాల్గో టెస్టులో ఆసీస్ కష్టాల్లో పడింది. భారత బౌలర్లు విజృంభించడంతో ఆసీస్ 198 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయి ఎదురీదుతోంది. 24/0 ఓవర్నైట్ స్కోరుతో శనివారం ఆటను కొనసాగించిన ఆసీస్ 72 పరుగుల వద్ద ఉస్మాన్ ఖవాజా(27) వికెట్ను నష్టపోయింది. తొలి సెషన్లో భారత్కు పరీక్షగా నిలిచిన ఖావాజాను కుల్దీప్ యాదవ్ బోల్తా కొట్టించడంతో ఆసీస్ తొలి వికెట్ను కోల్పోయింది. ఆ తరుణంలో మార్కస్ హారిస్కు జత కలిసిన లబుస్కాంజ్ ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టాడు. వీరిద్దరూ 56 పరుగులు జోడించిన తర్వాత హారిస్(79) పెవిలియన్ చేరాడు. రవీంద్ర జడేజా బౌలింగ్లో హారిస్ బౌల్డ్ కావడంతో 128 పరుగుల వద్ద ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. ఆపై స్పల్ప వ్యవధిలో షాన్ మార్ష్(8), లబూస్కాంజ్(38)లు ఔట్ కావడంతో ఆసీస్ 152 పరుగులకే నాలుగు వికెట్లను చేజార్చుకుంది. షాన్ మార్ష్ను జడేజా ఔట్ చేయగా, లబూస్కాంజ్ను షమీ పెవిలియన్ చేర్చాడు. మరో 40 పరుగుల వ్యవధిలో ట్రావిస్ హెడ్(20) సైతం పెవిలియన్ బాట పట్టడంతో 192 పరుగుల వద్ద ఆసీస్ ఐదో వికెట్ను నష్టపోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో రిటర్న్ క్యాచ్ ఇచ్చిన ట్రావిస్ హెడ్ ఐదో్ వికెట్గా ఔటయ్యాడు. టీ విరామం తర్వాత టిమ్ పైన్(5)ను కుల్దీప్ ఔట్ చేయడంతో ఆసీస్ మరింత కష్టాల్లోకి వెళ్లింది. ఆసీస్ కోల్పోయిన ఆరు వికెట్లలో్ కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు సాధించగా, జడేజా రెండు వికెట్లు తీశాడు. మహ్మద్ షమీకి వికెట్ లభించింది. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్ను 622/7 వద్ద డిక్లేర్ చేసింది. ఆసీస్ ఫాలో ఆన్ ప్రమాదంలో పడకుండా ఉండాలంటే తొలి ఇన్నింగ్స్లో 423 పరుగులు చేయాలి. ఆసీస్ రెండొందల పరుగుల లోపే సగానికి పైగా వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టుకు ఫాలో ఆన్ తప్పేలా లేదు. -
పంత్పై పాట.. దద్దరిల్లిన సిడ్నీ మైదానం!
-
పంత్పై పాట.. దద్దరిల్లిన సిడ్నీ మైదానం!
సిడ్నీ : ఆస్ట్రేలియా పర్యటనలో తనదైన స్లెడ్జింగ్తో హాట్టాపిక్గా నిలిచిన టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్.. చివరి టెస్ట్లో తన విశ్వరూపాన్ని చూపించాడు. ఇప్పటి వరకు ఆతిథ్య జట్టు ఆటగాళ్లకు మాటకు మాట బదులిస్తూ వార్తల్లో నిలిచిన పంత్.. సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్లో సెంచరీ బాది.. ఆసీస్ గడ్డపై ఈ ఘనతను అందుకున్న తొలి భారత వికెట్ కీపర్గా రికార్డు సృష్టించాడు. 189 బంతుల్లో 159 పరుగులు చేసిన పంత్.. నోటితోనే కాదు బ్యాట్తోనూ బదులివ్వగలనని చాటి చెప్పాడు. అయితే ఈ సిరీస్ ఆసాంతం తన ప్రవర్తనతో అభిమానులను ఆకట్టుకున్న పంత్.. తాజా ప్రదర్శనతో వారి మనసులను దోచుకున్నాడు. దీంతో చివరి టెస్ట్ చూడటానికి మైదానానికి వచ్చిన భారత అభిమానులు అతనిపై ఓ అద్భుత పాటను రూపొందించి పాడారు. ప్రస్తుతం ఈ పాట నెట్టింట హల్చల్ చేస్తోంది. పంత్-పైన్ స్లెడ్జింగ్ ప్రతిబింబించేలా ఉన్న ఈ పాట లిరిక్స్.. "We've got Pant. Rishab Pant. I just don't think you'll understand. He'll hit you for a six. He'll babysit your kids. We've got Rishab Pant," నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయ్. చతేశ్వర్ పుజారా(193), రిషభ్ పంత్ (159) సెంచరీలకు తోడుగా జడేజా (81), మయాంక్ అగర్వాల్ (77) అర్థసెంచరీలు చేయడంతో భారత్ 622 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ ఇచ్చింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. -
భారత్ భారీ స్కోరు; ఇన్నింగ్స్ డిక్లేర్డ్
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్లో టీమిండియా 622/7 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. 303/4 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు శుక్రవారం ఆట ప్రారంభించిన భారత్ మరో 3 వికెట్లు కోల్పోయి 319 పరుగులు జోడించింది. రిషబ్ పంత్ సెంచరీ, రవీంద్ర జడేజా అర్ధ సెంచరీలు సాధించారు. తొలి రోజు సెంచరీ చేసిన వన్డౌన్ బ్యాట్స్మన్ చతేశ్వర్ పుజారా(193) ఏడు పరుగుల తేడాతో డబుల్ సెంచరీ కోల్పోయాడు. మిడిలార్డర్ బ్యాట్స్మన్ హనుమ విహారి(42) ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్కు అమూల్యమైన 101 పరుగులు జోడించి భారీ స్కోరుకు బాటలు వేశారు. యువ బ్యాట్స్మన్ రిషబ్ పంత్తో కలిసి ఆరో వికెట్కు 89 పరుగుల జత చేసిన పుజారా ఆరో వికెట్గా అవుటయ్యాడు. చివర్లో పంత్, జడేజా జోడి చెలరేగడటంతో టీమిండియా స్కోరు 600 పరుగులు దాటింది. వీరిద్దరూ ఏడో వికెట్కు 204 పరుగులు జోడించారు. సెంచరీ దిశగా సాగుతున్న జడేజాను లయన్ అవుట్ చేయడంతో టీమిండియా కెప్టెన్ కోహ్లి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. జడేజా 114 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్తో 81 పరుగులు చేశాడు. 189 బంతుల్లో 15 ఫోర్లు, సిక్సర్తో 159 పరుగులు చేసి పంత్ అజేయంగా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో లయన్ 4, హాజిల్వుడ్ 2 వికెట్లు పడగొట్టారు. స్టార్క్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. -
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్
సిడ్నీ: టీమిండియా యువ బ్యాట్స్మన్ రిషబ్ పంత్.. సిడ్నీ టెస్టులో సత్తా చాటాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో శతకం బాదాడు. ఫోర్తో శతకం పూర్తి చేశాడు. 137 బంతుల్లో 8 ఫోర్లతో సెంచరీ సాధించాడు. టెస్టుల్లో అతడికి రెండో సెంచరీ. పంత్ చేసిన రెండు శతకాలు కూడా ఆయా సిరీస్ల్లో చివరి టెస్టులే కావడం విశేషం. 2018, సెప్టెంబర్లో ఇంగ్లండ్తో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్లో పంత్ తొలి సెంచరీ(114) చేశాడు. కంగారూ గడ్డమీద శతకం బాదిన తొలి భారత వికెట్ కీపర్గా పంత్ చరిత్ర సృష్టించాడు. తాజా శతకంతో ఆసియా బయట రెండు సెంచరీలు సాధించిన భారత వికెట్ కీపర్ కూడా అతడు ఖ్యాతి దక్కించుకున్నాడు. -
పుజారా డబుల్ సెంచరీ మిస్
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాట్స్మన్ చతేశ్వర్ పుజారా తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశం కోల్పోయాడు. ద్విశతకానికి ఏడు పరుగుల దూరంలో అతడు అవుటయ్యాడు. 373 బంతుల్లో 22 ఫోర్లతో 193 పరుగులు చేసి లయన్ బౌలింగ్లో ఆరో వికెట్గా పెవిలియన్ చేరాడు. డబుల్ సెంచరీ చేజారడంతో నిరాశగా మైదానాన్ని వీడాడు. టీమిండియా 491/6 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. రిషబ్ పంత్ అర్ధ సెంచరీ చేశాడు. అతడికి తోడుగా రవీంద్ర జడేజా(25) క్రీజ్లో ఉన్నాడు. (మొదటి రోజు...మనదే జోరు) టెస్టుల్లో పుజారా ఇప్పటివరకు మూడు డబుల్ సెంచరీలు చేశాడు. ఇందులో రెండు ఆస్ట్రేలియాపైనే సాధించడం విశేషం. టెస్టుల్లో అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరు 206 నాటౌట్. 2012, నవంబర్లో అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో అతడీ స్కోరు సాధించాడు. 2013, మే నెలలో హైదరాబాద్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 204 పరుగులు చేశాడు. 2017, మార్చిలో ఆసీస్తోనే జరిగిన మ్యాచ్లోనూ డబుల్ సెంచరీ(202) కొట్టాడు. -
కోహ్లి.. ఇదేం పని?
సిడ్నీ: క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓవర్ ముగిసిన వెంటనే బంతిని అంపైర్కు ఇవ్వడమనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇక ఆటలో ఎటువంటి బ్రేక్ వచ్చినా బంతిని తన వద్దనే పెట్టుకుంటారు ఫీల్డ్ అంపైర్లు. ఇలా చేయడం వల్ల ట్యాంపరింగ్ను సాధ్యమైనంత వరకూ నివారించవచ్చనేది ఐసీసీ ఉద్దేశం, రూల్ కూడా. ఒకవేళ బంతి ఆకారంలో ఏమైనా తేడా కనిపిస్తే దాన్ని అంపైర్ దృష్టికి తీసుకెళ్లడం వరకూ మాత్రమే ఆటగాళ్లు చేసే పని. అప్పుడు ఆ బంతిని చెక్ చేసి ఏం చేయాలనేది ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. అలా కాకుండా ఆట విరామంలో బంతితో ఆడుకోవడమనేది రూల్స్ ప్రకారం తప్పే. అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి విరామ సమయంలో బంతితో ఆడుకోవడమనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆసీస్తో నాల్గో టెస్టులో భాగంగా తొలి రోజు ఆటలో టీ బ్రేక్లో అంపైర్ వద్ద నుంచి బంతిని తీసుకున్న కోహ్లి దాన్ని బంతితో టచ్ కొట్టాడు. ఆటను తిరిగి ఆరంభించే క్రమంలో ఆసీస్ ఆటగాళ్ల కోసం నిరీక్షించే సమయంలో బంతిని అంపైర్ నుంచి తీసుకున్న కోహ్లి.. బంతిని బ్యాట్కు మిడిల్ చేస్తూ పరీక్షించబోయాడు. బంతిని చూస్తానని చెప్పి కోహ్లి ఇలా చేయడంతో అంపైర్ రిచర్డ్ కెటెల్బోరో ఆశ్చర్యానికి గురయ్యాడు. అలా చేయవద్దంటూ కోహ్లి నుంచి బంతిని బలవంతంగా తీసేసుకున్నాడు. ఇక్కడ కోహ్లి చేసింది బ్యాట్ స్ట్రోక్ను చెక్ చేయడానికే అయినా, బంతి ఆకారం, మెరుపు దెబ్బతినే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఒక అంతర్జాతీయ మ్యాచ్లో కోహ్లి ఇలా చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. -
భారీ స్కోరు దిశగా టీమిండియా
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాల్గో టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 303 పరుగులు నమోదు చేసింది. చతేశ్వర్ పుజారా(130 బ్యాటింగ్; 250 బంతుల్లో 16 ఫోర్లు), హనుమ విహారి(39 బ్యాటింగ్; 58 బంతుల్లో 5 ఫోర్లు) క్రీజ్లో ఉన్నారు. గురువారం ఆరంభమైన చివరిదైన నాల్గో టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దాంతో ఇన్నింగ్స్ను మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్లు ప్రారంభించారు. అయితే ఆదిలోనే టీమిండియాకు షాక్ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ మూడో బంతికి రాహుల్(9) తొలి వికెట్గా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో చతేశ్వర్ పుజారాతో కలిసి ఇన్నింగ్స్ను నడిపించాడు మయాంక్. వీరిద్దరూ 116 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత మయాంక్ రెండో వికెట్గా పెవిలియన్ చేరాడు. అనంతరం పుజారాతో కలిసి విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టాడు. ఈ క్రమంలోనే పుజారా హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే టీబ్రేక్ తర్వాత విరాట్ కోహ్లి(23) ఔట్ కావడంతో భారత్ 180 పరుగుల వద్ద మూడో వికెట్ను కోల్పోయింది. ఆపై పుజారాతో కలిసి 48 పరుగుల్ని జత చేసిన రహానే(18; 55 బంతుల్లో 1 ఫోర్) నాల్గో వికెట్గా ఔటయ్యాడు. అటు తర్వాత హనుమ విహారితో కలిసి ఇన్నింగ్స్ను పుజారా చక్కదిద్దాడు. ఆ క్రమంలోనే పుజారా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది పుజారాకు టెస్టుల్లో 18వ సెంచరీ కాగా, ఈ సిరీస్లో మూడోది. ఆసీస్ బౌలర్లలో హాజిల్వుడ్ రెండు వికెట్లు సాధించగా, స్టార్క్, లయన్లకు తలో వికెట్ దక్కింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) పుజారా మళ్లీ కొట్టేశాడు.. కోహ్లి సరసన పుజారా..! మయాంక్ మరో రికార్డు -
పుజారా మళ్లీ కొట్టేశాడు..
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్లో టీమిండియా ఆటగాడు చతేశ్వర్ పుజారా శతకాలపై శతకాలు బాదేస్తున్నాడు. ఆసీస్తో చివరిదైన నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్లో పుజారా సెంచరీ సాధించాడు. ఇది పుజారా టెస్టు కెరీర్లో 18 వ సెంచరీ కాగా, ఈ సిరీస్లో మూడో శతకం సాధించాడు. తొలి టెస్టులో శతకం సాధించిన పుజారా.. మూడో టెస్టులో సెంచరీ నమోదు చేశాడు. ఈ రెండు టెస్టుల్లో తొలి ఇన్నింగ్స్లోనే సెంచరీలు సాధించిన పుజారా.. నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. 199 బంతుల్లో 13 ఫోర్లతో సెంచరీ సాధించాడు. 134 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన పుజారా.. మరో 65 బంతుల్లో్ వంద పరుగుల మార్కును చేరాడు. హాఫ్ సెంచరీని ఫోర్తోనే సాధించిన పుజారా.. ఫోర్తోనే సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. ఇదిలా ఉంచితే, ఆస్ట్రేలియాలో ఒక టెస్టు సిరీస్లో అత్యధిక సెంచరీలు భారత ఆటగాళ్ల జాబితాలో పుజారా.. సునీల్ గావస్కర్ సరసన నిలిచాడు. ఆస్ట్రేలియాలో ఒక సిరీస్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో కోహ్లి(4) తొలి స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్లో పుజారా సెంచరీ సాధించడంతో భారత్ జట్టు భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో్ 78 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ 262 పరుగులు చేసింది. అంతకుముందు మయాంక్ అగర్వాల్(77) రాణించిన సంగతి తెలిసిందే. రాహుల్(9) తొలి వికెట్గా ఔట్ కాగా, మయాంక్ రెండో వికెట్గా పెవిలియన్ చేరాడు. మూడో వికెట్గా కోహ్లి(28), నాల్గో వికెట్గా రహానే(18) ఔటయ్యారు. కోహ్లి సరసన పుజారా..! మయాంక్ మరో రికార్డు -
కోహ్లి సరసన పుజారా..!
సిడ్నీ: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో తనదైన మార్కు ఆట తీరుతో ఆకట్టుకుంటూ భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న చతేశ్వర్ పుజారా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆసీస్తో నాల్గో టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్స్లో పుజారా ఒక మైలురాయిని చేరుకున్నాడు. ఆస్ట్రేలియాలో ఒక టెస్టు సిరీస్లో వెయ్యికి పైగా బంతుల్ని ఆడిన భారత ఆటగాళ్ల జాబితాలో పుజారా చేరిపోయాడు. తొలి ఇన్నింగ్స్లో 134 బంతులాడిన పుజారా అర్థ శతకాన్ని సాధించాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాలో ఒక ద్వైపాక్షిక సిరీస్లో వెయ్యి బంతుల్ని ఆడిన ఘనత నమోదు చేశాడు. అంతకముందు 2014-15 సీజన్లో భాగంగా ఆసీస్లో పర్యటించినప్పడు కోహ్లి వెయ్యి బంతుల్ని ఆడాడు. ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో వెయ్యికి పైగా బంతుల్ని ఆడిన పుజారా.. ఆసీస్ బౌలర్లకు చెమటలు పట్టిస్తున్నాడు. అంతకముందు ఆస్ట్రేలియాలో ఒక టెస్టు సిరీస్లో వెయ్యికి పైగా బంతులు ఆడిన భారత క్రికెటర్లలో రాహుల్ ద్రవిడ్( 2003-04 సీజన్లో 1203 బంతులు), విజయ్ హజారే(1947-48 సీజన్లో 1192 బంతులు), కోహ్లి(2014-15 సీజన్లో 1093 బంతులు)సునీల్ గావస్కర్(1977-78 సీజన్లో 1032 బంతులు) వరుస స్థానాల్లో ఉన్నారు. మయాంక్ మరో రికార్డు -
మయాంక్ మరో రికార్డు
సిడ్నీ: ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా మూడో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన టీమిండియా ఆటగాడు మయాంక్ అగర్వాల్ మరో ఘనత సాధించాడు. గత మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి (76,42) 118 పరుగులు చేసి విదేశీ గడ్డపై అరంగేట్రం మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత్ ఆటగాడిగా నిలిచిన మాయాంక్.. నాల్గో టెస్టులోనూ ఆకట్టుకున్నాడు. ఆసీస్తో చివరిదైన నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్లో మాయంక్ అగర్వాల్(77; 112 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) చక్కటి ఆరంభాన్ని అందించాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ విఫలమైనప్పటికీ మయాంక్ మాత్రం సొగసైన షాట్లతో హాఫ్ సెంచరీ సాధించాడు. ఫలితంగా తొలి మూడు ఇన్నింగ్స్ల్లో రెండు అర్థ శతకాలు సాధించిన మూడో భారత ఓపెనర్గా నిలిచాడు. అంతకుముందు ఈ జాబితాలో సునీల్ గావస్కర్, పృథ్వీషాలు ఉండగా, ఇప్పుడు వారి సరసన మయాంక్ నిలిచాడు. మరొకవైపు ఆస్ట్రేలియాలో కనీసం రెండు హాఫ్ సెంచరీలు ఎనిమిదో టీమిండియా ఓపెనర్గా గుర్తింపు పొందాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగింది. భారత్ ఇన్నింగ్స్ను కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాలు ఆరంభించారు. కాగా, రాహుల్(9) మరోసారి తనకు వచ్చిన అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. హాజల్వుడ్ బౌలింగ్లో షాన్ మార్ష్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తరుణంలో చతేశ్వర్ పుజారాతో కలిసి ఇన్నింగ్స్ను నడిపించాడు మయాంక్. వీరిద్దరూ 116 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత మయాంక్ రెండో వికెట్గా పెవిలియన్ చేరాడు. అనంతరం పుజారాతో కలిసి విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టాడు. ఈ క్రమంలోనే పుజారా హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే టీ బ్రేక్ తర్వాత విరాట్ కోహ్లి(23) ఔట్ కావడంతో భారత్ 180 పరుగుల వద్ద మూడో వికెట్ను కోల్పోయింది. గెలిస్తే గొప్ప ఘనతవుతుంది! -
రాహుల్ ఫెయిల్.. మయాంక్ దూకుడు
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 10 పరుగుల వద్ద తొలి వికెట్ నష్టపోయింది. ఓపెనర్ లోకేశ్ రాహుల్ (9) వైఫల్యాన్ని కొనసాగించాడు. హాజిల్వుడ్ బౌలింగ్లో మార్ష్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా జాగ్రత్తగా ఆడుతూ స్కోరును వంద పరుగులు దాటించారు. ఈ క్రమంలో మయాంక్ అర్ధసెంచరీ సాధించాడు. 96 బంతుల్లో 6 ఫోర్లతో అర్ధ శతకం పూర్తిచేశాడు. అతడికి సీనియర్ బ్యాట్స్మన్ పుజారా చక్కటి సహకారం అందించాడు. అర్ధ సెంచరీ చేసిన తర్వాత మయాంక్ దూకుడు పెంచాడు. లయన్ బౌలింగ్లో రెండు సిక్సర్లు బాదాడు. చివరికి అతడి బౌలింగ్లోనే మయాంక్(77; 112 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అవుటయ్యాడు. 161/2 స్కోరుతో టీమిండియా ఆట కొనసాగిస్తోంది. చతేశ్వర్ పుజారా (49), విరాట్ కోహ్లి(19) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లు ఉమేశ్ యాదవ్, రవీంద్రన్ అశ్విన్లకు తుది జట్టులో స్థానం దక్కలేదు. ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారికి తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. (గెలిస్తే గొప్ప ఘనతవుతుంది!) -
గెలిస్తే గొప్ప ఘనతవుతుంది!
సిడ్నీ: నాలుగేళ్ల క్రితం ధోని అనూహ్య రిటైర్మెంట్తో సిడ్నీలో జరిగిన చివరి టెస్టుతోనే కోహ్లి కెప్టెన్గా బాధ్యత చేపట్టాడు. ఆ సమయంలో ఐసీసీ ర్యాంకింగ్స్లో ఏడో స్థానంలో ఉన్న భారత్ కోహ్లి నాయకత్వంలో వరుస విజయాలు సాధించి నంబర్వన్గా ఎదిగింది. ఇప్పుడు ‘టాప్’ హోదాలో మరోసారి అదే మైదానానికి వచ్చిన కోహ్లి నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ గెలవడం ఎంతో కష్టమని, ఇప్పుడు గనక దానిని సాధిస్తే అది చాలా పెద్ద ఘనత అవుతుందని వ్యాఖ్యానించాడు. ‘నేను వరుసగా మూడో సారి ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చాను. ఇక్కడ సిరీస్ గెలుపు ఎంత కష్టమో నాకు బాగా తెలుసు. నా నాయకత్వంలో ఇక్కడి నుంచి భారత జట్టు కొత్త ప్రస్థానం మొదలైంది. ఇప్పుడు నంబర్వన్గా మళ్లీ వచ్చాం. దానిని కొనసాగించాలని పట్టుదలగా ఉన్నాం. అందుకే సిరీస్ గెలిస్తే దానిని నేను మాత్రమే కాకుండా జట్టంతా గొప్ప ఘనతగా భావిస్తుంది’ అని కోహ్లి అన్నాడు. తన దృష్టిలో గత రికార్డులకు ఎలాంటి విలువ లేదని, తాను చరిత్రను పట్టించుకోనని కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లలో ఎప్పుడైనా గెలవాలనే కసి ఉండాలన్నాడు. ‘మనకు ఏదైనా లక్ష్యం మాత్రమే ఉంటే ఒకటి రెండు మ్యాచ్ల తర్వాత అది ముగిసిపోతుంది. కానీ ఎప్పుడైనా గెలవాలనే కసి ఉంటే మాత్రం అది ఆగిపోదు. మెల్బోర్న్ టెస్టులో గెలిచిన క్షణాన ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవారితో సహా ప్రతీ ఒక్కరు తమ భావోద్వేగాలు ప్రదర్శించారు. అందరిలోనూ ఒక రకమైన కసి అక్కడ కనిపించింది. నిజాయతీగా చెప్పాలంటే గతంలో ఏం జరిగిందనేది అనవసరం. నేను వర్తమానంపైనే దృష్టి పెట్టి పని చేస్తా’ అని కోహ్లి కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. ఆస్ట్రేలియాలో సిరీస్ విజయంతో తాను ఏదో నిరూపించుకోవాలని భావించడం లేదన్న భారత కెప్టెన్... కొత్త సంవత్సరాన్ని గెలుపుతో ప్రారంభిస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. అశ్విన్ గాయం కొత్తది కాదు! వరుసగా రెండు విదేశీ పర్యటనల్లోనూ ప్రధాన స్పిన్నర్ అశ్విన్ ఒకే తరహా గాయంతో బాధపడుతున్నాడని, దీనికి పరిష్కారం చూడాల్సి ఉందని కోహ్లి వ్యాఖ్యానించాడు. ‘ఇంగ్లండ్లో, ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా అశ్విన్కు ఒకే తరహా గాయం ఉండటం దురదృష్టకరం. దీనికి చికిత్స తీసుకోవడంపై అతను దృష్టి పెట్టాడు. ఫిజియో, ట్రైనర్ కూడా అందుకు సహకరిస్తున్నారు. టెస్టు క్రికెట్లో అతను ఎంత కీలకమో తెలుసు కాబట్టి 100 శాతం ఫిట్గా ఉండాలని కోరుకుంటున్నాం. సరైన సమయంలో కోలుకోలేకపోతున్నందుకు అశ్విన్ కూడా బాధపడుతున్నాడు’ అని కోహ్లి చెప్పాడు. మరోవైపు ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి బౌలింగ్పై కెప్టెన్ ప్రశంసలు కురిపించాడు. నిజానికి అశ్విన్ గైర్హాజరులో ఆఫ్ స్పిన్ లోటు కనిపించడం లేదని, విహారి పార్ట్టైమర్గానే ఆ పని చేస్తున్నాడని కోహ్లి చెప్పాడు. అతనికి ఎప్పుడు అవకాశం ఇచ్చినా అద్భుతంగా బౌలింగ్ చేస్తూ తమకు మంచి ప్రత్యామ్నాయంగా మారాడని కోహ్లి అభిప్రాయం వ్యక్తం చేశాడు. -
సిడ్నీ టెస్ట్; భారత జట్టు ఇదే
సిడ్నీ: ఆస్ట్రేలియాతో రేపటి నుంచి సిడ్నీలో జరగనున్న నాలుగో టెస్టుకు 13 మంది సభ్యులతో భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఆశ్చర్యకరంగా ఇషాంత్ శర్మను జట్టు నుంచి తప్పించింది. అతడికి ఫిట్నెస్ లేదని ప్రకటించింది. గాయపడ్డడా, అనారోగ్యంతో బాధ పడుతున్నాడా అనేది వెల్లడించలేదు. (ఈసారి వదలొద్దు..) అడిలైడ్లో జరిగిన మొదటి టెస్టులో పార్శపు నొప్పి(సైడ్ స్ట్రెయిన్)తో జట్టుకు దూరమైన అశ్విన్కు అవకాశం దక్కింది. రెండు, మూడు టెస్టులు ఆడలేకపోయిన అతడికి చివరి టెస్ట్లో ఛాన్స్ ఇచ్చారు. అశ్విన్ తుది జట్టులో ఉంటాడా, లేదా అనేది మ్యాచ్ ప్రారంభానికి ముందు నిర్ణయిస్తామని బీసీసీఐ తెలిపింది. వ్యక్తిగత కారణాలతో రోహిత్ శర్మ నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. తనకు కూతురు పుట్టడంతో అతడు స్వదేశానికి వచ్చాడు. చివరిదైన సిడ్నీ టెస్టులో పైచేయి సాధించి చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తోంది. ఒకవేళ ఈ మ్యాచ్ ఫలితం తేలకున్నా సిరీస్ భారత్ సొంతమవుతుంది. బీసీసీఐ ప్రకటించిన జట్టు విరాట్ కోహ్లి(కెప్టెన్), అజింక్య రహానే(వైస్ కెప్టెన్), ఛతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, రవీంద్రన్ అశ్విన్, మహ్మద్ షమి, జస్ప్రిత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్ -
గావస్కర్కు అందని సీఏ ఆహ్వానం
ముంబై: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ పేరేమో ‘బోర్డర్–గావస్కర్’ టోర్నీ. చిత్రంగా ట్రోఫీ ప్రదానోత్సవానికి మాత్రం భారత దిగ్గజం సునీల్ గావస్కర్కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారిక ఆహ్వానం పంపలేదు. దీంతో సన్నీ అక్కడికి వెళ్లడం లేదు. బోర్డర్తో కలిసి ట్రోఫీని అందించడం లేదు. 1996 నుంచి జరుగుతున్న ఈ సిరీస్ విజేతకు ఈసారి మాత్రం అలెన్ బోర్డర్ ఒక్కడే ట్రోఫీని ప్రదానం చేయనున్నారు. సీఏ సీఈఓ జేమ్స్ సదర్లాండ్ గత మే నెలలో గావస్కర్కు ముందస్తు సమాచారం ఇచ్చారు. ఆ మరుసటి నెలలోనే సదర్లాండ్ తన 17 ఏళ్ల సుదీర్ఘ పదవీ కాలానికి బైబై చెప్పారు. ముందస్తు సమాచారమైతే ఉంది కానీ అనంతరం సీఏ నుంచి అధికారిక ఆహ్వానమేదీ సన్నీకి అందలేదు. ఒకవేళ సీఏ హడావుడిగా ఇప్పుడు ఆహ్వానం పంపినా గావస్కర్ వెళ్లే అవకాశం లేదు. ఎందుకంటే సన్నీ ‘సోనీ నెట్వర్క్’తో ఒప్పందం చేసుకున్నారు. ముంబై నుంచి వ్యాఖ్యానం చేస్తున్నారు. కనీసం సిరీస్కు ముందైనా చెబితే సోనీ సంస్థ ఏదైనా ప్రత్యామ్నాయం చేసుకునేదని ఇప్పుడు మాత్రం ఏ అవకాశం లేదని సన్నీ చెప్పారు. దీంతో భారత దిగ్గజం గైర్హాజరు కానున్నారు. మరోవైపు సీఏ కమ్యూనికేషన్స్ హెడ్ టిమ్ విటకెర్ మాట్లాడుతూ... జూన్లో ఒకసారి, ఆగస్టులో మరోసారి గావస్కర్కు ఆహ్వానాలు పంపామని చెప్పారు. అయితే ఈ ఆహ్వానాల స్క్రీన్షాట్స్ చూపగలరా అంటే మాత్రం ‘మీడియాకు మా అధికారిక ఆహ్వానాలు వెల్లడించం’ అని బదులిచ్చారు. సీఏ ఇలా చేయడం ఇదేం మొదటిసారి కాదు. 2015లో చివరి నిమిషంలో ఆహ్వానించింది. అక్కడే ఉండటంతో సన్నీ సరేనన్నారు. 2007–08లోనూ ఇలాగే చేసింది. 2000లో ఆస్ట్రేలియా శతాబ్ది జట్టును ఎంపిక చేసేందుకు సీఏ గావస్కర్ను ఆ ప్యానెల్లో సెలెక్టర్గా నియమించింది. వేడుకకి మాత్రం పిలవలేదు. -
‘మంకీ గేట్ వివాదంతో తాగుబోతునయ్యా’
సిడ్నీ : మంకీ గేట్ వివాదం గురించి తెలియని క్రికెట్ ప్రేమికులుండరు. భారత సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్, ఆస్ట్రేలియా ఆటగాడు ఆండ్రూ సైమండ్స్ల మధ్య చోటుచేసుకున్న ఈ వివాదం అప్పట్లో ప్రకంపనలు సృష్టించింది. 2008 సిడ్నీ టెస్ట్లో చోటు చేసుకున్న ఈ వివాదాన్ని తాజాగా ఆండ్రూ సైమండ్స్ మరోసారి ప్రస్తావించాడు. ఈ వివాదం తనను ఓ తాగుబోతుని చేసిందని, దీంతోనే తన జీవితం నాశనమైందని నాటి సంఘటనను గుర్తుచేస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఆ వివాదంతో నేను ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోడం మొదలు పెట్టాను. దీంతో నా కెరీర్ కూడా నాశనమవడం ప్రారంభమైంది. ఆ ఘటనతోనే నేను తీవ్ర ఒత్తిడికి లోనయ్యాను. ఈ వివాదంపై నేను డీల్ చేసిన విదానం కూడా సరైది కాదు. చాలా గిల్టీగా ఫిలయ్యాను. ఇక చాలా సార్లు హర్భజన్ నన్ను దూషించాడు. భారత్లోనే నన్ను మంకీ అని పిలిచాడు. ఈ విషయంపై నేను అతని డ్రెస్సింగ్ రూం వెళ్లి మరి మాట్లాడాను. అలా పిలవడం ఆపకపోతే పెద్ద సమస్య అవుతోందని చెప్పాను’ అని నాటి ఘటనను గుర్తు చేసుకుంటూ బాధపడ్డాడు. అయితే 2009లో చివరి మ్యాచ్ ఆడిన సైమండ్స్.. చాలా సార్లు జట్టు నిబంధనలు బ్రేక్ చేయడంతో క్రికెట్ ఆస్ట్రేలియా అతని కాంట్రాక్టును రద్దు చేసింది. ఇక సిడ్నీ టెస్ట్లో హర్భజన్ తనను మంకీ అని జాతివివక్ష వ్యాఖ్యలు చేశాడని మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేయడంతో వివాదస్పదమైంది. దీంతో రిఫరీ హర్భజన్పై మూడు టెస్ట్ల నిషేధం విధించాడు. అయితే ఈ వివాదంలో భజ్జీ తప్పులేదని అప్పటి భారత్ ఆటగాళ్లు స్పష్టం చేశారు. నిషేధం ఎత్తేయకపోతే సిరీస్ నుంచి తప్పుకుంటామని కూడా హెచ్చరించారు. దీంతో వెనక్కి తగ్గిన అప్పీల్స్ కమిషనర్ జాన్ హనెసన్ భజ్జీ శిక్షను రద్దు చేశారు. చదవండి: మంకీగేట్ : మర్చిపోలేని వివాదం -
మంకీగేట్ : మర్చిపోలేని వివాదం
జోహాన్స్బర్గ్ : క్రికెట్ ప్రేమికులందరికీ మంకీగేట్ వివాదం బాగా గుర్తుండే ఉంటుంది. హర్భజన్ సింగ్, ఆండ్రూ సైమండ్స్ మధ్య వివాదాన్ని దశాబ్దం తరువాత నాటి మ్యాచ్ రెఫరీ మైక్ ప్రోక్టర్ మరోసారి తెరమీదకు తెచ్చాడు. ఈ ఘటనపై మైక్ ప్రొక్టర్ సచిన్ పాత్రపై సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించాడు. రెఫరీగా తన అనుభవాలను పొందుపరుస్తూ మైక్ ప్రోక్టర్ తన ఆత్మకథను రచించాడు. అందులో 2008 సిడ్నీటెస్ట్ మంకీగేట్ ఉదంతాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. సిడ్నీలో రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ తన దగ్గరికి వచ్చి.. హర్భజన్ సింగ్ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడని ఫిర్యాదు చేశాడు. బౌలింగ్ ఎండ్కు సమీపంలో ఉన్న ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ని మంకీ అని సంబోధించినట్లు పాంటింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పాంటింగ్ ఫిర్యాదుపై సచిన్ టెండూల్కర్ తీవ్రంగా స్పందించాడు. హర్భజన్ మంకీ అనలేదని.. హిందీలో ‘తేరి మా.. కి...’ అని అన్నట్లు సచిన్ విచారణ కమిటీ ముందు స్పష్టం చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న నేను హర్భజన్పై మూడు టెస్టుల నిషేధాన్ని విధించినట్లు మైక్ ప్రోక్టర్ ఆత్మకథలో గుర్తు చేసుకున్నారు. అయితే, అప్పీల్స్ కమిషనర్ జాన్ హనెసన్ ముందు హర్భజన్కు సచిన్ మద్దతుగా నిలవడంతో, అతను ఈ శిక్షను రద్దు చేశారు. హర్భజన్కు శిక్ష రద్దు చేయడం నన్ను చాలా నిరుత్సాహ పరిచిందని ప్రోక్టర్ ఆత్మకథలో పేర్కొన్నారు. మాకు 22 గజాల దూరంలో ఉన్న సచిన్ టెండూల్కర్కు ‘మంకీ’ ‘మా..కీ’ అనే పదాల మధ్య వ్యత్యాసం అంత స్పష్టంగా ఎలా వినిపించిందన్నదే నాకు అంతుచిక్కలేదని అందులో తెలిపారు. విచారణ కమిటీ ముందు తనకు ఇంగ్లీషు పెద్దగా రాదని హర్భజన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. హర్భజన్కు ఇంగ్లీష్ బాగా వస్తుందని.. అయితే వివాదం నుంచి బయటపడేందుకే అతను అలా చెప్పివుంటాడని ఆత్మకథలో ప్రోక్టర్ రాసుకున్నారు. అత్యున్నత స్థాయి వ్యక్తులు, శక్తుల జోక్యంతో వివాదం సద్దుమణిగిందని పుస్తకంలో ఆయన పేర్కొన్నారు. ఈ వివాదంలో హర్భజన్కు సచిన్ టెండూల్కర్తో పాటు, జట్టు మేనేజర్ చేతన్ చౌహాన్, బీసీసీఐ కూడా మద్దతు తెలిపిందని అందులో చెప్పుకొచ్చారు. భారత్ క్రికెట్ జట్టు 2007-08 సీజన్లో ఆస్ట్రేలియాలో పర్యటిచింది. భారత జట్టు సిడ్నీలో రెండో టెస్టు ఆడుతోంది. ఆడుతున్న భారత్ భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ని మంకీ అని సంబోధించినట్లు వివాదం చెలరేగింది. -
‘భువి’కి దిగిపోయాడు!
తొలి ఓవర్లోనే వికెట్... కాస్త ఆలస్యమైనా తొలి స్పెల్లోనే ఓపెనర్ ఒకరు కచ్చితంగా పెవిలియన్కు... ఇదీ ఆ బౌలర్ శైలి. వేదిక ఏదైనా, వాతావరణం ఎలా ఉన్నా అతని చేతుల నుంచి వెళ్లిన బంతి రెండు వైపులా స్వింగ్ అవుతుంటే, మహా మహా బ్యాట్స్మెన్లే ఆడేందుకు ఇబ్బంది పడ్డారు. భువనేశ్వర్ కుమార్ ఘనమైన కెరీర్ ఆరంభంలో ‘మీరట్ కత్తెర’లా అంత పదునుగా సాగింది. తన బలాన్ని మరచి వేగాన్ని అందుకునే ప్రయత్నంలో కోల్పోయిన స్వింగ్... ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను ఏ మాత్రం ఇబ్బంది పెట్టని బౌలింగ్తో రికార్డుల కొద్దీ అందిస్తున్న పరుగులు, గాయాల బెడద... తుది జట్టులో స్థానమే లేకపోగా కాంట్రాక్ట్లో కూడా దిగువకు పడిపోయిన వైనం. ఇప్పుడు భువనేశ్వర్ కెరీర్ మొత్తం తిరోగమనమే. ఎక్కడో ఆకాశంలో ఉన్న అతను ఒక్కసారిగా భువికి పడిపోయినట్లుగా ఉంది తాజా స్థితి. మూడేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టిన భువనేశ్వర్ కెరీర్లో అప్పుడే ఎన్నో ఎత్తు పల్లాలు ఎదుర్కొన్నాడు. 22 ఏళ్ల వయసులో వచ్చిన స్టార్ హోదా నుంచి ఇప్పుడు చోటు కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. మరి అతను తిరిగి తన పాత ఫామ్ను అందుకోగలడా... టీమిండియా ప్రధాన పేసర్గా తన గుర్తింపును నిలబెట్టుకోగలడా...! పదును తగ్గిన పేసర్ * తుది జట్టుకు దూరం * పడిపోయిన కాంట్రాక్ట్ గ్రేడింగ్ సాక్షి క్రీడా విభాగం: అంతర్జాతీయ క్రికెట్లో భువనేశ్వర్ ప్రవేశమే సంచలనంగా మొదలైంది. పాకిస్తాన్తో టి20 మ్యాచ్లో 3/9 బౌలింగ్లో తొలి మ్యాచ్లో అతను అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఐదు రోజుల తర్వాత తొలి వన్డేలో కూడా 9 ఓవర్ల స్పెల్లో 3 మెయిడిన్లతో చెలరేగాడు. అంతకుముందు మూడేళ్ల క్రితం రంజీ ఫైనల్లో దిగ్గజం సచిన్ టెండూల్కర్ను దేశవాళీలో తొలిసారి డకౌట్ చేయడంతో ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. 13 బంతుల పాటు పరుగు ఇవ్వకుండా కట్టడి చేసి తర్వాతి బంతికి మాస్టర్ను అవుట్ చేసిన భువీ, భవిష్యత్తులో భారత్కు కీలక బౌలర్ అవుతాడని పెట్టుకున్న అంచనాలు నిజం చేశాడు. బౌలింగ్లో మెరుపు వేగం లేకపోయినా... 125-130 కిలో మీటర్ల వేగంతోనే బంతులు సంధించిన అతను అద్భుత ఫలితాలు సాధించాడు. గోల్డెన్ పీరియడ్... 2013లో ఇంగ్లండ్లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ భువీ సత్తా మరోసారి ప్రపంచానికి చూపించింది. ఆ టోర్నీలో భారత్తో తలపడిన ఐదు జట్లలో ఒక్క బ్యాట్స్మన్ కూడా అతడిని సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. సహజంగానే బంతిని బాగా స్వింగ్ చేయగల భువీ, అక్కడి పరిస్థితుల్లో ఆరంభంలోనే వికెట్లు తీసి భారత్ విజయానికి బాటలు వేశాడు. ఆ తర్వాత మరో ఏడాదికి టెస్టుల్లో ఇంగ్లండ్ గడ్డపైనే అతని అత్యుత్తమ ప్రదర్శన వచ్చింది. 2014 టెస్టు సిరీస్లో ఐదు మ్యాచ్లలో కలిపి అతను 26.63 సగటుతో 19 వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా కూడా నిలిచాడు. ఇంగ్లండ్పై ఒక భారత బౌలర్ ఇన్ని వికెట్లు తీయడం ఇదే మొదటిసారి కాగా... లార్డ్స్ ఆనర్స్ బోర్డులో పేరు లిఖించుకున్న అరుదైన ఆటగాళ్లలో భువనేశ్వర్ ఒకడయ్యాడు. ఈ సిరీస్లో సాధించిన మూడు హాఫ్ సెంచరీలు బ్యాటింగ్లో కూడా అతని విలువను చూపించాయి. 2013-14 సంవత్సరానికి అతను ‘బీసీసీఐ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా కూడా నిలిచాడు. గాయాల సమస్య... ఈ దశలో చీలమండ గాయం భువీని ఇబ్బందుల్లో పడేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో గాయం కారణంగా అతను మొదటి మూడు టెస్టుల్లో ఆడలేకపోయాడు. చివరిదైన సిడ్నీ టెస్టులో బరిలోకి దిగినా ఏ మాత్రం ప్రభావం చూపించలేక ఒక వికెట్ తీసి ఏకంగా 168 పరుగులు సమర్పించుకున్నాడు. ప్రపంచకప్ ఆరంభానికి కోలుకోకపోవడంతోపాటు ఉమేశ్, షమీ, మోహిత్ త్రయం కుదురుకోవడంతో అతనికి పెద్దగా మ్యాచ్ అవకాశాలు రాలేదు. షమీ గాయపడిన ఒకే మ్యాచ్లో ఆడిన అతను పొదుపుగా బౌలింగ్ చేశాడు. తగ్గిన ప్రభావం... సిడ్నీ టెస్టు తర్వాత భారత్ ఈ ఏడాది ఆరు టెస్టు మ్యాచ్లు ఆడింది. కానీ ఒక్కదాంట్లోనూ భువనేశ్వర్కు చోటు దక్కలేదు. శ్రీలంక సిరీస్లోనైతే ఒక వైపు భువనేశ్వర్లాంటి ప్రధాన స్వింగ్ బౌలర్ జట్టులో ఉన్నా... హడావిడిగా భారత్ నుంచి స్టువర్ట్ బిన్నీని పిలిపించి కోహ్లి తుది జట్టులో స్థానం కల్పించడం భువీపై అపనమ్మకాన్ని చూపిస్తోంది. బెంగళూరు టెస్టు కోసం స్పిన్నర్ స్థానంలో సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలనుకున్నప్పుడు కూడా భువనేశ్వర్ను కాకుండా బిన్నీకే చోటు దక్కింది. ప్రపంచకప్ తర్వాత అతను ఆడిన పది వన్డేల్లో హరారేలో జింబాబ్వేపై (4/33) మినహా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏదీ లేదు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో అయితే అతని బౌలింగ్ మరీ పేలవంగా కనిపించింది. ఐదు వన్డేల్లో కలిపి 7 వికెట్లు తీసిన అతను ఇండోర్ మినహా మిగిలిన నాలుగు మ్యాచ్లలో భారీగా పరుగులు ఇచ్చాడు. ముంబై వన్డేలో వందకు పైగా పరుగులిచ్చి భారత్ తరఫున అందరికంటే చెత్త రికార్డు నమోదు చేయడం అతని పట్టు జారుతోందనడానికి నిదర్శనం. బలాన్ని వదిలి... ఉన్నత స్థాయిలో కొంత కాలం పాటు ఆడుతూ వచ్చిన బౌలర్లు ఎవరైనా వైవిధ్యం కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు. అయితే ఆ క్రమంలో తన బలాన్ని మరచిపోతేనే కష్టం. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే బంతిని స్వింగ్ చేయడం భువనేశ్వర్ పూర్తిగా మరచిపోయినట్లు కనిపిస్తోంది. ‘భువీ తొలి మ్యాచ్లో పాక్పై అద్భుతంగా బౌలింగ్ చేసినప్పుడు అతని వేగం ఎంత అని ఎవరైనా పట్టించుకున్నారా. అందరూ అతని స్వింగ్పైనే దృష్టి పెట్టారు. ఇర్ఫాన్ పఠాన్లాగే ఇతను కూడా వేగంగా బంతిని విసిరే ప్రయత్నంలో తనకు గుర్తింపు తెచ్చిన శైలిని పూర్తిగా పక్కన పెట్టాడు. చాలా మంది యువ బౌలర్లలాగే భువీ కూడా తప్పు చేస్తున్నాడు. కటక్లో స్వింగ్కు మంచి అవకాశం ఉన్న సమయంలో అతను మెక్గ్రాత్ తరహాలో బౌలింగ్ చేయబోయి భంగపడ్డాడు’ అని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ విశ్లేషించారు. భువీ వేగం గురించి చెప్పలేను గానీ... అతను గతంలోలాగా బంతిని స్వింగ్ చేయలేకపోతున్నాడనేది మాత్రం వాస్తవం అని మాజీ పేసర్ జహీర్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. మార్గదర్శనం కావాలి... తొలి రెండు టెస్టుల్లో స్థానం దక్కకపోవడంతో రంజీ ట్రోఫీకి వెళ్లి భువీ పటిష్ట జట్లు ముంబై, తమిళనాడులతో రెండు మ్యాచ్లు ఆడాడు. అక్కడా 4 వికెట్లు మాత్రమే తీసి పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఇప్పుడు పరిస్థితి చేయి దాటక ముందే అతను తన లోపాన్ని సరిదిద్దుకోవాల్సి ఉంది. ‘వేగంగా బౌలింగ్ చేయాలంటే స్వింగ్ను పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. 140 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు వేస్తూ కూడా స్వింగ్ రాబట్టే బౌలర్లు ఉన్నారు. అతను రనప్ కాస్త పెరిగిన మాట వాస్తవమే. అయితే అతను పూర్తిగా స్వింగ్ కోల్పోలేదు. ఇప్పుడు కావాల్సింది కాస్త నిలకడ చూపించడం. మరి కొంత శ్రమిస్తే అతను త్వరలోనే జట్టులోకి తిరిగొస్తాడు’ అని భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ విశ్వాసం వ్యక్తం చేశారు. అరుణ్తో పాటు టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి తదితరులు అతని సమస్యను సరిగ్గా గుర్తించి మార్గనిర్దేశం చేస్తే పాత భువనేశ్వర్లా సత్తా చాటగలడు. లేదంటే ఘనంగా దూసుకొచ్చి నిశ్శబ్దంగా కెరీర్ ముగించిన అనేక మంది భారత బౌలర్ల జాబితాలో చేరిపోయే ప్రమాదం ఉంది. -
సిడ్నీ టెస్టుకు జాన్సన్ దూరం
సిడ్నీ: భారత్తో జరిగే చివరి, నాలుగో టెస్టుకు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ జాన్సన్ దూరమయ్యాడు. గాయం కారణంగా జాన్సన్ ఈ మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఈ మ్యాచ్ ఈ నెల 6 నుంచి సిడ్నీలో జరగనుంది. నాలుగు టెస్టుల సిరీస్ను ఆసీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ధోనీ రిటైరవడంతో విరాట్ కోహ్లీ భారత్కు సారథ్యం వహించనున్నాడు.