Tampering
-
ఆ రెండు గంటలు ఏం జరిగింది మీరు సమాధానం చెప్పాల్సిందే
-
Venezuela presidential election: వెనిజులాలో... మళ్లీ పాత కథే!
కారకాస్: వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో అంతా ఊహించిందే జరిగింది. అధ్యక్షుడు నికొలస్ మదురో వరుసగా మూడోసారి విజయం సాధించినట్టు ఆ దేశ ఎన్నికల సంఘం (సీఎన్ఈ) ప్రకటించింది. ఆదివారం జరిగిన దేశవ్యాప్త పోలింగ్ అనంతరం రాత్రి ఓట్ల లెక్కింపు చేపట్టారు. 80 శాతం ఓట్లను లెక్కించేసరికి మదురోకు విజయానికి అవసరమైన 51 శాతం ఓట్లు లభించినట్టు సీఎన్ఈ చీఫ్ ఎల్విస్ అమోరోసో అర్ధరాత్రి అనంతరం ప్రకటన విడుదల చేశారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎడ్మండో గొంజాలెజ్కు 44 శాతం ఓట్లొచ్చినట్టు వెల్లడించారు. దీనిపై విపక్షాలన్నీ తీవ్రంగా మండిపడ్డాయి. ఓట్ల లెక్కింపును ప్రహసనప్రాయంగా మార్చేసి ప్రజాస్వామ్యాన్ని మరోసారి మంటగలిపారని విపక్ష నేత మరియా కొరీనా మచాడో దుమ్మెత్తిపోశారు. ‘‘మదురోను ఓడించేందుకు జనమంతా వెల్లువలా కదిలొచ్చి గొంజాలెజ్కు ఓటేశారు. ఆయన కనీసం మూడింట రెండొంతుల ఓట్లతో ఘనవిజయం సాధించారు. మా బూత్లవారీ విశ్లేషణలో కూడా అదే తేలింది. ఓటింగ్ సరళిని చూసిన మీదట ఓటమి ఖాయమని మదురోకు అర్థమైపోయింది. ఫలితాలను తారుమారు చేసేందుకు పథకం ప్రకారం విపక్ష కూటమి పర్యవేక్షకులను పోలింగ్ బూత్ల నుంచి తరిమేశారు. అనంతరం మదురో చేతిలో కీలుబొమ్మ అయిన సీఎన్ఈ చీఫ్ ఫలితాలను ఆయనకు అనుకూలంగా వక్రీకరించారు’’ అంటూ ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తక్షణం దేశవ్యాప్తంగా మొత్తం 30 వేల పోలింగ్ బూత్లవారీగా పోలైన ఓట్ల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. సీఎన్ఈ మాత్రం అందుకు సుముఖంగా లేదు. దీనికితోడు పోలింగ్ ముగిశాక ఫలితాల వెల్లడిని నిర్ధారిత సమయం కంటే ఏకంగా ఆరు గంటలపాటు ఆలస్యం చేశారు. ఫలితాలను మదురోకు అనుకూలంగా మార్చేందుకే ఇలా చేశారని విపక్ష కూటమి దుయ్యబట్టింది. ఫలితాలను చట్టపరంగా సవాలు చేస్తామని ప్రకటించింది. మదురో మాత్రం విదేశీ శక్తులతో కలిసి కొందరు కుట్ర పన్ని ఈవీఎంలను హాక్ చేసేందుకు ప్రయతి్నంచారంటూ విపక్షాలపై ప్రత్యారోపణలకు దిగారు. శాంతిభద్రతలకు భంగం కలిగించజూస్తే ఏం చేయాలో పోలీసులు, సైన్యం చూసుకుంటాయని హెచ్చరించారు. వెనిజులాలో పాతికేళ్లుగా యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ పాలనకు తెర దిచేందుకు విపక్షాలన్నీ మచాడో సారథ్యంలో ఒక్కతాటిపైకి వచ్చి పోటీ చేశాయి.ఫలితాలపై దేశాల పెదవి విరుపు వెనిజులా ఎన్నికల ఫలితాలు అస్సలు నమ్మశక్యంగా లేవని అమెరికా, చిలీ,ఉరుగ్వేతో పాటు చాలా దేశాలు పేర్కొన్నాయి. అవి ప్రజల మనోగతాన్ని, ఓటింగ్ సరళిని ప్రతిఫలించడం లేదని స్పష్టం చేశాయి. చిలీ అధ్యక్షుడు గేబ్రియెల్ బోరిక్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్తో పాటు బ్రిటన్ కూడా ఈ మేరకు ప్రకటన చేసింది. -
Lok Sabha Elections 2024: ఈవీఎంలు వెరిఫికేషన్ చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలపై కొందరు అభ్యర్థులు అనుమానాలు వ్యక్తంచేస్తూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. ఈవీఎంలలోని మైక్రో–కంట్రోలర్ చిప్లు ట్యాంపరింగ్కు గురయ్యాయో లేదో తనిఖీ చేయాలని ఆయా లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులు ఈసీకి దరఖాస్తు చేసుకున్నారు. ఇలా ఆరు రాష్ట్రాల పరిధిలోని ఎనిమిది లోక్సభ నియోజకవర్గాల నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులుసహా ఎనిమిది దరఖాస్తులు ఈసీకి అందాయి. తమిళనాడు, హరియాణాలో చెరో రెండు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధప్రదేశ్, తెలంగాణలో చెరో స్థానంలో ఇలా మొత్తంగా 8 లోక్సభ నియోజకవర్గాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. పేపర్ బ్యాలెట్ విధానానికి మారుదామంటూ దాఖలైన పిటిషన్లను కొట్టేస్తూ, ఈవీఎం విధానాన్ని సమర్థిస్తూ ఏప్రిల్ 26వ తేదీన సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు వెలువడిన వేళ ఇలా ఈసీకి అభ్యర్థనలు రావడం గమనార్హం. అయితే ఆయా నియోజకవర్గాల్లో ఓడి రెండో, మూడో స్థానంలో నిలిచిన అభ్యర్థులు ఈవీఎంలపై సందేహాలు వ్యక్తంచేస్తే ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ర్యాండమ్గా ఐదు శాతం ఈవీఎంలను చెక్చేసేందుకు సుప్రీంకోర్టు అవకాశం కల్పించింది. ఈ వెసులుబాటును వినియోగించుకుంటూ ఓడిన అభ్యర్థులు కొందరు తాజాగా ఈసీని ఆశ్రయించగా ఆయా వివరాలను ఈసీ వెల్లడించింది. ఆరు రాష్ట్రాల్లో కలిపి 92 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను చెక్ చేయనున్నారు. అయితే ఒక్కో ఈవీఎం సెట్ను తనిఖీచేయడానికి నిర్వహణ ఖర్చుగా రూ.47,200ను ఆ అభ్యర్థి ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంటుందని జూన్ ఒకటో తేదీన ఈసీ ఒక ప్రకటన జారీచేయడం తెల్సిందే. ఈవీఎంల తనిఖీ ఖర్చును భారత్ ఎలక్ట్రానిక్స్ (బెల్), ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐఎల్)లు రూ.40,000 నిర్ణయించగా జీఎస్టీ 18 శాతం(రూ.7,200) కలుపుకుంటే ఖర్చు రూ. 47,200గా తేలింది. అయితే ఈవీఎంల తరలింపు, వాటిని తనిఖీని రికార్డ్ చేసేందుకు సీసీటీవీల ఏర్పాటు, విద్యుత్ చార్జీలు, వీడియోగ్రఫీ, జిల్లా ఎన్నికల అధికారి స్థాయిలో ఇతర నిర్వహణ ఖర్చులు అదనంగా ఉండొచ్చని తెలుస్తోంది. మహారాష్ట్రలోని అహ్మద్నగర్లో బీజేపీ అభ్యర్థి సంజయ్ రాధాకృష్ణ విఖే పాటిల్ 40 పోలింగ్ కేంద్రాల్లో తనిఖీ చేయాలని దరఖాస్తుచేశారు. ఛత్తీస్గఢ్లోని ఒక లోక్సభ పరిధిలోని 4 పోలింగ్ స్టేషన్లను, హరియాణాలోని రెండు లోక్సభ స్థానాల్లోని 6 పోలింగ్ స్టేషన్లను, తమిళనాడులోని 2 లోక్సభ స్థానాల్లోని 20 పోలింగ్ స్టేషన్లను అభ్యర్థులు తనిఖీకి ఎంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ.. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం లోక్సభ స్థానం పరిధిలోని బొబ్బిలి, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో పోలింగ్ స్టేషన్లో ఈవీఎంలను తనిఖీ చేయాలని వైఎస్సార్సీపీ అభ్యర్థి కోరారు. గజపతినగరం అసెంబ్లీ స్థానంలో ఒక పోలింగ్ స్టేషన్, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 12 పోలింగ్ స్టేషన్లను వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎంచుకున్నారు. తెలంగాణలోని జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలో ఉన్న నారాయణ్ఖేడ్లో 7 , జహీరాబాద్లో 7, ఆందోల్లో 6 పోలింగ్ స్టేషన్లను బీజేపీ అభ్యర్థి ఎంచుకున్నారు. ఒడిశాలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 13 పోలింగ్ స్టేషన్లను బీజేడీ అభ్యర్థి ఎంచుకున్నారు. -
ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమే: సెంథిల్
తిరువళ్లూరు: ఈవీఎంల ట్యాంపరింగ్పై కాంగ్రెస్ పారీ్టకి ఉన్న అనుమానాల వెనుక బలమైన కారణాలు ఉన్నాయని తిరువళ్లూరు పార్లమెంట్ సభ్యుడు, మాజీ ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ స్పష్టం చేశారు. ప్రభుత్వ అతిథి గృహంలో బుధవారం కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచి్చన తరువాత అన్ని వర్గాల ప్రజలను టార్గెట్ చేసి, కొన్ని వర్గాలకు పంచిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై మాతో పాటు సాధారణ ప్రజలకు కూడా అనుమానం ఉంది. తాము వేసిన ఓటు ఎక్కడికి వెళ్తుందోనని ఆలోచన చేసే స్థాయికి చేరారు. దేశంలో ఈవీఎంలు లేకపోయి ఉంటే బీజేపీ హ్యాట్రిక్ సాధించేదా..? అని ప్రశ్నించారు. ఈవీఎంలను నిషేధించాలన్న తమ పార్టీ విధానానికి ఇప్పటికి కట్టుబడి ఉన్నామన్నారు. ఈవీఎంలను హ్యాక్ చేయడం కుదరదన్న వారే ఎలాన్ మస్క్ సవాలుకు తోక ముడిచారన్నారు. -
Elon Musk: హ్యాక్ చేయొచ్చు..!
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) పనితీరు, పారదర్శకతపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈవీఎంలలో నమోదైన ఫలితాలను సులభంగా తారుమారు చేయొచ్చని, ఎన్నికల్లో వీటిని ఉపయోగించకపోవడమే మంచిదని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల యజమాని, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సైతం ఈవీఎంలపై స్పందించారు. ఈ మేరకు తాజాగా ‘ఎక్స్’లో తన అభిప్రాయం వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వినియోగిస్తున్న ఈవీఎంల పనితీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యంత్రాలను హ్యాక్ చేసేందుకు ఆస్కారం ఉందన్నారు. మస్క్ అభిప్రాయాన్ని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మాజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఖండించారు. భారత్లో ఉపయోగిస్తున్న ఈవీంఎలు పూర్తిగా సురక్షితమేనని తేల్చిచెప్పారు. దీనిపై మస్క్ ఘాటుగా స్పందించారు. ఏదైనా హ్యాక్ చేయొచ్చని పేర్కొన్నారు. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాందీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్లు కూడా ఆదివారం స్పందించారు. ఈవీఎంలు ఎవరూ తనిఖీ చేయలేని బ్లాక్బాక్సుల్లాంటివేనని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. ‘ఎక్స్’లో ఎలాన్ మస్క్ చేసిన పోస్టును తన ‘ఎక్స్’ ఖాతాల్లో రాహుల్ షేర్ చేశారు. ఈవీఎంల విశ్వసనీయతను అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. రిస్క్ చిన్నదైనా పరిణామం పెద్దదే మనుషులు లేదా కృత్రిమ మేధ(ఏఐ)తో ఈవీఎంలను హ్యాక్ చేసేందుకు ఆస్కారం ఉంది. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను వాడొద్దు. ఎన్నికల నుంచి ఈ యంత్రాలను దూరంగా ఉంచాలి. ఈవీఎంలను హ్యాక్ చేసే రిస్క్ తక్కువగా ఉన్నప్పటికీ అది ముమ్మాటికీ హ్యాకింగే అవుతుంది. రిస్క్ చిన్నదైనా అది పెద్ద పరిణామానికి దారితీస్తుంది.– ఎలాన్ మస్క్, స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల అధినేత ఎన్నికల ప్రక్రియపై అనుమానాలున్నాయి భారత్లో ఉపయోగిస్తున్న ఈవీఎంలు బ్లాక్బాక్సుల్లాంటివే. వాటిని తనిఖీ చేయడానికి ఎవరినీ అనుమతించరు. మన దేశంలో అమల్లో ఉన్న ఎన్నికల ప్రక్రియపై తీవ్ర ఆందోళనలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవస్థల్లో జవాబుదారీతనం, పారదర్శకత లోపించినప్పుడు ప్రజాస్వామ్యం ఓ బూటకంగానే మిగిలిపోతుంది – ‘ఎక్స్’లో రాహుల్ గాంధీ ఈవీఎంలు పూర్తి సురక్షితం పూర్తిగా సురక్షితమైన ఎల్రక్టానిక్ పరికరాలను, డిజిటల్ హార్డ్వేర్ను ఎవరూ తయారు చేయలేరన్న సాధారణ అభిప్రాయం ప్రజల్లో ఉంది. అలా అను కోవడం పొరపాటు. ఈవీఎంలపై ఎలాన్ మస్క్ వ్యక్తం చేసిన భయాందోళలు సమంజసం కాదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను హ్యాక్ చేయడం అమెరికాతోపాటు ఇతర దేశాల్లో సాధ్యమవుతుందేమో గానీ ఇండియాలో ఎంతమాత్రం వీలుపడదు. ఇతర దేశాల్లో ఇంటర్నెట్తో అనుసంధానించిన ఓటింగ్ యంత్రాలను వాడుతుంటారు. ఇండియాలో అలాంటి పరిస్థితి లేదు. ఇంటర్నెట్తో కనెక్ట్ చేసినప్పుడు అవకతవకలు జరిగే అవకాశం ఉండొచ్చు. ఇండియాలో ఈవీఎంలకు ఇంటర్నెట్తో గానీ, బ్లూటూత్తో గానీ, వై–ఫైతోగానీ ఎలాంటి అనుసంధానం ఉండదు. ఇవి పూర్తిగా సురక్షితమైనవి. ఫ్యాక్టరీలో పోగ్రామ్ చేసిన ఈవీఎం కంట్రోలర్లను బయట రీప్రోగ్రామింగ్ చేయడం సాధ్యం కాదు. ఇండియాలో ఉపయోగిస్తున్న ఈవీఎంలు, వాటి భద్రత గురించి ఎలాన్ మస్్కకు ట్యూషన్ చెప్పడానికి నేను సిద్ధమే – రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మాజీ సహాయ మంత్రి ‘‘ఏదైనా(ఏ ఎల్రక్టానిక్ పరికరమైనా) హ్యాక్ చేయొచ్చు’’ – రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యలపై ఎలాన్ మస్క్ ప్రతిస్పందన ఈవీఎంలకు స్వస్తి పలకాలి టెక్నాలజీ అనేది సమస్యలను పరిష్కరించేలా ఉండాలి. అదే టెక్నాలజీ ఒక సమస్యగా మారినప్పుడు దాన్ని పక్కనపెట్టమే మంచిది. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని నిపుణులు ఇప్పటికే నిరూపించారు. ప్రపంచవ్యాప్తంగా ఈవీఎంలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నా యి. ఓటింగ్ యంత్రాలను హ్యాక్ చేస్తున్నట్లు సందేహాలున్నాయి. ఈవీఎం ట్యాంపరింగ్పై ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ నిపుణులు సైతం బహిరంగంగా ప్రకటనలు చేశారు. అలాంటప్పుడు మన దేశంలో ఈవీఎంలను బలవంతంగా ఉపయోగించాల్సిన అవసరం ఏమిటి? దీనిపై అధికార బీజేపీ సమాధానం ఇవ్వాలి. ఈవీఎంలకు స్వస్తి పలకాలి. భవిష్యత్తులో జరిగే ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహించాలి. – ‘ఎక్స్’లో అఖిలేష్ యాదవ్ దమ్ముంటే హ్యాక్ చేసి చూపించండి ఎలాన్ మస్క్ గానీ, ఇంకెవరైనా గానీ ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని చెబుతున్న వ్యక్తులు భారత ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలి. అక్కడ ఈవీఎంను తీసుకొని హ్యాక్ చేసి చూపించాలి. ఇదే మా చాలెంజ్. భారతదేశ ప్రజాస్వామ్యం గురించి రాహుల్ గాంధీ ఎందుకు ఎలాన్ మస్్కకు ఫిర్యాదు చేస్తున్నారు? మస్క్ ఏం చేయగలరు? ప్రపంచం ముందు కన్నీళ్లు పెట్టుకోవడం, భారతదేశ ప్రతిష్టను దిగజార్చడం కాంగ్రెస్ డీఎన్ఏలో ఒక భాగమా? వారసత్వ రాజకీయాలను ప్రజలు వరుసగా మూడోసారి తిరస్కరించారు. అయినా ఆ విషయం కాంగ్రెస్కు అర్థం కావడం లేదు? – అమిత్ మాలవీయ, బీజేపీ ఐటీ విభాగం ఇన్చార్జి -
‘బలి’ కోరుతున్న సాంకేతిక విజయం!
‘ది హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ గురించి క్రీడా ప్రియులందరూ వినే ఉంటారు. 1986 ఫుట్బాల్ వరల్డ్ కప్ సందర్భంగా అర్జెంటీనా – ఇంగ్లండ్ మ్యాచ్లో డీగో మారడోనా చేసిన తొలి గోల్ వివాదాస్పదమైంది. డీగో చేసిన హెడర్ గోల్ను వాస్తవానికి చేత్తో నెట్టాడని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో రికార్డింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల రెఫరీ దాన్ని గోల్గానే ప్రకటించాడు. తర్వాత నాలుగు నిమిషాలకే ‘గోల్ ఆఫ్ ది సెంచరీ’ని కొట్టిన మారడోనా, అదే ఊపులో వరల్డ్ కప్ను గెలుచుకోవడమే గాక ఫుట్బాల్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. వివాదాస్పద గోల్పై ఆ తర్వాత స్పందించిన మారడోనా అది ‘సగం మారడోనా హెడ్, సగం హ్యాండ్ ఆఫ్ గాడ్’ ఫలితమని ప్రకటించాడు.దుబాయ్లో ఇటీవల కురిపించిన కృత్రిమ వర్షం ఎంత బీభత్సాన్ని సృష్టించిందో ప్రపంచమంతా చూసింది. క్లౌడ్ సీడింగ్ ఓవర్డోస్కు వాతావరణ మార్పులు కూడా తోడైన ఫలితంగా రెండేళ్లలో కురవాల్సిన వర్షమంతా ఒకేరోజు కురిసి ఎమిరేట్ను అతలాకుతలం చేసింది.ఆంధ్రప్రదేశ్లో ఈసారి జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తుంటే ఏదో ‘అదృశ్య హస్తం’ (హ్యాండ్ ఆఫ్ గాడ్) పనిచేసినట్టుగా, కృత్రిమ ఓట్ల వర్షం కురిపించినట్టుగా అనిపించక మానదు. లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటువంటి ఫలితాలు రావాలంటే రష్యా నాయకుడు పుతిన్ లేదా తుర్కియే పాలకుడు ఎర్డోగాన్ లేదా మయన్మార్ మిలిటరీ జుంటా ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగి ఉండాలి. అలా జరగలేదు కాబట్టి ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ ప్రమేయం ఉండాలి. ఎవరా గాడ్? కేంద్ర ప్రభుత్వమా? ఎన్నికల సంఘమా... ఎవరు? కృత్రిమ ఓట్ల వర్షానికి క్లౌడ్ సీడింగ్ ఎవరు చేశారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనసామాన్యం మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివి.ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లను ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఫలితాలను తారుమారు చేయడం సాధ్యమేనని స్వయంగా చంద్రబాబే పలుమార్లు ప్రకటించారు. ఆయన అభిమాని వేమూరి రవి ఇంకొంచెం ముందుకెళ్లి ఈవీఎమ్లను ఎలా హ్యాక్ చేయవచ్చో మీడియా సమక్షంలోనే ప్రదర్శించి చూపెట్టారు. అందువల్ల ఈవీఎమ్ల ట్యాంపరింగ్ అనే ఆర్ట్పై కూటమికి స్పష్టమైన అవగాహన ఉన్నది.రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 5 గంటలకు 68 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ తుది వివరాలను ప్రకటించడానికి దాదాపు మూడు రోజుల సమయాన్ని తీసుకున్నది. ఈ అసాధారణ జాప్యంపై సందేహాలను లేవనెత్తుతూ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రిక సైతం కథనాన్ని ప్రచురించింది. ఆ గడువు ముగిసిన తర్వాత పోలయిన ఓట్ల సంఖ్య కూడా అనుమానాలను రేకెత్తించే విధంగానే ఉన్నది.తుది పోలింగ్ శాతాన్ని సుమారు 81గా నిర్ధారిస్తూ మూడు రోజుల తర్వాత ఈసీ తాపీగా ప్రకటన విడుదల చేసింది. మామూలుగా పోలింగ్ సమయం ముగిసిన తర్వాత పోలింగ్ కేంద్రం ఆవరణలో నిలబడి ఉన్నవారికి స్లిప్స్ పంపిణీ చేస్తారు. వారికి మాత్రమే ఓటువేసే అవకాశం కల్పిస్తారు. అలా నిలబడిన వారికి ఈసారి ఎందుకనో స్లిప్స్ లేదా టోకెన్లు పంపిణీ చేయలేదనే వార్తలు వినవస్తున్నాయి. ఇది అనుమానించదగ్గ అంశం.పోలింగ్ గడువు ముగిసిన తర్వాత ప్రాంగణంలో నిలబడి ఉన్నవారి సంఖ్య మనకున్న సమాచారం మేరకు ఎక్కడా యాభై నుంచి వంద దాటలేదు. వీరు ఓట్లు వేయడానికి ఇంకో రెండు, మూడు గంటలు చాలు. అంటే తొమ్మిది గంటలకల్లా పోలింగ్ పూర్తి కావాలి. కానీ అర్ధరాత్రి దాటిందాకా పోలింగ్ జరుగుతూనే ఉందట! అంటే ఆ యాభైమందే అంతసేపూ సైక్లింగ్ చేస్తున్నారా? వేలాది పోలింగ్ బూత్లలో గడువు ముగిసే సమయానికి 65 నుంచి 70 శాతం మధ్యనున్న పోలింగ్ శాతం తుది ప్రకటన వచ్చేసరికి 85 నుంచి 95 శాతం దాకా ఎగబాకింది.పోలింగ్కు ముందు జరిగిన రాజకీయ పరిణామాలను కూడా గమనంలోకి తీసుకోవాలి. ఎన్డీఏ కూటమిలో చేరడం కోసం చంద్రబాబు పడిన పాట్లు, భరించిన అవమానాలు తెలిసినవే. కూటమిగా కుదురుకున్న తర్వాత వారు ‘ఎలక్షనీరింగ్’ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అనేక ప్రాంతాల్లోని ప్రభుత్వాధికారులను బదిలీ చేశారు. కనీవినీ ఎరుగని విధంగా ఏ ప్రాంతంలో ఏ అధికారిని నియమించాలో కూడా ఎన్నికల సంఘానికి సూచించారు. ఈసీ కూడా కూటమి కోర్కెలన్నింటినీ మారుమాట్లాడకుండా నెరవేర్చింది. సాధారణంగా తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ఎప్పుడూ తొలి ఫేజ్లోనే ఉంటూ వచ్చాయి. కానీ కూటమి కోరిక మేరకు ఈసారి నాలుగో ఫేజ్కు నెట్టివేశారు.మొదటి మూడు దశల పోలింగ్ తర్వాత జాతీయ స్థాయిలో ఎన్డీఏలో అభద్రతా భావం మొదలైందట. పోలింగ్ సరళి తమకు అనుకూలంగా లేదనే నిర్ధారణకు ఎన్డీఏ పెద్దలు వచ్చారు. నాలుగో దశకు ఎన్నికలను వాయిదా వేయించుకున్న చంద్రబాబు అదనంగా లభించిన సుమారు నెల రోజుల సమయాన్ని ప్రత్యేక ‘ఏర్పాట్ల’ కోసం ఉపయోగించుకున్నారు. ఈ ఏర్పాట్లకు ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ పూర్తిగా సహకరించింది. దేశవ్యాప్తంగా 19 లక్షల ఈవీఎమ్ల మిస్సింగ్పై ఇప్పటికీ కేంద్రం నుంచి స్పష్టమైన సమాధానాలు రాలేదు. ఇవెక్కడున్నాయి? ఏ పనికి వినియోగిస్తున్నారు? ఎవరి సేవల కోసం ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ వీటిని వినియోగిస్తున్నారో తేలవలసి ఉన్నది.గడచిన ఐదేళ్లుగా ప్రత్యర్థులపై లేని దాడులను ఉన్నట్లుగా చూపించి గగ్గోలు పెట్టినవారు పోలింగ్ రోజు సాయంత్రం, మరునాడు – మళ్లీ కౌంటింగ్ రోజు నుంచి గత నాలుగు రోజులుగా జరిగిన హింసాకాండపై మౌనం వహించారు. ఈ హింసాకాండ కూడా అప్పటికప్పుడు ఆవేశంతో చెలరేగినట్టు లేదు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక క్రమం కనిపిస్తున్నది. కృత్రిమ ఓట్ల వర్షం కురిసే సమయానికి ఎవరూ పోలింగ్ కేంద్రాల వైపు వెళ్లకుండా బెదరగొట్టేందుకు దాడులు జరిగాయి. మరుసటి రోజు కూడా చాలాచోట్ల ఇవి కొనసాగాయి. మళ్లీ కౌంటింగ్ పూర్తవుతున్న సమయం నుంచి నాలుగు రోజులుగా యథేచ్ఛగా రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. అసాధారణమైన ఓటింగ్ సరళిని సమీక్షించడానికి ప్రత్యర్థులు గ్రామాల్లో పర్యటించే అవకాశం లేకుండా బెదరగొట్టడానికి ఈ దాడులు జరిగాయి. పోలీసు యంత్రాంగం పూర్తిగా కూటమి వ్యూహానికి తోడుగా నిలబడింది.విచక్షణారహితంగా జరుగుతున్న ఈ దాడులు మన ప్రజాస్వామ్య భవిష్యత్తు మీద ప్రశ్నార్థకాన్ని రచిస్తున్నాయి. ఈ దాడులను ఖండించకపోగా ‘వైఎస్సార్సీపీ కవ్వింపు చర్యలకు రెచ్చిపోకండ’ని ముఖ్యమంత్రి కాబోయే చంద్రబాబు ట్వీట్ చేశారు. గత రెండేళ్లుగా లోకేశ్ ఒక రెడ్బుక్ను సభల్లో ప్రదర్శిస్తూ హెచ్చరికలు జారీ చేసేవారు. తాను రెడ్బుక్లో పేర్లు ఎక్కించిన వారి సంగతి అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తానని చెప్పేవారు. ఇప్పుడా రెడ్బుక్ హోర్డింగ్లను కూడళ్లలో ఏర్పాటు చేశారు. దాని సందేశమేమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.సందేశం గూండాతండాలకు స్పష్టంగానే అర్థమైంది. టీడీపీ వారికి చాలాచోట్ల జనసైనికులు కూడా తోడయ్యారు. ప్రత్యర్థులపై దాడులు చేస్తున్న సందర్భాల్లో పోలీసులు మౌన ప్రేక్షక పాత్రను పోషించారు. కొన్నిచోట్ల పారిపోతూ కనిపించారు. ఇప్పటివరకు బయటకొచ్చిన వీడియోల్లో ఇటువంటి దృశ్యాలెన్నో కలవరం కలిగించాయి.నూజివీడులో వైసీపీకి చెందిన ముసినిపల్ కౌన్సిలర్ను వెంబడించి కత్తులతో పొడుస్తున్న దృశ్యం పిండారీల దండయాత్రను తలపించింది. ఒక హాస్టల్ నిర్వాహకుడి ఇంటిపై దాడిచేసి గృహాన్ని ఛిద్రం చేసి, ఆ పెద్దమనిషిని మోకాళ్లపై కూర్చోబెట్టి కాళ్లు పట్టించుకున్న పైశాచికత్వం భయానకంగా కనిపించింది. రాళ్ల దాడులు, కర్రలతో దాడులు, కత్తులతో దాడులు, కిడ్నాప్లు... ఎన్నెన్ని దృశ్యాలు? వైసీపీకి చెందిన వారి కార్యాలయాలను పెట్రోల్ పోసి తగలబెట్టారు. వాహనాలను తగులబెట్టారు. జెండా దిమ్మెలను సుత్తులతో పగులగొట్టారు. శంకుస్థాపన ఫలకాలను ధ్వంసం చేశారు. గ్రామ సచివాలయాల మీద దాడులు చేశారు. వైఎస్సార్ విగ్రహాలను తొలగించి ఈడ్చుకుంటూ అవమానించారు.వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంపై వైఎస్సార్ అక్షరాలు తొలగించారు. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ల వంటి విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించిన వైఎస్సార్ పేరు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి బాగుంటుందని భావించిన ప్రభుత్వం చట్టసవరణ ద్వారా ఎన్టీఆర్ పేరును మార్చి వైఎస్సార్ పేరు పెట్టారు. బదులుగా విజయవాడ కేంద్రంగా ఏర్పడిన కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టారు. ఒక అల్లరిమూక దాడి చేసి ఇప్పుడా అక్షరాలను తొలగించింది..విశ్వవిద్యాలయాల మీద కూడా దాడులకు తెగబడ్డారు. వీసీలు, రిజిస్ట్రార్లు తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభు త్వం మారితే యూనివర్సిటీ పాలకవర్గాలను కూడా మార్చాలనే ఓ కొత్త ఆచారానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు కనిపిస్తున్నది. నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు రాజీనామాలు చేయడం సంప్రదాయం కానీ, ఇవి నామినేటెడ్ పదవులు కావు. సెర్చ్ కమిటీ సిఫారసుల మేరకు గవర్నర్ చేసిన నియామకాలు. అయినా సరే తమ పార్టీవాడే వీసీగా కూర్చోవాలనే దుందుడుకుతనం ప్రజాస్వామిక పద్ధతులను దెబ్బతీస్తున్నది.భయానక వాతావరణాన్ని కల్పించడం ద్వారా ప్రతిపక్షాలను కట్టడి చేయాలని కొత్త ప్రభుత్వం భావిస్తే అది నెరవేరే అవకాశం ఉండదు. నాలుగు రోజులు ఆలస్యమైనా సరే ఎన్నికల అవకతవకలపై వారు దృష్టి సారించకుండా ఉండరు. నిజానిజాలు తవ్వితీయకుండా ఉండరు. అలాగే కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం జనంతో కలిసి విపక్షాలు కచ్చితంగా ఉద్యమిస్తాయి. కూటమికి లభించిన విజయం సాంకేతికమైనదే. అయినా సరే, ప్రభుత్వాన్ని అదే ఏర్పాటు చేస్తుంది. అడ్డంకులేమీ ఉండవు. చేసిన హామీలను నెరవేర్చి, ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరించితే కొత్త ప్రభుత్వం ప్రజల మన్నన పొందుతుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై ఈసీ స్పందించాలి
సాక్షి, అమరావతి: ఏపీ ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించాలని ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈవీఎంల పనితీరుపై ఉన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. విజయవాడలో ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు శుక్రవారం మాట్లాడుతూ.. ఈవీఎంల పనితీరుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించాలన్నారు.గతంలో ఆయన ఈవీఎంల పనితీరుపై పలు సందేహాలు వ్యక్తంచేశారని, ఈవీఎం చిప్లను ట్యాంపరింగ్ చేసి ప్రజా తీర్పును మార్చి వెయొ్యచ్చని.. అలాగే, ప్రపంచంలో ఎక్కడా ఈవీఎంలను ఉపయోగించడంలేదని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కృష్ణంరాజు గుర్తుచేశారు. ఇప్పుడు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చంద్రబాబు వైఖరి ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.గతంలో చంద్రబాబు సాంకేతిక సలహాదారుడిగా పనిచేసిన వేమూరు హరికృష్ణ ప్రసాద్ తన అమెరికన్ మిత్రులు అలెక్స్ హాల్దార్ మెన్, రాస్గోమ్ గ్రీస్ సహకారంతో ఎన్నికల సంఘం నుంచి దొంగిలించిన ఈవీఎంను బహిరంగంగానే హ్యాక్చేసి చూపించారన్నారు. ఈవీఎం దొంగతనం ఆరోపణపై హరికృష్ణ ప్రసాద్ అరెస్టు కూడా అయ్యారన్నారు. ప్రజాతీర్పు ఏకపక్షంగా, మెజార్టీలు అత్యధికంగా ఉండటంతో ప్రజల్లో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.బాబు విదేశీ పర్యటనపై అనుమానాలు..బెటర్ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ సునీత లక్కంరాజు మాట్లాడుతూ.. స్ట్రాంగ్ రూముల్లో ఉన్న అన్ని ఈవీఎంలను ఒకేసారి హ్యాక్ చేయవచ్చునని కూడా హరికృష్ణ ప్రసాద్ చెప్పారన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు విదేశీ పర్యటనలపై కూడా ప్రజలకు అనేక సందేహాలున్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. ఆంధ్ర అడ్వకేట్ ఫోరం కన్వీనర్ బి.అశోక్కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం వివరణ ఇవ్వకపోతే తమ వద్ద ఉన్న ఆధారాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పౌర సంఘాల ప్రతినిధులు తెలిపారు. -
ఈవీఎంల ట్యాంపరింగ్ అనుమానాలున్నాయ్: కారుమూరి
సాక్షి, పశ్చిమగోదావరి: అన్ని వర్గాలకు మంచి జరిగేలా వైఎస్ జగన్ పాలన చేశారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ గెలవాలని కష్టపడ్డ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.‘‘మంచి కంటే చెడు ఈజీగా ప్రచారం అవుతుంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ని భూతంలా చూపించి దుష్ప్రచారం చేశారు. జగన్ మీ ఆస్తులు తాకట్టు పెట్టేస్తాడంటూ నమ్మించారు. ఇన్ని లక్షలమందికి అన్ని హక్కులతో స్థలాలు ఇచ్చిన జగన్.. మీ ఆస్తులు ఎందుకు లాక్కుంటారు?. ప్రజలు, రైతులకు మంచి జరగాలని తపన పడ్డ మనిషి వైఎస్ జగన్. ఈవీఎంలపై రాష్ట్రమంతటా చర్చలు జరుగుతున్నాయి. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని మాకు అనుమానం ఉంది’’ అని కారుమూరి చెప్పారు.భీమవరంలో ఈవీఎంలను ప్రైవేట్ కారులో తరలిస్తుంటే పట్టుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఒక నియోజకవర్గంలో లక్ష ఎనభై వేల ఓట్లు పొలైతే ముప్పై వేలు అధికంగా కనబడ్డాయి. ఈవీఎంలు ఏదో తేడా జరిగిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటాం’’ అని కారుమూరి పేర్కొన్నారు. -
అఫిడవిట్లో అలసత్వం వద్దు
తాము ఎన్నుకోబోయే అభ్యర్థికి సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవడం ఓటర్ల హక్కుగా ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అందువల్లే పోటీ చేసే అభ్యర్థులు తమ ఆస్తులు, అప్పులు, ఉన్న కేసులు, జైలు జీవితం అనుభవిస్తే ఆ వివరాలు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు, కుటుంబ సభ్యుల వివరాలన్నీ నామినేషన్ సందర్భంగా లిఖితపూర్వకంగా ఎన్నికల అధికారికి తెలపాలని పేర్కొంది. అయితే కొందరు అభ్యర్థులు అఫిడవిట్లో అన్ని వివరాలు తెలపడంలో అవలంబిస్తున్న నిర్లక్ష్యంపై సుప్రీం కోర్టులో కేసు దాఖలైంది. దీనిపై 2013లో న్యాయస్థానం తీర్పును వెలువరించింది. దాని ప్రకారం అఫిడవిట్లో ఏ ఒక్క కాలమ్ను నింప కుండా ఖాళీగా ఉంచవద్దంటూ పేర్కొంది. ఎవరైనా అభ్యర్థి పొరపాటున ఎక్కడైనా ఖాళీగా వదిలేస్తే దాన్ని పూర్తిగా నింపాలంటూ తేల్చి చెప్పింది. ఓటర్ల హక్కు సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సతీమణి వనమా పద్మావతి పేరిట ఉన్న ఇన్నోవా వాహనంపై హైదరాబాద్లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.135 ట్రాఫిక్ చలాన్ పెండింగ్లో ఉంది. ఆయన కుటుంబం పాల్వంచ మున్సిపాలిటీకి రూ.3,120 వాటర్ బిల్లు బకాయి ఉంది. వీటితో పాటు వివిధ ఆస్తులు, తనపై నమోదైన పోలీసు కేసుల వివరాలను 2018 ఎన్నికల్లో నామినేషన్ దాఖలు సందర్భంగా వనమా అఫిడవిట్లో పేర్కొనలేదు. పారదర్శకత పాటించడంలో విఫలమైనందున వనమా ఎన్నికను రద్దు చేయాలంటూ ఆయన ప్రత్యర్థి జలగం వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించి చుక్కలు చూపించారు. చిన్న ట్రాఫిక్ చలానాయే కదా అనే నిర్లక్ష్యం, ప్రజాజీవితంలో ఉన్నోళ్లపై పోలీసు కేసులు సహజమే అనే ఏమరుపాటు ఇబ్బంది తెచ్చి పెట్టగా కేసు ఇంకా సుప్రీంలో కొనసాగుతోంది. ప్రజా జీవితంలో ఉన్నోళ్లు ప్రతీ అంశాన్ని ప్రజలకు తెలియజేయాల్సిందే. ఆస్తులు, అప్పులు, కేసుల వివరాల వెల్లడిలో అలసత్వముంటే ఇబ్బందులు ఎదురవుతాయనేందుకు వనమా ఉదంతం ఉదాహరణగా నిలుస్తోంది. వనమా తరహాలోనే నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో వివరాలను టాంపరింగ్ చేశారనే ఆరోపణలతో మంత్రి శ్రీనివాస్గౌడ్, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి సైతం న్యాయపరమైన చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. పత్రికా ప్రకటనలు అభ్యర్థులు తమపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను ప్రజలకు బహిరంగా తెలపాలనే నిబంధన సైతం 2013 నుంచి అమల్లోకి తెచ్చారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత పోలింగ్కు రెండు రోజుల ముందులోపు స్థానికంగా ఉన్న పేపర్లు/టీవీల్లో ప్రకటనల ద్వారా క్రిమినల్ కేసుల వివరాలను ప్రజలకు తెలపాల్సి ఉంటుంది. అది కూడా ఏ మూలనో కాకుండా ప్రముఖంగా కనిపించేలా మూడు సార్లు ప్రకటనలు ఇవ్వాలి. ఇలా ప్రజలకు అన్ని వివరాలను తెలియజేయకుండా ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టినట్టయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం –1951 ప్రకారం అనర్హతకు గురవుతారు. బీ ఫామ్ అందుకోగానే బీ ఫామ్ అందుకోవడమే ఆలస్యం నామినేషన్ దాఖలు చేయడం, ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడమే తరువాయి అనుకుంటే పొరపాటే. నామినేషన్ సందర్భంగా అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్ (లిఖిత వాంగ్మూలం) విషయంలో జాగ్రత్త పడకపోతే చిక్కులు తప్పవు. అక్కడ రాసే ప్రతీ అక్షరం, పొందు పరిచే ప్రతీ విషయం ఆ అభ్యర్థిని నీడలా వెంటాడుతాయి. ఏమైనా పొరపాట్లు జరిగితే ఎన్నిక రద్దవ్వడమే కాదు తదుపరి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వీలుండదు. -
ఒడిశా రైళ్ల ప్రమాదంపై... సీబీఐ విచారణ
బాలాసోర్/న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేసిన ఒడిశా రైళ్ల ప్రమాదంపై సీబీఐ విచారణ జరిపించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రమాదానికి మూలకారణాన్ని, ఈ ‘నేరపూరిత’ చర్యకు ప్రధాన కారకులను ఇప్పటికే గుర్తించినట్టు ఆదివారం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించిన కాసేపటికే ఈ మేరకు ప్రకటన వెలువడింది. అంతేగాక, ‘‘ప్రమాదం వెనక విద్రోహ కోణాన్నీ తోసిపుచ్చలేం. రైళ్ల ఉనికిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ వాటి గమనాన్ని నిర్దేశించే అతి కీలకమైన ఇంటర్ లాకింగ్ వ్యవస్థను ట్యాంపర్ చేసి ఉండే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం’’ అని రైల్వే వర్గాలు చెప్పుకొచ్చాయి. రైలును ట్రాక్ను మళ్లించే ఎలక్ట్రిక్ పాయింట్, ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సంబంధిత సమస్యే ప్రమాదానికి కారణమని ప్రమాద స్థలి వద్దే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న వైష్ణవ్ భువనేశ్వర్లో మీడియాకు చెప్పారు. ‘‘పూర్తి వివరాల్లోకి నేనిప్పుడే వెళ్లదలచుకోలేదు. అయితే పాయింట్ యంత్రం సెట్టింగ్ను మార్చారు. ఇదెందుకు, ఎలా జరిగిందన్నది విచారణ నివేదికలో వెల్లడవుతుంది’’ అని వివరించారు. మూడు రైళ్ల ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా సీబీఐకి సిఫార్సు చేసినట్టు వెల్లడించారు. విపక్షాలు మాత్రం ఈ విషయంలో కేంద్రంపై దుమ్మెత్తిపోశాయి. ప్రమాదానికి పూర్తి బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి తక్షణం రాజీనామా చేయాల్సిందేనని తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ సహా పలు ఇతర విపక్షాలు రైల్వే మంత్రి రాజీనామాకు డిమాండ్ చేశాయి. మంత్రుల స్థాయి నుంచి కింది దాకా బాధ్యులందరినీ గుర్తించి కఠినాతి కఠినంగా శిక్షించి తీరాల్సిందేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేతలు రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. మోదీ సర్కారు మీడియా పిచ్చి, పీఆర్ గిమ్మిక్కులు ప్రభుత్వ వ్యవస్థను చేతగానిదిగా మార్చేశాయమంటూ ఖర్గే తూర్పారబట్టారు. యూపీఏ హయాంలో రైల్వే మంత్రుల పనితీరు ఎంత ఘోరంగా ఉండేదో కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలంటూ బీజేపీ ఎదురుదాడికి దిగింది. మహా విపత్తును కూడా రాజకీయం చేయడం దారుణమని మండిపడింది. ప్రమాదంలో మరణించిన వారి తుది సంఖ్యను 288 నుంచి 275గా రైల్వే శాఖ ఆదివారం సవరించింది. విద్రోహ కోణంపై రైల్వే ఏం చెప్పిందంటే... పాయింట్ మెషీన్, ఇంటర్ లాకింగ్ వ్యవస్థ పూర్తిగా సురక్షితమని రైల్వే వర్గాలు వివరించాయి. ‘‘అదెంత సురక్షితమంటే ఒకవేళ అది పూర్తిగా విఫలమైనా సిగ్నళ్లన్నీ వెంటనే రెడ్కు మారి రైళ్ల రాకపోకలన్నీ తక్షణం నిలిచిపోతాయి. అయినా సిగ్నలింగ్ సమస్యే ప్రమాదానికి కారణమైంది గనుక బయటి శక్తుల ప్రమేయాన్ని తోసిపుచ్చలేం. కేబుళ్లను చూసుకోకుండా ఎవరైనా తవ్వేయడంతో తెగిపోయి ఉండొచ్చు’’ అని రైల్వే బోర్డు సభ్యురాలు జయా వర్మ సిన్హా వివరించారు. ప్రమాదానికి మితిమీరిన వేగం, డ్రైవర్ల తప్పిదం కారణం కావని రైల్వే వర్గాలు స్పష్టం చేశాయి. లోపలి, లేదా బయటివ్యక్తులు విద్రోహానికి పాల్పడే అవకాశాన్నీ తోసిపుచ్చలేమని రైల్వే అధికారి ఒకరన్నారు. టికెట్ లేని వారికీ పరిహారం షాలిమార్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ శుక్రవారం రాత్రి ఒడిశాలోని బహనగా బజార్ స్టేషన్ సమీపంలో లూప్లైన్లోకి దూసుకెళ్లి ఆగున్న గూడ్సును ఢీకొని పట్టాలు తప్పడం, పక్క ట్రాక్పై పడ్డ బోగీలను ఢీకొని బెంగళూరు–హౌరా ఎక్స్ప్రెస్ కూడా పట్టాలు తప్పడం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో గాయపడ్డ 1,175 మందిలో వందలాది మంది ఇంకా పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రెండు రైళ్లలో చాలావరకు వలస కార్మికులే ఉన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్డు గత ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని టికెట్ లేని ప్రయాణికులకు కూడా పరిహారం అందించనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. మరోవైపు సహాయ చర్యలతో పాటు ట్రాక్ల పునరుద్ధరణ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. తూర్పు, దక్షిణ భారతాలను కలిపే ఈ కీలక రైల్వే లైన్లో పూర్తిగా దెబ్బ తిన్న ట్రాకుల్లో ఇప్పటిదాకా రెండింటిని పునరుద్ధరించారు. ప్రమాదంపై సుప్రీంలో పిల్ సాక్షి, న్యూఢిల్లీ: ఒడిశాలో రైలు ప్రమాదంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి సారథ్యంలో విచారణకు కేంద్రాన్ని ఆదేశించాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో పిల్ దాఖలైంది. రైల్వే వ్యవస్థలో ప్రమాద, భద్రత పరామితులను కమిటీ విశ్లేషించి, వాటి బలోపేతానికి సలహాలు, సూచనలిచ్చేలా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ విశాల్ తివారీ కోరారు. కవచ్ వ్యవస్థను వెంటనే అమలు చేసేలా మార్గదర్శకాలివ్వాలన్నారు. -
AP: విద్యార్థుల కోసం మరో 6 లక్షల ట్యాబ్లు
సాక్షి, అమరావతి: కొత్త విద్యా సంవత్సరం (2023–24)లో 8వ తరగతిలోకి వచ్చే విద్యార్థుల కోసం కొత్తగా 6 లక్షల ట్యాబ్లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులందరికీ ట్యాబ్లు ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్టు తెలిసింది. ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లో 8వ తరగతి విద్యార్థులతోపాటు సుమారు 75 వేల మంది ఉపాధ్యాయులకు 5,18,740 ట్యాబ్లను ఉచితంగా అందించింది. 8, 9 తరగతుల విద్యార్థులకు అవసరమైన పాఠ్యాంశాలకు సంబంధించి సుమారు రూ.25 వేల ఖరీదు చేసే బైజూస్ కంటెంట్తో ట్యాబ్లను అందించింది. సమస్య వస్తే మూడు రోజుల్లో పరిష్కారం గత ఏడాది విద్యార్థులకు ఇచ్చి న ట్యాబ్ల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని అందుబాటులోకి తెచ్చి ంది. ట్యాబ్లలో తలెత్తే సాంకేతిక సమస్యలను గరిష్టంగా మూడు రోజుల్లో పరిష్కరించేలా ఏర్పాట్లు చేసింది. ట్యాబ్ల వినియోగంలో తలెత్తే సాఫ్ట్వేర్ సమస్యలు పరిష్కరించేలా ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇచ్చి ంది. అయితే, హార్డ్వేర్ సమస్యలు వస్తే ట్యాబ్లను స్థానిక వార్డు, గ్రామ సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ ద్వారా పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విద్యార్థి లేదా వారి తల్లిదండ్రులు ట్యాబ్ను డిజిటల్ అసిస్టెంట్కు అందజేసి సమస్యను వివరిస్తే ఫోన్ నంబర్, ట్యాబ్ ఈఎంఐఈ నంబర్ ఆధారంగా ఆన్లైన్లో నమోదు చేస్తారు. అయితే, వివరాల నమోదు, ఆన్లైన్లో ఉండటంతో చదువుకోలేని తల్లిదండ్రులు రసీదులు పొందడంలో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికోసం మాన్యువల్గా రశీదులు ఇవ్వనున్నారు. మరమ్మతుకు గురైన ట్యాబ్లను రాష్ట్రంలోని 145 శాంసంగ్ సర్వీస్ సెంటర్లలో గరిష్టంగా 3 రోజుల్లో మరమ్మతు చేయించి అందించనున్నారు. ట్యాంపర్ చేస్తే ఐటీ సెల్కు అలర్ట్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్లు ప్రత్యేకంగా రూపొందించింది. ఈ ట్యాబ్ల్లో కంటెంట్ ఇంటర్నెట్ లేకుండానే వినియోగించుకోవచ్చు. సబ్జెక్టుల వారీగా ఉన్న పాఠ్యాంశాలను విద్యార్థి ఎన్ని గంటలు చూశారు, ఏ సబ్జెక్టు కోసం ఎక్కువ సమయం కేటాయించారో అందులో నమోదవుతుంది. ట్యాబ్స్ను నెట్(వైఫై)కు అనుసంధానం చేయగానే మొత్తం వివరాలు స్టేట్ ఐటీ సెల్కు చేరుతాయి. విద్యార్థులు ట్యాబ్లను ఎలా వినియోగిస్తున్నారో తెలుసుకునేందుకు విశాఖపట్నంలో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్ను రాష్ట్ర ప్రభుత్వం గురువారం అందుబాటులోకి తెచ్చి ంది. ఇక్కడ ఉన్న సిబ్బంది ప్రతి విద్యార్థికి ఇచ్చి న ట్యాబ్ను ఎలా వాడుతున్నారో గుర్తిస్తారు. మరోవైపు ట్యాబ్లను ట్యాంపరింగ్ చేసే వీలు లేకుండా సాంకేతికపరంగా కట్టడి చేశారు. విద్యార్థికి ఇచ్చిన ట్యాబ్లోని కంటెంట్ తొలగించేందుకు యతి్నంచినా, కొత్తగా మార్పులు చేసినా ఆటోమేటిక్గా ట్యాబ్ లాక్ అయిపోతుంది. వెంటనే ఏ జిల్లాలో, ఏ పాఠశాలలోని విద్యార్థి ఈ పని చేశారో ఐడీ నంబర్తో సహా ఇబ్రహీంపట్నంలోని స్టేట్ ఐటీ సెల్కు, విశాఖలోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు ఆ వివరాలు వెళ్లిపోతాయి. అనంతరం కారణం తెలుసుకుని, మొబైల్ డివైజ్ మేనేజ్మెంట్ (ఎండీఎం) సిస్టంతో పాటు గూగుల్ అథెంటికేషన్ ఓటీపీ ద్వారా జిల్లా నోడల్ అధికారి అన్లాక్ చేస్తారు. -
ఇంటర్ బోర్డు భద్రత వ్యవస్థ ట్యాంపర్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ బోర్డులో భద్రత వ్యవస్థ ట్యాంపరింగ్కు గురైందని, కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశారని బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ వెల్లడించారు. బోర్డులో అత్యంత కీలకమైన సీసీ కెమెరా లకు సంబంధించిన పాస్వర్డ్ చోరీ అయిందని తెలియడంతో అప్రమత్తమైనట్టు తెలిపారు. ఈ విషయం గుర్తించిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దీని వెనుక సూత్రధా రులెవరో, ఏ అవసరాల కోసం ఈ కుట్రకు పాల్పడ్డారో దర్యాప్తులో తేలుతుందన్నారు. నేర చరిత్ర ఉన్న ఓ వ్యక్తి బోర్డు అధికారిని బెదిరించి, భయపెట్టి పాస్వర్డ్ను తస్కరించినట్టు ప్రాథమికంగా తెలిసిందన్నారు. దీనిపై శాఖాపరమైన విచారణకు ఆదేశాలిచ్చినట్టు మిత్తల్ వెల్లడించారు. ఆన్లైన్ మూల్యాంకనం పూర్తి పారదర్శకం అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే ఈ ఏడాది నుంచి ఇంటర్ సమా ధాన పత్రాల ఆన్లైన్ మూల్యాంకనం చేపడుతున్నట్లు మిత్తల్ తెలిపారు. దీనివల్ల మూల్యాంకనం పారదర్శకంగా ఉండటంతోపాటు తప్పుల నివారణ సాధ్య మవుతుందని తెలిపారు. గతంలో విద్యార్థి రీవ్యాల్యూయేషన్ కోరితే జిల్లాల నుంచి పేపర్లు తెప్పించడంలో తీవ్ర జాప్యం జరిగేదని, ఇప్పుడు ఆన్లైన్ చేయడం వల్ల వేగవంతంగా పూర్తవుతుందని చెప్పారు. పేపర్లు దిద్దేవారికి ఇచ్చే టీఏ, డీఏ ఖర్చునూ నివారించవచ్చన్నారు. ఇప్పటికే అన్ని దేశాలూ, విశ్వవిద్యా లయాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయని, ఆన్లైన్ మూల్యాంకనం కోసం అధ్యాపకు లకు అవసరమైన శిక్షణ కూడా ఇస్తామని వివరించారు. ఈ ఏడాది ప్రయోగాత్మ కంగా ఆర్ట్స్, కామర్స్, లాంగ్వేజ్లకు సంబంధించిన 35 లక్షల పేపర్లను ఆన్లైన్ ద్వారా వ్యాల్యుయేషన్ చేస్తున్నామని, రెండేళ్లలో ఈ విధానాన్ని పూర్తిగా విస్తరిస్తా మన్నారు. గతంలో జరిగిన విధానంలో ప్రైవేటు కాలేజీలు సమాధాన పత్రాలు ఎక్కడకు వెళ్తున్నాయో తెలుసుకుని వారికి అనుకూలమైన విధానాలు అనుసరించారనే ఆరోపణలున్నాయని, ఇలాంటివి ఇప్పుడు సాగవనే ఉద్దేశంతో ఏసీబీ కేసులున్న ఓ వ్యక్తి పనిగట్టుకుని బోర్డు ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడని మిత్తల్ చెప్పారు. -
ధరణి పోర్టల్ ట్యాంపరింగ్.. మీసేవ ఆపరేటర్ల హస్తం!
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కాగా, అక్రమార్కులు ధరణి పోర్టల్ను ట్యాంపరింగ్ చేశారు. పాసు పుస్తకం ఉన్నప్పటికీ పెండింగ్ మ్యుటేషన్గా మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ఈ అక్రమాల్లో మీసేవ ఆపరేటర్ల హస్తం కూడా ఉంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నాతాధికారులు విచారణ ప్రారంభించారు. ఇది కూడా చదవండి: డీజీపీనీ వదలని సైబర్ నేరగాళ్లు -
మెడికల్ కౌన్సిల్’ కేసులో ముగ్గురి అరెస్ట్
సాక్షి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) డేటాబేస్ ట్యాంపరింగ్ చేసి, అనర్హులకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ చేసిన వ్యవహారంలో సీనియర్ అసిస్టెంట్ కందుకూరి అనంతకుమార్ సూత్రధారిగా తేలింది. చైనాలో మెడిసిన్ పూర్తి చేసిన వారు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) పరీక్ష పాస్ అయితేనే రిజిస్ట్రేషన్కు ఆస్కారం ఉంటుందని, పాస్ కాని వారి నుంచి రూ.9 లక్షల చొప్పున వసూలు చేసిన కుమార్ సర్టిఫికెట్లు జారీ చేశాడని అదనపు సీపీ (నేరాలు) ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. జేసీపీ డాక్టర్ గజరావ్ భూపాల్, ఓఎస్డీ పి.రాధాకిషన్రావులతో కలిసి గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇబ్రహీంపట్నానికి చెందిన కసరమోని శివానంద్, కర్మన్ఘాట్ వాసి తోట దిలీప్ కుమార్ స్నేహితులు. వీరు చైనాలో ఎంబీబీఎస్ చదివారు. 2012లో సర్టిఫికెట్ పొంది తిరిగి వచ్చారు. ఇలా విదేశాల్లో వైద్య విద్యనభ్యసించిన వారు ఇక్కడ ప్రాక్టీసు చేయాలంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) ఉత్తీర్ణులు కావాలి. అత్యంత కఠినంగా ఉండే ఈ పరీక్షను ఎంసీఐ ఆరు నెలలకు ఒకసారి నిర్వహిస్తుంది. ఈ ద్వయం 2012–14 మధ్య రెండుసార్లు పరీక్షకు హాజరైనా ఉత్తీర్ణులు కాలేదు. పాస్ అయితే కానీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగదు. దీంతో వీళ్లిద్దరూ ‘ప్రత్యామ్నాయ మార్గాలు’ అన్వేషించారు. వీరికి ఓ స్నేహితుడు (ప్రస్తుతం దుబాయ్లో) ద్వారా టీఎస్ఎంసీలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న అనంతకుమార్తో పరిచయమైంది. 2017లో అతడిని కలిసి తమ అవసరాన్ని చెప్పారు. దీంతో ఒక్కొక్కరి నుంచి రూ.9 లక్షల చొప్పున వసూలు చేసిన అనంతకుమార్ 2016లో రిజిస్టర్ చేసుకున్న వైద్యుల రిజిస్ట్రేషన్ నంబర్లు వీరికి కేటాయించాడు. ఈ మేరకు టీఎస్ఎంసీ డేటాబేస్లో మార్పుచేర్పులు చేసి, వీరిద్దరికీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అందించాడు. ఇటీవల అసలు వైద్యులు రెన్యువల్, అర్హతలు అప్డేట్ కోసం టీఎస్ఎంసీకి రావడంతో విషయం తెలిసింది. టీఎస్ఎంసీ ఫిర్యాదు మేరకు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుల కోసం నార్త్జోన్ టాస్క్ఫోర్స్ రంగంలోకి దిగింది. ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలోని టీమ్ ముగ్గురు నిందితులను అరెస్టు చేసి నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకుంది. వీరి వద్ద నకిలీ టీఎస్ఎంసీ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ... ఎంసీఐ సర్వర్లో మాత్రం ఎంటర్ కాలేదు. దీంతో అందులో అసలు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వివరాలే కనిపిస్తున్నాయి. చిక్కుతామని భయపడిన వీరు ప్రాక్టీసు చేయకుండా వైద్య సంబంధ ఉద్యోగాలు చేస్తున్నారు. అనంతకుమార్ వీరిద్దరితో పాటు శ్రీనివాస్, నాగమణిలకు ఈ తరహాలో సహకరించినట్లు అనుమానాలున్నాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న వారి వివరాలు ఆరా తీస్తున్నామన్నారు. శివానందం 2012–16 మధ్య, దిలీప్ 2016 –18 మధ్య సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో డ్యూ టీ డాక్టర్లుగా పని చేశారు. టీఎస్ఎంసీ సర్టిఫికెట్ లేని శివానందంకు ఉద్యోగం ఎలా వచ్చిందనేది ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం వీరిలో ఒకరు మెడికల్ కంపెనీలో, మరొకరు వైద్యులకు అసిస్టెంట్గా పని చేస్తున్నారు. (చదవండి: తమ్ముడి ఇంట్లో తుపాకీ పెట్టాడు!) -
కటకటాల్లోకి కల్లాడ వీఆర్ఏ..
నందిగాం(శ్రీకాకుళం జిల్లా): రెవెన్యూ రికార్డుల తారుమారు కేసులో కల్లాడ పంచాయతీ వీఆర్ఏని అరెస్టు చేశామని ఎస్సై ఎస్.బాలరాజు బుధవారం తెలిపారు. తప్పుడు రికార్డులు సృష్టించి సుమారు 30 ఎకరాల లేని భూమి ఉన్నట్లుగా చేసి అమాయకులకు అమ్మజూపి వారి నుంచి లక్షలాది రూపాయలు దోచుకున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు మదన్గౌడ్కు వీఆర్ఏ కొత్తపల్లి ఢిల్లేశ్వరరావు సహకరించినట్టు తేలింది. కంప్యూటర్ పరిజ్ఞానంతో రెవెన్యూ కార్యాలయంలో తిష్ట వేసిన ఢిల్లేశ్వరరావు రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి మదన్గౌడ్కు సహాయం చేశాడని, అందుకు ప్రతిఫలంగా రూ.1.25 లక్షలు పుచ్చకున్నాడని పక్కా ఆ«ధారాలు సేకరించడంతో అరెస్టు చేసి జైలుకు పంపించామని ఎస్సై పేర్కొన్నారు. నందిగాం తహసీల్దారు కార్యాలయంలో అవుట్సోర్సింగ్లో పద్ధతిలో కంప్యూటర్ ఆపరేటర్ పని చేసేవారు. అయితే కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వీఆర్ఏ ఢిల్లేశ్వరరావును గతంలో అధికారులు నియామకం చేశారు. ఇదే అదునుగా ప్రతి చిన్న పనికీ లంచం తీసుకోవడానికి అలవాటు పడిన ఆయన టీడీపీ నాయకులకు పూర్తి సహాయసహకారాలు అందిస్తుండేవాడని తెలిసింది. రెవెన్యూ రికార్డుల వ్యవహారంలో ప్రతి చిన్న పనికి తహసీల్దారు డిజిటల్ సంతకం అవసరం కావడంతో దానికి సంబంధించిన ‘కీ’ని అప్పుడప్పుడూ ఢిల్లేశ్వరరావు వినియోగించేవాడు. అయితే ఇదే అదునుగా భావించిన మదన్గౌడ్ ఢిల్లేశ్వరరావు ద్వారా మండలంలోని పలుచోట్ల రెవెన్యూ రికార్డులను తారుమారు చేసేందుకు రూ.1.25 లక్షలు ముట్టజెప్పాడు. అయితే భూముల కోనుగోలు చేసిన హైదారాబాద్కు చెందిన వ్యక్తికి అనుమానం రావడంతో కార్యాలయానికి వెళ్లి ఆరా తీయడంతో రికార్డుల తారుమారు వ్యవహారం జూలైలో బయటకు వచ్చింది. అంతేకాక బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నందిగాం పోలీసులు గతంలో ప్రధాన నిందితుడు మదన్గౌడ్ను అరెస్టు చేశారు. రికార్డుల తారుమారులో తహసీల్దారు కార్యాలయ సిబ్బంది పాత్రపై అనుమానం ఉన్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టగా వీఆర్ఏ ఢిల్లేశ్వరరావుపై అనుమానం వచ్చి ఆరా తీయగా నిజాలు బయటకు వచ్చాయి. దీంతో మదన్గౌడ్ నుంచి పుచ్చుకున్న రూ.1.25 లక్షల్లో పోలీసులు రూ.లక్ష రికవరీ చేయడంతో పాటు ఢిల్లేశ్వరరావును అరెస్టు చేసి నరసన్నపేట సబ్జైల్కు పంపించారు. రెవెన్యూ రికార్డుల తారుమారు వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. -
మాస్క్ పెట్టి మస్కా కొట్టాలని చూస్తే..
సాక్షి, హైదరాబాద్: నగరంలో సంచరిస్తున్న ఉల్లంఘనులు నానాటికీ రెచ్చిపోతున్నారు. నిఘా నేత్రాలకు తమ నెంబర్ ప్లేట్లు చిక్కకుండా ఉండేందుకు వాటిని ‘కవర్’ చేస్తున్నారు. మాస్క్లతో సహా కొన్నింటితో మూసేయడం, వంచేయడం, విరిచేయడం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి ఉల్లంఘనులపై ట్రాఫిక్ పోలీసులు మోటారు వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు విధిస్తూ వచ్చారు. అయితే ఈ తరహా ఉల్లంఘనుల్లో మార్పురాకపోవడం, నేరగాళ్ళు సైతం ఇదే బాటపట్టడంతో ట్రాఫిక్ కాప్స్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా నెంబర్ ప్లేట్స్ ‘కవరింగ్’కు పాల్పడిన వారిని పట్టుకుని శాంతిభద్రతల విభాగానికి అప్పగిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులే ఫిర్యాదు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తున్నారు. శుక్రవారం ఈ తరహా నేరం చేసి పంజగుట్టలో చిక్కిన చంద్రాయణగుట్ట యువకుడిపై చీటింగ్ కేసు నమోదైంది.(నెంబర్ప్లేట్ కనిపించకుండా ట్యాంపరింగ్..) ఈ–చలాన్ తప్పించుకోవడానికే... సిటీ ప్రధానంగా ఈ నెంబర్ ప్లేట్ల కవరింగ్ అనేక ఈ–చలాన్లను తప్పించుకోవడానికే చేస్తున్నారని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం నగరంలో పూర్తి స్థాయి నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానాలు అమలవుతున్నాయి. అంటే... ఒకప్పుడు మాదిరిగా రహదారులపై ఉండే ట్రాఫిక్ పోలీసులు ఉల్లంఘనుల్ని పట్టుకున్నప్పుడు వారికి స్పాట్లో చలాన్ విధించడం, జరిమానా వసూలు చేయడం జరగట్లేదు. కేవలం క్షేత్రస్థాయి సిబ్బంది తమ చేతిలో ఉన్న డిజిటల్ కెమెరాలతో ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాల ఫొటోలను నెంబర్ ప్లేట్స్తో సహా చిత్రీకరిస్తున్నారు. వీటితో పాటు సీసీ కెమెరాల ద్వారా సేకరించిన ఫొటోల ఆధారంగా కమాండ్ అండ్ కంట్రోల్ సిబ్బంది ఉల్లంఘనులకు ఈ–చలాన్లు జారీ చేస్తున్నారు. ఈ విధానంలో వాహనాల నెంబర్, దాని ఆధారంగా సేకరించే చిరునామా కీలకం. తమ వాహనాలకు సంబంధించిన నెంబర్ ప్లేట్లను వి విధ రకాలుగా కవర్ చేయడం, వంచేయడం, విరిచే యడం చేస్తున్న వాహనచోదకులు వాటి రిజిస్ట్రేషన్ నెంబర్లు ట్రాఫిక్ కెమెరాలకు చిక్కుకుండా తప్పించుకుంటున్నారు. దీన్ని అదునుగా భావించి కొందరు నేరగాళ్ళు సైతం నెంబర్ ప్లేట్లు లేకుండా, వాటిని కవర్ చేసి తమ పని పూర్తి చేసుకుపోతున్నారు. గత నెల 31న అబిడ్స్ పరిధిలో సెల్ఫోన్ స్నాచింగ్కు పాల్పడిన ఓ స్నాచర్ ఈ తరహాలోనే నే రం చేశాడు. ఇలా జరిగిన కొన్ని నేరాలను కొలిక్కి తేవడాని కి పోలీసులు అనేక వ్యయప్రయాసలకు ఓర్చాల్సి వస్తోంది. వెనుక వాటి మూసివేతలే ఎక్కువ... వాహనాల నెంబర్ ప్లేట్స్ ఎదుటి వారికి, సీసీ కెమెరాలకు చిక్కకుండా కవర్ చేయడం అనేది తేలికపాటి వాహనాల కంటే ద్విచక్ర వాహనాలకే ఎక్కువగా కనిపిస్తోందని అధికారులు చెప్తున్నారు. రోడ్లపై ఈ తరహా నెంబర్ ప్లేట్ను పోలీసులు గుర్తించి ఆపడానికి ప్రయత్నిస్తే బైక్స్ మాదిరిగా తేలికపాటి వాహనాలు తప్పించుకునిపోలేవు. ఈ నేపథ్యంలోనే వీళ్ళు ఆ తరహా చర్యల జోలికి వెళ్ళట్లేదని ట్రాఫిక్ కాప్స్ అంటున్నారు. ద్విచక్ర వాహనాల్లోనూ 90 శాతం వెనుక వైపు నెంబర్ ప్లేట్కే రూపురేఖలు లేకుండా చేస్తున్నారు. సాధారణంగా ఉల్లంఘనల్ని వాహనం వెనుక నుంచే ఫొటోలు తీస్తుండటంతోనే ఈ చర్యలకు పాల్పడుతున్నారు. ఇర్రెగ్యులర్/ఇంప్రాపర్ నెంబర్ ప్లేట్ ఉల్లంఘనగా పిలిచే వీటిపై ఇప్పటికే ట్రాఫిక్ విభాగం అధికారులు అనేకసార్లు స్పెషల్డ్రైవ్స్ చేశారు. అయినప్పటికీ వాహనచోదకుల్లో పూర్తి స్థాయి మార్పు రాలేదు. దీంతో ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఉల్లంఘలకు పాల్పడిన వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయడం మొదలెట్టారు. మాస్క్ పెట్టి మస్కా కొట్టాలని... పాతబస్తీలోని చంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన మహ్మద్ జహూరుద్దీన్ గురువారం తన ద్విచక్ర వాహనంపై పంజగుట్టకు వచ్చాడు. తన రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపింకుండా వెనుక నెంబర్ ప్లేట్కు ఫేస్ మాస్క్ తగిలించేసిన ఇతగాడు పంజగుట్ట వైపు నుంచి వీవీ స్టాట్యూ వైపు దూసుకుపోతున్నాడు. ఈ విషయం గమనించిన ట్రాఫిక్ పోలీసులు ఆపి ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో ఇతగాడు ఉద్దేశపూర్వకంగానే నెంబర్ ప్లేట్ కవర్ చేసినట్లు నిర్థారించి స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించారు. ఆ అధికారులు ఇతడిపై మోసం ఆరోపణలపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎవరైనా నగరవాసులు ఇలాంటి నెంబర్ ప్లేట్లతో కూడిన వాహనాలను గుర్తిస్తే ఆ ఫొటోలు తీసి పోలీసు అధికారిక వాట్సాప్ నెంబర్ 9490616555కు పంపాలని కోరుతున్నారు. -
అతనిపై 4 మ్యాచ్లు... మీపై 12 నెలలా?
బ్రిస్బేన్: ఇటీవల అఫ్గానిస్తాన్తో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ స్టార్ ఆటగాడు నికోలస్ పూరన్ బాల్ ట్యాంపరింగ్కు పాల్పడటంతో అతనిపై నాలుగు టీ20 మ్యాచ్ల నిషేధ పడింది. అయితే ఇదే తరహాలో ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ బాల్ ట్యాంపరింగ్కు పాల్పడటంతో ఏడాది నిషేధం ఎదుర్కొన్నాడు. ఇక డేవిడ్ వార్నర్ సైతం ట్యాంపరింగ్లో భాగం కావడంతో అతనిపై కూడా 12 నెలలు సస్పెన్షన్ పడగా, బెన్క్రాఫ్పై 9 నెలల నిషేధం విధించారు. అయితే పూరన్కు ఎందుకు స్వల్ప శిక్ష పడిందని స్టీవ్ స్మిత్ను అడగ్గా.. అలా అతనికి తక్కువ నిషేధం పడితే తనకేమిటి సంబంధం అని ఎదురు ప్రశ్నించాడు. అతనికి ఓ మోస్తరు శిక్ష వేయడంతో తనకు వచ్చిన ఇబ్బందేమీ లేదన్నాడు. ‘ ప్రతీ ఒక్కరూ డిఫరెంట్.. ప్రతీ బోర్డు డిఫరెంట్. అక్కడ చాలా విషయాలు మిళితమై ఉంటాయి. నాకు కఠినమైన శిక్ష పడిందని నేనేమీ ఫీల్ కావడం లేదు. అది గతం. నేను గతం నుంచి ప్రస్తుతానికి వచ్చా. ఇప్పుడు వర్తమానంపై దృష్టి సారిస్తున్నా. నాకు నికోలస్ తెలుసు. అతనితో చాలా క్రికెట్ ఆడిన అనుబంధం ఉంది. అతనొక టాలెంట్ ఉన్న క్రికెటర్. పూరన్కు మంచి భవిష్యత్తు ఉంది. అతను చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటాడు’ అని స్మిత్ పేర్కొన్నాడు. లక్నోలో అఫ్గానిస్తాన్తో జరిగిన మూడో వన్డేలో అతను బాల్ ట్యాంపరింగ్కు పాల్పడినట్లు తేలడంతో ఐసీసీ అతనిపై నాలుగు మ్యాచ్ల నిషేధాన్ని విధించింది. బంతి ఆకారాన్ని మార్చినట్లు పూరన్ అంగీకరించడంతో క్షమాపణలు కూడా కోరాడు. సస్పెన్షన్ కారణంగా విండీస్ ఆటగాడు తదుపరి నాలుగు టి20 మ్యాచ్లకు దూరమయ్యాడు. ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళిలోని లెవెల్–3 నిబంధనను అతిక్రమించడంతో ఆరి్టకల్ 2.14 ప్రకారం నాలుగు సస్పెన్షన్ పాయింట్లను విధించామని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. -
బాల్ ట్యాంపరింగ్ ఇలా చేసే వాడిని..!
లండన్: తాను క్రికెట్ ఆడే సమయంలో బాల్ ట్యాంపరింగ్ చేసే వాడినంటూ ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ సంచలన విషయాలు వెల్లడించాడు. ఇందుకు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు నుంచి పూర్తిగా మద్దతు ఉండేందంటూ కొత్త వివాదానికి తెరలేపాడు. 2006-13 మధ్య కాలంలో ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన పనేసర్.. ట్యాంపరింగ్ చేయడానికి సన్ స్ర్కీన్ లోషన్స్తో పాటు తన ప్యాంటుకు ఉన్న జిప్ను ఉపయోగించే వాడినన్నాడు. కొన్ని సమయాల్లో చూయింగ్ మింట్లతో కూడా బంతి ఆకారాన్ని చెడగొట్టడానికి యత్నించేవాడినన్నాడు. ఈ విషయాల్నితన రాసిన ‘ ద ఫుల్ మోంటీ’ పుస్తకం ద్వారా బయటపెట్టాడు. సాధ్యమైనంత వరకూ బంతిని పొడి బారేలే చేయడానికి ఈ విధానాల్ని ఉపయోగించే వాడినని, తాను బంతి ఆకారాన్ని ఎలా దెబ్బతీయాలనే విషయంలో పేసర్ జేమ్స్ అండర్సన్ సహకరించే వాడన్నాడు. ఇలా తాను చేసిన తర్వాత బంతి రివర్స్ స్వింగ్కు తోడ్పటమే ప్రధాన కారణంగా చెప్పుకొచ్చాడు. ఆపై అండర్సన్ తరహా పేసర్లకు బంతి నుంచి రివర్స్ స్వింగ్ లభించేదంటూ పనేసర్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్ తరఫున 50 టెస్టు మ్యాచ్లు ఆడిన పనేసర్ 167 వికెట్లు సాధించగా, 26 వన్డేలకు గాను 24 వికెట్లు మాత్రమే తీశాడు. క్రికెట్ లా మేకర్ ఎంసీసీ నిబంధనల ప్రకారం బంతి ఆకారాన్ని కావాలని దెబ్బ తీయడం నేరం. ఐసీసీ 42.3 నియమావళి ప్రకారం ఇలా ఎవరైనా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ తాజా వివాదంపై ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి. -
ఈవీఎంలను హ్యాక్ చేయలేం!
సాక్షి, హైదరాబాద్: ఈవీఎంలను హ్యాకింగ్/ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని ఐటీ నిపుణుడు సందీప్ రెడ్డి స్పష్టం చేశారు. కొందరు కావాలనే పనికట్టుకుని ఈవీఎంలపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎం)ను డీ–కోడ్ చేయడం కష్టతరమని, వీటిలో ఎలాంటి డివైజ్ డ్రైవర్స్ను ఇన్స్టాల్ చేయలేరని సందీప్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల సంఘం వివిధ దశల్లో ఈవీఎంల సెక్యూరిటీని పరిశీలించిన తర్వాతే వినియోగిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ‘కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు ముఖ్యమైన వ్యక్తులు.. అభద్రతాభావంతో ఈవీఎంలపై దుష్ప్రచారం చేస్తున్నారు. నేనో ఎంబేడెడ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా క్రిప్టాలజీ, ఎన్క్రిప్టింగ్ మీద 15ఏళ్లుగా పనిచేస్తున్నాను. నా అనుభవం ద్వారా తెలుసుకున్న వాస్తవాలను యావదాంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. ప్రభుత్వ పెద్దలు ఆరోపణలు చేస్తున్నట్లుగా ఓ ఈవీఎంను ట్యాంపర్ చేయాలంటే దానికి హార్డ్వేర్, కమ్యూనికేషన్ రేడియోస్, సపోర్టింగ్ సాఫ్ట్వేర్ కీలకం. ఒకవేళ ఈవీఎంని నెట్వర్క్ వీడియోస్తో అనుసంధానం చేయాలంటే చాలా ఖరీదైన పని. ఈవీఎంలలో ఎలాంటి డివైజ్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయలేరు. ఒకసారి ఫర్మ్వేర్ కంపైల్ చేసిన తర్వాత ఈవీఎంపైన ఫ్లాష్చేస్తే.. రెండోసారి రీ–ఫ్లాష్చేసే అవకాశం ఉండదు. అదే విధంగా బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ యూనిట్ మధ్య జరిగే కమ్యూనికేషన్ ప్రొపరేటరీ సెక్యూర్ ప్రొటోకాల్ ద్వారానే జరుగుతుంది. ఏజెంట్ సమక్షంలో సమక్షంలో బ్యాటరీ స్విచాఫ్ చేస్తారు. దీంతో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా కట్ అయిపోతుంది. దీంతో అటోమెటిక్గా ఈవీఎంలో మెమరీ అలాగే ఉన్నప్పటికీ.. బయటి వారు యాక్సెస్ చేసేందుకు వీలుండదు. ఈవీఎంలను హ్యాక్ చేయాలని ప్రయత్నించి చాలా మంది విఫలమయ్యారు’అని సందీప్ రెడ్డి వెల్లడించారు. మన ఈవీఎంలను చాలా దేశాల్లో వినియోగిస్తున్నారని.. కానీ కావాలనే కొందరు మన దేశంలో దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి వారిపై కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ఓ హ్యాకర్ ఈవీఎంలను హ్యాక్ చేస్తానంటూ సవాల్ విసిరి భంగపడ్డారని సందీప్ తెలిపారు. ఈ ఏడాది కూడా సయ్యద్ షుజా అనే వ్యక్తి యూకే నుంచి ఈవీఎంలను హాక్ చేస్తానని, గతంలో తాను ఈసీఐఎల్లో పనిచేస్తున్న సమయంలో హ్యాకింగ్ చేశానని చెప్పుకున్నారు. దీంతో మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్, మరికొందరు మీడియా, రాజకీయ ప్రముఖులు లండన్ వెళ్లొచ్చారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం అవాస్తవమని వారు తెలుసుకున్న విషయాన్ని కూడా సందీప్ రెడ్డి గుర్తుచేశారు. వీవీప్యాట్కు, బ్యాలెట్ యూనిట్కు మధ్య మార్పు జరిగే సమయంలో ట్యాంపర్ (మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్) జరుగుతుందంటూ కొందరు చేస్తున్న వాదన అర్థరహితం అన్నారు. ఏపీ ఎన్నికల సమయంలో 36 చోట్ల ఈవీఎంలు మోరాయించాయని.. అది కూడా ఆపరేటర్ అసమర్థత ద్వారానే జరిగిందన్నారు. ఇందులో ఈవీఎంల తప్పిదమేమీ లేదన్నారు. -
కశ్మీర్ వాసిని యూఎస్ రెసిడెంట్గా...
సాక్షి, సిటీబ్యూరో: పాస్పోర్టులను ట్యాంపరింగ్ చేస్తూ నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులకు సోమవారం చిక్కిన ముఠా ఓ క్లిష్ట సమస్యను తెరపైకి తెచ్చింది. ఈ గ్యాంగ్ నుంచి పోలీసులు దాదాపు 80 పాస్పోర్టులు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఎవరు నిందితులు? ఎవరు బాధితులుగా మారుతారు? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ముఠా సూత్రధారి రహీముద్దీన్ను పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారించడంతో పాటు ఆయా వ్యక్తులను పిలిచి ప్రశ్నించిన తర్వాతే నిందితులా? బాధితులా? అనేది తేలుస్తామని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. తెలిసీ చేస్తే చర్యలు తప్పవు... రహీముద్దీన్ సైదాబాద్లోని శాంత ప్యాలెస్లో అక్రమ వీసా కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న సంస్థ అని కస్టమర్లకు తెలిసి ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలోనే కొందరు సక్రమ వ్యవహారమే అని భావించి వీసా ప్రాసెసింగ్కు ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. మరికొందరు తమకు అర్హత, అవకాశం లేకపోయినా అక్రమ మార్గంలో వీసాలు పొంది ఆయా దేశాలకు వెళ్లాలని భావించిన వాళ్లూ ఉంటారు. ఇలా తమ పాస్పోర్టులను రహీముద్దీన్కు అప్పగించిన వారు నిందితులుగా మారుతారని పోలీసులు చెబుతున్నారు. ఇతడితో పాటు ఇతర ముఠా సభ్యుల నుంచి స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లలోని డేటా, వీరు రూపొందించిన బోగస్ సర్టిఫికెట్లు పరిశీలిస్తే తెలిసీ ముందుకు వచ్చింది ఎవరనేది గుర్తించడం తేలిక అవుతుందని భావిస్తున్నారు. కశ్మీర్ వాసిని యూఎస్ రెసిడెంట్గా... అనేక కారణాలు, నేపథ్యాల్లో జమ్మూకు చెందిన వ్యక్తులకు అమెరికా, కెనడా, యూరోపియన్ దేశాలు వీసాలు ఇవ్వడం లేదు. దీంతో తమను సంప్రదించిన జమ్మూ వాసి వికాస్ను రహీముద్దీన్ అండ్ గ్యాంగ్ అమెరికా రెసిడెంట్గా మార్చేసింది. ఇతడి పాస్పోర్ట్ను ట్యాంపర్ చేసిన గ్యాంగ్ ఆఖరి పేజీలో అమెరికా నుంచి అది రీ–ఇష్యూ అయినట్లు మార్చేసింది. దీంతో పాటు అతడికి యూఎస్ రెసిడెంట్ కార్డునూ సృష్టించేసింది. దీని ఆధారంగా అతను వీసా ఇంటర్వ్యూకు వెళ్లగా.. అనివార్య కారణాలతో తిరస్కరణకు గురైంది. మరోసారి ట్యాంపర్ చేస్తూ యూకే రెసిడెంట్గా చూపడానికి రహీముద్దీన్ ‘ఏర్పాట్లు’ చేసేశాడు. అలాగే మియాపూర్కు చెందని ఓ యువకుడికి ఇదే పంథాలో టర్కీ వెళ్లడానికి జాబ్ వీసా ఇప్పించేశాడు. మొత్తం 450 మందిలో ఇలా దేశం దాటేసిన వాళ్లు ఎవరు? వీసా రాక ఇక్కడే ఉన్నది ఎవరు? అనే అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయనున్నారు. వీరిపై కేసులు ‘రాసులు’.... ఈ అంతరాష్ట్ర గ్యాంగ్కు చెందిన చెందిన వారిలో దాదాపు ప్రతి ఒక్కరికీ గతంలో నేరచరిత్ర ఉంది. సూత్రధారి రహీముద్దీన్పై ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదయ్యాయి. 2010లో చాదర్ఘాట్, 2012, 2013ల్లో హుస్సేనిఆలం, 2016లో లంగర్హౌస్ ఠాణాల్లో ఇవి రిజిస్టర్ అయ్యాయి. చెన్నైకి చెందిన ఇలియాస్పై అక్కడి సీసీఆర్బీ టీమ్లు 2003, 2007లో కేసులు నమోదు చేసి అరెస్టు చేశాయి. స్టాంపుల తయారీదారుడు జహీరుద్దీన్పై గత ఏడాది హుస్సేనిఆలం పోలీసులు కేసు నమోదు చేశారు. రహీముద్దీన్పై నమోదైన కేసులు ప్రస్తుతం దర్యాప్తు దశలోనే ఉన్నాయి. తాజా ఉదంతాలకు సంబంధించి ముఠాపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదులతో సైదాబాద్, బేగంపేట, ముషీరాబాద్, చాదర్ఘాట్, నాంపల్లి, గోల్కొండ పోలీసుస్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ఈ ముఠాపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి నగర పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. స్టాంపుల తయారీదారులపై స్పెషల్ డ్రైవ్ నగరంలో అనేక మంది రబ్బర్ స్టాంపులు తయారు చేసే వారు ఉన్నారు. రహీముద్దీన్ గ్యాంగ్ పాస్పోర్ట్స్ ట్యాంపర్ చేసి కాన్సులేట్లను మోసం చేయడంలో రబ్బర్ స్టాంపుల పాత్ర కీలకం. ఏ తయారీదారుడూ సంబంధిత శాఖ, సంస్థ నుంచి అధీకృత లేఖ లేనిదే స్టాంపులు తయారు చేయరాదు. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు. దీన్ని పరిశీలించేందుకు నగర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్స్ చేయాలని నిర్ణయించాం.– అంజనీకుమార్, కొత్వాల్ -
ట్యాంపర్ రామారావు మళ్లీ అరెస్టు
సాక్షి, విశాఖపట్నం/భీమునిపట్నం: ట్యాంపరింగ్కు పాల్పడిన మాజీ తహసీల్దార్ బీటీవీ రామారావు మరోసారి కటకటాలపాలయ్యారు. అడ్డగోలుగా రికార్డులను ట్యాంపర్ చేసి వందల వేల కోట్ల విలువైన భూములను అన్యాక్రాంతమయ్యేందుకు కారణమైన ఈయన రాజకీయ పలుకుబడితో తనపై సస్పెన్షన్ను ఎత్తివేయించుకోవడమే కాదు.. ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చి విశాఖలోనే వరుసగా మూడు సార్లు పోస్టింగ్ పొందారు. అయితే ‘మా కొద్దీ అధికారి’అంటూ జిల్లా అధికారులు తిప్పి పంపగా ఎన్నికల వంకతో శ్రీకాకుళంలో పోస్టింగ్ పొందారు. నేడో రేపో బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో మరో కేసులో మరోసారి జైలు పాలయ్యారు. భీమిలి తహసీల్దారుగా పనిచేసిన సమయంలో రికార్డుల ట్యాంపరింగ్లతో పాటు పలు అవకత వకలకు పాల్పడగా అరెస్టయిన సంగతి తెలిందే. కాగా తాజాగా మరో కేసులో ఆయన మళ్లీ అరెస్ట్ కావడం కలకలం రేపుతోంది. విశాఖలో ఉంటున్న రామారావును భీమిలి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా, 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ విధించారు. ఈ కేసు వివరాలను భీమిలి సీఐ ఎం.వెంకటనారాయణ శుక్రవారం రాత్రి మీడియాకు తెలియజేశారు. విశాఖలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న బడే నరసింహారావు 2007లో చేపలుప్పాడులోని సర్వే నంబర్ 31/7లో 30 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశారు. అడంగల్, వన్–బీ, పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ పొందారు. 2016 వరకు రెవెన్యూ రికార్డులన్నింటిలోనూ ఈ భూమి ఆయన పేరు మీదే ఉండేది. 2016 జనవరి 12న కారి సత్తెన్న పేరిట మారిపోయింది. సత్తెన్న చనిపోయాడంటూ కొద్ది రోజులకు వారి కుమారులు కారి అప్పారావు, ఆనంద్ల పేరిట అడంగల్, 1బీలు మార్చారు. వాటిని భీమిలి కోర్టులో సమర్పించి మేజిస్ట్రేట్ను కూడా తప్పుదారి పట్టించి 2017 డిసెంబర్లో తమకు అనుకూలంగా ఆర్డర్స్ పొందారు. ఆ వెంటనే ఆ భూమిలో భారీ నిర్మాణాలు చేపట్టడంతో పాటు విద్యుత్ కనెక్షన్ తీసుకుని, వారి పేరిట ఇంటి పన్నులు కూడా చెల్లించారు. అయితే తనకు జరిగిన అన్యాయాన్ని నరసింహారావు స్థానిక రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యల్లేవు. చివరకు అప్పటి కలెక్టర్ ప్రవీణ్కుమార్ను ఆశ్రయించగా ఎస్డీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన విచారణలో బీటీవీ రామారావు తహసీల్దార్గా ఉన్న సమ యంలో రికార్డులు ట్యాంపర్ చేసి పేర్లు మార్చేసినట్టుగా నిర్ధారించారు.ఆ మేరకు కలెక్టర్కు నివేదిక సమర్పించారు. దాన్ని ఆధారంగా చేసుకుని బీటీవీ రామారావుపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేస్తూ కలెక్టర్ ప్రవీణ్కుమార్ ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించారు. గ్రీవెన్స్లో వినతితో కదలిక 2018 డిసెంబర్ 27న ఈ స్థలానికి సంబంధించి పూర్తి ఆధారాలతో ఇక్కడ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఉద్దేశ పూర్వకంగా రికార్డులు మార్చిన బీటీవీ రామారావుతో పాటు తన భూమిలోకి చొరబడిన కారి అప్పారావు, ఆనంద్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంలేదంటూ ఈ నెల 21న గ్రీవెన్స్లో కలెక్టర్ కాటంనేని భాస్కర్ దృష్టికి నరసింహారావు తీసుకెళ్లారు. పది రోజుల్లో ఫ్రెష్ అడంగల్, వన్బీ ఇచ్చి, ఈ మేరకు తనకు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. అంతే కాకుండా రికార్డులను ట్యాంపర్ చేసిన రెవెన్యూ అధికారులు, కబ్జాకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆర్డీవోకు సూచించారు. కాగా క్రైం నంబర్ 339/2018 కింద నమోదైన ఈ కేసులో బీటీవీ రామారావు చేసిన తప్పిదం వల్లనే ఇదంతా జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు రామారావుతో పాటు కారి అప్పారావు, కారి ఆనంద్ తదితరులపై సెక్షన్లు 465, 468, 4 71 కింద కేసు నమోదు చేసిన భీమిలి పోలీసులు శు క్రవారం ఉదయం విశాఖలోని అక్కయ్యపాలెం నందగిరినగర్లో ఉంటున్న రామారావు నివాసానికి వెళ్లి అరెస్ట్ చేశారు. భీమిలి కోర్టులో హాజరుపరచగా 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించినట్టుగా సీఐ తెలిపారు. -
ఈవీఎం.. దుమారం!
-
గార్డ్ ఛేంజ్ చేసి మరీ రెచ్చిపోయాడు
సిల్హెట్: బాల్ ట్యాంపరింగ్ కారణంగా ఏడాదిపాటు అంతర్జాతీయ నిషేధం గురైన ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్.. మరో రెండు నెలల్లో నిషేధం పూర్తి చేసుకోబోతున్నాడు. మార్చి నెల చివరి వారంతో అతనిపై విధించిన నిషేధం పూర్తి కావొస్తుంది. ఈ క్రమంలోనే విదేశీ లీగ్లో పాల్గొంటూ తన ఫామ్ను పునికిపుచ్చుకునే పనిలో ఉన్నాడు డేవిడ్ వార్నర్. ఇప్పటికే కెనడా లీగ్ ఆడిన వార్నర్.. తాజాగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్)లో ఆడుతున్నాడు. బీపీఎల్లో సిల్హెట్ సిక్సర్స్కు కెప్టెన్గా వ్యహరిస్తున్న వార్నర్ తన బ్యాటింగ్ పవర్ను చూపించాడు. రంగాపూర్ రైడర్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో వార్నర్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయంగా 61 పరుగులు చేశాడు. అయితే ఇందులో కొన్ని బంతులు ఆడటానికి తన బ్యాటింగ్ గార్డ్ను మార్చుకుని సాధించడం విశేషం. స్వతహాగా ఎడమచేతి వాట బ్యాట్స్మన్ అయిన వార్నర్.. గేల్ వేసిన 19 ఓవర్ నాల్గో బంతికి ఉన్నపళంగా గార్డ్ మార్చుకున్నాడు. అంతకుముందు బాల్ను హిట్ చేద్దామని ప్రయత్నించిన వార్నర్ విఫలం కావడంతో కుడి చేతి వాటం బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఫీల్డ్ అంపైర్కు తెలిపిన వార్నర్.. రైట్ హ్యాండ్తో ఆడిన మొదటి బంతిని సిక్స్గా కొట్టాడు. ఆ తర్వాత వరుస రెండు బంతుల్ని రెండు ఫోర్లు కొట్టి మరీ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో 33 బంతుల్లో 47 పరుగుల్ని లెఫ్ట్ హ్యాండర్గా సాధించగా, 3 బంతుల్లో 14 పరుగుల్ని రైట్ హ్యాండర్గా సాధించాడు. ఈ మ్యాచ్లో వార్నర్కు జతగా లిటన్ దాస్(70; 43 బంతుల్లో 9ఫోర్లు 1 సిక్సర్) రాణించడంతో సిల్హెట్ సిక్సర్స్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. ఆపై లక్ష్య ఛేదనలో రంగపూర్ రైడర్స్ ఆరు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి ఓటమి పాలైంది. -
ఓవర్లో ఏడో బంతికి బ్యాట్స్మన్ ఔట్!
పెర్త్: బిగ్బాష్ లీగ్(బీబీఎల్)లో ఓ బ్యాట్స్మన్ ఔటైన తీరు వివాదాస్పదమైంది. సాధారణంగా ఓవర్కు ఆరు స్ట్రైయిట్ బంతులు మాత్రమే పడాల్సిన ఉన్నా అంపైర్ ఏడో బాల్ వేయించడంతో పాటు ఆ బంతికి బ్యాట్స్మన్ ఔట్ కావడం వివాదానికి దారి తీసింది. ఆస్ట్రేలియా వేదిక జరుగుతున్న బీబీఎల్లో భాగంగా ఆదివారం పెర్త్ స్కార్చర్స్-సిడ్నీ సిక్సర్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో పెర్త్ స్కార్చర్స్ జట్టు 178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రెండో ఓవర్లో ఓపెనర్ మైకేల్ క్లింగర్ ఏడో బంతికి ఔటయ్యాడు. ఓవర్కు వేసే బంతుల్ని లెక్కించే క్రమంలో అంపైర్ ఒక్క బంతి ఎక్కువగా వేయించాడు. ఆ బంతికి క్లింగర్ ఔట్ కావడం చర్చకు దారి తీసింది. డ్వార్షూయిస్ వేసిన సదరు ఓవర్ తొలి రెండు బంతుల్ని మరో ఓపెనర్ బెన్క్రాఫ్ట్ ఆడి ఒక లెగ్ బై ద్వారా పరుగు తీశాడు. ఆపై మూడో బంతిని క్లింగర్ ఆడి బై ద్వారా రెండు పరుగులు సాధించగా, నాల్గో బంతికి క్లింగర్ పరుగు తీశాడు. ఇక ఐదో బంతికి బెన్ క్రాఫ్ ఆడి రెండు పరుగులు తీయగా, ఆరు బంతికి పరుగు తీశాడు. దాంతో ఓవర్ పూర్తయ్యింది. అయితే మరొక బంతిని అంపైర్ వేయించడంతో క్లింగర్ ఔటయ్యాడు. ఫీల్డ్ అంపైర్ చేసిన తప్పిదాన్ని మ్యాచ్ అధికారులు సైతం గుర్తించకపోవడంతో క్లింగర్ 2 పరుగులకే పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో పెర్త్ స్కార్చర్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కామెరూన్ బెన్క్రాఫ్ట్ 61 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో అజేయంగా 87 పరుగులు సాధించడంతో పెర్త్ స్కార్చర్స్ 18.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి గెలుపును అందుకుంది. బాల్ ట్యాంపరింగ్తో నిషేధానికి గురై ఇటీవల ప్రొఫెషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టిన బెన్క్రాఫ్ట్ బ్యాట్తో మెరవడం పెర్త్ స్కార్చర్స్ అభిమానుల్ని అలరించింది. -
ఈవీఎంలపై అనుమానం అక్కర్లేదు
చంఢీగఢ్: ఈవీఎంల (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్)పై ఎటువంటి అనుమానం అక్కర్లేదని, వాటి పనితీరును అత్యంత సాంకేతిక పరిజ్ఞానం గల నిపుణులతో పర్యవేక్షిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎమ్ఈఆర్)నూతన విద్యా సంవత్సర ప్రారంభోత్సవ సమావేశంలో ‘ముందుకు సాగడానికి అవకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై మాట్లాడారు. ఈవీఎం వ్యవస్థ పనితీరుపై అసలు సందేహ పడాల్సిన అవసరమే లేదని ఆయన స్పష్టం చేశారు. పలు రాజకీయ పార్టీలు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ సీఈసీపై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో అరోరా ఈమేరకు వ్యాఖ్యానించారు. ‘ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిందేమిటంటే ఏ యంత్రమైనా పాడవుతుంది. కానీ పాడవడానికి, సరిగా పనిచేయకపోవడానికి మధ్య తేడా ఉంది. మీరు ఒక కారు కొన్నారు అనుకోండి అది ఓ వారం లోపు పనిచేయకపోవచ్చు’అని ఉదహరించారు. ఇవేమీ పట్టించుకోకుండా ప్రజలు ఇష్టమొచ్చినట్లు ఈవీఎంలపై విమర్శలు చేస్తున్నారన్నారు. రానున్న లోక్సభ ఎన్నికలను విశ్వసనీయతతో, నిష్పాక్షికతతో, నైతికతతో నిర్వహించడానికి మాకు సాధ్యమైనంత వరకు పనిచేస్తామని వెల్లడించారు. పీజీఐఎమ్ఈఆర్ 2018లో దేశంలోని అన్ని మెడికల్ కాలేజీల్లో 2వ ర్యాంకు సాధించినందుకు అభినందించారు. సమావేశంలో పీజీఐఎమ్ఈఆర్ డైరెక్టర్ జగత్ రామ్, కాలేజీ ఫ్యాకల్టీ, విద్యార్థులు పాల్గొన్నారు. -
మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల అభిప్రాయానికి భిన్నంగా ఫలితాలొచ్చాయని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ఎన్నికల నిర్వహణలో అనేక అక్రమాలు జరిగాయని, అధికార పార్టీకి అనుకూలంగా ఈవీఎంల ట్యాంపరింగ్ జరి గిందన్నారు. దీనిపై విచారణకు ఆదేశించాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఫిర్యాదు చేశారు. అలాగే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు. గురువారం తన నివాసంలో పొన్నాల విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రపతి ఇటీవల హైదరాబాద్కు వచ్చి నప్పుడు ఫిర్యాదు చేయాలనుకున్నా సమయం కుదరలేదని, అందుకే లేఖ రాస్తున్నానని వెల్లడించారు. లేఖ లో పేర్కొన్న విషయాలను ఆయన వివరించారు. పోలిం గ్ రోజున చాలా చోట్ల ఈవీ ఎంలు పనిచేయలేదని, వాటి స్థానంలో తప్పుడు ఈవీఎంలు పెట్టి ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. ఎన్నికలు జరిగిన 36 గంటల తర్వాత కూడా ఎంత శాతం పోలింగ్ నమోదైందనే విషయాన్ని ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రకటించలేదని పేర్కొన్నారు. తెలంగాణతో పాటు ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసిన 3 గంటల్లో పోలింగ్ శాతం వెల్లడైందని, ఆ రాష్ట్రాల కంటే తక్కు వ అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణలో మాత్రం 36 గంటలు పట్టిందని తెలిపారు. పోలింగ్ సమయంలో, ఆ తర్వాత అక్రమాలు చేసినందుకే ఇంత సమయం తీసుకున్నారని ఆరోపించారు. ఆయన చెప్పినట్లుగానే ఫలితాలు.. ఎన్నికల ముందే టీఆర్ఎస్ అధినేత చెప్పినట్లుగానే ఫలితాలొచ్చాయని, పేర్లతో సహా ఆయన చెప్పిన వారే గెలిచారని, ఇది కూడా ఎన్నికల్లో అక్రమాలకు నిదర్శనమని పొన్నాల పేర్కొన్నారు. దాదాపు 30 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు తేడా ఉందని, పోలైన ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు కౌం టింగ్ ఎందుకు జరిగిందో ఈసీ ఇప్పటివరకు వివరణ ఇవ్వలేదన్నారు. కొన్నిచోట్ల చనిపోయిన వ్యక్తు లు కూడా ఓట్లు వేసినట్టు నమోదైందని ఎన్నికల తర్వాత మీడియా పరిశోధనల్లో తేలిందన్నారు. -
స్మిత్ చూసీ చూడనట్లున్నాడు
మెల్బోర్న్: కేప్టౌన్ టెస్టులో సహచరులు బాల్ ట్యాంపరింగ్కు పాల్పడుతున్న సంగతి తెలిసినా కెప్టెన్ స్మిత్ చూసీచూడనట్లు వ్యవహరించాడని అప్పటి కోచ్ లీమన్ వ్యాఖ్యానించారు. ఇందులో కోచ్ పాత్ర లేకపోయినా... నైతిక బాధ్యతగా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లీమన్ మాట్లాడుతూ ‘నాయకుడిగా బాధ్యతతో వ్యవహరించాల్సిందిపోయి స్మిత్ మిన్నకుండిపోయాడు. ఆ తతంగమంతా చూసినా చూడనట్లు కళ్లు మూసుకున్నాడు. ఆ తప్పే పెను వివాదానికి దారితీసింది. జట్టుకు, బోర్డుకు తలవంపులు తెచ్చింది’ అని లీమన్ తెలిపారు. కెప్టెన్ ఎలాంటి ఒత్తిళ్లనయినా తట్టుకోగలగాలని, ఎలాగైనా గెలవాలనే కసితో తప్పు చేయకూడదని చెప్పారు. ‘బాన్క్రాఫ్ట్కు బాల్ ట్యాంపరింగ్ చేయాలని వార్నర్ చెప్పినపుడు అతను నాకు లేదంటే సహాయ సిబ్బందికైనా తెలపాల్సింది. అపుడే వారించే వాళ్లం. అలా కాకుండా వాళ్లంతా (ముగ్గురు) పెద్ద తప్పే చేశారు. ఇది నిజంగా ఆస్ట్రేలియా క్రికెట్కు ఇబ్బందికరమైన అంశం’ అని లీమన్ అన్నారు. 1998 నుంచి 2004 వరకు ఆసీస్కు ప్రాతినిధ్యం వహించిన లీమన్ 27 టెస్టులు ఆడాడు. -
ఈవీఎంలలో లోపాలను తగ్గిస్తాం
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) పనితీరుని రాజకీయ పార్టీలు తప్పుపట్టడం సరికాదని గురువారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా అన్నారు. ఈవీఎంల విషయంలో రాజకీయ నేతలు ఎవరికి వారు తమకు అనుకూలంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈవీఎంలలో తలెత్తుతున్న లోపాలు, పొరపాట్లను సాధ్యమయ్యేంత తగ్గించేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోందని ఆయన వెల్లడించారు. ‘మేం సంతృప్తి చెందలేదు. కొన్ని సంఘటనలు (పొరపాట్లు, లోపాలు) పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం’అని చెప్పారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం, ఈవీఎంలలో లోపాలు తలెత్తడం రెండు వేర్వేరు అంశాలని అన్నారు. ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్, మిజోరం, తెలంగాణల్లో జరిగిన అసెంబ్లీల ఎన్నికల్లో 1.76 లక్షల పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ ఎన్నికల్లో కొన్ని చోట్ల మాత్రమే (ఒక శాతానికి తక్కువే) ఈవీఎంలలో పొరపాట్లు తలెత్తాయని.. ఇంతమాత్రానికే ఈవీఎంలను తప్పుపట్టడం సరికాదన్నారు. 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు పూర్తి భిన్నంగా వచ్చాయని వాటిని చూసి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సైతం వేర్వేరు ఫలితాలు వచ్చాయని, అంతకుముందు నిర్వహించిన ఉప ఎన్నికల ఫలితాల్లో ఇదే విషయం రుజువైందని చెప్పారు. ఈవీఎంల విశ్వసనీయతపై రాజకీయ పార్టీల ఆరోపణలపై అరోరా స్పందిచారు. ‘ఓటర్ల తర్వాత రాజకీయపార్టీలే కీలక భాగస్వామి. అయితే కొన్ని పొరపాట్ల కారణంగా పార్టీలన్ని ఇష్టారీతిన వ్యాఖ్యానిస్తున్నాయి. ఇది సరికాదు..’అని అన్నారు. అలాగే బ్యాలెట్ పేపర్ వైపు మరోసారి దేశం చూడాల్సిన అవసరం రాదని అరోరా పేర్కొన్నారు. -
ఓటర్ల జాబితా ట్యాంపరింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో ట్యాంపరింగ్ జరిగిందన్న అనుమానాలున్నాయ ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అన్నా రు. రాష్ట్రంలో 8 లక్షల కొత్త ఓటర్లు చేరినా కూడా గత నాలుగేళ్లలో 20 లక్షల ఓటర్లు తగ్గారని పేర్కొన్నారు. కొత్తగా చేర్పులు జరిగినా సంఖ్య ఎలా తగ్గిందని ప్రశ్నించారు. జాబితాలో ట్యాంపరింగ్ జరిగిందనే అనుమానాలు ఉన్నాయని చెప్పా రు. మంగళవారం గాంధీభవన్లో మర్రి శశిధర్రెడ్డి అధ్యక్షతన ఎన్నికల కమిటీ భేటీ జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా ఉత్తమ్ హాజరయ్యారు. ముందస్తు ఎన్నికలు, ఓటర్ జాబితా, ఎన్నికల సంఘం తదితర అంశాలపై చర్చించారు. ఉత్తమ్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 7 మండలాలు ఏపీలో కలిపినందున అక్కడ ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. 10 శాతం వీవీప్యాట్లను లెక్కపెట్టాలని సుప్రీం కోర్టులో రాజస్తాన్ వేసిన పిటిషన్ ఉందని, అందులో టీపీసీసీ కూడా కక్షిదారుగా చేరుతుందని పేర్కొన్నారు. ఈవీఎమ్ మానిటర్ను మాన్యువల్ చేయాలని కోరారు. ఓటర్ల జాబితాపై 7న సమావేశాలు.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ తెలిపారు. ఓటర్ల జాబితాతో పాటు ఇతర అంశాలపై జాగ్రత్తగా ఉండాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఓటర్ల జాబి తాపై చర్చించడానికి సెప్టెంబర్ 7న అన్ని నియోజకవర్గాల్లో సమావేశా లు నిర్వహిస్తామన్నారు. 9న మండల, డివిజన్ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిందిగా కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. బూత్ కార్యకర్త వరకు ఓటరు జాబితా చేరేలా చర్యలకు ఎన్నికల కమిటీ భేటీలో నిర్ణయం చేసినట్లు చెప్పారు. 2019 జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు నిండిన వారందరినీ ఓటర్ల జాబితాలో చేర్చాలని కోరారు. ఆదివారం జరిగిన ప్రగతి నివేదన సభలోనే కేసీఆర్ ఏం చెప్పలేదని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. జోనల్ కోసం ప్రధాని మోదీని ఇస్తావా.. చస్తావా అని నిలదీసిన సీఎం.. విభజన హామీలు, ముస్లిం, గిరిజన రిజర్వేషన్లపై అదే తరహాలో ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉందని, దీనిపై జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల కమిషన్ను కోరతామని తెలిపారు. సమావేశంలో పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి పాల్గొన్నారు. -
ఈసారి ఓటు ఎలా?
వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. ఈవీఎం లను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉన్నందున 2019 ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లనే ఉపయోగించాలని కాంగ్రెస్, తృణమూల్ సహా 17 ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈవీఎం లను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదని, పైగా వీవీప్యాట్ (ఓటరు ఏ పార్టీకి ఓటు వేసిందీ తెలియపరుస్తూ రసీదు ఇచ్చే మిషన్)ల అనుసంధానంతో ఈవీఎంలు మరింత భద్రంగా, కచ్చితంగా పనిచేస్తాయని ఎన్నికల సంఘం పదే పదే స్పష్టం చేస్తున్నా విపక్షాలు నమ్మడం లేదు. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి ఈవీఎంలే కారణమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. గతే డాది ఉత్తరప్రదేశ్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక ఈవీఎంలో ఏ పార్టీకి ఓటేసినా బీజేపీకే పడటాన్ని సాక్ష్యంగా చూపుతోంది. 2017లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఆప్ ఆరోపించింది. ‘ఈవీఎంల స్థానం లో బ్యాలెట్ పేపర్లు పెట్టాలన్నది మా డిమాండ్. పార్టీలన్నీ ఒక్కటై దీన్ని సాధించాలి’అని తృణమూల్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ప్లీనరీలో కాంగ్రెస్ తీర్మానం... ఈవీఎంలను తొలగించాలంటూ ఈ ఏడాది మార్చి లో జరిగిన 84వ ప్లీనరీలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ తీర్మానాన్ని ఆమోదించింది. ఈవీఎంలను వాడు తున్నప్పటి నుంచి ఎన్నికల ఫలితాలు ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వస్తున్నాయని, ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే ఇలా జరుగుతోందని ఆ పార్టీ వాదిస్తోంది. వచ్చే సోమవారం అన్ని పార్టీలు సమావేశమై దీనిపై చర్చిం చనున్నాయి. పార్లమెంటులో ఈవీఎంలపై చర్చకు డిమాండ్ చేయాలని నిర్ణయించాయి. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల కమిషనర్ను కలసి ఈవీఎంలపై వినతిపత్రం సమర్పించనున్నాయి. మరోవైపు అన్ని పార్టీలు కాదంటే ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్లను ప్రవేశపట్టే విషయం ఆలోచిస్తామని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈవీఎంలతో లాభాలివీ... ♦ ఈవీఎంల వల్ల కాగితం ఆదా అవుతుంది. ♦ ఈవీఎంలను భద్రపరచడం, పంపిణీ చేయడంలోనూ సమస్యలను అధిగమించవచ్చు. ♦ ఈవీఎంల వాడకంతో చెల్లని ఓటంటూ ఉండదు. ♦ ఈవీఎంల ద్వారా గంటకు 240 ఓట్లు వేయొచ్చు. కానీ బ్యాలెట్ బాక్స్లలో ఇది సాధ్యం కాదు. ♦ కేవలం 6 వోల్ట్ల బ్యాటరీతోనే ఈవీఎంలు పనిచేస్తాయి కనుక మారుమూల గ్రామాల్లోనూ ఈవీఎంలను వాడటం తేలిక. బ్యాలెట్ పేపర్తో కష్టాలు... ♦ బ్యాలెట్ విధానంలో దొంగ ఓట్లు వేసే అవకాశం ఎక్కువ. రాజకీయ ప్రాబల్యంగల వారు రిగ్గింగ్కి పాల్పడటం, ప్రత్యర్థులకు ఓట్లు పడ్డాయనుకున్న చోట్ల బ్యాలెట్ బాక్సుల్లో ఇంక్ పోయడం లాంటి వాటికి అవకాశం ఉంది. ♦ ఓటరు ఎంచుకున్న అభ్యర్థి గుర్తుపైన ముద్ర పడకున్నా, లేక పడిన ముద్ర పూర్తిగా కనిపించకపోయినా ఆ ఓటు చెల్లకపోవచ్చు. ♦ బ్యాలెట్ బాక్స్లను సురక్షిత ప్రదేశానికి తరలించడం కషం. దీనికి పెట్టాల్సిన ఖర్చు అధికం. ♦ ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటింగ్కు ఈవీ ఎంలతో 2 నుంచి 3 గంటలు పడితే, బ్యాలెట్ పేపర్తో 30 నుంచి 40 గంటలు పడుతుంది. ♦ 2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 9,30,000 పోలిం గ్ స్టేషన్లలో 14 లక్షల ఈవీఎంలను ఉపయోగించారు. 81.7 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2019 ఎన్నికల్లో దాదాపు 87.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇంత భారీ సంఖ్యలో ప్రజలు ఓట్లు వినియోగించాలంటే బ్యాలెట్కన్నా ఈవీఎంలే నయమనే వాదనా ఉంది. మన బ్యాలెట్ కథా కమామిషు! ఎన్నికల నిర్వహణకు ఒక రూపు రేఖ తీసుకువచ్చిన ఘనత తొలి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుకుమార్సేన్ దే. ఆయన దేశంలో ఎన్నికల ప్రక్రియకు తొలిసారిగా వేసిన బాట మరువలేనిది. తొలి ఎన్నికల్లో ప్రతి అభ్యర్థికీ వేర్వేరు రంగుల్లో ఉన్న ఒక్కో బ్యాలెట్ బాక్స్ని కేటాయించారు. ఆ బాక్స్పై వారి పేరు, ఎన్నికల గుర్తును పెయింట్ చేశారు. ప్రతి పోలింగ్ బూత్లో ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉన్నారో, అన్ని బాక్స్లు ఉంచారు. ఓటర్లు తమకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్ను వారికి నచ్చిన అభ్యర్థి బ్యాలెట్ బాక్స్లో వేస్తే సరిపోతుంది. 1957లో కూడా ఇదే ప్రక్రియను అనుసరించారు. 1962లో జరిగిన మూడో సార్వత్రిక ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థులు, వారి ఎన్నికల గుర్తులన్నీ ఒకే బ్యాలెట్ పేపర్పై ముద్రించి, తమకు నచ్చిన అభ్యర్థిపై ముద్ర వేసే పద్ధతిని ప్రవేశపెట్టారు. తొలి ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 25, 1951 నుంచి 1952 మార్చి 27 వరకు మొత్తం నాలుగు నెలలపాటు జరిగింది. ఒకసారి ఓటు వేసిన వాళ్లు మళ్లీ ఓటు వెయ్యకుండా చూపుడు వేలి మీద ఇంకు గుర్తు వేయడం కూడా తొలి ఎన్నికల్లోనే ప్రవేశపెట్టారు. తొలి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 62 కోట్ల బ్యాలెట్ పేపర్లను ముద్రించారు. ఇక ప్రతి అభ్యర్థికి ఒక్కో బ్యాలెట్ బాక్స్ తయారీని ప్రఖ్యాత గోద్రేజ్ కంపెనీ చేపట్టింది. ముంబైలోని విఖ్రోలి సబర్బన్ ప్రాంతంలో వాటి తయారీ జరిగింది. రోజుకు 15 వేలకుపైగా బ్యాలెట్ బాక్స్ల చొప్పున 2.1 కోట్లకుపైగా స్టీల్ బ్యాలెట్ బాక్స్లను తయారు చేసి అనుకున్న సమయానికి అందించడంలో గోద్రేజ్ కంపెనీ సఫలమైంది. నేపాల్, ఇండోనేసియా, సూడాన్ వంటి దేశాలు భారత్ ఎన్నికల నిర్వహణను పరిశీలించడానికి తమ ప్రతినిధుల్ని పంపించాయి. విదేశీ మీడియా కూడా భారత్లో తొలి ఎన్నికల నిర్వహణను ప్రశంసించింది. ఇలా అభ్యర్థికొక బ్యాలెట్ బాక్స్లతో మొదలైన ప్రయాణం ఈవీఎంల వరకు చేరుకొని, ఇప్పుడు మళ్లీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న చర్చకు దారి తీస్తోంది. ఈవీఎంలపై అనుమానాలివీ.. ♦ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ట్యాంపరింగ్ (ఏ బటన్ నొక్కినా ఒకే పార్టీకి ఓటు పడేలా) చేయొచ్చన్న ఆరోపణ ఉంది. 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఎస్పీ, ఆప్ పార్టీలు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్లు ఆరోపించాయి. ♦ ఈవీఎంలతో అవకతవకలకు అవకాశం లేదని కచ్చితంగా చెప్పడానికి లేదు. పూర్తిగా జోక్యానికి వీల్లేని యంత్రమనేది ప్రపంచంలో లేనేలేదనీ, మనం గమనించలేనంత చిన్న పరికరం సాయంతో ఈవీఎంల పనితీరును ప్రభావితం చేయవచ్చని శాస్త్రవేత్త, సామాజిక కార్యకర్త గౌతమ్ రజా పేర్కొన్నారు. ♦ ఈవీఎంల వాడకంలోనూ బూత్ల ఆక్రమణ జరిగే అవకాశం లేకపోలేదు. యంత్రాలతో చేసే తప్పుడు పనులకు కండబలం అవసరం లేదు. అది ఎవరి కంట్లో పడదు కాబట్టి మరింత ప్రమాదమనే అభిప్రాయం వినబడుతోంది. ♦ అర్హత లేని సిబ్బంది యంత్రాల నిర్వహణ బాధ్యతలు చేపట్టినట్లు ఉత్తరాఖండ్ ఎన్నికలకు సంబంధించి సమాచార హక్కు చట్టం కింద వెల్లడైంది. ♦ నెదర్లాండ్స్లో 2000 సంవత్సరంలో ఈవీఎంల వాడకంలో సమస్యలు ఎదురవడంతో తిరిగి బ్యాలెట్ ఓటింగ్నే అనుసరించారు. ♦ ఈవీఎంలతో ట్యాంపరింగ్కు అవకాశమున్నందున ప్రపంచ దేశాలు పేపర్ బ్యాలెట్ వైపునకు మళ్లుతున్నాయని, భారత్ కూడా దీన్ని అనుసరించాలని సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ సూచిస్తున్నారు. బ్యాలెట్కు బ్లాక్చెయిన్..! ఈవీఎంల వాడకం ద్వారా ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉందని రాజ కీయ పార్టీలు, నిపుణులు చెబుతుండటంతో ఇకపై ఓటింగ్ కోసం బ్లాక్చెయిన్ టెక్నాలజీ ఉపయోగించాలని సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధానంలో ఓటరు వివరాలు, ఓటింగ్ వివ రాలు సంకేతభాషలో నిక్షిప్తమవుతాయి కాబట్టి ఇతరులెవరూ వాటిని చూడటం లేదా మార్పుచేర్పులు చేయడం సాధ్యం కాదు. నెట్వర్క్లో ఉన్నవారిలో అంటే.. వ్యవహారం నడిపిన వారందరూ అంగీకరిస్తేనే మార్పులు సాధ్యమవుతాయి. బ్లాక్చెయిన్ టెక్నాలజీని సురక్షితమైన ఓటింగ్కు కొత్త మార్గంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. మీ వివరాలతో ఎన్నికల నిర్వహణ సంస్థ వద్ద పేరు నమోదు చేసుకోవాలి. తరువాతి దశలో ఈ వివరాలను గోప్యంగా ఉంచుతూనే మీకు ఓ డిజిటల్ గుర్తింపు సంఖ్య, పాస్వర్డ్ లభిస్తాయి. స్మార్ట్ఫోన్, కంప్యూటర్లతో డిజిటల్ బ్యాలెట్ బాక్స్లో ఓటు వేయవచ్చు. ఓట్లు లెక్కకట్టేందుకు ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తారు. బ్లాక్చెయిన్ టెక్నా లజీ వాడితే ఎవరికి ఓటు పడిందో తెలుస్తుందిగానీ.. ఓటేసిన వారి వివరాలు ఏమాత్రం తెలియవు. సియర్రా లియోన్ అనే చిన్న దేశం ఈ ఏడాది మార్చిలో బ్లాక్చెయిన్ టెక్నాలజీని ఉపయోగించి ఎన్నికలు నిర్వహించగా దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా త్వరలో ఈ టెక్నాలజీని వాడతామని ప్రకటించాయి. ఈవీఎంలను తీసేసే ప్రసక్తి లేదు: ఈసీ ఈవీఎంలలో ఎలాంటి లోపాలు లేవని, వాటిని ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని కేంద్ర ఎన్నికల కమిషనర్ రావత్ స్పష్టం చేశారు. వీవీప్యాట్లతో ఈవీఎంల పనితీరు మరింత పారదర్శకంగా, కచ్చితంగా మారిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ బ్యాలెట్ పేపర్ వైపు వెళ్లే ప్రసక్తే లేదని ఆయన పునరుద్ఘాటించారు. ఈవీఎంలలో లోపాలు లేవని, దానిని ఉపయోగిస్తున్న తీరుపైనే ఓటర్లకు అనుమానాలున్నాయని, ఎన్నికల సంఘం వాటిని నివృత్తి చేయాల్సి ఉందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వంటి సంస్థల ప్రతినిధులు, నిపుణులు అంటున్నారు. ఇటీవల ఎన్నికల్లో ఉపయోగించిన వీవీప్యాట్ల పనితీరుపైనా కొందరు ఓటర్లు అనుమానాలు వ్యక్తం చేశారని, ఎన్నికల సంఘం వారి అనుమానాలు తీరేలా యంత్రాలను మెరుగుపరచాలని వారు సూచిస్తున్నారు. -
టీడీపీకి ఈవీఎంల ట్యాంపరింగ్ టెన్షన్
-
‘అతని స్థానంలో నేనున్నా మోసం చేసేవాడిని’
సిడ్నీ: ఇటీవలే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కొత్త కోచ్గా నియమితులైన జస్టిన్ లాంగర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆసీస్ క్రికెటర్ బాన్ క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్ వివాదాన్ని ప్రస్తావిస్తూ.. అతని స్థానంలో తానున్నా కచ్చితంగా మోసం చేసేవాడినన్నాడు. తాను ఆడే సమయంలో సీనియర్ క్రికెటర్లు మోసం చేయమని ఆదేశిస్తే అది తప్పకుండా చేసే వాడినని చెప్పాడు. దీనిలో భాగంగా అలెన్ బోర్డర్, స్టీవ్ వా, డేవిడ్ బూన్, ఇయాన్ హేలీ, బాబీ సింప్సన్ తదితరులతో డ్రెసింగ్ రూమ్ విషయాలని లాంగర్ షేర్ చేసుకున్నాడు. అలెన్ బోర్డర్ వంటి సీనియర్ ఆటగాళ్లు తనను కనుక బంతిని ట్యాంపరింగ్ చేయమని అడిగి ఉంటే యువ ఆటగాడిగా తాను ఆ పని చేసి ఉండేవాడినని పేర్కొన్నాడు. అయితే ట్యాంపరింగ్ అంటే బోర్డర్కు కూడా భయమేనని, అలా చేయడానికి ఆయన ఎప్పుడూ ఇష్టపడలేదన్నాడు. ఇక ట్యాంపరింగ్ పాల్పడిన ఏ ఆటగాడ్ని క్షమించే గుణం బాబీ సింప్సన్కు లేదన్నారు. కొన్ని నెలల క్రితం దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లో బాల్ ట్యాంపరింగ్ ఘటనలో డేవిడ్ వార్నర్ అడగడంతో బాన్ క్రాఫ్ట్ బంతిని ట్యాంపర్ చేసిన సంగతి తెలిసిందే. నూతన కోచ్ లాంగర్ చేసిన వ్యాఖ్యలు.. వార్నర్, స్మిత్ల వ్యవహార శైలిని పరోక్షంగా తప్పుబడుతున్నట్లు ఉండగా, క్రాఫ్ట్కు మద్దతుగా ఉన్నాయి. -
అతను మోసగాడు కాదు: గంగూలీ
ముంబై: బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ఏడాది పాటు నిషేధానికి గురైన ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్కు టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ మద్దతుగా నిలిచాడు. స్మిత్ ఒక అద్భుతమైన క్రికెటర్ అని పేర్కొన్న గంగూలీ.. అతన్ని మోసగాడిగా చూడొద్దంటూ హితవు పలికాడు. ‘స్మిత్ పట్ల నాకు సానుభూతి ఉంది. ఎందుకంటే అతనొక అసాధారణ క్రికెటర్. అతన్ని మోసగాడిగా చూడొద్దు. ఆసీస్ తిరిగి బరిలోకి దిగి సత్తాచాటుతాడు. అతను చీట్ చేశాడంటే నేను నమ్మడం లేదు. అతని చేసింది మోసం అనడం సరికాదు' అని గంగూలీ తెలిపాడు. -
స్మిత్ క్రికెట్ కిట్ను గ్యారేజ్లో పడేసిన తండ్రి!
-
స్మిత్ కిట్ను గ్యారేజ్లో పడేసిన తండ్రి!
సిడ్నీ: ట్యాంపరింగ్ ఉదంతంతో ఏడాదిపాటు నిషేధానికి గురైన ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ తనను వెంటాడుతున్న వివాదాన్ని మరచిపోయేందుకు దేశం విడిచి యూఏఈకి వెళ్లాడు. ఇంటా బయటా విమర్శల జడివాన కురుస్తుండటంతో ఉపశమనం పొందడానికి స్మిత్ తన కుటుంబంతో కలిసి యూఏఈకి పయనమయ్యాడు. ఈ క్రమంలోనే స్మిత్ క్రికెట్ కిట్ను తండ్రి పీటర్ గ్యారేజ్లో పడేశాడు. ఇప్పట్లో స్మిత్కు క్రికెట్తో పనిలేదు కాబట్టి అతని క్రికెట్ కిట్ను గ్యారేజ్లో పడేసినట్లు పీటర్ తెలిపాడు. దక్షిణాఫ్రికా నుంచి గురువారం ఆసీస్ చేరుకున్న స్మిత్.. తండ్రితో కలిసి మీడియా సమావేశానికి హాజరైన విషయం తెలిసిందే. మీడియాతో మాట్లాడుతుండగా స్మిత్ బోరున విలపించాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న పీటర్.. తన బాధను దిగమింగుకుంటూ స్మిత్ను భుజం తట్టి ఓదార్చిన దృశ్యం అభిమానులను కంటతడి పెట్టించింది. అటు తర్వాత స్మిత్ క్రికెట్ కిట్ను గ్యారెజ్లో పడేశాడు. -
ట్యాంపరింగ్: వెలుగుచూసిన మరో వీడియో
కేప్టౌన్: బాల్ ట్యాంపరింగ్ చేయడంలో ‘మాస్టర్ మైండ్స్’ఎవరైనా ఉన్నారంటే అది ఆస్ట్రేలియా క్రికెట్ జట్టేనేమో. ఆ జట్టు ట్యాంపరింగ్ చేయడానికి యత్నించిన మరొక వీడియో తాజాగా వెలుగులోకి రావడం అందుకు మరింత బలాన్నిచ్చింది. కేప్టౌన్లో జరిగిన మూడో టెస్టులోనే ఆసీస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ తన షూ స్పైక్స్తో బంతిని నొక్కిపట్టడం వివాదాస్పదంగా మారింది. తొలిరోజు ఆట 53వ ఓవర్లో ప్రొటీస్ ఆటగాడు డీన్ ఎల్గర్కు వేసిన బంతి డిఫెన్స్ ఆడడంతో తిరిగి అది కమిన్స్ దగ్గరికే వచ్చింది. దీన్ని అతడు షూస్తో ఆపడంతో పాటు తన ఎడమకాలి స్పైక్స్తో కొన్ని సెకన్లపాటు బలంగా అదమడం వీడియోలో కనిపించింది. ఈ ఉదంతాన్ని అప్పుడు ఎవరూ సీరియస్గా తీసుకోలేదు. అంపైర్లు కూడా బంతిని పరిశీలించి ఆటను కొనసాగించారు. కానీ కామెంటేటర్ గ్రేమ్ స్మిత్ మాత్రం ‘ఉద్దేశపూర్వకంగా.. అనుకోకుండా చేసింది’ అని వ్యంగ్యంగా అన్నాడు. మరోవైపు ప్రెస్ మీట్లో కమిన్స్ మాట్లాడుతూ.. అది అనుకోకుండా జరిగిన సంఘటన అని సమర్థించుకున్నాడు. ఈ టెస్టు సిరీస్ మూడో మ్యాచ్లో ట్యాంపరింగ్కు పాల్పడిన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్ క్రాఫ్ట్లు అందుకు తగిన మూల్యాన్ని చెల్లించుకున్న సంగతి తెలిసిందే. అయితే కమిన్స్ వ్యవహారాన్ని అంపైర్లు సీరియస్గా పరిగణించకపోవడంతో అతనిపై ఎటువంటి చర్యలు లేకుండా సేఫ్గా బయటపడ్డాడు. -
వార్నర్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటి?
సిడ్నీ: బాల్ ట్యాంపరింగ్ ఘటనలో తాను ఎంతగానో చింతిస్తున్నానని, అందుకు క్షమించాలని ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ క్రికెట్ ప్రపంచానికి విజ్ఞప్తి చేశాడు. తాను ఎంతో ప్రేమించే క్రికెట్పై తన చర్య మాయని మచ్చగా అభివర్ణించాడు. తామ చేసిన తప్పిదాలు క్రికెట్ ప్రతిష్ఠను దెబ్బతీశాయని వార్నర్ అంగీకరించాడు. అయితే ప్రస్తుతం వార్నర్ సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అతనిపై ఏడాది నిషేధం విధించడంతో పాటు శాశ్వతంగా ఆసీస్ పగ్గాలు చేపట్టకుండా సీఏ(క్రికెట్ ఆస్ట్రేలియా) నిర్ణయం తీసుకుంది. స్మిత్పై ఏడాది నిషేధం మాత్రమే విధించిన సీఏ.. వార్నర్పై మాత్రం కాస్త కఠినంగా వ్యవహరించిందనే చెప్పాలి. ఒకే వ్యవహారంలో ఒకే దేశానికి చెందిన ఆటగాళ్లపై వేర్వేరుగా ఆ దేశ క్రికెట్ బోర్డు ఎందుకిలా నిర్ణయం తీసుకుందో సగటు అభిమానికి ఓ పజిల్లా మారిపోయింది. ఈ ఘటనలో తన పాత్ర ఉందంటూ కెప్టెన్ స్మిత్ అంగీకరించినప్పటికీ, వైస్ కెప్టెన్ వార్నర్నే టార్గెట్ చేసినట్లు కనబడింది. స్మిత్కు ఏడాది పాటు కెప్టెన్సీకి దూరం పెడతామని చెప్పిన సీఏ.. వార్నర్ను శాశ్వతంగా సారథ్య బాధ్యతలకు చేపట్టుకుండా ఉండేలా నిర్ణయం తీసుకుంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. గతంలో ఆసీస్ క్రికెటర్ల కాంట్రాక్ట్లో భాగంగా జీతాల విషయంలో సీఏతో తీవ్రంగా పోరాడటమే వార్నర్కు శాపంగా మారినట్లు కనబడుతోంది. ఆటగాళ్లందర్నీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి సీఏను దిగివచ్చేలా చేశాడు వార్నర్. ఆసీస్ పగ్గాలను భవిష్యత్తులో వార్నర్ చేపట్టకుండా సీఏ నిర్ణయం తీసుకోవడం వెనుక ఇదే ప్రధాన కారణమనేది క్రికెట్ ప్రేమికుల భావన. వార్నర్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటి? మరి త్వరలోనే ఒక న్యూస్ చెబుతానంటూ సఫారీ పర్యటన నుంచి సిడ్నీకి పయనమయ్యే క్రమంలో వార్నర్ వ్యాఖ్యానించడం వెనుక ఆంతర్యం ఏమిటి. తనపై నిషేధం తగ్గుతుందని వార్నర్ భావిస్తున్నాడా?, లేక భవిష్యత్తులో ఆసీస్ పగ్గాలు చేపట్టకుండా సీఏ తీసుకున్న ముందస్తు నిర్ణయాన్ని తిరిగి సమీక్షిస్తారని నమ్ముతున్నాడా?, మొత్తం క్రికెట్కు గుడ్ బై చెప్పి అదే వార్తగా చెప్పాలనుకుంటున్నాడా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు. మద్దతు లభిస్తుందా..? ట్యాంపరింగ్ ఉదంతం తర్వాత స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్ క్రాఫ్ట్, కోచ్ లీమన్ వ్యాఖ్యల కంటే కూడా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చేసిన వ్యాఖ్యలే అత్యధిక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. స్మిత్, వార్నర్లపై ఏడాది నిషేధం విధించడంతో పాటు బాన్ క్రాఫ్ట్పై 9 నెలల నిషేధం విధించింది. మరొకవైపు వారికి వారం రోజుల్లో అప్పీలు చేసుకునే అవకాశం కూడా ఇచ్చింది. దీనిలో భాగంగా అభిమానులు, ప్రజలు, క్రికెటర్ల మద్దతును కూడా పరిగణలోకి తీసుకుంటామని సీఏ స్పష్టం చేసింది. ఒకవేళ వీరికి మద్దతు లభిస్తే నిషేధం తగ్గించే ఆలోచన చేస్తుందా..? అదే సమయంలో స్మిత్, వార్నర్ల 'కెప్టెన్సీ'పై తీసుకున్న నిర్ణయాన్ని కూడా సమీక్షిస్తుందా? అనేది త్వరలో తేలనుంది. -
‘వార్నర్, స్మిత్లకు ఇదేమీ కొత్త కాదు’
మెల్బోర్న్:దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ఏడాది పాటు నిషేధానికి గురైన ఆసీస్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్లపై మాజీ అంపైర్ డరైల్ హార్పర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వీరిద్దరికీ బాల్ ట్యాంపరింగ్ చేయడం కొత్తమే కాదంటూ విమర్శించాడు. 2016లో షెఫల్ షీల్డ్ టోర్నీలో భాగంగా తాను రిఫరీగా పని చేసిన ఓ మ్యాచ్లో న్యూసౌత్వేల్స్ జట్టుకు స్మిత్, వార్నర్ ఆడారని, అందులో వాళ్లిద్దరూ బాల్ ట్యాంపరింగ్కు ప్రయత్నించారన్నాడు. అప్పట్లో దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ రిఫరీ సైమన్ టౌఫెల్కు ఈమెయిల్ కూడా పంపానని హార్పర్ వెల్లడించాడు. దాంతో స్మిత్, వార్నర్ల తాజా టాంపరింగ్ ఉదంతం తనకు కొత్తగా ఏమీ అనిపించలేదన్నాడు. -
విలియమ్సన్కే కెప్టెన్సీ బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్ సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్గా కేన్ విలియమ్సన్ను ఎంపిక చేశారు. గత సీజన్లో సన్రైజర్స్ కెప్టెన్గా చేసిన డేవిడ్ వార్నర్ ట్యాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు క్రికెట్కు దూరమైన నేపథ్యంలో అతని స్థానంలో విలియమ్సన్ను సారథిగా నియమిస్తూ సన్ రైజర్స్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో ఆరంభమయ్యే ఐపీఎల్ సీజన్లో భాగంగా సన్ రైజర్స్ తన తొలి మ్యాచ్ను రాజస్తాన్ రాయల్స్తో తలపడనుంది. ఏప్రిల్ 9 వ తేదీన సన్ రైజర్స్ ..రాజస్తాన్తో మొదటి మ్యాచ్ను ఆడనుంది. కాగా, ట్యాంపరింగ్ ఉదంతంతో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి స్టీవ్ స్మిత్ సైతం వైదొలిగిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో ఆసీస్ జట్టు ట్యాంపరింగ్కు పాల్పడటంతో ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్లపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ సీఏ నిర్ణయం తీసుకుంది. దాంతో వీరు అంతర్జాతీయ మ్యాచ్లతో పాటు దేశవాళీ మ్యాచ్లకు కూడా సంవత్సరం పాటు దూరం కానున్నారు. ఇక బౌలర్ బాన్ క్రాఫ్ట్పై 9 నెలల నిషేధం పడింది. -
‘వార్నర్ చెడ్డోడేమీ కాదు’
ఆక్లాండ్: ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్కు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బాసటగా నిలిచాడు. ఐపీఎల్లో సన్రైజర్స్ తరపున వార్నర్ కెప్టెన్సీలో ఆడిన విలియమ్సన్.. వార్నర్ స్వతహాగా చెడ్డ వ్యక్తి కాదని స్పష్టం చేశాడు. క్రికెట్ గేమ్ను మోసం చేశారంటూ అభిమానులు వార్నర్, స్మిత్లను తిడుతున్న తరుణంలో విలియమ్సన్. తన సహచరుడు వార్నర్కు అండగా నిలిచాడు. 'ఇది నిజంగా సిగ్గుచేటు. ఈ చర్యను ఏ జట్టూ సమర్థించదు. కానీ వార్నర్ చెడ్డ వ్యక్తి కాదు. అతడు తప్పు చేశాడు, దాన్ని ఒప్పుకున్నాడు. అలా చేసినందుకు వార్నర్ చాలా ఆవేదన చెందాడు. ట్యాంపరింగ్ ఉదంతం తర్వాత వార్నర్తో నేను టచ్లోనే ఉన్నాను' అని విలియమ్సన్ తెలిపాడు. బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా వార్నర్, స్మిత్లపై ఏడాదిపాటు దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)నిషేధించింది. మరొకవైపు బౌలర్ బాన్క్రాఫ్ట్పై 9 నెలలపాటు వేటు వేసింది. స్మిత్, బాన్క్రాఫ్ట్లను నిషేధం ముగిసిన ఏడాది దాకా కెప్టెన్సీకి పరిగణనలోకి తీసుకోమని తేల్చి చెప్పింది. వార్నర్ను జీవితాంతం ఎలాంటి నాయకత్వ బాధ్యతలకు పరిగణనలోకి తీసుకోబోమని సీఏ తేల్చిచెప్పింది. -
‘మళ్లీ అతనికి కెప్టెన్సీ వద్దే వద్దు’
మెల్బోర్న్: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లో భాగంగా మూడో మ్యాచ్లో ట్యాంపరింగ్ ఉదంతంతో ఏడాది పాటు నిషేధానికి గురైన కెప్టెన్ స్టీవ్ స్మిత్పై ఆ దేశ దిగ్గజ ఆటగాడు ఇయాన్ చాపెల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆస్ట్రేలియా క్రికెట్ పరువు మంటగలిపిన స్మిత్కు తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డేవిడ్ వార్నర్ శాశ్వతంగా కెప్టెన్ కాకుండా సీఏ ఎలాంటి నిర్ణయం తీసుకుందో, స్మిత్పై కూడా అవే తరహాలో చర్యలు తీసుకుంటే బాగుండేదన్నారు. ఇక ఆసీస్ జట్టుకు స్మిత్ను సారథిగా చూడాలని తాను అనుకోవడం లేదని ఇయాన్ చాపెల్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 'స్మిత్ను మళ్లీ కెప్టెన్గా చూడాలని అనుకోవడం లేదు. ఒక కెప్టెన్ అయిన వ్యక్తి ఎంతో హుందాగా వ్యవహరించాలి. కానీ స్మిత్ అలా చేయలేదు. సారథిగా సహచరులు గౌరవం ఇవ్వాలి. అటువంటిది స్మిత్ పూర్తిగా గౌరవం కోల్పోయాడు. దాంతో అతనికి శాశ్వతంగా కెప్టెన్గా ఉంచడమే సరైనది. ఆ మేరకు సీఏ చర్యలు తీసుకోవాలి.0 వార్నర్ను కెప్టెన్సీ చేపట్టే అవకాశం లేకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నారో అదే నిబంధనను స్మిత్కు కూడా వర్తింప చేయాలి' అని చాపెల్ పేర్కొన్నాడు. -
క్రికెట్ ఆస్ట్రేలియాకు మరో షాక్
సిడ్నీ: స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్ క్రాఫ్ట్ల ట్యాంపరింగ్ ఉదంతంతో ఇప్పటికే పరువు పోగుట్టుకుని ప్రపంచం ముందు చిన్నబోయిన క్రికెట్ ఆస్ట్రేలియాకు మరో షాక్ తగిలింది. ఏడాది కాలంగా క్రికెట్ ఆస్ట్రేలియాకు అతిపెద్ద స్పాన్సర్గా వ్యవహరిస్తున్న మెగెల్లాన్ తన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ మేరకు గురువారం క్రికెట్ ఆస్ట్రేలియాతో ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని మగెల్లాన్ చీఫ్ హమీష్ డాగ్లస్ ఓ ప్రకటనలో వెల్లడించారు.ఇలా ఆకస్మికంగా తమ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం బాధగా ఉన్నప్పటికీ, తప్పనిసరి పరిస్థితుల్లో వెనక్కితగ్గాల్సి వచ్చిందన్నారు. 2017లో మెగెల్లాన్ భారీ మెత్తం (20 మిలియన్ల ఆసీస్ డాలర్లు) చెల్లించి సీఏతో మూడేళ్లపాటు కొనసాగేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. గత ఏడాది జరిగిన యాషెస్ సిరీస్తో ఒప్పందానికకి శ్రీకారం చుట్టిన మెగెల్లాన్.. అతి కొద్ది కాలంలోనే సీఏతో ఒప్పందానికి ముగింపు పలికింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆసీస్ జట్టు ట్యాంపరింగ్కు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంలో వార్నర్, స్మిత్, బాన్ క్రాఫ్ట్లు అడ్డంగా దొరికిపోయి దోషులుగా నిలబడ్డారు. ఈ క్రమంలోనే స్మిత్, వార్నర్లపై ఏడాదిపాటు సీఏ నిషేధం విధించగా, బాన్ క్రాఫ్ట్పై 9 నెలల నిషేధం పడింది. దాంతో పాటు కొన్ని కోట్ల ఒప్పందాల్ని వీరు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ట్యాంపరింగ్: తొలిసారి స్పందించిన వార్న్
సిడ్నీ: ట్యాంపరింగ్ ఉదంతంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్లపై క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ఏడాది పాటునిషేదం విధిస్తూ కఠిన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే సీఏ విధించి శిక్షపై ఆదేశ దిగ్గజ మాజీ క్రికెటర్ షేన్ వార్న్ సోషల్మీడియా వేదికగా స్పందించారు. తన సుదీర్ఘ కెరీర్లో ఇలాంటి సిగ్గుమాలిన సంఘటన ఎప్పుడూ చూడలేదని, క్షమించలేని తప్పును ఆసీస్ ఆటగాళ్లు చేసారని వార్న్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బాల్ ట్యాంపరింగ్ను చాలా మంది ఆటగాళ్లు ఆవేశపూరితంగా చేశారని, కానీ ముందస్తు ప్రణాళిక ప్రకారం ఒక వస్తువు తెచ్చుకొని ట్యాంపరింగ్ చేయడం తానెప్పుడు చూడలేదన్నాడు. ఇది ఓ సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. ఈ చర్యతో దేశ పరువు తీయడమే కాకుండా ఆసీస్ అభిమానులకు అపత్రిష్ట తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి ఆడినా ప్రతీ మ్యాచ్ను గెలవలేమని, ఓటమి ఆటలో ఒక భాగమే అనే విషయాన్ని ఆటగాళ్లు గుర్తించాలని ఈ మాజీ క్రికెటర్ సూచించారు. అసలు కేప్టౌన్లో ఏం చేశారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని, ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆటగాళ్లకు వార్న్ హితబోద చేశారు. స్మిత్, వార్నర్ల నిషేధంతో నవంబర్లో భారత్తో జరిగే కీలక సిరీస్కు దూరం కావడం ఇబ్బంది కలిగించే విషయం అని, కానీ వరల్డ్ కప్కు అందుబాటులో ఉండటం సంతోషం అని వార్న్ పేర్కొన్నారు. ఏడాది నిషేదం తరువాత వచ్చే ఆటగాళ్లను స్వాగతించాలని అభిమానులకు వార్న్ విజ్ఞప్తి చేశారు. యువ ఆటగాళ్లు ఇదొక గుణపాఠంగా భావించాలని హితవు పలికారు. -
అమెజాన్కు భారీ టోకరా
సాక్షి, బెంగళూరు : ఆన్లైన్ మార్కెటింగ్ దిగ్గజం 'అమోజాన్'కే కుచ్చుటోపీ పెట్టాడో ప్రబుద్ధుడు. కంపెనీ ఇచ్చిన ట్యాబ్తోనే మోసానికి పాల్పడ్డాడు. డెబిట్/క్రెడిట్ కార్డుల ట్యాంపరింగ్ ద్వారా ఏకంగా రూ.1.3 కోట్ల మేర కంపెనీని ముంచేశాడు. తనఫ్రెండ్స్ ద్వారా విలువైన ఆస్తులను ఆర్డర్ చేయడం.. ఎలాంటి చెల్లింపు చేయకుండానే ఆయా ప్రొడక్ట్లను సొంతం చేసుకోవడం ఇదీ ఇతగాడి మోడస్ ఒపరాండీ.. దీంతో కేవలం అయిదు నెలల్లోనే రూ. కోటికి పైగా కంపెనీకి నష్టం కలిగించాడు. కంపెనీ త్రైమాసిక ఆడిట్ సమయంలో ఈ మోసం వెలుగు చూసింది. వివరాల్లోకెళితే...కర్ణాటకలోని చిక్కమంగళూరుకు చెందిన దర్శన్ అలియాస్ ధృవ (25) తన మిత్రులతో కలిసి ఖరీదైన ఉత్పత్తులను ఆన్లైన్లో ఆర్డర్ చేసేవాడు. ఎలాంటి నగదు బదిలీలు లేకుండానే వాటిని అక్రమంగా డెలివరీ చేసుకున్నాడు. సెప్టెంబరు, 2017-ఫిబ్రవరి, 2018 మధ్యకాలంలో ఆ అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో అమోజాన్ కంపెనీకి చిక్కమంగళూరు నగరం నుంచి 4,604 ఆర్డర్లు వచ్చాయి. ఏకదంత కొరియర్ ఏజెన్సీతో అమెజాన్కు ఒప్పందం ఉంది. ఈ కొరియర్ ఏజెన్సీలో డెలీవరీ బాయ్గా పనిచేస్తున్న దర్శన్ ఈ మోసానికి తెగబడ్డాడు. ఈ వ్యవహారంపై మార్చి 8న అమెజాన్ సీనియర్ మేనేజర్ నవీన్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్డు పేమెంట్ సిస్టమ్ను టాంపరింగ్ చేయడం ద్వారా ఇంతపెద్ద మోసానికి నిందితుడు పాల్పడ్డాడని ఎస్పీ కే.అన్నామలై మీడియాకి తెలిపారు. కంపెనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్శన్ సహా పునీత్ (19) సచిన్ షెట్టి, (18) అనిల్ షెట్టి, (24) అనే నలుగురు యువకుల్ని అరెస్టు చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని ఆయన వెల్లడించారు. ట్యాబ్ను ఫోరెన్సిక్ల్యాబ్కు తరలించామనీ, నిందితుల నుంచి రూ.25 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 21 స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్, మరో ఐపాడ్, ఓ యాపిల్ వాచ్లుతో పాటు, నాలుగు బైక్లు ఉన్నట్టు పేర్కొన్నారు. -
గట్టిపోటీ కానేకాదు: అమిత్ షా
న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారం చేపడుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. గుజరాత్లో బీజేపీకి కాంగ్రెస్ గట్టిపోటీని ఇచ్చిందని వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. బీజేపీ కన్నా కాంగ్రెస్ 8% వెనుకబడి ఉందనీ, అది గట్టి పోటీ కానేకాదన్నారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా, తాము చేసిన అభివృద్ధికి నిదర్శనమే ఎన్నికల ఫలితాలన్నారు. ప్రధాని మోదీకి ఉన్న జనాకర్షణ, కేంద్రంలో, రాష్ట్రంలో తాము చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపించాయని చెప్పారు. కాంగ్రెస్ విభజనవాద రాజకీయాల వల్లే తమ పార్టీకి సీట్లు తగ్గాయన్నారు. 2019 సాధారణ ఎన్నికల్లోనూ తమదే విజయమని ధీమా వ్యక్తంచేశారు. హిందువని చెప్పినా ఫలితం లేదా? సోమ్నాథ్ మందిర్కు వెళ్లినప్పుడు రాహుల్... తాము హిందూవేతరులమని తెలిపే విజిటర్ల పుస్తకంలో సంతకం పెట్టడాన్ని బీజేపీ ఎన్నికల్లో వాడుకోవాలని చూసింది. ఈ క్రమంలో బీజేపీ వాదనను తిప్పికొట్టడానికి కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా కాషాయపక్షం వలలో పడి అనవసర చర్చకు ఆస్కారం కల్పించారు. రాహుల్ హిందువు మాత్రమే కాదు, ఆయన ‘జనేవూధారీ’ (జంధ్యం ధరించిన) బ్రాహ్మణుడని అందరూ భావించేలా సూర్జేవాలా వివరణ ఇవ్వడమేగాక గతంలో రాహుల్ తన కోటుపై జంధ్యం వేసుకున్నప్పటి ఫోటో ట్విటర్లో పెట్టి కాంగ్రెస్ కూడా కులాన్ని ఎన్నికల్లో ఇంత బాహాటంగా వాడుకుంటోందనే విమర్శలకు అవకాశం కల్పించారు. ట్యాంపరింగ్తోనే గెలుపు: హార్దిక్ గుజరాత్లో బీజేపీ ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్)లను ట్యాంపర్ చేసి, ధనబలాన్ని ఉపయోగించి గెలిచిందని పాస్ (పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి) నేత హార్దిక్ పటేల్ ఆరోపించారు. బీజేపీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడకుండా ఉండుంటే కాంగ్రెసే గెలిచేదని ఆయన అన్నారు. ‘గుజరాత్లో పోలింగ్ సమయంలో వైఫై నెట్వర్క్లను గుర్తించిన సందర్భాలున్నాయి. అలాగే ఈ రోజు ఓట్ల లెక్కింపు మొదలవ్వడానికి ముందే కూడా కొన్ని ఈవీఎంలకు సీళ్లు లేవు’ అని హార్దిక్ ఆరోపించారు. పటీదార్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న వరచ్చ రోడ్, కమ్రేజ్ తదితర నియోజకవర్గాల్లోనూ బీజేపీ గెలవడాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు. బీజేపీది నైతిక ఓటమి ‘గుజరాత్లో బీజేపీది నైతిక ఓటమి. 2019లో ఆ పార్టీ ఓటమికి ఇదే ఆరంభం. సమతూకంతో తీర్పు ఇచ్చిన గుజరాత్ ప్రజలకు అభినందనలు. ఇది బీజేపీకి తాత్కాలిక, పరువు నిలుపుకునే గెలుపు మాత్రమే. సామాన్యులపై దురాగతాలకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారు’ – మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ సీఎం సంబరాలెందుకు: సీపీఎం ‘గుజరాత్లో బీజేపీ గెలుపు ఆ పార్టీ సంబరాలు చేసుకోవాల్సినంతగా ఏమీ లేదు. 150 సీట్లు గెలవడం తమ లక్ష్యమని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రచారంలో ప్రకటించినా కనీసం వంద సీట్లు కూడా గెలవలేకపోయారు.’ తగ్గుతున్న బీజేపీ ఓట్బ్యాంక్ గుజరాత్లో బీజేపీ ఓటు బ్యాంకు క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు స్పష్టమవుతోంది. 2014 లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి అత్యధికంగా 60శాతం పైగా ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం 49.1శాతానికి పడిపోయింది. అదే సమయంలో కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును 33 శాతం నుంచి 41.4 శాతానికి పెంచుకుంది. 2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో జరిగిన ఎన్నికల్లో రెండు పార్టీల ఓటు బ్యాంక్ తేడా 10.4% కాగా 2012 ఎన్నికల్లో 9 శాతానికి.. తాజాగా ఈ తేడా 7.7 శాతానికి తగ్గిపోయింది. ఐదుగురు మంత్రులు చిత్తు! అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీకి షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో ఐదుగురు మంత్రులు కాంగ్రెస్ అభ్యర్థుల చేతుల్లో చిత్తుగా ఓడిపోయారు. గధడ్లో దళిత మంత్రి ఆత్మారామ్ పర్మర్ కాంగ్రెస్ నేత ప్రవీణ్భాయ్ మరు చేతిలో, జమ్జోధ్పూర్లో మంత్రి చిమన్భాయ్ సపరియా చిరాగ్భాయ్ కలారియా(కాంగ్రెస్) చేతిలో ఓటమి చవిచూశారు. వీరితో పాటు శంకర్ చౌధరీ, కేశాజీ చౌహాన్, శబ్ద్శరణ్ తడ్వీలు తమ ప్రత్యర్థుల చేతిలో ఓడిపోయారు. మెజారిటీ కన్నా ‘నోటా’కే ఎక్కువ న్యూఢిల్లీ: గుజరాత్లోని పోర్బందర్లో బీజేపీ అభ్యర్థి బాబూభాయ్ బోఖారియా 1,855 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా.. అదే నియోజకవర్గంలో నోటా గుర్తుకు 3,433 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 5.5 లక్షల మంది ఓటర్లు అభ్యర్థులను తిరస్కరించి ‘నోటా’ (పైవారెవరూ కాదు)కు ఓటేశారు. ఓటుహక్కు వినియోగించుకున్న వారిలో ఇది 1.8 శాతానికి సమానం. హిమాచల్ప్రదేశ్లో 33 వేల మంది (0.9 శాతం) ఓటర్లు నోటా మీట నొక్కారు. గుజరాత్లో పార్టీల పరంగా నోటాకు పడిన ఓట్ల సంఖ్య బీజేపీ, కాంగ్రెస్ల తరువాత మూడో స్థానంలో ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థి మేవాని గెలుపొందిన వాద్గాంలో అత్యధికంగా 4,200కు పైగా, సీఎం విజయ్ రూపానీ పో టీచేసిన రాజ్కోట్ (పశ్చిమ)లో 3,300 నోటా ఓట్లు పోలయ్యాయి. -
ఐఎంఈఐ టాంపరింగ్ చేస్తే...
సాక్షి, న్యూఢిల్లీ: సెల్ ఫోన్ దొంగతనాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు పూనుకుంది. మొబైల్లో కీలకమైన 15 అంకెల ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్ (ఐఎంఈఐ) మార్చితే కఠిన శిక్షలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఈ నేపధ్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం(డాట్) కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంది. ఐఎంఈఐ టాంపరింగ్ చేసినా, మార్చినా 3 సంవత్సరాల వరకు జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించనుంది. ఉత్పత్తి దారుడు తప్ప మిగిలిన ఎవరైనా ఐఎంఈఐ నెంబర్ను మార్చడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. 15 డిజిట్ల ఈ నెంబరును టాంపరింగ్ చేస్తే ఐఎంఈఐ 2017 నిబంధనల ప్రకారం చట్టరీత్యా శిక్షకు అర్హులని పేర్కొంది. తయారు చేసిన కంపెనీ తప్పించి వేరే ఎవరు మార్చినా, తొలగించినా మూడేళ్ల పాటు జైలు శిక్ష తప్పదని స్పష్టం చేసింది. తద్వారా నకిలీ ఐఎంఈఐ సంఖ్యలకు సంబంధించిన సమస్యలను అరికట్టడానికి , కోల్పోయిన మొబైల్ ఫోన్ల ట్రాకింక్ను కూడా సులభతరం చేయనున్నామని టెలికాం శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.భారతీయ టెలిగ్రాఫ్ చట్టం 2017 చట్టంలోని 7, 25 సెక్షన్ల ప్రకారం ఈ నిబంధనలను రూపొందించింది ఐఎంఈఐ నెంబర్ల మార్పిడిపై కఠినమైన చట్టాలను రూపొందించే యోచనలో ఇటీవల డాట్ సంప్రదింపులు ప్రారంభించింది. ఈ కేసుల విచారణ సందర్భంగా ఒకే ఐఎంఈఐ నెంబర్తో సుమారు 18వేల హ్యాండ్సెట్లను డాట్కు చెందిన టెలికాం ఎన్ఫోర్స్మెంట్ రిసోర్స్ అండ్ మానిటరింగ్ (TERM) సెల్ కనుగొంది. దీంతో ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు మొబైల్చోరీలకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త పద్ధతిని టెలికాం శాఖ అమల్లోకి తెస్తోంది. చోరీకి గురైన ఫోన్లలో సిమ్ కార్డు మార్చినా, ఐఎంఈఐ నెంబర్ను మార్చినా అన్ని నెట్వర్క్లను బ్లాక్ చేయనుంది. కాగా సాధారణ మొబైల్స్నుంచి హై ఎండ్ స్మార్ట్ఫోన్ దాకా మొబైల్ వినియోగం ఎంత పెరిగిందో.. అదే స్థాయిలో స్మార్ట్ఫోన్ల చోరీలు కూడా నమోదవుతున్నాయి. కొట్టేసిన మొబైల్ తాలూకు ఐఎంఈఐ నెంబర్లనుమార్చి.. వాటిని ట్రాక్ చెయ్యడానికి వీల్లేకుండా IMEI నెంబర్లు మార్చేసి వాడే వారు ఎక్కువైన సంగతి తెలిసిందే. -
ఐఎంఈఐ నెంబర్ తారుమారు చేస్తే జైలు
సాక్షి, న్యూఢిల్లీ : మొబైల్ ఫోన్లకు ఉండే 15 అంకెల ఐఎంఈఐ నెంబర్ను ట్యాంపర్ చేస్తే మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. నకిలీ ఐఎంఈఐ నెంబర్లను అరికట్టడంతో పాటు చోరీకి గురైన మొబైల్ ఫోన్లను గుర్తించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఫోన్ తయారీదారు కాకుండా వేరొకరు ఉద్దేశపూర్వకంగా ఐఎంఈఐ నెంబర్ను తొలగించడం, మార్చడం చట్టవిరుద్ధమని టెలికాం శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఐఎంఈఐ నెంబర్ను మార్చడం, సాఫ్ట్వేర్లో మార్పులు చేయడం ఈ నిబంధనల కింద నేరంగా పరిగణిస్తారు. మొబైల్ హ్యాండ్సెట్కు యూనిక్ ఐడీగా ఐఎంఈఐ నెంబర్ను కోడ్ చేస్తారు. సిమ్ను మార్చడం ద్వారా హ్యాండ్సెట్లో మొబైల్ నెంబర్ను మార్చడం సాధ్యమవుతుంది. అయితే ఐఎంఈఐ నెంబర్ను ప్రత్యేక పరికరాలతో సాంకేతిక అనుభవం ఉన్న వ్యక్తులు మాత్రమే మార్చగలరు. ఈ తరహా ట్యాంపరింగ్కు చెక్ పెట్టేందుకే ప్రభుత్వం కఠిన నిబంధనలతో ముందుకొచ్చింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం ఐఎంఈఐ నెంబర్ను తారుమారు చేస్తే మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. -
ట్యాంపరింగ్ నిరూపించండి
-
ట్యాంపరింగ్ నిరూపించండి
- ఈవీఎంలపై రాజకీయ పార్టీలకు ఈసీ సవాల్ - జూన్ 3 నుంచి మొదలు సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్కు గురయ్యాయని వచ్చిన ఆరోపణలను నిరూపించాలని రాజకీయ పార్టీలతో బహిరంగ సవాల్ కు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈమేరకు సవాల్ జూన్ మూడో తేదీ నుంచి ప్రారంభమవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ నసీం జైదీ చెప్పారు. ఇందులో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న రాజకీయ పార్టీలు ఈ నెల 26 వ తేదీ సాయంత్రంలోగా రిజిస్టర్ చేసుకోవాలన్నారు. జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన నేతలు ముగ్గురు నిపుణులతో వచ్చి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి నిరూపించాలన్నారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ఎన్నికలలో పాల్గొన్న రాజకీయ పార్టీలకే అవకాశమిస్తున్నట్లు చెప్పారు. రాజకీయ పార్టీలు విదేశీ నిపుణుల సాయం తీసుకోరాదని తేల్చి చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఈవీఎంలు ట్యాంపరింగ్ కు గురయ్యాయని ఫిర్యాదులు అందాయని, అందుకు సరైన ఆధారాలు లేవన్నారు. ఈవీఎంలలో వైఫై చిప్ ఉండదని, అందువల్ల బయటనుంచి ఆదేశాలను తీసుకునే అవకాశం లేదన్నారు. పరువు, ప్రతిష్టకు పోరాదు ఈవీఎంల ట్యాంపరింగ్ సవాల్ను రాజకీయ పార్టీలు పరువు మర్యాదల విషయంగా పరిగణించరాదని జైదీ సూచించారు. తాము నియమించే సాంకేతిక నిపుణులతో కూడిన బృందం ట్యాంపరింగ్ జరిగిందో లేదని నిర్ధారిస్తుందని తెలిపారు. ఈ సవాల్ సుమారు 4–5 రోజులు కొనసాగొచ్చని పేర్కొన్నారు. ఈవీఎం యంత్రాన్ని హ్యాక్ చేయడానికి ప్రతి పార్టీకి నాలుగు గంటల సమయం ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఆన్లైన్ ఓటింగ్ ప్రవేశపెట్టడం అసాధ్యమని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ నసీం జైదీ అభిప్రాయపడ్డారు. ఈ ప్రక్రియ గోప్యతను కాపాడే భద్రతా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకునే తానిలా చెబుతున్నానని అన్నారు. భద్రతకు ఢోకా లేదు ఈవీఎంలలో ఉన్న సాంకేతికత భద్రతా ప్రమాణాలపై హైదరాబాద్, బెంగుళూరు నగరాల్లోని ప్రముఖ సాంకేతిక నిపణులతో పరీక్షలు చేయిస్తున్నామని జైదీ తెలిపారు. సాఫ్ట్వేర్ను బయటి దేశాల నుంచి దిగుమతి చేసుకున్నామనే ఆరోపణలను కొట్టివేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపామని, ఆయా పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. ఈవీఎంల వినియోగం, వీవీప్యాట్ పనితీరుపై కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ఒక నమూనా ప్రదర్శన నిర్వహించింది. -
ఈ వృథా చర్చ ఇక చాలు
ఈవీఎంలపై రాద్ధాంతాన్ని ఆపేస్తే మంచిది. ఏ ఎన్నికల్లోనైనా ట్యాంపరింగ్ నిజంగా జరిగిందా లేదా అన్నదే మనం చేయాల్సిన చర్చ. అందుకు ఏ అవకాశమూ లేకుండా ఏం చెయ్యాలన్నది ఆలోచించాల్సిన మరో అంశం. ఏదో మేరకైనా ఈవీఎంల అవకతవకలకు పాల్పడేందుకు ఉన్న అవకాశాన్ని నివారించేందుకు కాగితపు రసీదును ఇచ్చే పద్ధతిని వాడటంపై అందరిదీ ఏకాభిప్రాయమే. ఇలాంటి కొత్త మెషీన్ల కొనుగోలు కోసం ఇప్పుడు కేంద్రం డబ్బు ఇవ్వడానికి సిద్ధపడుతోంది. అదే ఈ చర్చ వల్ల జరిగిన ఏకైక లాభం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) మద్దతుదారులూ, వ్యతిరేకులూ కలసి గత కొద్ది సంవత్సరాలుగా దేశంలో ఒక నిరర్థక చర్చను కొన సాగిస్తున్నారు. ఈ క్షుద్ర క్రీడ ద్వారా తాము ప్రజాస్వామ్యానికి కీడు చేస్తు న్నామని గతంలో బీజేపీ అనుకోలేదు, ఇప్పుడు బీజేపీ వ్యతిరేకులూ అలా ఆలోచించడం లేదు. 2014కు ముందు ఇవే ఈవీఎంలతోనే తామెలా ఎన్నికల్లో గెలుపు సాధించామో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు మనకు చెప్పవు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీదైతే మరీ వితండవాదన. వారు ఎన్నికల్లో గెలుపు సాధించినప్పుడల్లా ఎన్నికల కమిషన్, ఈవీఎంలు సరిగ్గా పని చేశాయని, ఓడిపోవడం మొదలైనప్పటి నుంచే ఈవీఎంల అవకతవకలు మొదలయ్యాయని అనుకోవాలి. మరోవైపు, అవకతవకలన్నీ 2009కు ముందే ఉన్నట్టు, ఇప్పుడు ఈవీఎం లన్నీ బాగైపోయినట్టు బీజేపీ చెబుతుంది. ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను ప్రశ్నించడమే నేరమన్నట్టు ఇప్పుడు బీజేపీ మాట్లాడుతుంది. కానీ ఎన్నికల సభల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జేమ్స్ మైకేల్ లింగ్డో పేరెత్తి మరీ ఆరో పణలు చేసిన తొలి రాజకీయ నేత నరేంద్ర మోదీ అనే విషయాన్ని టీవీ యాంకర్లు అలవాటుగానే మరచిపోయారు. తప్పుడు సమస్యలపై సాగుతున్న చర్చ ఈవీఎంలపై అన్ని పార్టీలూ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నాయన్న కారణంతో మాత్రమే వాటిపై జరుగుతున్న చర్చను అర్థంలేనిదని చెప్పడం లేదు. రెండు పక్షాల వాళ్లూ తప్పుడు విషయంపై చర్చ చేస్తున్నారు కాబట్టే ఇది వృథా చర్చ అని అంటున్నా. ఈవీఎంలను ఎప్పుడైనా ట్యాంపరింగ్ చేసే వీలుందా, లేదా అన్న అంశంపైనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈవీఎంలు ఏ మాత్రం ట్యాంపరింగ్కు వీలు కాని యంత్రాలని వాటి సమర్థకులు వాది స్తున్నారు. దీనికి ప్రతిగా వాటి వ్యతిరేకులు ఈవీఎంలను ఎలా ట్యాంపరింగ్ చేయొచ్చో నిరూపించడంలో నిమగ్నమైపోయారు. ఈవీఎంలను ట్యాంప రింగ్ చేసి ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేయడం అసాధ్యమేమీ కాదన్నది వీరి వాదన. ఈ ప్రశ్నకు సూటియైన, స్పష్టమైన జవాబు ఏమిటంటే, ఎలాంటి అవ కతవకలకు వీలులేని ఎలక్ట్రానిక్ పరికరం మొత్తం ప్రపంచంలోనే ఎక్కడా లేదు. నేనేమీ ఇంజనీర్ను కాను. అయినప్పటికీ చిప్ లేదా మదర్బోర్డును మార్చడం ద్వారా ఏ యంత్ర పరికరాన్నైనా ఎలా అనుకుంటే అలా మార్చె య్యవచ్చనే విషయాన్ని మాత్రం అర్థం చేసుకోగలను. సాఫ్ట్వేర్ ద్వారా అత్యంత సూక్ష్మ స్థాయిలో అవకతవకలకు పాల్పడవచ్చు. వాస్తవం ఏమి టంటే ఈవీఎంలలో ట్యాంపరింగ్ అసాధ్యమేమీ కానప్పటికీ, మన ఎన్నికల వ్యవస్థలో దీనికున్న అవకాశం అతి స్వల్పం. కాబట్టి సిద్ధాంత రీత్యా ఈవీఎం లలో లోటుపాట్లపై చర్చ చేయడంలో అర్థం లేదు. మొబైల్ ఫోన్లలో వందల రకాల నమూనాలున్నట్టుగానే ఈవీఎంలలో కూడా డజన్ల మోడళ్లున్నాయి. ఇతర దేశాలలో ఏ మోడల్ మెషీన్తో ఎలాంటి అనుభవం వచ్చిందనేది మనకు అప్రస్తుతం. ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమేనా? మన దగ్గర ఈవీఎంల ద్వారా అవకతవకలకు పాల్పడేందుకు ఉన్న అవకాశం ఎంత అనేది అసలు ప్రశ్న. మన దగ్గర ఉపయోగించే బేసిక్ మోడల్ ఈవీఎంలలో ఇంటర్నెట్ లేదా మొబైల్ సిగ్నళ్లు పని చేయవు. అంటే ఈవీ ఎంలోని సాఫ్ట్వేర్ను మార్చకుండా దీనిని దూరం నుంచి ట్యాంపరింగ్ చేయడం అసాధ్యం. ఒకవేళ ఫ్యాక్టరీలో తయారు చేసేటప్పుడే ఈవీఎంలో బిగించే చిప్ను ట్యాంపర్ చేశారనుకున్నా, దాంతో ఏదో ఒక పార్టీకి జరిగే లాభమేమీ ఉండదు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ ఎన్నికల గుర్తును లేదా పార్టీ పేరును గుర్తించలేదు. ఇది కేవలం అభ్యర్థి సంఖ్యను మాత్రమే గుర్తిస్తుంది. ఇక తమ పార్టీ అభ్యర్థుల పేర్లు ఏ నియోజకవర్గంలో ఏ సంఖ్యా క్రమంలో ఉంటాయో పోలింగ్కు రెండు వారాల ముందు దాకా ఎవరికీ తెలియదు. ఒకవేళ మెషీన్లో ఏదో ఒక సంఖ్యకు లాభం జరిగేలా ట్యాంపరింగ్ చేసినా దాని వల్ల వేర్వేరు నియోజకవర్గాల్లో వేర్వేరు పార్టీలకు లాభం జరుగు తుంది తప్ప, ఏదో ఒక పార్టీకే లాభం జరిగే అవకాశం లేదు. అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత కూడా ఇలాంటి ట్యాంపరింగ్ చాలా కష్టం. ఎందుకంటే ఏ నియోజకవర్గానికి ఏ మెషీన్ను పంపాలనేది పోలింగ్కు కేవలం మూడు, నాలుగు రోజుల ముందే ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుంది. పోలింగ్ మొదల వడానికి ముందు ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ ఈవీఎం బటన్లు నొక్కి వాటిని తనిఖీ చేసే అవకాశం అన్ని పార్టీల ఏజెంట్లకూ ఇస్తారు. ఇవి కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ మరో ట్యాంపరింగ్ అవకాశం గురించి చెబుతోంది. ఓట్లు వేయడానికి ముందే ఈవీఎం మదర్బోర్డును మార్చివేసి, ఉదయం తనిఖీ పూర్తయిన తర్వాత ఓటింగ్ మొదలయ్యాక ఎవరైనా ఒక ఓటరు కుట్రపూరితంగా ఒక కోడ్ను నొక్కడం ద్వారా ట్యాంపరింగ్ ప్రక్రి యను ఆరంభించవచ్చు అని వారంటారు. నిజానికి ఇది అసాధ్యమేమీ కాదు. అయితే ఇలా ట్యాంపరింగ్ చేయాలంటే ఆచరణలో ఏమేం చేయాల్సి ఉంటుందో ఆలోచించండి. ఢిల్లీ నగర పాలక సంస్థ వంటి చిన్న స్థాయి ఎన్నికల్లో కూడా 15 వేల మెషీన్లను తెరిచి వాటి విడి భాగాలను మార్చాల్సి ఉంటుంది. ఆ తర్వాత వేలాది పోలింగ్ కేంద్రాల్లో కోడ్ను మార్చే కుట్రను అమలు చేయడానికి కనీసం ఒక్కో వ్యక్తినైనా కేటాయించాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి రహస్యాన్ని కాపాడగల నమ్మకస్తుడై ఉండాలి. మన లాంటి దేశంలో ఇంత విస్తృత స్థాయి కుట్రకు తెరతీశాక, దానికి పాల్పడ్డ వేలాది మందిలో ఒక్కరైనా దాన్ని బట్టబయలు చేయకుండా ఉండడమనేది అసలు సాధ్య మేనా? వేలాది మంది వ్యక్తులలో ఒక్కరైనా దీని గురించి మాట్లాడకుండా ఉంటారా? ఒక్క బూత్లోనైనా ఈ ట్యాంపరింగ్ గుట్టు రట్టు కాదా? నిరాధారమైన ఆరోపణలు కాబట్టి ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమా, కాదా అన్న సైద్ధాంతిక చర్చను ఇప్పటికైనా ఆపేస్తే మంచిది. అసలు ఎక్కడైనా ఎన్నికల్లో ఇలాంటి ట్యాంపరింగ్ వ్యవహారం నిజంగా జరిగిందా లేదా అన్నదే మనం చేయాల్సిన చర్చ. భవిష్యత్తులో ఇలాంటి చిన్న అవకాశం సైతం పూర్తిగా లేకుండా పోవాలంటే ఏం చెయ్యాలన్నది మనం ఆలోచించాల్సిన మరో అంశం. మొదటి విషయానికొస్తే.. ఏ ఎన్నికల్లోనైనా ట్యాంపరింగ్ జరిగిందని నిరూపించడానికి ఏ పార్టీ దగ్గరా ఆధారాలు లేవు. ముంబైలో ఒక అభ్యర్థికి తన పోలింగ్ బూత్లో ఒక్క ఓటూ పడలేదన్న విషయం, మధ్యప్రదేశ్లో ఇటీవల జరిగిన ఉపఎన్నిక సందర్భంగా ఈవీఎంలో జరిగాయని చెప్పిన లోటుపాట్లూ... ఇవి రెండూ మీడియా పరిశోధనలో అబద్ధమని తేలాయి. ఇటీవల జరిగిన ఎన్నికలలో ఫిర్యాదులన్నీ ఫలితాలు వెలువడ్డ తర్వాతే ముందుకొచ్చాయన్నది గమనార్హం. పోలింగ్ రోజున ఉదయం పార్టీల ఏజెంట్ల తనిఖీ సందర్భంగా ఎలాంటి ఫిర్యాదులూ రాలేదు. పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అవకతవకలు జరిగిన మాట నిజమే అయితే కాగితపు స్లిప్తో కూడిన ఈవీఎంలను ఉపయోగించిన నియోజకవర్గాల్లోనైనా ఫలి తాలు భిన్నంగా రావాలి కదా. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఢిల్లీ మునిసి పల్ ఎన్నికల్లోనూ అలాంటి ఆధారాలేమీ లేవు. ఈవీఎంలను సాకుగా చూపడం మానండి ఇక రెండో ప్రశ్నకు జవాబు ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు రెండూ ఇదివరకే చెప్పేశాయి. ఏదో మేరకైనా ఈవీఎంల అవకతవకలకు పాల్పడేందుకు ఉన్న అవకాశాన్ని నివారించేందుకు కొత్త తరహా వీవీపీటీ మెషీన్ (ఓటు వేసిన తర్వాత కాగితపు రసీదును వెలువరించే మిషన్)ను ఉపయోగించే విష యంలో అందరిదీ ఏకాభిప్రాయమే. ఇలాంటి కొత్త మెషీన్ల కొనుగోలు కోసం ఎన్నికల కమిషన్కు కావాల్సిన డబ్బును గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వ లేదు. గత మూడేళ్లలో బీజేపీ ప్రభుత్వం కూడా అందుకు సిద్ధపడలేదు. ఈ చర్చ వల్ల జరిగిన ఒకే ఒక లాభం ఏదైనా ఉందంటే ఇప్పుడు కేంద్రం ఆ డబ్బు ఇవ్వడానికి సిద్ధపడటమే. ఇక ముందు జరుగబోయే ఎన్నికలన్నిం టిలోనూ కొత్త నమూనా ఈవీఎంలనే ఉపయోగిస్తామని ఎన్నికల కమిషన్ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నిరర్థక అంశంపై చర్చను ఇకనైనా ఆపే య్యాలన్న గ్రహింపు రాజకీయ పార్టీలన్నింటికీ కలుగుతుందని ఆశిద్దాం. తాజాకలం: ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలలో మా పార్టీ స్వరాజ్ ఇండియా కూడా పోటీ చేసింది. మేం ఒక్క సీటునైనా గెల్చుకోలేకపోయాం. ఓట్లు కూడా మేం ఆశించిన దానికన్నా చాలా తక్కువే పడ్డాయి. మా అభ్యర్థులలో కూడా చాలా మందికి మెషీన్లే మమ్మల్ని మోసం చేశాయేమోనన్న అనుమానం కలి గింది. కానీ మేం ఈవీఎంలను సాకుగా చెప్పడానికి బదులు మన లోపాలే మిటో నిజాయితీగా ఆత్మవిమర్శ చేసుకోవడం మేలని భావించాం. ఇతర పార్టీలు కూడా అలాగే చేస్తాయని ఆశిద్దాం. వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు మొబైల్: 98688 88986 ‘ Twitter: @_YogendraYadav యోగేంద్ర యాదవ్ -
అఖిల పక్షాలతో ఈసీ సమావేశం
న్యూఢిల్లీ: ఈవీఎంల వివాదంపై కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం అయ్యింది. ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతున్నదంటూ ప్రతిపక్షాలు గగ్గోలు రేపుతున్న నేపథ్యంలో ఈ అంశంపై సందేహాలను నివృత్తి చేసేందుకు ఈసీ అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఏడు జాతీయ పార్టీలతో పాటు 48 ప్రాంతీయ పార్టీల నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ నుంచి ఎంపీ వినోద్, టీడీపీ నుంచి ఎంపీ మాల్యాద్రి పాల్గొన్నారు. కాగా ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ఢిల్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలు ట్యాంపరింగ్కు గురవుతున్నాయని విపక్షాలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. యూపీ నేతలు మాయావతి, అఖిలేశ్ యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈవీఎంల పనితీరుపై అనుమానాలు లేవనెత్తారు. ఈవీఎంలను ఎత్తివేసి తిరిగి బ్యాలెట్ పేపర్లను ఉపయోగించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే విపక్ష నేతల బృందం ఈసీని కలిసి ఓ విజ్ఞాపన కూడా అందచేసింది. అయితే, ఈవీఎంలపై ఆరోపణలు ఖండించిన ఈ విషయంలో స్పష్టత ఇచ్చేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఈసీ ఏర్పాటు చేసింది. ఈవీఎంలలో మరింత పారదర్శకతను తెచ్చేందుకు రానున్న ఎన్నికల్లో వోటర్ వెరీఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్)ను ఉయోగించాలని భావిస్తున్నట్టు ఈసీ తెలిపింది. -
ఈవీఎం ట్యాంపరింగ్ను నిరూపించండి: ఈసీ
న్యూఢిల్లీ: ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్)లను ట్యాంపర్ చేస్తున్నారంటూ పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం (ఈసీ) రాజకీయ పార్టీలు, నిపుణులకు బహిరంగ సవాల్ విసిరింది. ఎవరైనా ఈవీఎంలను ట్యాంపర్ చేసి నిరూపించాలంది. ఇందుకోసం మే తొలివారంలో అవకాశం కల్పిస్తామనీ, అనుమానాలు ఉన్నవారు హ్యాకింగ్ చేసి నిరూపించవచ్చంది. 2009లోనూ హ్యాకింగ్ను నిరూపించేందుకు అవకాశమిచ్చినా, ఏ ఒక్కరూ రుజువు చేయలేకపోయారని ఈసీ గుర్తుచేసింది. హ్యాకింగ్ పరీక్ష పెట్టే తేదీలను మరో రెండ్రోజుల్లో ప్రకటిస్తామంది. ఈవీఎంలను ట్యాంపర్ చేయడం వల్లే ఉత్తరప్రదేశ్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలిచిందని బీఎస్పీ ఆరోపిస్తున్న నేపథ్యంలో, ఆ ఎన్నికల్లో వాడిన ఈవీఎంలను కూడా పరీక్షలో పెట్టాలని నిర్ణయించింది. -
ఈవీఎంల ట్యాంపరింగ్పై విచారణ జరపాలి: లాలు
పట్నా: ఈవీఎంల ట్యాంపరింగ్పై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆర్జేడీ నేత లాలూప్రసాద్ యాదవ్ ఆదివారం కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్లో బంధవ్గర్, అతర్లో జరగబోయే ఉప ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇది చాల ముఖ్యమైన విషయమని, ఈవీఎంల ట్యాంపరింగ్లపై వెంటనే విచారణ చెపట్టాలన్నారు. ఈవీఎంల పేపర్ ఆడిట్ ట్రయల్ను ఆయన తప్పుబట్టారు. గత ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేసిన బీజేపీకి వెళ్లినట్లు ప్రింట్లు వచ్చాయని, ఇతర పార్టీలకు పడ్డ ఓట్ల ప్రింట్లు ఎందుకు చూపించలేదని ప్రశ్నించాడు. బీజేపీ ప్రభుత్వం గోవధ నిషేద చట్టాన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కూడ అమలు చేయాలని లాలూఈ సందర్భంగా డిమాండ్ చేశారు. -
కోహ్లిపై ట్యాంపరింగ్ ఆరోపణలు!
ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో కోహ్లి ట్యాంపరింగ్కు పాల్పడ్డాడని బ్రిటన్ పత్రిక డెరుులీ మెరుుల్ ఒక కథనాన్ని ప్రచురించింది. కోహ్లి తన నోట్లో చేరుు పెట్టి తీసిన చాక్లెట్లాంటి పదార్థం ద్వారా బంతికి మరింత మెరుపు తీసుకు వచ్చే ప్రయత్నం చేశాడని, మ్యాచ్ వీడియోలో అది స్పష్టంగా ఉందని ఆరోపించింది. అరుుతే ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్ ముగిసిన ఐదు రోజుల్లోనే ఎవరైనా దీనిపై ఫిర్యాదు చేయవచ్చు. దీనిపై అంపైర్లు, మ్యాచ్ రిఫరీ గానీ, ఇంగ్లండ్ ఆటగాళ్లు గానీ అధికారికంగా ఎలాంటి ఫిర్యాదూ చేయకపోవడంతో ఇది పట్టించుకోవాల్సిన అంశం కాదని ఐసీసీ ప్రతినిధి ఒకరు వెల్ల డించారు. రాజ్కోట్ టెస్టు ఈ నెల 13న ముగిసింది. -
ఓటు డౌటు ‘క్లియర్’!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (ఈవీఎంలు) ద్వారా ఓటేసే విధానం వచ్చిన తర్వాత.. ఆ ఓటు ఎవరికి పడిందోననే అనుమానం మీలో ఏదో మూలన దాగుంది కదూ..! నిజంగా మీరు వేయాలనుకున్న వారికే ఓటు పడిందా..? ఎవరైనా ఆ మెషిన్ను టాంపరింగ్ చేశారా..? మీరు ఒకరికి వేస్తే మరొకరికి ఓటు పడి ఉంటుందా?... ఇలాంటి సందేహాలు గతంలో ఓటేసినప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయా?.. ఇకపై అలాంటి సందేహాలు అక్కర్లేదు. వీటికి త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ఎన్నికల సంఘం చెక్ పెట్టనుంది. ఈవీఎంలపై నెలకొన్న సందేహాలను తీర్చడంతో పాటు ఎన్నికల సంస్కరణలలో భాగంగా ఈ సార్వత్రిక ఎన్నికలలో తొలిసారిగా ‘ఓట్ కన్ఫర్మేషన్’ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. అంటే మీరు వేసిన ఓటు ఎవరికి పడిందో వెంటనే తెలిసిపోతుందన్నమాట. అయితే, ఈ విధానాన్ని ఈసారి ఎన్నికలలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని, విజయవంతం అయితే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఈసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పైలట్ ప్రాజెక్టు కింద మన జిల్లా ఎంపికవుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఓట్ను నిర్ధారించే విధంగా ఉండే ఈవీఎంల అందుబాటు, సిబ్బంది సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం పైలట్ ప్రాజెక్టును ఎక్కడెక్కడ అమలు చేయాలన్నది నిర్ణయిస్తుంది. ఒకవేళ మన జిల్లా ఎంపికయితే, కనీసం ఒకటి, రెండు నియోజకవర్గాలలోనయినా ఈ ఓట్ కన్ఫర్మేషన్ విధానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఓటు ‘కన్ఫర్మ్’ అవుతుంది ఇలా.. ఎన్నికల సంఘం వర్గాల ప్రకారం... పోలింగ్ బూత్లోకి వెళ్లిన తర్వాత ముందుగా గతంలో ఓటేసిన విధంగానే ఈవీఎంలో ఓటేయాలి. ఆ తర్వాత కన్ఫర్మ్ చేసుకోవాలని ఎన్నికల సిబ్బందికి చెపితే వారు మీ ఓటు కన్ఫర్మ్ చేస్తారు. మీరు ఓటేసిన ఈవీఎం దగ్గరే మీరు మరో రెండు సెకన్లు నిలుచుంటే మీకు అదే ఈవీఎంలో మీరు ఏ గుర్తుకు ఓటేశారనేది డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత మీ ఓటును నిర్ధారిస్తూ ఓ స్లిప్ బయటకు వస్తుంది. కానీ ఆ స్లిప్ను మీ చేతికి ఇవ్వరు. మీకు చూపించరు. ఆ స్లిప్ వేరే బాక్సులోనికి వెళ్లిపోతుంది. ఆ స్లిప్లో మీరు వేసిన ఓటు ఎవరికి పడిందో స్పష్టంగా ఉంటుంది. కానీ మీ ఓటరు నెంబరు, మీ వివరాలు ఏమీ ఉండవు. మీరు ఎవరికి ఓటేసింది బయటి వారికి కానీ, ఎన్నికల సిబ్బందికి కానీ తెలిసే అవకాశం ఉండదు. అయితే, మీ ఓటు ఎవరికి పడిందో చాలెంజ్ చేసి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఎన్నికల సిబ్బంది ఆ స్లిప్ను తీసి మీకు చూపిస్తారు.