Telangana Public Service Commission
-
మార్చి ఆఖరులోగా ‘గ్రూప్స్’ తుది ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ‘గ్రూప్స్’ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వచ్చే ఏడాది మార్చి నెలాఖరు కల్లా పూర్తవుతుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు. ఇప్పటికే గ్రూప్–4 ఉద్యోగాల భర్తీ పూర్తయిందని.. వచ్చే ఏడాది జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరిలో గ్రూప్–1 పరీక్షల తుది ఫలితాలు ఇస్తామని తెలిపారు. తర్వాత గ్రూప్–2 ఫలితాలు, వెనువెంటనే గ్రూప్–3 ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. ఆదివారం నుంచి గ్రూప్–2 పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం టీజీపీఎస్సీ కార్యాలయంలో బుర్రా వెంకటేశం మీడియాతో మాట్లాడారు.పకడ్బందీగా ఏర్పాట్లుఈ నెల 15వ తేదీ ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్–1, అదేరోజు మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు పేపర్–2, 16వ తేదీ ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్–3, మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు పేపర్–4 పరీక్ష జరుగుతాయని బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ మేరకు పకడ్బందీగా ఏర్పాటు చేశామని చెప్పారు. 783 ఉద్యోగాలకు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, ఒక్కో పోస్టుకు సగటున 70 మంది పోటీ పడుతున్నారని వెల్లడించారు.గ్రూప్–2 పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,368 కేంద్రాలను సిద్ధం చేశామని.. ప్రత్యక్షంగా 49,848 మంది, పరోక్షంగా మరో 25 వేల మంది సిబ్బంది పరీక్షల విధుల్లో పాల్గొంటారని తెలిపారు. శుక్రవారం నాటికి 75 శాతం మంది అభ్యర్థులు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పారు. అభ్యర్థులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరని స్పష్టం చేశారు. సీసీ కెమెరాలతో పరీక్ష తీరును పర్యవేక్షిస్తామని తెలిపారు.ఈ నెల 18 నుంచి ఢిల్లీ పర్యటన..టీజీపీఎస్సీని మరింత పటిష్టం చేసే క్రమంలో.. ఈ నెల 18, 19 తేదీల్లో టీజీపీఎస్సీ బృందంతో కలిసి ఢిల్లీలో పర్యటించనున్నట్లు బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ నెల 18న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)ను, మరుసటి రోజు స్టాఫ్ సెలెక్షన్కమిషన్(ఎస్ఎస్సీ), తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ని సందర్శిస్తామని చెప్పారు. పరీ క్షలను పారదర్శకంగా నిర్వహించే విధానాలపై అధ్యయ నం చేస్తామని, దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమ ర్పిస్తామని తెలిపారు.వచ్చే నెలలో కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు టీజీపీఎస్సీకి వచ్చే అవకాశం ఉందనితెలిపారు. కొత్త నోటిఫికేషన్లను జాబ్ క్యాలెండర్ ఆధారంగా ప్రకటిస్తామన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించినది టీజీపీఎస్సీయేనని చెప్పారు. టీజీపీఎస్సీలో కొత్తగా 80మంది ఉద్యోగులను డిప్యుటేషన్పై తీసుకుంటున్నట్లు తెలిపారు. -
టీజీపీఎస్సీ ఉద్యోగాల అర్హుల జాబితా విడుదల
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వ శాఖల్లో అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నిక ల్ ఆఫీసర్, డ్రిల్లింగ్ సూపర్వైజర్ ఉద్యోగాల కు అర్హత సాధించిన అభ్యర్థుల ప్రాథమిక జా బితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసింది. ఎలక్ట్రికల్ కే టగిరీలో 50 పోస్టులు, మెకానికల్ కేటగిరీలో 97 పోస్టులకు టీజీపీఎస్సీ అభ్యర్థులను ఎంపి క చేసింది. ఈ జాబితాలు కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్లు కార్యదర్శి నవీన్నికో లస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
టీజీపీఎస్సీని భ్రష్టుపట్టించారు
సాక్షి, హైదరాబాద్: గత పాలకులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)ను రాజ కీయ పునరావాస కేంద్రంగా మార్చి భ్రష్టు పట్టించారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. అదే తాము ఉన్నత చదువులు చదివిన వారిని, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న వారిని టీజీపీఎస్సీలో నియమించామని చెప్పారు. ఏడాది ప్రజాపాలన విజయోత్స వాల్లో భాగంగా సోమవారం ఎన్టీఆర్ మార్గ్లోని హెచ్ఎండీఏ మైదానంలో ఆరోగ్య ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో... సీఎం చేతుల మీదుగా 422 మంది అసిస్టెంట్ సివిల్ సర్జన్లకు, 24 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందజేశారు.16 నర్సింగ్ కళాశాలలను, 32 ట్రాన్స్జెండర్ క్లినిక్లను వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో సీఎం రేవంత్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘గతంలో ఆర్ఎంపీ డాక్టర్ను, డిప్యూటీ తహసీల్దార్ను పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా నియమించారు. ఒక కలెక్టర్ను సెక్షన్ ఆఫీసర్, అటెండర్ నిర్ణయించలేరు కదా. అందుకే ఉన్నత చదువులు చదివిన వారిని, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారిని టీజీపీఎస్సీలో నియమించాం.టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలతో 563 మంది గ్రూప్–1 అధికారులు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారు. టీజీపీఎస్సీ పనితీరుకు ఇది గీటురాయి. మహేందర్రెడ్డి పదవీ విరమణ చేస్తుంటే మూడున్నరేళ్ల సర్వీస్ ఉన్నప్పటికీ సర్వేల్లో చదివిన సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశంను కమిషన్ చైర్మన్గా నియమించాం.రికార్డు స్థాయిలో నియామకాలు చేశాంఏడాదిలోనే 14 వేల మందిని వైద్యారోగ్య శాఖలో నియమించడం దేశంలోనే రికార్డు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిది మెడికల్ కాలేజీలు ఇచ్చి ఎలాంటి వసతులూ కల్పించలేదు. కానీ మేం దేశంలోనే అత్యధిక డాక్టర్లను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. కొత్తగా 6,500 మందిని వైద్యారోగ్యశాఖలో నియమించాలని నిర్ణయించాం. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఒకే ఏడాది 50 వేల ఉద్యోగాలు ఇవ్వలేదు.ఈ విషయంలో తెలంగాణ చరిత్ర సృష్టించింది. కేసీఆర్ ఇంట్లో వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తేనే తెలంగాణ యువతకు ఉద్యోగాలు వచ్చాయి. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇస్తే ప్రశ్నపత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్ముకునేవాళ్లు. డీఎస్సీ వాయిదా వేయాలని రాజకీయ ప్రేరేపిత ఆందోళన చేశారు. ఎవరు అడ్డుపడినా డీఎస్సీ పరీక్షలు నిర్వహించి 55 రోజుల్లో నియామక పత్రాలు అందించాం. తెలంగాణ యువత పట్ల మాకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేశారు2005లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చి పేదలకు అపోలో, యశోదా వంటి కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం అందించి ఆదుకున్నారు. అలాంటి ఆరోగ్యశ్రీని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. మా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచింది. గత ఏడాది కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.835 కోట్లను ప్రజలకు ఇచ్చి ఆదుకున్నాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఇప్పటివరకు కోటీ 15 లక్షల సార్లు ఉచితంగా ప్రయాణం చేశారు. మేం 50లక్షల కుటంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.ఏడాదిలోనే 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం. సంక్రాంతి తర్వాత రైతు భరోసా కచ్చితంగా ఇచ్చి తీరుతాం. మేం రుణమాఫీ పూర్తి చేయడంతో కొందరి గుండెల్లో పిడుగులు పడుతున్నాయి. కొందరు ఫాంహౌజ్లలో పడుకుని బాధపడుతున్నారు. మేం సన్నవడ్లకు ఇస్తున్న బోనస్తో కౌలు రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. వచ్చే పదేళ్లు మా ప్రభుత్వమే ఉంటుంది. బోనస్ కొనసాగిస్తుంది. సన్నాలు పండించండి. బోనస్ తీసుకోండి.ప్రభుత్వాన్ని మీరే కాపాడుకోండిసంక్రాంతి పండుగకు వచ్చే గంగిరెద్దులు, బసవన్నల్లా కొందరు ఇప్పుడే వస్తున్నారు. వాళ్లు ఎన్ని సన్నాయిలు ఊదినా.. అది సర్పంచి ఎన్నికల కోసమే. ఢిల్లీలో 11 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మాపై విమర్శలు చేస్తున్నాయి. ఈ 10 నెలల్లో అద్భుతాలు జరుగుతాయా? ప్రభుత్వాన్ని బదనాం చేసేవారికి కర్రు కాల్చి వాత పెట్టాలి. మీరు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత మీదే. ప్రభుత్వంపై జరుగుతున్న విషప్రచారాన్ని తిప్పికొట్టాలి..’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు.ప్రజారోగ్యంపై మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది: భట్టిరాష్ట్రంలో పేదల ఆరోగ్యం కోసం చిత్తశుద్ధితో కృషి చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆరోగ్య ఉత్సవంలో ఆయన మాట్లాడారు. పదేళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిందని.. ఆరోగ్యశ్రీని, ప్రభుత్వ ఆస్పత్రులను పట్టించుకోలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో పేదల వైద్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు.ఇక మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత వైద్య పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని.. అదనంగా రూ.487.29 కోట్లు నిధులు కేటాయించామని చెప్పారు. ట్రాన్స్జెండర్ల కోసం దేశంలోనే తొలిసారిగా మైత్రి క్లినిక్లను ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, షబ్బీర్ అలీ, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
టీజీపీఎస్సీ చైర్మన్గా బుర్రా వెంకటేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నూతన చైర్మన్గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియమితులు కానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా నియామక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం టీజీపీఎస్సీ చైర్మన్గా ఉన్న ఎం.మహేందర్రెడ్డి పదవీకాలం ఈ నెల 3వ తేదీతో ముగుస్తోంది. ఆ తర్వాత బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించనున్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నాలుగో చైర్మన్గా బుర్రా వెంకటేశం నిలవనున్నారు. ఆయన వయసు 62 ఏళ్లు పూర్తయ్యే వరకు లేదా ఆరేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. పదవీ విరమణ చేసిన అధికారులను టీజీపీఎస్సీ చైర్మన్గా నియమిస్తే... సంస్కరణలు తీసుకురావడం, అమలు చేయడానికి తగిన సమయం ఉండదన్న ఉద్దేశంతో బుర్రా వెంకటేశంను సీఎం రేవంత్రెడ్డి ఎంపిక చేశారని అధికార వర్గాలు చెబుతున్నాయి. వివిధ హోదాల్లో పనిచేసి... బుర్రా వెంకటేశం ప్రస్తుతం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు. గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా, జేఎనీ్టయూ వైస్ చాన్స్లర్గా అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్నారు. జనగామ జిల్లా కేశవాపురం గ్రామానికి చెందిన బుర్రా వెంకటేశం.. 1995 సివిల్స్లో జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయనే టాపర్. ఆయన 2005– 2009 మధ్య మెదక్, గుంటూరు జిల్లాల కలెక్టర్గా పనిచేశారు. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిగా, యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం– సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్గా, కార్యదర్శిగా సుదీర్ఘకాలం కొనసాగారు. జిల్లా కలెక్టర్గా తన అనుభవాలతో ‘పాత్వేస్ టు గ్రేట్ నెస్–కమింగ్ టుగెదర్ ఫర్ చేంజ్’పుస్తకం కూడా రాశారు. కీలక కార్యక్రమాలతో గుర్తింపు బుర్రా వెంకటేశం రాష్ట్రంలో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్, అంతర్జాతీయ స్వీట్స్ ఫెస్టివల్, అంతర్జాతీయ ఫోటోగ్రఫీ ఫెస్టివల్, హైదరాబాద్ హెలీ టూరిజం పేరిట విభిన్న కార్యక్రమాలను పరిచయం చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. పరీక్ష తేదీ నుంచి కేవలం 65 రోజుల రికార్డు సమయంలో ఏకంగా 11 వేల ఉపాధ్యాయ పోస్టుల నియామక ప్రక్రియను పూర్తి చేశారు. అదే సమయంలో 35వేల మంది టీచర్లకు పదోన్నతులు, 22 వేల మందికి బదిలీల ప్రక్రియలనూ విజయవంతంగా నిర్వహించారు.2005లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నుంచి ప్రశంసా పత్రాన్ని.. 2016లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి అత్యుత్తమ పౌర పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన సామాజిక సేవకు గుర్తింపుగా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ పది బంగారు పతకాలను అందజేసింది. 2019లో ‘సెల్ఫీ ఆఫ్ సక్సెస్’అనే పుస్తకం రాశారు. రామాయణ పరివారం, జీవన ధాన్య శతకం, ‘బుద్ధ శతకం’కూడా రాశారు. పదవికి ముందు పదోన్నతి విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న బుర్రా వెంకటేశం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొందారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. టీజీపీఎస్సీ చైర్మన్గా ఆయన పేరు ఖరారైన నేపథ్యంలో ఈ పదోన్నతి ఇవ్వడం గమనార్హం. -
టీజీపీఎస్సీ చైర్మన్గా బుర్రా వెంకటేశం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ (టీజీపీఎస్సీ)గా ఐఏఎస్ అధికారి బుర్ర వెంకటేశంను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం(నవంబర్30) ఉత్తర్వులు జారీ చేసింది.బురర్రా వెంకటేశం నియామకానికి సంబంధించిన ఫైల్పై గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సంతకం చేయడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.టీజీపీఎస్సీ చైర్మన్గా నియమితులవ్వడంతో ఇప్పుడున్న అన్ని పోస్టులకు రాజీనామా బుర్ర వేంకటేశం రాజీనామా చేయనున్నారు.ఇప్పటికే ఈయన వీఆర్ఎస్ అప్లై చేయడంతో దానికి ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. డిసెంబర్ 2న వెంకటేశం బాధ్యతలు స్వీకరించనున్నారు. టీజీపీఎస్సీ చైర్మన్గా నియమితులవడం వల్ల సంతోషంగా ఉందని వెంకటేశం తెలిపారు. -
డిసెంబర్ 15,16న గ్రూప్–2 పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–2 ఉద్యోగాల భర్తీకి సంబంధించి అర్హత పరీక్షల షెడ్యూల్ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో నాలుగు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది.ఐదోసారి ప్రకటనవివిధ ప్రభుత్వ శాఖల్లో 783 గ్రూప్–2 ఉద్యోగ ఖాళీల భర్తీకి టీజీపీఎస్సీ 2022 డిసెంబర్ 26న నోటిఫికేషన్ విడుదల చేయడం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హత పరీక్షలు ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా పడగా తాజాగా టీజీపీఎస్సీ ఐదోసారి పరీక్షల తేదీలను ప్రకటించింది. గతేడాది ఆగస్టులో జరగాల్సిన ఈ పరీక్షలను ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో అక్టోబర్కు రీ–షెడ్యూల్ చేస్తూ టీజీపీఎస్సీ తేదీలను ప్రకటించింది. ఆ తర్వాత ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో నిర్వహించనున్నట్లు కమిషన్ మరో ప్రకటన చేసింది. అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడటం, టీజీపీఎస్సీని ప్రక్షాళనతో ఏర్పాటైన కమిషన్... గ్రూప్–2 పరీక్షలను ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించనున్నట్లు షెడ్యూల్ విడుదల చేసింది. కానీ డీఎస్సీ పరీక్షల నేపథ్యంలో గ్రూప్–2 పరీక్షల తేదీలను మార్చాలంటూ క్షేత్రస్థాయి నుంచి అభ్యర్థులు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేయడంతో ప్రభుత్వం... పరీక్షల తేదీలను మార్చాలని కమిషన్కు సూచించింది. ఈ క్రమంలో డిసెంబర్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించిన కమిషన్ తాజాగా షెడ్యూల్ను విడుదల చేసింది. గ్రూప్–2 ఉద్యోగాల కోసం 5.45 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. -
అక్టోబర్ 21 నుంచి గ్రూప్–1 మెయిన్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు వరుసగా పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఏడు పరీక్షలు వరుసగా హైదరాబాద్లో హెచ్ఎండీఏ పరిధిలో జరగనున్నాయి. ప్రతీ పరీక్షకు 3 గంటల సమయం ఉంటుందని, గరిష్ట మార్కులు 150 అని కమిషన్ వెల్లడించింది. జనరల్ ఇంగ్లిష్ పరీక్ష ప్రశ్నపత్రం మినహా మిగతావన్నీ ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ఉంటాయి. అభ్యర్థి ఇష్టానుసారంగా భాషను ఎంచుకుని జవాబులు రాయొచ్చు. కన్వెన్షనల్, డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది. ఆరు పరీక్షలను ఎంపిక చేసుకున్న ఒకే భాషలో రాయాల్సి ఉంటుందని, ఒక్కో పరీక్షను ఒక్కో భాషలో రాసే అవకాశం లేదని పేర్కొంది. అలా రాసినట్లైతే వాటిని పరిగణనలోకి తీసుకోమని కమిషన్ స్పష్టంచేసింది. జనరల్ ఇంగ్లిష్ పరీక్ష పదోతరగతి స్థాయిలో ఉంటుంది. ఈ పరీక్షలో వచ్చిన మార్కులను ర్యాంకింగ్ పరిధిలోకి తీసుకోరు.. కానీ ఈ పరీక్షలో క్వాలిఫై అయితేనే ఇతర పరీక్షల పేపర్లను వాల్యుయేషన్ చేస్తారు. ఇందులో ఫెయిలైతే తక్కిన పేపర్లను పరిగణనలోకి తీసుకోరు. అభ్యర్థి నిర్దేశించిన అన్ని పరీక్షలకు తప్పకుండా హాజరు కావాలి. ఇందులో ఏ ఒక్క పరీక్షకు గైర్హాజరైనా వెంటనే అనర్హతకు గురవుతారు. మెయిన్ పరీక్షలకు సంబంధించిన సిలబస్, విధానం తదితర పూర్తిస్థాయి సమాచారం కమిషన్ వెబ్సైట్లో ఉందని టీజీపీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
గ్రూప్–1 ప్రిలిమ్స్కు తీవ్ర పోటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ మూడో సారి నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షలో తీవ్ర పోటీ నెలకొంది. గతంలో రెండుసార్లు నిర్వహించి రద్దు చేసిన ప్రిలిమ్స్తో పోలిస్తే ఈసారి అభ్యర్థుల సంఖ్య భారీగా పెరిగింది. ఈసారి పరీక్షకు 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 3.02 లక్షల మంది (74%) ప్రిలిమ్స్ రాసినట్లు కమిషన్ ప్రాథమికంగా వెల్లడించింది.దీనికితోడు ఈసారి ప్రశ్నపత్రం సులభంగా ఉండటంతో కటాఫ్ మార్కులపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. అన్ని కేటగిరీల్లో ప్రశ్నలు సులభతరం నుంచి మధ్య స్తంగా ఉన్నట్లు ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. కమిషన్ ప్రాథమిక ‘కీ’విడుదల చేశాకే స్పష్టత కటాఫ్పై వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అర్హతకు కనీసం 50 శాతానికి పైబడి మార్కులు రావాల్సిందేనని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండుసార్లు రద్దు కావడంతో..: వాస్తవానికి గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి 2022 ఏప్రిల్లో 503 ఉద్యోగాల భర్తీకి కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అదే ఏడాది అక్టోబర్లో ప్రిలిమ్స్ నిర్వహించి 1:50 నిష్పత్తిలో మెయిన్ పరీక్షలకు తేదీలు ప్రకటించింది. కానీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగు చూడటంతో ప్రిలిమ్స్ను కమిషన్ రద్దు చేసింది. ఆ తర్వాత గతేడాది జూన్లో రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించగా అందులో లోపాలు జరిగాయంటూ అభ్యర్థులు కోర్టుకెక్కారు.దీంతో కోర్టు ఆదేశంతో ప్రిలిమ్స్ను కమిషన్రద్దు చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం... కొత్తగా 60 గ్రూప్–1 పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వడంతో టీజీపీఎస్సీ మొత్తంగా 563 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తును అప్డేట్ చేసుకొనే అవకాశం కల్పించడంతోపాటు కొత్తగా దరకాస్తు చేసుకొనే అవకాశం కలి్పంచింది. దీంతో కొత్తగా 23 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఫలితంగా అభ్యర్థుల సంఖ్య 4.03 లక్షల చేరింది. -
టీఎస్పీఎస్సీ ఉద్యోగులకూ సిట్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్స్ కేసులో సిట్ దర్యాప్తులో ముందుకు వెళ్లే కొద్దీ.. కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీలో పని చేస్తున్న వాళ్లందరినీ ప్రశ్నిస్తోంది సిట్. తాజాగా.. టీఎస్పీఎస్సీలో పని చేస్తున్న 42 మంది ఉద్యోగులకూ సిట్ నోటీసులు జారీ చేసింది. సిట్ బుధవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్లో పని చేస్తున్న 42 మందికి నోటీసులు జారీ చేసింది. వీళ్లలో పేపర్ లీక్స్ వ్యవహారంలో ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్లతో సంబంధాలు ఉన్న వాళ్లే ఉన్నట్లు సమాచారం. దీంతో వాళ్లను ప్రశ్నించాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే కాన్ఫిడెన్షియల్ రూం అధికారిణి శంకర్ లక్ష్మిని రెండుసార్లు పిలిపించుకుని ప్రశ్నించింది సిట్. ఈమె సిస్టమ్ నుంచే పేపర్లు లీక్ అయ్యాయనే అనుమానాలు ఉన్నాయి. తాజాగా నోటీసులు ఇచ్చినవాళ్లలో.. టీఎస్పీఎస్సీలో టెక్నికల్ డిపార్ట్మెంట్తో సంబంధం ఉన్నవాళ్లే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇక.. ప్రధాన సూత్రధారి రాజశేఖర్ స్నేహితుడైన సురేష్ నడుమ సంబంధాలపై సిట్ ఆరా తీస్తోంది. సైబర్ క్రైమ్ టెక్నికల్ టీం వీళ్లిద్దరి మధ్య వాట్సాప్ ఛాటింగ్, కాల్ డేటా, లావాదేవీల ఆధారంగా కీలక ఆధారాలు సేకరించింది. ఈ ఆధారాలను బట్టి.. రాజశేఖర్ టీఎస్పీఎస్సీ నుంచి పేపర్ తీసుకెళ్లి సురేష్కు ఇచ్చినట్లు గుర్తించింది సిట్. అయితే సురేష్ సైతం పేపర్ను లీక్ చేశాడా? చేస్తే ఎంత మందికి పేపర్ ఇచ్చాడు? అనే కోణంలో సిట్ దర్యాప్తు ఇప్పుడు ముందుకు సాగుతోంది. మరోవైపు పేపర్ లీకేజ్ కేసులో.. నేడు సిట్ దర్యాప్తు ఐదవ రోజు ముగిసింది. మొత్తం తొమ్మిది మంది నిందితులను ఏడు గంటలపాటు విచారణ చేపట్టింది సిట్. ప్రవీణ్, రాజశేఖర్ పెన్ డ్రైవ్లలోని ప్రశ్న పత్రాలు లీక్ కావడంపై నిందితులను సిట్ అధికారులు ప్రశ్నించారు. అదే సమయంలో.. పలు అంశాలపై టెక్నికల్ ఆధారాలు సేకరించించింది సైబర్ క్రైమ్ టెక్నికల్ టీం. రేణుక, నిలేష్, గోపాల్ల నడుమ రూ. 14 లక్షల నగదు ట్రాన్జాక్షన్స్ జరిగినట్లు గుర్తించింది. ఈ లావాదేవీలపై సిట్ కూపీ లాగుతోంది. ఇక రాజశేఖర్ కాంటాక్ట్ లిస్ట్, వాట్సాప్ ఛాటింగ్ వివరాల ఆధారంగానే సిట్ నిందితులపై ప్రశ్నలు గుప్పిస్తోంది. ఇదీ చదవండి: మళ్లీ పిలిపించే అవసరం రాకుండా చూసుకోండి! -
ఒక్కడు చేసిన పాపం.. ఎందరికో శాపం
పరీక్షల రద్దు ప్రకటన వేలాది మందికి అశనిపాతమే అయింది. పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్ధులకు కేరాఫ్గా మారిన ఆర్టీసీ క్రాస్రోడ్స్, చిక్కడపల్లి, అశోక్నగర్, తదితర ప్రాంతాలు పరీక్షల రద్దు ప్రకటనతో ఉలిక్కిపడ్డాయి. అశోక్నగర్లోని నగర కేంద్ర గ్రంథాలయంలో చదువుకుంటున్న వేలాది మందిలో గందరగోళం నెలకొంది. ఒక్క సిటీసెంట్రల్ లైబ్రరీలోనే కాదు..అశోక్నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని అద్దె గదుల్లో, స్టడీరూమ్లలో, కోచింగ్ కేంద్రాల్లోనూ చదువుకుంటున్న లక్షలాది మంది అభ్యర్ధులు కొద్ది రోజులుగా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అశోక్నగర్ ప్రాంతంలోనే చిన్నవి, పెద్దవి సుమారు 30కి పైగా కోచింగ్ కేంద్రాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. వయోపరిమితిలో చివరకు చేరుకొన్న అభ్యర్ధులు మొదలుకొని, ఈ ఏడాదే డిగ్రీ పూర్తయిన విద్యార్థుల వరకు ఒక్కో అభ్యర్థి కోచింగ్కు, మెటీరియల్కు, ఇళ్ల అద్దె, భోజనం తదితర సదుపాయాల కోసం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు చేశారు. తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన అభ్యర్థులంతా ప్రస్తుతం హైదరాబాద్లోనే మకాంవేసి ఉంటున్నారు.‘పరీక్షల రద్దుతో చదవడం మానేసి ఇంటికి వెళ్లాలా లేకపోతే మరో ప్రకటన కోసం ఎదురు చూస్తూ చదువుకోవాలా’ తేల్చుకోలేకపోతున్నట్లు పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పొలం అమ్ముకున్నాడు బోధన్ సమీపంలోని కోటగిరి ప్రాంతానికి చెందిన శంకర్ కుటుంబానికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. ఉన్న కొద్దిపాటి భూమిలో అరఎకరం భూమిని తన చదువుల కోసమే అమ్మేశారు. మరో రూ.6 లక్షలు అప్పు చేయవలసి వచ్చింది. రెండేళ్లుగా కష్టపడి చదువుతున్నాడు. గ్రూప్–1 ప్రిలిమ్స్లో అర్హత సాధించాడు. మెయిన్స్లోనూ విజయం సాధిస్తాననే గట్టి నమ్మకంతో ఉన్నాడు.‘ఐదు రూపాయల భోజనం తిని చదువుకుంటున్నాను. స్టడీమెటీరియల్, కోచింగ్, పరీక్షల కోసమే ఎక్కువ ఖర్చు చేస్తున్నా. ఇటీవల ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది. అయినా సరే ఉద్యోగం వస్తే అంతా బాగుంటుందనే ఆశతో ఉన్నాను. కానీ ఇప్పుడు ఇలా అయింది.’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. హైదరాబాద్లో ఉండాలా, వద్దా తేల్చుకోలేకపోతున్నట్లు చెప్పాడు. ఏం సమాధానం చెప్పాలి సంగారెడ్డికి చెందిన పద్మావతి ఏడాదిన్నర కాలంగా పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్నారు. ఇంటికి, కుటుంబానికి దూరంగా హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఈసారి ఎలాగైనా జాబ్ గ్యారెంటీ అనే నమ్మకంతో ఉన్నారు. కానీ ప్రస్తుత పరిణామాలు ఆమె నమ్మకాన్ని వమ్ము చేశాయి. ‘ఎప్పటి వరకు ప్రిపరేషన్ పూర్తవుతుంది. పరీక్షలు ఎప్పుడు రాస్తావు, మళ్లీ ఇంటికి ఎప్పుడొస్తావు అని నాన్న అడుగుతున్నారు. కానీ ఏం సమాధానం చెప్పాలి?’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రద్దు మంచిదే ‘ఒకవిధంగా రద్దు చేయడం మంచిదే. లీకేజీ వల్ల నిజాయితీగా కష్టపడే వాళ్లకు అన్యాయం జరుగుతుంది. కానీ లక్షలాది మంది అభ్యర్ధుల భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో ఒక ప్రభుత్వ సంస్థ ఇంత బలహీనంగా ఉండడమే ఆందోళన కలిగిస్తోంది’ అని మరో అభ్యర్థిని విజయలక్ష్మి పేర్కొన్నారు. సగటున ఒక అభ్యర్థి ఖర్చులు అంచనా.. నలుగురితో కలిసి ప్రతి నెలా చెల్లించే ఇంటి అద్దె : రూ.3500 నెల భోజనం ఖర్చు : రూ.2900 స్టడీరూమ్ (ఏసీ) రూ.1700 స్టడీరూమ్ (నాన్ ఏసీ) రూ.900 గ్రూప్–1 కోచింగ్ ఫీజు రూ. 75,000 గ్రూప్–2, కోచింగ్ ఫీజు రూ.28,000 స్టడీ మెటీరియల్ రూ.15000 ఒక అభ్యర్ధికి ఏడాదికి అయ్యే ఖర్చు సుమారు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు. మరిన్ని అదనపు సదుపాయాలతో చదువుకుంటే రూ.3 లక్షలపైనే ఖర్చవుతుంది. రద్దు అన్యాయం నేను గ్రూప్–1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. మెయిన్స్కు చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్న సమయంలో పేపర్ లీక్ అంటూ రద్దు చేశారు. ఇది చాలా అన్యాయం. ఎవడో తప్పు చేస్తే నిజాయితీగా రాసిన వేలాదిమంది అభ్యర్థులను పరిగణనలోనికి తీసుకోకుండా పరీక్ష పూర్తిగా రద్దు చేయడం అన్యాయం. తప్పు చేసిన వారిని గుర్తించి శిక్షించాలి కానీ అందరికి శిక్ష వేడం సరికాదు. ఈ విషయంలో పునరాలోచించి మాలాంటి వారికి న్యాయం చేయాలని కోరుతున్నా. – పిట్ల సరిత, డిచ్పల్లి, గ్రూప్–1 అభ్యర్థి -
టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం?!
సాక్షి, హైదరాబాద్: పేపర్ లీకేజీ ప్రకంపనలతో.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవాళ జరిగిన కీలక భేటీలో.. కీలకనిర్ణయమే తీసుకున్నట్లు తెలుస్తోంది. కొలువుల జాతర పేరుతో.. ఈ మధ్యకాలంలో మొత్తం వివిధ రకాల పరీక్షలకు సంబంధించి 26 నోటిఫికేషన్లను రిలీజ్ చేసింది టీఎస్పీఎస్సీ. అయితే ఏఈ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగు చూడడం, ఆపై సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తుండడంతో.. ఇప్పుడు కొన్ని పరీక్షలను రద్దు చేస్తూనే, దాదాపు అన్ని పరీక్షల ప్రశ్నాపత్రాలను మార్చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. 20 పరీక్షలకు సంబంధించి మార్పులు చేర్పులు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు స్పష్టమైన సమాచారం అందుతోంది. ఇప్పటికే ఏడు పరీక్షలు జరగ్గా.. వాటి పేపర్లు మొత్తం! లీక్ అయినట్లు సిట్ దర్యాప్తు నివేదిక ద్వారా దాదాపుగా నిర్ధారణ చేసుకుంది కమిషన్. ఈ నేపథ్యంలో మొన్న ఏఈ పరీక్ష.. ఇవాళ గ్రూప్-1 ప్రిలిమ్స్తో పాటు మరో రెండు పరీక్షలను(ఏఈఈ, డీఏవో పరీక్షలు) సైతం రద్దు చేసి.. వాటిని తిరిగి నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అంటే అయిపోయిన నాలుగు పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు సిద్ధం కాగా.. మరో మూడు పరీక్షల నిర్వహణను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. అవే.. గ్రౌండ్ వాటర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, జూనియర్ లెక్చరర్ పరీక్షలు. ఈ క్రమంలో ఈ పరీక్షల కోసం ఇప్పటికే సిద్ధం చేసిన ప్రశ్న పత్రాలతో పాటు.. రాబోయే రోజుల్లో జరగబోయే మిగతా పరీక్షల పత్రాలను సైతం మార్చాలని యోచిస్తోంది. రాబోయే మూడు, నాలుగు నెలల్లో.. టీఎస్పీఎస్సీ దాదాపు 20కి పైగా పరీక్షలు నిర్వహించేందుకు ప్లాన్ వేసుకుంది. పేపర్ లీకేజీ వ్యవహారం నేపథ్యంలో విమర్శలకు, అభ్యర్థుల అనుమానాలకు తావు లేకుండా.. ముందస్తు జాగ్రత్తగా.. ప్రశ్నాపత్రాలను తిరిగి రూపొందించాలని కమిషన్ భావిస్తోంది. పరీక్ష తేదీలను మార్చేసి, ఆలోపు కొత్త ప్రశ్నాపత్రాలను సిద్ధం చేసి పరీక్షలు నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. హైకోర్టులో పిటిషన్ ఇదిలా ఉంటే.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై ఎన్ఎస్యూఐ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బలమూరు వెంకట్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే.. ఈ కేసులో బీఆర్ఎస్ నేతల హస్తం ఉందని పిటిషన్లో పేర్కొన్న ఆయన.. రాష్ట్ర పరిధిలోని సిట్తో కాకుండా సీబీఐగానీ, సిట్టింగ్ జడ్జితోగానీ ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని ఆయన పిటిషన్లో కోర్టును కోరారు. -
TSPSC: మెయిన్ సర్వర్ నుంచే పేపర్ కొట్టేశాడు
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో కీలకాంశాలు వెలుగు చూశాయి. రిమాండ్ రిపోర్ట్లో కీలకాంశాలను ప్రస్తావించారు పోలీసులు. ప్రధాన నిందితుడు ప్రవీణ్ తన నేరాన్ని అంగీకరించినట్లు అందులో పేర్కొంటూనే.. ఈ మొత్తం తతంగం ఎలా జరిగిందనేది అందులో వివరించారు. మెయిన్ సర్వర్ నుంచే ప్రశ్నాపత్రాన్ని కొట్టేశాడు టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ కుమార్. లూప్ ఉన్న కంప్యూటర్ల ద్వారా ఆ పేపర్ను సేకరించాడు. సేకరించిన పేపర్ను ప్రింట్ తీసుకుని తనతో సన్నిహితంగా ఉంటున్న రేణుకకు షేర్ చేశాడు ప్రవీణ్. ఆపై.. పేపర్ అమ్మేందుకు రేణుకు ఫ్యామిలీ చాలా ప్రయత్నాలే చేసింది. రేణుక తన కమ్యూనిటీలోని పలువురికి తన దగ్గర పేపర్ ఉందని సమాచారం ఇచ్చింది. ఈ ప్రచారంలో రేణుక భర్త, సోదరుడు ముఖ్యపాత్ర పోషించారు. ఒక్కో పేపర్కి రూ.20 లక్షలు డిమాండ్ చేసింది రేణుక. అయినప్పటికీ పేపర్ కొనుగోలుకు ఇద్దరు అభ్యర్థులు ముందుకు వచ్చారు. వాళ్లను తన ఇంట్లోనే ఉంచి ప్రిపేర్ చేసింది. పరీక్ష రోజున వనపర్తి నుంచి అభ్యర్థులను తీసుకొచ్చి.. సరూర్నగర్లోని సెంటర్ వద్ద స్వయంగా దింపేసి వెళ్లిపోయిందని పోలీసులు పేర్కొన్నారు. ఇక ప్రవీణ్ ఫోన్లో చాలామంది మహిళల కాంటాక్ట్స్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. వాళ్లతో సంబంధాలు నడిపినట్లు నిర్ధారించుకున్నారు కూడా. అయితే ఇది హనీ ట్రాపా? లేదంటే పక్కా ప్రణాళికగా జరుగుతున్న స్కామా? అనేది మాత్రం ఇంకా నిర్ధారించాల్సి ఉంది. ఇదీ చదవండి: ప్రవీణ్ ఫోన్లో మహిళల అసభ్య ఫొటోలు నిందితులకు 14 రోజుల రిమాండ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలోని నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఈ లీకేజ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన తొమ్మిది మంది నిందితులను నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరు పరచగా, వారికి రెండు వారాల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పు నిచ్చింది. ఈ క్రమంలోనే నిందితులను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ నిందితులకు వైద్య పరీక్షలు పూర్తి కావడంతో నిందితులను చంచల్గూడ జైలుకు తరలించారు. కస్టడీ కోరిన పోలీసులు పేపర్ లీకేజీ కేసు నిందితులను కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు హైదరాబాద్ బేగంబజార్ పోలీసులు. ఈ కేసులో అరెస్ట్ అయిన తొమ్మిది మందిని.. పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. -
Group 4 Notification: 9,168 కొలువులకు నోటిఫికేషన్.. పరీక్ష విధానం ఇదే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో గ్రూప్–4 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తంగా 9,168 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎస్పీఎస్సీ ఇంత భారీ సంఖ్యలో గ్రూప్స్ కొలువుల భర్తీకి ప్రకటన వెలువరించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇందులో 25 ప్రభుత్వ విభాగాల పరిధిలో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్, వార్డు ఆఫీసర్ కేటగిరీల పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్లో దరఖాస్తులు: గ్రూప్–4 పోస్టులకు ఈ నెల 23 నుంచి వచ్చే ఏడాది జనవరి 12వ తేదీ వరకు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. శాఖల వారీగా ఉద్యోగ ఖాళీలపై స్పష్టత ఇచ్చింది. ఆయా పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, కేటగిరీల వారీగా ఖాళీలు, వేతన స్కేల్, వయో పరిమితి తదితర వివరాలతో కూడిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ను ఈ నెల 23న కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుందని.. దీనిని వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో నిర్వహిస్తామని వెల్లడించింది. అన్నీ జూనియర్ అసిస్టెంట్ కేటగిరీవే.. తాజాగా గ్రూప్–4 కేటగిరీలో భర్తీ చేయనున్న ఉద్యోగాలన్నీ జూనియర్ అసిస్టెంట్ స్థాయికి సంబంధించినవే. ఇందులో నాలుగు కేటగిరీలు ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్ కేటగిరీలో 429 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ కేటగిరీలో 6,859 పోస్టులు, జూనియర్ ఆడిటర్ కేటగిరీలో 18 పోస్టులు, వార్డ్ ఆఫీసర్ కేటగిరీలో 1,862 పోస్టులు ఉన్నాయి. -
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. AP: సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం.. వారికి తీపి కబురు.. హోంగార్డులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీపికబురు అందించారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా పోలీసు నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు పోలీసు నియామక ప్రక్రియ నిబంధనలు సవరించి మరీ హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడం విశేషం. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. శాఖల వారీగా గ్రూప్–4 పోస్టుల వివరాలివే.. ఆ రెండు శాఖల్లోనే ఎక్కువ ఖాళీలు.. రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 9,168 గ్రూప్–4 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం లభించిన విషయం తెలిసిందే. అయితే ఈ పోస్టుల వివరాలు, ఏఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి వంటి వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. AP: పోలీసు ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. పోస్టుల వివరాలు ఇవే.. పోలీసు ఉద్యోగార్థులకు శుభవార్త! 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీకి రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ కానుంది. ఏటా 6,500 నుంచి 7 వేల వరకు పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొద్ది నెలల క్రితం పోలీసు శాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. ముందస్తు మేఘాలు! అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం కేసీఆర్ దృష్టి శాసనసభకు ముందస్తు ఎన్నికలు ఉండవని, నిర్దేశిత సమయంలోనే జరుగుతాయని సీఎం కె.చంద్రశేఖర్రావు పలు సందర్భాల్లో చెప్పారు. కానీ.. రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లు, సొంత జాగాలో నివాసాలు, దళితబంధు లాంటి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి దృష్టి సారించడం, కొలువులు భర్తీ చేయాలని నిర్ణయించడం..‘ముందస్తు’కు సంకేతాలేనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. ఎన్నికలే లక్ష్యంగా బాబు డేంజర్ గేమ్.. ఇంకెన్ని దారుణాలు చూడాలో.. ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు... నా చంద్రబాబు అధికారంలో ఉంటే చాలనుకుంటాడు రామోజీరావు. అందుకే... ‘బాబు మాట– బంగారం మూట’ అనే రీతిలో నారా వారు చెప్పే పచ్చి అబద్ధాలను కూడా పతాక శీర్షికల్లో అచ్చేస్తుంటాడు. కాస్తయినా ఇంగితజ్ఞానం, పత్రికగా కొంతైనా సామాజిక బాధ్యత ఉండాలి కదా? తన పాఠకులకే కాదు... ఈ రాష్ట్ర ప్రజలకు కూడా జవాబుదారీ అనే స్పృహ అక్కర్లేదా? పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. US midterm elections results 2022: ఫలితమూ మధ్యంతరమే అమెరికాలో ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికలతో లాభపడింది ఎవరు? హోరాహోరీగా తలపడిన వైరిపక్షాలు డెమొక్రాట్లు, రిపబ్లికన్లు తమ లక్ష్యాన్ని చేరాయా అంటే కచ్చితంగా లేదనే చెప్పాలి.డెమొక్రాట్లకు చావు తప్పి కన్ను లొట్టబోతే, రిపబ్లికన్లు నిక్కుతూ నీలుగుతూ మునిగిపోయే నావనుంచి చివరి నిమిషంలో బయటపడి అతికష్టం మీద ఊపిరి పీల్చుకున్నారు. అంతో ఇంతో జనాలే లాభపడ్డారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. Neena Rao: విజేత తల్లి ప్రతి బిడ్డా ప్రత్యేకమే. మీ బిడ్డ పదిలో ఒకరు కాకపోవచ్చు. పదిమంది చేసినట్లు చేయకపోవచ్చు. మీకు పుట్టింది ఐన్స్టీన్ కావచ్చు. బిల్ గేట్స్ కూడా కావచ్చు. బిడ్డ మేధాశక్తిని గ్రహించండి. బిడ్డకు ఏమివ్వాలో తెలుసుకోండి. మీ బిడ్డ విజేతగా నిలుస్తాడు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది! ‘అభివృద్ధిని ముందుగా ఊహించిన వాళ్లే ఫలాలను అందుకుంటారు’ స్థిరాస్తి రంగంలో ఇది అక్షర సత్యం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీల రాకతో మొదలైన మాదాపూర్ అభివృద్ధి.. 2007లో రియల్ బూమ్తో చుట్టూ 20 కి.మీ. వరకూ విస్తరించింది. సేమ్ ఇదే తరహా డెవలప్మెంట్ ఉత్తర హైదరాబాద్లో మొదలైంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. వాషింగ్టన్ సుందర్ సరికొత్త చరిత్ర.. 12 ఏళ్ల రికార్డు బద్దలు ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు అద్భుతంగా రాణించినప్పటికీ.. బౌలర్లు మాత్రం మరోసారి పూర్తిగా తేలిపోయారు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. టాలీవుడ్లో మాస్ జాతర.. పూనకాలు తెప్పిస్తారట! టికెట్లు బాగా తెగాలంటే మాస్ ప్రేక్షకులు రావాలి. అందుకే ఏడాదికి రెండొందల సినిమాలు వస్తే.. వాటిలో తొంభై శాతం మాస్ సినిమాలే ఉంటాయి. ఆ మాస్ బొమ్మ (సినిమా) బాగుంటే ఇక మాస్ ప్రేక్షకులకు పండగ... వసూళ్లతో బాక్సాఫీస్కి పండగ. ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న ‘మాస్ బొమ్మ’లపై ఓ లుక్కేద్దాం... పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
వచ్చే వారం గ్రూప్–1 నోటిఫికేషన్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్–1 ఉద్యోగ నియామకాల కసరత్తు వేగవంతమైంది. ఆర్థిక శాఖ అనుమతిచ్చిన 503 గ్రూప్–1 ఉద్యోగాలకు వచ్చే వారం నోటిఫికేషన్ జారీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే నిర్దేశించిన పోస్టులకు సంబంధించి ఆయా ప్రభుత్వ శాఖలు టీఎస్పీఎస్సీకి ప్రతిపాదనలు సమర్పిం చగా ఒకట్రెండు శాఖలకు సంబంధించిన ప్రతిపాదనల్లో సందేహాలు తలెత్తడంతో వాటి నివృత్తికి కమిషన్ సవరణ ప్రతిపాదనలు కోరినట్లు తెలిసింది. ఆయా శాఖలు సవరణ ప్రతిపాదనలు సమర్పించిన వెంటనే టీఎస్పీఎస్సీ సమావేశమై కోరం ఆమోదంతో ఉద్యోగ ప్రకటన జారీ చేయనుందని, ఈ ప్రక్రియకు ఎంతో సమయం పట్టదని టీఎస్పీఎస్సీ వర్గాలు పేర్కొన్నాయి. సోమవారం సైతం టీఎస్పీఎస్సీ యంత్రాంగం గ్రూప్–1 ఉద్యోగ ప్రకటనపై పలు సమీక్షలు నిర్వహించి ప్రక్రియ పూర్తికి కసరత్తు చేసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై ఎనిమిదేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు రాష్ట్రంలో గ్రూప్–1 ఉద్యోగ నియామకాలు జరగలేదు. దీంతో కమిషన్ నుంచి ప్రకటన వస్తే రాష్ట్రంలో అదే తొలి ప్రకటన కానుంది. (చదవండి: ఇంటర్వ్యూ రద్దుతో ‘రాత’ మారేనా!) -
గ్రూప్–1లో తెలుగు అర్హత పేపర్ పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో తెలుగును అర్హత పేపర్గా ప్రవేశపెట్టాలని గ్రూప్–1 పరీక్ష అభ్యర్థులు టీఎస్పీఎస్సీ చైర్మన్ను కోరారు. ఈ మేరకు వారు గురువారం గవర్నర్ తమిళి సై సౌందర రాజన్, మంత్రి శ్రీనివాస్ గౌడ్కు వినతి పత్రాలు అందజేశారు. గ్రామీణ ప్రాంత అభ్యర్థులు చాల వరకూ తెలుగు మాధ్యమంలో చదువుకున్నారని, దీనివల్ల పట్టణ ప్రాంత అభ్యర్థులతో పోటీ పడలేకపోతున్నారని వారు తెలిపారు. పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. వినతి పత్రం సమర్పించిన వారిలో నరేందర్, నాగరాజు, రమేష్, శ్రీనివాస్, పి.వెంకటేశం తదితరులున్నారు. -
తెలంగాణ: నిరుద్యోగులకు గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని అన్ని విభాగాల్లో 3,878 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తేలింది. పురపాలక శాఖ డైరెక్టరేట్ (డీఎంఏ)లో 122, హెచ్ఎండీఏలో 191, ప్రజారోగ్య, ఇంజనీరింగ్ విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) పరిధిలో 432, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ)లో 233, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ ఆథారిటీ (కుడా)లో 70, జీహెచ్ఎంసీలో 879, హైదరాబాద్ జలమండలి (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ)లో 1,951 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. డీఎంఏ, డీటీసీపీ, పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ పరిధిలోని ఖాళీ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ద్వారా నియామక ప్రకటనలు రానున్నాయి. జీహెచ్ఎంసీ, జల మండలి, హెచ్ఎండీఏ, కుడా పరిధిలోని ఖాళీలను శాఖాపరమైన నియామకాల ప్రక్రియ ద్వారా భర్తీ చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. పురపాలక శాఖలోని వివిధ విభాగాల్లో ఖాళీ పోస్టుల వివరాలు కేటగిరీల వారీగా.. దేవాదాయ శాఖలో 128.. రాష్ట్ర దేవాదాయ శాఖలో మొత్తం 128 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. డిప్యూటీ కమిషనర్ (2), అసిస్టెంట్ కమిషనర్లు (12), అసిస్టెంట్ ఇంజనీర్లు (3), ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్–1 (4), ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్–3 (81), జూనియర్ అసిస్టెంట్స్ (16), ఎల్డీసీ (1), టైపిస్టు కమ్ స్టెనో (9). వ్యవసాయశాఖలో 761 ఖాళీలు సాక్షి, హైదరాబాద్: తమ శాఖ పరిధిలోని వివిధ విభాగాల్లో 761 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వ్యవసాయశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. వాటిలో వేర్హౌసింగ్లో ఎక్కువగా 312 ఖాళీలు ఉన్నాయని పేర్కొంది. ఇతర విభాగాల్లో.. విత్తనాభివృద్ధి సంస్థలో 89, విత్తన, సేంద్రీయ ధ్రువీకరణ సంస్థలో 59, రాష్ట్ర సహకార మార్కెటింగ్ ఫెడరేషన్లో 51, ఆగ్రోస్లో 74, హాకాలో 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించింది. కేటగిరీ పోస్టుల సంఖ్య పురపాలక శాఖ డైరెక్టరేట్ (డీఎంఏ)లో.. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్–2 26 మున్సిపల్ కమిషనర్ గ్రేడ్–3 6 హెచ్ఎండీఏలో.. జూనియర్ పర్సనల్ ఆఫీసర్ 37 ఏఈఈలు 54 పబ్లిక్ హెల్త్ ఈఎన్సీలో.. ఏఈఈలు 175 ఏఈలు 75 టెక్నిల్ ఆఫీసర్ 11 కేటగిరీ పోస్టుల సంఖ్య డీటీసీపీలో.. అడిషనల్ డైరెక్టర్ టౌన్ప్లానింగ్ 20 టౌన్ప్లానింగ్ అసిస్టెంట్ 6 టౌన్ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ 175 ఏఏడీఎం 10 కుడాలో.. జూనియర్ పర్సనల్ ఆఫీసర్స్ 2 సర్వేయర్లు 10 జీహెచ్ఎంసీలో... టౌన్ప్లానింగ్ సూపర్ వైజర్లు 200 వెటర్నరీ ఆఫీసర్లు 31 సానిటరీ ఇన్స్పెక్టర్లు 45 హెల్త్ అసిస్టెంట్లు 44 ఫీల్డ్ అసిస్టెంట్లు 120 టౌన్ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ 60 టౌన్ సర్వేయర్లు 30 కేటగిరీ పోస్టుల సంఖ్య హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీలో.. మేనేజర్ (ఇంజనీరింగ్) 159 టెక్నిషియన్ గ్రేడ్–2 72 జనరల్ పర్పస్ ఎంప్లాయి (సిబ్బంది) 110 జనరల్ పర్పస్ ఎంప్లాయి (వాటర్ సప్లై జనరల్) 1,114 జనరల్ పర్పస్ ఎంప్లాయి (సివరేజీ జనరల్) 297 -
50 వేల పోస్టుల భర్తీకి ఒకేసారి అనుమతి
సాక్షి, హైదరాబాద్ : వివిధ ప్రభుత్వ శాఖల్లో 50 వేల ఉద్యోగాల భర్తీకి ఒకేసారి అనుమతి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. ఇదివరకు ఒక్కో శాఖకు ఒక్కోసారి పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చేవారమని, ఇప్పుడు అలాకాకుండా అన్ని శాఖల్లో భర్తీకి ఒకేసారి అనుమతి ఇవ్వాలని భావిస్తున్నామని వెల్లడించారు. అతి త్వరలో భర్తీకి అనుమతులు ఇస్తామని, ఇప్పటికే ఖాళీల గుర్తింపుపై కసరత్తు మొదలు పెట్టామన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యులు విఠల్, చం ద్రావతి, ఖాద్రీల పదవీకాలం పూర్తయిన నేపథ్యంలో గురువారం టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో ఆయ న పాల్గొన్నారు. చక్రపాణి, ఇతర సభ్యులను సీ ఎస్ ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. ఆరేళ్లలో ఘంటా చక్రపాణి అత్యంత పారదర్శకంగా సేవలందిం చారని సీఎస్ కొనియాడారు. మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ విద్యార్థులు ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెం చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఘం టా చక్రపాణి మాట్లాడుతూ రాష్ట్రానికి సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని, నియామకాల భర్తీ ప్రక్రియలో ఉద్యోగులు ఎంతో సహకరించారని, కమిషన్ పరపతి అంతర్జాతీ య స్థాయిలో పెరిగిందన్నారు. టీఎస్పీఎస్సీలో దరఖాస్తు ప్రక్రియ మొదలు ఫలితాల ప్రకటన, అభ్యర్థుల ఎంపిక, నియామక ఉత్తర్వులు.. ఇలా అన్ని స్థాయిల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసి సత్ఫలితాలు తెచ్చామన్నారు. టీఎస్పీఎస్సీ ఇన్చార్జి చైర్మన్గా కృష్ణారెడ్డి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) సభ్యుడు డి.కృష్ణారెడ్డి సంస్థ ఇన్చార్జి చైర్మన్గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి పదవీకాలం గురువారంతో ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
నోటిఫికేషన్లకు... కోరం ఉండాల్సిందే
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కోరం నిబంధనతో వీలైనంత త్వరగా కొత్త నియామకాలను చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. టీఎస్పీఎస్సీ ప్రస్తుత చైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యులు సి.విఠల్, చంద్రావతి, మతీనుద్దీన్ ఖాద్రీల ఆరేళ్ల పదవీకాలం ఈనెల 17తో ముగియనుంది. ఆ తర్వాత కమిషన్లో కేవలం ఇద్దరు సభ్యులు... కృష్ణారెడ్డి, సాయిలు మాత్రమే కొనసాగనున్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ల జారీకి టీఎస్పీఎస్సీలో కోరం ఉండాల్సిందే. కమిషన్ చైర్మన్తో పాటు కనీసం ముగ్గురు సభ్యులు ఉండాలి. కానీ ఈ నెల 17 తర్వాత కమిషన్లో ఇద్దరే మిగులుతారు. కాబట్టి కొత్త చైర్మన్తో పాటు కనీసం ఒక సభ్యుడిని ప్రభుత్వం వీలైనంత త్వరగా నియమిస్తేనే ఉద్యోగ ప్రకటనల జారీకి ఇబ్బందులు ఉండవు. రాజ్యాంగం ప్రకారం చైర్మన్, సభ్యుల కాలపరిమితి పెంచే అవకాశం లేకపోవడంతో కొత్త నియామకాలు అనివార్యం కానున్నాయి. అదేవిధంగా ప్రస్తుత కమిషన్లో ఈనెల 17 తర్వాత మిగిలే ఇద్దరు సభ్యుల్లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఒకరి, అక్టోబర్లో మరొకరి పదవీ కాలం ముగుస్తుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు 50 వేల ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. శాఖల వారీగా ఉన్న ఖాళీలు, ప్రాధాన్యతల ప్రకారం భర్తీకి కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను ఆదివారం ఆదేశించిన సంగతి తెలిసిందే. మంజూరైన ఉద్యోగాలు, ప్రస్తుతం పనిచేస్తున్న వారు, ఖాళీల లెక్కలను తీసే పనిలో వివిధ ప్రభుత్వశాఖలు ఉన్నాయి. ఖాళీల లెక్క తేలాక ప్రభుత్వం వీటి భర్తీకి ఇండెంట్లు ఇస్తే వాటికి సంబంధించిన నోటిఫికేషన్లను టీఎస్పీఎస్సీ ఇవ్వాల్సి ఉంటుంది. పదవీ విరమణ ఉత్తర్వులు జారీ టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యులు సి.విఠల్, బి.చంద్రావతి, మతీనుద్దీన్ ఖాద్రీ ఈ నెల 17న పదవీ విరమణ చేస్తారని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సోమవారంఉత్తర్వులు జారీ చేశారు. -
టెట్ నిర్వహిస్తారా లేదా...?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) కోసం 5.5 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపడితే తమకు టెట్ అర్హత ఉంటుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ముందే టెట్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏటా రెండు సార్లు నిర్వహించాల్సిన టెట్ను ఉమ్మడి రాష్ట్రంలో కలుపుకొని ఇప్పటివరకు ఆరుసార్లే నిర్వహించారు. వాస్తవానికి 12 సార్లు నిర్వహించాల్సిన టెట్ను 6 సార్లే నిర్వహించడంతో ఇంకా 5.5 లక్షల మంది టెట్ కోసం ఎదురు చూస్తు న్నారు. రాష్ట్రంలో 2017 జూలై 23 తర్వాత ఇప్పటి వరకు టెట్ నిర్వహించలేదు. తాజాగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఎన్సీటీఈ నిబంధనల మేరకు.. ఎలిమెంటరీ స్కూల్ టీచర్ (1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు) పరీక్ష రాయాలంటే టెట్లో అర్హత సాధించి ఉండాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి 2011లో ఆదేశాలు జారీ చేసింది. విద్యా హక్కు చట్టం మేరకు టెట్ను తప్పనిసరి చేసింది. టెట్ వ్యాలిడిటీ ఏడేళ్లు ఉంటుందని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా టెట్ పేపర్–1లో అర్హత సాధిస్తే ఒకటి నుంచి 5వ తరగతి వరకు, పేపర్–2లో అర్హత సాధిస్తేనే 6 నుంచి 8వ తరగతి వరకు బోధించవచ్చని పేర్కొంది. టెట్లో అభ్యర్థులు సాధించిన స్కోర్కు ఉపాధ్యాయ నియామకాల్లో 20 శాతం వెయిటేజీ, ఉపాధ్యాయ నియామక పరీక్షకు 80 శాతం వెయిటేజీ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముగిసిన మూడు టెట్ల వ్యాలిడిటీ.. ఎన్సీటీఈ నిబంధనల మేరకు 2011 జూలై 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మొదటి టెట్ నిర్వహించింది. ఆ తర్వాత 2012 జనవరి 8న రెండో టెట్, 2012 జూన్ 1న మూడో టెట్ నిర్వహించింది. ప్రస్తుతం ఆ మూడు టెట్ల స్కోర్కు ఎన్సీటీఈ కల్పించిన ఏడేళ్ల వ్యాలిడిటీ ముగిసింది. ఆయా టెట్ల పేపర్–1, పేపర్–2 పరీక్షలకు తెలంగాణ, ఏపీకి చెందిన వారు 15 లక్షల మందికి పైగా హాజరు కాగా, అందులో 7,41,097 మంది అర్హత సాధించారు. అందులో తెలంగాణకు చెందిన అభ్యర్థులు దాదాపు 4 లక్షల మంది ఉన్నారు. ఏడేళ్ల నిబంధన కారణంగా వారంతా తమ టెట్ వ్యాలిడిటీని కోల్పోయారు. ఆ తర్వాత (2014, 2016, 2017లలో) నిర్వహించిన మరో మూడు టెట్లలో 3,69,308 మంది అర్హత సాధించారు. 2014 మార్చి 16న నిర్వహించిన నాలుగో టెట్లో ఏపీకి చెందిన 70 వేల మంది విద్యార్థులు ఉన్నారు. వారు కాకుండా తెలంగాణ అభ్యర్థులు 3 లక్షల మంది ఆయా టెట్లలో అర్హత సాధించారు. అయితే మొదటి మూడు టెట్లలో అర్హత కోల్పోయిన వారు ఇందులో దాదాపు 2 లక్షల మంది ఉండగా, మరో లక్ష మంది అర్హులు కాలేకపోయారు. నాలుగో టెట్లో అర్హత సాధించని లక్ష మందితో పాటు మరో 3 లక్షల మందికి పైగా పలు టెట్లలో అర్హత సాధించని వారు ఉన్నారు. వారికి తోడు 2017 జూలై 23న నిర్వహించిన చివరి టెట్ తర్వాతి మూడు విద్యా సంవత్సరాల్లో (2018, 2019, 2020) ఉపాధ్యాయ విద్యా కోర్సులను (బీఎడ్, డీఎడ్) పూర్తి చేసుకున్న వారు మరో లక్షన్నర మంది ఉన్నారు. ఇలా మొత్తంగా రాష్ట్రంలో టెట్ కోసం ఇప్పుడు 5.5 లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారంతా టెట్లో అర్హత సాధిస్తేనే టీఆర్టీ రాసేందుకు అర్హులు అవుతారు. ఆ లక్ష మందికి ప్రయోజనం చేకూరేనా? ప్రస్తుతం ఏడేళ్లు మాత్రమే ఉన్న టెట్ వ్యాలిడిటీని శాశ్వతం చేయాలని ఇటీవల ఎన్సీటీఈ పాలక మండలి నిర్ణయించింది. దాన్ని జీవితకాలం వ్యాలిడిటీగా మారుస్తామని స్పష్టం చేసింది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఇప్పటికే టెట్లో అర్హత సాధించిన వారి విషయంలో న్యాయ సలహా తీసుకున్నాకే తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. అయితే దానిపైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా, మొదటి మూడు టెట్లలో అర్హత సాధించినా, తర్వాతి టెట్లలో అర్హత సాధించని మరో 1 లక్షల మందికి టెట్ గండం వచ్చి పడింది. టెట్ వ్యాలిడిటీని శాశ్వతం చేస్తామన్న ఎన్సీటీఈ నిర్ణయాన్ని.. గతంలో టెట్ అర్హత సాధించిన వారికి కూడా వర్తింపజేస్తే ఆ లక్ష మందికి ప్రయోజనం చేకూరనుంది. లేదంటే వారు కూడా మళ్లీ టెట్ రాయాల్సిందే. వెంటనే టెట్ నోటిఫికేషన్ ఇవ్వండి: రామ్మోహన్రెడ్డి, డీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రాష్ట్రంలో వెంటనే టెట్ నోటిఫికేషన్ జారీ చేసి పరీక్ష నిర్వహించాలి. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో టెట్లో అర్హత సాధిస్తేనే అభ్యర్థులకు టీఆర్టీ రాసే అర్హత లభిస్తుంది. టెట్ కోసం 5 లక్షల మందికిపైగా అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. వ్యాలిడిటీ రద్దయిన టెట్ల వివరాలు.. 2011 జూలై 1న మొదటి టెట్.. పేపర్ హాజరు అర్హులు అర్హుల శాతం 1 3,05196 1,35,105 44.27 2 3,34,659 1,66,262 49.68 2012 జనవరి 8 నాటి రెండో టెట్.. 1 55,194 24,578 44.53 2 4,12,466 1,93,921 47.02 2012 జూన్ 1 నాటి మూడో టెట్ 1 58,123 26,382 45.39 2 4,18,479 1,94,849 46.56. ప్రస్తుతం వ్యాలిడిటీ ఉన్న మూడు టెట్లు.. 16–3–2014 – నాలుగో ఏపీ టెట్ 1 65,770 40,688 61.86 2 4,04,385 1,15,510 28.56 22–5–2016– మొదటి తెలంగాణ టెట్ 1 88,661 48,278 54.45 2 2,51,906 63,079 25.04 23–7–2017– రెండో తెలంగాణ టెట్ 1 98,848 56,708 57.37 2 2,30,932 45,045 19.51 –––––––––––––––––––––– 22–5–2016 కానీ జనవరి 24న పరీక్ష జరిగింది. -
సాంకేతికత.. సంస్కరణలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సాంకేతికంగా పలు సంస్కరణలు తీసుకువచ్చి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిగడిం చింది. కమిషన్కు తొలి చైర్మన్గా నియుక్తులైన ఘంటా చక్రపాణి ఆరేళ్లలో పలు వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టారు. ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ మొదలు నియామక పత్రాల జారీ వరకు అన్నింటికీ సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి పారదర్శకతకు కేరాఫ్ అడ్రస్గా టీఎస్పీఎస్సీని తీర్చిదిద్దారు. ఈనెల 17న ఘంటా చక్రపాణి పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో గత ఆరేళ్లలో టీఎస్పీఎస్సీ సాధించిన రికార్డులను పరిశీలిస్తే... అంతా ఆన్లైన్.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోవడంలో టీఎస్పీఎస్సీ జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు ఆదర్శంగా నిలిచింది. ఉద్యోగ ప్రకటనలు మొదలు అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, ఫీజు వసూలు, హాల్టికెట్ల జారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన.. చివరకు ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి నియామక పత్రాన్ని కూడా ఆన్లైన్లో ఇచ్చి టీఎస్పీఎస్సీ తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రత్యేక చర్యల కారణంగా జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్లతో ఏర్పాటైన కమిటీకి అధ్యక్షత వహించే అవకాశం టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణికి దక్కింది. టీఎస్పీఎస్సీ ప్రవేశపెట్టిన పలురకాల సంస్కరణలు ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు కావడంలో ఆయన కీలక భూమిక పోషించారు. మారిషస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ డిసిప్లైన్డ్ ఫోర్సెస్ సర్వీస్ కమిషన్ బృందాలు టీఎస్పీఎస్సీని సందర్శించి ఇక్కడి విధానాలను ప్రత్యక్షంగా వీక్షించి పలు అంశాలను తమ దేశంలో అమలుకు ఉపక్రమించడం ద్వారా టీఎస్పీఎస్సీ ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి ఎగబాకింది. సీసీటీవీలు, డ్రోన్ కెమెరాలను కూడా వినియోగించి పరీక్షల నిర్వహణ, పర్యవేక్షణను సులభతరంగా చేసింది. కమిషన్ తన కార్యకలాపాలన్నీ డిజిటలైజేషన్ చేయడంతో దేశంలోనే అత్యుత్తమ డిజిటల్ పీఎస్సీగా ఎంపికైంది. కంప్యూటర్ ఆధారిత రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ)ని అందుబాటులోకి తీసుకొచ్చి పరీక్షల విధానాన్ని మరింత సరళీకృతం చేసింది. పారదర్శకతకు కూడా కమిషన్ పెద్ద పీట వేసింది. టీఎస్పీఎస్సీ కార్యక్రమాలను ఏటా గవర్నర్కు నివేదిక రూపంలో అందజేయడం అనవాయితీగా పాటిస్తున్నారు. అవినీతి లేని వ్యవస్థను నిర్మించాం.. ‘అవినీతి, ఆశ్రిత పక్షపాతం లేని పారదర్శక వ్యవస్థను నిర్మించగలిగాం. ఇది దేశంలో పీఎస్సీలకు, మారిషస్ లాంటి దేశాలకు మోడల్గా నిలిచింది. వారు మన పద్ధతులను అనుసరించడం గర్వకారణం’అని కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. -
సీఎం కేసీఆర్ ప్రకటన.. నిరుద్యోగుల్లో ఆశలు
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. సర్కారీ కొలువుల నోటిఫికేషన్ల కోసం ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్న వారి నిరీక్షణ త్వరలో ముగియనుంది. ఉపాధ్యాయ, పోలీసు ఉద్యోగాలతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను సీఎం ఆదేశించారు. ‘రాష్ట్రంలో వివిధ శాఖల్లో దాదాపు 50 వేల వరకు ఖాళీలున్నట్లు ప్రాథమిక సమాచారం. వాటన్నింటినీ భర్తీ చేయాలి. వేల సంఖ్యలో ఉపాధ్యాయులు, పోలీసుల రిక్రూట్మెంట్ జరగాల్సి ఉంది. ఈ రెండు విభాగాలతో పాటు రాష్ట్రంలోని ఇతర శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు వెంటనే సేకరించాలి. ఇంకా ఏయే శాఖల్లో ఎంతమంది ఉద్యోగుల అవసరం ఉందో లెక్క తేల్చాలి. అలా లెక్క తేలిన తర్వాత వాటిని భర్తీ చేయడం కోసం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు’ అని సీఎం కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైంది. కొలువుల జాతర మొదలుకానుంది. ఒకటీ రెండు నెలల్లో 50 వేలకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాఖల వారీగా ఖాళీల వివరాలను సేకరించాలని, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను ఆదివారం సీఎం కేసీఆర్ ఆదేశించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. విద్యాశాఖ, పోలీసు, వైద్యారోగ్య శాఖల్లో అత్యధిక పోస్టులు అందుబాటులోకి రానున్నా యి. రాష్ట్రంలో 2018 తరువాత పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ కాకపోవడంతో ఇన్నాళ్లు నిరుద్యోగులంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇపుడు సీఎం ప్రకటనతో వారికి ఊరట లభించినట్లైంది. వీరంతా సీరియస్గా ప్రిపరేషన్లో మునిగిపోనున్నారు. విద్యాశాఖలో 15 వేలకు పైనే రాష్ట్రంలోని పాఠశాలల్లో దాదాపు 15 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. 2017 సంవత్సరంలో 8,972 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన విద్యాశాఖ తాజాగా మరో 15 వేలకు పైగా పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల స్థానాల్లో విద్యా వాలంటీర్లు పనిచేస్తున్నారు. అం దులో ప్రధానంగా విద్యార్థులు ఎక్కువగా ఉండి, ఒక్కరిద్దరే టీచర్లు ఉన్న స్కూళ్లు, సబ్జెక్టు టీచర్లు లేని స్కూళ్లలో గతేడాది 15,661 మంది విద్యా వలంటీర్లు పని చేశారు. అంటే ఆ మేరకు ఉపాధ్యాయ ఖాళీలు కచ్చితంగా ఉన్నాయని విద్యాశాఖ వర్గాలు అంచనాకు వచ్చాయి. ఈ నేపథ్యంలో 15వేలకు పైగానే ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసే అవకాశం ఉంటుంది. పోలీసుశాఖలో 20 వేలు రాష్ట్ర పోలీసు శాఖలో 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. హోంమంత్రి మహమూద్ అలీ కూడా ఇదే విషయాన్ని ఇటీవల చెప్పారు. తాజాగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీసు శాఖలో ఆయా పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది. మరోవైపు వైద్యారోగ్య శాఖలో 12 వేల పోస్టులు, రెవెన్యూ శాఖలో 4 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం చెబు తోంది. వీటితోపాటుఇతర శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు కలిపి 50 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ ఓకే చెప్పారు. టీఎస్పీఎస్సీ ద్వారా.. రాష్ట్రంలో 1,10,012 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అందులో 83,048 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. అయితే ఆయా శాఖల ద్వారా నిబంధనలకు సంబంధించిన క్లియరెన్స్లు లభిం చకపోవడంతో అన్నింటినీ భర్తీ చేయలేకపోయారు. 52,724 పోస్టులు భర్తీకి వివిధ ఏజెన్సీలు నోటిఫికేషన్లు జారీ చేశాయి. అందులో 36,758 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసింది. వాటిలో 35,724 పోస్టుల భర్తీ చేసినట్లు ఇటీవల టీఎస్పీఎస్సీ గవర్నర్కు అందజేసిన వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. పాతవి... కొత్తవి కలిపి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్ పీఆర్బీ) 2018లో 18,428 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 16,925 కానిస్టేబుల్ పోస్టులు, 1,503 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. 2019 సెప్టెంబరు నాటికి వీటికి రాతపరీక్ష పూర్తయి ఫలితాలు వచ్చేశాయి. సబ్ ఇన్స్పెక్టర్లతోపాటు, సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుళ్లకు ఈ ఏడాది జనవరి నాటికి శిక్షణ మొదలైంది. మైదానాల కొరత, కరోనా లాక్డౌన్ కారణంగా తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ)ల శిక్షణలో తీవ్ర జాప్యం నెలకొంది. అక్టోబరు మొదటివారంలో 9,213 మంది సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్ల శిక్షణ పూర్తయి విధుల్లో చేరారు. తాజాగా 1,162 మంది సబ్ ఇన్స్పెక్టర్లు శిక్షణ పూర్తిచేసుకున్నారు. ఈ లెక్కన 10,375 పోస్టులు భర్తీ అయ్యాయి. మరోవైపు భర్తీ కాకుండా సరెండర్ చేసిన పోస్టులు కొన్ని ఉన్నాయి. వాటితో పాటు కొత్తగా ఏర్పడిన ఖాళీలు కలుపుకొని తాజాగా 20 వేల వరకు ఉద్యోగాలు అందుబాటులో ఉన్నట్లు అంచనా. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. మూడేళ్లలో 52 వేలకు పైగా పోస్టుల భర్తీ వైద్యారోగ్య శాఖలో 12 వేలు.. రెవెన్యూలో 4 వేలు తాజా లెక్క తేలాలి... రాష్ట్ర ప్రభుత్వం గతంలో వెల్లడించిన లెక్కల ప్రకారం ఉన్నత విద్యలో 4,702, వ్యవసాయ శాఖలో 3,673, పశుసంవర్ధక శాఖలో 1,842, బీసీ సంక్షేమ శాఖలో 2,881, అటవీ శాఖలో 3,602 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఇప్పటికే కొన్ని ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇపుడు సీఎం ఆదేశాలతో అన్ని శాఖల్లో తాజాగా ఉన్న ఖాళీల వివరాలను సేకరించాక... నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం అనుమతించనుంది. -
బీట్ ఆఫీసర్ల నియామకానికి లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్ : ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల నియామకానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆగిపోయిన బీట్ ఆఫీసర్ల పోస్టుల భర్తీని చేపట్టాలని టీఎస్పీఎస్సీకి హైకోర్టు ఆదేశాలిచ్చింది. 1857 బీట్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ ప్రక్రియ చేపట్టింది. అయితే, టీఎస్పీఎస్సీ 6(A) రూల్స్ పాటించకుండా ఉద్యోగ నియామకాలు చేపడుతోందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న నియామకాలను అడ్డుకోవాలని దాఖలైన పిటిషన్ను హైకోర్టు సింగిల్బెంచ్ విచారించి స్టే విధించింది. దీంతో సింగిల్ బెంచ్ విధించిన స్టే పై పలువురు అభ్యర్థులు డబుల్ బెంచ్లో సవాల్ చేశారు. విచారించిన డబుల్ బెంచ్ బీట్ ఆఫీసర్ల నియామకం జరపాలని.. ఇతరత్రా ఏమైనా నిబంధనలు ఉంటే టీఎస్పీఎస్సీ చూసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అటవీశాఖలో అధికారుల నియామకం ఆగిపోతే ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొంది. -
ఎస్జీటీ పోస్టుల భర్తీ ప్రక్రియపై హైకోర్టు స్టే
సాక్షి, హైదరాబాద్: సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల (ఎస్జీటీ) నియామక ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు, ఇంగ్లిష్ మీడియం ఎస్జీటీ 4,700 పోస్టుల భర్తీ ప్రిక్రియను నిలిపివేస్తూ స్టే ఇచ్చింది ఈ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2017 అక్టోబర్ 21న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు వివిధ జిల్లాలకు చెందిన పి.రామకృష్ణ మరో 27 మంది అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీల్ వ్యాజ్యాలను వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనం గురువారం విచారించింది. ఆ పోస్టులకు సంబంధించి టీఎస్పీఎస్సీ చేపట్టిన ఎంపిక విధానాన్ని తప్పుపడుతూ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై జోక్యం చేసుకునేందుకు సింగిల్ జడ్జి గతంలో నిరాకరించారు. దీంతో వారు అప్పీల్ పిటిషన్లు దాఖలు చేయగా.. గురువారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డిల ధర్మాసనం విచారించి స్టే ఉత్తర్వులు ఇచ్చింది. కమిషన్ నిబంధనల్లోని 6–ఏ ప్రకారం అర్హత సాధించిన అభ్యర్థులను విచారించాలని, ఆ పోస్టులకు ఆసక్తి చూపని వారిని తొలగించాకే ఎంపిక నోటిఫికేషన్ ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎస్.రాహుల్రెడ్డి వాదించారు. వాదనల అనంతరం తెలుగు, ఇంగ్లిష్ మీడియం ఎస్జీటీ పోస్టుల ఎంపిక ప్రక్రియపై స్టే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఉర్దూ, కన్నడ మీడియం పోస్టులకు ఈ ఉత్తర్వులు వర్తించవు. మరోవైపు ఇప్పటికే సర్వీస్ కమిషన్ ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, పోస్టింగ్లు ఇచ్చేందుకు జాబితాను విద్యాశాఖకు పంపించింది. అభ్యర్థులకు ఆ పోస్టింగ్లు ఇచ్చేందుకు అనుమతి కోరుతూ విద్యాశాఖ ప్రభుత్వానికి ఫైలు పంపించింది. అయితే కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ స్టే ఉత్తర్వుల్ని తొలగించాలని కోరుతూ సర్వీస్ కమిషన్ జూన్లో అప్పీల్ చేసే అవకాశాలున్నాయి. -
కార్బైడ్ వినియోగిస్తే కఠిన చర్యలే
సాక్షి, హైదరాబాద్ : వివిధ రకాల పళ్లను మగ్గబెట్టేందుకు కార్బైడ్ను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో దీనికి అడ్డుకట్ట వేసే దిశగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పారిశ్రామిక అవసరాలు, చట్టం నిర్దేశించిన అవసరాలకు మినహా మిగిలిన వాటికి కార్బైడ్ను ఉపయోగించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. చట్ట వ్యతిరేకంగా కార్బైడ్ కలిగి ఉన్న వ్యక్తులపై కఠినచర్యలు తీసు కోవాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. దీనిపై ఓ నివేదికను తమ ముందుంచాలని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 23కు వాయి దా వేసింది. ఈ మేరకు ప్రధానన్యాయమూర్తి (సీజే) తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పళ్లను మగ్గబెట్టేందుకు కొందరు వ్యాపారులు విచ్చలవిడిగా కార్బైడ్ను ఉపయోగిస్తుండటంపై పత్రికల్లో కథనాలు వచ్చాయి. వీటిని హైకోర్టు 2015లో సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) గా పరిగణించింది. దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భం గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఆహార భద్రత అధికారుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇం దుకు ప్రభుత్వం నుంచి ఆమోదం కూడా వచ్చిందని వివరించారు. కొత్తగా 36 ఆహార భద్రతా అధికారుల పోస్టులను సృష్టించామని తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానిక అభ్యర్థులు, ఇతరులకు చెం దిన రిజర్వేషన్ల వ్యవహారంపై మరింత స్పష్టత అవసరం ఉందని చెప్పారు. ఈ సమయంలో ధర్మాస నం స్పందిస్తూ అటువంటిదేమీ అవసరం లేదని, రాష్ట్రపతి ఉత్తర్వులు చాలా స్పష్టంగా ఉన్నాయని, చట్ట నిబంధనల మేరకు ఆ ఉత్తర్వులను అమలు చేస్తే సరిపోతుందని తెలిపింది. వీలైనంత త్వరగా ఆహార భద్రతా అధికారుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయాలని టీఎస్ïపీఎస్సీని ధర్మాసనం ఆదేశించింది. ఆహార భద్రతారంగం ఎదుర్కొం టున్న పెద్ద సవాళ్లలో కార్బైడ్ వినియోగం ఒకటని ధర్మాసనం అభిప్రాయపడింది. -
లెక్చరర్ల పోస్టుల భర్తీకి తొలగిన అడ్డంకులు
సాక్షి, హైదరాబాద్: రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టుల భర్తీకి అడ్డంకులు తొలగిపోయాయి. పోస్టుల భర్తీకి సంబంధించి గతంలో ఇచ్చి న మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. లెక్చరర్ల పోస్టులను భర్తీ చేసుకోవచ్చని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)కు హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ నియామకాలన్నీ తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొంది. పొలిటికల్ సైన్స్ విభాగంలో ఓ పోస్టును ఖాళీగా ఉంచాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్కుమార్ షావిలి ఉత్తర్వులు జారీ చేశారు. రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టుల భర్తీలో బీసీలకు తగిన రిజర్వేషన్లు కల్పించడం లేదంటూ హైదరాబాద్కు చెందిన సుజాత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. నియామకపు ప్రక్రియపై స్టే విధించింది. ఈ స్టేను ఎత్తేయాలని కోరుతూ టీఎస్పీఎస్సీ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ అభినంద్కుమార్ షావిలి విచారణ జరిపారు. ప్రభుత్వ నియామకాల్లో బీసీలకు 29 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసిందని పిటిషనర్ వివరించారు. అయితే డిగ్రీ కాలేజీల్లో భర్తీ చేసే లెక్చరర్ల పోస్టుల భర్తీ విషయంలో ఈ ఉత్తర్వులను అమలు చేయడం లేదన్నారు. ఆ తరువాత టీఎస్పీఎస్సీ న్యాయవాది డి.బాలకిషన్రావు వాదనలు వినిపిస్తూ, రోస్టర్ ప్రకారం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. 546 పోస్టుల్లో బీసీలకు 117 పోస్టులు కేటాయించామన్నారు. సర్వీసు నిబంధనల ప్రకారం పోస్టుల భర్తీ జరుగుతోందని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. పోస్టుల భర్తీ విషయంలో గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించారు. లెక్చరర్ల పోస్టుల భర్తీకి అనుమతినిచ్చారు. -
వీఆర్వో పరీక్షలో కాపీయింగ్కు యత్నం
మంచిర్యాలటౌన్: వీఆర్వో పోస్టులకు సంబంధించిన రాతపరీక్ష సందర్భంగా కాపీయింగ్ యత్నం జరగడం కలకలం సృష్టించింది. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వాగ్దేవి డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కళాశాల కరస్పాండెంట్ పెట్టెం మల్లేశ్ కూతురు పెట్టెం సాహితికి ఇదే కళాశాలలో పరీక్ష కేంద్రం పడింది. ఈ కేంద్రానికి మహేందర్ను చీఫ్ సూపరింటెండెంట్ (సీఎస్)గా నియమించగా.. ఆయన స్థానంలో పెట్టెం శ్రీకర్ సీఎస్గా విధులు నిర్వర్తించారు. రూమ్ నంబర్ 2లో పరీక్ష రాస్తున్న సాహితికి తరచూ ఆరోగ్య సమస్య అంటూ వచ్చి ట్యాబ్లెట్లు ఇవ్వడం, మరో గదికి తీసుకెళ్లడం వంటివి చేయడంతో ఆ గదిలో పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు అనుమానం వచ్చింది. శ్రీకర్ జవాబులు రాసి ఉన్న చిట్టీని సాహితికి ఇవ్వడంతోపాటు పరీక్ష రాసే స్థలాన్ని మరోచోటకు మార్చారు. దీంతో అభ్యర్థులు ఆందోళకు దిగారు. లైజన్ ఆఫీసర్ శ్రీనివాస్ అక్కడికి చేరుకుని సాహితి నుంచి ఓఎంఆర్ షీట్ తీసుకుని, విచారణ చేపడతామని చెప్పడంతోపాటు ఆమెను పంపించి వేయడంతో వివాదం సద్దుమణిగింది. ఈ సంఘటనపై జాయింట్ కలెక్టర్ సురేందర్రావును సంప్రదించగా.. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీఆర్వో పరీక్షకు ఒకే ఒక్కడు.. కెరమెరి (ఆసిఫాబాద్): దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సమీప ప్రాంతాల్లో వీఆర్వో పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించాల్సి ఉండగా, ఆప్షన్లతో సంబంధం లేకుండా పరీక్ష కేంద్రాలు కేటాయించడంతో అభ్యర్థులు నానా ఇబ్బందులు పడ్డారు. కుమురం భీం జిల్లా కెరమెరి మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 240 మందికి 75 మంది మాత్రమే హాజరయ్యారు. ఇదే పరీక్ష కేంద్రంలో రూం నంబర్ 9లో 24 మందికిగాను ఒకే ఒకడు హాజరు కావడం గమనార్హం. పెద్దపల్లికి చెందిన ఒకే అభ్యర్థి ఇక్కడ పరీక్ష రాశాడు. ఇదిలా ఉండగా రాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపల్లికి చెందిన అనిల్కుమార్ ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు మోటారుసైకిల్పై బయలుదేరి పరీక్ష కోసం 275 కి.మీ.(రానుపోను 550 కి.మీ.) దూరంలో ఉన్న కెరమెరికి వచ్చి పరీక్ష రాయడం కొసమెరుపు! చాలా ఇబ్బంది పడ్డా! శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి సాయంకాలం ఆసిఫాబాద్కు చేరా. అక్కడే లాడ్జిలో ఉండి ఉదయాన్నే కెరమెరి వెళ్లా. దరఖాస్తు కూడా ప్రారంభంలోనే చేశాను. కుమురం భీ జిల్లాను 8వ ఆప్షన్గా ఎంచుకున్నా. అయితే ఇంతదూరం పరీక్ష కేంద్రం వేయడంతో చాలా ఇబ్బంది పడ్డా . ఇది అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. వీఆర్వో ప్రశ్నపత్రం లీక్? జనగామ: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన వీఆర్వో పరీక్ష ప్రశాంతంగా జరిగిందని అధికారులు చెబుతున్నా.. జనగామ జిల్లా కేంద్రంలో మాత్రం ప్రశ్న పత్రం లీకైందన్న చర్చ జోరుగా సాగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం జనగామలోని హన్మకొండ రోడ్డులోగల ఓ పరీక్ష కేంద్రం నుంచి గుర్తుతెలియని యువకుడు వీఆర్వో పరీక్ష పత్రాన్ని తీసుకొని సిద్దిపేట రోడ్డులోని ఓ జిరాక్స్ సెంటర్ వద్దకు పలుమార్లు వచ్చి జిరాక్స్ తీయమని కోరినట్లు తెలిసింది. అయితే సదరు యజమాని జిరాక్స్ తీసేందుకు తిరస్కరించడంతో వెళ్లిపోయినట్లు సమాచారం. దీనిపై ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆరా తీసినట్లు సమాచారం. అయితే, లీక్ జరగలేదని అధికారులు చెబుతున్నారు. -
ఒకే పరీక్ష!
-
ఒకే పరీక్ష!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఒకే పరీక్ష నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయానికి వచ్చింది. గురుకుల పోస్టుల తరహాలో ప్రిలిమ్స్, మెయిన్స్ విధానం కాకుండా గతంలో డీఎస్సీ నిర్వహించిన విధంగానే ప్రతి సబ్జెక్టుకూ ఒకే పరీక్ష చొప్పున నిర్వహించాలని నిర్ణయించింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అధ్యక్షతన గురువారం కమిషన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పరీక్ష విధానంపై సమగ్రంగా చర్చించారు. పరీక్ష విధానాన్ని ఖరారు చేసే బాధ్యత ప్రభుత్వం టీఎస్పీఎస్సీకే ఇచ్చిన నేపథ్యంలో.. పాత పద్ధతిలోనే ఉపాధ్యాయ నియామక పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) స్కోర్కు 20 శాతం వెయిటేజీ ఇవ్వనుంది. ప్రస్తుతం పాఠశాలల్లో బోధిస్తున్న పాఠ్యాంశాల ఆధారంగా ఆయా సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్ను ఖరారు చేయనుంది. ఈ బాధ్యతను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలికి (ఎస్సీఈఆర్టీ) అప్పగించింది. ఎస్సీఈఆర్టీ ఇచ్చే సిలబస్ ప్రకారమే పరీక్షలను నిర్వహించనుంది. అన్ని జిల్లాల్లో పోస్టులు ఉండేలా కసరత్తు విద్యా శాఖ పాత పది జిల్లాల ప్రకారం పోస్టులను గతంలో ఖరారు చేసింది. అయితే ఇపుడు 31 జిల్లాల ప్రకారం పోస్టులను ఇవ్వాల్సి ఉంది. ప్రాథమికంగా 31 జిల్లాల ప్రకారం కూడా పోస్టులు ఇచ్చినప్పటికీ వాటిలో కొన్ని మార్పులు అవసరమని విద్యా శాఖ భావించింది. కొత్త జిల్లాల ప్రకారం చూస్తే కొన్ని జిలాల్లో టీచర్ పోస్టుల్లేవు. నోటిఫికేషన్ జారీ చేస్తే పోస్టులు లేని జిల్లాల్లోని అభ్యర్థుల నుంచి ఆందోళన వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా జిల్లాల్లో కూడా పోస్టులను ఇచ్చేందుకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. 8,792 పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, మరో 2,500కు పైగా పోస్టులు పెరిగే అవకాశం ఉంది. పోస్టులు లేని జిల్లాల్లో 2018 వరకు రిటైర్మెంట్ ద్వారా ఏర్పడే ఖాళీలను కూడా భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఆ ప్రకారం లెక్కలను ఖరారు చేసే పనిలో పడింది. అయితే వాటిని ఈ నోటిఫికేషన్ పరిధిలోకే తెస్తారా, తర్వాత సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేస్తారా, అన్నది నాలుగైదు రోజుల్లో తేలనుంది. మొత్తానికి పోస్టుల సంఖ్య 8,792 కాకుండా 11,500 దాటే అవకాశం ఉంది. ఈ అదనపు పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులు పొందాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని విద్యా శాఖ టీఎస్పీఎస్సీకి తెలియజేసింది. కొత్త జిల్లాలు.. కొత్త రోస్టర్ మరోవైపు కొత్తగా ఏర్పడిన 31 జిల్లాల ప్రకారమే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టనున్న నేపథ్యంలో కొత్త రోస్టర్ విధానాన్ని అనుసరించేందుకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. పాత పది జిల్లాలకు సంబంధించిన రోస్టర్ కొత్త జిల్లాల్లో వర్తింపజేయడం సాధ్యం కానుక కొత్తగా రోస్టర్ విధానాన్ని అమలు చేయనుంది. అయితే ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల విషయంలో మాత్రం వారి పాత రోస్టర్ విధానాన్ని కొనసాగించనుంది. గతంలో ఏ రోస్టర్ పాయింట్ వద్ద ఆగిపోయిందో.. ఆ తర్వాత పాయింట్ నుంచి ప్రస్తుత రోస్టర్ను కొనసాగించే అవకాశం ఉంది. 23వ తేదీలోగా నోటిఫికేషన్! ఇక పరీక్షను పాత పద్ధతిలోనే చేపట్టాలని నిర్ణయించినందున గతంలో జారీ చేసిన జీవోలను అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరాలని విద్యా శాఖ నిర్ణయించింది. మొత్తానికి నోటిఫికేషన్ జారీ సహా ఈ ప్రక్రియ అంతా ఈనెల 23వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కమిషన్ సభ్యులతోపాటు విద్యా శాఖ అదనపు డైరెక్టర్ పీవీ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
సీనియారిటీ లేకున్నా పదోన్నతులు!
రవాణాశాఖలో వివాదాస్పద ఆదేశం సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖలో పదోన్నతుల వ్యవహారం వివాదాస్పదంగా మారిం ది. జిల్లా రవాణాధికారి పోస్టుల భర్తీలో ఉన్న పదోన్నతి నిబంధనలు కాదని అస్మదీయుల కోసం గత సంవత్సరం ఓ ఉత్తర్వు జారీ అయింది. సాధారణంగా జిల్లా రవాణాధికారి పోస్టును మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లకు సీనియారిటీ ప్రకారం పదోన్నతి ద్వారా భర్తీ చేస్తారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్–1 నియామకం ద్వారా నేరుగా భర్తీ చేయొచ్చు. ఈ రెండు విధానాలు గత సంవత్సరం వరకు కొనసాగింది. పదోన్నతి ద్వారా అయితే సీనియారిటీ జాబితా రూపొందించి డీపీసీ ద్వారా భర్తీ చేయాలి. కానీ, కొందరు అధికారులు ప్రభుత్వంలో తమ పలుకుబడి ఉపయోగించుకుని సీనియారిటీ లేకున్నా పదోన్నతికి తెరదీశారు. ఎంటెక్, పీహెచ్డీ ఉన్నవారికి ఈ పదోన్నతి కల్పించొచ్చని రవాణా శాఖ ఓ ఉత్తర్వు జారీ చేసింది. దీని ప్రకారం ఈ రెండు ‘అర్హతలు’న్నవారు సీనియర్లను వెనక్కు నెట్టేసి పదోన్నతి పొందొచ్చు. ఈ మేరకు గత సంవత్సరం ముగ్గురు అధికారులకు పదోన్నతులు కల్పించారు. తాజాగా సర్క్యులర్ జారీ... ఇప్పుడు మరోసారి ఆ ఉత్తర్వును ఆధారం చేసుకుని జిల్లా రవాణాధికారి పోస్టులు భర్తీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ ఉత్తర్వులో పేర్కొన్నట్టుగా అదనపు అర్హతలున్న వారి వివరాలు తెలపాలంటూ రవాణా శాఖ జిల్లా అధికారులకు సర్క్యులర్ జారీ చేసింది. వేరే రాష్ట్రాల్లో ఊరూపేరులేని సంస్థల నుంచి డిగ్రీ, ఇతర సర్టిఫికెట్లు పొంది వాటిని పేర్కొంటూ గతంలో నియామకాలు జరిపిన అంశంపై తీవ్ర వివాదం నెలకొంది. ఈ అంశం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది. నాన్ టెక్నికల్ పోస్టు అయిన జిల్లా రవాణాధికారి పోస్టుకు ఎంటెక్ లాంటి డిగ్రీని అర్హతగా పేర్కొనటం విడ్డూరంగా ఉందని ఇతర సీనియర్ అధికారులంటున్నారు. ప్రభుత్వం దీన్ని ఉపసంహరించుకుని నిబంధనల ప్రకారం సీనియర్లకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. -
గ్రేటర్లో 226 పోస్టుల భర్తీ
- 200 టీపీఏ/టీపీఎస్.. 26 ఫుడ్ ఇన్స్పెక్టర్ పోస్టులు - గ్రీన్సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం - టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు.. త్వరలో నోటిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లో 226 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో 200 టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లు(టీపీఎస్)/టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్(టీపీఏ) పోస్టులతో పాటు హెల్త్ అండ్ శానిటేషన్ విభాగంలో మరో 26 ఫుడ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలకు ఇటీవల సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆమోదం తెలిపారు. ఈ పోస్టుల భర్తీకి పరిపాలనాపరమైన అనుమతులు జారీ చేస్తూ ఆర్థిక శాఖ ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ద్వారా ఈ పోస్టుల భర్తీకి చర్య లు తీసుకోనున్నారు. మహానగరంలో అనధికార నిర్మాణాల తొలగింపు, రోడ్ల విస్తరణ కార్యక్రమాలు చేపట్టడంలో టౌన్ ప్లానింగ్ విభాగం కీలకపాత్ర పోషి స్తోంది. ఈ విభాగంలో చీఫ్ సిటీ ప్లానర్ నుండి సర్వేయర్ వరకు 412 మంది అధికారులు, సిబ్బంది ఉండాల్సి ఉండగా.. 135 మందే విధులు నిర్వర్తిస్తు న్నారు. నగరాన్ని ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దడానికి ఈ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని పురపాలక మంత్రి కేటీఆర్.. సీఎం కేసీఆర్కు ఇటీవల విజ్ఞప్తి చేశారు. సీఎం ఆదేశాల మేరకు పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు. సీఎం ఆమోదించడంతో త్వరలో ఈ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనుంది. -
గ్రేడ్–2 ఏఈవో పరీక్ష ఫలితాలు వెల్లడి
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్న 1,311 అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ – గ్రేడ్–2 (ఏఈవో) పోస్టులకు రెండు దఫాలుగా నిర్వహించిన రాత పరీక్షల్లో ఎంపికైన 1,258 మంది అభ్యర్థుల జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. వాటి ఫలితాలను సోమవారం విడుదల చేసింది. పోస్టులకు ఎంపికైన వారి రిజిస్టర్డ్ నంబర్లను తమ వెబ్సైట్లో చూడవచ్చని టీఎస్పీఎస్సీ తెలిపింది. 2015 డిసెంబర్ 30న 311 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన టీఎస్పీఎస్సీ 31 నుంచి 2016 జనవరి 25 వరకు దరఖాస్తులను స్వీకరించింది. మార్చి 13వ తేదీన రాత పరీక్షలను నిర్వహించింది. అలాగే మరో 1,000 పోస్టులకు 2016 ఏప్రిల్ 30న నోటిఫికేషన్ జారీ చేసి, మే 4 నుంచి 19వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించింది. వాటికి జూన్ 4వ తేదీన రాత పరీక్షలను నిర్వహించింది. ఏ నోటిఫికేషన్ ద్వారా ఎవరెవరు పోస్టులకు ఎంపికయ్యా రన్న వివరాలను పాత జిల్లాల వారీగా తమ వెబ్సైట్లో (tspsc.gov.in) అందు బాటులో ఉంచింది. 2015 డిసెంబర్లో ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా 311 పోస్టులకు 283 మందిని ఎంపిక చేయగా, 2016 ఏప్రిల్లో ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా 1000 పోస్టులకు 975 మందిని ఎంపిక చేసింది. 311 పోస్టుల భర్తీకి 2015 డిసెంబర్లో జారీ చేసిన నోటిఫికేషన్కు 5034 దరఖాస్తు చేసుకోగా, 3824 మంది పరీక్షకు హాజరయ్యారు. అలాగే వెయ్యి పోస్టుల భర్తీకి 2016 ఏప్రిల్లో జారీ చేసిన నోటిఫికేషన్కు 7645 మంది దరఖాస్తు చేసుకోగా, 6479 మంది పరీక్షకు హాజరయ్యారు. వివిధ కేటగిరీల్లో అభ్యర్థులు లేకపోవడంతో 53 పోస్టులను భర్తీ చేయలేదు. -
గ్రూప్-2 పరీక్ష నేడే
సిటీబ్యూరో: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్-2 పరీక్ష కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం జరిగే ఈ పరీక్ష కోసం ఆయా కేంద్రాల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, సిబ్బందిని నియమించారు. కేంద్రాల పర్యవేక్షణ కోసం అవసరమైన సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలను ఏర్పాటు చేశారు. అభ్యర్థుల సౌకర్యార్థం ప్రత్యేకంగా 1000 సిటీ బస్సులు నడపనున్నారు. హైదరాబాద్ జిల్లాలో పరీక్ష కేంద్రాలు: 263 హాజరు కానున్న అభ్యర్థులు: 1,15,968 పరీక్ష చీఫ్ సూపరింటెండెంట్లు: 268 పరీక్ష షెడ్యూలు పరీక్ష కేంద్రంలోకి అనుమతించే సమయం: ఉదయం 8.45 కేంద్ర ద్వారాలు మూసివేత: 9.45 10 నుంచి 12.30 వరకు పరీక్ష మధ్యాహ్నం కేంద్రంలోకి అనుమతించే సమయం: 1.15 పరీక్ష కేంద్ర ద్వారాలు మూసివేత: 2.15 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్ష ఒక పరీక్షకు హాజరు కాకపోతే మరొక పరీక్షకు అనుమతించరు. ప్రధాన సూచనలు.. టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్, రెండు పాస్పోర్టు సైజు ఫొటోలు, గుర్తింపు కోసం ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, పాన్కార్డు, డ్రైవింగ్ లెసైన్సల్లో ఏదైనా ఒక ఓరిజినల్ కార్డును తప్పని సరిగా తీసుకురావాలి. ఓఎంఆర్ అన్సర్ షీట్ల బబ్లింగ్ కోసం బ్లూ/బ్లాక్ బాల్పారుుంట్ పెన్ను మాత్రమే వాడాలి. వేరే రంగు పెన్నుతో బబ్లింగ్ చేస్తే జవాబు పత్రాలు ఇన్వ్యాలిడ్ అవుతారుు. ఇవి అనుమతించరు: మొబైల్ ఫోన్లు, ట్యూబ్లు, పెన్డ్రైవ్లు, వాచీలు, క్యాలిక్యులేటర్లు, చేతి బ్యాగులు, లాగ్ బుక్స్, చార్టులు, కాగితాలు, పరికరాలు ఎలాక్ట్రానిక్ గ్యాడ్జెట్లు.. బూట్లు, ఆభరణాలు, నగలు ధరించరాదు. అభ్యర్థుల చేతికి మొహందీ పెట్టుకోవద్దు. బయోమెట్రిక్ విధానంలో అభ్యర్థి ఫొటోతో పాటు వేలిముద్రలను సేకరిస్తారు. ప్రతి అభ్యర్థి ఫొటోల గుర్తింపు ప్రక్రియ ఉంటుంది. విద్యాసంస్థలకు 12న సెలవు గ్రూప్-2 పరీక్షల కోసం ఎంపిక చేసిన విద్యాసంస్థలకు ఈనెల 11,13 తేదీల్లో సెలవు ప్రకటించారు. కాగా ఈ విద్యాసంస్థలకు 12న కూడా సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. -
రేపు ‘వ్యవసాయ’ పోస్టులకు పరీక్ష
26 కేంద్రాల్లో ఆన్లైన్ పరీక్ష హాజరుకానున్న 7,645 మంది అభ్యర్థులు సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ విస్తరణ అధికారి (గ్రేడ్ 2) పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) శనివారం పరీక్ష నిర్వహించనుంది. హెచ్ఎండీఏ పరిధిలో ఏర్పాటుచేసిన 26 కేంద్రాల్లో 7,645 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ ద్వారా ఆన్లైన్లో పరీక్షకు ఏర్పాట్లు చేశామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ గురువారం తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-1 పరీక్ష (జనరల్ స్టడీస్ అండ్ ఎబిలిటీస్), మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్-2 (అగ్రికల్చర్) పరీక్ష జరగనుంది. అభ్యర్థులను నిర్దేశిత సమయం కన్నా గంటన్నర ముందుగానే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారని, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరని పార్వతి సుబ్రమణియన్ తెలిపారు. -
కొత్త ఇంజినీర్లు వచ్చేశారు..
మైనర్ ఇరిగేషన్ శాఖలో 19 మందికి పోస్టింగ్ బాధ్యతల స్వీకరణ మిషన్ కాకతీయ పనుల పర్యవేక్షణకు దోహదం వరంగల్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ద్వారా ఎంపికైన 124 మంది ఇంజినీర్లకు మైనర్ ఇరిగేషన్(చిన్న నీటిపారుదల) శాఖలో పోస్టింగ్లు ఇచ్చారు. కాగా, వీరిలో 19 మందిని జిల్లాకు కేటాయించారు. పోస్టింగ్ పొందిన వారంతా సోమవారం హన్మకొండలోని సర్కిల్ కార్యాలయంలో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు. అనంతరం ఎస్ఈ శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వరంగల్ మైనర్ ఇరిగేషన్ సర్కిల్ పరిధిలో ఇంజినీరింగ్ కేడర్లో 77 మంది ఉండాలి. 58 పోస్టుల్లో ఏఈలు విధులు నిర్వర్తిస్తుండగా, మరో 19 పోస్టుల్లో ఇప్పటిదాకా పదవీ విరమణ పొందిన అసిస్టెంట్ ఇంజినీర్ల సేవలను టెక్నికల్ కన్సల్టెంట్ల పేరిట ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన వినియోగించుకునేవారు. తాజాగా 19 మంది ఇంజినీర్ల నియూమకంతో ఇంజినీరింగ్ కేడర్లో పూర్తిస్థారుు భర్తీలు జరిగినట్లవుతుంది. మిషన్ కాకతీయ పనుల దృష్ట్యా ఇప్పటిదాకా ఔట్సోర్సింగ్లో పనిచేస్తున్న టెక్నికల్ కన్సల్టెంట్ల సేవలనూ వినియోగించుకోనున్నారు. పోస్టింగ్ లేక ఖాళీగా.. ఎస్ఆర్ఎస్పీ డీఈఈలు మిషన్ కాకతీయ తొలి విడత పనుల సందర్భంగా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నుంచి డిప్యూటేషన్పై వచ్చిన డీఈఈలు పోస్టింగ్ లేక ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే ప్రాజెక్టు నుంచి వచ్చిన 24 మంది ఏఈఈలకు మాత్రం మండలాల్లో పోస్టింగ్ ఇచ్చారు. డీఈఈ పోస్టులు ఖాళీగా లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. రెగ్యులర్ డీఈఈల బదిలీ, పదవీ విరమణ జరిగితే తప్ప డిప్యూటేషన్పై వచ్చే వారికి పోస్టింగ్లు రావని పేర్కొంటున్నారు. వందలాది చెరువుల మరమ్మతుకు.. మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా ఒకేసారి వందలాది చెరువుల మరమ్మతులు చేపట్టడంతో పనుల పర్యవేక్షణకు తగిన సంఖ్యలో సిబ్బంది అందుబాటులో లేరు. ఒక్కో మండలంలో 15 నుంచి 30 చెరువులు మంజూరవడంతో ఇంజినీర్ల పర్యవేక్షణ లేక పనులు కుంటుపడుతున్నారుు. దీంతో మిషన్ కాకతీయ తొలివిడత పనుల సందర్భంగా గతేడాది ఎస్సారెస్పీ-1 నుంచి 27 మంది ఇంజినీర్లను మైనర్ ఇరిగేషన్ శాఖకు డిప్యూటేషన్పై తీసుకున్నారు. వీరికి సహాయకులుగా ఉండేందుకు గృహ నిర్మాణ శాఖకు చెందిన 42 మంది వర్క్ ఇన్స్పెక్టర్లను మైనర్ ఇరిగేషన్ విభాగానికి డిప్యూటేషన్పై కలెక్టర్ కేటాయించారు. మిషన్ కాకతీయ రెండో విడతలో టెండర్ల నిర్వహణలో జాప్యం జరగడంతో పనులు వేగవంతం చేసేందుకు 14 మంది కంప్యూటర్ ఆపరేటర్లను ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియమించారు. అంతేకాకుండా మండలాల్లోని ఏఈలకు మూడు నెలల పాటు వాహన సౌకర్యం కల్పించారు. మిషన్ కాకతీయ పనులను వేగవంతం చేసేందుకే ఈ చర్యలు చేపట్టారు. -
టీఎస్పీఎస్సీ ‘తొలి పరీక్ష’ సక్సెస్
931 ఏఈఈ పోస్టులకు ఆన్లైన్ పరీక్ష * దేశంలోనే తొలిసారి విజయవంతంగా నిర్వహణ * 24,383 మంది హాజరు.. ప్రశాంతంగా ముగిసిన పరీక్ష * నేడు సమాధాన పత్రాలు, ప్రాథమిక కీ.. 24న తుది కీ సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డి: దేశంలోనే తొలిసారిగా ఆన్లైన్లో ఉద్యోగ నియామక పరీక్షను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవంతంగా నిర్వహించింది. 931 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం ఆదివారం హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్లలోని 99 పరీక్ష కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్ష (సీబీఆర్టీ) ప్రశాంతంగా ముగిసింది. ఈ విధానంలో మొదటి ప్రయత్నంలోనే వేలాది అభ్యర్థులకు విజయవంతంగా ఆన్లైన్ పరీక్ష నిర్వహించడం ద్వారా టీఎస్పీఎస్సీ చరిత్ర సృష్టిం చింది. రాష్ట్రవ్యాప్తంగా 30,796 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 24,383 మంది పరీక్ష రాశారు. యూపీఎస్సీతో పాటు దేశంలోని ఇతర ఏ రాష్ట్రాల పబ్లిక్ సర్వీసు కమిషన్లూ ఇం త భారీ సంఖ్యలో అభ్యర్థులకు ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించిన దాఖలా లు లేవు! రంగారెడ్డి జిల్లాలో ఒక పరీక్ష కేం ద్రంలో స్వల్ప సాంకేతిక సమస్య మినహా అంతా సజావుగా జరిగినట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతీ సుబ్రమణ్యం ఓ ప్రకటనలో తెలిపారు. అక్కడ 136 మందిని ఇతర కేంద్రాలకు తరలించి, అదనపు సమయం ఇచ్చారు. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాం డ్ సెంటర్ ద్వారా టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యులు, అధికారులు పరీక్ష నిర్వహణను ఎప్పటికప్పుడు సమీక్షించారు. 1,600 మంది ఇన్విజిలేటర్లు, 1,050 మంది సహాయక సిబ్బంది, 250 మంది కమిషన్ పరిశీలకులు పరీక్షల విధుల్లో పాలుపంచుకున్నారు. పరీక్షా కేంద్రాలపై నిఘా కోసం 29 ప్రత్యేక బృందాలను కూడా టీఎస్పీఎస్సీ నియమించింది. మూడంచెల పాస్వర్డ్లు: ఆన్లైన్ పరీక్ష నేపథ్యంలో టీఎస్పీఎస్సీ మూడంచెల పాస్వర్డ్ల విధానాన్ని అవలంబించింది. ఉదయం 7.30 గంటలకు తొలి పాస్వర్డ్ (బండిల్ పాస్వర్డ్), 9 గంటలకు రెండో పాస్వర్డ్ (డ్రైవ్ పాస్వర్డ్), 9.50 గంటలకు మూడో పాస్వర్డ్ (క్యాండిడేట్ పాస్వర్డ్)లను పరీక్ష కేంద్రాలకు విడుదల చేసింది. ఉదయం పదింటి నుంచి మధ్యాహ్నం 2.30 వరకు పరీక్ష జరిగింది. నేడు సమాధాన పత్రాలు, ప్రాథమిక కీ ఇప్పటికే చాలా పరీక్ష కేంద్రాల నుంచి టీఎస్పీఎస్సీకి అభ్యర్థుల సమాధాన పత్రాలు, ఆడిట్ ట్రయల్స్ చేరుకున్నాయి. సోమవారం సాయంత్రం 6 గంటల తర్వాత అభ్యర్థులకు వారి సమాధాన పత్రాలతో పాటు ప్రాథమిక కీని టీఎస్పీఎస్సీ పంపించనుంది. ప్రాథమిక కీపై అభ్యంతరాలను అభ్యర్థులు రెండు రోజుల్లో తెలపవచ్చు. 24న తుది కీ విడుదలవుతుంది. మొరాయించిన కంప్యూటర్లు: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్లు మొరాయించడంతో 136 మంది అభ్యర్థులను అనుమతించలేదు. 2 గంటలు గేటు బయటే ఉండాల్సి రావడంతో వారు ఆందోళనకు దిగారు. వారిని ఇతర కేంద్రాలకు తరలించారు. దీనిపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీరభ ద్రయ్య నేతృత్వంలో విచారణకు ఆదేశించినట్టు టీఎస్పీఎస్సీ సభ్యుడు విఠల్ తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్లు తెలిసింది. మరోవైపు, పరీక్షలో పలుమార్లు సిస్టమ్ లాకవడంతో అభ్యర్థులు ఇబ్బందిపడ్డారు. మౌస్ను నాన్స్టాప్గా కదిలించాల్సి వచ్చిందని, లేదంటే సిస్టం లాకయిందని అభ్యర్థులు వాపోయారు. -
స్టడీ సర్కిల్ ఏది..?
ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సెంటర్ నివేదిక సిద్ధం చేయాలంటూ ఆదేశాలు పట్టించుకోని అధికారులు ప్రవేశ పరీక్ష జరిగినా కానరాని పురోగతి నోటిఫికేషన్లు జారీచేస్తున్న టీఎస్పీఎస్సీ ఆందోళనచెందుతున్న అభ్యర్థులు హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరంలో రెండో స్టడీసర్కిల్ను నిర్వహించేందుకు సాంఘిక సంక్షేమ శాఖ సిద్ధంగా ఉన్నా.. స్థానిక అధికారుల నుంచి స్పందన కరువైంది. సెప్టెంబర్ మొదటివారంలోగా వరంగల్లో స్టడీ సెంటర్ ప్రారంభించాలని ఉన్నతాధికారులు ఆదేశించినా.. అధికారుల్లో చలనం లేదు. గడువు ముగిసినా.. విలువైన సమయం హరిస్తున్నా.. స్టడీ సర్కిల్ ఏర్పాటు వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. హన్మకొండ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శ్రీకారం చుట్టింది. గడిచిన మూడు నెలలుగా వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో దళిత నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరంలో స్టడీసర్కిల్ నెలకొల్పాలని సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. గతనెలలో ఈ శాఖకు చెందిన డెరైక్టరు సుబ్రహ్మణ్యం వరంగల్కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. స్టడీసర్కిల్ నిర్వాహణకు సంబంధించి ఫ్యా కల్టీ ఎంపిక, స్టడీ సెంటర్ నిర్వాహనకు అవసరమైన సి బ్బంది, బాలురు, బాలికలకు వేర్వేరుగా శిక్షణ లేదా ఒకే క్యాంపస్లో శిక్షణ, వసతితో కూడిన శిక్షణ లేక వసతి లేకుండా శిక్షణా ఇవ్వాలా అనే అంశాలపై వెంటనే నివేదిక రూపొందించాలని ఆదేశించారు. సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందివ్వాలని, ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ మొదటివారంలో శిక్షణ తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చలనం లేదు స్టడీ సర్కిల్ నిర్వహనకు సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించడంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో స్టడీ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి కసరత్తు మొదలుపెట్టలేదు. మరోవైపు వరంగల్లో స్టడీ సర్కిల్ ఏర్పాటుపై కతృనిశ్చయంతో ఉన్న రాష్ట్రస్థాయి అధికారులు 2015 ఆగస్టు 16వ తేదీన ఉద్యోగార్థులకు నగరంలో ప్రవేశ పరీక్ష సైతం నిర్వహించారు. వందలాది మంది దళిత, దళితేతర నిరుద్యోగులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఫలితాలు విడుదల చేసిన వెంటనే శిక్షణ ప్రారంభించాల్సి ఉంటుంది. కోచింగ్కు సిద్ధమవుదామని కళ్లలో వొత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. కానీ జిల్లా నుంచి ఎటువంటి రిపోర్టు అందనందున ఫలితాల విడుదలలో జాప్యం చోటు చేసుకుంటోంది. స్టడీ సర్కిల్ ఏర్పాటు వివరాల కోసం కార్యాలయంలో సంప్రదిస్తే.. అధికారులు, సిబ్బంది స్టడీసెంటర్ ఏర్పాటుపై అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు. విలువైన సమయం వృథా.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలకమైన గ్రూప్-1, గ్రూప్-2 తదితర పోస్టులకు సిలబస్ సైతం ప్రకటించింది. పోటీ పరీక్షలలో విజయం సాధించాలంటే కనీసం ఆర్నెళ్ల శిక్షణ, ప్రిపరేషన్ అవసరం. ఇప్పటికే వరంగల్లో బీసీ స్టడీ సర్కిల్లో కోచింగ్ క్లాసులు మొదలయ్యాయి. కానీ సాంఘిక సంక్షేమ శాఖ విభాగంలో క్షేత్రస్థాయి అధికారుల్లో చలనం కరువైపోవడంతో స్టడీ సర్కిల్ ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. స్టడీ సర్కిల్ ఏర్పాటుకు సంబంధించి జిల్లా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తే..ఈ పాటికి శిక్షణ మొదలయ్యేది. పేద దళిత విద్యార్థులకు సివిల్స్, గ్రూప్స్, బ్యాంకు తదితర పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడంతో పాటు వసతి, లైబ్రరీ తదితర సౌకర్యాలు విద్యార్థులకు అంది ఉండేవి. గతకొంతకాలంగా టీపీపీఎస్సీ సిలబస్ను ప్రకటించి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తుండటంతో ఉద్యోగార్థుల్లో ఆందోళనమొదలైంది. స్టడీ సర్కిల్ ఏర్పాటులో జరుగుతున్న జాప్యం కారణంగా విలువైన సమయం కోల్పోవాల్సి వస్తుందని పేద దళిత ఉద్యోగార్థులు ఆవేదన చెందుతున్నారు. కమీషన్ల కక్కుర్తితో.. సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది కమీషన్ల కక్కుర్తి వ్యవహారంతో స్టడీ సర్కిల్ కోసం ఎంపిక చేయాల్సిన భవనం విషయంలో జాప్యం జరుగుతోంది. ఈ మేరకు నగర పరిధిలో మూడు భవనాలను ఎంపిక చేసినట్లుగా సమాచారం. ఈ భవన యజమానులు, సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బందికి మధ్య అద్దె కమీషన్ల విషయంలో పేచీ పడుతున్నట్లుగా ఈ శాఖ సిబ్బందే చెవులు కొరుక్కుంటున్నారు. -
చరిత్ర తెలిసి ఉంటేనే.. సేవ చేయగలం
నల్లగొండ టూ టౌన్: ‘తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా నిర్వహించే పరీక్షల్లో తెలంగాణ చరిత్రను సిలబస్గా చేర్చడంపట్ల అభ్యర్థులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన కళ్లముందున్న మన చరిత్రను చూడాలి. మన ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసుకోవడానికి, రాసుకోవడానికి వెసులుబాటు ఉంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై అద్భుతమైన సమాచారం అందుబాటులో ఉంది. అభ్యర్థులందరూ దీనిని సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షల్లో విజయం సాధించాలి. మన చరిత్ర మనకు తెలియకపోతే మన ప్రాంతానికి సేవ చేయలేరు. ఉద్యోగులకు ప్రాంతం గురించి పూర్తిగా తెలిసి ఉండాల్సిందే.’ అని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరాం అన్నారు. శుక్రవారం నల్లగొండలోని చిన వెంకటరెడ్డి ఫంక్షన్హాలులో ‘సాక్షి- భవిత’ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్స్ పరీ క్షలపై అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో గ్రూప్స్ పరీక్షలు రాసి ఉన్నతస్థాయి ఉద్యోగాలు సాధించాలన్న బలమైన ఆకాంక్ష ఈ ప్రాంత విద్యార్థుల్లో ఉందన్నారు. అయితే, ఉద్యోగంరాని వారు బాధపడకుండా పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో నిజాయితీతో పారదర్శకంగా పరీక్ష నిర్వహిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. ‘సాక్షి’ నిర్వహిస్తున్న సదస్సులకు హాజరవుతున్న అభ్యర్థులలో ఎక్కువ మంది రైతు కుటుంబాలు, గ్రామీణ ప్రాంతాలేవారే కనుక సబ్జెక్టుపై వారికి పూర్తిస్థాయిలో అవగాహన ఉంటుందని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ సభ్యుడు విఠల్ మాట్లాడుతూ ఐదారునెలల పాటు అహర్నిశలు శ్రమించి టీఎస్పీఎస్సీ లో కీలకమార్పులు తీసుకొచ్చామన్నారు. ఎలాంటి అవకతవకలు లేకుండా పూర్తి నిబద్ధతతో పరీక్ష లు జరుగుతాయన్నారు. పరీక్షకేంద్రాల్లో బయోమెట్రిక్ పద్ధతిని అమల్లోకి తేవాలని కమిషన్ నిర్ణయించిందని, పరీక్ష రాసిన వ్యక్తే ఇంటర్వ్యూకు హాజరయ్యారా లేదా అని నిర్ధారించేందుకు ఇంటర్వ్యూ వేళ కూడా బయోమెట్రిక్ తీసుకుంటామని, నాలుగు వైపులా కని పించే విధంగా పరీక్ష గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని విఠల్ తెలిపారు. కవి, రచయిత సుంకిరెడ్డి నారాయణరెడ్డి చరిత్రపై అవగాహన కల్పించారు. సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ సిల బస్ పుస్తకాలను సాక్షి సహకారంతో పేద విద్యార్థులకు అందించేందుకు ప్రతీక్రెడ్డి ఫౌండేషన్ ద్వారా ప్రయత్నిస్తామని చెప్పారు. ‘సాక్షి’ ఎడిటర్ వర్ధెల్లి మురళి మాట్లాడుతూ గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల్లో గందరగోళం తొలగిం చడానికే అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ‘సాక్షి’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్రెడ్డి మాట్లాడుతూ గ్రూప్స్ పరీక్షల కోసం త్వరలోనే సాక్షి హెల్ప్లైన్ నంబర్ను కూడా ప్రకటిస్తామని తెలి పారు. తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ మాట్లాడుతూ పరీక్ష అయిపోయే వరకు అభ్యర్థులు తమ జేబుల్లో సిల బస్ కాగితం పెట్టుకుని తిరగాలన్నారు. ప్రముఖ కవి, రచయిత వేణు సంకోజు సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సదస్సులో ‘సాక్షి’ మఫిసిల్ ఎడిటర్ ఎస్.చలపతిరావు, నెట్వర్క్ ఇన్చార్జ్ కె.శ్రీకాంత్రావు, నల్లగొండ మునిసిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మితోపాటు వేల సంఖ్యలో నిరుద్యోగులు హాజరయ్యారు. సదస్సు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ఏపీపీఎస్సీ ఉద్యోగులపై హెచ్చార్సీలో ఫిర్యాదు
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలోనికి అక్రమంగా చొరబడిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయ సిబ్బందిపై తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ కో కన్వీనర్ కొంతం గోవర్దన్రెడ్డి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. టీఎస్పీఎస్సీ కార్యాలయంలోకి చొరబడి కీలకమైన రికార్డులను ఏపీపీఎస్సీ ఉద్యోగులు చిందర వందర చేసి, తారుమారు చేశారని, ఈ సంఘటనపై న్యాయ విచారణ జరపాలని హెచ్చార్సీని కోరారు. బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన హెచ్చార్సీ సెప్టెంబరు 21 లోగా సంఘటనకు సంబంధించి సమగ్రమైన నివేదికను అందజేయాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. -
నోటిఫికేషన్ తర్వాత 45 రోజుల్లోనే పోస్టుల భర్తీ: విఠల్
వికారాబాద్: నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత కేవలం 45 రోజుల్లోనే పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సభ్యుడు విఠల్ చెప్పారు. సోమవారం రంగారెడ్డి జిల్లా వికారాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2012లో నిర్వహించిన గ్రూప్-1ను మళ్లీ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, ఆ పరీక్షను 2 రాష్ట్రాలు విడివిడిగా నిర్వహిస్తాయన్నారు. తెలంగాణ చరిత్ర, భౌగోళిక అంశాలు, తెలంగాణ ఉద్యమం, సంస్కృతి మీద ఈసారి పరీక్షల్లో అధిక ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందన్నారు. తొలి విడతలో 25 వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సిద్ధమైనట్లు చెప్పారు. వీటి తర్వాత మరో పదివేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని, అందులో గ్రూప్ ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ అభ్యర్థుల కోసం రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తామని, గ్రూపు పరీక్షలకు ఇంటర్వ్యూ తప్పనిసరిగా ఉండే అవకాశం ఉందని విఠల్ తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సభ్యుడు శివశంకర్, జేఏసీ రంగారెడ్డి జిల్లా చైర్మన్ శ్రీనివాస్, పంచాయతీరాజ్ మినిస్ట్రీరియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నందకుమార్,ఎంపీడీఓ సత్తయ్య, సాక్షర భారత్ రాష్ట్ర నాయకుడు గోపాల్ యాదవ్ పాల్గొన్నారు. -
టీపీఎస్సీ ఎదుట ఓయూ విద్యార్థుల ఆందోళన
-
ప్రతిభావంతుడు..మన ప్రభాకరుడు
గంగారం(కాల్వశ్రీరాంపూర్) : ఆయన పేదరికంలో పుట్టి పెరిగారు. సరస్వతీ కటాక్షం పొందాలనే లక్ష్యంతో ఆయన ముందుకు సాగారు. కష్టాలకు ఎదురీదుతూ పట్టుదలతో విద్యాభ్యాసం చేసి ఉన్నతస్థాయికి ఎదిగారు. నేడు తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్లో సిలబస్ మార్పు కమిటీ సభ్యుడిగా నియాకమయ్యారు. ఈ మేరకు టీపీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనే కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన భైరి ప్రభాకర్. ఆయన తల్లిదండ్రులు రాజవీరు-కనుకమ్మ. తండ్రి చేనేత కార్మికుడు. తల్లి పచ్చళ్లు తయారు చేస్తూ విక్రయించేవారు. వాటిని అమ్మడం ద్వారా ప్రభాకర్ చదువులకు డబ్బు సమకూర్చారు. చెల్లెలు రమ వ్యవసాయ కూలీ పనులు చేసేవారు. ఆమె సంపాదించిన సొమ్మును సోదరుని ఉన్నత విద్యాభ్యాసానికి అందించేవారు. ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం.. గంగారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక విద్య అభ్యసించారు. కాల్వశ్రీరాంపూర్లో హైస్కూల్, సుల్తానాబాద్లో ఇంటర్మీడియెట్ పూర్తి చేశారు. ఏపీపీఎస్సీగ్రూ-4 పరీక్ష రాశారు. అందులో ఉత్తీర్ణులై సిరిసిల్లలోని అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాలలో స్టెనోగ్రాఫర్ ఉద్యోగం సాధించారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో ఎక్స్టర్నల్ పరీక్షలు డిగ్రీ, ఎంఏ, ఎంకాం పూర్తి చేసి అక్కడే అధ్యాపకుడిగా చేరారు. ఎంఫిల్, పీహెచ్డీ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. కాకతీయ యూనివర్సిటీలో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ (మానవ వనరుల అభివృద్ధి)పై పరిశోధన చేసి పీహెచ్డీ సాధించారు. ప్రొఫెసరయ్యాక వరంగల్ ఉమెన్స్ కాలేజీ, సిరిసిల్లలో అధ్యాపకుడిగా పనిచేశారు. సొంతూరిపై మమకారం.. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ, కుటుంబ పోషణ విస్మరించలేదు ప్రభాకర్. తల్లిదండ్రులను పోషిస్తూనే తన ఇద్దరు చెల్లెలు పద్మ, రమ వివాహం చేసి అత్తారింటికి పంపించారు. స్వగ్రామంపై మమకారంతో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. తాను చదివిన పాఠశాల విద్యార్థులకు పలకలు, పుస్తకాలు, నోటుబుక్కులు, పెన్నులు, దస్తులు అందించారు. చదువులో ప్రతిభ చాటిన విద్యార్థులకు ఏటా నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. గురువు చెంతనే చోటు.. ప్రభాకర్ ప్రస్తుతం మెదక్ జిల్లా గజ్వేల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విభాగాధిపతిగా భాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో అప్పటి వీసీ లింగమూర్తి నుంచి ప్రభాకర్ డాక్టరేట్ పట్టా (కాన్వోకేషన్) అందుకున్నారు. ఆ యూనివర్సిటీలో ఇప్పుడు ఆయన చెంతనే విధులు నిర్వర్తించే టీపీఎస్సీలో సభ్యుడిగా చేరారు. అదృష్టంగా భావిస్తున్నా, ప్రభాకర్ మా అమ్మానాన్నతోపాటు చెల్లెళ్లు సైతం నేను చదువుకునేందుకు ఎంతో కష్టపడ్డారు. కనిపెంచి ప్రయోజకుడిని చేసిన అమ్మానాన్న, ఉన్నతస్థాయికి ఎదిగేలా మార్గనిర్దేశం చేస్తూ, ఉన్నత విద్యాభ్యాసంలో ఎదిగేలా కృషి చేసిన గురువులకు రుణపడి ఉంటా. నాపై నమ్మకంతో అప్పగించిన టీపీఎస్సీ సిలబస్ మార్పు కమిటీలో సభ్యుడిగా బాధ్యతగా పనిచేస్తా. -
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములమవుదాం
కరీంనగర్ : తెలంగాణ ఉద్యమంలో చూపినా తెగువను రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ చూపాలని, బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేయాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ యువతకు పిలుపునిచ్చారు. రెవెన్యూ గార్డెన్స్లో శనివారం టీఆర్ఎస్వీ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన వారు మాట్లాడుతూ నదులు, నీళ్లు, ఉద్యోగాల కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టిందని, కోట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో అభివృద్ధే ఎజెండాగా ముందుకుసాగుదామని అన్నారు. రాష్ట్రం కోసం పోరాడిన విద్యార్థులకు ఎన్నికల్లో టికెట్లు ఇచ్చి గెలిపించుకున్న ఘనత, నామినేటెడ్ పోస్టులిచ్చిన చరిత్ర సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ఆర్నెల్లలోనే రైతులకు రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ, చెరువుల పునరుద్ధరణ, వాటర్గ్రిడ్ వంటి అనేక పథకాలు ప్రారంభించిన ఘనత టీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థులకు జనవరి ఒకటి నుంచి సన్నబియ్యం అందిస్తామని వివరించారు. తెలంగాణ పబ్లిక్ కమిషన్ ఏర్పాటైన నేపథ్యంలో వేలాది ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశముందన్నారు. టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు, ఇల్లంతకుంట జెడ్పీటీసీ సిద్ధం వేణు మాట్లాడుతూ విద్యార్థులకు పార్టీలో పదవులు ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. విద్యార్థి జేఏసీ నాయకుడు ఏనుగు రవీందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కెమసారం తిరుపతి, బీఎస్ఎఫ్ నాయకులు రంజిత్, దుబ్బయ్య, దీకొండ నాగరాజు మాట్లాడారు. పొన్నం అనిల్గౌడ్, కాటం సురేశ్ కుమార్, సుదగోని శ్రీనాథ్ గౌడ్, కొంకటి శేకర్, రాజాంజనేయులు, రామడుగు రాజేశ్, ప్యాట సురేశ్, శేకర్బాబు, గోగుల గణేశ్, పటేల్ శ్రావణ్రెడ్డి, రవివర్మ, రవితేజ, ఫహద్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. భారీ ర్యాలీ.. తెలంగాణ పాటల హోరు పిడమర్తి రవి, ఎంపీ బాల్క సుమన్ జిల్లాకు తొలిసారి వచ్చిన నేపథ్యంలో టీఆర్ఎస్వీ కార్యకర్తలు వందలాది బైక్లతో ర్యాలీ నిర్వహించారు. గాయకుడు సుధీర్ ఆ లపించిన పాటలు ఉత్తేజం నింపాయి. రవి, బాల్క సు మన్ స్వయంగా వాహనాలు నడుపుకుంటూ వచ్చారు. పలు సంఘాల సన్మానం .. పిడమర్తి రవి, బాల్క సుమన్ను వివిధ కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు సన్మానించాయి. తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర నాయకులు కంసాల శ్రీనివాస్, ముల్కల గంగారాం, కొంకటి శ్రీనివాస్ గజమాలతో సన్మానించారు. విద్యార్థి జేఏసీ పక్షాన సిద్దం వేణు, రవీందర్రెడ్డి, తిరుపతి, పొన్నం అనిల్, సురే శ్తో పోటాపోటీగా సన్మానించారు. -
లక్ష ఉద్యోగాల భర్తీకి చర్యలు
⇒ కొత్త సంవత్సరంలో నిరుద్యోగులకు తీపి కబురు ⇒ టీఎస్పీఎస్సీ డెరైక్టర్ చంద్రావతి ఖమ్మంరూరల్/ఖమ్మంవైరారోడ్/కూసుమంచి : వచ్చే ఏడాది తెలంగాణలో లక్ష ప్రభుత్వోద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డెరైక్టర్ బానోత్ చంద్రావతి తెలిపారు. హైదరాబాద్ నుంచి బుధవారం జిల్లాకు వచ్చిన చం ద్రావతి కూసుమంచి, ఖమ్మం రూరల్ మండ లం పెద్దతండా, ఖమ్మం ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక రా ష్ట్రంలో కొలువులు లభిస్తాయనే ఆశతో నిరుద్యోగులు ఉన్నారని, వారి ఆకాంక్ష నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారని చెప్పారు. అయితే శాఖల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంత నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఇప్పుడు ఉద్యోగాల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని, ప్రతిభ ఉన్నవారికే అవకాశాలొస్తాయని, నిరుద్యోగులు దళారుల మాట నమ్మవద్దని సూచించారు. కేవలం ప్రతిభ ప్రాతిపదికనే ఉద్యోగాల ఎంపిక ఉంటుందని, నిరుద్యోగులు అందుకు సిద్ధం కావాలని కోరారు. బంగారు తెలంగాణ కోసం ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తనపై ఎంతో నమ్మకంతో ఈ పదవిని ఇచ్చిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు పలు తప్పిదాలు చేశాయని, ఇకపై అలాంటివి ఉండబోవని చెప్పారు. కమిషన్ చైర్మన్తో పాటు సభ్యులంతా కష్టపడి పని చేసేవారేనని, నిరుద్యోగులకు ఎక్కడా అన్యాయం జరుగదని అన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్ మాట్లాడుతూ కేసీఆర్ ఖమ్మం జిల్లాకు సముచిత స్థానం కల్పించారని అన్నారు. తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవి, పిడమర్తి రవికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, చంద్రావతికి టీఎస్పీఎస్సీ పదవి ఇచ్చి ప్రాధాన్యత కల్పించారన్నారు. చంద్రావతి వెంట టీఆర్ఎస్ ఖమ్మం, పాలేరు నియోజకవర్గ ఇన్చార్జిలు ఆర్జేసీ కృష్ణ, బత్తుల సోమయ్య, జడ్పీటీసీలు వడ్త్యి రాంచంద్రునాయక్, ధరావత్ భారతి, నాయకులు ధరావత్ రాంమూర్తి, చెరుకుపల్లి లక్ష్మి , కొత్తపల్లి సరిత, బారి శ్రీనివాస్, వీరభద్రం ఉన్నారు. -
7th సెన్స్ను మేల్కొలపండి...
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొలుదీరింది...ఇక కొలువుల ప్రక్రియ మొదలు కానుంది. ఉద్యోగ ప్రకటనలు త్వరలో రాగలవనే సమాచారం నిరుద్యోగుల్లో కొండంత ఆశలను రేకెత్తిస్తున్నాయి. దాదాపు లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడనుండటం అరుదైన విషయమే. ఈ సమాచారంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఎక్కడ చూసినా పుస్తకాలతో కుస్తీ పడుతున్న అభ్యర్థులే దర్శనమిస్తున్నారు. ఇదే సమయంలో ఈ పోటీలో మేం సాధించగలమా? అన్న ప్రశ్న వేలాది మందిని వేధిస్తోంది. కానీ మనిషి అనుకుంటే సాధించలేనిదేమి లేదు. మన పంచేంద్రియాలు(జ్ఞానేంద్రియాలు) రోజు వారీ పనులను చక్కబెడతాయి...ఆపద నుంచి బయటపడేసేది సిక్త్సెన్స్...కానీ మనకు గతంలో పరిచయం, ఊహించని శక్తి దాగివుందని తెలిపేది ‘సెవెంత్ సెన్స్ ’ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు సరిగ్గా దాన్ని నిద్ర లేపాల్సిన తరుణమిదే. * సంశయం వీడి ముందుకు సాగండి * ఆత్మ విశ్వాసం ఉంటే ఉజ్వల భవిత మీదే నల్లగొండ అర్బన్: మూడేళ్ల క్రితం విడుదలైన సెవెంత్సెన్స్ సినిమా గుర్తుందా...అందులో 1600 ఏళ్ల క్రితం జీవించిన బోధిధర్ముడిని తిరిగి రప్పించటం ఆ సినిమా కథాంశం. కాకపోతే అది జన్యు నిర్మాణం(జెనెటిక్ ఇంజినీరింగ్). మనం ఎంచుకున్న లక్ష్యాని కనుగుణంగా మానసికంగా తమనితాము తీర్చిదిద్దుకోవడం భవిష్యత్ నిర్మాణం... ఇది మరో సెవెంత్ సెన్స్. వ్యక్తి మేధస్సుపై 15 నుంచి 20 శాతం లక్షణాల్లోనే అతని వంశపారం పర్య ప్రభావం ఉంటుందట. మరో 15 నుంచి 20శాతం వరకు పరిసరాలు అతన్ని ప్రభావితం చేస్తే మిగతా 60 నుంచి 70 శాతం మాత్రం వ్యక్తి సొంత నిర్ణయంపైనే ఆధారపడి జీవితం సాగుతుందట. అందుకోసం మానసికంగా ముందు సిద్ధమవ్వాలని హార్వార్డ్ పరిశోధకులు చానాళ్ల క్రితమే తేల్చారు. ముందుకు సాగాలి ఇలా... ఏ ఉద్యోగాన్ని ఇష్టపడుతున్నారో ముందు స్పష్టత ఉండాలి. ఆ రంగంలో రాణించిన ప్రముఖులను ఆదర్శంగా తీసుకోవాలి. జెనెటిక్ ఇంజి నీరింగ్ ద్వారా వారి జీన్స్ను మీకు ఎక్కించడం సాధ్యమయ్యే(ఇప్పటికైతే) పనికాదు కాబట్టి వారు సాధిం చిన విజయాలు, వృత్తిలో ముందుకెళ్లిన తీరును మీకు మీరు ఆపాదించుకోవాలి. ఉదాహారణకు పోలీసు కావాలనుకుంటున్న వారు, ఆ శాఖలో పేరు ప్రఖ్యాతలు సాధించిన కిరణ్బేడి లాంటి వారిని ఆదర్శంగా భావించాలి. అలా ఆయా రం గాల్లోని వారిని ఆదర్శంగా తీసుకుని వారి తీరును గుర్తు చేసుకోవాలి. అదే బాట లో పయనించాలనే మీ లక్ష్యానికి పట్టుదలతో పదును జోడించాలి. అదే భవిష్యత్ నిర్మాణానికి పునాది వేస్తుంది. 1 ఆత్మ పరిశీలన పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు.వారి బలం, బలహీనతలపై ఆత్మ పరి శీలన చేసుకోవాలి. వాటిని ఎప్పటికపుడు ఓ పుస్తకంలో రాసుకుని అధిగమించేందుకు కృషి చేయాలి. 2 అనుకూల పరిసరాలు తమ చుట్టూ ఉన్న పరిసరాలను అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. సెల్ఫోన్కు దూరంగా ఉండాలి. తప్పదనుకుంటే వాయిస్మెయిల్ ఆన్ చేయాలి. మరీ ఇబ్బందిని అనిపిస్తే నంబర్లు మార్చండి. ఉదయం అరగంట పాటు యోగా, వ్యాయామం చేయాలి. 3 పాజిటివ్ థింకింగ్ చాలా మంది తమ బలాలను గుర్తించరు. పిచ్చాపాటి మాట్లాడేటప్పుడు గొప్ప విషయాలను చెప్పేవారు, పరీక్షా కేంద్రంలో తడబడతారు. పాజిటివ్ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి. బలాన్ని ద్విగుణీకృతం చేసే యత్నం చేయాలి. 4 ఒక్క అడుగుతోనే మొదలు.. కొండంత సిలబస్ను చూసి బెంబేలు చెందొద్దు. ఒకేరోజు అంతా పూర్తిచేయడం ఎవ్వరికి సాధ్యం కాదు. వేయి మైళ్ల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే మొదలుపెడతాం. అలాగే ఎంత పెద్ద సిలబస్ అయినా చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకుని, చదివినదాన్ని పునఃశ్చరణ చేయాలి. తర్వాత వీలుంటే వాటిని కాగితంపై పెట్టాలి. సమాధానాలతో సరిపోల్చుకోవాలి. అప్పుడే ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. 5 నెగెటివ్ ఆలోచనలొద్దు కొందరు ప్రిపరేషన్ను బాగానే కొనసాగిస్తుంటారు. ఒకటి, రెండు లక్ష్యాలను చేరుకోలేకపోయేసరికి ఢీలా పడతారు. ఇతరుల కంటే వెనుకబడ్డామనే ఆలోచన వచ్చిందంటే ఇక అంతే వెనుకబడిపోతారు. అది తప్పుడు ఆలోచన. ఎవరు ఎక్కువ చదివారన్నది పోటీ పరీక్షలకు సంబంధం లేదు. ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వగలిగామా అన్నదే ప్రధానం. 6 ఆత్మవిశ్వాసం ఇలాంటి లక్షణాలన్నీ మీరు ఆపాదించుకోవాలంటే ఆత్మవిశ్వాసం, సంకల్పబలం, సాధించాలనే కాంకక్ష ముఖ్యం. దాన్ని ఎలాంటి పరిస్థితుల్లో సలడనీయవద్దు. వేళకు తీనేలా, పడుకునేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇక సక్కెస్ మీదే...విష్యూ ఆల్ది బెస్ట్. 7 విజేతలతో జట్టు కట్టాలి సంకుచిత ఆలోచనలు మనిషి వెనక్కులాగుతాయి. సానుకూల ఆలోచనలు అంతే ముందుకు తీసుకెళ్తాయి. ఇది వరకు పోటీ పరీక్షల్లో విజయవం సాధించిన వారిని స్ఫూర్తిగా తీసుకుంటే ధైర్యం కలుగుతుంది. వీలయితే వారి సూచనలు, సలహాలు స్వీకరించాలి. వారి అనుభవం మీ లక్ష్యాన్ని విజయ పథాలకు తీసుకెళ్లగలదు. -
TSPSC చైర్మన్గా ప్రొ.ఘంటా
-
‘ఘంటా’ మోగింది
ఉద్యమ బిడ్డకు ఉత్తమ పదవి.. పెద్దపల్లి: ఉద్యమకారుడు, శాంతిచర్చల ప్రతినిధి ఘంటా చక్రపాణికి తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్(టీపీఎస్సీ) చైర్మన్ పదవి లభించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఎలిగేడు మండలం ధూళికట్లలో జన్మించిన ప్రొఫెసర్ చక్రపాణికి అరుదైన అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లాకు రాష్ట్రలో ప్రత్యేకచోటు లభించినట్లయింది. ఎలిగేడు గ్రామానికి చెందిన మొగిలయ్య-జననమ్మ దంపతుల రెండో కుమారుడు చక్రపాణి. అక్కడే ఏడో తరగతి వరకు చదివారు. ఎనిమిది నుంచి పదో తరగతి వరకు సుల్తానాబాద్లో అభ్యసించారు. ఇంటర్, డిగ్రీ కరీంనగర్లో పూర్తి చేశారు. బాల్యం నుంచే సామాజిక సేవా కార్యక్రమాలకు ఆకర్షితులయ్యారు. కరీంనగర్ నుంచి వెలువడ్డ జీవగడ్డ దినపత్రికలో విలేకరిగా పనిచేశారు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్కు వెళ్లిన చక్రపాణి.. విద్యారంగంలో విశిష్ట సేవలు అందించారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా కొనసాగారు. శాంతిచర్చల సభ్యడిగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో మావోయిస్టులు, ప్రభుత్వానికి మధ్య జరిగిన శాంతి చర్చల్లో మేధావుల కమిటీ నుంచి సభ్యుడిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో శాంతి స్థాపన కోసం మేధావులు, మానవహక్కుల సంఘాలతో కలిసి పనిచేశారు. పౌరహక్కులకు భంగం కలిగిన పలు సందర్భాల్లో చక్రపాణి గొంతెత్తి ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర.. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కలిసి కీలకపాత్ర పోషించారు. స్వరాష్ట్ర సాధన కోసం పోరాడిన పలు ప్రజాసంఘాలు చేపట్టిన సభలు, సమావేశాల్లో చక్రపాణి ప్రధాన వక్తగా పాల్గొని తెలంగాణ వాణి వినిపించారు. ఉద్యమానికి మేధావులను సమీకరించడంలో ఆయన చేసిన కృషికి నిదర్శనంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు సమయంలోనే తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ చైర్మన్ పదవి ఇవ్వడానికి సూచనప్రాయంగా కేసీఆర్ అంగీకరించారు. అప్పట్లో ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకునే క్రమంలోనే బుధవారం చక్రపాణికి అరుదైన టీపీఎస్సీ చైర్మన్గా అవకాశం కల్పించారు. ఇప్పటికే జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ అల్లం నారాయణకు ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి అప్పగించిన సంగతి తెలిసిందే. అల్లం నారాయణకు సన్నిహితుడైన చక్రపాణికి తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ అవకాశం దక్కింది. ప్రతీ దీపావళికి ఇంటికి.. హైదరాబాద్లో స్థిరపడ్డ చక్రపాణి అన్నదమ్ములు, కుటుంబసభ్యులు ప్రతీదీపావళికి ఎలిగేడుకు వస్తుం టారు. ఎలిగేడులో సొంత ఇంట్లోనే కేదారీశ్వరి వ్రతం నోముకుంటారు. ఆయనకున్న పొలం ప్రస్తుతం కౌలుకిచ్చారు. తల్లిదండ్రులు చక్రపాణితోనే ఉంటున్నారు. చక్రపాణికి ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులున్నారు. -
ఖాళీ పోస్టులు 10,236
హన్మకొండ అర్బన్ : త్వరలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేస్తామని... రాష్ట్రంలోని సుమారు 1.07లక్షల ఖాళీలు భర్తీ చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి శాసన సభలో ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నారుు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారు ఉత్సాహంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగ నియామకాల్లో ఐదేళ్ల వయోపరిమితి సడలిస్తున్నట్లు కేసీఆర్ స్పష్టం చేయడంతో నిరాశలో ఉన్న వారిలోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నారుు. చివరిసారిగా తమ అదృష్టం పరీక్షించుకునే అవకాశం వచ్చిందని వారు ఆనంద పడుతున్నారు. ఉద్యోగ నియామకాల ప్రక్రియకు నిర్ధిష్టమైన తేదీ ప్రకటించకున్నా... కొద్ది నెలల్లో అనడంతో పోటీలో ఉండాలనుకుంటున్న వారందరూ పుస్తకాలతో కుస్తీ మొదలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ముందు నుంచి జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 10,236 ఖాళీలు ఉన్నాయని అధికారికవర్గాల సమాచారం. వీటిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయాల్సినవే ఎక్కువగా ఉన్నాయి. టీచర్ పోస్టుల వంటి కొన్ని మాత్రం డీఎస్పీ ద్వారా భర్తీ చేస్తారు. కొద్ది సంవత్సరాలుగా ఊరిస్తున్న సర్వీస్ కమిషన్ నియామకాల్లో వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శుల పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇక పదుల సంఖ్యలోనే ఏపీపీఎస్పీ నుంచి నియామకాలు జరిగాయి. ఈ నేపథ్యంలో మిగతా ఖాళీలను భర్తీ ప్రక్రియ త్వరగా చేపట్టాలని నిరుద్యోగులు ఆకాంక్షిస్తున్నారు. విభజన లెక్కలు పూర్తయితేనే... విభజన లెక్కలు పూర్తయితేనే రాష్ట్రంతోపాటు జిల్లాల వారీగా కూడా పూర్తి ఖాళీలు ఎన్ని ఉన్నాయనే విషయంలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఇదే విషయూన్ని ముఖ్యంమంత్రి కూడా శాసన సభలో తెలిపారు. ప్రస్తుతం ఐఏఎస్, ఐపీఎస్ల విభజనతతోపాటు జోనల్, మల్టీ జోనల్ కేడర్ అధికారుల పంపకాలు పూర్తి చేసినట్లయితే ఇక్కడ ఉండేవారు... ఆంధ్రాకు వెళ్లేవారి లెక్కలు పక్కాగా తేలుతాయి. వాటి ఆధారంగా రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు గుర్తించే ప్రక్రియ సులువవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎటొచ్చి ప్రస్తుతం ఉన్న ఖాళీల సంఖ్య పెరగడమే తప్ప తగ్గే అవకాశాలు ఉండవని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. శిక్షణ సంస్థల్లో పెరిగిన రద్దీ రాష్ట్ర విభజన... సాధారణ ఎన్నికల్లో ‘మేం అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం’ అంటూ అన్ని పార్టీలు ప్రకిటించాయి. ఈ విషయంలో అందరికన్నా ముందున్న టీఆర్ఎస్ పగ్గాలు చేపట్టడంతో సహజంగానే ఉద్యోగ నియామకాలపై యువతీయవకులు ఎంతో ఆశగా ఉన్నారు. ఎన్నికల అనంతరం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు, నియామకాల ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు కోచింగ్ సెంటర్ల బాట పట్టారు. ప్రస్తుతం వేలాది మందితో కిక్కిరిసి పోతున్నాయి. త్వరలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటై... సిలబస్ ప్రకటిస్తే ఈ సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది. -
తెలంగాణలోను వయో పరిమితి పెంపు !
తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించే పరీక్షలు రాసే ఉద్యోగుల వయో పరిమితి పెంచాలని టీఆర్ఎస్ ప్రభుత్వం యోచిస్తుంది. అలాగే పరీక్ష విధానంలో కూడా సమూలమైన మార్పులు తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తుంది. ఈ అంశాలపై వచ్చే ఏడాది జనవరి నాటికి ప్రభుత్వానికి ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ అంశాల అమలు సాధ్యాసాధ్యాలపై మేధావులు, విద్యావంతులతో ప్రభుత్వం చర్చిస్తుంది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే భారీ ఎత్తున ప్రభుత్వ కలువులు భర్తీ చేస్తామని టీఆర్ఎస్ పార్టీ తన ఎన్నికల మేనిఫేస్టోలో వెల్లడించింది. ఎన్నికల్లో ఆ పార్టీ విజయఢంకా మోగించి.. అధికారాన్ని కైవసం చేసుకుంది. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే కేసీఆర్ ప్రభుత్వం దాదాపు 60 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసును క్రమబద్దీకరించింది. దీంతో నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఆ క్రమంలో వారు ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం దిగి వచ్చింది. అదికాక ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం... ఉద్యోగ వయో పరిమితిని 36 నుంచి 40 ఏళ్లకు పెంచుతూ జీవో జారీ చేసిన విషయం విదితమే. దీంతో ఆదే దిశగా కేసీఆర్ సర్కార్ కూడా ఆలోచన చేస్తుందని సమాచారం. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఉద్యోగాల భర్తీలోగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే పరీక్షలు, ఉద్యోగాల భర్తీ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుందని సమాచారం. -
టీపీఎస్సీ ఆవిర్భావం
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం చైర్మన్గా ఘంటా చక్రపాణి..! నేడో రేపో ఉత్తర్వులు మార్గదర్శకాలు ఖరారు హైదరాబాద్: నిరుద్యోగులు ఎదురుచూస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీపీఎస్సీ) ఆవిర్భవించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మ శుక్రవారం జీవో జారీ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 ప్రకారం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం పబ్లిక్ సర్వీసు కమిషన్ను ఏర్పాటు చేసుకోవచ్చని, ఆ నిబంధనల మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ను ఏర్పాటు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్టికల్ 320 ప్రకారం కమిషన్ నిర్వహణ నియమావళి ఉంటుందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం జూన్ 2న ఆవిర్భవించిందని, దీంతో కమిషన్ ఏర్పాటు ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని గెజిట్ నోటిఫికేషన్లో ప్రచురించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ బాధ్యతలను వెంటనే కమిషన్ చూస్తుందని పేర్కొన్నారు. అలాగే, టీపీఎస్సీ చైర్మన్గా బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిని నియమించనున్నారు. ఒకటీ రెండు రోజుల్లో ఆయన నియామక ఉత్తర్వులు వెలువడనున్నాయి. కమిషన్ సభ్యులను ప్రభుత ్వం నియమించనుంది. మరోవైపు కమిషన్ మార్గదర్శకాలను జారీ చేయనుంది. కమిషన్ ఏర్పాటుకు గవర్నర్ నరసింహన్ ఆమోద ముద్ర వేసిన రెండు రోజులకే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. సభ్యుల నియామకంపై కసరత్తు.. టీపీఎస్సీలో ఎంతమందిని మొదట సభ్యులుగా నియమించేలా అంశంపైనా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వారి నియామకాలకు సంబంధించి కూడా మూడు నాలుగు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. వీలైతే చైర్మన్ నియామకంతోపాటే సభ్యుల నియామక ఉత్తర్వులు కూడా జారీ చేయనుంది. గతంలో ఏపీపీఎస్సీ ఏర్పాటు చేసినపుడు ముగ్గురు సభ్యులు, ఒక చైర్మన్తో మొత్తంగా నలుగురితో ఏపీపీఎస్సీ ఏర్పాటైంది. ఆ తరువాత క్రమంగా సభ్యులను సంఖ్య రాష్ట్ర ప్రభుత్వం తమ అభీష్టం మేరకు పెంచుకుంది. అలాగే, ప్రస్తుతం టీపీఎస్సీలో కూడా నలుగురు లేదా ఐదుగురు సభ్యులు, ఒక చైర్మన్ను నియమించనుంది. ఆ తరువాత అవసరం అనుకుంటే సభ్యుల సంఖ్యను పెంచాలని భావిస్తోంది. కార్యదర్శిగా అనుభవం కలిగిన ఐఏఎస్ అధికారిని నియమించే ఆలోచనలు చేస్తోంది. త్వరలో ఉద్యోగాల భర్తీపై స్పష్టత ఉద్యోగుల కేటాయింపుపై పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చాక ఇంకా ఎంత మంది రాష్ట్ర స్థాయి అధికారులు అవసరం అవుతారు? శాఖాధిపతి కార్యాలయాల్లో ఎంతమంది సిబ్బందిని నియమించుకోవాల్సి ఉంటుందనే అంశాలపై ఆలోచనలు చేస్తోంది. ఆ తరువాత అవసరమైన నియామకాలపై చర్యలు చేపట్టనుంది. దీనికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చని, వీలైతే ఆగస్టు నెలలో నియామకాలకు చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. జిల్లాల్లోని పోస్టులకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉండబోవని, వాటిని యథావిధిగా భర్తీ చేసుకునే వీలుంటుందని తెలిపారు. గతంలో ఆర్థిక శాఖ ఇచ్చిన ఆమోదం ప్రకారం టీపీస్సీ ద్వారా 15 వేల వరకు ఉద్యోగాల భర్తీ చేపట్టే అవకాశం ఉంది. ‘కేసీఆర్ చొరవతోనే టీపీఎస్సీ’ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చొరవతోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీపీఎస్సీ) త్వరగా ఏర్పాటయిందని తెలంగాణ గ్రూపు-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్గౌడ్, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో హర్షం వ్యక్తంచేశారు. కాగా, టీపీఎస్సీ ఏర్పాటు చరిత్రాత్మకమని తెలంగాణ బీసీ టీచర్స్ యూనియన్ ఒక ప్రకటనలో పేర్కొంది. -
పది రోజుల్లోగా టీపీఎస్సీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్(టీపీఎస్సీ)ను ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. దీనికి సంబంధించిన ఫైలును సిద్ధం చేసిన ప్రభుత్వం.. దాన్ని రెండు, మూడు రోజుల్లో గవర్నర్ నరసింహన్కు పంపించాలని నిర్ణయించింది. గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే కమిషన్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. మొత్తంమీద ఈ ప్రక్రియంతా పూర్తయ్యేందుకు పది రోజుల వరకు పట్టే అవకాశముంది. అలాగే, కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకంపైనా సమాలోచనలు మొదలయ్యాయి. ఎంతమందిని సభ్యులుగా నియమించాలనే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏపీపీఎస్సీని మొదట చైర్మన్, ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేశారు. ఆ తరువాత క్రమంగా సభ్యుల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం తమ అభీష్టం మేరకు పెంచుకుంటూ వచ్చింది. అలాగే ఇప్పుడు టీపీఎస్సీని కూడా చైర్మన్తో పాటు నలుగురు లేదా ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆ తరువాత అవసరం అనుకుంటే సభ్యుల సంఖ్యను పెంచుకోవచ్చనే భావనలో ఉంది. గవర్నర్ ఆమోదం లభించిన వెంటనే కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, టీపీఎస్సీ ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోదం అవసరమా? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోనే టీపీఎస్సీ ఏర్పాటుకు అవకాశం కల్పించినందువల్ల గవర్నర్ ఆమోదం సరిపోతుందని అధికారులు వాదిస్తున్నారు. కమలనాథన్ కమిటీతో చర్చించాక, ఉద్యోగుల కేటాయింపుపై పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చిన తరువాత.. నూతన నియామకాలపై నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. ఇంకా ఎంతమంది రాష్ట్రస్థాయి అధికారులు.. ఇతర సిబ్బంది అవసరమవుతారనే విషయంపై కూడా ప్రస్తుతమున్న ఉద్యోగుల కేటాయింపు అనంతరమే స్పష్టత వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టకపోవచ్చని, వీలైతే ఆగస్టు నెలలోనే నూతన నియామకాలకు తెరలేపే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. జిల్లాల్లోని పోస్టులకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉండబోవని, వాటిని యథావిధిగా భర్తీ చేసుకునే వీలుంటుందన్నారు.