Vitamins
-
చలికాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన ‘సూపర్ పండు’ ఎన్ని లాభాలో!
ప్రకృతి చాలా మహమాన్వితమైంది. సీజన్కు తగ్గట్టు మనకు ఎన్నో అద్భుతమైన ఫలాలను అందిస్తుంది. అందుకే ఏ కాలంలో దొరికే పళ్లు, కూరగాయలు ఆకాలంలో విరివిగా తినాలని పెద్దలు చెబుతారు. మరి శీతాకాలంలో మాత్రమే దొరికే ఒక అద్భుతమైన చిట్టి పండు గురించి తెలుసుకుందాం. రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఏమిటా పండు? దాని లాభాలేంటి? చూద్దామా. శీతాకాలంలో మాత్రమే దొరికే రేగి పండు(jujube fruit)తీపి పులుపు కలగలిపిన అద్భుతమైన రుచి. చూడ్డానికి చిన్నగా కనిపించినా పోషక విలువలు మాత్రం మెండుగా లభిస్తాయి. అందుకే ఆయుర్వేద చికిత్సలో, ఔషధాల్లో ప్రాముఖ్యత కూడా ఉంది. రేగు పండ్లు తరచూ జ్వరం, జలుబు రాకుండా చేస్తాయి. తలనొప్పి, డయేరియా, రక్త విరేచనాలను అరికట్టడానికి రేగి చెట్టు బెరడును ఉపయోగిస్తారు. బెరడు కషాయం మలబద్ధకానికి బాగా పనిచేస్తుంది.ఈ పండ్లను చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతగానో ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా రేగు పళ్లతో చేసే ఒడియాలకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక్కసారి అలవాటు పడితే తినకుండా ఉండలేం. వీటి రుచి మహాగమ్మత్తుగా ఉంటుంది. రేగి పళ్ళపై ఉప్పు కారం చల్లుకుని తింటారు. ఇంకా వీజామ్లూ, జెల్లీలూ, జ్యూస్, టీ, వినెగర్, క్యాండీలూ లాంటి వాటిని కూడా తయారు చేస్తారు. రేగుపళ్లలో పురుగులు బాగా ఉంటాయి. చూసుకొని తినాలి రేగు పండ్లలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ కారణంగా శరీరం దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడతాయి. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి. రేగిపండులో ఉన్న పోటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.రక్తహీనతతో బాధపడేవారికి రేగుపళ్లు చాలా మేలు చేస్తాయి. గర్భిణీ స్త్రీలు కూడా తినవచ్చని వైద్యులు చెబుతున్నారు. అలాగే వేవిళ్లు, వాంతుల సమయంలో రేగుపళ్లుతో తయారు చేసిన రేగుపళ్లను కొద్ది కొద్దిగా చప్పరిస్తూ ఉంటే నోటికి పుల్లగా బావుంటుంది. అలాగే వాంతులు కూడా తగ్గే అవకాశాలున్నాయి. అద్బుతమైన ప్రయోజనాలురేగిపండులోని విటమిన్ సీ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఈ పళ్లలోని యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని వైరస్లు, బాక్టీరియా వంటి హానికరమైన సూక్ష్మజీవుల నుంచి రక్షిస్తాయి శీతాకాలంలో వచ్చే సీజనల్ జలుబు, దగ్గు వంటి ఇతర ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. సహజసిద్ధమైన చక్కెరలు , బీ విటమిన్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.రక్తహీనతను (Anaemia) నివారిస్తుంది. రేగిపండులో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది హీమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. ఫలితంగా రక్తహీనత తగ్గుతుంది. అనీమియాసమస్యలతో బాధపడేవారు కొన్ని రేగిపండ్లను రోజూ తీసుకుంటే రక్తహీనత సమస్యను తగ్గించుకోవచ్చు.రేగిపండులో ఉన్న యాంటీఆక్సిడెంట్లు చర్మ సౌందర్యాన్ని పాడతాయి. ముఖంపై మచ్చలు, ముడతలు , తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులోని విటమిన్ సి చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి,చర్మానికి మెరుపునిస్తుంది. సౌందర్యం కోసం రేగిపండును ఫేస్ ప్యాక్ లాగా కూడా ఉపయోగిస్తారు.అంతేనా...ఇంకాదీర్ఘకాలిక ఆందోళన, ఒత్తిడితో బాధపడేవాళ్లకి రేగుపండ్లు ఔషధంలా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లు తింటే డిప్రెషన్ దూరం అవుతుంది. అలాగే నిద్రలేమి (Insomnia) సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ మతిమరుపూ ఆల్జీమర్స్ రాకుండానూ అడ్డుకుంటుందని ఒక అధ్యయనంలో తేలింది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇందులోని ఫైటోకెమికల్స్ (Phytochemicals) వల్ల రక్తంలో ఇన్సులిన్ సున్నితత్వం మెరుగుపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు రేగిపండును (మితం) తీసుకోవచ్చు.రేగిపండులో కూడా క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. కనుక బరువు పెరుగుతామనే బెంగ అవసరం లేదు. పైగా ఇది కడుపుని తేలికగా,తృప్తిగా ఉంచుతుంది. రేగిపండులో కేల్షియం, ఫాస్పరస్, మ్యాగ్నీషియం ఎముకలను బలపరుస్తాయి. ఆస్టియో పోరోసిస్ వంటి ఎముకల సమస్యలకు ఉపశమనం పనిచేస్తాయి.రేగిపండులో యాంటీ-క్యాన్సర్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి క్యాన్సర్ కణాల వృద్ధిని నియంత్రిస్తాయి . ప్రత్యేకంగా బ్రెస్ట్ క్యాన్సర్ , లివర్ క్యాన్సర్ ముప్పును తగ్గించే అవకాశం ఉంది.ఎవరు తినకూడదుయాంటీ డిప్రెసెంట్ మందులువాడేవారుమూర్చ వ్యాధితో బాధపడుతున్న వారుస్కిన్ అలెర్జీ, శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నవారు.ఆస్తమా వ్యాధితోబాధపడుతున్నారు కూడా రేగుపళ్ళను అతిగా తినకూడదు.ఎక్కువగా తింటే విరేచనాలు అయ్యే ప్రమాదముంది గనుక, ఇప్పటికే ఈ సమస్యతో బాధపడేవారు కూడా దూరంగా ఉండాలి. నోట్: ఇది అవగాహన కోసం అందించిన మాత్రమే. ఏదైనా అతిగా తినకూడదు. అతిగా తింటే కొన్ని అనారోగ్య సమస్యలు రావచ్చు. గొంతులో కఫం పెరగడం, దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. -
ఈ విటమిన్లు తీసుకోండి
విటమిన్లు అందరికీ అవసరమే అయినా మహిళల ఆరోగ్యంలో ఇవి మరింత కీలక పాత్ర పోషిస్తాయి. 25 ఏళ్ల తరువాత మహిళల శరీరంలో పలు మార్పులు ప్రారంభమవుతాయి. ఇలాంటి కీలక దశలో పోషకాహారం, ఎక్సర్సైజులను నిర్లక్ష్యం చేస్తే విపరిణామాలు ఎదురవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిపుణుల ప్రకారం 25 దాటిన మహిళల ఆహారంలో కొన్ని విటమిన్స్ తప్పనిసరిగా ఉండాలి. అవేంటంటే..విటమిన్ డి...ఎముకలు, రోగనిరోధక శక్తి బలోపేతానికి అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్లను శరీరం సులువుగా గ్రహించేందుకు విటమిన్ డీ అవసరం. మహిళల్లో మరణాలకు ప్రధాన కారణాల్లో ఆస్టియోపోరోసిస్, ఫ్రాక్చర్ల ప్రమాదం ఎక్కువ కాబట్టి విటమిన్ డీ ఆహారంలో ఉండేలా చేసుకోవాలి. ఎందులో ఉంటుందంటే...ఫార్టిఫైడ్ పాలు, గుడ్లు, సాల్మన్ లాంటి ఫ్యాటీ ఫిష్లో ఇది పుష్కలంగా ఉంటుంది.విటమిన్ బి12...ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కీలకమైన విటమిన్ బీ12 మహిళ ఆరోగ్యానికి ఎంతో కీలకం. ఈ విటమిన్ లోపం తలెత్తితే మెగాలోబ్లాస్టిక్ అనేమియా అనే రక్తహీనత తలెత్తుతుంది. సంతానోత్పత్తికి, ప్రెగ్నెన్సీ సమయంలో ఇబ్బందులను అడ్డుకునేందుకు కూడా ఈ విటమిన్ కీలకం. ఎందులో లభిస్తుందంటే... అన్ని రకాల మాంసాహారాలలో... పాలు, పెరుగు, నెయ్యి, కివీ, అరటి వంటి పండ్లలో విటమిన్ బి 12 లభిస్తుంది. విటమిన్ సి...మహిళలకు కావలసిన అతి ముఖ్యమైన విటమిన్లలో ఇది కూడా ఒకటి. ఇది శరీరంలో ఉత్పత్తి కాదు కాబట్టి ఆహారం ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది. మహిళలకు రోజుకు 75 మిల్లీ గ్రాముల విటమిన్ సీ కావాలి. ఇది రక్తపోటు, కొలెస్టెరాల్ స్థాయులను నియంత్రించేందుకు అవసరం. వయసు పెరిగే కొద్దీ గుండె జబ్బులు అడ్డుకునేందుకు కూడా ఇది కీలకం. విటమిన్ సి సమృద్ధిగా తీసుకుంటే ఐరన్ లోపం తలెత్తే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. ఎందులో ఉంటుంది?నిమ్మ జాతికి చెందిన పండ్లు, కీవీ పళ్లల్లో ఈ విటమిన్ సమృద్ధిగా ఉంటుంది.విటమిన్ ఈయాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్న విటమిన్ ఈ చర్మ ఆరోగ్యానికి కీలకం. అతినీలలోహిత కిరణాలు, కాలుష్యం కారణంగా చర్మానికి జరిగే నష్టాన్ని ఇది తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తి కూడా బలోపేతమయ్యేలా చేస్తుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పులు, ఇతర అసౌకర్యాల నుంచి కూడా విటమిన్ ఈ ఉపశమనం కలిగిస్తుంది.ఎందులో ఉంటుందంటే... విత్తనాలు, గింజలు, పాలకూర, పొద్దుతిరుగుడు పువ్వు నూనెలో ఈ విటమిన్ పుష్కలంగా ఉంటుంది.విటమిన్ కే...బ్లడ్ క్లాటింగ్కు కీలకమైన విటమిన్ కే గాయాలు త్వరగా మానేలా చేస్తుంది. ఎముకల ఆరోగ్యానికీ ఇది కీలకం. మహిళల్లో ఉదయం పూట కలిగే అసౌకర్యాల నుంచి ఉపశమనం కల్పిస్తుంది. మెదడు ఆరోగ్యానికీ ఇది అవసరమే. ఆకుకూరలు, ఆవకాడో లాంటి పండ్లు, చేపలు, లివర్, మాంసం గుడ్లల్లో ఇది పుష్కలంగా ఉంటుంది. -
మందపాటి రగ్గు కప్పుకున్నా చలి తగ్గడంలేదా.. కారణమిదే..
శీతాకాలంలో చలిగా అనిపించడం సహజం. దీంతో చలి నుంచి తప్పించుకునేందుకు ఉన్ని దుస్తులు ధరిస్తారు. రాత్రిపూట మందపాటి రగ్గులు కప్పుకుంటారు. అయినప్పటికీ కొందరు తమకు ఏమ్రాతం చలి తగ్గలేదని చెబుతుంటారు. పైగా కాళ్లు చేతులు, చల్లబడిపోతున్నాయని, చలికి తట్టుకోలేకపోతున్నామని అంటుంటారు. అయితే ఇందుకు వారి శరీరంలో వివిధ విటమిన్లు, పోషకాల లోపం కారణం కావచ్చంటున్నారు నిపుణులు. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.ఇవి కూడా చలికి కారణమే..మెగ్నీషియం లోపం: మెగ్నీషియం లోపం వల్ల కండరాల తిమ్మిర్లు, నొప్పులు తలెత్తుతాయి. రక్త ప్రసరణ సరిగా జరగదు. ఫలితంగా ఇది చేతులు, కాళ్లు చల్లబడేందుకు కారణంగా నిలుస్తుంది. తృణధాన్యాలు, ఆకు కూరలు వంటి మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం లేదా మెగ్నీషియం సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని అధిగమించవచ్చు.ఇనుము: శరీరంలో ఐరన్ లేనప్పుడు, అది రక్తహీనతకు కారణమవుతుంది. ఫలితంగా అలసట, నీరసంతోపాటు చేతులు, కాళ్ళు చల్లగా మారుతాయి. ఆహారంలో లీన్ మీట్, పౌల్ట్రీ, చేపలు, బీన్స్, ఆకు కూరలు వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవడం వలన ఐరన్ లోపాన్ని నివారించవచ్చు.ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు: ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యకరమైన కొవ్వులు. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ, రక్త ప్రసరణలోనూ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల లోపం రక్త ప్రసరణను దెబ్బతీస్తుంది. ఫలింగా చలిగా ఉన్నట్లు అనిపిస్తుంది.విటమిన్ బీ12: విటమిన్ బీ12 శరీరంలో రక్త కణాలను తయారు చేయడంలో, నరాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. బీ 12 లోపం కండరాల దృఢత్వాన్ని దెబ్బతీస్తుంది. ఈ లోపాన్ని తగ్గించేందుకు చేపలు, మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులతోపాటు బలవర్థకమైన తృణధాన్యాలను ఆహారంలో చేర్చుకోవాలి.విటమిన్ డి: ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో, శరీరంలో కాల్షియం స్థాయిలను నియంత్రించడంలో విటమిన్ డి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి లోపం బలహీనమైన రక్త ప్రసరణకు కారణమవుతుంది. ఈ లోపం చేతులు, కాళ్లు చల్లబడేలా చేస్తుంది. ఎండలో బయట కాస్త సమయం గడపడం, చేపలు, గుడ్లు, బలవర్థకమైన పాల ఉత్పత్తులు వంటి విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. తద్వారా శరీరంలో విటమిన్ డి స్థాయి కొనసాగుతుంది. ఫలితంగా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.ఇది కూడా చదవండి: Year Ender 2024: విమాన ప్రమాదాలు.. ప్రాణాలు కోల్పోయిన ప్రముఖులు -
చలికాలంలో చుండ్రు బాధ, ఒళ్లు పగులుతుంది ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే!
ఈ ఏడాది నవంబరు మాసం వచ్చినా కూడా సాధారణంగా ఉండేంత చలి వణికించకపోయినా, మిగతా సీజన్లతో పోలిస్తే చలి కాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. చలిగాలులు సోకకుండా ఉన్ని,ఊలు దుస్తులను ధరించడంతోపాటు, రోగనిరోధక శక్తిని కాపాడుకునేలా ఆహారం విషయంలో జాగ్రత్తపడాలి.చలికాలంలో శ్వాసకోస వాధులు, ఇన్ఫెక్షన్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం పట్ల మరింత అ ప్రమత్తంగా ఉండాలి. శరీరం వేడిగా ఉండేలా జాగ్రత్తలు పాటించాలి. స్వెట్లర్లు, సాక్సులు, మంకీ క్యాప్లు విధింగా ధరించేలా చూడాలి. లేదంటే జలుబు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. తాజా పండ్లు, ఆకుకూరలతో పాటు, తృణధాన్యాలతో కూడిన పోషకాహారాన్ని మన ఆహారంలో చేర్చుకోవాలి. నిల్వచేసిన, ఫ్రిజ్లో ఉంచిన ఆహారానికి బదులుగా ఎప్పటికప్పుడు వేడిగా తినడం మంచిది. అలాగే చలిగా ఉంది కదా అని మరీ వేడి నీటితో స్నానం చేయకూడదు. తల స్నానానికి కూడా గోరు వెచ్చని నీరు అయితే మంచిది. చుండ్రు సమస్య రాకుండా ఉండాలంటే, చలికాలంలో జుట్టును శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. మైల్డ్ షాంపూ వాడాలి. చలికాలంలో వేడి నీళ్లు తాగితే జీర్ణ సమస్యలు ఉండవు. గొంతు నొప్పి లాంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు.ముఖ్యంగా విటమిన్ సీ, ఏ, లభించేలా చూసుకోవాలి. అలాగే చలికాలంలో ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి విటమిన్ డీ అందేలా చూసుకోవాలి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఇలా అనేక రకాల సీజనల్ వ్యాధులను, ఇన్ఫెక్షన్ల ప్రమాదం నుంచి ఇది కాపాడతాయి. కొవ్వు చేపలు, కోడిగుడ్డు,మష్రూమ్స్, సోయా మిల్క్ వంటి వాటిలో డీ విటమిన్ పుష్కలంగా ఉంటుంది.రోగనిరోధక శక్తిని పెంచేలా విటమిన్ సీ లభించే సిట్రస్ పండ్లను తీసుకోవాలి. నిమ్మ, నారింజ, బ్రోకలీ, బెర్రీ, వివిధ రకాల సిట్రస్ పండ్లపై దృష్టిపెట్టాలి. నట్స్, సీడ్స్, కోడిగుడ్లు, గుమ్మడి గింజలు, చేపలు వంటివి తీసుకోవాలి.విటమిన్ ఏ ఎక్కువగా లభించే క్యారెట్లు, చిలగడ దుంపలు, పాలకూర, పాలు, చీజ్ బీఫ్ లివర్, క్యాప్సికం, గుమ్మడి కాయ కూరగాయలను తీసుకోవాలి. విటమిన్ ఏ చర్మానికి, కంటి ఆరోగ్యానికి మంచిది. వీటితోపాటు, శరీరానికి అవసరమయ్యే అత్యంత ముఖ్యమైన బీ 12,బీ6ను తీసుకోవాలి. ఇవి వైరల్ ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులనుంచి రక్షిస్తాయి. సాల్మన్ చేపలు, టునా ఫిష్, చికెన్, కోడిగుడ్లు, పాలు వంటి పదార్థాల్లో విటమిన్ బి 12 లభిస్తుంది. చలికాలంలో చర్మంపై కూడా చాలా ప్రభావం ఉంటుంది. పగలడం, ఎండిపోయినట్టు అవ్వడం చాలా సాధారణంగా కనిపించే సమస్యు. అందుకే దాహంగా అనిపించకపోయినా, సాధ్యమైనన్ని నీళ్లను తాగుతూ ఉండాలి. దీంతో శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా, తేమగా ఉంటుంది. రాగుల జావ, తాజా పండ్ల రసాలు తీసుకోవాలి.డ్రై స్కిన్ ఉన్న వారికి చిట పటలాడం, మంట పెట్టడం, దురద పెట్టడం లాంటి ఇబ్బందులు మరీ ఎక్కువగా వస్తాయి. అలాంటి వారు ఖ వింటర్ సీజన్ లో మాయిశ్చ రైజింగ్ క్రీములు వాడాలి. చర్మ సంరక్షణ కోసం రసాయన సబ్బులకు బదులుగా ప్రకృతిసిద్ధంగా లభించే వాటితో తయారు చేసుకున్న సున్ని పిండి వాడితే ఉత్తమం. లేదా ఆయుర్వేద, లేదా ఇంట్లోనే తయారు చేసుకున్న సబ్బులను వినియోగించాలి. లేదంటే గ్లిసరిన్ సబ్బులను ఎంచుకోవాలి. విటమిన్ ఇ లభించే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. -
ఈ నాలుగు కీలక పోషకాలను తక్కువగా తీసుకుంటున్నాం!
మనం తీసుకునే ఆహారంలో సూక్ష్మపోషకాలు, స్థూల పోషకాలు ఉండాలని చెబుతుంటారు. సమతుల్య ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వమని నిపుణులు సూచిస్తుంటారు. అయితే మన ఆహారంలో అత్యంత కీలకమైన పోషకాలను కోల్పోతున్నామట. ఇటీవల పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో తేలింది. మన తీసుకునే ఆహారంలో అత్యంత కీలకమైన, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే పోషకాలను కోల్పోతున్నామని పరిశోధకులు చెప్పారు. ఇంతకీ ఏంటా నాలుగు కీలక పోషకాలంటే..!హార్వర్డ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శాంటా బార్బరా పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయ్యింది. ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలు కాల్షియం, ఐరన్, విటమిన్ సీ, ఈతో సహా శరీరానికి అవసరమయ్యే సూక్ష్మ పోషకాలను సరిపోని స్థాయిలో వినయోగిస్తున్నట్లు తెలిపారు. అందుకో 34 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తుల డేటాపై అధ్యయనం చేసినట్లు తెలిపింది. ఇలా మొత్తం 31 దేశాలలోని ప్రజల డేటాను సర్వే చేసి మరీ అంచనా వేసినట్లు పేర్కొన్నారు. అందులో పురుషుల, స్త్రీల డేటాను వేరు చేసి మరి అధ్యయనం చేసినట్లు తెలిపారు. వారందరిపై దాదాపు 15 విటమిన్లు, ఖనిజాల గురించి అధ్యయనం చేసింది. అందులో నాలుగు కీలక పోషకాలను ఆహారం నుంచి చాల తక్కువ మోతాదులో తీసుకుంటున్నారని తేలింది. ముఖ్యంగా అయోడిన్, విటమిన్ ఈ, కాల్షియం, ఐరన్ తగినంతగా తీసుకోవడం లేదని పరిశోధనలో తేలిందని చెప్పారు. ఇక సగానికి పైగా ప్రజల్లో రిబోఫ్లావిన్, ఫోలేట్, విటమిన్ సీ, బీ6, నియాసిన్ తదితరాలను చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. అంతేగాదు ప్రపంచ జనాబాలో దాదాపు 22% మంది చాలా తక్కువ స్థాయిలో ఈ పోషకాలను తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు పరిశోధకులు. ఇవి మన రోగనిరోధక వ్యవస్థను బలోపతం చేయడంలో కీలక పాత్ర పోషించేవని తెలిపారు. (చదవండి: పెళ్లిలో తోడిపెళ్లి కూతురు/పెళ్లి కొడుకు సంప్రదాయం ఎలా వచ్చిందంటే..!) -
పోషకాహార లోపాన్ని అధిగమించడానికి.. ఏం తినాలో తెలుసా!?
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన దేశంలో ఆహార సమస్యకు పరిష్కారంగా హరిత విప్లవం వచ్చింది. హరిత విప్లవం ఫలితంగా ఆహార పంటల దిగుబడులు గణనీయంగా పెరిగాయి. ఆ తర్వాత గ్రామీణ భారత స్వయంసమృద్ధి లక్ష్యంతో శ్వేత విప్లవం వచ్చింది. శ్వేత విప్లవం వల్ల దేశంలో పాల ఉత్పత్తి పెరగడమే కాకుండా, ఎందరికో స్వయం ఉపాధి లభించింది. ఈ రెండు విప్లవాలు వచ్చి దశాబ్దాలు గడిచిపోయాయి. అయినా, నేటికీ మన దేశంలో ఎందరో శిశువులు, చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.దేశవ్యాప్తంగా 2019–21 మధ్య చేపట్టిన ఐదో విడత జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్–5) ప్రకారం మన దేశంలో ఐదేళ్ల లోపు వయసు ఉన్నవారిలో ఎదుగుదల లోపించిన చిన్నారులు 36.5 శాతం, బక్కచిక్కిపోయిన చిన్నారులు 19.3 శాతం, తక్కువ బరువుతో ఉన్న చిన్నారులు 32.1 శాతం మంది ఉన్నారు. చాలా రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత మధ్యాహ్న భోజన పథకాలను అమలు చేస్తున్నా, చిన్నారుల్లో పోషకాహార లోపం ఈ స్థాయిలో ఉండటం ఆందోళనకరం. ఇదిలా ఉంటే, మన దేశంలో ఐదేళ్ల లోపు చిన్నారుల్లో 2.4 శాతం మంది స్థూలకాయంతో బాధడుతున్నారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి పోషకాహార నిపుణులు చెబుతున్న జాగ్రత్తలు ‘జాతీయ పోషకాహార వారోత్సవం’ సందర్భంగా మీ కోసం...నేటి బాలలే రేపటి పౌరులు. దేశ భవితవ్యానికి చిన్నారుల ఆరోగ్యమే కీలకం. చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలి. వారు ఏపుగా ఎదగాలి. అప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుంది. ప్రపంచవ్యాప్తంగానే కాకుండా, మన దేశంలోని చిన్నారుల్లో పోషకాహార లోపానికి గల కారణాలను, చిన్నారుల్లో పోషకాహార లోపం వల్ల తలెత్తే పరిణామాలను కూలంకషంగా అర్థం చేసుకుని, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని భర్తీ చేసేందుకు వారికి ఎలాంటి ఆహారాన్ని ఇవ్వాలో, వారిలోని ఎదుగుదల లోపాలను అరికట్టేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.చిన్నారుల్లో పోషకాహార లోపం సమస్య తీవ్రతను అర్థం చేసుకోవాలంటే, ప్రపంచవ్యాప్త పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వెనుకబడిన దేశాల్లోను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ ఈ సమస్య అత్యంత తీవ్రంగా ఉంది. అంతర్జాతీయ గణాంకాలను చూసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్ల లోపు వయసు గల చిన్నారుల్లో 14.9 కోట్ల మంది పోషకాహార లోపం కారణంగా ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. మరో 4.5 కోట్ల మంది చిన్నారులు పోషకాహారం అందక బక్కచిక్కి ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న బాలల మరణాల్లో 45 శాతం మరణాలు పోషకాహార లోపం వల్ల సంభవిస్తున్నవే! చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే! మరోవైపు, 3.7 కోట్ల మంది చిన్నారులు స్థూలకాయంతో బాధపడుతున్నారు.పోషకాహార లోపాన్ని అధిగమించాలంటే, రోజువారీ ఆహారంలో వీలైనంత వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. తృణధాన్యాలు, గింజధాన్యాలు, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పెరుగు, ఇతర పాల ఉత్పత్తులు, గుడ్లు, చికెన్ వంటివి తీసుకోవాలి. ఐరన్, జింక్, అయోడిన్ తదితర ఖనిజ లవణాలు, విటమిన్–ఎ, విటిమన్–బి, విటమిన్–సి తదితర సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉండే పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి.చక్కని పోషకాహారం తీసుకోవడమే కాకుండా, ఆహారం సరిగా జీర్ణమవడానికి ప్రతిరోజూ తగినంత నీరు తాగాలి. ప్రతిరోజూ నిర్ణీత వేళల్లో భోజనం చేయడం వల్ల ఆహార జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. అలాగే, కుటుంబ సభ్యులతో కలసి భోజనం చేయడం వల్ల తినడంలో ఆరోగ్యకరమైన పద్ధతులు అలవడటమే కాకుండా, సామాజిక అనుబంధాలు పెరుగుతాయి. ఆకలి వేసినప్పుడు తినే పదార్థాల మీద పూర్తిగా దృష్టిపెట్టి తృప్తిగా భోజనం చేయాలి. తినే సమయంలో టీవీ చూడటం సహా ఇతరత్రా దృష్టి మళ్లించే పనులు చేయకుండా ఉండటం మంచిది.పోషకాహార లోపానికి కారణాలు..చిన్నారుల్లో పోషకాహార లోపానికి అనేక కారణాలు ఉన్నాయి. శిశువులకు తల్లిపాలు అందకపోవడం మొదలుకొని ఆహార భద్రతలేమి వరకు గల పలు కారణాలు చిన్నారులకు తీరని శాపంగా మారుతున్నాయి. భారత్ సహా పలు దేశాల్లోని పిల్లలకు పేదరికం వల్ల ఎదిగే వయసులో ఉన్నప్పుడు తగినంత పోషకాహారం అందడంలేదు. కడుపు నింపుకోవడమే సమస్యగా ఉన్న కుటుంబాల్లోని చిన్నారులకు పోషకాహారం దొరకడం గగనంగా ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఆరునెలల లోపు వయసు ఉన్న శిశువుల్లో 44 శాతం మందికి మాత్రమే తల్లిపాలు అందుతున్నాయి. మన దేశంలో ఇదే వయసులో ఉన్న శిశువుల్లో దాదాపు 55 శాతం మందికి తల్లిపాలు అందుతున్నట్లు ‘ఎన్ఎఫ్హెచ్ఎస్–5’ గణాంకాలు చెబుతున్నాయి. బాల్యంలో పోషకాహార లోపం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా అవి:– కండరాలు పెరగక బాగా బక్కచిక్కిపోతారు.– ఎదుగుదల లోపించి, వయసుకు తగినంతగా పెరగరు.– పెద్దయిన తర్వాత డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు, ఎముకల బలహీనత, రకరకాల క్యాన్సర్లు వంటి ఆరోగ్య సమస్యలకు లోనవుతారు.డైటరీ సప్లిమెంట్ల ఉపయోగాలు..మూడు పూటలా క్రమం తప్పకుండా భోజనం చేసినా, మన శరీరానికి కావలసిన సూక్ష్మపోషకాలు తగినంత మోతాదులో అందే అవకాశాలు తక్కువ. అందువల్ల వైద్య నిపుణులను సంప్రదించి, వయసుకు తగిన మోతాదుల్లో సూక్ష్మపోషకాలను అందించే డైటరీ సప్లిమెంట్లను తీసుకోవడం మంచిది. ముఖ్యంగా చిన్నారులకు విటమిన్–ఎ, ఐరన్ సప్లిమెంట్లు ఎక్కువగా అవసరమవుతాయి. విటమిన్–ఎ సప్లిమెంట్ను చిన్నప్పటి నుంచి తగిన మోతాదులో ఇస్తున్నట్లయితే, కళ్ల సమస్యలు, దృష్టి లోపాలు రాకుండా ఉంటాయి.ఐరన్ సప్లిమెంట్లు ఇచ్చినట్లయితే, రక్తహీనత వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అన్ని పోషకాలు సమృద్ధిగా దొరికే ఆహారం తీసుకోవడం, అవసరం మేరకు డైటరీ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. మంచి ఆరోగ్యం కోసం రోజువారీ భోజనంలో కూరగాయలు, ఆకుకూరలు, గింజ ధాన్యాలు, పప్పు ధాన్యాలు ఎక్కువ పరిమాణంలో ఉండేలా చూసుకోవాలి. వీటికి తోడు కొద్ది పరిమాణంలో నట్స్, డ్రైఫ్రూట్స్, పండ్లు, పెరుగు ఉండేలా చూసుకోవాలి. నూనెలు, ఇతర కొవ్వు పదార్థాలు, ఉప్పు అవసరమైన మేరకే తప్ప ఎక్కువగా వాడకుండా ఉండాలి.పిల్లల ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సినవి..ఎదిగే వయసులో ఉన్న చిన్నారులు పుష్టిగా ఎదగాలంటే, వారి ఆహారంలో తగినన్ని పోషకాలు ఉండాలి. వారు తినే ఆహారం తేలికగా జీర్ణమయ్యేలా కూడా ఉండాలి. పిల్లలకు అందించే ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సిన పదార్థాలు ఇవి:– పిల్లల భోజనంలో పప్పుధాన్యాలు, గింజధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ఆకుకూరలు, కాలానికి తగిన పండ్లు, గుడ్లు, పాలు, పెరుగు తప్పనిసరిగా ఉండాలి.– పిల్లలు చురుకుగా ఉండటానికి, ఆరోగ్యకరంగా ఎదగడానికి వారిని ఆరుబయట ఆటలు ఆడుకోనివ్వాలి. శారీరక వ్యాయామం చేసేలా, ఆటలాడేలా, ఇంటి పనుల్లో పాలు పంచుకునేలా పిల్లలను ప్రోత్సహించాలి.– పిల్లలకు ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పించాలి. వారు వ్యక్తిగత శుభ్రత పాటించేలా అలవాటు చేయాలి.– అతిగా తినడం, వేళాపాళా లేకుండా తినడం వంటి అలవాట్లను చిన్న వయసులోనే మాన్పించాలి. ఈ అలవాట్లను నిర్లక్ష్యం చేస్తే పిల్లలు స్థూలకాయం బారినపడే ప్రమాదం ఉంటుంది.– ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలు మితిమీరి ఉండే జంక్ఫుడ్కు పిల్లలు దూరంగా ఉండేలా చూడాలి.కుకింగ్ క్లాసెస్తో.. "విద్యార్థులకు ఆకు కూరలు, కూరగాయలు, పళ్లు, ఇతర ఆహారపదార్థాల్లోని పోషకవిలువల పట్ల అవగాహన కల్పించేందుకు హైదరాబాద్లోని విద్యారణ్య, ఓక్రిజ్ స్కూళ్లలో కుకింగ్ క్లాసెస్నూ నిర్వహిస్తున్నారు." – అడ్డు కిరణ్మయి, సీనియర్ న్యూట్రిషనిస్ట్, లైఫ్స్టైల్ కన్సల్టంట్ -
బోడకాకర ఉంటే, మటన్, చికెన్ దండగ, ఒక్కసారి రుచి చూస్తే
ఏ సీజన్లో లభించే కూరగాయలు, పళ్లను ఆ సీజన్లో తీసుకోవాలని పెద్దలు, ఆరోగ్య నిపుణులు చెబుతారు. అంటే ఆయా కాలంలో వచ్చే వైరస్లు, రోగాల నుంచి కాపాడతాయని దీని అర్థం. వర్షాకాలం పచ్చగా నిగ నిగలాడుతూ కనిపించే కూరగాయల్లో ఒకటి బోడ కాకర కాయ. వీటినే బొంత కాకర కాయలు అని కూడా పిలుస్తారు. ఇంకా అడవి కాకర, ఆ-కాకర అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు. అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే గుణాలు బోడకాకరకాయలో పుష్కలంగా ఉన్నాయి. కండరాలను బలోపేతం చేస్తుందని, సూపర్ ఇమ్యూనిటీ బూస్టర్ అంటారు నిపుణులు.శరీరానికి అవసరమైన అన్ని విటమిన్లను అందిస్తుంది. విటమిన్ డీ12, విటమిన్ డీ, కాల్షియం, జింక్, కాపర్, మెగ్నీషియం లాంటివి లభిస్తాయి. శరీరంలోని కొవ్వును కరిగించి, బరువు నియంత్రణలో సహాయపడుతుంది. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు అదుపులో ఉంటాయి. బోడ కాకరకాయలో ఉండే ఫోలేట్స్ వల్ల వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మంచిది. దీన్ని ఫ్రై లేదా, ఉల్లిపాయలు, మసాలతో కూర చేసుకుంటారు. పోషకాలతో పోలిస్తే, చికెన్, మటన్ కంటే ఇది చాలా బెటర్ అంటారు. బోడకాకరతో ఆరోగ్య ప్రయోజనాలుబోడకాకరతో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియకుమంచిది. రోగనిరోధక శక్తిని బలపడుతుంది తలనొప్పి, జుట్టు రాలడం, చెవి నొప్పి, దగ్గు, కడుపులో ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. రక్తంలోని చక్కెర నిల్వలను తగ్గిస్తుంది.రక్తపోటు, కేన్సర్ వ్యాధుల నుంచి రక్షించడంలోసాయపడుతుంది. పక్షవాతం, వాపు, అపస్మారక స్థితి, కంటి సమస్యల విషయంలో కూడా మంచి ప్రభావం చూపిస్తుంది. మొటిమలు రాకుండా నివారిస్తుంది. ఇందులోని ఫ్లావనాయిడ్లు వృద్ధాప్య ముడతలను నివారిస్తాయి. గర్భిణులు ఈ కాయను కూర చేసుకొని తింటే గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. వర్షాకాలంలో వర్చే దురదల నుంచి కూడా కాపాడుతుంది -
Beauty Tips: పండులాంటి ప్యాక్..!
ముఖంలో నిగారింపు, చర్మంలో కోమలత్వం తగ్గుతుందని దిగులు చెందుతున్నారా..! అయితే ఈ సింపుల్, బెస్ట్ బ్యూటీ చిట్కాలు మీకోసమే..ఇలా చేయండి..– అరటితొక్కతో సహా పండుని ముక్కలుగా తరిగి పేస్టు చేయాలి.– ఈ పేస్టుకు రెండు టీస్పూన్ల పచ్చిపాలు పోసి మరోసారి గ్రైండ్ చేసి పదిహేను నిమిషాలు రిఫ్రిజిరేటర్లో పెట్టాలి.– తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పూతలా అప్లై చేసి ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి.– అరటి పండులో ఉన్న విటమిన్ బి6, బి12, ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియంలు చర్మానికి పోషణ అందించి ఆరోగ్యంగా ఉంచుతాయి.– ఈ ప్యాక్ను వారానికి రెండుసార్లు వేసుకోవడం వల్ల ముఖచర్మం నిగారింపుని సంతరించుకుంటుంది.– క్రమం తప్పకుండా వాడితే ఫలితం త్వరగా కనిపిస్తుంది.ఇవి చదవండి: ఇంకు, తుప్పు వంటి మొండి మరకలు సైతం తొలగించాలంటే..? ఇలా చేయండి.. -
కలబంద రసంతో.. ఉపయోగాలెన్నో..!
కలబందలో మొక్కలకు కావలసిన పోషకాలు, యాంటిఆక్సిడెంట్లు, ఎంజైమ్లు పుష్కలంగా ఉంటాయి. అమైనా ఆమ్లాలు, కాల్షియం, జింక్, మెగ్నీషియం వంటివి 75 రకాలపోషకాలుంటాయి.. ఇది మొక్కలను క్రిములు, వైరస్లు, శిలీంధ్రాల నుంచి కాపాడుతుంది. కలబంద ఆకు ముక్కలను మిక్సీలో వేస్తే రసం వస్తుంది. స్పూనుతో ఈ కింద చెప్పిన కొలతలో ఇంటిపంటలు / మిద్దెతోటల సాగులో వాడుకోవచ్చు..1. ఒక టీస్పూను కలబంద రసాన్ని ఒక లీటరు నీటితో కలిపి మొలక దశలో లేదా చిన్న మొక్కలు స్ప్రే చేయవచ్చు. వారానికి ఒక సారి చేస్తే సరి΄ోతుంది.2. ఒక టేబుల్ స్పూన్ రసాన్ని ఒక లీటరు నీటితో కలిపి మొక్క ఉన్న కుండీలోపోయాలి. ఇలా నెలకు ఒకసారి చేయాలి. దీనివలన మొక్కకు ఇమ్మ్యూనిటీ పెరుగుతుంది.3. మొక్కను ఒక కుండీ నుంచి వేరే కుండీలోకి మార్చినప్పుడు లీటరు నీటికి ఒక టేబుల్ స్పూన్ రసాన్ని కలిపి కుండీలోపోయాలి. ఇలా చేస్తే మొక్క మార్పిడి వత్తిడికి గురికాదు.4. ఎరువుగా వాడాలి అన్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల కలబంద రసాన్ని లీటరు నీటితో కలిపి మొక్క కుండీలోపోయాలి. ఇలా 15 రోజులకు ఒకసారి వాడాలి.5. స్ప్రే చేయాలంటే ఒక టేబుల్ స్పూన్ వాడాలి లీటరు నీటికి. ఆకుల అడుగు భాగంలో మాత్రమే స్ప్రే చేయాలి. దీనివలన మొక్క తొందరగాపోషకాలను గ్రహిస్తుంది.6. రూటింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఏదైనా మొక్క కొమ్మను విరిచి నాటుకోవాలంటే, నేరుగా కలబంద రసంలో అరగంట కొమ్మ చివరను నానబెట్టి, ఆ తరువాత నాటవచ్చు.7. ఇది బూడిద తెగులును అరికడుతుంది. గమనిక: కలబంద రసం తయారు చేసిన అర గంట లోపే వాడాలి. పులిస్తే అందులో ఉన్నపోషకాలు కొన్నిపోతాయి.– విజయలక్ష్మి, బెంగళూరు మిద్దెతోట బృందంఇవి చదవండి: ఫోన్ కనపడకపోతే.. ప్రాణం పోతోందా? అయితే మీకీ వ్యాధి ఉన్నట్లే! -
నిత్యం వీటిని తినడంతో.. కలిగే మార్పులు తెలుసా!
కొంతమంది ఎప్పుడూ ఉసూరుమంటూ ఉంటారు. టార్చి లైటు వేసి చూసినా, వారి ముఖంలో ఉత్సాహం కనిపించదు. ఇంకొందరేమో ఉత్సాహానికి మారుపేరులా... ఎప్పుడూ నవ్వుతూ తుళ్లుతూ ఉంటారు. మనం తీసుకునే ఆహారం మన ప్రవర్తనపైన, పనితీరుపైనా ప్రభావం చూపుతుందనడానికి అదొక తార్కాణం. కొన్ని రకాల ఆహార పదార్థాలను నిత్యం తింటుండటం వల్ల ఉత్సాహంగా... ఉల్లాసంగా ఉండడంతోపాటు మెరుపులీనే చర్మం, మంచి ఆరోగ్యం మన సొంతం అవుతాయి. అవేమిటో చూద్దామా... ఉత్సాహంగా ఉంచే ఆహారం అనగానే అదేదో ఖరీదైన తిండేమో అని అనుకోనక్కరలేదు. ఇంకా చె΄్పాలంటే మిగిలిన వాటితో పోల్చితే అవి కాస్తంత చవగ్గానే దొరుకుతాయి. టొమాటో: దీనిలోని లైకోపిన్ కాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. గుండె, రక్తనాళాలకి సంబంధించిన అనారోగ్యాన్ని కూడా నిరోధిస్తుంది. మన చర్మానికి ఎండ తాలూకు ప్రభావాలనుండి రక్షించడంలో మిగతా పోషకాలతో పాటు టమాటోల పాత్ర చెప్పుకోదగినదే. నట్స్: ముఖ్యంగా వాల్నట్స్లో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్, ΄్లాంట్ స్టెరోల్స్ సమృద్ధిగా ఉంటాయి. కొలెస్టరాల్ లెవల్ తగ్గించడంలో వీటి పాత్ర అమోఘం. వాల్నట్స్లో పీచుపదార్థం అధికం. మెగ్నీషియం, కాపర్, ఫోలేట్, విటమిన్–ఇ, ఉండి శక్తిమంతమైన యాంటి ఆక్సిడెంట్స్ని అందిస్తాయి. బ్లడ్ ప్రెషర్ను తగ్గిస్తుంది. ఆస్టియోపొరోసిస్ రాకుండా ఆపుతుంది. గుండె ఆరోగ్యాన్ని, చర్మానికి ఎండనుండి కలిగే హానినుండి కాపాడుతుంది. ఆల్మండ్స్ చర్మకాంతికి తోడ్పడతాయి. రోజూ గుప్పెడు నట్స్ తింటూ ఉంటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది. గ్రీన్టీ: ఇది ఓ సూపర్ డ్రింక్. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. చర్మాన్ని అంత త్వరగా ముడతలు పడనివ్వదు. కళ్ళకు మెరుపు అందిస్తుంది. కేటరాక్ట్ ముదరటాన్నీ నెమ్మదింపచేస్తుంది. కప్పు గ్రీన్ టీ తీసుకోగానే కొత్త ఉత్సాహం పరవళ్లు తొక్కుతున్నట్లనిపిస్తుంది. యోగర్ట్ లేదా పెరుగు: మనం కర్డ్ లేదా పెరుగు అంటాం కానీ, విదేశాలలో దీనినే యోగర్ట్ అంటారు. అయితే మన పెరుగుకూ దానికీ ఉన్న తేడా ఏమిటంటే... పెరుగు కాస్త పలచగా ఉంటుంది. యోగర్ట్ గట్టిగా ఉంటుంది. పెరుగు కాస్తంత పుల్లదనాన్ని కలిగి ఉంటుంది. యోగర్ట్లో ఏమాత్రం పులుపు ఉండదు. కస్టర్డ్ ΄ûడర్ కలిపినట్టుగా గడ్డగా... కొద్దిపాటి తియ్యగా ఉంటుంది. ఈ రెండూ కూడాప్రోటీన్, కాల్షియం, విటమిన్–బి లను కలిగి ఉంటాయి. ఇవన్నీ కలిసి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇన్ఫెక్షన్ కలగకుండా పోరాడతాయి. యోగర్ట్ మన శరీర ఆరోగ్యానికి, జీర్ణ వ్యవస్థకు, నాడీవ్యవస్థకు మేలుచేస్తుంది. క్యాన్సర్, ఎలర్జీలు, అధిక రక్తపోటు, హై–కొలెస్టరాల్ బారిన పడకుండా కాపాడుతుంది. బీన్స్: ప్రోటీన్స్, పీచుపదార్థం, విటమిన్లు, మినరల్స్, ఫైటోన్యూట్రియెంట్స్. ఇవన్నీ బీన్స్లో సమృద్ధిగా ఉంటాయి. అలాగే కొవ్వుకు సంబంధించిన చెడు లక్షణాలు ఉండవు. బీన్స్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. షుగర్ లెవల్స్ సమతుల్యంగా ఉండేటట్లు చూస్తూనే సురక్షితమైన, నిలకడ అయిన నెమ్మదిగా ఖర్చయ్యే శక్తిని అందిస్తుంది. కొలెస్టరాల్ లెవెల్స్ని కొంతమేరకు తగ్గిస్తాయి. బీన్స్తో చేసిన కూరలు తిన్నప్పుడు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. అయితే ఇందులో అధిక క్యాలరీలు లేకపోవడం వలన బరువు పెరిగే సమస్యే ఉందదు. బెర్రీస్: ముఖ్యంగా నేరేడుపండ్లు-వృద్ధాప్యం త్వరగా రాకుండా చేస్తాయి. వృద్ధులవుతున్న కొద్దీ మెదడు నెమ్మదించే అవకాశం ఉంది. అలాంటి అనారోగ్యలనుంచి బెర్రీస్ కాపాడుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, క్యాన్సర్ నిరోధకాలు ఉంటాయి. ఆకుకూరలు: ఆకుకూరలు చాలా రకాల క్యాన్సర్ల నుండి కాపాడుతాయి. వీటిలో విటమిన్ బీ, సీ, ఇ, ఫోలేట్, పొటాషియం, పీచుపదార్ధం సమృద్ధిగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి మంచిది. కాల్షియంని శరీరం ఇముడ్చుకోవటానికి తోడ్పతాయి. కేటరాక్ట్ను నిరోధించడంలో పాలకూర తోడ్పడుతుంది. వీలయినంత వరకూ వీటిలో కొన్నింటిని అయినా రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే ఉత్సాహంగా ఉండవచ్చు. ఇవి చదవండి: కిచెన్ టిప్స్: మనకిష్టమైన పదార్థాలను ఇలా కాపాడుకుందాం..! -
మిమ్మల్ని మీరే పట్టించుకోవాలీ..!
కుటుంబ సభ్యులందరికీ కావలసిన వాటిని అమర్చడంలో పడి మహిళలు తమ ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ వహించరు. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదని అందరికీ తెలిసిందే. అందువల్ల ముందే మేలుకొనడం అవసరం. నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేడుకలు జరుపుకునే ఉంటారు. అయితే అంతకన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే మహిళలు తమ ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెట్టి సమయం కేటాయించడం. తమ వయసుకు తగ్గ పోషకాహారం తీసుకోవడం. అనారోగ్య సమస్యలను దాచిపెట్టకుండా తగిన ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. మీరు ఆరోగ్యంగా ఉంటేనే...మీ కుటుంబం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి.. ఐరన్ ఉండే ఆహారం... మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన దానిలో ఐరన్ మొదటి స్థానంలో ఉంది. గర్భధారణ సమయంలో స్త్రీలకు ఐరన్ చాలా అవసరం. శరీరంలో ఐరన్ పరిమాణం తగ్గిపోవడం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. దీనివల్ల నీరసం, అలసట, ఊపిరి అందకపోవడం వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల మీ ఆహారంలో మాంసకృత్తులు, చికెన్, సీఫుడ్, బీన్స్, కాయధాన్యాలు, బచ్చలి కూర, బ్రోకలీ, బీట్రూట్, దానిమ్మ, ఖర్జూరం, తృణధాన్యాలు వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. విటమిన్ ఎ తప్పనిసరి... మహిళలకు అవసరమైన విటమిన్ల జాబితాలో విటమిన్ ఎ ద్వితీయ స్థానంలో ఉంది. ఇది మహిళల పునరుత్పత్తి ఆరోగ్యానికి ముఖ్యమైన విటమిన్. ఆహారంలో విటమిన్ ఎ అధికంగా ఉండే ఆకుకూరలు, అరటి పండ్లు వంటివి తీసుకోవాలి. విటమిన్ బి 12.. విటమిన్ బి 12 అనేది జీవక్రియ కార్యకలాపాలను పెంచుతుంది. రక్తహీనతను నివారిస్తుంది, మహిళల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందువల్ల బీ 12 సమృద్ధిగా ఉండే మాంసం, చేపలు, గుడ్లు తీసుకోవాలి. శాకాహారులు ΄÷ట్టు తియ్యని వేరసెనగపప్పు, సెనగలు, దంపుడు బియ్యం, వెన్న తియ్యని పాలు (జంతువుల నుంచి వచ్చిన పాలు) వంటివి తీసుకోవాలి. కాల్షియం... మహిళలు వయస్సు పెరిగేకొద్దీ, ఎముక సంబంధిత ఆరోగ్య సమస్యలను తరచు ఎదుర్కొంటారు. అందువల్ల, ఎముకల ఆరోగ్యానికి మహిళలు కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం. ఇందుకోసం పాలు, గుడ్డు, నువ్వులు వంటివి తీసుకోవాలి. విటమిన్ డి... ఈ జాబితాలో విటమిన్ డి తర్వాతి స్థానంలో ఉంది. విటమిన్ డి మన శరీరం కాల్షియాన్ని గ్రహించడంలో సహాయపడుతుంది. ఇది ఎముకలు, దంతాల పెరుగుదలకు సహాయపడుతుంది. మెగ్నీషియం... మెగ్నీషియం కూడా స్త్రీలకు కావలసిన అతి ముఖ్యమైన పోషకం. కండరాల బలం ఎముకల ఆరోగ్యానికి మెగ్నీషియం అవసరం. మహిళలు మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ పరీక్షలు అవసరం.. భారతదేశంలో మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు.. ఎన్నో గణాంకాలు స్త్రీలల్లో ఐరన్ లోపం ఉంది అని చెబుతున్నాయి. కనీసం 10 శాతం కూడా హిమోగ్లోబిన్ ఉండటం లేదు. ఈ పరిస్థితిని ఇలానే నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. ముఖ్యంగా ఇది బ్లడ్ క్యాన్సర్కు కూడా దారితీస్తుంది. అందువల్ల అత్యవసరమైన సీబీపీ అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, థైరాయిడ్, విటమిన్ పరీక్షలు, కాల్షియం, కొలెస్ట్రాల్, ఐరన్ వంటి పరీక్షలను చేయించుకోవడం అవసరం. ఇవి చదవండి: సమాజాన్ని అద్దంలో చూపించాను -
రక్తహీనతతో బాధ పడుతున్నారా.. అయితే ఇవి తీసుకోండి!
'మన శరీరంలో పోషకాలు, ఆక్సిజన్ ప్రతి కణానికి సరిగ్గా అందడంలో రక్తం పాత్ర ముఖ్యమైనది. సరైన ఆరోగ్యం కోసం తగినంత రక్తం శరీరంలో ఉండాల్సిన అవసరం ఉంది. శరీరంలో రక్తం లోపించిన పరిస్థితిని అనీమియా అంటారు. రక్తం సరిగ్గా ఉండటానికి సరైన ఆహారాలు తినటం ఎంత ముఖ్యమో ప్రాసెస్డ్ ఆహారాలు, కృత్రిమ షుగర్స్ గల ఆహారాలు తగ్గించడం కూడా అంతే ముఖ్యం.' ఐరన్ అనేది ఎర్ర రక్త కణాలలోని హిమోగ్లోబిన్ లో కనిపించే ఒక ఖనిజం. హిమోగ్లోబిన్ ఆక్సిజన్ను శరీరంలోని అన్ని భాగాలకు చేరవేస్తుంది. శరీరంలో ఐరన్ లోపం ఉన్నప్పుడు, ఎర్ర రక్త కణాలు సరిగా ఉత్పత్తి కావు, గుడ్లు, మాంసం, చేపలు, టోఫు, పప్పులు, చిక్కుళ్ళు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఐరన్ లోపం తలెత్తకుండా ఉంటుంది. విటమిన్ బి 12 అనేది ఒక విటమిన్, ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరం. విటమిన్ బి12 లోపం ఉన్నప్పుడు, ఎర్ర రక్తకణాలు సరిగా పనిచేయలేవు. అందువల్ల ఆహారంలెఓ విటమిన్–బి 12 లభించే మాంసం, చేపలు, పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ అనేది ఒక విటమిన్, ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కూడా అవసరం. ఫోలిక్ యాసిడ్ లోపం ఉన్నప్పుడు, ఎర్ర రక్త కణాలు సరిగా పెరగలేవు, అందువల్ల ఫోలిక్ యాసిడ్ ఉండే గుడ్లు, మాంసం, చేపలు, ఆకుకూరలు, బీన్స్, చిక్కుళ్ళు తీసుకోవాలి. ప్రోటీన్లు అనేవి శరీరం యొక్క నిర్మాణాత్మక భాగాలు. ప్రోటీన్లు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కూడా అవసరం. ప్రోటీన్ల–మూలం మాంసం, చేపలు, పాలు, పాల ఉత్పత్తులు, పప్పులు, చిక్కుళ్ళు, ధాన్యాలు, ఆకుకూరలు, తోటకూర, పాలకూర, గోంగూర వంటి ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, ఈ ఐరన్ మన రక్తం లోని హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో ముఖ్యమైనది. ఆకు కూరల్లాంటి ఐరన్ రిచ్ ఫుడ్స్ తినడం వల్ల రక్తం పెరిగి అనీమియా వంటి సమస్య రాకుండా ఉంటుంది. చిక్కుళ్ళు, పప్పు దినుసులు చిక్కుళ్ళు, పప్పు దినుసుల్లో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉన్న ప్లాంట్ బేస్డ్ ఐరన్ రక్తవృద్ధికి సహాయపడాలంటే వీటితో పాటు విటమిన్ సి అధికంగా ఉన్న ఫుడ్స్ కూడా తీసుకోవాలి. అలాగే వీటిలో ఫోలియేట్, విటమిన్ బి 6 కూడా ఉండటం వల్ల రక్తం తయారవ్వటానికి ఇవి బాగా దోహదం చేస్తాయి. నట్స్, సీడ్స్ బాదం, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు వంటి నట్స్, సీడ్స్ లో ఫోలియేట్, ఐరన్, విటమిన్ ఇ ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ ఇ ఎర్ర రక్తకణాలు నష్టపోకుండా కాపాడుతుంది. బీట్ రూట్ బీట్ రూట్స్ లో ఐరన్, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. అందుకని మన శరీరం లో బ్లడ్ లెవల్స్ పెరగడానికి ఇది సహాయపడుతుంది. అలాగే ఈ బీట్రూట్స్ లో ఉండే నైట్రేట్స్ రక్త ప్రసరణ సవ్యంగా జరగడానికి అలాగే రక్తంలో ఆక్సిజన్ సరిగ్గా ఉండటానికి సహాయపడతాయి. సిట్రస్ పండ్లు నారింజ పళ్ళు, ద్రాక్ష, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి అనేది మన శరీరంలో రక్తం పెరగడానికి అవసరం అయ్యే ఐరన్ గ్రహించడానికి సహాయపడుతుంది. అందుకనే ఐరన్ రిచ్ ఫుడ్స్ తో పాటు ఈ సిట్రస్ పండ్లు కూడా తీసుకోవటం మంచిది. ఇవి కూడా చదవండి: ఆస్తమా 'దమ్ముందా'? ఇలా చేసి చూడండి! వెంటనే.. -
బచ్చలికూర ఎంత మేలో.. తెలిస్తే అస్సలు వదులుకోరు!
'మనకు అందుబాటులో ఉండే అనేక రకాల ఆకుకూరల్లో బచ్చలి కూర ఒకటి. కానీ, బచ్చలికూరను చాలామంది ఇష్టపడరు.. అయితే, బచ్చలికూరలో దాగివున్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం నిజంగా బంగారమే అంటారు.' బచ్చలి కూరలో విటమిన్ ఎ, సి, ఇ, కె, మెగ్నీషియం, ఫోలేట్, పొటాషియం, ఐరన్, కాపర్ పుష్కలంగా ఉన్నాయి. ఇది ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, డైటరీ ఫైబర్, ఫ్లేవనాయిడ్స్కు భాండాగారం. రక్తహీనతతో బాధపడే వారికి బచ్చలి కూర దివ్యౌషధంలా పని చేస్తుంది. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు తమ రోజు వారి ఆహారంలో బచ్చలికూరను చేర్చుకుంటే ఆ సమస్య నుంచి త్వరగా బయటపడగలరని నిపుణులు చెబుతున్నారు. హైబీపీ పేషెంట్లు బచ్చలి ఆకులను రసంగా చేసుకుని తాగుతుంటే.. రక్తపోటు అదుపులో ఉంటుంది. అంతేకాదు.. బచ్చలి కూర గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బచ్చలికూరను తరచూ తీసుకోవటం ద్వారా శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరుగుతుంది. బచ్చలి కూరలో ఉండే కాల్షియం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. బచ్చలి కూరలో అధికంగా ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, నియాసిన్, సెలీనియం నరాల ఆరోగ్యానికి, మెదడు ఆరోగ్యానికి ఎంతో సహా యపడతాయి. అంతేకాదు, మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడేవారు రెగ్యులర్గా బచ్చలి కూరను తీసుకోవడం వల్ల మూత్ర విసర్జనలోని సమస్యలు తొలగిపోతాయి, పైల్స్, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు బచ్చలికూరను తింటే ఈ సమ స్యనుంచి ఉపశమనం లభిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇవి చదవండి: 'ఇంగువ'ని ఇలా తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు! -
గుడ్లు, ఆకుకూరలు తింటున్నారా? మీ చర్మంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో తెలుసా?
శరీరానికి సరైన ఆహారం ఎంతో ముఖ్యం. ఎందుకంటే మనం ఏం తింటామో అదే మన చర్మంపై రిఫ్లెక్ట్ అవుతుంది. ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా సరైన ఆహారం తీసుకోకపోతే వ్యర్థమే. బ్యాలెన్స్ డైట్లో విటమిన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. విటమిన్లలో ముఖ్యంగా విటమిన్-ఎ అధికంగా ఉండే ఆహారం చర్మ సంరక్షణకు కీలకంగా ఉపయోగపడుతుంది. మరి విటమిన్-ఎ ఎక్కువగా ఏ ఆహార పదార్థాల్లో లభ్యమవుతుంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. క్యారట్లు: విటమిన్-ఎ కి బెస్ట్ ఛాయిస్ క్యారట్లు. రోజూ కప్పు క్యారెట్ ముక్కలు తింటే రోజువారీ శరీరానికి అవసరమైన విటమన్ ‘ఎ’లో దాదాపుగా 334 శాతం అందుతుందని అధ్యయనంలో వెల్లడైంది. చాలామంది క్యారట్స్ని వండుకొని తింటారు. కానీ క్యారట్స్లోని పోషకాలు సంపూర్తిగా అందాలంటే పచ్చివి తింటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు. లేదా జ్యూస్ తీసుకుని తాగచ్చు. చిలగడ దుంప: చిలగడ దుంప లో కూడా విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. ఇది మంచి చిరుతిండి. దీనిని ఉడకబెట్టి తినేయవచ్చు. లేదంటే, వీటితో ఇతర రకాల పిండివంటలు చేసుకోవచ్చు. సూప్స్, సలాడ్స్ కూడా బాగుంటాయి. పాలు: పాలల్లో కాల్షియమే కాదు విటమిన్ ఏ కూడా ఉంటుంది. ప్రతిరోజూ గ్లాసెడు పాలు తాగడం వల్ల మీ స్కిన్టోన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గుడ్లు గుడ్లలో విటమిన్ ‘డి’ తోపాటు అధికమోతాదులో విటమిన్ ‘ఎ’ కూడా ఉంటుంది. ఇవి రెండు చర్మ ఆరోగ్యానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతిరోజూ ఒక గుడ్డు తినడం వల్ల ఆరోగ్యంతో పాటు అందం కూడా మెరుగవుతుంది. ఆకుకూరలు: ఆకుకూరల్లో విటమన్ ‘ఎ’ పుష్కలంగా ఉంటుంది. కూరల్లో ఉండే పోషకాలన్నీ మనకి అందాలంటే వాటిని సరిగ్గా వండాలి. అంటే, ఎంత తక్కువ వండితే అంత ఎక్కువ మంచిది. ప్రతిరోజూ వీటిని మీ ఆహారంలో వీటిని చేర్చడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా అందుతాయి టమాటా: విటమిన్ ‘ఎ’ టమాటాల్లో అధికంగా ఉంటుంది. సహజంగానే మనరోజువారీ వంటకాల్లో టమాటా ఉపయోగిస్తాం! వంటలతోపాటు టమాటా సూప్, టమాటా చట్నీ ఇలా కూడా తీసుకుంటే దీనిలోని పోషకాలు శరీరానికి సరిపడా అందుతాయి. విటమిన్ ఏ మాత్రమే కాక టొమాటోలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి కాన్సర్ సెల్స్ పెరగకుండా అడ్డుకుంటాయి. ఇందులో ఉండే క్రోమియం బ్లడ్ షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచుతుంది. గుమ్మడికాయ: కెరోటినాయిడ్, ఆల్ఫా-కెరోటిన్ లు గుమ్మడికాయలో పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి కాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటితో సూప్స్, పైస్, స్నాక్స్ వంటివి చేసుకోవచ్చు. తియ్యగుమ్మడిలో విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది. గుమ్మడి గింజలను ప్రతిరోజూ తినడం వల్ల హార్మోనల్ బ్యాలెన్స్కి కూడా సహాయపడుతుంది. -
పోషకాహార లోపంతో సతమతమవుతున్న చిన్నారులు.. రోజూ ఏం తినాలంటే..
సాక్షి, మేడ్చల్ జిల్లా: మహిళలు, చిన్నారుల్లో పోషకాహార స్థితిని మెరుగుపర్చాలనే లక్ష్యంతో పోషణ మాసోత్సవాన్ని చేపట్టారు. తద్వారా ఆరోగ్యకరంగా జీవించేందుకు బాటలు వేసేందుకు జిల్లా సంక్షేమ శాఖ చర్యలు తీసుకుంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో పలు పథకాలను కూడా అమలు చేస్తున్నాయి. చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. నగరంతో సహా శివారు జిల్లాలైన మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డిలలో పోషకాల లోపంతో సతమవుతున్న చిన్నారులు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. పోషకాలపై అవగాహన కల్పించి, పథకాలను సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం కల్పించే మాసోత్సవాన్ని పోషణ్ అభియాన్ పేరుతో ఈ నెలాఖరు వరకు ఆయా జిల్లా సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్నాయి. ఇదీ లక్ష్యం.. స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలలు, ప్రజల భాగస్వామ్యంతో సంపూర్ణ ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యంగా ఈ నెలాఖరు వరకు వివిధ కార్యక్రమాలతో తల్లిదండ్రులను చైతన్యం చేస్తారు. పోషకాహార లోపం లేని తెలంగాణగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. గర్భిణులు మిటమిన్లు, ఐరన్ సమృద్ధిగా ఉన్న వివిధ రకాల పోషకాహారం ఎలా తీసుకోవాలో అవగాహన కల్పిస్తారు. బహుమతుల ప్రదానం పోషణ మాసోత్సవంలో భాగంగా నగరంతో సహా శివారు జిల్లాల్లోని అంగన్వాడీ కేంద్రాలు, పురపాలక సంఘాలు, గ్రామపంచాయతీల్లో పిల్లల ఎత్తు, బరువు చూస్తారు. ఆరోగ్యంగా ఉన్న పిల్లలకు బహుమతులు అందజేస్తారు. రక్తహీనత శిబిరాలు నిర్వహించి, పోషకాహారంపై అవగాహన కల్పిస్తారు. ఈ సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా గుర్తించటం వల్ల.. మాసోత్సవాల్లో ఈ అంశానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. చిన్నారులకు నిత్యం పోషక విలువలతో కూడిన ఆహారం అందించేందుకు పాలు, పండ్లు సూచిస్తున్నారు. యువజన, మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు. బరువు లేని చిన్నారులపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా పోషణ మాసోత్సవాన్ని షెడ్యూలు ప్రకారం నిర్వహిస్తున్నాం. చిన్నారులు ఆరోగ్యంగా ఎదగాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకుసాగుతోంది. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న మాసోత్సవం సజావుగా సాగేలా చూస్తున్నాం. వయస్సుకు తగ్గ బరువులేని చిన్నారులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందేలా చూస్తున్నాం. నిత్యం పాలు, పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలను ఆహారంలో చేర్చడం ద్వారా ఉండే ప్రయోజనాలపై వారికి వివరిస్తున్నాం. – కృష్ణారెడ్డి, జిల్లా సంక్షేమాధికారి, మేడ్చల్–మల్కాజిగిరి. -
కచ్చిడి చేపలతో ఒక్కరోజులోనే మిలియనీర్.. ఎందుకింత విపరీతమైన క్రేజ్?
ఏపీ సెంట్రల్ డెస్క్: మహారాష్ట్రకు చెందిన ఓ జాలరికి దొరికిన కచ్చిడి చేపలతో ఒక్క రోజులోనే మిలియనీర్ అయిపోయాడు. యాభై కేజీల కచ్చిడి చేప కలకత్తాలో రూ.13 లక్షలకు అమ్ముడుబోయింది. కాకినాడ కుంభాభిషేకం రేవులో కచ్చిడి చేప 4 లక్షల రూపాయలు పలికింది. కోనసీమలోని అంతర్వేది తీరంలో కచ్చిడి దొరికిన మత్స్యకారుడిపై కాసుల వర్షం కురిసింది. ఇలాంటి వార్తలు తరచూ చూస్తున్నాం. అసలేంటీ కచ్చిడి చేప. పులసకే తాతలా ఉంది. కళ్లు బైర్లు కమ్మే రేటు ఎందుకు పలుకుతోంది. కేజీ రూ. 20 వేలకు పైగా ధర పలికేంత విషయం కచ్చిడిలో ఏముంది. సింగపూర్, మలేసియా, హాంగ్కాంగ్, థాయ్లాండ్, జపాన్, ఇదర ఆగ్నేయాసియా దేశాల్లో దీనికి అంత డిమాండ్ ఎందుకు.. అంటే ఇది ఔషధాల గని కాబట్టి. బురద ప్రాంతాల్లో నివాసం హిందూ మహా సముద్రం, దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో ఇవి నివసిస్తాయి. పర్షియన్ గల్ఫ్, భారత్ తీరం, జపాన్, పవువా న్యూగినియా, ఉత్తర ఆ్రస్టేలియా సముద్ర ప్రాంతంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. నదీ ముఖద్వారాలు సమీపంలో, అడుగున బురదగా, బండరాళ్లు ఉండే ప్రాంతాల్లో జీవిస్తాయి. సాధారణంగా ఇవి 60 మీటర్ల లోతులో సంచరిస్తూ ఉంటాయి. ఆహారం కోసం వలస వెళ్తూ ఉంటాయి. ఎన్నో పేర్లు.. ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంలో కచ్చిడిగా పిలుస్తున్న ఈ చేప శాస్త్రీయ నాయం ప్రొటోనిబియా డయాకాంథస్. దీనిని ఘోల్ ఫిష్ అని, సీ గోల్డ్ అని కూడా పిలుస్తారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో టెలియా భోలా, కచ్చర్ భోలా అని అంటారు. ప్రపంచ వ్యాప్తంగా దీనిని బ్లాక్స్పాటెడ్ క్రోకర్ అని, ఆ్రస్టేలియాలో బ్లాక్ జ్యూఫిష్ అని అంటారు. జీవితకాలం 15 ఏళ్లు.. వీటి నోరు పెద్దగా ఉంటుంది. పక్కన నాలుగు రెక్కలు (ఫిన్స్), వెన్నుముక పొడవునా మరో ఫిన్ ఉంటుంది. రెండు వెన్నుముకలతో పొట్ట తర్వాత నుంచి కిందకు వంగి.. తోకవరకు సన్నగా ఉంటుంది. ఇవి అవకాశాన్ని బట్టి అన్ని రకాల ఆహారాలను తింటాయి. ముఖ్యంగా పీతలు, రొయ్యలు, లాబ్స్టర్లను ఇష్టంగా లాగిస్తాయి. చిన్న చేపలను వేటాడతాయి. సముద్రంలో ఎక్కడెక్కడ తిరిగినా ఏటా గుడ్లు పెట్టే సమయానికి మాత్రం తమ ఆవాసాలకు గుంపులుగా చేరతాయి. మే నుంచి అక్టోబర్ మధ్య కాలంలో నదులు సముద్రంలో కలిసే చోట్లకు వచ్చి గుడ్లుపెడతాయి. వీటి జీవితకాలం 15 ఏళ్లు. అయితే పుట్టినప్పటి నుంచి చాలా వేగంగా ఎదుగుతాయి. నాలుగేళ్లలోనే మూడు అడుగుల సైజుకు పెరిగి సంతానోత్పత్తికి సిద్ధమవుతాయి. ఐదు అడుగుల వరకూ కూడా పెరిగే ఇవి.. 60 కేజీలకు పైగా బరువుతూగుతాయి. ఎన్నో ఉపయోగాలు కచ్చిడి చేపలోని ఔషధ గుణాల వల్లే దానికంత క్రేజ్ వచ్చింది. ఐయోడిన్, ఒమెగా–3, డీహెచ్ఏ, ఈపీఏ, ఐరన్, మెగ్నీషియం, సెలీనియం లాంటి మినరల్స్ గని ఈ చేప. దీని కడుపు క్రింది భాగంలో చిన్న సంచిలాంటి శరీర భాగం ఉంటుంది. ఆ సంచిలో లభించే ఔషధాల వల్ల మార్కెట్లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ సంచి కారణంగానే దీనిని సీ గోల్డ్ అని పిలుస్తారు. ఈదడానికి ఉపయోగపడే వీటి రెక్కలతో సింగపూర్లో వైన్ తయారు చేస్తారు. కంటి చూపును మెరుగుపరిచే చాలా విటమిన్స్, మినరల్స్, ప్రొటీన్స్ ఈ చేపలో పుష్కలంగా లభిస్తాయి. ఈ చేపలో చర్మానికి అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీనితో చర్మంపై ముడతలు పడవు. ముదిమి ఛాయలు దరిదాపులకు రాకుండా నవయవ్వనంగా చర్మం మెరుస్తుంది. చిన్న పిల్లల్లో మొదడు సక్రమంగా ఎదుగుదలకు ఈ చేపలో పెద్దఎత్తున లభించే ఒమెగా–3 ఎంతో ఉపయోగపడుతుంది. క్రమం తప్పక తింటూ ఉంటే ఐక్యూ (ఇంటెలిజెన్స్ కొషెంట్) కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. కచ్చిడిలోని విటమిన్స్, మినరల్స్ మన శరీరంలోని కండరాలు బలంగా మారడానికి ఎంతో దోహదపడతాయి. ప్రమాదంలో కచ్చిడి.. ప్రపంచ దేశాల్లో అతిగా వేటాడటం, తీర ప్రాంతం కాలుష్యంగా మారడం వల్ల దీని ఉనికికే ప్రమాదం ఏర్పడుతోంది. గుడ్లు పెట్టేందుకు తీర ప్రాంతాలకు వచ్చే సమయంలో వీటిని ఎక్కువగా వేటాటం వల్ల వాటి సంఖ్య విపరీతంగా తగ్గిపోతోంది. ఇటీవల కాలంలో దీనిని రక్షించడానికి ఆ్రస్టేలియా కొన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. అలాగే భారత్ తీర ప్రాంతంలో మెకనైజ్డ్ బోట్లతో వేట నిషేధం, ఇవి గుడ్లు పెట్టే సీజన్లో వేటకు విశ్రాంతి ప్రకటించడం వల్ల వీటికి రక్షణ లభిస్తోంది. -
మీకు తెలుసా
జీడిపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్,ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఎన్నో వ్యాధులనుంచి రక్షిస్తాయి. జీడిపప్పులో ఉండే మెగ్నీషియం రక్తపోటును తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జీడిపప్పును ఒక్కొక్కరు ఒక్కోలా తింటుంటారు. కొందరు పచ్చి జీడిపప్పును తింటే ఇంకొంతమంది వీటిని రాత్రి నానబెట్టి ఉదయం తింటుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జీడిపప్పును పాలలో నానబెట్టి తింటే వాటి ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి బాగా సహాయపడుతుంది. ఇందుకోసం ఏం చేయాలంటే..? రాత్రిపూట గ్లాసు పాలలో మూడు లేదా నాలుగు జీడిపప్పులను వేయండి. మరుసటి రోజు ఈ జీడిపప్పు తిని పాలను తాగండి. దాంతో మామూలుగా జీడిపప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలకంటే అనేకరెట్లు అధిక ప్రయోజనాలను పొందవచ్చు. ఆరోగ్యానికి మంచిదని మోతాదుకు మించి తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది జాగ్రత్త. ఉదయం లేచిన తర్వాత వేడి వేడిగా టీ కానీ, కాఫీ కానీ తాగనిదే చాలా మంది రోజు మొదలవ్వదు. చాలా మంది సమయం సందర్భం లేకుండా టీ తాగుతూ ఉంటారు. లేవగానే ఒకసారి టీ తాగడం.. టిఫిన్ చేశాక టీ తాగడం, మళ్లీ సాయంత్రం, మధ్యాహ్నం భోజనం తర్వాత ఇలా.. ఎప్పుడు పడితే అప్పుడు తాగేస్తుంటారు. అయితే.. భోజనం తర్వాత టీ కానీ కాఫీ గానీ తాగడం వల్ల మనకు తెలీకుండానే సమస్యలు కొని తెచ్చుకున్నవాళ్లం అవుతామట. అదెలాగంటే... అన్నవాహిక అనేది ఒక పొడవాటి గొట్టం. ఇది మన నోటి నుంచి కడుపు వరకు ఉంటుంది. ఇది ద్రవాలు, లాలాజలం, నమిలిన ఆహారానికి వాహకంగా పనిచేస్తుంది. వేడి వేడి కాఫీ, టీలు ఎక్కువసార్లు తాగడం వల్ల అన్నవాహిక దెబ్బతిని క్యాన్సర్ల వంటివి వచ్చే ముప్పు ఉందట. అందువల్ల కాఫీ టీలు తాగేటప్పుడు అదీ మరీ వేడిగా తాగేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం మంచిది. -
మీ కన్నయ్య మన్ను తింటున్నాడా?
కొందరు పిల్లలు తల్లిదండ్రుల కళ్లు కప్పి మట్టి, బలపాలు, గోడకు ఉండే సున్నపు బెత్తికలు తింటూ ఉంటారు. మరికొందరు పెద్దవాళ్లు కూడా బియ్యంలో మట్టిగడ్డలు తినడం చూస్తుంటాం. మొక్కై వంగనిది మానై వంగునా? అన్నట్లు చిన్నప్పుడే పిల్లల్లో ఉండే మట్టి తినే అలవాటును మాన్పించకుంటే వారి ఆరోగ్యానికి పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. మట్టితినే అలవాటు మాన్పించడం ఎలాగో చూద్దామా? ఎందుకు తింటారంటే..? చాక్లెట్లు, బిస్కట్లు, లాలీపాప్లు, ఇలా రకరకాల తినుబండారాలు ఉండగా వాటన్నింటికీ బదులు లేదా వాటితోపాటు అప్పుడప్పుడు ఇలా మట్టి ఎందుకు తింటారో తెలుసా? ... విటమిన్ల లోపమే అందుకు కారణం. శరీరంలో ఉండవలసిన దానికన్నా బాగా తక్కువ పరిమాణంలో ఈ విటమిన్లు ఉండటం లేదా అసలే లేకపోవడం వల్ల పిల్లలు మట్టితింటూ ఉంటారు. కాల్షియం, ఐరన్ తగినంత లేకపోవడం వల్ల పిల్లలు ఇలా మట్టి తినడానికి అలవాటు పడతార ని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. మట్టి తినే అలవాటు పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. కడుపు, జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలు మొదలవుతాయి. వాటిని సకాలంలో ఆపకపోతే, పెరుగుదలలోనూ అనేక సమస్యలను ఎదుర్కొంటారు. పిల్లల శరీరంలో కాల్షియం లోపం ఏర్పడినప్పుడు, వారు మట్టి రుచిని ఇష్టపడతారు. పిల్లలు మట్టి వైపు వెళ్లకుండా నివారించడానికి, తగినంత కాల్షియం ఉన్న పదార్థాలు తినేలా చూడాలి. పిల్లలకు మట్టి, బలపాలు తినే అలవాటు మానుకోవాలంటే లవంగం నీళ్లు ఇస్తే మేలు జరుగుతుంది. 6 -7 లవంగాలను నీటిలో బాగా మరిగించి పిల్లలచేత తాగించండి. అవసరం అనుకుంటే దీనికి కొద్దిగా తేనె కలిపినా మంచిదే. అరటి పండులో ఎక్కువ మొత్తంలో కాల్షియం ఉంటుంది కాబట్టి పిల్లలకు రోజూ అరటిపండు తినిపించాలి. కావాలంటే అరటిపండుకు తేనె కలిపి మెత్తగా చేసి తినిపించవచ్చు. -
విటమిన్ ట్యాబ్లెట్లు వాడితే మంచిదా? ఎంతవరకు! డాక్టర్లు చెప్తున్నదేంటి?
ఇటీవల మనందరిలో పెరిగిన ఆరోగ్యస్పృహ గురించి తెలిసిందే. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఈ ప్రయత్నంలో ‘విటమిన్ల’ కోసం సప్లిమెంట్లు అతిగా తీసుకునేవారూ ఉన్నారు. జీవక్రియల కోసం విటమిన్లు కీలకమే. కానీ ‘ఆరోగ్య స్పృహ’ అంటూ అతిచేయడంతో విటమిన్ల మోతాదు పెరిగి ‘హైపర్ విటమినోసిస్’ కు గురయ్యే ప్రమాదమూ ఉంది. ఆ అనర్థాలేమిటో తెలిపే కథనమిది. మోతాదుకు మించి విటమిన్లు తీసుకోవడం వల్ల ‘హైపర్ విటమినోసిస్’ అనే కండిషన్ వస్తుందంటూ వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కండిషన్ను ‘విటమిన్ టాక్సిసిటీ’గా కూడా పేర్కొంటున్నారు. నీటిలో కరిగేవాటికంటే... ఫ్యాట్లో కరిగేవే డేంజర్ విటమిన్లలో ఏ, బీ కాంప్లెక్స్, సీ, డీ, ఈ, కే అనే విటమిన్లు ఉంటాయి. వీటిల్లో ‘ఏ, డీ, ఈ, కే’ అనేవి కొవ్వు (ఫ్యాట్)లో కరిగితేనే దేహంలోకి ఇంకుతాయి. ఇక విటమిన్ ‘బీ–కాంప్లెక్స్’తో పాటు విటమిన్ ‘సీ’ మాత్రం నీళ్లలో కరుగుతాయి. ఈ బీ కాంప్లెక్స్, సీ విటమిన్లు నీళ్లలో కరగడం వల్ల కాస్త ఎక్కువైనా... మూత్రంతో పాటు బయటకు తేలిగ్గా వెళ్తాయి. దాంతో హానికి పెద్దగా అవకాశం ఉండదు. కానీ సమస్యల్లా విటమిన్ ఏ, డీ, ఈ, కే లు కొవ్వుల్లో కరగడం వల్ల... వీటి మోతాదు పెరిగినప్పుడు అంత తేలిగ్గా బయటకు వెళ్లడం సాధ్యపడదు. దాంతో ఎక్కువైనప్పుడు కొన్ని అనర్థాలు తెచ్చిపెడతాయి. విటమిన్–ఏ పెరిగితే... విటమిన్–ఏ లోపిస్తే రేచీకటి వంటి సమస్యలు వస్తాయి. విటమిన్– ఏ పెరగడం వల్ల ఒకే వస్తువు రెండుగా కనిపించడం (డిప్లోపియా), వికారం లేదా వాంతులు, తలనొప్పి, కండరాల–కీళ్ల నొప్పులు, మరీ మోతాదు ఎక్కువైతే కాలేయం తన విధులు నిర్వర్తించలేకపోవడం వంటి అనర్థాలు వస్తాయి. విటమిన్–డీ ఎక్కువైతే... ఆరుబయట చేసే ఉద్యోగాలు బాగా తగ్గడం, దాదాపుగా అందరూ ఆఫీసుల (ఇన్డోర్స్)కే పరిమితం కావడంతో ఇటీవల మన దేశంలో విటమిన్ ‘డీ’ లోపం బాగానే పెరిగింది. ఒక దశలో విటమిన్–డీ లోపం కేసులు చాలా పెద్ద సంఖ్యలో రావడంతో చాలామంది డాక్టర్లు చాలా సందర్భాల్లో ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విటమిన్–డీ సప్లిమెంట్లను ఇవ్వడం మొదలుపెట్టారు. డీ–విటమిన్ ఎక్కువైతే అది రక్తంలో క్యాల్షియమ్ మోతాదుల్ని పెంచుతుంది ఫలితంగా కుంగుబాటు (డిప్రెషన్) వంటి కొన్ని మానసిక సమస్యలు కనిపించవచ్చు. అలాగే తలనొప్పి, తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ, జీర్ణవ్యవస్థకు (గ్యాస్ట్రో ఇంటస్టినల్) సమస్యలు రావచ్చు. అంటే ఉదాహరణకు వికారం, వాంతులు, మలబద్ధకం, కడుపునొప్పి వంటివి కనిపించే అవకాశాలున్నాయి. ఇక మూత్ర వ్యవస్థకు సంబంధించిన లక్షణాలు... అంటే తరచూ మూత్రవిసర్జనకు వెళ్లడం, మూత్రపిండాల్లో క్యాల్షియమ్ ఎక్కువగా చేరే ‘నెఫ్రోక్యాల్సినోసిస్’ వంటి సమస్యలూ రావచ్చు. ఫలితంగా కిడ్నీ పనితీరు దెబ్బతినేందుకు అవకాశాలుంటాయి. విటమిన్–ఈ పెరగడం వల్ల దేహాన్ని అందంగా ఉంచడంతో పాటు కొంతమేరకు ప్రత్యుత్పత్తికి ఉపయోగపడే ఇదే విటమిన్ దేహంలో పెరగడం వల్ల... అది మరో విటమిన్ అయిన విటమిన్–కే చేయాల్సిన విధుల్ని దెబ్బతీస్తుంది. దాంతో తేలిగ్గా రక్తస్రావం జరగడానికీ, అంతర్గత రక్తస్రావాలకూ అవకాశం ఏర్పడుతుంది. విటమిన్–కే పెరుగుదలతో దుష్ప్రభావాలివి... దేహంలో విటమిన్–కే పెరగడం అన్నది చాలా చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది. అయితే ఇలా పెరగడం వల్ల కామెర్లు, హీమోలైటిక్ అనీమియా వంటి కండిషన్లు ఏర్పడతాయి. చికిత్స : సమస్య నిర్ధారణలో హైపర్ విటమినోసిస్ వల్ల వచ్చిన అనర్థమే అన్నది చాలా కీలకం. దేహంలో ఏ విటమిన్లు ఎక్కువయ్యాయో దాన్ని బట్టి నిర్దుష్టమైన చికిత్స ఉంటుంది. ఉదాహరణకు విటమిన్–ఏ ఎక్కువైతే... దానికి విరుగుడుగా మూత్రం ఎక్కువగా వచ్చేందుకు ఉపకరించే ‘ఎసెటజోలమైడ్’ వంటి మాత్రలు సూచిస్తారు. ∙విటమిన్–డీ పెరిగినట్లు తెలిస్తే... దానికి విరుగుడుగా దేహంలోని క్యాల్షియమ్ మోతాదులు తగ్గించేందుకు రక్తనాళం ద్వారా ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం, చాలా ఎక్కువ మోతాదులో మూత్రం వచ్చేందుకు వాడే ‘లూప్ డైయూరెటిక్స్’ వంటివి వాడతారు. అలాగే క్యాల్షియమ్ మోతాదులు తగ్గించేందుకు కల్సిటోనిన్ వంటి ముక్కు ద్వారా ఇచ్చే స్ప్రేలు, బిస్ఫాస్ఫోనేట్ వంటివి ఇస్తారు. ► విటమిన్–ఈ పెరిగినట్లు నిర్ధారణ అయితే రక్తస్రావాలు, అంతర్గత రక్తస్రావాలు నివారించేందుకు విటమిన్–కే, ఎఫ్ఎఫ్పి (ఫ్రెష్ ఫ్రోజెన్ ΄్లాస్మా) వంటి ప్రక్రియలు చేస్తారు. ► విటమిన్–కే పెరిగినట్లు తెలిస్తే... దాని అనర్థాలు నివారించేందుకు వార్ఫేరిన్ వంటి మందులు లేదా కామెర్లకు వాడే మందులు ఉపయోగిస్తారు. నివారణ : దేహంలోని జీవక్రియలకు ఎంతో కీలకమైన విటమిన్లు చాలావరకు మనం తీసుకునే సమతులాహారంతోనే సమకూరుతుంటాయి. నిర్దుష్టంగా ఏవైనా విటమిన్ లోపాల వల్ల వచ్చే లక్షణాలను కనుగొంటే డాక్టర్లు వీటిని సూచిస్తారు. అంతేతప్ప... విటమిన్లు పెరిగితే ఆరోగ్యమూ పెరుగుతుందనే అపోహతో ‘ఆన్ కౌంటర్ మెడిసిన్’లలా విటమిన్ సప్లిమెంట్లు వాడటం ఎంతమాత్రమూ సరికాదు. - డాక్టర్ కె. శివరాజు ,సీనియర్ ఫిజీషియన్ -
పిల్లల ఎముకలు దృఢంగా ఉండాలంటే...
గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, కండరాలను బలోపేతం చేయడానికి, ఎముకలను అభివృద్ధి చేయడానికి కాల్షియం అవసరమన్న సంగతి అందరికీ తెలుసు. పాలు, జున్ను, పెరుగుతో సహా అన్నిపాల ఉత్పత్తుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పిల్లల ఎముకల ఎదుగుదలకి ఏం చేయాలో తెలుసుకుందాం.... తల్లిదండ్రులు.. పిల్లలు రోజుకు కనీసం 2 గ్లాసుల పాలను తాగేట్టు చూడాలి. అలాగే మీ పిల్లల ఆహారంలో బచ్చలికూర, బెండకాయ, పాలకూర వంటి ఆకుపచ్చ కూరగాయలు ఉండేట్టు చూడండి. అలాగే రోజుకు ఒకసారైనా పెరుగును తినేట్టు చూడాలి. సోయా పాలు, సోయా పెరుగు వంటి సోయాబీన్ ఉత్పత్తుల్లో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అన్నింటికీ మించి నువ్వులలో క్యాల్షియం చాలా అధికమొత్తంలో ఉంటుంది కాబట్టి పిల్లలు రోజూ ఒక స్పూను నువ్వులు తినేలా చూస్తే చాలు... తప్పకుండా ఉండాలండి కాల్షియం శోషణ విటమిన్ డి సహాయపడుతుంది. దీనికే విటమిన్ డి 3 అని కూడా పేరు. మన దేశంలో విటమిన్ డికి ఎలాంటి కొదవ లేకున్నా.. చాలా మంది డి విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. విటమిన్ డి సూర్యరశ్మి ద్వారా, కొన్ని రకాల ఆహారాల ద్వారా పొందవచ్చు. పిల్లల ఆహారంలో తగినంత విటమిన్ డి లేకపోతే విటమిన్ డి సప్లిమెంట్ను తీసుకోవాలి. ఎందుకంటే విటమిన్ డి ఎముకల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. ►నవజాత శిశువులకు కూడా విటమిన్ డి అవసరం. అందుకోసం వారి ఒంటికి నువ్వుల నూనె రాసి, లేలేత సూర్యకిరణాలు తగిలేలా చూస్తే సరిపోతుంది. ఆ తర్వాత మృదువుగా మర్దనా చేస్తూ స్నానం చేయించాలి. ఈ విటమిన్లు కూడా ► శరీరంలో విటమిన్ కె, మెగ్నీషియం స్థాయులు ఎక్కువగా ఉంటే విటమిన్ డి సమృద్ధిగా ఉన్నట్లే. అలాగే రికెట్స్, బోలు ఎముకల వ్యాధితో సహా ఎన్నో ఎముకల సమస్యలను తగ్గించడానికి ఇవి సహాయపడతాయి. కాల్షియంతో పాటుగా ఈ విటమిన్లు కూడా పిల్లల ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. క్యాబేజీ, ఆకుపచ్చ మొలకలు వంటి ఆకుపచ్చ కూరగాయల్లో విటమిన్ కె, మెగ్నీషియం ఉంటాయి. శీతల పానీయాలు వద్దే వద్దు... పిల్లలు ఎంత మారాం చేసినా వారిని శీతల పానీయాలు తాగనివ్వకూడదు. ఎప్పుడో ఒకసారి అయితే ఫరవాలేదు కానీ తరచూ ఇవి తాగడం పిల్లల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే వీటిలో సాధారణంగా కొన్ని ఫాస్పోరిక్ ఆమ్లాలు ఉంటాయి. ఇది శరీరం కాల్షియాన్ని గ్రహించకుండా నిరోధిస్తుంది. ఈ ఆమ్లం ఎముకల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కార్భోనేటెడ్ పానీయాలకు బదులుగా నారింజ రసం వంటి హెల్తీ డ్రింక్లను తాగించండి. దీనివల్ల పిల్లల ఎముకలు దృఢంగా ఉంటాయి. పిల్లల మానసిక, శారీరక ఎదుగుదల బాగుంటుంది. -
అయోమయమా.. జట్టు రాలుతుందా..? అయితే ఈ కారణమే కావచ్చు..!
ఆరోగ్యకరమైన ఆహారం లేదా పోషకాల విషయానికి వస్తే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది ప్రోటీ న్లు, కాల్షియం లేదా విటమిన్లు. వీటిలో జింక్ ఒకటి. ఇది ఆహారం ద్వారా లభిస్తుంది. జింక్ లోపం ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా జుట్టు చిట్లడం, రాలడం అధికమవుతుంది. అకారణంగా జుట్టు రాలుతున్నా, జుట్టు పలుచబడుతున్నా జింక్ లోపమేమో అనుమానించాలి. ఇదే కాదు, శరీరంలో జింక్ లోపం ఉన్నప్పుడు ఇంకా ఎలాంటి లక్షణాలు ఉంటాయో, నివారణకు ఏం చేయాలో తెలుసుకుందాం. మన శరీరానికి జింక్ చాలా అవసరం. రోగనిరోధక శక్తి, కణ విభజన, కణాల ఎదుగుదల, ప్రొటీన్లు, డీఎన్ఏ నిర్మాణం వంటి వాటికి దాదాపు 300 ఎంజైమ్లు అవసరం. ఆ ఎంజైమ్లను పనిచేసేలా చేయడం కోసం జింక్ అత్యవసరం. మనం తినే ఆహారంలో చాలా పరిమిత పరిమాణంలో జింక్ లభిస్తుంది. శరీరం జింక్ను నిల్వచేసుకోదు. అందుకే జింక్ లభించే ఆహారాన్ని రోజూ తినాలి. మగవారికి రోజూ 11 మిల్లీగ్రాముల జింక్ అవసరం అయితే, మహిళలకు 8 మిల్లీ గ్రాముల జింక్ అవసరం. అదే గర్భిణిలు, తల్లిపాలు ఇచ్చే మహిళలకు మాత్రం 12 మిల్లీ గ్రాములు అవసరం పడుతుంది. జింక్ లోపిస్తే శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. జింక్ లోపాన్ని కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు, గాయాలైనప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేసేందుకు జింక్ చాలా అవసరం. జింక్ లోపం ఏర్పడినప్పుడు గాయాలు తగిలినా అవి త్వరగా నయం కావు. అంతేకాదు ముఖంపై మొటిమలు వస్తాయి. బరువు తగ్గడం.. జింక్ లోపం వల్ల జీర్ణశక్తిలో మార్పులు వస్తాయి. ఆకలి మందగిస్తుంది. ఆహారం తినాలనిపించదు. ఫలితంగా బరువు తగ్గిపోతారు. ఇలా పోషకాల లోపం వల్ల బరువు తగ్గడంతో అనేక ఆరోగ్యసమస్యలు ఉత్పన్నమవుతాయి. జుట్టు రాలిపోవడం.. జింక్ లోపం వల్ల జుట్టు చిట్లడం, రాలడం అధికమవుతుంది కాబట్టి అకారణంగా జుట్టు అధికంగా రాలుతున్నా, జుట్టు పలుచబడుతున్నా జింక్ లోపమేమో అనుమానించాలి. దానికి సంబంధించిన సప్లిమెంట్స్ తీసుకుని సమస్య సద్దుమణిగితే నిశ్చింతగా ఉండవచ్చు. తరచూ జలుబు.. జింక్ తగ్గితే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దాని వల్ల తరచూ జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఎక్కువ. తరచూ మీకు జలుబు చేస్తున్నా, అనారోగ్యం బారిన పడుతున్నా జింక్ లోపం ఉందేమో చూసుకోవాలి. జింక్ తగినంత అందితే జలుబు తగ్గుతుంది. చూపు మసక బారడం.. ఆరోగ్యకరమైన చూపుకు జింక్ చాలా అవసరం. శరీరానికి తగినంత జింక్ అందనప్పుడు దృష్టి మందగిస్తుంది. మసకగా కనిపిస్తుంది. అస్పష్టంగా అనిపిస్తుంది. జింక్, విటమిన్ ఎ ఆరోగ్యకరమైన చూపును ఇస్తాయి కాబట్టి శరీరంలో జింక్ లోపిస్తే చూపు మసకబారుతుంది. గందరగోళం.. మీకు మనసు, ఆలోచనలు గందరగోళంగా ఉన్నాయా? అయితే జింక్ లోపం ఉందేమో చూసుకోండి. జింక్ తగినంత అందకపోతే మెదడు సరిగా పనిచేయదు. పనిపై ఏకాగ్రత్ కుదరదు. జ్ఞాపకశక్తి సమస్యలకు కూడా తలెత్తుతాయి. సంతానోత్పత్తిపై ప్రభావం.. జింక్ లోపం పురుషులకు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. దీనివల్ల పురుషుల సంతానోత్పత్తి ప్రభావితమవుతుంది. మీరు తండ్రి కావాలనుకుంటే తప్పనిసరిగా జింక్ తీసుకోవడంపై శ్రద్ధ వహించాలి. తగినంత పరిమాణంలో జింక్ తీసుకోని పురుషులు తండ్రి కావడానికి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రోగనిరోధక శక్తి బలహీనం.. శరీరానికి సంబంధించి అనేక విధులకు జింక్ అవసరమవుతుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. మళ్లీ మళ్లీ అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతుంది. అయితే జింక్ లోపం ఉంటే అది రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది కాబట్టి లోప నివారణకు సప్లిమెంట్లు తీసుకోక తప్పదు. ఇలా నివారించాలి.. జింక్ లోప నివారణకు శనగలు, గింజ ధాన్యాలు, పుచ్చగింజలు, జనపనార గింజలు, ఓట్స్, జీడిపప్పు, పెరుగు, డార్క్ చాకొలెట్లను తీసుకోవాలి. వైద్యుల సలహా మేరకు విటమిన్ సప్లిమెంట్లు కూడా తీసుకోవచ్చు. -
ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏమిటి..? అందులో ఉండే విటమిన్లేంటి?
మహబూబ్నగర్ రూరల్: కరోనా వైరస్ ప్రజారోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసిన నేపథ్యంలో మనుషుల్లో రోగ నిరోధక శక్తి పెంచేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అధిక పోష కాలు ఉన్న బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా అందించాలని నిర్ణయించింది. పోషక బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్)ను ఎఫ్సీఐ ద్వారా సేకరించనుంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇందుకు సహకారం అందిస్తోంది. బియ్యంలో కృత్రిమంగా సూక్ష్మ పోషకాలు కలపటంతో ఆ ఆహారం తీసుకున్న వ్యక్తుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని.. తద్వారా కరోనాలాంటి పలురకాల వైరస్లను మానవులు తట్టుకుంటారని భావిస్తున్నారు. ఫోర్టిఫైడ్ రైస్ తయారీకి జిల్లాలోని రైస్మిల్లుల్లో యంత్రాలను మార్చాలని యజమానులకు అధికారులు సూచించారు. అంగన్వాడీ కేంద్రాలకు ఏప్రిల్లో సరఫరా చేయగా.. రానున్న రోజుల్లో పాఠశాల విద్యార్థులు, రేషన్ లబ్ధిదారులకు కూడా అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. చదవండి👉🏻Photo Feature: అమ్మ.. అంటే ఎవరికైనా అమ్మే బ్లెండింగ్ యూనిట్ల ఏర్పాటు.. 2024 నాటికి అన్ని రాష్ట్రాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బలవర్ధక బియ్యాన్ని పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భారత ఆహార సంస్థ అందించిన నిల్వలకు అదనంగా పోషకాలు కలుపుతున్నారు. ఇందుకు మిల్లుల్లో బ్లెండింగ్ యూని ట్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఏర్పాటుకు సుమా రు రూ.6 లక్షల వరకు ఖర్చవుతుంది. జిల్లాలోని 10 పారా బాయిల్డ్ రైస్మిల్లుల్లో వీటిని ఏర్పాటుచేసి అంగన్వాడీ కేంద్రాలకు నెలకు 700 క్వింటాళ్ల ఫోర్టిఫైడ్ నిల్వలను సరఫరా చేస్తున్నారు. మరో అయిదు మిల్లుల్లో బ్లెండింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి బియ్యంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్–ఏ, జింక్, ఇతర విటమిన్లు చేర్చేలా చర్యలు తీసుకుంటున్నారు. 2021 యాసంగిలో పౌరసరఫరాలశాఖ సేకరించిన ధాన్యం 7,540 మెట్రిక్ టన్నులు ఈ మిల్లులకు కేటాయించగా.. ఫోర్టిఫైడ్ రైస్ పౌరసరఫరాలశాఖ గోదాములకు చేరింది. ఉపయోగం ఏంటి? సాధారణ బియ్యంలో ఐరన్ విటమిన్ డి, బి–12తో పాటు మరిన్ని పోషకాలు కలపటంతో సూక్ష్మ పోషకాలతో కూడిన బియ్యంగా మారుతాయి. గోధుమలు, మినుములు, పెసర, అపరాలు, రాగులు, సజ్జలు వంటి తృణ ధాన్యాలను పొడిగా మారుస్తారు. వీటిని కెనరల్స్ అంటారు. ఈ కెనరల్స్ పౌడర్ను ముద్దల రూపంలోకి మార్చి క్వింటా సాధారణ బియ్యానికి కిలో కెనరల్స్ కలుపుతారు. సాధారణ బియ్యంలో కార్బొహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి. తోడుగా కెనరల్స్ కలపటంతో పిండి పదార్థాలు, పోషకాలు జమవుతాయి. పోషకాలు కలిపిన బియ్యం వండితే బలవర్ధక ఆహారం తయారవుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్వింటాకు కిలో చొప్పున.. వంద కిలోల సాధారణ బియ్యానికి కిలో పోషకాల నిల్వలను కలుపుతున్నారు. మిల్లుల్లో ఓవైపు మరపట్టిన.. మరోవైపు పోషకాల నిల్వలు వచ్చి ఒకేచోట పడేలా యంత్రాలను అమర్చుతున్నారు. ఉత్తర్వులు రావాలి.. పోషకాల మిళిత బియ్యాన్ని ఇప్పటికే అంగన్వాడీలకు సరఫరా చేస్తున్నాం. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మున్ముందు పాఠశాలలలు, రేషన్ లబ్ధిదారులకు అందిస్తాం. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రావాల్సి ఉంది. – జగదీశ్కుమార్, మేనేజర్, పౌరసరఫరాల శాఖ, మహబూబ్నగర్ చదవండి👇🏽 కాల్షియం లోపిస్తే..? ఎదురయ్యే సమస్యలు ఇవే! ఇవి తిన్నారంటే.. -
Snake Gourd: పొట్లకాయ తింటున్నారా... అయితే.. కిడ్నీలు, బ్లాడర్ పనితీరు..
పొట్లకాయ... పొడుగ్గా పెరగడానికి రాయి కడతారు. తిన్నగా సాగాక తనంత పొడవుగా మరొకరు లేరంటూ విర్రవీగుతుంది ఈ స్నేక్గార్డ్. సాధరణంగా పొట్లకాయ అంటే చాలా మంది ముఖం చిట్లిస్తారు. కాస్త చాకచక్యంగా వండాలేగానీ... నోరూరించే రుచులు ఆస్వాదించవచ్చు. అంతేకాదు... ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. భారత్ సహా అన్ని ఆసియా దేశాల్లోనూ, ఆఫ్రికా, ఆస్ట్రేలియాల్లోనూ పొట్లకాయలను ఆహారంలో ఉపయోగిస్తారు. మనదేశంలో వీటితో రకరకాల కూరలు వండటం పరిపాటి. అయితే, కొన్ని దేశాల్లో పొట్లకాయలు బాగా పండిన తర్వాత వాటి గుజ్జును టమాటా గుజ్జుకు ప్రత్యామ్నాయంగా కూడా వినియోగిస్తారు. ఇక ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో వీటి మొలకలను, ఆకులను తింటారు కూడా. పొట్లకాయలో ఉండే పోషకాలు ►పొట్లకాయల్లో ఫైబర్ ఉంటుంది. ►స్వల్పంగా ప్రొటీన్లు, పిండి పదార్థాలు కూడా కలిగి ఉంటుంది. ►ఇక విటమిన్లలో... విటమిన్–ఏ, బీటా కెరోటిన్, విటమిన్–బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్–సి వంటివి పొట్లకాయలో లభిస్తాయి. ►వీటితో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. పొట్లకాయను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ►పొట్ల కాయలు కడుపు ఉబ్బరాన్ని తొలగిస్తాయి. ►వీటిలో పుష్కలంగా ఉండే పీచు పదార్థాలు మలబద్ధకాన్ని నివారిస్తాయి. ►జ్వరానికి పథ్యంగా పనిచేస్తాయి. ►శరీరంలోని వ్యర్థాలను బయటకు(డిటాక్సీఫై) పంపిస్తుంది. ►డీ హైడ్రేషన్ తగ్గిస్తుంది. కిడ్నీలు, బ్లాడర్ పనితీరును మెరుగపరుస్తుంది. ►ఇవి మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. ►జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ►పొట్లకాయలో యాంటీ బయాటిక్ గుణాలు ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ►శ్వాస వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిసిన తర్వాత పొట్లకాయను ఆహారంలో చేర్చుకోవాలనిపిస్తోంది కదా! అయితే, ఎప్పటిలా కూరలా కాకుండా ఇలా కట్లెట్ తయారు చేసుకుని రుచిని ఆస్వాదించండి. పొట్లకాయ కట్లెట్ ఇలా తయారీ కావలసినవి: లేత పొట్ల కాయ – 1; బంగాళదుంపలు – 3 (మీడియం సైజువి); తరిగిన పచ్చి మిర్చి – 2; వెల్లుల్లి రెబ్బలు – 3 (మెత్తగా చేయాలి); ఉల్లి తరుగు – పావు కప్పు; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; బియ్యప్పిండి – కొద్దిగా. తయారీ: ►పొట్లకాయను కడిగి, పెద్ద సైజు చక్రాలుగా తరగాలి ►ఉడికించి, తొక్క తీసేసిన బంగాళ దుంపలు ముద్దలా అయ్యేలా చేతితో కలపాలి. ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఉల్లి తరుగు, మెత్తగా చేసిన వెల్లుల్లి రేకలు వేసి ఉల్లి తరుగు మెత్తపడే వరకు వేయించాలి ►బంగాళ దుంప ముద్ద, తరిగిన పచ్చి మిర్చి, పసుపు, ఉప్పు జత చేసి బాగా వేయించి, దింపేయాలి ►ఈ మిశ్రమాన్ని పొట్లకాయ చక్రాలలో కూరాలి ►స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాచాలి ►స్టఫ్ చేసిన చక్రాలను పొడి బియ్యప్పిండిలో పొర్లించి, కాగిన నూనెలో వేసి రెండు వైపులా దోరగా కాల్చి ప్లేట్లోకి తీసుకోవాలి ►టొమాటో సాస్ లేదా చిల్లీ సాస్తో అందించాలి. చదవండి: Gas Problem Solution: గ్యాస్ సమస్యా... పాస్తా, కేక్ బిస్కెట్స్, ఉల్లి, బీట్రూట్స్ తింటే గనుక అంతే! -
Health Tips: వంకాయ కూర తింటున్నారా.. అయితే అందులోని విటమిన్ ‘కె’ వల్ల
ఆహా ఏమి రుచి అనరా మైమరచి.. రోజూ తిన్నా మరీ మోజే తీరనిదీ.. తాజా కూరలలో రాజా ఎవరండీ... ఇంకా చెప్పాలా వంకాయేనండీ.. అవును నిజమే.. మహానుభావులు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు చెప్పినట్లు కూరగాయలలో వంకాయ నిజంగా కింగే! తెలుగువారి మెనూలో కచ్చితంగా ఉండే కూరగాయ ఇది. గుత్తి వంకాయ, వెన్న వంకాయ, వంకాయ నువ్వుల పులుసు, వంకాయ ఉల్లి పచ్చడి.. ఇలా ఏ రకంగా ఎవరు వండినా, ఎలా వండినా... తనదైన రుచిని వంటకానికి అద్దడం వంకాయ ప్రత్యేకత. కేవలం రుచిలోనే కాదండోయ్... ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలోనూ వంకాయ భేష్! వంకాయలో ఉండే పోషకాలు: ►వంకాయల్లో స్వల్పంగా పిండి పదార్థాలు ఉంటాయి. ►చక్కెర, పీచు పదార్థాలు పుష్కలం. ►ఇక విటమిన్ల విషయానికొస్తే... విటమిన్–బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్–సి, విటమిన్–ఇ, విటమిన్–కె వంటివి ఉంటాయి. ►క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజ లవణాలు వంకాయలో ఉంటాయి. ►యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. ►కేలరీలు తక్కువ. చదవండి: Goru Chikkudu Kaya Benefits: షుగర్ పేషెంట్లు గోరు చిక్కుడు కూర తింటే... ఇందులోని ఆ గుణాల వల్ల... వంకాయ కూర తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు: ►వంకాయలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ►జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడతాయి. ►ఫలితంగా స్థూలకాయాన్ని, గుండెజబ్బులు, రక్తపోటు ముప్పును నివారిస్తాయి. ►వంకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ 15. కాబట్టి ఇది డయాబెటిస్ పేషంట్లకు మంచిది. ►అంతేకాదు వంకాయలో క్యాలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువ ఉంటాయి. ►కొవ్వు శాతం తక్కువ.. నీరు ఎక్కువగా ఉంటుంది. ►కాబట్టి టైప్ 2 మధుమేహ రోగులు, డైట్ కంట్రోల్ చేస్తోన్న స్థూలకాయులు దీనిని తరచూ తినడం మంచిది. ►అదే విధంగా వంకాయ హైబీపీని అదుపు చేస్తుంది. ►రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ను వంకాయలు తగ్గిస్తాయి. ►న్యాసునిన్ క్లోరోజెనిక్ రూపంలో ఉండే ఫైటో న్యూట్రియెంట్లు వంకాయలో పుష్కలంగా ఉంటాయి. తద్వారా ఇవి పలు రకాల క్యాన్సర్ల బారిన పడకుండా కాపాడగలుగుతాయి. ►ఫోలేట్, మెగ్నీషియం, పొటాసియం, విటమిన్ బీ1, బీ6, విటమిన్ కె బీటా కెరోటిన్ వంటివి గుండెవ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. ►ఉబ్బసాన్ని తగ్గించడంలో కూడా వంకాయ ఎంతో ఉపయోగపడుతుంది. గమనిక: ఆర్థరైటిస్ ఉన్నవారు తింటే కొన్నిసార్లు కీళ్లనొప్పులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్లు కొంచెం తక్కువ తీసుకోవడం మంచిది. చదవండి: Pista Pappu Benefits: రోజూ పిస్తా పప్పు తింటున్నారా.. అయితే అందులోని విటమిన్ బీ6 వల్ల.. -
Pista Pappu: రోజూ పిస్తా పప్పు తింటున్నారా.. అయితే అందులోని విటమిన్ బీ6 వల్ల..
పిస్తా పప్పు.. చూడగానే నోరూరిపోతుంది! చటుక్కున రెండు పప్పులు తీసుకుని నోట్లో వేసుకోవాలనిపిస్తుంది. చాలా మంది రోజూవారీ డైట్లో తప్పక దర్శనమిస్తుంది ఈ పిస్తా. ఈ అలవాటు మంచిదే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిజానికి.. పిస్తా కేవలం రుచికి మాత్రమే కాదు... మంచి బలవర్ధకమైన ఆహారం కూడా. కొంచెం తిన్నా చాలు కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. అదే సమయంలో మనకు కావాల్సిన శక్తి లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సాగవుతోన్న ఖరీదైన డ్రై ఫ్రూట్స్లో పిస్తా కూడా ఒకటి. మరో విషయం.. పిస్తా, కాజూ ఒకే జాతికి చెందినవి. పిస్తా పప్పులో ఉండే పోషకాలు: ►పిస్తా పప్పులో ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు ఉంటాయి. ►పిస్తాలో పీచు పదార్థాలు, మాంసకృత్తులు కూడా ఎక్కువే. ►ఇక పిస్తాలో లభించే విటమిన్లు.... విటమిన్ బి6, సి, ఇ. ►పిస్తాలో పొటాషియం చాలా ఎక్కువ. ►ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాపర్ క్యాల్షియం లాంటి ఖనిజ లవణాలు కూడా మెండుగా ఉంటాయి. ►ఇతర డ్రై ఫ్రూట్స్తో పోలిస్తే... పిస్తాలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఒక ఔన్సు అంటే (28 గ్రాములు) సుమారు 49 పిస్తా పప్పుల్లో ఉంటే పోషకాలు.. కాలరీలు: 159 కార్బోహైడ్రేట్లు: 8 గ్రా. ఫైబర్: 3 గ్రా. ప్రొటిన్: 6 గ్రా. ఫ్యాట్: 13 గ్రా.(90 శాతం అనుశాటురేటెడ్ ఫ్యాట్స్) పొటాషియం: 6 శాతం ఫాస్పరస్: 11 శాతం విటమిన్ బీ6: 28 శాతం థయామిన్: 21 శాతం మెగ్నీషియం: 15 శాతం. చదవండి: Goru Chikkudu Kaya Benefits: షుగర్ పేషెంట్లు గోరు చిక్కుడు కూర తింటే... ఇందులోని ఆ గుణాల వల్ల... పిస్తా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు: ►డ్రై ఫ్రూట్స్ అన్నింట్లోకెల్లా పిస్తాలో క్యాలరీలు ఎక్కువ. ►ఇందులోని విటమిన్ బి6 ప్రొటీన్లను జీర్ణం చేసుకోవడంలో బాగా ఉపయోగపడుతుంది. ►రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ పిస్తా బాగా పనిచేస్తుంది. ►రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ►ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కాన్సర్ ముప్పును తగ్గిస్తాయి. ►పిస్తాలోని అధిక ఫైబర్, ప్రొటిన్ కారణంగా కొంచెం తినగానే కడుపు నిండిన భావన కలుగడంతో పాటు తక్షణ శక్తి లభిస్తుంది. దీంతో తక్కువగా తినడం.. తద్వారా బరువు తగ్గడంలోనూ ఇది ఉపయోగపడుతుంది. ►ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే విటమిన్ బి6 అధికంగా లభించే ఆహారపదార్థాల్లో పిస్తా ముందు వరుసలో ఉంటుంది. కాబట్టి పిస్తా తినడం వల్ల ఒత్తిడిని అధిగమించవచ్చు. ►ఆరోగ్యానికి మేలు చేసే బాక్టీరియాను పెంపొందిస్తుంది. ►ఇందులో ఉండేది ఎక్కువగా ఆరోగ్యకరమైన కొవ్వే కాబట్టి డైట్లో పిస్తాను చేర్చుకోవచ్చు. చదవండి: Health Benefits Of Ivy Gourd: దొండకాయ కూర తింటున్నారా.. అందులో ఉండే బీటా కెరోటిన్ వల్ల.. -
విటమిన్ పేరిట విషం మాత్రలు ఇచ్చి ముగ్గురి హత్య
సాక్షి, చెన్నై: ఈరోడ్ జిల్లా సెన్నిమలైకు చెందిన ఓ కుటుంబంలోని వారికి విటమిన్ పేరిట విషం మాత్రలు ఇవ్వడంతో ముగ్గురు మృతిచెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. చిన్నిమలైకి చెందిన కరుప్పన్నన్, ఆయన భార్య మల్లిక, కుమార్తె దీప, పని మనిషి కరుప్పాయి శనివారం సాయంత్రం పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. అదే సమయంలో వీరి పొలంలో కొంత భాగాన్ని లీజుకు తీసుకున్న కళ్యాణ సుందరం కూడా అక్కడే ఉన్నాడు. అటువైపు కరోనా శిబిరం నుంచి వచ్చినట్టు పేర్కొంటూ యువకుడు ఫీవర్ టెస్ట్ చేసి విటమిన్ మాత్రలు ఇచ్చి వెళ్లాడు. అవి వేసుకున్న కాసేపటికే కరుప్పన్నన్ కుటుంబం స్పృహ తప్పింది. గమనించిన ఇరుగుపొరుగు వారిని ఆస్పత్రికి తరలించగా మల్లిక, కరుప్పాయి, దీప మృతి చెందారు. కరుప్పన్నన్ కోయంబత్తూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కల్యాణ సుందరం ఆ మాత్రలు వాడకపోవడంతో అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించారు. కరుప్పన్నన్ పొలం లీజుతో పాటు ఆయన నుంచి తీసుకున్న రూ.13 లక్షలు చెల్లించలేని స్థితిలో హత్యకు పథకం పన్నినట్టు అంగీకరించాడు. చదవండి: జూన్లో 10.8 కోట్ల కోవిషీల్డ్ టీకాలు ఉత్పత్తి చేసిన సీరమ్ ఐటీ సంస్థ మహిళా అధికారి ఆత్మహత్య -
చులకన వద్దు.. గరిటెడైనను చాలు గాడిద పాలు!
సాక్షి, అమరావతి: గాడిదను మనం చాలా చులకనగా చూస్తుంటాం.. ఒరేయ్ గాడిదా.. అంటూ దాని పేరును ఓ తిట్టులా వాడేస్తాం. మన దృష్టిలో అవమానానికి మారుపేరుగా మిగిలిన ఆ గాడిద పాలలోమనకు మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అనారోగ్యం బారిన పడినప్పుడు అవి మనకు అక్కరకొస్తున్నాయి. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన తాజా పరిశోధనలు నిగ్గుతేల్చాయి. దేశంలో గాడిద పాల వినియోగం పూర్వకాలం నుంచే ఉన్నా.. పాల కోసమే గాడిదల్ని పెంచే దశకు మనం ఇంకా రాలేదు. ఆఫ్రికా, పశ్చిమాసియా, ఆసియా ఉపఖండ ప్రాంతాలను మినహాయిస్తే.. అమెరికా, లాటిన్ అమెరికా సహా ప్రపంచంలోని చాలా దేశాల్లో గాడిద పాల వినియోగం పారిశ్రామిక స్థాయికి చేరింది. ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీ, స్పెయిన్, హాలెండ్, సెర్బియా, బోస్నియా వంటి దేశాల్లో పాల కోసం గాడిదల పెంపకం వాణిజ్య స్థాయిలో కొనసాగుతోంది. యూరోప్లో సౌందర్య పోషణ ఉత్పత్తుల్లో గాడిద పాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వయసు మళ్లే ప్రక్రియను గాడిద పాలు ఆలస్యం చేస్తాయన్న నమ్మకం అనాదిగా ఉంది. వయసు మళ్లిన వారు గాడిద పాలను బలవర్ధక ఆహారంగా తీసుకుంటున్నారు. వీటిలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయని ఇటీవలి పరిశోధనలో తేలింది. లాటిన్ అమెరికన్ దేశాల్లో గాడిద పాలను ఔషధంగానే కాకుండా తల్లిపాలకు ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. అయితే మన దేశంలో మాత్రం కేవలం ఔషధంగానే తీసుకుంటున్నారు. ఈ పాలు తాగితే పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్న నమ్మకం కూడా ఉంది. లీటర్ గాడిద పాల ధర సుమారు రూ.2 వేలపైనే ఉంది. ఔషధ వినియోగం కోసం సుమారు 25, 30 మి.లీ. మోతాదులో విక్రయిస్తున్నారు. ఒక్కో మోతాదు ధర రూ.200 నుంచి రూ.300 వరకూ ఉంది. మన ఇళ్ల దగ్గరకొచ్చేవారు 10 మి.గ్రా ఇచ్చి రూ.100 తీసుకుంటున్నారు. సీ విటమిన్ పుష్కలంగా ఉన్న గాడిదపాల వినియోగం ఇటీవల కరోనా నేపథ్యంలో బాగా పెరిగింది. పుష్కలంగా పోషకాలు గాడిద పాలల్లో విటమిన్ సీ, బీ, బీ12, ఈ విటమిన్లతో పాటు, న్యూట్రిన్లు ఉన్నాయి. ఆవు పాలతో పోలిస్తే గాడిద పాలలో సీ విటమిన్ 60 రెట్లు అధికం కీలకమైన ఓమేగా–3, 6తో పాటు ఫ్యాటీ ఆమ్లాలు కూడా పుష్కలం తల్లిపాలతో సమాన స్థాయిలో కేలరీలు, మినరల్స్ ఉంటాయి. గేదె పాలతో సమానమైన బలం ఇస్తాయని శాస్త్రవేత్తలు నిగ్గు తేల్చారు. అప్పుడే పుట్టిన పిల్లల్లో ఆస్తమా, క్షయ, గొంతు సంబంధిత వ్యాధుల నివారణ కోసం తయారు చేసే ఆయుర్వేద మందుల్లో గాడిద పాలను వినియోగిస్తారు. నవజాత శిశువులకు పూర్తి పోషకాలను అందించడంతో పాటు చర్మవ్యాధులను నయం చేస్తాయి. గాడిద పాలల్లో ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు తక్కువ. ఆవుల వల్ల వచ్చే ఎలర్జీ వ్యాధులు గాడిద పాలతో నయమవుతాయి. గాడిద పాలలో కాల్షియం ఎక్కువ. పిల్లల్లో ఎముకలను పటిష్ట పర్చడం, విరిగిన ఎముకలను అతికించే స్వభావం వీటికి ఉంది. ఈ పాల వినియోగంతో ఉబ్బసం, సోరియాసిస్, ఎగ్జిమా వంటి వ్యాధులు నయమైనట్టు ఇటీవల సైప్రస్ వర్సిటీ నిర్ధారించింది. కొవ్వు శాతం చాలా తక్కువ గాడిద పాలు తల్లి పాలకు దగ్గర ఉంటాయి. తల్లి పాలకు దాదాపు సమానంగా వీటిలో లాక్టోజ్ ఉంటుంది. ఈ పాలలో కొవ్వు శాతం చాలా తక్కువ. స్థూలకాయం నుంచి బయటపడేందుకు గాడిద పాలను సూచిస్తున్నారు. మనకు మేలు చేసే ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నా.. మన దేశంలో మాత్రం గాడిద పాలు వాణిజ్య స్థాయిలో వినియోగంలోకి రాలేదు. – డాక్టర్ జి.రాంబాబు, అసిస్టెంట్ సర్జన్, రాష్ట్ర పశు సంవర్థక శాఖ జనాభాలో దాదాపు 2 నుంచి 6 శాతం ప్రజలకు ఆవు పాలు సరిపడవు. ఆ పాల వల్ల ఎలర్జీలొస్తాయి. అలాంటి వారికి గాడిద పాలు మేలు చేస్తాయి. – ఐక్యరాజ్యసమితి అధ్యయనం మా తాతముత్తాతల దగ్గర్నుంచి మా ఇంట్లో గాడిద పాలు వాడుతున్నాం. గాడిద పెంపకందార్లే ఇంటి ముందుకొచ్చి పాలు పితికి ఇస్తారు. చిన్న అమృతాంజనం సీసా పాలకు రూ.100 తీసుకుంటారు. ఇప్పుడు కరోనా కూడా రావడంతో ఇంట్లో పిల్లలకీ ఇస్తున్నాం.. – మురళీ, చీరాల గాడిద పాలు ఎయిడ్స్ను పూర్తిగా నయం చేయకపోయినా, రోగుల జీవిత కాలాన్ని పొడిగించేందుకు మాత్రం దోహదపడతాయి – లక్నో వర్సిటీ పరిశోధకుడు దేశ్దీపక్ ప్రకటన -
Chinta Chiguru: చింతలు తీర్చే చిగురు
చింత చిగురు.. ఇప్పుడంటే అంతా కమర్షియల్ అయింది కానీ గతంలో పల్లెటూర్లలో అలా నడుచుకుంటూ వెళ్లి కోసుకొచ్చుకొనేవాళ్లు. పప్పులో, పచ్చడిలో, పులుసులో ఇలా పలు వంటకాల్లో చింతచిగురు చేరిస్తే దాని రుచే వేరంటారు భోజన ప్రియులు. కేవలం రుచి కోసమే కాదని, చింత చిగురు వల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ప్రధానంగా ఏప్రిల్– జూలై మాసాల్లో దొరికే చింత చిగురుతో ఎన్నో లాభాలున్నాయి, అవేంటో చూద్దాం.. ఇందులోనే ఫైబర్ కంటెంట్ కారణంగా మలబద్దకం సమస్య తొలగిపోతుంది. విరేచనం సులభంగా అయ్యేలా చూస్తుంది. పైల్స్ ఉన్న వారికి, జీర్ణాశయ సంబంధ సమస్యలు ఉన్నవారికి చింతచిగురు బాగా పనిచేస్తుంది. చింతచిగురులో ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. టడయాబెటీస్ ఉన్న వారు చింత చిగురును ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయి క్రమంగా తగ్గుతుంది. ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, టార్టారిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్ తదితరాలు రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు ఎముకల ధృఢత్వానికి తోడ్పడతాయి. చింత చిగురును మెత్తగా నూరి కీళ్లపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గుతాయి. చింత చిగురును ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు, పగుళ్లు వంటి నోటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. స్కర్వీ, మలేరియా వ్యాధులకు కూడా ఈ చిగురు చక్కగా పనిచేస్తుంది. కడుపులోని నులి పురుగులకు కూడా చింతచిగురు మంచి ఔషధం. చింతచిగురు టీ కానీ, చింతచిగురును వేణ్ణీళ్లలో మరిగించి కొంచెం తేనె కలుపుకుని తాగినా కానీ సాధారణ జలుబు, దగ్గులాంటివి మాయం అవుతాయి. చింతచిగురు జ్యూస్ ఆడవాళ్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గిస్తుంది. నేత్ర సంబంధ సమస్యలను కూడా చింత చిగురు దూరం చేస్తుంది. కళ్లు దురదగా ఉన్నప్పుడు కొంత చింత చిగురు తింటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. థైరాయిడ్ సమస్య కూడా దీనివల్ల తగ్గుముఖం పడుతుంది. కేవలం చిన్న చిన్న రోగాలకే కాదు.. పలు రకాల కాన్సర్లు రాకుండా చూసే ఔషధ గుణాలు చింత చిగురులో ఉన్నాయి. వందగ్రాముల చింత చిగురులో దాదాపుగా 239 కాలరీల శక్తి, ఒక్కగ్రాము ఫ్యాట్, 3 గ్రాముల ప్రోటీన్, 26 ఎంజీ సోడియం, 63 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. దాదాపు 16 శాతం ఐరన్, 6 శాతం విటమిన్ సీ, 1 శాతం విటమిన్ ఏ ఉంటాయి. సో... ఈసారి చింతచిగురు కనిపిస్తే వదలకండి! (చదవండి: నవ్వు మాత్రమే కాదు.. ఏడుపూ మంచిదే.. !) -
వెన్న రుచికరమే కాదు...ఆరోగ్యకరం కూడా!
ఇటీవల నూనెల వాడకం బాగా పెరిగాక వెన్నను గతంలోలా మునపటంత విరివిగా ఉపయోగించడం లేదు. కానీ నిజానికి వెన్న చాలా మంచి ఆరోగ్యకరమైన ఆహారం. వెన్నలోని కొన్ని పోషకాలూ, వాటితో కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం. వెన్నలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె2 చాలా ఎక్కువ. వాటితో పాటు ఇందులో బ్యుటిరేట్, కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్ఏ) అనే పోషకాలు ఉన్నాయి. వెన్నలోని కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్ఏ) గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వెన్నలోని బ్యుటిరేట్ అనే పోషకం అనేక మానసిక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. అంతేకాదు... ఇది మంచి శక్తివనరు. మన జీవక్రియలకు అవసరమైన శక్తిని ఇది సమకూరుస్తుంది. మనం తిన్న ఆహారం చిన్నపేగుల్లోకి ప్రవేశించాక... అక్కడ ఆ జీర్ణాహారం ఏమాత్రం వృథాపోకుండా అంతా ఒంటికి పట్టేలా చేస్తుంది వెన్నలోని ఈ బ్యుటిరేట్. బ్యూటిరేట్కు మరో మంచి లక్షణం కూడా ఉంది. చిన్న పేగుల్లో ఇన్ఫ్లమేషన్ను కూడా అది సమర్థంగా తగ్గిస్తుంది. -
ఎండిన పండ్లతో... మెండైన ఆరోగ్యం
డ్రైఫ్రూట్స్ను మనందరం చాలా ఇష్టంగా తింటుంటాం. ఈ ఎండిన పండ్లలో మనకు బాగా తెలిసినవి ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూర వంటివి కొన్నే. కానీ... ఇటీవల అలాంటి డ్రైఫ్రూట్ ఎన్నెన్నో మనకు అందుబాటులోకి వస్తున్నాయి. పైగా అవి ఎన్నెన్నో వ్యాధుల నివారణకూ తోడ్పడుతున్నందువల్ల వాటిపై ఆసక్తి కూడా బాగా పెరిగింది. ఇటీవల వాటి లభ్యత కూడా బాగానే పెరిగింది. కొన్ని ఎండు పండ్లు... ఎన్నో వ్యాధుల నివారణతో బాగా మన ఆరోగ్య పరిరక్షణలో, వాటితో ఒనగూరే ప్రయోజనాలపై అవగాహన కలిగించుకునేందుకు తోడ్పడేదే ఈ కథనం. సాధారణంగా ఆరోగ్యాన్ని కలిగించేవి కాస్తంత చేదుగానో, ఘాటుగానో, వగరుగానో ఉంటాయి. వాటిని తినడానికి మనం ఒకింత ఇబ్బంది పడుతుంటాం కూడా. కానీ ఎండిన పండ్లు మంచి రుచిగా ఉంటాయి కాబట్టి ఇష్టంగానే మనం వీటిని తింటుంటాం. అలా ఇష్టంతో, మంచి రుచితో కొన్ని జబ్బులను నివారించుకునే మార్గాలను చూద్దాం. రక్తహీనత తగ్గించే ఎండు ఖర్జూర: సాధారణంగా మహిళలందరిలోనూ రక్తహీనత కనిపిస్తుంటుంది. ప్రతినెలా అయ్యే రుతుస్రావం వల్ల ఈ కండిషన్ ఉంటుంది. రక్తహీనతను నివారించే మంచి మార్గాల్లో ఎండు ఖర్జూరం ఒకటి. బాగా నీరసంగా ఉండేవారికి సైతం ఎండు ఖర్జూర మంచి ఉపయోగకారి. చాలాసేపు ఏమీ తినకుండా ఉండి, దేహంలో చక్కెర పాళ్లు తగ్గి, నీరసంగా ఉన్నవారిలో ఆ నిస్సత్తువను తక్షణం తగ్గించేందుకు ఎండు ఖర్జూరాలు తోడ్పడతాయి. వీటిలో ఉండే చక్కెర వల్ల కేవలం ఒకటి రెండు ఎండు ఖర్జూరాలతోనే అన్నం తిన్నంత ఫలితం ఉంటుంది. అలాగే ఎండిన అత్తిపండ్లు (డ్రై– ఫిగ్స్) తినడం వల్ల దీనిలోని ఐరన్, విటమిన్–సి వల్ల రక్తహీనత తగ్గడంతోపాటు వ్యాధినిరోధక శక్తి కూడా పెంపొందుతుంది. రక్తహీనత నివారణకు మాంసాహారం... ముఖ్యంగా మాంసాహారాల్లోనూ కాలేయం బాగా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తారు. అయితే కఠినంగా శాకాహార నియమాలు పాటించేవారికి ఇది ఒకింత ఇబ్బంది కలిగించే పరిష్కారం. అలాంటివారందరూ ఎండిన ఫిగ్స్పై ఆధారపడవచ్చు. రక్తహీనతతో బాధపడేవారిలో మాంసాహారంలోని కాలేయం వంటివి తీసుకుంటే ఎలాంటి ఫలితాలు ఒనగూరుతాయో... ఎండిన ఫిగ్స్తోనూ అవే ప్రయోజనాలు చేకూరతాయి. అధిక రక్తపోటు నివారణకు ఎండు ఆప్రికాట్: సాధారణంగా హైబీపీతో బాధపడేవారికి అరటిపండ్లు తినమని డాక్టర్లు సూచిస్తుంటారు. అరటిపండులో పుష్కలంగా ఉండే పొటాషియమ్ రక్తపోటును నివారిస్తుంది/నియంత్రిస్తుంది. అందుకే ఆ సూచన చేస్తుంటారు. అయితే ఒక అరటి పండులో కంటే ఒక ఎండిన ఏప్రికాట్లో మూడు రెట్లకు మించి కాస్తంత ఎక్కువగానే పొటాషియమ్ ఉంటుంది. దాంతో హైబీపీ బాగా తగ్గుతుంది. అట్లాంటాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంలో పొటాషియమ్ ఎక్కువగా తీసుకోవడం అన్నది హైబీపీ నియంత్రిస్తుందని తేలింది. (దీనికి భిన్నంగా సోడియమ్ అన్నది రక్తపోటును పెంచుతుందన్న విషయం తెలిసిందే. అందుకే రక్తపోటు పెరిగే ప్రమాదం ఉన్నందున ఉప్పు ఎక్కువగా తీసుకోవద్దంటూ డాక్టర్లు సూచిస్తుంటారు కూడా). అందుకే హైబీపీ నియంత్రణకు ఎండిన ఏప్రికాట్ మంచి రుచికరమైన మార్గం. ఆస్టియోపోరోసిస్ను నివారించే రెయిసిన్స్ : ఇటీవల రకరకాల రెయిసిన్స్ (కిస్మిస్ లాంటివే అయినా బాగా ఎండిన మరో రకం ద్రాక్ష) మెనోపాజ్కు చెరుకున్న మహిళల్లో అత్యంత సాధారణంగా కనిపించే ఆస్టియోపోరోసిస్ను నివారిస్తాయి. వాళ్ల ఎముకలను పటిష్టం చేస్తాయి. సాధారణంగా మహిళలందరిలోనూ ఒక వయసు దాటాక ఎముకల సాంద్రత తగ్గుతుంది. (ఈ పరిణామం అందరిలోనూ కనిపించినా... మెనోపాజ్ దాటాక మహిళల్లో మరింత ఎక్కువ. అందుకే ఎముకలను పెళుసుబార్చి తేలిగ్గా విరిగేలా చేసే ఆస్టియోపోరోసిస్ వాళ్లలోనే ఎక్కువ). సాధారణంగా పాలు, పాల ఉత్పాదనల్లో కాల్షియమ్ ఎక్కువ. అందుకే పెరుగులో కొన్ని రెయిసిన్స్ ముక్కలతో పాటు మన దగ్గర ఇటీవలే లభ్యత పెరిగిన ‘పెకాన్స్’ వంటి ఎండుఫలాలను కలిపి తీసుకుంటే మరింత మంచి ప్రయోజనం కనిపిస్తుంది. మలబద్దకాన్ని నివారించే ప్రూన్స్: ఈ ప్రూన్స్ కూడా కిస్మిస్, రెయిజిన్స్ లాంటి మరో రకం ఎండు ద్రాక్ష. కాకపోతే అవి నల్లటి రంగులో కిస్మిస్, రెయిజిన్స్ కంటే పెద్దవిగా ఉంటాయి. మనలో చాలామంది మలబద్దకంతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యను అధిగమించడం కోసం అనేక మార్గాలు అవలంబిస్తూ ఉంటారు. కానీ వాటన్నిటికంటే రుచుకరమైనదీ, తేలికైన మార్గం ప్రూన్స్ తినడం. రోజూ అరడజను ప్రూన్స్ తినడం వల్ల మలవిసర్జన సాఫీగా జరుగుతుందని అనేక పరిశీలనల్లో తేలింది. ప్రూన్స్లో ఉండే సార్బిటాల్ అనే పోషక పదార్థం మలాన్ని మృదువుగా చేసి అది తేలిగ్గా విసర్జితమయ్యేలా తోడ్పడతుంది. కాబట్టి మలబద్దకం ఉన్నవారు ఈ రుచికరమైన మార్గాన్ని ఎంచుకుని ప్రయోజనం పొందవచ్చు. గౌట్ను నివారించే ఎండు చెర్రీలు: ఎండు చెర్రీలలో యాంథోసయనిన్ అనే పోషకం ఉంటుంది. ఇది ఎముకల్లో మంట, నొప్పి, ఇన్ఫ్లమేషన్ను సమర్థంగా తగ్గిస్తుంది. అందుకే ఎముకల్లో తీవ్రమైన నొప్పి కలిగించే గౌట్, ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడేవారు ఎండు చెర్రీలను తింటే మంచి ఉపశమనం లభిస్తుంది. కొద్దిరోజుల కిందట యూఎస్ లోని మిషిగన్ యూనివర్సిటీలో నిర్వహించిన ఒక అధ్యయనంలో ఎండు చెర్రీ పండ్లు తినేవారిలో ఎముకల్లో మంట, నొప్పి, ఇన్ఫ్లమేషన్ సగానికి సగం తగ్గుతాయని తేలింది. యూరినరీ ఇన్ఫెక్షన్స నివారణకు ఎండిన క్రాన్బెర్రీ పండ్లు : మహిళల్లో మూత్రసంబంధిత ఇన్ఫెక్షన్లు ఎక్కువ. ఇలా మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ల (యూరినరీ ఇన్ఫెక్షన్స్)తో బాధపడేవారు ఎండిన క్రాన్బెర్రీ పండ్లను తింటే మంచి ఉపశమనం కలుగుతుందని తేలింది. కొన్ని అమెరికన్ అధ్యయనాల్లో ఇది నిరూపితమైన సత్యం. అంతేకాదు క్యాన్బెర్రీ పండ్ల వల్ల జీర్ణసంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచీ ఉపశమనం చేకూరుతుంది. ముఖ్యంగా ఈ–కోలై బ్యాక్టీరియా నుంచి కూడా ఉపశమనం కలుగుతుందని తేలింది. ఎండిన క్యాన్బెర్రీలలో ఉండే ప్రో–యాంథోసయనిన్ అనే పోషక పదార్థం వల్ల ఈ ప్రయోజనం ఒనగూరుతుందని స్పష్టమైంది. జీనత్ ఫాతిమా డైటీషియన్ -
ఫార్మాకు ‘విటమిన్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 ప్రభావం భారత్లో అన్ని రంగాలపైనా చూపిస్తోంది. ఇందుకు ఫార్మా మినహాయింపు ఏమీ కాదు. అయితే ఈ రంగంలో విభిన్న వాతావరణం నెలకొంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కొన్ని మందుల వినియోగం తగ్గితే, మరికొన్నిటి వాడకం పెరిగింది. ప్రధానంగా గ్యాస్ట్రో, న్యూరో, ఆప్తల్మాలజీ, డెంటల్, గైనిక్ సంబంధ ఔషధాల వినియోగం గణనీయంగా తగ్గింది. వైరస్ ఎక్కడ తమకు సోకుతుందోనన్న భయంతో ఆసుపత్రులకు రోగు లు వెళ్లకపోవడం, చికిత్సలు వాయిదా వేసుకోవడమే ఇందుకు కారణం. కార్డియో, డయాబెటిక్ వంటి మందుల అమ్మకాల్లో పెద్దగా మార్పులేదు. కోవిడ్ చికిత్సలో ఉపయోగించే రెమ్డెసివిర్, ఫావిపిరావిర్ తదితర ఔషధాల విక్రయాలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు ఈ మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి రోగనిరోధక శక్తిని పెంచుకునే పనిలో ప్రజలు నిమగ్నమయ్యారు. విటమిన్ల అమ్మకాలు ఎన్నడూ లేనంతగా జరుగుతున్నాయి. విటమిన్లపైనే ఫోకస్.. దాదాపు అన్ని ఫార్మా కంపెనీల పోర్ట్ఫోలియోలో విటమిన్లు కూడా ఉంటున్నాయి. మొత్తం ఫార్మా విక్రయాల్లో కోవిడ్ ముందు వరకు విటమిన్ల వాటా కేవలం 5–10 శాతమే. ఇప్పుడిది 30–40 శాతానికి చేరిందని ఆప్టిమస్ ఫార్మా డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘మల్టీ విటమిన్లు, బి, సి, డి, జింక్ ట్యాబ్లెట్ల అమ్మకాలు గతంలో లేనంతగా పెరిగాయి. కంపెనీలు మొదట శానిటైజర్లు, ఆ తర్వాత విటమిన్ల తయారీ వైపు మొగ్గుచూపాయి. అయితే వీటికి డిమాండ్ అధికమవడంతో ధర 20 శాతం దాకా పెరిగింది. ఇతర ఔషధాల అమ్మకాలు తగ్గినా.. కంపెనీలను విటమిన్లు ఆదుకుంటున్నాయి’ అని అన్నారు. కాగా, కోవిడ్ కారణంగా ఫార్మా రంగంలో ఉద్యోగుల తీసివేతలు జరగలేదని, కొత్త నియామకాలు కొనసాగుతూనే ఉన్నాయని ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ అభ్యర్థుల కోసం పరిశ్రమ ఎదురుచూస్తోందన్నారు. రెండేళ్లలో రూ.1,000 కోట్లు.. యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్, జనరిక్స్, ఇంజెక్టేబుల్స్ తయారీలో భారత్లో తొలి స్థానంలో ఉన్న హైదరాబాద్లో సుమారు 1,500 దాకా కంపెనీలు ఉన్నాయి. 5 లక్షల పైచిలుకు ఉద్యోగులు ఈ రంగంలో ఉన్నారు. ఎగుమతి మార్కెట్లతోపాటు దేశీయంగా ఔషధాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఒకట్రెండేళ్లలో 25 దాకా కంపెనీల నుంచి కొత్త యూనిట్లు వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. మిగిలిన కంపెనీలు అన్నీ ఇప్పటికే ఉన్న ప్లాంట్లలో విస్తరణకు సిద్ధంగా ఉన్నాయని సమాచారం. ఈ కంపెనీలు రెండేళ్లలో రూ.1,000 కోట్ల దాకా పెట్టుబడి చేసే అవకాశం ఉంది. తద్వారా కొత్తగా 50,000 మందికి ఉపాధి లభించనుంది. హిమాచల్ప్రదేశ్లోని బద్దిలో ప్లాంట్లను నిర్వహిస్తున్న కొన్ని కంపెనీలు తదుపరి విస్తరణ హైదరాబాద్లో చేపట్టనున్నాయని ఫ్యూజన్ హెల్త్కేర్ ఎండీ మధు రామడుగు తెలిపారు. భాగ్యనగరి సమీపంలో ప్రతిపాదిత ఫార్మా సిటీ సాకారం అయితే పెద్ద ఎత్తున కొత్త ప్లాంట్లు ఏర్పాటవుతాయని చెప్పారు. ఏపీలోనూ కంపెనీల విస్తరణ ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు హైదరాబాద్లో ఉన్న ప్లాంట్లలో విస్తరణ కోసం ఎదురుచూస్తున్నాయని బల్క్ డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఈడీ ఈశ్వర్ రెడ్డి వెల్లడించారు. అయితే పరిమితులు ఇందుకు అడ్డంకిగా ఉన్నాయని అన్నారు. ‘ఫార్మా సిటీ సాకారమయ్యే వరకు వీటి విస్తరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. చాలా ప్లాంట్లు యూఎస్ఎఫ్డీఏ అనుమతి ఉన్నవే. కొత్తగా ఎఫ్డీఏ నుంచి అనుమతి తీసుకోవాలంటే కనీసం మూడేళ్లు పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు బల్క్ డ్రగ్ పార్క్లలో ఒకటి తెలంగాణలో ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో వచ్చే రెండేళ్లలో 50–60 యూనిట్లు కొత్తగా వచ్చే అవకాశం ఉంది. బల్క్ డ్రగ్ పరిశ్రమ ఈ ఏడాది 15–20 శాతం వృద్ధి నమోదు చేయనుంది’ అని వివరించారు. ఎగుమతులతో కలుపుకుని భారత ఫార్మా మార్కెట్ విలువ సుమారు రూ.3 లక్షల కోట్లు ఉంది. -
టొమాటో మాటున ఆరోగ్యం
ప్రాచీన భారతదేశీయ వైద్యమైన ఆయుర్వేదంలో టొమాటో ప్రస్తావన లేదు. ఇది మన దేశపు పంట కాకపోవటమే ఇందుకు కారణం. మౌలికంగా ఇది అమెరికా సీమకు చెందినది. క్రీ.శ. 7వ శతాబ్దంలో పెరూ, చిలీ, బొలీవియా దేశాలలో ఈ పంట ప్రారంభమైంది. అనంతరం 16వ శతాబ్దం లో ఐరోపా వాసులకు పరిచయమైంది. తదనంతరం పోర్చుగీసు వారి ద్వారా భారతదేశానికి సంక్రమించింది. ఈ పండు ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. ఈ రక్త వర్ణానికి భయపడి ప్రారంభదశలో దీనిని విషతుల్యంగా భావించి తినేవారు కాదు. క్రమేణా దీని రుచిని, ఆరోగ్య ప్రయోజనాలను ఆస్వాదించటం మొదలైంది. వాస్తవానికి ఈ చెట్టు కాండంలోనూ, ఆకులలోనూ ఉండే సొలానిన్ అనే పదార్థం దుర్గుణాలను కలిగి ఉంటుంది. అందుకే ఏ జంతువూ ఈ చెట్ల జోలికి పోదు. దీంట్లో ప్రధానంగా పులుపు, తీపి రుచులు ఉంటాయి. కొద్దిగా లవణ రసం (ఉప్పగా) కూడా ఉంటుంది. కనుక ఏ కూరగాయలతో దీనిని కలిపి వండినా, పచ్చిగా సేవించినా వాటి రుచి మరింత పెరుగుతుంది. వాతహరంగా ఉపకరిస్తుంది. ఆధునికశాస్త్రరీత్యా పోషక విలువలు సుమారుగా ఒక కప్పు (150 గ్రా.) టొమాటో పండ్లలోని పోషక విలువల శాతాలు ఈ క్రింది విధంగా ఉంటాయి. క్యాలరీలు (శక్తి) 1%, పిండి పదార్థాలు 2%, ఆహారపు పీచు 7%, శర్కర 2.8%, ఒమేగా త్రీ ఫాటీ యాసిడ్స్ 3%. విటమిన్లు ఎ – 25%, సి – 32%, ఇ – 4%, కె –15%, బీ కాంప్లెక్సు – సరాసరి 4% ఖనిజ లవణాలు (మినరల్స్) క్యాల్షియం– 1%, ఐరన్ – 4%, మెగ్నీషియం – 4%, ఫాస్ఫరస్ – 4% జింక్ – 2%, కాపర్ – 4%, మాంగనీసు – 8%, పొటాషియం–10%. లైకోపిన్, ల్యూటిన్, బీటాకొరెటిన్ సమృద్ధిగా ఉంటాయి. ఉండనివి (శూన్యం) కొలెస్టరాల్, స్టార్చ్, సోడియం, సెలీనియం (విషం), విటమిన్ డి అండ్ బి12. ప్రయోజనాలు: వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. చర్మకాంతి, కంటి చూపు మెరుగుపడతాయి. కేశాలు దృఢంగా పెరుగుతాయి. గుండెకు బలం, కండరాల శక్తి పెరుగుతాయి. అధిక రక్త్తపీడనం (అధిక బీపీ) అదుపులోకి వస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణం కలిగి రోగాలను దరిచేరనీయదు. బరువు తగ్గేవారికి ఇదిమంచి ఆహారం. శరీరానికి నీటి శాతం పుష్కలంగా అందుతుంది. క్యాబేజీ కుటుంబానికి చెందిన బ్రొకోలీతో టొమాటోను కలిపి తింటే ప్రొస్టేట్ క్యాన్సర్, పాంక్రియాసిస్ క్యాన్సర్లు తగ్గుతాయని ఇటీవలి పరిశోధనలు వెల్లడి చేస్తున్నాయి. గమనిక: దీంట్లో పొటాషియం అధికంగా ఉంటుంది కనుక ‘మూత్రపిండాలలో రాళ్లు’ వ్యాధిగ్రస్తులు దీనిని సేవించరాదు. -
విటమిన్ కోసం మేం రెడి!
‘ఇదేంటీ.. అంతమంది శిశువులను ఎత్తుకుని కనిపిస్తున్నారు.. వైద్యానికిగాని వచ్చారా!’అనిపిస్తోంది కదూ! మీ అనుమానం నిజమే. వారు వచ్చింది వైద్యంకోసమేగానీ.. వైద్యుడి వద్దకు మాత్రం కాదు. ఉదయంపూట వచ్చే సూర్యకిరణాలతో చిన్నారులకు ‘డి’విటమిన్ లభిస్తుందని డాక్టర్ సూచించడంతో మంచిర్యాల జిల్లా కేంద్రం ఆసుపత్రిలో జన్మించిన శిశువులను వారి బంధువులు ఇదిగో ఇలా బుధవారం ఉదయం 8 గంటలకు ఎత్తుకుని ఆసుపత్రి ఎదుట కనిపించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్ మంచిర్యాల -
హెల్త్ టిప్స్
►కూరగాయ ముక్కలని పెద్దవిగా కట్ చేస్తే వీటిలో లభించే విటమిన్స్ వృథా అవ్వవు. ►ప్రతిరోజూ నీళ్లలో తులసి ఆకులు వేసుకుని తాగాలి. ఇలా చేస్తే థ్రోట్ ఇన్ఫెక్షన్ క్రమంగా తగ్గుతుంది. ►క్యారెట్, టొమాటో కలిపి జ్యూస్చేసి, తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని నీళ్లలో కలుపుకుని తాగితే రక్తశుద్ధి అవుతుంది. ►తులసి ఆకులని మరిగించిన నీటితో స్నానం చేస్తే చర్మం పై రాషెస్ తగ్గుముఖం పడతాయి. ►జీలకర్ర, పంచదారని కలిపి నమిలితే కడుపు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ►గ్లాసుడు నీళ్లలో పావు టీ స్పూన్ ఏలకుల పొడి కలుపుకుని తాగితే యూరినరీ ఇన్ఫెక్షన్ బాధ నుండి బయట పడవచ్చు ►అల్లం ముక్కని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇందులో చిటికెడు జీలకర్ర పొడి, పంచదార కలిపి తింటే దగ్గు తగ్గుముఖం పడుతుంది. ►నెలసరి నొప్పితో బాధపడేవారు క్రమం తప్పకుండా ప్రతిరోజు ఒక ఉసిరికాయను తింటే ఉపశమనం లభిస్తుంది. ►పంటి నెప్పితో బాధ పడేవారు, ఒక లవంగాన్ని పంటికింద ఉంచితే మంచి ప్రభావం ఉంటుంది. -
ఈ వర్షాల్లో ఇమ్యూనిటీ పెంచుకోండిలా...
మీకు తరచూ జలుబు చేస్తుంటుందా? అలా కాస్త తగ్గుతుండగానే మళ్లీ ఇలా అది వచ్చేస్తోందా? వర్షాలు పడుతున్న ఇలాంటి సీజన్లో ఈ లక్షణాలు కొందరిలో తరచూ కనిపిస్తుంటాయి. మనందరిలో కాస్త దగ్గు, జలుబూ, రొంపా, జ్వరం కనిపించగానే... అలా మందుల దుకాణానికి వెళ్లడం, ఏదో యాంటీబయాటిక్ కొని వేసుకోవడం సాధారణంగా చేస్తుంటాం. దీనితో రెండు నష్టాలు. మొదటిది... రోగ నిరోధక శక్తి తగ్గడంతో పాటు ఆ కారణంగా మరింత ప్రభావకరమైన మందు వాడితే తప్ప మనకు వచ్చే జబ్బులు తగ్గకపోవడం. ఇదొక దుష్పరిణామం అయితే... ఆ మందుల సైడ్ ఎఫెక్ట్స్ కూడా రెండో ప్రమాదంగా చెప్పవచ్చు. అందుకే ఇంట్లో దొరికే మామూలు వంట పదార్థాలతో మంచి రోగనిరోధక శక్తిని సాధించవచ్చు. దీనితో తరచూ వచ్చే జబ్బులే కాదు... కొన్ని రకాల దీర్ఘరోగాల నుంచి మంచి ఇమ్యూనిటీ కూడా లభిస్తుంది. చిలగడ దుంపలు (స్వీట్పొటాటో) దీన్నే మోరంగడ్డ/గెణుసుగడ్డ అని కూడా పిలుస్తారు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు పోషకాలూ వ్యాధి నిరోధకశక్తిని పెంచేందుకు ఉపయోగపడేవే. ఇక ఇది మేనికి మంచి మెరుపునిస్తుంది. ప్రమాదకరమైన బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్స్నుంచి రక్షణ ఇస్తుంది. ఇక ఇందులో ఉండే చక్కెర వల్ల గుండె, రక్తప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థకు బలం చేకూరుతుంది. ఇది మన శరీరంలోని గ్లూటాథయోన్ అనే యాంటీ ఆక్సిడెంట్ స్థాయులను పెంచుతుంది. గ్లూటాథయోన్ను ‘మాస్టర్ యాంటీఆక్సిడెంట్’ అని వ్యవహరిస్తారు. ఇది మన కణాల్లో పేరుకున్న విషాలను బయటకు పంపి, వాటిని శుభ్రపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫ్రీ–రాడికల్స్ను తొలగిస్తుంది. అందుకే చిలగడదుంపలు తినేవారు ఆరోగ్యంగా ఉంటారు. మంచి జీవననాణ్యతతో దీర్ఘకాలం బతుకుతారు. వర్షాలు విస్తృతంగా పడుతున్న ఈ సీజన్లో ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచుకోడానికి చాలా రుచికరమైన కొన్ని చిట్కాలు. వీటితోపాటు అన్ని పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవడం, ఏ సీజన్లో దొరికే పండ్లను ఆ సీజన్లో తింటుండటం కూడా బాగా ఉపకరిస్తుంది. చికెన్ సూప్ మీరు మాంసాహారం తినేవారైతే జలుబు, రొంప లాంటి తరచూ సోకే ఇన్ఫెక్షన్లకు కమ్మటి చికిత్స చికెన్ సూప్. ఇది ఎన్నో ఏళ్లుగా అందరూ అనుసరిస్తున్న రుచికరమైన స్వాభావిక చికిత్సామార్గం. చికెన్ సూప్లో సిస్టిన్ అనే ఒక అమైనో యాసిడ్ ఉంటుంది. కోడి పులుసు పెట్టేటప్పుడే ఈ అమైనో యాసిడ్ స్రవిస్తుంది. చికెన్, దాని ఎముకలతో చేసే సూప్లో మినరల్స్, పోషకాలతో మంచి వ్యాధి నిరోధకశక్తి చేకూరుతుంది. ఉదాహరణకు చికెన్సూప్లోని జిలాటిన్ అనే అమైనోయాసిడ్ వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది. అంతేకాదు... చికెన్సూప్ అన్నది మంచి జీర్ణశక్తికి, కాలేయం పనితీరును మెరుగుపరచడానికి, ఎముకలను పటిష్టం చేయడానికి ఉపయోగపడుతుంది. వెల్లుల్లి ఇది ఉల్లి జాతికి చెందిన వంట దినుసు. తాను ఘాటుగా ఉండటం మాత్రమే కాదు... ఇది ఎన్నో వ్యాధులపై కూడా అంతే ఘాటు ప్రభావాన్ని చూపిస్తుంది. అనేక రోగాలను నిరోధిస్తుంది. దీనిలోని అల్లెసిన్ అనే పోషకం చాలా రకాల జబ్బులతో పోరాడి, వాటి నుంచి శరీరాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అల్లిసిన్ ఒక ప్రభావపూర్వకమైన యాంటీ ఆక్సిడెంట్ కూడా. మనం తినే ఆహారాల్లో ఫ్రీ–రాడికల్స్ అనే పదార్థాలు అనేక దుష్ప్రభావాలను చూపి, వ్యాధులకు కారణమవుతాయి. అల్లిసిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఫ్రీ–రాడికల్స్ను ప్రభావరహితం చేసేస్తుంది. అందుకే ఇది వ్యాధి నిరోధకతను పెంచడంతో పాటు ఎన్నో రకాల క్యాన్సర్లనూ నివారిస్తుంది. ఆహారంలో వెల్లుల్లి ఎక్కువగా తినేవారికి బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్, పరాన్నజీవుల (పారసైటిక్) ఇన్ఫెక్షన్ల నుంచి మంచి రక్షణ లభిస్తుంది. అంతేకాదు... శ్వాసకోశవ్యాధులున్నవారు వెల్లుల్లిని ఎక్కువగా వాడటం వల్ల ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. నిమ్మజాతి పండ్లు నిమ్మజాతి పండ్లైన నారింజ, బత్తాయి, కమలాలు వంటి పండ్లలో విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది. అది అనేక రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. అందుకే ఇవి చాలా వ్యాధులకు మంచి రుచికరమైన నివారణ అని చెప్పవచ్చు. అంతేకాదు... కణాలను నాశనం చేసి, ఏజింగ్కు తోడ్పడే ఫ్రీరాడికల్స్ను నారింజల్లోని హెస్పరిడిన్, హెస్పరెటిన్ వంటి బయోఫ్లేవనాయిడ్స్ సమర్థంగా అరికడతాయి. అందువల్ల వీటిని తినేవారు దీర్ఘకాలం యౌవనంగా ఉంటారు. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున ఇవి ఎన్నో రకాల క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తాయి. పీచు చాలా ఎక్కువ. అందుకే జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి బాగా తోడ్పడుతుంది. ఎక్కువ పీచు, తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల స్థూలకాయం, బరువు తగ్గడానికి ఇది బాగా ఉపకరిస్తుంది. దాంతో చాలా జబ్బులు నివారితమవుతాయి. -
గర్భిణులు కాయధాన్యాలను ఎందుకు తినాలి?
గర్భిణికి తగిన మోతాదులో విటమిన్లు, ఖనిజాలు, మాంసకృత్తులు, పీచు పదార్థాలు అందుతుండాలి అని వైద్యులు చెబుతుంటారు. ప్రసవించాక కూడా తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పోషకాలు తప్పనిసరి. దీనర్థం గర్భంతో ఉన్నవారు పెద్ద మొత్తంలో ఆహారం తీసుకోవాలని కాదు. కొద్ది మొత్తంలో తీసుకుంటూనే పెద్దమొత్తంలో పై పోషకాలు ఉండేలా శ్రద్ధ తీసుకుంటే చాలు. గుడ్లు, ఆకుకూరలు, చేపలతో పాటు.. కాయధాన్యాలలో గర్భిణికి అవసరమైన పోషకాలన్నీ ఉంటాయి. కాయధాన్యాలంటే.. కాయల్లో ఉండే ధాన్యా లు. కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, ఇంకా బీన్స్ వంటి వాటితో వండిన కాయధాన్య ఆహారం గర్భిణికి సత్తువనిస్తుంది. శక్తిని ఇవ్వడమే కాదు. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా నివారిస్తుంది. అవి ఏమిటో ఒక్క మాటలో తెలుసుకుందాం. కాయధాన్యాలుగర్భిణులలో రక్తహీనతను నివారిస్తాయి.గర్భస్థ శిశు లోపాలను తగ్గిస్తాయి.అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి.మైగ్రేన్ తలనొప్పుల తీవ్రత ఉండదు.మలబద్ధక సమస్య తలెత్తదు.రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సరిగా ఉంటాయి. -
పగుళ్లకు కాంప్లిమెంట్స్
కవులకేం పన్లేదు. ఊరికే కూర్చొని కవితలు అల్లేస్తుంటారు. పాదాల్ని పద్మాలు అంటారు. తమలపాకులు అంటారు. అయినా పనీపాట ఉన్న స్త్రీల పాదాలు ‘పద్మాలంత సున్నితంగా, తమలపాకులంత కోమలంగా’ ఎలా ఉంటాయి చెప్పండి! కానీ కవుల భావుకతను మరీ అంత తీసిపడేయనక్కర్లేదు. ఒక ఆలోచనైతే కలిగించారు కదా.. పాదాలు మృదువుగా ఉంటే అందంగా ఉంటాయని! అలా అందంగా, శుభ్రంగా పాదాలను ఉంచుకోడానికి ప్రయత్నిస్తే పాపం కవుల కల్పనను గౌరవించినవాళ్లమూ అవుతాం, మనకూ కొన్ని కాంప్లిమెంట్స్ వస్తాయి. ఇప్పుడైతే పగుళ్ల పాదాలను చిన్న టిప్తో అందంగా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. ఏం చేయాలి? బాగా పండిన అరటిపండ్లు రెండు తీసుకోండి. చక్కగా గుజ్జులా చెయ్యండి. కాస్త పచ్చిగా, పచ్చగా ఉన్న పండ్లయినా ఓకే అనుకోకండి. పూర్తిగా పండని అరటిపండ్లలో ఆసిడ్స్ ఉంటాయి. అవి చర్మంతో దురుసుగా ప్రవర్తిస్తాయి. ఇప్పుడు ఆ పండిన అరటిపండ్ల గుజ్జును మెల్లిగా పాదమంతా రుద్దండి. కాలి వేళ్లు, వేళ్ల సందులకు కూడా గుజ్జును చేర్చి, చిన్న మసాజ్లాంటిది ఇవ్వండి. అలా రెండు పాదాలకూ రాసి, 20 నిముషాల పాటు అలాగే ఉంచేయండి. 20 నిముషాల తర్వాత శుభ్రమైన నీటితో (చల్లనివి గానీ, గోరు వెచ్చనివి గానీ) కడిగేయండి. ఎన్నిసార్లు ? పడుకోబోయే ముందు ప్రతి రోజూ చెయ్యాలి. అలా కనీసం రెండు వారాలు లేదా ఫలితాలతో మీరు సంతృప్తి చెందేవరకు చెయ్యాలి. చేస్తే ఏమౌతుంది? అరటిపండు సహజసిద్ధమైన మాయిశ్చరైజర్. అంటే చర్మాన్ని తేమగా ఉంచే స్వభావం గలది. అరటిపండులో ఉండే విటమిన్ ఎ, బి6, సి లలో చర్మాన్ని మెత్తబరిచి, పొడిబారకుండా ఉంచే గుణాలు ఉంటాయి. ఇవన్నీ కలిసి పాదాలను మృదువుగా మార్చేస్తాయి. మడమల పగుళ్లకు ఇది తిరుగులేని మంత్రం. -
దానిమ్మలోని పదార్థంతో దీర్ఘాయుష్షు!
దీర్ఘాయుష్షుకు ఉపయోగపడుతుందని భావిస్తున్న ‘యురోలిథిన్ ఏ’ అనే పదార్థాన్ని మనుషుల్లోనూ విజయవంతంగా పరీక్షించారు శాస్త్రవేత్తలు దానిమ్మలో కనిపించే ఈ యురోలిథిన్ ఏ ఇప్పటికే కొన్ని రకాల పురుగులు, ఎలుకల ఆయుష్షును గణనీయంగా పెంచింది. స్విట్జర్లాండ్లోని ఈపీఎఫ్ఎల్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల ద్వారా ఈ విషయం స్పష్టమైంది. యురోలిథిన్ ఏ కణాల్లోని మైటోకాండ్రియా పనితీరును మెరుగుపరచడం ద్వారా వద్ధాప్యంతో వచ్చే సమస్యలను నివారిస్తుందని అంచనా. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ పదార్థం మనకు తెలిసిన ఏ ఆహారంలోనూ ఉండదు. కాకపోతే దానిమ్మ, రాస్ప్బెర్రీ వంటి పండ్లలోని కొన్ని రసాయనాలు మన పేగుల్లో యురోలిథిన్ ఏగా విడిపోతాయి. ఈపీఎఫ్ఎల్ శాస్త్రవేత్తలు ఈ యురోలిథిన్ ఏ ను కత్రిమంగా తయారు చేసి ప్రయోగాలు చేశారు. వేర్వేరు మోతాదుల్లో 60 మందికి అందించారు. వీరందరూ ఆరోగ్యంగా ఉన్నవారే. కాకపోతే వ్యాయామాలు వంటివి పెద్దగా చేయనివారు. వీరికి వేర్వేరు మోతాదుల్లో యురోలిథిన్ ఏను అందించారు. 500 నుంచి వెయ్యి మిల్లీగ్రాములు ఇచ్చినప్పుడు మైటోకాండ్రియా పనితీరులో మార్పు కనిపించిందని వ్యాయామం చేస్తే ఎలాంటి వచ్చే ఫలితాలు ఈ మందు ద్వారా వచ్చాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జొహాన్ అవురెక్స్ తెలిపారు. -
మామిడి ఉపయోగాలు
►మామిడి పండును పండ్లలో రారాజుగా పిలుస్తారు. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం... అధిక రక్తపోటు సమస్యను నివారిస్తుంది. విటమిన్ సి, ఫైబర్... శరీరంలో హాని చేసే కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి ►మామిడి పండును తినడం వల్ల పంటి నొప్పి, చిగుళ్ల సమస్యలు, చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి సమస్యలు దూరమవుతాయి ►నోటిలోని బ్యాక్టీరియా నశిస్తుంది. దంతాలు శుభ్రపడతాయి. పంటిపై ఎనామిల్ కూడా దృఢంగా ఉంటుంది ►మామిడి పండు మంచి జీర్ణకారి ∙ఇది అజీర్ణం, అరుగుదల సరిగా లేకపోవడం వంటి జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది ►మామిడి పండ్లను తీసుకోవడం ద్వారా సన్నగా ఉన్నవారు సహజమైన బరువు పెరిగే అవకాశం ఉంది ►ఇందులో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో మామిడి పండ్లు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇందులో ఉండే కాపర్ ఎర్ర రక్త కణాల వృద్ధికి దోహదపడుతుంది ►ఈ పండులో ఉండే విటమిన్లు, ఖనిజాలు గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది ►వృద్ధాప్య సమస్యలను తగ్గిస్తుంది ►చర్మపు ఆరోగ్యాన్ని పెంచుతుంది ►మెదడుని ఆరోగ్యంగా ఉంచుతుంది ►శరీరంలోని రోగనిరోధకశక్తిని పెంచే బీటా కెరటిన్ అనే పదార్థం సమృద్ధిగా ఉంది. ఇది మన శరీరంలోని రోగనిరోధకశక్తిని పెంచి శరీరాన్ని బలోపేతం చేస్తుంది ►మామిడి పండుకి నాలుగు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది భారతదేశపు జాతీయఫలం. పాదాల పగుళ్లు: మామిడి జిగురు తీసుకుని, ఆ పరిమాణానికి మూడు రెట్లు నీళ్లు కలిపి పేస్టులా చేసి, ప్రతిరోజు పాదాలకు లేపనంలా పూసుకోవాలి. పంటినొప్పి, చిగుళ్ల వాపు: రెండు కప్పుల నీళ్లు తీసుకుని మరిగించాక, రెండు పెద్ద చెంచాల మామిడి పూతను జత చేసి మరికొంత సేపు మరగనిచ్చి, దింపేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు పుక్కిట పట్టాలి. ఇలా రోజుకు రెండు మూడు సార్లు చేయొచ్చు. కడుపులో పురుగులు: మామిడి టెంకలోని జీడిని వేరు చేసి తడి పోయేవరకు ఆరబెట్టాలి. పెద్ద చెంచాడు మెంతులను కలిపి మెత్తగా చేసి, ఒక సీసాలో భద్రపరచుకోవాలి. కొన్నిరోజుల పాటు మజ్జిగతో కలిపి తీసుకోవాలి. ఆర్శమొలలు: మామిడి జీడిని వేరు చేసి, ఎండబెట్టి, పొడి చేయాలి. పెరుగు మీది తేటకు ఈ పొడి జత చేసి తీసుకోవాలి. జ్వరం: మామిడి వేర్లకు కొద్దిగా నీళ్లు జతచేసి మెత్తగా రుబ్బాలి. ఈ ముద్దను అరికాళ్లకు, అరిచేతులకు రాసుకుంటే జ్వరంలో కనిపించే వేడి తగ్గుతుంది. బట్టతల: ఒక జాడీలో కొబ్బరి నూనె గాని, నువ్వుల నూనె గాని తీసుకుని మామిడికాయలను సంవత్సరం పాటు ఊరబెట్టాలి. ఆ తరవాత ఈ నూనెను తల నూనెగా వాడుకోవాలి. చెవి నొప్పి: స్వచ్ఛమైన మామిడి ఆకుల నుంచి రసం తీసి కొద్దిగా వేడి చేసి, నొప్పిగా ఉన్న చెవిలో డ్రాప్స్గా వేసుకోవాలి. ముక్కు నుంచి రక్త స్రావం: మామిడి జీడి నుంచి రసం తీసి రెండు ముక్కు రంధ్రాల్లోనూ డ్రాప్స్గా వేసుకోవాలి. కంటి నొప్పి: పచ్చి మామిడి కాయను కచ్చాపచ్చాగా దంచి నిప్పుల పైన సుఖోష్టంగా ఉండేలా వేడి చేసి మూసి ఉంచిన కన్ను పైన బట్ట వేసుకోవాలి. దంత సంబంధ సమస్యలు: మామిడి ఆకులను ఎండబెట్టి, బూడిద అయ్యేంతవరకూ మండించాలి. దీనికి ఉప్పు కలిపి టూత్పౌడర్లా వాడుకోవాలి. ఈ పొడికి ఆవనూనెను కలిపి వాడుకుంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. కాలిన గాయాలు: మామిడి ఆకుల బూడిదను డస్టింగ్ పౌడర్లా వాడితే గాయాలు త్వరగా నయమవుతాయి. వడ దెబ్బ: పచ్చి మామిడి కాయను నిప్పుల మీద వేడి చేసి పిండితే సులభంగా గుజ్జు వస్తుంది. దీనికి కొద్దిగా చన్నీళ్లను, పంచదారను చేర్చి తాగితే, దప్పిక తీరడమే కాకుండా, శక్తి వస్తుంది. చెమట కాయలు: రెండు పచ్చి మామిడి కాయలను గిన్నెలో నీళ్లు పోసి ఉడికించి, చల్లార్చాక, గుజ్జు తీసి∙పంచదార, ఉప్పు కలిపి సేవించాలి. దీని వల్ల శరీరంలో వేడి తగ్గి ఒళ్లు పేలకుండా ఉంటుంది. మధుమేహం: లేత మామిడి ఆకులను, వేప చిగుళ్లను సమాన భాగాలుగా (రెండూ కలిపి అర టీ స్పూను మించరాదు) తీసుకుని మెత్తగా నూరి ముద్ద చేసి, నమిలి మింగేయాలి. ఇలా కొంతకాలం చేస్తే మధుమేహం అదుపులో ఉంటుంది. -
ఈ సమయంలో హెర్బల్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చా?
నా కూతురు ఎక్కువగా హెర్బల్–సప్లిమెంట్లు తీసుకుంటుంది. తాను ఇప్పుడు ప్రెగ్నెంట్. ఈ సమయంలో హెర్బల్– సప్లిమెంట్లు తీసుకోవచ్చా? విటమిన్స్ తప్పనిసరి అంటారు కదా.... ఇవి సమకూరాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియజేయగలరు. హెర్బల్ సప్లిమెంట్లు, గర్భంలో ఉన్నప్పుడు తీసుకోకపోవడం మంచిది. వీటికి ప్రభుత్వ ఆమోదం లేదు. మామూలు సమయంలో తీసుకుంటే ఫర్వాలేదు కాని గర్భిణులు ఇవి తీసుకోవటం వల్ల, వాటిలో కొన్ని పదార్థాల వల్ల అబార్షన్లు, నెలలు నిండకుండా కాన్పులు, బ్లీడింగ్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ.కాబట్టి ప్రెగ్నెన్సీలో వాటిని తీసుకోకపోవడం మంచిది.ఫోలిక్ యాసిడ్ అనేది బి కాంప్లెక్స్ జాతికి చెందిన ఒక విటమిన్. దీన్ని ప్రెగ్నెన్సీలో తీసుకోవడం వల్ల, బిడ్డ పెరుగుదలకు, అవయవాలు సరిగా ఏర్పడటానికి, నాడీవ్యవస్థలో లోపాలను చాలావరకు నివారించడానికి ఉపయోగపడుతుంది. ఇది 5ఎంజీ మాత్ర రూపంలో దొరుకుతుంది. ఫోలిక్ యాసిడ్ తాజా ఆకుకూరలు, పప్పులు, బఠానీలు, బీన్స్, పండ్లలో ఎక్కువగా లభిస్తుంది. పైన చెప్పిన ఆహారంతో పాటు, ఫోలిక్ యాసిడ్ మాత్ర కూడా ప్రెగ్నెన్సీ రాకముందు మూడునెలల నుంచే వాడటం మంచిది. అలానే మొదటి మూడునెలలు తప్పనిసరిగా వాడటం వల్ల పిండం సరిగా పెరిగి శిశువుగా రూపాంతరం చెందుతుంది. నాకు జనాంగాల మీద పొక్కులు వస్తున్నాయి. మొదట్లో నేను పెద్దగా పట్టించుకోలేదు. స్కేబీస్, ఫ్యూబిక్ లైస్ వంటి లైంగికంగా సంక్రమించే వ్యాధుల వల్ల పొక్కులు వస్తాయని ఎక్కడో చదివాను. ఇది నిజమేనా? వివరంగా తెలియజేయగలరు. జనాంగాల మీద పొక్కులు అనేక రకాల బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటిలో సిఫిలిస్, స్కేబిస్, çప్యూబిక్లెన్ హెర్పిస్, వార్ట్స్ వంటి ఎన్నో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. వీటిలో చాలావరకు లైంగిక వ్యాధుల వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి.ఒక్కొక్క ఇన్ఫెక్షన్ని బట్టి జననాంగాల మీద రకరకాల పొక్కులులాగా, నీటిగుల్లలులాగా, చిన్న చీముగడ్డలులాగా ఉండవచ్చు.లైంగికంగా సంక్రమించే వ్యాధులను అరికట్టడానికి కండోమ్స్ వాడుకోవడం మంచిది.అలాగే రక్తహీనత, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా, తొందరగా సంక్రమించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి, జననేంద్రియాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, సరైన పౌష్టికాహారం తీసుకోవడం, వ్యాయామాలు చెయ్యడం వంటి జాగ్రత్తలు పాటించడం వల్ల కొన్ని రకాల ఇన్ఫెక్షన్లను అరికట్టవచ్చు, ఎక్కువగా వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు.ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే పొక్కులు ఎటువంటి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందో పరీక్ష చేసి, నిర్ధారణ చేసుకుని మందులు ఇవ్వడం జరుగుతుంది. నిర్లక్ష్యం చేస్తే అవి ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయి. ప్రసవమయ్యాక బాలింతల రొమ్ముల ఆకృతిలో మార్పులు వస్తాయని, వాపు వస్తుందని, ఇబ్బందిగా ఉంటుందని విన్నాను. ఇలా రాకుండా ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవచ్చా? ప్రసవమయ్యాక కంటే గర్భవతిగా ఉన్నప్పటి నుంచే శరీరంలో మార్పులలాగే, రొమ్ములలో కూడా పాలు తయారుకావటానికి అనుగుణంగా మార్పులు మొదలవుతాయి. ఇందులో భాగంగా రొమ్ములు సైజు పెరుగుతాయి. నిపుల్ చుట్టూ వలయాకారం నల్లగా ఏర్పడుతుంది. కొందరిలో నల్లగా లేక ఎర్రగా రొమ్ముపైన స్ట్రెచ్మార్క్స్ ఏర్పడుతాయి.కాన్పు తర్వాత పాలు పడటం మొదలయ్యి, రొమ్ములు నిండుగా సౌష్టవంగా తయారవుతాయి. పాలు సరిపడా ఉండి, బిడ్డ సరిగా పాలు తీసుకుంటే రొమ్ములో వాపు, ఇబ్బంది, నొప్పి ఏమీ ఉండవు.కొన్నిసార్లు బిడ్డ సరిగా పాలు తాగకపోవటం, పాలు ఎక్కువగా స్రవించడం వంటి సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే రొమ్ములు పాలతో గట్టిపడి వాపు, ఇబ్బంది, నొప్పి వస్తాయి. అప్పటికీ సరిగా పట్టించుకోకపోతే, చీము పట్టడం, జ్వరం వంటి ఇబ్బందులు ఏర్పడవచ్చు.కాబట్టి బిడ్డ పుట్టిన తరువాత పాలు పడినా పడకపోయినా, రొమ్ము పట్టించి చీకేలా చేయాలి. మూడుగంటలకొకసారి పాలు పట్టాలి. పాలు ఎక్కువగా అనిపిస్తే వాటిని పిండి తీసివేయాలి. అలానే ఉంటే పైన చెప్పిన ఇబ్బందులు రావచ్చు. రొమ్ముల్లో వాపు ఇబ్బంది అనిపిస్తే డాక్టర్ని సంప్రదించాలి. సహజంగా రొమ్ములో వచ్చే మార్పులను అన్నీ నివారించలేము. అవి గర్భంతో ఉన్నప్పుడు శరీరంలో జరిగే హార్మోన్లలో మార్పులకు అనుగుణంగా ఉంటాయి. తల్లిపాలతో బిడ్డకు లభించే పోషకాలు, ఇతర లాభాలతో పోలిస్తే ఈ మార్పుల గురించి భయపడటం తగదు. ఈ ప్రయోజనాలు వెలకట్టలేనివి. డా‘‘ వేనాటి శోభబర్త్రైట్ బై రెయిన్బో హైదర్నగర్ -
హెల్త్ టిప్స్
కూరగాయ ముక్కలని పెద్దవిగా కట్ చేస్తే వీటిలో లభించే విటమిన్స్ వృథా అవ్వవు.ప్రతిరోజూ నీళ్లలో తులసి ఆకులు వేసుకుని తాగాలి. ఇలా చేస్తే థ్రోట్ ఇన్ఫెక్షన్ క్రమంగా తగ్గుతుంది.క్యారెట్, టొమాటో కలిపి జ్యూస్ చేసి, తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని నీళ్లలో కలుపుకుని తాగితే రక్తశుద్ధి అవుతుంది.తులసి ఆకులని మరిగించిన నీటితో స్నానం చేస్తే చర్మం పై రాషెస్ తగ్గుముఖం పడతాయి.జీలకర్ర, పంచదారని కలిపి నమిలితే కడుపు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.గ్లాసుడు నీళ్లలో పావు టీ స్పూన్ ఏలకుల పొడి కలుపుకుని తాగితే యూరినరీ ఇన్ఫెక్షన్ బాధ నుండి బయట పడవచ్చుఅల్లం ముక్కని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇందులో చిటికెడు జీలకర్ర పొడి, పంచదార కలిపి తింటే దగ్గు తగ్గుముఖం పడుతుంది. -
కొవ్వు పదార్థాలంటే ఎప్పుడూ చెడు చేసేవేనా?
విటమిన్స్టే చెడు చేస్తాయనే అపోహ చాలామందికి ఉంది. కొన్ని విటమిన్లు, అన్ని పోషకాలూ సమకూరాలంటే కొవ్వులు కావాల్సిందే! అవే ఏ, డి, ఈ, కే విటమిన్లు. అవి ఫ్యాట్ సొల్యుబుల్ విటమిన్స్. శరీరం బరువు తగ్గడానికి కూడా కొన్ని కొవ్వులు కావాలి. కాకపోతే కొవ్వుల్లో కొన్ని రకాలైన ట్రాన్స్ ఫ్యాట్స్, హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ని మాత్రం తగ్గించాలి. ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, ఒమెగా 6, ఒమెగా 9 ఫ్యాటీ ఆసిడ్స్ వంటి కొవ్వులు మేలు చేస్తాయి. ఈ తరహా కొవ్వు పదార్థాలు చేపల్లో, అవిశె నూనెలో ఉంటాయి. కొవ్వు పదార్థాలన్నీ చెడ్డవే అనుకునే చాలా మంది వాటిని తీసుకోవడం తగ్గిస్తారు. అలా అవసరమైనన్ని కొవ్వులు తీసుకోకపోవడం వల్ల కూడా చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని గుర్తించండి. అందుకే పూర్తిగా నిరాకరించకండి. అలాగని అధికంగా తీసుకోకండి. మితమెప్పుడూ హితమే. -
మన చేతిలోనే మన ఆరోగ్యం
మహబూబాబాద్ : మన ఆరోగ్యం మన చేతిలో ఉందని ప్రముఖ ఆరోగ్య సలహాదారుడు వీరమాచినేని రామకృష్ణారావు అన్నారు. స్థానిక గాంధీపార్క్లో ఆదివారం రాత్రి ‘మీ ఆరోగ్యం మీ చేతిలోనే..’ అనే అంశంపై ఉచిత అవగాహన సదస్సు జరిగింది. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ఆరోగ్య జాగ్రత్తల గురించి తెలిసినా నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్యలు తలెత్తుతాయని అన్నారు. ఆహార పదార్థాల్లో ఉన్న పోషకాలు, విటమిన్లపై అవగాహన పెంచుకోవాలని చెప్పారు. విటమిన్ డీ కలిగిన బలవర్ధకమైన ఆహారం గుడ్డు తినాలన్నారు. ఎమ్మెల్యే భానోత్ శంకర్నాయక్ మాట్లాడుతూ కోట్లాది రూపాయల ఆస్తుల కన్నా ఆరోగ్యం మిన్నా అన్నారు. కార్యక్రమంలో ఘనపురపు అంజయ్య, పి.పర్కాల శ్రీనివాస్రెడ్డి, డాక్టర్ డోలి సత్యనారాయణ, రామసాయం వెంకట్రెడ్డి, పిల్లి సతీష్, పిల్లి సుధాకర్, వద్దుల సరేందర్రెడ్డి, ప్రభాకర్రావు, బోడ్డుపెల్లి ఉపేందర్, వడ్డెబోయిన శ్రీనివాస్, కేదాస్ వాసుదేవ్ పాల్గొన్నారు. -
ఐక్యూ పెరగాలంటే?
సెల్ఫ్చెక్ జీవితంలో విజయవంతంగా ముందుకు పోవడానికి వివేకం, విచక్షణ చాలా అవసరం. ఇందుకు ఐక్యూ (ఇంటెలిజెన్స్ కోషెంట్) స్థాయిని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలి. పిల్లల్లో వివేక సూచిక (ఐక్యూ)ను పెంచడానికి మన వంతు ప్రయత్నం చేస్తున్నామా? 1. పిల్లల్లో, పెద్దవాళ్లలో, ఐక్యూ మెరుగుపడాలంటే ఆహారం కీలకం. ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్, ఫ్యాట్ తగిన మోతాదులో ఉన్న సమతుల ఆహారం తీసుకోవాలి. ఎ. అవును బి. కాదు 2. మెదడు చురుకుదనానికి దోహదం చేసే ఆహారం అందనప్పుడు ఆ లోటును భర్తీ చేసే ఒమేగా 3 ఆయిల్ క్యాప్సూల్స్ వంటి వాటిని డాక్టరు సలహా లేకుండా వాడకూడదని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 3. ఐక్యూ స్థాయి పెరగడానికి తగినంత నిద్ర తప్పనిసరి. ఎ. అవును బి. కాదు 4. కలత నిద్ర వల్ల మెదడు గ్రహించిన విషయాలను తాత్కాలికంగా నిల్వ చేసుకుని త్వరగా వదిలేస్తుంది. ఎ. అవును బి. కాదు 5. చెస్, సుడోకు వంటి ఇండోర్ గేమ్స్, పజిల్స్ పరిష్కరించడమనే హాబీలు ఐక్యూ స్థాయిని పెంచుతాయి. ఎ. అవును బి. కాదు 6. పిల్లలు కంప్యూటర్ గేమ్స్ ఆడేటప్పుడు వ్యూహాత్మ కంగా పావుల కదుపుతూ ఆడాల్సిన ఆటలనే ప్రోత్సహిస్తారు. ఎ. అవును బి. కాదు 7. చేతుల కదలికలు, మెదడు, కంటి చూపు... వీటి సమన్వయంతో ఆడగలిగిన టెన్నిస్, పింగ్పాంగ్, బ్యాడ్మింటన్ వంటి ఆటలు ఐక్యూ పెంచడానికి దోహదం చేస్తాయంటారు నిపుణులు. ఎ. అవును బి. కాదు 8. మెదడు చురుకుదనానికి ఆహారం, వ్యాయామం, విశ్రాంతి కూడా అవసరమని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే ఐక్యూ స్థాయి పెంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీకు తెలుసు. ‘బి’లు ఎక్కువగా వస్తే మీరు పిల్లల విషయంలో మీరు మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాళ్లు భవిష్యత్తులో మంచి ఫలితాలను సాధించగలుగుతారు. -
వెన్నతో వేయి లాభాలు!
గతంలో ఆహారాలలో వెన్నను బాగా వాడేవాళ్లం. రొట్టెలపైన వెన్న రాసుకుని తినేవాళ్లం. వేడి అన్నంలో వెన్నపూస వేసుకునే వాళ్లం. అయితే నూనెల వాడకం బాగా పెరిగాక వెన్న వాడకం తగ్గింది. కానీ నిజానికి వెన్న చాలా శ్రేష్ఠమైన, ఆరోగ్యకరమైన ఆహారం. ► వెన్నలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె2 చాలా ఎక్కువ. వాటితో పాటు ఇందులో బ్యుటిరేట్, కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్ఏ) అనే పోషకాలు ఉన్నాయి. ► వెన్నలోని బ్యుటిరేట్ అనే పోషకం అనేక మానసిక వ్యాధుల నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది. అంతేకాదు... ఇది మంచి శక్తివనరు. మన జీవక్రియలకు అవసరమైన శక్తిని ఇది సమకూరుస్తుంది. ► మనం తిన్న ఆహారం చిన్నపేగుల్లోకి ప్రవేశించాక... అక్కడ ఆ జీర్ణాహారం ఏమాత్రం వృథాపోకుండా అంతా ఒంటికి పట్టేలా చేస్తుంది వెన్నలోని బ్యుటిరేట్. దీనికి మరో సుగుణం కూడా ఉంది. చిన్న పేగుల్లో ఇన్ఫ్లమేషన్ను కూడా సమర్థంగా తగ్గిస్తుంది. ► వెన్నలోని బ్యుటిరేట్ పెద్ద పేగుల క్యాన్సర్ను సమర్థంగా నివారిస్తుంది. ► వెన్నలోని కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్ఏ) విషయానికి వస్తే – మనకు అవసరమైన పోషకాలలో దానికీ ఎంతో ప్రాధాన్యం ఉంది. గుండె ఆరోగ్యానికి అదెంతో మంచిది. నిజానికి చాలామంది వెన్న తినడం వల్ల కొవ్వు పెరిగి, గుండె ఆరోగ్యానికి అదంత మంచిది కాదని అనుకుంటారు. కానీ పరిమితమైన వెన్న వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ► వెన్నలో యాంటీఆక్సిడెంట్స్, ఒమెగా–3, ఒమెగా–6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువే. ఇవి వ్యాధి నిరోధకశక్తి పెంచేందుకు, అనేక క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పించేందుకు దోహదపడతాయి. ► చాలామందికి వెన్న వల్ల స్థూలకాయం వస్తుందనే అపోహ ఉంటుంది. కానీ పరిమితమైన వెన్న వల్ల స్థూలకాయుల్లో కొవ్వు పాళ్లు తగ్గుతాయి. వెన్న తిన్న తర్వాత ఉండే సంతృప్త భావన మితిమీరి తినడాన్ని ఆపుతుంది. ఆ చర్య ద్వారా బరువు పెరగకుండా చూస్తుంది. మరీ ముఖ్యంగా పొట్టలోని కొవ్వు తగ్గడానికి వెన్న దోహదపడుతుంది. ఇలా మన ఆహారంలో పరిమితంగా వెన్న తీసుకోవడం వల్ల కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు. అయితే వెన్నతో ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి కదా అని ఎక్కువగా తీసుకోవడం మాత్రం సరికాదు. రోజుకు 25 గ్రాములు మితం. -
రక్తహీనతను తగ్గించే ఖర్జూరాలు
గుడ్ఫుడ్ ఖర్జూరాల్లో అనేక విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలోని స్వాభావికమైన చక్కెరలైన గ్లూకోజ్, ఫ్రక్టోజ్లకు తక్షణం శక్తిని అందజేసే గుణం ఉంది. ఖర్జూరాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్ని... ఖర్జూరాలు కొలెస్ట్రాల్ పాళ్లను తగ్గిస్తాయి. అందువల్ల గుండెకు మేలు చేస్తాయి, స్థూలకాయాన్ని నివారిస్తాయి. పొటాషియమ్ పుష్కలంగా ఉన్నందున పక్షవాతం వంటి జబ్బులను నివారిస్తాయి. వీటిల్లో విటమిన్ బి1, బి2, బి3, బి5, విటమిన్– ఏ, విటమిన్–సి పుష్కలంగా లభిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తింటే విటమిన్ సప్లిమెంట్స్ అవసరం రాదనడం అతిశయోక్తి కాదు. సెలేనియమ్, మ్యాంగనీస్, కాపర్, మెగ్నీషియమ్ పుష్కలంగా ఉన్నందున ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. దంతాలను సంరక్షిస్తాయి. ఖర్జూరాల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనత తగ్గుతుంది. ఇవి జీర్ణశక్తితో పాటు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. అంతే కాదు... మలబద్దకాన్ని కూడా నివారిస్తాయి. -
బలవర్ధకమైన ఆహార ధాన్యం
తిండి గోల భారతదేశంలో ఎక్కువగా పండించే ధాన్యాలలో గోధుమలు ఒకటి. భారతదేశంతోబాటు చైనా, అమెరికా, రష్యాలలో కూడా గోధుమలను విస్తారంగా పండిస్తారు. గోధుమలను, గోధుమపిండిని ప్రపంచ వ్యాప్తంగా వాడతారు. కొన్ని దేశాలలో అయితే గోధుమలే వారి ప్రధాన ఆహారం. మనదేశంలో దీన్ని ఉత్తర భారతదేశంలో ఎక్కువగా పండిస్తారు. పండిన దానిలో వారే ఎక్కువగా వినియోగిస్తారు. కారణం గోధుమ పిండితో చేసిన రొట్టెలు వారి ప్రధాన ఆహారం. గోధుమ గడ్డిని పశుగ్రాసంగా వాడతారు. ఇళ్ల పైకప్పుగా వాడతారు. గోధుమ గడ్డి నుంచి తీసిన రసం ఆరోగ్యానికి చాలా మంచిది. గోధుమ రవ్వతో ఉప్మా చేస్తారు. లడ్డూలు కూడా చేస్తారు. బ్రెడ్ తయారీకి కూడా గోధుమలే వాడతారు. అంతేకాదు, అత్యంత బలవర్ధకమైన ఆహారం గోధుమలు. ఎదిగే పిల్లలకు గోధుమలు ఎంతో ఉపయోగపడతాయి. ఎముకల పెరుగుదలకు, రక్తహీనతకు, మలబద్ధకానికి ఆయుర్వేదంలో గోధుమలను ఉపయోగించి రకరకాల ఔషధాలను తయారు చేస్తారు. గోధుమలలో బీకాంప్లెక్స్ విటమిన్లు, ప్రొటీన్లు, పీచుపదార్థాలు ఉంటాయి. గోధుమ లడ్డూలు ఎంతో రుచికరమైన చిరుతిండి. భిన్నమైన వాదనలు వినిపిస్తున్నప్పటికీ బరువు తగ్గాలనుకునేవారు ఒకపూట అన్నం తినడం మాని గోధుమ రొట్టెలను తినడం మనకు అనుభవంలో ఉన్నదే. గోధుమలను నూనె లేదా నీరు లేకుండా ఒక మూకుడులో వేసి మాడ్చి చూర్ణం చేసి పూటకు పదిగ్రాముల చొప్పున రోజూ రెండుపూటలా తేనెతో కలిపి తింటూ ఉంటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయని ఆయుర్వేద వైద్యచిట్కా. -
మేలు మామిడి
గుడ్ ఫుడ్ మార్కెట్లోకి మామిడిపండ్లు విరివిగా వస్తున్నాయి. వాటికి సీజన్ ఇది. బంగారపు రంగులో మిసమిసలాడే ఈ పండ్లు నిజంగానే బంగారమంటున్నారు పరిశోధకులు. మామిడిలో ఏమేముంటాయి: చిన్న కప్పు మామిడి ముక్కల్లో 100 క్యాలరీల శక్తి ఉంటుంది. దీనిలో ఒక గ్రాము ప్రోటీన్లు, 0.5 గ్రాముల కొవ్వులు, 25 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 23 గ్రాముల చక్కెర, 3 గ్రాముల పీచు, ఒక రోజుకు ఒక మనిషికి అవసరమైనన్ని విటమిన్లు ఉంటాయని ఒక అంచనా. మామిడి ప్రయోజనాలు ⇒మామిడి పెద్దపేగుకు క్యాన్సర్ వచ్చే అవకాశాలను సమర్థంగా నివారిస్తుంది. ⇒కంటిచూపును దెబ్బతీసే జబ్బు ‘మాక్యులార్ డీజనరేషన్’ ముప్పును తప్పించగల శక్తి దీని సొంతం. ⇒మామిడిలో పీచు పదార్థం ఎక్కువ కాబట్టి మలబద్ధకానికి ఇది స్వాభావికమైన మందుగా పరిగణించవచ్చు. ⇒కంటిచూపును మెరుగుపరిచేందుకు అవసరమైన బీటా–కెరటిన్ మామిడిలో పుష్కలంగా ఉంటుంది. ⇒మామిడిలోని బీటా కెరొటిన్ పోషకమే ప్రోస్టేట్ క్యాన్సర్తో పాటు... రొమ్ము, లుకేమియా వంటి అనేక క్యాన్సర్ల నివారణకూ తోడ్పడుతుంది. ⇒మామిడిలో ఉండే పొటాషియమ్ కారణంగా అది గుండెజబ్బుల (కార్డియో వాస్క్యులార్ డిసీజెస్)నూ, రక్తపోటునూ నివారిస్తుంది. -
రుచిక్కుళ్ళు
చక చకా మార్కెట్కు వెళ్లి... చిక చికా వచ్చేయండి! ‘నోరు తిరగట్లేదు... ఏంటీ చక చక... చిక చికా’ అనుకుంటున్నారా! అదేనండీ... చిక్కుళ్ళతో వచ్చేయండి. చిక్కుడు వండాలంటే నోరు తిరగనక్కర్లేదు. చేయి తిరగనక్కర్లేదు! చాలా ఈజీ! చలికాలం... చిక్కుళ్ళ సీజన్! చీప్ అండ్ బెస్ట్! చిక్కుళ్ళు తెచ్చేయండి... చిక్కులు లేకుండా వండేయండి. చిక్కగా, చక్కగా... ఎంజాయ్ చేయండి. ప్రొటీన్లు, విటమిన్లు, ఫైబర్... అంతా... గాడ్స్ ఓన్ ప్యాకేజీ చిక్కుళ్ళు! చిక్కుడుకాయ మెంతికూర కావల్సినవి: చిక్కుడుకాయ - పావుకేజీ, మెంతికూర - పెద్ద కట్ట (2 కప్పులు), ఉల్లిపాయ - 1 , పచ్చి మిర్చి - 2, అల్లం,వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్, నూనె - టేబుల్ స్పూన్, ఆవాలు - టీ స్పూన్, మినప్పప్పు - టీ స్పూన్, జీలకర్ర - అర టీ స్పూన్, ఎండుమిర్చి - 2 (మధ్యకు విరవాలి), పసుపు - పావు టీ స్పూన్, ఉప్పు - తగినంత, కారం - పావు టీ స్పూన్ తయారీ: చిక్కుడు కాయలను, మెంతికూరను శుభ్రం చేసి, సిద్ధంగా ఉంచుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టి, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. అల్లం - వెల్లుల్లి పేస్ట్, చిక్కుడు కాయల ముక్కలు వేసి కలపాలి. ఉప్పు, పసుపు, అర కప్పు నీళ్లు పోసి, పైన మూత పెట్టి ఉడికించాలి. పది నిమిషాల తర్వాత మంట తగ్గించి, నీళ్లన్నీ తగ్గేంత వరకు ఉంచాలి. దీంట్లో మెంతి ఆకులు, కారం వేసి కలపాలి. కూర పొడిగా అయ్యేంత వరకు ఉంచి దించాలి. చిక్కుడుకాయ కుడుములు కావల్సినవి: చిక్కుడుకాయలు - పావుకేజీ, పచ్చి మిర్చి - 4 , ఉల్లిపాయలు - 2 , బియ్యప్పిండి - కప్పు (తగినంత), కొత్తిమీర - గుప్పెడు, ఉప్పు - తగినంత, వెల్లుల్లి తరుగు - టీ స్పూన్, నూనె - టీ స్పూన్ తయారీ: చిక్కుడు కాయ నార తీసి, ముక్కలు చేయాలి. గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి, చిక్కుడు కాయ వేసి ఉడికించి, పక్క నుంచాలి.పచ్చిమిర్చి, ఉప్పు కలిపి ముద్దగా నూరాలి. ఉల్లిపాయలు సన్నగా తరగాలి. ఉడికించిన చిక్కుడు కాయ రుబ్బుకోవాలి. గిన్నెలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చిక్కుడు కాయ ముద్ద, బియ్యప్పిండి, ఉప్పు, కొత్తిమీర, వేసి బాగా కలపాలి. చిన్న చిన్న ఉండలు తీసుకొని, అదిమి, ఇడ్లీ ప్లేట్కు నూనె రాసి, దాంట్లో ఈ మిశ్రమాన్ని ఉంచాలి. పాత్ర అడుగున కొద్దిగా నీళ్లు పోసి, పైన సిద్ధంగా ఉంచిన ఇడ్లీ ప్లేట్ పెట్టి, మూత ఉంచాలి. పొయ్యి మీద 15 నిమిషాలు ఉడికించాలి. ఉడికించే ముందు మిశ్రమం పైన జీడిపప్పులు అలంకరించవచ్చు. ఉడికిన చిక్కుడు కుడుములను టొమాటో పచ్చడి, కెచప్తో వడ్డించాలి. చిక్కుడుకాయ గుడ్డుకూర కావల్సినవి: చిక్కుడు కాయలు - పావు కేజీ, ఉల్లిపాయలు - 1 (సన్నగా తరగాలి), టొమాటో - 1 (సన్నగా తరగాలి), మునక్కాడ - 1 (మూడు అంగుళాల పొడవున కట్ చేసుకోవాలి), పచ్చి మిర్చి - 2 (అంగుళం సైజు ముక్కలుగా కట్ చేయాలి), జీలకర్ర - అర టీ స్పూన్, అల్లం - వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూన్, కారం - టీ స్పూన్ (తగినంత), పసుపు - పావు టీ స్పూన్, ధనియాల పొడి - టీ స్పూన్, ఉప్పు - తగినంత, నూనె - టేబుల్ స్పూన్ + టీ స్పూన్, ఉడికించిన గుడ్లు - 3, కొత్తిమీర తరుగు - టీ స్పూన్ తయారీ: చిక్కుడుకాయ రెండు వైపులా తొడిమ, నార తీసి, 2 అంగుళాల పొడవున కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, టొమాటో, పచ్చిమిర్చి, మునక్కాడలు సిద్ధంగా ఉంచాలి. మందపాటి గిన్నె లేదా కడాయి పొయ్యి మీద పెట్టి నూనె వేసి వేడి చేయాలి. దీంట్లో చిటికెడు ఉప్పు, పసుపు, కారం వేసి కలిపి, ఉడికించిన గుడ్లు వేసి 2-3 నిమిషాలు సన్నని మంట మీద వేయించి, తీసి పక్కనుంచాలి. అదే గిన్నెలో మిగిలిన నూనె కూడా వేసి వేడయ్యాక జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, మునక్కాయలు వేసి వేయించాలి. ఇవి దోరగా వేగాక అల్లం - వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత చిక్కుడుకాయ ముక్కలు వేసి మరో 2-3 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి. దీంట్లో కారం, ధనియాలపొడి, పావు కప్పు నీళ్లు పోసి ఉడికించాలి. 4 నిమిషాల తర్వాత టొమాటో ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. టొమాటో ముక్క ఉడికి, కూర చిక్కబడేంతవరకు ఆగి, వేయించిన గుడ్లు వేసి కలిపి దించాలి. చివరగా కొత్తిమీర చల్లుకోవచ్చు. చిక్కుడుకాయ పలావ్ కావల్సినవి: చిక్కుడు గింజలు - పావు కేజీ, బాస్మతి బియ్యం - 2 కప్పులు, నూనె - 3 టేబుల్ స్పూన్లు, యాలకులు - 6, లవంగాలు - 4, సాజీరా - అర టీ స్పూన్, బిర్యానీ ఆకులు - 3, దాల్చిన చెక్క - చిన్న ముక్క, పుదీనా ఆకులు - కప్పు, మెంతి ఆకులు - అర కప్పు , ఉల్లిపాయ - 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్, పచ్చి మిర్చి - 6 (సన్నగా చీల్చాలి), నీళ్లు - 4 కప్పులు, కొత్తిమీర - అలంకరణకు తగినంత తయారీ: చిక్కుడు గింజలలో నీళ్లు పోసి, ఉడికించి, వార్చి పక్కనుంచాలి. (చిక్కుళ్లు పై పొర వచ్చేలా ఉడికించాలి.) బియ్యం కడిగి, నీళ్లు పోసి అరగంటపాటు నాననివ్వాలి. మసాలా దినుసులు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి - అన్నీ కట్ చేసి సిద్ధంగా ఉంచాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి, నూనె పోసి వేడి చేయాలి. దీంట్లో సాజీర, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. దీంట్లో పుదీనా, మెంతి ఆకులు వేసి కలపాలి. ఉల్లిపాయలు వేసి బాగా వేగాక అల్లం - వెల్లుల్లి పేస్ట్, పచ్చి మిర్చి వేసి కలపాలి. దీంట్లో ఉడికించిన బీన్స్ వేయాలి. ఉప్పు, నానబెట్టిన బియ్యం వేసి ఉడికించాలి. నీళ్లనీ పూర్తిగా ఇంకిపోయి అన్నం ఉడికాక మంట తగ్గించాలి. మరో 5 నిమిషాలు ఉడికించి, చివరగా కొత్తిమీర చల్లి దించాలి. దీనిని ఏదైనా నచ్చిన గ్రేవీతో లేదా రైతాతో వడ్డించాలి. చిక్కుడుకాయ బెల్లంకూర కావల్సినవి: చిక్కుడు కాయ - పావు కేజీ, బెల్లం లేదా పంచదార - 2 టీ స్పూన్లు, ఉల్లిపాయలు - 2 (సన్నగా తరగాలి), పచ్చి మిర్చి - 1 (సన్నగా తరగాలి), వెల్లుల్లి రెబ్బలు - 8 (కచ్చాపచ్చాగా దంచాలి), కరివేపాకు - 2 రెమ్మలు, జీలకర్ర - టీ స్పూన్, మినప్పప్పు - టీ స్పూన్, కారం - టీ స్పూన్, ధనియాల పొడి - టీ స్పూన్, జీలకర్ర పొడి - పావు టీ స్పూన్, కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూన్, ఉప్పు - తగినంత తయారీ: చిక్కుడుకాయలను శుభ్రం చేసి, ముక్కలు చేయాలి. గిన్నెలో 2 కప్పుల నీళ్లు పోసి, చిక్కుడుకాయలను ఉడికించి దించాలి.బాణలిలో 2 టేబుల్స్పూన్ల నూనె వేసి, వేడయ్యాక జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, వెల్లుల్లి వేసి వేయించాలి. దీంట్లో ఉల్లిపాయలు వేసి వేగాక, కారం, ధనియాల పొడి, జీలకర్రపొడి, బెల్లం లేదా పంచదార వేసి కలపాలి. ఉడికిం చిన చిక్కుళ్ళు వేసి కలిపి, 10 నిమిషాల సేపు ఉంచి, కొత్తిమీర చల్లి దించాలి. -
పాలిష్ పట్టిన బియ్యంలో లోపించే విటమిన్?
విటమిన్లను మొట్టమొదట ఫంక్ కనుగొన్నాడు. విటమిన్లు రెండు రకాలు అవి.. 1. కొవ్వులో కరిగే విటమిన్లు 2. నీటిలో కరిగే విటమిన్లు ఎ, డి, ఇ, కె విటమిన్లు కొవ్వులో కరుగుతాయి. ఇవి కాలేయంలో నిల్వ ఉంటాయి. నీటిలో కరిగే బి, సి విటమిన్లు దేహంలో నిల్వ ఉండవు. విటమిన్ ఎ రసాయన నామం- రెటినాల్ విటమిన్ ఎకు ఉన్న మరో పేరు యాంటీ జిరాఫ్తాల్మిక్ విటమిన్ విటమిన్ ఎ కంటిలో ఉండే రొడాప్సిన్ అనే వర్ణక పదార్థాన్ని సంశ్లేషణ చేయడానికి తోడ్పడుతుంది. మొక్కల్లో విటమిన్ అ.. ఛ కెరోటిన్ రూపంలో లభ్యమవుతుంది. కాలేయం ఛ కెరోటిన్ను విటమిన్ అగా మారుస్తుంది. విటమిన్ అ అధికంగా లభించే మొక్కలు.. ఆకుకూరలు, బొప్పాయి, మామిడి, మునగ, ఎర్రగుమ్మడి జంతువుల్లో విటమిన్ అ అధికంగా లభించేవి - పాలు, గుడ్లు, మాంసం, లివర్. ముఖ్యంగా షార్క లివర్ ఆయిల్, కాడ్ లివర్ ఆయిల్ విటమిన్ అ లోపం వల్ల వచ్చే వ్యాధులు: - రేచీకటి (నైక్ట్టాలోపియా) - జిరాఫ్తాల్మియా (పొడికన్ను), కెరటో మలేసియా విటమిన్ అ కాలేయంలో నిల్వ ఉంటుంది రేచీకటి: దీన్నే నైక్ట్టాలోపియా అంటారు. దీని వల్ల కాంతి తక్కువగా ఉన్నప్పుడు సరిగ్గా కనిపించదు. జిరాఫ్తాల్మియా: కంటిలో కన్నీటిని స్రవించే లాక్రిమల్గ్రంథులు ఎండిపోతాయి. ఫలితంగా కను గుడ్లు పొడిగా మారతాయి. విటమిన్ అ ఎపిథీలియల్ కణాలను ఆరోగ్యం గా ఉంచుతుంది. అందువల్లే ఫేస్ క్రీముల్లో విటమిన్ అను కూడా కలుపుతారు. విటమిన్ అ లోపం వల్ల చర్మం గరుకుగా మారుతుంది. విటమిన్ అ లోపం ప్రత్యుత్పత్తి వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. విటమిన్ డి రసాయన నామం- కాల్సీఫెరాల్ విటమిన్ ఇ రసాయన నామం- టోకోఫెరాల్ విటమిన్ కె రసాయన నామం - నాఫ్తోక్వినోన్ లేదా ఫిల్లోక్వినోన్ విటమిన్ సి రసాయన నామం - ఆస్కార్బిక్ ఆమ్లం విటమిన్ బి1 రసాయన నామం - థయమిన్ విటమిన్ బి2 రసాయన నామం - రిబోఫ్లేవిన్ విటమిన్ బి3 రసాయన నామం - నియాసిన్ లేదా నికోటినిక్ ఆమ్లం విటమిన్ బి5 రసాయన నామం - పాంటోథెనిక్ ఆమ్లం విటమిన్ బి6 రసాయన నామం - పైరిడాక్సిన్ విటమిన్ బి12 రసాయన నామం - సయనోకోబాలమిన్ విటమిన్ బి7 రసాయన నామం - బయోటిన్ విటమిన్ బి9 రసాయన నామం - ఫోలిక్ ఆమ్లం విటమిన్ అకి ఉన్న మరొక పేరు - యాంటీ జిరాఫ్తాల్మిక్ విటమిన్ విటమిన్లు - మారు పేర్లు విటమిన్ డి - సన్షైన్ విటమిన్, యాంటీ రికెట్స్ విటమిన్ విటమిన్ ఇ - బ్యూటీ విటమిన్, యాంటీ స్టెరిలిటీ విటమిన్ విటమిన్ కె - కొయాగ్యులేషన్ విటమిన్, యాంటీ హేమరేజిక్ విటమిన్, యాంటీ బ్లీడింగ్ విటమిన్ విటమిన్ బి1 - యాంటీ బెరిబెరి విటమిన్ విటమిన్ బి2 (రిబోఫ్లేవిన్) - విటమిన్ జి, వోవో ఫ్లేవిన్ (ౌఠిౌ జ్చఠిజీ) విటమిన్ బి3 (నియాసిన్) - యాంటీ పెల్లాగ్రా విటమిన్ విటమిన్ సి - యాంటీ స్కర్వీ విటమిన్ విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధులు: 1. రికెట్స్ (ఎక్కువగా చిన్న పిల్లల్లో) 2. ఆస్టియో మలేసియా (ఎక్కువగా యువతీ, యువకుల్లో) 3. ఆస్టియోపీనియా (వృద్ధుల్లో కండరాలు, ఎముకలు బలహీనపడటం) విటమిన్ ఇ లోపం వల్ల వచ్చే సమస్యలు 1. మగవారిలో వంధ్యత్వం కలిగి, శుక్ర కణాల ఉత్పాదన జరగదు. 2. ఆడవారిలో గర్భస్రావాలు జరుగుతాయి. 3. వంధ్యత్వం కలుగుతుంది. విటమిన్ కె: రక్తం త్వరగా గడ్డకట్టడానికి ఉపయోగపడుతుంది. ఈ విటమిన్ను శస్త్ర చికిత్సకు ముందు రోగులకు ఇస్తారు. విటమిన్ కె లోపం వల్ల రక్తం గడ్డకట్టదు. దాంతో అధిక రక్తస్రావం జరుగుతుంది. విటమిన్ కె రక్త స్కంధనానికి తోడ్పడుతుంది. విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి స్కర్వీ విటమిన్ సి... వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వేడి చేస్తే విచ్ఛిన్నమయ్యే విటమిన్ - విటమిన్ సి గాయాలు త్వరగా మానేందుకు సహాయపడే విటమిన్ - విటమిన్ సి ఉసిరి, జామకాయ, నిమ్మ, నారింజ వంటి పుల్లగా ఉండే ఫలాల్లో ఎక్కువగా ఉండేది - విటమిన్ సి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచే విటమిన్ -విటమిన్ సి స్కర్వీ వ్యాధి లక్షణాలు: చిగుళ్లు వాచి రక్తం కారడం విటమిన్ బి1 (థయమిన్) లోపం వల్ల వచ్చే వ్యాధి - బెరిబెరి విటమిన్ బి1 లోపం వల్ల పక్షుల్లో వచ్చే వ్యాధి - పాలీన్యూరైటిస్ బియ్యం పొట్టు తీయడం లేదా పాలిష్ చేయడం వల్ల కోల్పోయే విటమిన్ - థయమిన్ తవుడులో అధికంగా ఉండే విటమిన్ - థయమిన్ చాలా రకాల ధాన్యాల్లో థయమిన్ పైపొరల్లోనే ఉంటుంది. మర పట్టినప్పుడు ఈ పొరలు పోతాయి. అందుకే తెల్లని పాలిష్ పట్టిన బియ్యంతో వండిన అన్నం తినే వాళ్లలో థయమిన్ లోపం ఏర్పడుతుంది. ఉప్పుడు బియ్యం, దంపుడు బియ్యం తినే వాళ్లకు ఈ జబ్బులు రావు. థయమిన్ లోపం వల్ల గుండె సామాన్యంగా ఉండే సైజు కంటే పెద్దగా అవుతుంది. దీన్నే కార్డియో మెగాలి అంటారు. గుండె నీరసంగా కొట్టుకొని కాళ్లలో వాపు వస్తుంది. కాఫీలు, టీలు, వక్కపొడి, జర్దా ఎక్కువగా తీసుకుంటే మనం తీసుకొనే ఆహారంలో ఉన్న థయమిన్ శరీరంలోని కణాలకు అందదు. ఆయా పదార్థాల్లో ఉండే రసాయన పదార్థాలు థయమిన్ను పనికి రాకుండా చేస్తాయి. ఆల్కహాల్ ఎక్కువగా సేవించే వారిలో థయమిన్ లోపం ఉంటుంది. విటమిన్ బి2 (రిబోఫ్లేవిన్) పాలు, గుడ్లు, కాలేయం, ఆకుకూరల్లో లభిస్తుంది. ఈ విటమిన్ నోటిపూతను అరికడుతుంది. విటమిన్ బి7 (బయోటిన్)ను దీన్నే విటమిన్ హెచ్ అని కూడా అంటారు. ఈ విటమిన్ను జుట్టు, గోర్లు బాగా పెరగడానికి డాక్టర్లు సిఫార్సు చేస్తారు. బయోటిన్ను పలు సౌందర్య ఉత్పత్తుల్లో వాడుతున్నారు. ఉడకబెట్టని పచ్చి గుడ్డును ఆహారంగా తీసుకునే వారిలో బయోటిన్ లోపం ఏర్పడుతుంది. బయోటిన్ లోపం వల్ల అలోపేసియా (జుట్టు ఊడిపోవడం) కలుగుతుంది. కనుబొమ్మలపై వెంట్రుకలు రాలిపోవడం, గోర్లకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. విటమిన్ బి12 లోపం వల్ల వచ్చే వ్యాధి - పెర్నీషియస్ అనీమియా ఫ్రీరాడికల్స్ ప్రభావం నుంచి రక్షించే విటమిన్ - విటమిన్ ఉ విటమిన్ ఉను శిశు జనన కారకం అంటారు. విటమిన్ ఉ-చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. క్రీడా సామర్థ్యాన్ని పెంచుతుంది. విటమిన్ డి అధికంగా ఉండే ఆహార పదార్థాలు: సార్ట్టైన్ చేపలు, పాలు, గుడ్లు, కాడ్లివర్ ఆయిల్, ట్యూనా చేపలు, పుట్ట గొడుగులు విటమిన్ ఉ అధికంగా లభించే ఆహార పదార్థాలు: బాదం, నువ్వులు, గుమ్మడి కాయ గింజలు, ప్రొద్దుతిరుగుడు గింజలు, వేరుశనగ, అవకాడో. విటమిన్ కె అధికంగా లభించే ఆహార పదార్థాలు: ఆకుకూరలు, క్యాబేజి, బ్రకోలి-పేగుల్లో ఉన్న బ్యాక్టీరియా విటమిన్ కెను ఉత్పత్తి చేస్తుంది. విటమిన్ బి1 (థయమిన్) అధికంగా లభించే పదార్థాలు: గోధుమ వంటి ధాన్యాలు, నువ్వు గింజలు, పాలు, మాంసం, వేరుశనగ గింజలు, చేపలు, గుడ్లు. విటమిన్ బి2 అధికంగా లభించే పదార్థాలు: పాలు, గుడ్లు, ఆకుకూరలు. విటమిన్ బి12 - సయనోకోబాలమిన్: ఆహార పదార్థాల్లో లభించదు. పేగుల్లోని బ్యాక్టీరియాలు దీన్ని సంశ్లేషణ చేసి శరీరానికి అందిస్తాయి. -
ఏదీ లోపించినా నష్టమే
– వరిలో పోషకాల ప్రాధాన్యంపై నిపుణుల అభిప్రాయం – డాట్ సెంటర్ కో–ఆర్డినేటర్ సుజాతమ్మ సూచనలు కర్నూలు(అగ్రికల్చర్) : మొక్కల సమర్థ పెరుగుదల, అధిక దిగుబడికి అనేక రకాల పోషకాలు అవసరం. ఉదజని, ఆక్సిజన్, నత్రజని, భాస్వరం, పొటాష్ తదితర ప్రధాన పోషకాలు, కాల్షియం, మెగ్నీషియం, గంధకంలాంటి ద్వితీయ పోషకాలతోపాటు ఇనుము, మాంగనీసు, కాపర్, జింక్, బోరాన్, క్లోరిన్ మొదలైన సూక్ష్మపోషకాలు వరి పంటకు అవసరం. ఇవన్ని కావాల్సినంతగా పైరుకు అందితేనే ఆశించిన మేరకు దిగుబడులు వస్తాయని డాట్ సెంటర్ శాస్త్రవేత్త కో–ఆర్డినేటర్ డాక్టర్ పి.సుజాతమ్మ(99896 23810) తెలిపారు. వరిలో పోషకాల లోపం, నివారణపై ఆమె రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. – నత్రజని.. పంట పెరుగుదల, పిలకల సంఖ్య, వెన్నులో గింజలవద్ధి, మాంసకత్తుల తయారీలో కీలకం. ఇదిలోపిస్తే ముందుగా ముదురు ఆకులు తర్వాత పైరంతా పసుపు రంగుకు మారుతుంది. పైరు పెరుగుదల తక్కువగా ఉండి గిడసబారుతుంది. నివారణ కోసం ఎకరాకు 92 కిలోల నత్రజనిని 3 సమభాగాలుగా చేసి విత్తు, దుబ్బు, అంకురం దశలో అందించాలి. – భాస్వరం .. వేర్ల పెరుగుదల, జీవ రసాయన ప్రక్రియలు, గింజ పరిపక్వతకు ఇది అవసరం. దీనిలోపంతో వేర్లు, మొక్కల పెరుగుదల తగ్గి ఆకులు సన్నగా, చిన్నగా కనిపిస్తాయి. నివారణకు సేంద్రీయ ఎరువులతో పాటు సిఫారసు మేరకు ఎకరాకు 32 కిలోల భాస్వరాన్నిచ్చే ఎరువులను దుక్కిలో వేసుకోవాలి. – పొటాషియం.. చీడపీడలు, చలి తట్టుకుని మొక్కలు దఢంగా, బలంగా పెరిగి గింజలు నిండుగా రావడానికి పొటాషియం తోడ్పడుతుంది. దీనిలోపంతో ఆకుల అంచులు గోధుమ రంగుకు మారి మచ్చలు ఏర్పడతాయి. చివర్లు అంచుల నుంచి ఎండిపోతాయి. లోపాల సవరణకు వరిగడ్డి లాంటి పంట వ్యర్థాలు వాడుతూ సిఫారసు మేరకు ఎకరాకు 32 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను బరువు నేలల్లో దమ్ములో, తేలిక నేలల్లో దమ్ములో సగం, మిగిలిన సగం చిరుపొట్ట దశలో వేయాలి. – గంధకం .. పత్రహరిత నిర్మాణంలో కిరణజన్య సంయోగక్రియ, అమైనో ఆమ్లాల తయారీలో గంధకం ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇదిలోపిస్తే లేత ఆకులు పచ్చదనాన్ని కోల్పోతాయి. పిలకలు తగ్గి మొక్కలో పెరుగుదల లోపిస్తుంది. సవరణకు సేంద్రీయ ఎరువులు, గంధకం కల్గిన రసాయన ఎరువులను దమ్ములో వేసుకోవాలి. -
మాంసం కొనేటప్పుడు జాగ్రత్తసుమా!
రాయవరం : ఇటీవలి కాలంలో మాంసం వినియోగం పెరుగుతోంది. మాంసంలో అధికంగా మాంసకృత్తులు, విటమిన్లు, కొవ్వు పదార్థాలు అధికంగా లభించడమే దీనికి కారణం. వీటిని కొనుగోలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొనకపోతే వ్యాధులబారిన పడే అవకాశం ఉంటుందని రాయవరం పశువైద్యశాల సహాయ సంచాలకుడు డాక్టర్ ఎం.రామకోటేశ్వరరావు హెచ్చరిస్తున్నారు. మాంసం నాణ్యతను, మాంసం నిల్వ అయితే కలిగే మార్పులను గమనించి కొనుగోలు చేయాలంటున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. మాంసం నాణ్యత రంగు, మెత్తదనం, రుచి, వాసన, నీటిని పీల్చే గుణాన్నిబట్టి మాంసం నాణ్యతను నిర్ధారించవచ్చు. సాధారణంగా మాంసం ఎరుపు రంగులో ఉంటుంది. గొడ్డు మాంసం ముదురు ఎరుపు రంగులోను, మేక, గొర్రె మాంసం మధ్యస్థ ఎరుపు రంగులోను, పంది మాంసం తెలుపు రంగులోను ఉంటుంది. చిన్న వయసు ఉన్న పశువు మాంసంతో పోలిస్తే పెద్ద వయసు ఉన్న పశువు మాంసం ఎక్కువ ఎరుపు రంగులో ఉంటుంది. నీటిని పీల్చే గుణం లేత వయసు పశువు మాంసంలో ఎక్కువగా ఉంటుంది. నిల్వ ఉంచిన మాంసానికి నీటిని పీల్చుకునే గుణం తగ్గుతుంది. మెత్తదనం అనేది కండరాలను కలిపే కణజాలంవల్ల కలుగుతుంది. చిన్న వయసు పశువులతో పోలిస్తే పెద్ద వయసు పశువుల్లో ఈ కణజాలం తక్కువగా ఉండి మాంసం గట్టిగా ఉంటుంది. ప్రతి జంతువు మాంసానికి ఒక ప్రత్యేకమైన వాసన ఉంటుంది. దానినిబట్టి మాంసాన్ని గుర్తించవచ్చు. మాంసం నిల్వ అయితే కలిగే మార్పులు * మాంసాన్ని సక్రమంగా నిల్వ చేయకుంటే కొన్ని మార్పులు జరిగి పాడైపోతుంది. సూక్ష్మజీవులు, శిలీంధ్రాల మూలంగా మాంసంలోని కొవ్వులు, మాంసకృత్తులు విచ్ఛిన్నమై కొన్ని మార్పులు జరుగుతాయి. * సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు జరిపే చర్యల వల్ల బ్యుటరిక్, ప్రొపియోనిక్లు ఏర్పడి మాంసానికి చెడు వాసన కలుగుతుంది. * నిల్వ మూలంగా సూక్ష్మజీవులు స్రవించే రంగుల వలన మాంసం ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోకి మారుతుంది. * సూడోమోనాస్, స్ట్రెప్టోకోకస్, లాక్టోబాసిల్లస్ వంటి బాక్టీరియాల వల్ల మాంసంపై పలుచని జిగురు వంటి పొర ఏర్పడుతుంది. * మాంసంపైన శిలీంధ్రాల వల్ల నలుపు, తెలుపు, ఆకుపచ్చని మచ్చలు, రంగు మచ్చలు ఏర్పడతాయి. * మాంసంలోని సల్ఫర్ పదార్థాలు విచ్ఛిన్నమవడం వలన హైడ్రోజన్ సల్ఫేట్, ఇతర మార్పుల వల్ల కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతాయి. * పాడైపోయినప్పుడు ఉత్పత్తి అయిన ఆమ్లాల వలన మాంసం పుల్లగా మారుతుంది. * కొవ్వు పదార్థాల విచ్ఛిన్నం జరిగి ఒక రకమైన వాసన వస్తుంది. దీనినే ‘రేన్సిడ్’ వాసన అంటారు. * ప్రొటీన్లు విచ్ఛిన్నం జరిగితే చేదు రుచి, చెడు వాసన కలుగుతాయి. * ఫాస్ఫోరిసాన్నే అంటారు. * కొన్నిసార్లు ఎముక దగ్గరి మాంసం పాడైపోతుంది. -
భారీగా ధర తగ్గనున్న మందులు ఇవే..
న్యూఢిల్లీ: మన దైనందిన జీవితంలో ఉపయోగించే కొన్ని మందుల ధరలు భారీగా తగ్గనున్నాయి. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రై సింగ్ అథారిటీ (ఎన్పీపీఎ) తాజాగా నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. యాంటీబయాటిక్స్, యాంటీఇన్ఫ్క్టివ్స్, అనాల్జేసిక్స్, విటమిన్ మందులు, యాంటీఫంగల్ మందులతో కూడిన మొత్తం 100కుపైగా మందుల రేట్లు 3 శాతం మేర తగ్గనున్నాయి. దీంతో గత ఏడాది 4 శాతం పెరిగిన ఈ మందులు ప్రస్తుతం తిరిగి మామూలు ధరకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిర్ణయించిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని వీటికి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే ఏప్రిల్ 15లోగా ఎన్పీపీఏ తెలియజేయాలని ఎన్పీపీఏ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే మార్కెట్లోకి విడుదలై ఎక్కువ రేటును ముద్రించి ఉన్న మందుల డబ్బును సంబంధిత కంపెనీలు డీలర్లకు తిరిగి అందిస్తాయని తెలిపారు. కాగా భారతీయ ఫార్మాస్యూటికల్ మార్కెట్ విలువ లక్ష కోట్ల రూపాయలు. ఎన్పీపీఏ ప్రకటించిన జాబితాలో ఉన్న మందుల సంవత్సర ఆదాయం రూ.4,839కోట్లు కాగా, రేట్లు తగ్గిన కారణంగా రూ.647 కోట్ల ఆదాయన్ని కంపెనీలు కోల్పోనున్నాయి. వీటిలో కేవలం గుండె సంబంధిత వ్యాధుల మందులు రూ.250 కోట్లను కోల్పోనున్నట్టు తెలుస్తోంది. -
చెట్టు మీద పండని కాయ
తిండి గోల శరీరంలో నిస్సత్తువ ఆవహించినప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు రెండు లేదా మూడు సపోటా పండ్లను తింటే నిమిషాల తేడాతో శరీరం మళ్లీ శక్తిని పుంజుకుంటుంది. పిండిపదార్థాలు, మాంసకృత్తులు, విటమిన్లు సమృద్ధిగా ఉన్న పండు సోపోటా. అయితే, ఈ చెట్టు అన్ని ప్రాంతాలలో ఎదగదు. ఉష్ణమండల ప్రాంతాలలో పెరుగుతుంది. దిగుబడీ బాగుంటుంది. ఆ విధంగా మన దేశంతో పాటు, మెక్సికో ప్రాంతాలలో సపోటా తోటల సాగు అధికంగా ఉంది. మొట్టమొదటగా స్పానిష్ రాజులు పిలిప్పీన్స్లో సపోటా తోటల పెంపకాన్ని ప్రోత్సహించినట్టు చరిత్ర చెబుతోంది. మన దేశంలో సపోటా లేదా చికూ అని, ఫిలిప్పీన్స్లో ‘చికో’ అని, ఇండోనేషియాలో ‘సవో’ అని, మలేషియాలో ‘చికు’ అని ఈ పండును అంటారు. సపోట కాయలు చెట్టుకు ఉన్నప్పుడు పండవు. కోసిన తర్వాతనే పండుతాయి. రుచిగా ఉన్నాయి కదా అని సపోటాలను అదేపనిగా తినడం మంచిది కాదు. అజీర్ణంతో పాటు పొట్ట ఉబ్బరం సమస్య కూడా వస్తుంది. -
అభాసుపాలవుతున్న ‘ఆరోగ్యలక్ష్మి’
అంగన్వాడీలకు రెండున్నరనెలలుగా నిలిచిన కందిపప్పు సరఫరా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందని పౌష్టికాహారం పట్టించుకోని అధికారులు ఘట్కేసర్ టౌన్: అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్యలక్ష్మి పథకం ఆరంభ శూరత్వంగా మారింది. మాతాశిశు మరణాలను తగ్గిం చడానికి షౌష్టికాహారం అందించాలని 2015 జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒకపూట సం పూర్ణ భోజనం పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. హయత్నగర్ ప్రాజెక్టులో 243 కేంద్రాల ద్వారా సుమారు 10,300 వేలకు పైగా బాలింతలు, గర్భిణిలు వన్ ఫుల్మీల్స్ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో గర్భిణిగా నమోదైనప్పటి నుంచి పుట్టిన సంతానం ఆరు నెలల వయస్సు వచ్చేం తవరకు ఈ భోజనాన్ని అందిస్తారు. ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం గర్భిణిలు, బాలింతలకు నిత్యం కూరగాయలు, పాలు, గుడ్లతో పాటు రోజూ 40 గ్రాముల కందిపప్పు, చిన్నారులకు 15 గ్రాముల కంది పప్పును భోజనంలో వడ్డించాలి. కనిపించని కందిపప్పు.. అధికారుల సమన్వయం లోపం గర్భిణిలు, బాలింతలు, చిన్నారుల పాలిట శాపంగా మారింది. అధికారుల ముందుచూపు కరువవడంతో అంగన్వాడీ కేం ద్రాలకు సుమారు మూడు నెలలుగా కంది పప్పు సరఫరా నిలిచిపోయింది. దీంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహా రానికి దూరం అవుతున్నారు. గర్భవతిగా ఉన్న సమయంలో కడుపు నిండా విటమిన్లతో కూడిన పౌష్టికాహారం అందితే కడుపులో ఉన్న బిడ్డ, తల్లి ఆరోగ్యంగా ఉంటారు. దీంతో మాతాశిశు మరణాలు తగ్గుతాయని ప్రభుత్వం భావించింది. కంది పప్పు సరఫరా కాకపోవడంతో కొనుగోలు చేసి వడ్డించాలని అధికారులు అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించినట్లు తెలుస్తోంది. అంగన్వా డీ సిబ్బంది కొనుగోలు చేసిన అరకొర పప్పుతో పౌష్టికాహారం ఎలా అందుతుందని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నా రు. ఈ విషయమై అంగన్వాడీ సూపర్వైజర్ యశోదను వివరణ కోరగా సరి పోను కందిపప్పు నిల్వలు లేని కారణం గా అందించ లేకపోయామని, వారం రోజుల్లో సరఫరా చేస్తామని తెలిపారు. -
హాయ్... హనీ...
హెల్త్టిప్స్ తేనెలోని మినరల్స్, విటమిన్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి పంచదార బదులు తేనెను వంటకాల్లో కానీ పానీయాల్లో కానీ ఉపయోగించొచ్చు.ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చని నీళ్లలో ఒక నిమ్మకాయ పిండి, కొద్దిగా తేనె కలిపి తాగితే జీర్ణాశయం శుద్ధవుతుంది.పెసర పిండి లేదా శనగ పిండితో తేనెను కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే ఫేషియల్ చేసుకున్న ముఖారవిందం మీ సొంతం. వంట చేసేటప్పుడు చర్మం కాలడం కానీ కత్తి గాట్లు కానీ పడితే ఆ గాయాలపై స్వచ్ఛమైన తేనెను రాయండి. అతిత్వరగా గాయం మానడంతో పాటు నొప్పి నుంచి వెంటనే ఉపశమనం పొందొచ్చు. -
తొక్కేకదా అని తేలిగ్గా తీసేయకు....
కాలిఫోర్నియా: అరటి పండు తొక్కను తేలిగ్గా తీసుకొని పారేయకు. పండులోకన్నా తొక్కలోనే పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ ప్రసిద్ధి చెందిన నిపుణులు తెలియజేస్తున్నారు. తొక్కలో ఏ, బీ6,బీ12, సీ విటమిన్లతోపాటు మ్యాగ్నీషియమ్, పొటాషియమ్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఉన్నాయని శాండియాగోకు చెందిన లారా ఫ్లోర్స్, ఎల్లా ఆల్రెడ్ అనే పోషక విలువల నిపుణులు తెలియజేస్తున్నారు. ఏ విటమిన్ వల్ల పళ్లు, ఎముకలు ఆరోగ్యంగా తయారవుతాయి. పంటి చిగుళ్లు బలపడుతాయి. బీ6 విటమిన్ వల్ల శరీరంలో నిరోధక శక్తి పెరుగుతుంది. గుండె, మెదడు ఆరోగ్యానికి దోహదపడుతుంది. బీ12 విటమిన్ మెదడుతోపాటు నాడీ వ్యవస్థకు బలం చేకూరుస్తుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడడంతోపాటు బరువును తగ్గిస్తుంది. సీ విటమిన్ శరీరంపై గాయాలు మానేందుకు ఉపయోగపడుతుంది. కొత్త కణజాలం, లిగమెంట్ల అభివృద్ధికి దోహదపడుతుంది. ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ బలపడడమే కాకుండా శరీరంలో చెడు కొలస్ట్రాల్ను తగ్గిస్తుంది. నిద్ర లేమిని దూరం చేసేందుకు, మనసు ప్రశాంతంగా ఉండేందుకు పొటాషియం, మ్యాగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు దోహదపడతాయి. అరటి పండు తొక్కలో మరెన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. భారత్ లాంటి దేశాల్లో చర్మంపై దురదలు పోవడానికి, పులిపిర్లను నయం చేసేందుకు ప్రధానంగా ఉపయోగిస్తారు. దోమలు, ఇతర కీటకాలు కుట్టిన చోట తొక్కను ప్యాచ్లాగా వేస్తే చల్లదనానిచ్చి ఉపశమనం కలిగిస్తుంది. సిట్రిక్ యాసిడ్ కలిగిన నారింజ, నిమ్మ కాయల తొక్కల్లో కూడా పోషక విలువలు అధికంగా ఉంటాయని, అవి త్వరగా జీర్ణం కావు కనుక వాటిని ఆహారంగా తీసుకోలేమని నిపుణులు తెలియజేస్తున్నారు. అరటి పండు తొక్క త్వరగా జీర్ణమవుతుందని, నేరుగా తినలేనివాళ్లు ఉడకబెట్టుకొని, కొంచెం వేపుకొని కూడా తినవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. -
బ్యూటిప్స్
- విటమిన్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అందరికీ తెలుసు. మరి అవి బాహ్య సౌందర్యానికి ఎంత తోడ్పడతాయో చాలామందికి తెలీదు. మరి అలాంటి విటమిన్ల కోసం క్యారెట్ తురుములో కొన్ని పాలు కలిపి పేస్ట్లా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని మెడ, చేతులకు రాసుకొని 10 నిమిషాలు మర్దన చేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చర్మానికి విటమిన్లు సమృద్ధిగా అంది నిగనిగలాడుతాయి. - ఇంట్లో వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకునేటప్పుడు వాటి పొట్టును పడేస్తూ ఉంటాం. అలా చేయకుండా ఇప్పటి నుంచి ఆ పొట్టుతో ముఖకాంతిని పెంచుకోండి. ఆ పొట్టుకు కొద్దిగా పెరుగు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ పేస్ట్ను రాత్రి నిద్రపోయేముందు ముఖానికి రాసుకోవాలి. ఉదయాన్నే చల్లటి నీటితో కడుక్కుంటే ముఖంపై ఉండే మొటిమలు తగ్గడంతో పాటు చర్మకాంతి పెరుగుతుంది. -
వ్యాధులతో ఫైట్మిన్లు
యుద్ధం గెలవాలంటే యోధులు కావాలి కదా! ఏ, బీ, సీ, డీ... లాంటి యోధులు కావాలి. మన ఆరోగ్యాన్ని దెబ్బతీయడానికి రకరకాల వ్యాధులు, వైరస్లు, బ్యాక్టీరియాలు ప్రతినిత్యం దాడి చేస్తూనే ఉంటాయి. ఇలాంటి చొరబాటుదారులను తిప్పికొట్టాలంటే... ఇలాంటి శత్రుమూకలను తరిమి తరిమి కొట్టాలంటే... ఇలాంటి దుండగుల ముఠాను మట్టుబెట్టాలంటే... ఏ, బీ, సీ, డీ... లాంటి విటమిన్ల సైన్యం మనకు ఎంతో అవసరం. ఈ యుద్ధవీరులు ఎక్కడ దొరుకుతారు? వాళ్లను మన సైన్యంలో ఎలా చేర్చుకోవాలి? శరీరానికి రక్షణకవచంగా ఎలా వాడుకోవాలి? తెలిపేదే.. ఈ ‘ఫైట్మిన్లు’. విటమిన్స్... ఇవి కార్బోహైడ్రేట్స్లాగ కేలరీలనివ్వవు. ప్రొటీన్స్లాగ కండబలాన్నీ ఇవ్వవు. అయినా మన ఆరోగ్యానికి ఇవి అత్యవసరం. ఇవి లేనిదే ప్రధాన పోషకాలైన ప్రొటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్స్ ఎంత పనిచేసినా నిరుపయోగమే. ఆరోగ్యం సజావుగా ఉండాలంటే ఇవి అత్యంత కీలకం. ఇంత కీలకమైన ఈ విటమిన్స్ మనకు అసరమయ్యేది మాత్రంచాలా తక్కువ మోతాదులోనే అయినా, పలురకాల ఆహార పదార్థాల ద్వారా శరీరానికి కావల్సిన విటమిన్లన్నింటినీ తీసుకోవాల్సిందే. పధ్నాలుగు.. బతుకుబండిని ముందుకు లాగించే విటమిన్స్ మొత్తం పధ్నాలుగు. వీటిలో నీటిలో కరిగేవి, కొవ్వుల్లో కరిగేవి అని రెండు రకాలుగా ఉంటాయి. బీ1, బీ2, బీ6, బీ12, విటమిన్ సి, బయోటిన్, బి9 మొదలైనవి నీటిలో కరిగే విటమిన్లు. కొవ్వుల్లాగ ఇవి శరీరంలో నిల్వ ఉండవు. ఎక్కువైనవి మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. ఎ, డి, ఇ, కె విటమిన్లు కొవ్వుల్లో కరుగుతాయి. కొవ్వుతో పాటే ఇవి శరీరంలో నిల్వ ఉంటాయి. ఈ విటమిన్లను మోతాదుకు మించి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. దేని పని దానిదే.. విటమిన్ల పని చాలా నిర్దిష్టంగా ఉంటుంది. ఒక విటమిన్ పనిని ఇంకో విటమిన్ చేయలేదు. ఉదాహరణకు ఒక వ్యక్తికి డి విటమిన్ పుష్కలంగా ఉండి సి విటమిన్ లోపముంటే సి విటమిన్ను భర్తీ చేసుకోవాల్సిందే తప్ప దాన్ని డి విటమిన్ భర్తీ చేయలేదు. తక్కువైనా ఎక్కువైనా.. విటమిన్లు తక్కువైతే ఎన్ని జబ్బులు వస్తాయో అవసరానికి మించి తీసుకున్న విటమిన్లూ అన్నే ప్రమాదాలను తెచ్చిపెడ్తాయి. అతిగా తీసుకున్నవి ఒకరకంగా శరీరానికి విషతుల్యాలే. నీటిలో కరిగే విటమిన్లు.. విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఐరన్ను గ్రహించి గాయాలు త్వరగా మానేలా చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇది లోపిస్తే స్కర్వీ, క్యాన్సర్ వంటి వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. విటమిన్ సి దొరుకు పదార్థాలు: జామ, నారింజ, ద్రాక్ష, మామిడి, బొప్పాయి వంటి పళ్లు, టొమాటా, బంగాళదుంపలు వంటి కాయగూరలు, పాలకూర వంటి ఆకుకూరలు. విటమిన్ బి9 ఎర్రరక్తకణాల నిర్మాణానికి, ప్రొటీన్ల జీవక్రియకు, జీవకణాల వృద్ధికీ తోడ్పడుతుంది. గర్భిణులకు ఈ విటమిన్ అత్యవసరం. గర్భస్థ శిశువుల్లో వెన్నుపూస సరిగ్గా వృద్ధి చెందని ‘స్పైనా బైఫిడా’ వ్యాధి రిస్క్ని తగ్గిస్తుంది. అంతేకాదు ఇది బి6, బి12 విటమిన్లతో కలిసి గుండెజబ్బులు, పక్షవాతం బారిన పడకుండా చూస్తుంది. బీ9 లోపం ఉన్నవారు మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా అంటే ఎర్రరక్తకణాలు ఎన్లార్జ్ అయ్యే వ్యాధికి లోనవుతారు.బి9 దొరికే పదార్థాలు: లివర్, చిక్కుళ్లు, ఆకు కూరలు, పుల్లటి పళ్లు, సోయాబీన్స్, పొద్దు తిరుగుడు గింజలు, మొక్కజొన్నలు, పచ్చి బఠాణీలు. విటమిన్ బి1 కార్బోహైడ్రేట్స్, కొవ్వులు, ఆల్కహాల్ రక్తంలో కలిసేలా దోహదపడుతుంది. బి1 లోపం ఉన్నవాళ్లు బెరిబెరి, గుండెజబ్బులు, నాడీ సమస్యలకు లోనయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే విటమిన్ బి1 మోతాదుకు మించి తీసుకుంటే తలనొప్పి, నిద్రలేమి, నీరసం, చర్మ సమస్యలు వచ్చే ప్రమాదాలున్నాయి. విటమిన్బి1 దొరికే పదార్థాలు: పాల ఉత్పత్తులు, పొట్టు ధాన్యాలు, లివర్, పంది మాంసం, ఎండిన చిక్కుళ్లు, నట్స్, బఠాణీలు. విటమిన్ బి2 ఆహారపదార్థాల్లోని కొవ్వులు, ప్రొటీన్, కార్బోహైడ్రేట్స్ నుంచి శక్తి లాగేది విటమిన్ బి2నే. ఇది తక్కువైతే చర్మ వ్యాధులు వస్తాయి. ప్రత్యేకించి మూతి చుట్టూ ఉన్న చర్మానికి. అయితే విటమిన్ బి2 మోతాదు ఎక్కువైతే నష్టం జరిగినట్లు దాఖలాల్లేవు. బి2 దొరికే పదార్థాలు: పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లు, చికెన్, చేపలు, పాలకూర, పుట్టగొడుగులు, పొట్టు ధాన్యాలు. విటమిన్ బి6 ప్రొటీన్ను కరిగించి, హెమోగ్లోబిన్ జీవక్రియను పెంచుతుంది. శక్తిని ఉత్పత్తి చేయడంలో, మెదడు సక్రమంగా పనిచేయడంలోనూ సాయపడుతుంది. జీర్ణాశయంలోని బ్యాక్టీరియా ద్వారా బి6 తయారవుతుంది. ఇది తక్కువైతే మాత్రం చర్మ సమస్యలు, నాడీ సమస్యలు తలెత్తుతాయి. మోతాదుకి మించి బి6ని తీసుకుంటే నరాలు క్షీణించే ప్రమాదం ఉంది. బి6 దొరుకు పదార్థాలు: పౌల్ట్రీ ఉత్పత్తులు, చేపలు,లివర్, పందిమాంసం, సోయాబీన్స్, ఓట్స్, పొట్టు ధాన్యాల ఉత్పత్తులు, పొద్దు తిరుగుడుపువ్వు గింజలు, బంగాళదుంపలు, అరటి పళ్లు. విటమిన్ బి12 ఎర్ర రక్తకణాల ఉత్పత్తి, కణాల జీవక్రియకు, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో విటమిన్ బి12 కీలకంగా పనిచేస్తుంది. అయితే, కొంతమంది బి12 విటమిన్ను గ్రహించలేరు. అలాగే శాకాహారులకు కూడా ఇది తగినంత అందదు. అలాంటివారు బి12 సప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది.బి12 దొరుకు పదార్థాలు: మాంసం, చేపలు, పౌల్ట్రీ ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు. విటమిన్ బి3 చర్మ పోషణలో పాత్ర వహిస్తుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. సాధారణంగా బి3 లోపం ఏర్పడదు. మోతాదు మించితే మాత్రం లివర్ సమస్యలు తలెత్తుతాయి.బి3 దొరుకు పదార్థాలు: చికెన్, పౌల్ట్రీ ఉత్పత్తులు, మాంసం, చేపలు, పల్లీలు, పొట్టు ధాన్యాలు, తృణ ధాన్యాలు, పుట్ట గొడుగులు. విటమిన్ బి5 కొవ్వులు, కార్బోహైడ్రేట్ మెటబాలిజం చురుగ్గా ఉండేలా చేస్తుంది. దీనికికి నిర్దిష్టమైన మోతాదేమీ సూచించలేదు. మోతాదు ఎక్కువైతే దుష్ఫలితాలు సంభవించిన దాఖలాలూ లేవు. బి5 దొరుకు పదార్థాలు: మాంసం, లివర్, పాల ఉత్పత్తులు, పల్లీలు, బాదంపప్పు, చిరుధాన్యాలు. కొవ్వుల్లో కరిగే విటమిన్లు విటమిన్ ఎ చక్కటి కంటి చూపు, ఎముకల వృద్ధికి, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, రోగనిరోధక శక్తి మెరుగుదలకు ‘ఎ’ విటమిన్ అత్యంత అవసరం. దీని లోపం వల్ల రేచీకటి వస్తుంది. మోతాదు మించితే కాలేయ సమస్యలు, ఎముకలు దెబ్బతినడం, వైకల్యంతో ఉన్న పిల్లలు పుట్టడం వంటి ప్రమాదాలున్నాయి. విటమిన్ ఎ దొరుకు పదార్థాలు: పాలకూర, క్యారెట్స్, మామిడిపళ్లు, టొమాటా.. వంటి ఆకుపచ్చ, ఆరెంజ్, పసుపు రంగుల్లో ఉన్న అన్ని ఆకు కూరలు, కూరగాయలు, పళ్లు మొదలైన వాటిలో పుష్కలంగా ఉంటుంది. అలాగే లివర్, చేపలు, పాల ఉత్పత్తుల్లో కూడా లభ్యమవుతుంది. విటమిన్ డి ఎముకల వృద్ధికి అత్యంత అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్లు మోతాదు మించకుండా నియంత్రిస్తుంది. ఇది లోపిస్తే పిల్లల్లో రికెట్స్, పెద్దవాళ్లల్లో ఎముకలు మెత్తబడే ఆస్టియోమలేషియా జబ్బుల వస్తాయి. మోతాదు మించితే వికారం, తలనొప్పి, రక్తపోటు, కిడ్నీసమస్యలు తలెత్తుతాయి.విటమిన్ డి దొరుకు పదార్థాలు: పాల ఉత్పత్తులు, గుడ్డులోని పచ్చసొన, ఫిష్లివర్ ఆయిల్, చిరుధాన్యాలు. విటమిన్ ఇ ఎర్ర రక్తకణాల రక్షణలో, ప్రత్యుత్పత్తి వ్యవస్థ సక్రమంగా ఉండడంలోనూ విటిమిన్ ఇ సహాయం చాలా ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది. విటమిన్ ఇ లోపం చాలా అరుదు. మోతాదు ఎక్కువైతే అధిక రక్తస్రావానికి, జీర్ణకోశ సమస్యలకు దారి తీస్తుంది. విటమిన్ ఇ దొరుకు పదార్థాలు: వెజిటేబుల్ ఆయిల్స్, కాయగూరలు, ఆకు కూరలు, తృణ ధాన్యాలు, పొట్టు ధాన్యాల ఉత్పత్తులు, నట్స్, పొద్దు తిరుగుడు పువ్వు గింజలు, పల్లీలు. విటమిన్ కె రక్తం గడ్డకట్టడానికి తోడ్పడుతుంది. నవజాత శిశువుల్లో, జీవక్రియ మందగించిన వాళ్లలో దీని డెఫిషియెన్సీ కనపడుతుంది. విటమిన్ డిలోపం చిన్న దెబ్బకే తీవ్ర గాయాలవడం, రక్తస్రావం వంటి సమస్యలు తలెత్తుతాయి. విటమిన్ కె దొరుకు పదార్థాలు: ఆకు కూరలు, పంది మాంసం, మాంసం, లివర్, బ్రకోలి, సోయా బీన్స్, ఆకు కూరలు. ఇన్పుట్స్: సుజాత స్టీఫెన్, మ్యాక్స్క్యూర్ హాస్పిటల్ మధురిమ సిన్హా, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్ సి విటమిన్ విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఆహారపదార్థాలు తిన్న వారికి క్యాన్సర్, గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువని, అదే సమయంలో అధికమొత్తంలో విటమిన్ సి తీసుకోవడం వల్ల డయేరియా, కిడ్నీల్లో రాళ్లు వచ్చే ప్రమాదమూ ఉంటుందని కొన్ని అధ్యయానాలు చెప్తున్నాయి డి విటమిన్ ఒక్క డి విటమిన్ తప్ప ఇంకే విటమిన్ శరీరంలో తయారు కాదు. చర్మం మీద సూర్యరశ్మి పడడం వల్ల డి విటమిన్ తయారవుతుంది. జీర్ణాశయంలోని బాక్టీరియా వల్ల కూడా కొన్ని విటమిన్స్ తయారవుతాయి. కానీ చాలా వరకు విటమిన్స్ను ఆహారం ద్వారా బయట నుంచే పొందాల్సిందే. -
క్యూట్ కేర్...
బ్యూటిప్స్ పెదాల చుట్టూ చర్మం నల్లగా మారుతుంది చాలామందికి. అది వేడి వల్ల కానీ, విటమిన్స్ లోపం వల్ల కానీ అయ్యుండొచ్చు. అలాంటి వారు తమ పెదాలు పూర్తిగా ఎరుపురంగులోకి రావడానికి రోజూ స్నానానికి వెళ్లే ముందు వాటిపై టూత్పేస్ట్ అప్లై చేయండి. అది ఆరాక మెల్లిగా మర్దన చేసుకుంటూ పెదాలను కడుక్కోవాలి. కొంచెం సమయం తీసుకున్నా సరే ఈ చిట్కా తప్పకుండా మంచి ఫలితాన్నిస్తుంది. అర్జెంట్గా పార్టీకి వెళ్లాలి. కానీ ముఖం మాత్రం జిడ్డుగా, కాంతిహీనంగా ఉందని చింతించకండి. పార్టీకి వెళ్లే రెండు గంటల ముందు ముఖానికి నేరేడుపళ్ల ఫేస్ప్యాక్ వేసుకోండి. దానికి కావాల్సినవి 4-5 నేరేడుపళ్లు మాత్రమే. నేరేడుపళ్ల గుజ్జులో కాస్త శనగ పిండి కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఓ 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ఫేస్వాష్ చేసుకుంటే సరి. అందులోని విటమిన్-సి, మినరల్స్ కారణంగా చర్మం ఆరోగ్యంతో నిగనిగలాడుతుంది. ముఖం తెల్లగా ఉండి అక్కడక్కడా నల్ల మచ్చలు ఉండటం వల్ల తాము అందంగా లేమని బాధపడుతుంటారు యువతులు. అలాంటి వారు ఈ ఇంటి చిట్కాను పాటించి చూడండి. రాత్రి పడుకునే ముందు ఉల్లిరసంలో దూదిని ముంచి నల్లమచ్చలపై అద్దండి. అలా రోజూ చేస్తే మచ్చలు తగ్గుముఖం పడతాయి. -
సన్నబియ్యం మేలు చేస్తాయా ?
తెలంగాణలో వందల సంఖ్యలో ఉన్న ప్రభుత్వ హాస్టళ్లలో జనవరి 1 నుంచి సన్నబియ్యంతో భోజన పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించా రు. నిరుపేద పిల్లలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల విద్యార్థుల బాగో గులపై ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు ఏదోరకమైన శ్రద్ధ ఉండటం అభినందించదగినదే. అయితే, ఎముకలు కొరికే చలికి అల్లల్లాడే చిన్నారులకు దుప్పట్లు, సబ్బులు, తలనూనె వంటి కనీసావసరాలపై దృష్టి పెట్టకుండా సన్నబియ్యం వంటి వ్యర్థమైన, ఆరోగ్య వ్యతిరేకమైన సౌకర్యాన్ని హాస్టళ్లకు అనవసరంగా అంట కట్టడం విజ్ఞత అనిపించు కోదు. వడ్ల గింజగా ఉన్న బియ్యాన్ని ఒకసారి మరపట్టి, తిరిగి మరపట్టి సదరు గింజలో పిసరంత పిండి పదార్ధం (కార్బొహైడ్రేట్స్) మినహా మరేమీలేని స్థితిని తేవడాన్నే సన్న బియ్యమని మనం వ్యవహరిస్తుం టాం. బియ్యం గింజ పైపొరలో స్వాభావికంగా ఉండే జింక్, ఐరన్, విటమిన్లు, ఇతర పోషక పదార్థాలను తెల్ల రంగుపై వ్యామోహంతో వదులుకోవడం హాస్టళ్లలో చిన్నారులకు ఎలా ఆరోగ్యకరమో ప్రభుత్వ పెద్దలే చెప్పాలి. చూడటానికి ముత్యాల్లా, నాజూకుగా, నోరూరించేలా కనిపించే సన్న బియ్యం సారహీనమైనవని వైద్య పరిశోధనల్లో తేలిన సత్యం. ఈ బియ్యంతో వండిన అన్నం జంక్ ఫుడ్, గడ్డితో సమానం. అనారోగ్య హేతువు. గత రెండు మూడు దశాబ్దాలుగా పూర్వపు ఏపీలోనూ, తమిళనాడులోనూ డయాబిటీస్ (సుగర్ వ్యాధి), రక్తపోటు (బీపీ) రోగులు ఊహాతీతంగా అధికం కావడానికి సన్న, తెల్ల బియ్యం వాడకం పెరగడమే ప్రధాన కారణమని ఆరోగ్య సంస్థలు ఎప్పుడో నివేదికలు ఇచ్చాయి. మన హైదరాబాద్ నగరం దేశంలోనే సుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్న డయాబెటిక్ రాజధానిగా ఇప్పటికే పేరుమోసింది. హాస్టళ్లలో ఉండే పిల్లలకు నిస్సారమైన తెల్ల బియ్యం సరఫరా చేయడాన్ని తమ పోరాట ఫలితంగా ఆర్.కృష్ణయ్య వంటి బీసీ నేతలు ఘనంగా చెబుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టుదలగా ఈ పథకాన్ని అమలు చేయించడానికి కంకణం కట్టుకున్నారు. ఇదంతా ఎవరి ఆరోగ్యం కోసం? ప్రతిరోజూ తెల్ల బియ్యంతో వండిన అన్నం తింటే అందులో పీచు లేకపోవడంతో కొద్ది సమయానికే ఆకలి వేస్తుం ది. దాని ఫలితంగా అందుబాటులో ఉన్న ఏదో ఒక ఆహారాన్ని ఆబగా తింటారు, శరీరంలో ఖర్చుకాని కేలరీలు అధికంగా జమపడి శరీరం బరువు పెరుగుతుంది. సన్నబియ్యం త్వరగా అరగడంతో జీర్ణక్రియకు రోజంతా పనిలేక ఆ వత్తిడి ఇతర శారీరక వ్యవస్థలపై ప్రభావం చూపు తుంది. ఈ బియ్యానికి అలవాటు పడిన వారిని జీవన శైలి వ్యాధులు యవ్వనంలోనే పలకరిస్తాయి. దాని కంటే గింజ పైపొరని యథాతథం గా ఉంచే సోనా మసూరి లేదా హెచ్ఎంటి బియ్యం ఈ వయస్సులో చిన్నారులకు మేలు చేస్తాయి. వేల టన్నుల సన్న బియ్యాన్ని వండించి పిల్లల ఆరోగ్యాన్ని అపాయంలో పడవేయడం తగదు. తెలంగాణ ప్రభుత్వం ఈ పథకంపై పునరాలోచన చేయడం మంచిది. - వీణవంక మార్కండేయ చెన్నూరు -
రసాయనికంగా సబ్బులు అనేవి..?
1. కార్బోహైడ్రేట్లు అనేవి? 1) మాంసకృత్తులు 2) పిండి పదార్థాలు 3) కొవ్వులు 4) విటమిన్లు 2. మానవ శరీరంలో ఉండే మాంసకృత్తులు? 1) కార్బోహైడ్రేట్లు 2) లిపిడ్లు 3) ప్రోటీన్లు 4) విటమిన్లు 3. సాధారణ కార్బొహైడ్రేట్ల నిర్మాణంలో ఉండని మూలకమేది? 1) హైడ్రోజన్ 2) కార్బన్ 3) ఆక్సిజన్ 4) నైట్రోజన్ 4. {పోటీన్ల నిర్మాణంలో అవసరమైన మూలకాలేవి? 1) హైడ్రోజన్, కార్బన్ మాత్రమే 2) కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మాత్రమే 3) కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్ మాత్రమే 4) కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ 5. కిందివాటిలో ప్రోటీన్లు ప్రధానంగా లేని పదార్థం ఏది? 1) గోళ్లు 2) వెంట్రుకలు 3) మాంసం 4) బియ్యం 6. టేబుల్ షుగర్ రసాయన నామం? 1) సుక్రోజ్ 2) గ్లూకోజ్ 3) ఫ్రక్టోజ్ 4) మాల్టోజ్ 7. పాలలోని చక్కెర ఏది? 1) గ్లూకోజ్ 2) సుక్రోజ్ 3) ఫ్రక్టోజ్ 4) లాక్టోజ్ 8. తేనెలో ఉండే కార్బొహైడ్రేట్? 1) ఫ్రక్టోజ్ 2) గ్లూకోజ్ 3) లాక్టోజ్ 4) మాల్టోజ్ 9. మొలాసిస్ నుంచి ఆల్కహాల్ తయారు చేసే ప్రక్రియ? 1) డయాలసిస్ 2) కిణ్వప్రక్రియ (ఫెర్మెంటేషన్) 3) కిరణజన్యసంయోగక్రియ (ఫొటోసింథసిస్) 4) లాక్టైజేషన్ 10. {పోటీన్లలో ఉండే ప్రత్యేక బంధం ’–CO–NH–’ ను ఏమంటారు? 1) ఎస్టర్ బంధం 2) ఈథర్ బంధం 3) ఎమైడ్ బంధం 4) పాలిఎమైడ్ 11. పాలిఎమైడ్లు అనేవి? 1) లిపిడ్లు 2) ప్రోటీన్లు 3) కార్బోహైడ్రేట్లు 4) విటమిన్లు 12. హీమోగ్లోబిన్లో ప్రధానంగా ఉండేవి? 1) లిపిడ్ కణాలు 2) ప్రోటీన్ కణాలు 3) కార్బోహైడ్రేట్లు 4) విటమిన్లు 13. గుండెజబ్బులకు ప్రధాన కారణమైన కొలె స్టిరాల్ అనేది ఒక? 1) లిపిడ్ 2) విటమిన్ 3) చక్కెర 4) ప్రోటీన్ 14. కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వ్యాధిగ్రస్థుల చికిత్సకు సంబంధించిన ప్రక్రియ? 1) ఫెర్మెంటేషన్ 2) లాక్టేషన్ 3) డయాలసిస్ 4) ఆస్మాసిస్ 15. కిడ్నీ ఫెయిల్యూర్ అయిన పేషెంట్ల ఆహా రంలో ఏవి తక్కువ మోతాదులో ఉండాలి? 1) ప్రోటీన్లు 2) లిపిడ్లు 3) విటమిన్లు 4) కొర్బోహైడ్రేట్లు 16. నూనెలను ‘డాల్డా’ లాంటి కొవ్వులుగా మా ర్చే ప్రక్రియ? 1) హైడ్రోజనీకరణం 2) హైడ్రాలిసిస్ 3) ఎస్టరిఫికేషన్ 4) ఫెర్మెంటేషన్ 17. సబ్బుల పరిశ్రమల్లో సహ ఉత్పన్నం ఏది? 1) గ్లిజరాల్ 2) గ్లైకాల్ 3) ఇథైల్ ఆల్కహాల్ 4) అసిటోన్ 18. సోడియం హైడ్రాక్సైడ్ లాంటి క్షారంతో వేటిని మరిగిస్తే సపోనిఫికేషన్ జరిగి సబ్బు ఏర్పడుతుంది? 1) నూనెలు (లిపిడ్లు) 2) కార్బోహైడ్రేట్లు 3) ప్రోటీన్లు 4) ఆల్కహాల్లు 19. మాయిశ్చరైజింగ్ సోప్లలో ఉండేది? 1) ఇథైల్ ఆల్కహాల్ 2) గ్లిజరాల్ 3) మిథైల్ ఆల్కహాల్ 4) ఆస్కార్బికామ్లం 20. నిమ్మజాతి పండ్లలో ఉండే విటమిన్-సికి మరో పేరు? 1) ఎ 2) బి 3) సి 4) డి 21. మొలకెత్తిన ధాన్యాల్లో అభివృద్ధి చెందే ప్రధాన విటమిన్ ఏది? 1) ఎ 2) బి 3) సి 4) ఇ 22. నీటిలో కరిగే విటమిన్లేవి? 1) ఎ, బి మాత్రమే 2) బి, సి మాత్రమే 3) సి, డి మాత్రమే 4) అన్ని విటమిన్లు నీటిలో కరుగుతాయి 23. ఆవుపాలు పసుపురంగులో ఉండటానికి కారణమైన విటమిన్? 1) పిరిడాక్సిన్ (B6) 2) రైబోఫ్లోవిన్ (B2) 3) థయమిన్ (B1) 4)సైనకోబాలమిన్ (B12) 24. ఏ విటమిన్ లోపిస్తే వ్యంధ్యత్వం వస్తుంది? 1) ఎ 2) బి 3) సి 4) ఇ 25. కోబాల్ట్ లోహ అయాన్ ఉండే విటమిన్ ఏది? 1) B1 2) B2 3) B12 4) B6 26. జతపరచండి. విటమిన్ లోపిస్తే వచ్చే వ్యాధి ఎ) B1 1) రికెట్స్ బి) B12 2) స్కర్వీ సి) C 3) రేచీకటి డి) D 4) బెరిబెరి 5) రక్తహీనత ఎ బి సి డి 1) 1 2 3 4 2) 2 3 4 5 3) 4 5 2 1 4) 5 4 1 2 27. గర్భిణీలకు ఇచ్చే విటమిన్ ఏది? 1) థయమిన్ 2) పిరిడాక్సిన్ 3) ఫోలికామ్లం 4) రైబోఫ్లోవిన్ 28. బియ్యాన్ని ఎక్కువగా పాలిష్ చేస్తే ఏ విటమిన్ లోపిస్తుంది? 1) బి 2) సి 3) ఎ 4) డి 29. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రించే హార్మోన్ ఏది? 1) ఇన్సులిన్ 2) ఈస్ట్రోజన్ 3) ప్రొజెస్టిరాన్ 4) ఏదీకాదు 30. ఎదుగుదలకు దోహదం చేసే హార్మోన్ ఏది? 1) ఇన్సులిన్ 2) థైరాక్సిన్ 3) ఈస్ట్రోజన్ 4) ప్రొజెస్టిరాన్ 31. అత్యల్ప ఆల్కహాల్ ఉండేది? 1) వైన్ 2) బీర్ 3) వోడ్కా 4) విస్కీ 32. వాహనాలు నడవడానికి పెట్రోల్తో పాటు దేన్ని కలుపుతున్నారు? 1) ఇథనాల్ 2) మిథనాల్ 3) గ్లిజరాల్ 4) గ్లైకాల్ 33. రసాయనికంగా సబ్బులు అనేవి? 1) ఫాటీ ఆమ్లాల సోడియం లేదా పొటాషియం లవణాలు 2) ఫాటీ ఆమ్లాల సల్ఫోనేట్ లవణాలు 3) గ్లిజరాల్, బై కార్బొనేట్ల మిశ్రమాలు 4) ఏదీకాదు 34. కిందివాటిలో ఏవి డిటర్జెంట్లు? ఎ. ఆల్కైల్ బెంజీన్ సల్ఫొనేట్లు బి. భార ఆల్కహాల్ల సల్ఫోనేట్ లవణాలు సి. భార ఫాటీ ఆమ్లాల సోడియం లవణాలు 1) ఎ, బి మాత్రమే 2) బి, సి మాత్రమే 3) ఎ, సి మాత్రమే 4) ఎ, బి, సి 35. కార్ రేడియేటర్లలో శీతలీకారిణి (యాంటీ- ఫ్రీజ్)గా దేన్ని ఉపయోగిస్తారు? 1) టెట్రాఇథైల్ లెడ్ 2) ఇథిలీన్ గ్లైకాల్ 3) గ్లిజరాల్ 4) ఇథైల్ ఆల్కహాల్ 36. పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే ఇథనాల్కు తాగడానికి పనికిరాకుండా ఉండటానికి కలిపే పదార్థం? 1) మిథనాల్ 2) ఎసిటోన్ 3) బెంజీన్ 4) క్లోరోఫాం 37. గాయాలు త్వరగా మానడానికి అవసర మైన విటమిన్ ఏది? 1) ఎ 2) బి 3) సి 4) డి 38. కెఫీన్ అనే డ్రగ్ ఎందులో ఉంటుంది? 1) కాఫీ 2) టీ 3) కోలా శీతల పానీయాలు 4) పైవన్నీ 39. సిగరెట్లో ఉండే డ్రగ్ ఏది? 1) కెఫీన్ 2) టేనిన్ 3) నికోటిన్ 4) వెనిలా 40. సొరచేప కాలేయం నుంచి తీసే నూనె ద్వారా లభించే విటమిన్? 1) ఎ 2) బి 3) సి 4) ఇ 41. ఆల్కహాల్ అధికంగా సేవించే వారిలో ఏ అవయవం పాడవుతుంది? 1) ఊపిరితిత్తులు 2) కాలేయం 3) కిడ్నీ 4) మూత్రనాళం 42. నూనెల హైడ్రోజనీకరణం గురించి సరికాని వాక్యం ఏది? 1) నూనెల హైడ్రోజనీకరణంలో ూజీ లో హాన్ని ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తారు 2) నూనెలను హైడ్రోజనీకరణం చేస్తే కొవ్వులు లభిస్తాయి 3) ఈ ప్రక్రియ వల్ల రుచి, వాసన పెరు గుతాయి 4) నూనెల హైడ్రోజనీకరణం వల్ల వచ్చే కొ వ్వులు తక్కువ కాలం నిల్వ ఉంటాయి 43. కఠిన జలంలోనూ డిటర్జెంటులు బాగా ఉపయోగపడటానికి కారణమేమిటి? 1) అవి నీటిలోని అయాన్లను తొలగిస్తాయి 2) అవి కఠినజల అయాన్లతో చర్య నొందవు 3) అవి కఠినజల అయాన్లతో చర్య నొందినప్పటికీ అవక్షేపించవు 4) అవి కఠినజల అయాన్లతో చర్యనొంది అవక్షేపిస్తాయి 44. రక్తం త్వరగా గడ్డకట్టడానికి తోడ్పడే విటమిన్? 1) ఎ 2) బి 3) సి 4) కె 45. ఏ విటమిన్ లోపం వల్ల మగవారిలో బీజాభివృద్ధి సరిగా లేకపోవడం, స్త్రీలలో త రచూ గర్భస్రావం లాంటివి కలుగుతాయి? 1) ఇ 2) బి 3) సి 4) డి 46. సూర్యరశ్మి సమక్షంలో శరీరంలో తయా రయ్యే విటమిన్? 1) ఎ 2) బి 3) ఇ 4) డి 47. కిందివాటిలో సరికాని జత ఏది? 1) కార్బోహైడ్రేటులు - శక్తి 2) ప్రోటీన్లు - పెరుగుదల 3) విటమిన్లు - వ్యాధి నిరోధకత 4) కొవ్వులు - పెరుగుదల 48. మూత్రపిండాలు సరిగా పనిచేయనివారి మూత్రంలో ఎక్కువ పరిమాణంలో కని పించేది? 1) చక్కెర 2) క్రియాటినిన్ 3) ప్రోటీన్ 4) కొవ్వు 49. పండ్లలో చక్కెర ఏ రూపంలో ఉంటుంది? 1) సుక్రోస్ 2) గ్లూకోజ్ 3) ఫ్రక్టోజ్ 4) లాక్టోస్ 50. ముతక బియ్యం (పాలీష్ చేయని బియ్యం) ఉపయోగించి చేసే ఇడ్లీలో పుష్కలంగా లభించే విటమిన్ ఏది? 1) అ 2) ఆ12 3) ఇ 4) ఉ 51. డయాబెటీస్ వ్యాధిగ్రస్థుల మూత్రంలో ఎక్కువ పరిమాణంలో కనిపించే షుగర్ ఏది? 1) సుక్రోజ్ 2) ఫ్రక్టోజ్ 3) గ్లూకోజ్ 4) లాక్టోజ్ సమాధానాలు 1) 2 2) 3 3) 4 4) 4 5) 4 6) 1 7) 4 8) 1 9) 2 10) 3 11) 2 12) 2 13) 1 14) 3 15) 1 16) 1 17) 1 18) 1 19) 2 20) 3 21) 4 22) 2 23) 2 24) 4 25) 3 26) 3 27) 3 28) 1 29) 1 30) 2 31) 2 32) 1 33) 1 34) 1 35) 2 36) 1 37) 3 38) 4 39) 3 40) 1 41) 2 42) 4 43) 3 44) 4 45) 1 46) 4 47) 4 48) 2 49) 3 50) 2 51) 3 -
విటమిన్లు-న్యూనతా వ్యాధులు
-
రోగ నివారిణి గోధుమ గడ్డి రసం
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: మారిన జీవన శైలివల్ల ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఎన్నో వ్యాధులబారిన పడుతున్నాం. నానాటికీ పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం వల్ల మనలోని రోగనిరోధక శక్తి క్రమేపీ క్షీణిస్తోందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. అయితే ప్రకృతి ప్రసాదించిన వివిధ రకాల వైద్య విధానాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గోధుమ గడ్డి రసంతో పలు రకాల వ్యాధులను నివారించవచ్చునని వాడకందారులు చెబుతున్నారు. ఈ గోధుమ గడ్డిలో 13 రకాల విటమిన్లు, 111 రకాల పోషకాలున్నాయని శాస్త్ర పరిశోధనలో తేలిందని ఈ ఔషధం తయారీదారుడు చెబుతున్నారు. వీటిలో ముఖ్యంగా విటమిన్లు, ఎంజైమ్లు, అమినో ఆసిడ్లు, ప్రోటీన్లు ఉన్నాయి. గోధుమ గడ్డి రసాన్ని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా 100 గ్రాముల గోధుమ గడ్డిలో కిలో ఆకు కూరల సత్తువ ఇమిడి ఉంటుందని అనుభవజ్ఞులు చెపుతున్నారు. ప్రాముఖ్యత... గోధుమ గడ్డి మానవాళికి ప్రకృతి ప్రసాదించిన వరం. కొన్ని వేల ఏళ్ల నుంచి మానవుడు ఆరోగ్య సమస్యలకు నివారిణిగి ఉపయోగపడుతోంది. దీన్ని మహా భారతంలో సంజీవనిగా వర్ణించారు. ఈ గోధుమ గడ్డిలో ఆరోగ్య విలువల్ని గుర్తించింది అమెరికాకు చెందిన డాక్టర్ విగ్మొర్. ఐతే ఎల్బీ నగర్కు చెందిన డి.సిరియాల్ రెడ్డి అనే వ్యక్తి ఈ రసాన్ని ప్రతి రోజు బాగ్లింగంపల్లిలోని సుందరయ్య పార్కు వద్ద విక్ర యిస్తుంటారు. దీని ఖరీదు సుమారు 100 గ్రాములకు రూ.20. మంచి ఫలితాలను ఇస్తుందని వాడకందారులు చెబుతున్నారు. రసంతో కలిగే లాభాలు... కాన్సర్, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, బహిష్టు సమస్యల నివారణకు ఉపకరిస్తుంది. మధుమేహం, పైల్స్, గ్యాస్, కడుపులో పుండు తదితర సమస్యలకు పనిచేస్తుంది. రక్తంలో చెక్కర శాతం, కొలెస్ట్రాల్, మల బద్దకాన్ని తగ్గిస్తుంది. రక్తహీనత, శ్వాస, చెమట సమస్యల నివారణ గోధుమ గడ్డి గుజ్జును పసుపు, పాలతో కలిపి ముఖానికి రాస్తే మచ్చలు, మొటిమలు, పగలటం, నల్లబడటాన్ని నివారించవచ్చు. గోధుమ గడ్డిలో పీచు ఉన్నందున జీర్ణం ఎక్కువ అవుతుంది. శరీరం బరువు పెరగటాన్ని తగ్గిస్తుంది శరీరంలో సహజమైన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ను తగ్గిస్తుంది. తయారీ విధానం... గోధుమలను 12 గంటలు నానబెట్టాలి. ట్రేలల్లో ఒక ఇంచు వరకు మట్టి పోసి విత్తనం వేయాలి. దానిపై సన్నటి మట్టిని చల్లి నీళ్లు చిలుకరించాలి. 4వ రోజుకు మొలకలు వస్తాయి. 8వ రోజు గడ్డి పెరిగాక వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సిలో వేసి సరిపడ నీళ్లు పోసి రసం తీయాలి. ఆ రసాన్ని పాలిస్టర్ గుడ్డలో వంపి గట్టిగా పిండాలి. వచ్చిన రసాన్ని పరగడుపున తాగితే మంచి ఫలితాల్ని ఇస్తుంది. 20 నిమిషాల తర్వాత ఏమైనా తినవచ్చును. ఈ మందును ప్రజల్లోకి తీసుకెళ్లాలనుంది..ఈ మందును ప్రజల్లోకి తీసుకుపోవాలనుంది. ఆబిడ్స్లోని ఓ పాత పుస్తకాల షాపులో 5 ఏళ్ల క్రితం గోధుమ గడ్డి వల్ల వచ్చే ప్రయోజనాల గూర్చి చదివాను. ప్రయోగించి వాడాను. మంచి ఫలితాలను ఇచ్చింది. నేను ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. మజిల్స్ పెయిన్స్, మొకాళ్ల నొప్పులు రెండు రోజుల్లో తగ్గాయి. ముఖ్యంగా ఇది క్యాన్సర్ రోగులకు, పైల్స్, మధుమేహం ఉన్నవారికి బాగాపనిచేస్తుంది. -డి.సిరియాల్ రెడ్డి, గోధుమ గడ్డి రసం విక్రయదారుడు మంచి ఫలితాలను ఇస్తుంది గోధుమ గడ్డి రసం మంచి ఫలితాలను ఇస్తుంది. ముందుగా ఏదో చూద్దాంలే అని తాగాను. తర్వాత వరుసగా రెండు రోజులు తాగి చూశాను. నాకు మంచి ఫలితాన్ని ఇచ్చింది. 3 నెలలుగా తాగుతున్నాను. నేను ఉల్లాసంగా ఉంటున్నాను. నేను తాగటంతో పాటు మా ఇంటికి కూడ తీసుకొని పోతున్నాను. నాకు షుగర్ కంట్రోల్లో ఉంది. -శ్రీహరి, చిక్కడపలి నాకు నరాల బలహీనత తగ్గింది.... నేను 1959 మొదటి బ్యాచ్కు చెందిన డాక్టర్ను. నరాల బలహీనతతో పూర్తిగా నడవలేక పోయేవాడిని. నారాయణగూడలో న్యూరో సర్జన్కు చూపించినా ప్రయోజనం కలగలేదు. ప్రస్తుతం 45 రోజు లుగా గోధుమగడ్డి రసాన్ని వాడడంతో నేను ఇప్పుడు మంచిగా నడువగల్గుతున్నాను. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. -డాక్టర్ దొరస్వామి రెడ్డి, బీడీఎస్, రిటైర్డ్ డెంటల్ సర్జన్ -
పశువులకూ విటమిన్లు కావాలి
పాడి-పంటపాడి-పంట: పశువులకు అన్ని పోషకాలను తగిన మోతాదులో అందించినప్పుడే ఉత్పాదకత బాగుంటుంది. పశువుకు ప్రొటీన్లు, పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, ఖనిజాలు, నీరు మొదలైనవే కాకుండా విటమిన్లు కూడా ఇవ్వాలి. పశువు శరీర సాధారణ జీవన ప్రక్రియకు ఇవి ఎంతో అవసరం. శరీర నిర్వహణ, పెరుగుదల, ఉత్పత్తి, ఆరోగ్య పరిరక్షణకు కూడా ఇవి అవసరమే. విటమిన్లు మేత పదార్థాలు కాకపోయినా వాటిలోని పోషకాలను పశువు శరీరం సమర్ధవంతంగా గ్రహించేందుకు దోహదపడతాయి. విటమిన్లను చాలా వరకూ మేత ద్వారానే అందించాలి. అయితే కొన్ని విటమిన్లు పశువు శరీరంలో నివసించే సూక్ష్మక్రిముల ద్వారా ఉత్పత్తి అవుతాయి. విటమిన్లలో ఏది లోపించినా దానికి సంబంధించిన జీవ రసాయన ప్రక్రియ ఆగిపోతుంది. విటమిన్లు రెండు రకాలు... కొవ్వులో కరిగేవి (విటమిన్-డి, ఇ, కె), నీటిలో కరిగేవి (బి-కాంప్లెక్స్, విటమిన్-సి). కొవ్వులో కరిగే విటమిన్లు చాలా వరకూ పశువుకు మేత ద్వారానే లభిస్తాయి. ఒకవేళ పశువు వీటిని ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పటికీ అవి కాలేయంలో నిల్వ ఉంటాయి. అయితే నీటిలో కరిగే విటమిన్లు మాత్రం నిల్వ ఉండవు. మూత్రం ద్వారా బయటికి పోతాయి. ఒక్క విటమిన్ బి-12 మాత్రమే పశువు శరీరంలో నిల్వ ఉంటుంది. శరీర కణాలు పనిచేయాలంటే... పశువుకు విటమిన్-ఎ ఎంతో అవసరం. ఇది కెరోటిన్ రూపంలో లభిస్తుంది. పసుపు, మొక్కజొన్న, పచ్చిమేతల్లో అధికంగా ఉంటుంది. పశు వు శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కెరోటిన్ వి టమిన్-ఎగా మారుతుంది. ఇది 90% వరకూ కాలేయంలో నిల్వ ఉంటుంది. మిగిలినది మూ త్రపిండాలు, ఊపిరితిత్తుల్లో దాగి ఉంటుంది. శరీర కణాలు బాగా పనిచేయాలంటే విటమిన్-ఎ అవసరమవుతుంది. ఇది లోపిస్తే చర్మం గరుకుగా తయారవుతుంది. కంటి లోపలి పొర ఎండిపోయి, చూపు పోయే ప్రమాదం ఉంది. పశువులో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా అది సులువుగా వ్యాధుల బారిన పడుతుంది. విటమిన్-ఎ లోపిస్తే పశువుకు ఆకలి మందగిస్తుంది. కోళ్లకు అయితే కళ్లు, ముక్కు రంధ్రాల నుంచి ద్రవాలు కారుతుంటాయి. ఎముకల్లో పెరుగుదల ఆగిపోతుంది. వాటి ఆకారం కూడా మారుతుంది. విటమిన్-ఎ లోప నివారణ కోసం పశువుకు విధిగా పచ్చిమేతలు మేపాలి. కాల్షియంను అందిస్తుంది విటమిన్-డి చాలా వరకూ సూర్యరశ్మిలోని అల్ట్రా వయొలెట్ కిరణాల ద్వారా పశువు శరీరంలోనే ఉత్పత్తి అవుతుంది. ఎముకల నుంచి కాల్షియం విడుదల కావడానికి, అది శరీర భాగాలకు చేరడానికి విటమిన్-డి ఎంతో అవసరం. అంతేకాదు... పేగుల ద్వారా కాల్షియం-భాస్వరం పశువు శరీర భాగాలకు చేరడానికి, వాటిని ఎముకల్లో నిల్వ చేయడానికి కూడా ‘డి’ విటమిన్ అవసరమవుతుంది. ఎముకలకు కాల్షియం అందకపోతే పశువుకు ‘రికెట్స్’ వ్యాధి సోకుతుంది. పెద్ద పశువులకు ‘ఆస్టియో మలేసియా’ అనే స్థితి ఎదురవుతుంది. విటమిన్-డి లోపిస్తే ఎముకలకు సంబంధించిన వ్యాధులు రావడమే కాకుండా ఆకలి మందగించడం, పెరుగుదల సరిగా లేకపోవడం, బిగుసుకుపోవడం, కుంటడం, ఎక్కువగా లేదా తరచుగా ఎముకలు విరగడం, పక్కటెముకలు పూసల మాదిరిగా తయారవడం, కీళ్లు వాయడం వంటి లక్షణాలు కూడా కన్పిస్తాయి. కోళ్లలోనూ, దూడల్లోనూ రికెట్స్ లక్షణాలు బాగా కన్పిస్తాయి. పునరుత్పత్తికి దోహదపడుతుంది విటమిన్-ఇ పునరుత్పత్తికి దోహదపడుతుంది. మొలక వచ్చిన శనగలు, ఉలవలు వంటి వాటిలో ఇది ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎదకు రాని పశువులకు మొలక వచ్చిన శనగలను మేపాలని చెబుతుంటారు. ‘ఇ’ విటమిన్ ఎక్కువ భాగం కాలేయంలో నిల్వ ఉంటుంది. కొవ్వు కణాలు చెదిరిపోకుండా కాపాడుతుంది. పశువులో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రక్తం గడ్డకట్టడానికి... రక్తం గడ్డకట్టడానికి విటమిన్-కె దోహదపడుతుంది. పశువు పేగుల్లో ఉన్న సూక్ష్మక్రిములు దీనిని తయారు చేస్తాయి. తీపి క్లోవర్ మొక్కలను పశువులకు మేపితే విటమిన్-కె లోపిస్తుంది. ఈ మొక్కల్లో డైకుమెరాల్ అనే విష పదార్థం ఉండడమే దీనికి కారణం. పశువు శరీర నిర్మాణానికి ఈ పదార్థం అవరోధంగా ఉంటుంది. పెద్ద పొట్ట పశువుల్లో రూమెన్లోని సూక్ష్మక్రిములు విటమిన్-కెను తయారు చేస్తాయి. లోపం కన్పించదు కానీ... బి-కాంప్లెక్స్ విటమిన్లు 12 రకాలు. సాధారణంగా పశువుల్లో వీటి లోపం కన్పించదు. ఎందుకంటే పశువు శరీరంలో ఉన్న సూక్ష్మక్రిములే వీటిని ఉత్పత్తి చేస్తుంటాయి. పశువుకు మనం అందించే పోషకాల నుంచి శక్తి విడుదల కావాలంటే ఎంజైములు అవసరమవుతాయి. ఆ ఎంజైముల్లో బి-కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి. పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, ప్రొటీన్ల నుంచి శక్తి విడుదల కావడానికి బి-కాంప్లెక్స్ విటమిన్లు బాగా ఉపయోగపడతాయి. ఏ కారణం చేతనైనా ఇవి లోపిస్తే చర్మ సంబంధమైన వ్యాధులు వస్తాయి. పశువులో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. రక్తంలో గ్లూకోజ్ నిర్వహణ దెబ్బతింటుంది. రక్తహీనత ఏర్పడుతుంది. విటమిన్లలో ఏది లోపిస్తే దానికి సంబంధించిన వ్యాధి లక్షణాలు బయటపడతాయి. - డాక్టర్ ఎం.వి.ఎ.ఎన్.సూర్యనారాయణ సీనియర్ శాస్త్రవేత్త, అధిపతి పశు పరిశోధనా స్థానం, గరివిడి విజయనగరం జిల్లా -
మూడేళ్లొచ్చినా... ఇంకా నడక, మాటలు రాలేదు..?
మా అబ్బాయికి మూడేళ్లు. వాడిలో ఆటిజం లక్షణాలున్నట్లు కనుక్కున్నాము. ఇంకా మాటలు సరిగా రాలేదు. ఏది కావాలన్నా అడగలేడు. ఎవరితోనూ కలవడు. వాడిని డాక్టర్ దగ్గరకు తీసుకెళితే కొన్ని రకాల రక్తపరీక్షలతోబాటు ఈయీజీ, ఎమ్మారై పరీక్షలు చేయించమన్నారు. దాంతో మా ఆవిడ చాలా కంగారుపడుతోంది. అసలు మా అబ్బాయి సమస్య ఏమిటి? ఇంత ఖరీదైన పరీక్షలు వాడికి ఈ వయసులోనే ఎందుకు? -బి. రాధాకృష్ణ, హైదరాబాద్ మీ సమస్యకు జవాబిచ్చే ముందు మాకు మరికొంత సమాచారం కావాలి. మీ అబ్బాయికి ఆటిజమ్ అని తెలిసిందన్నారు. ఎలా తెలిసింది? గర్భధారణ సమయంలో మీరేమైనా రుగ్మతలతో బాధపడ్డారా? ప్రసవం ఎలా జరిగింది? కాంప్లికేషన్లు ఏమైనా ఎదురైనాయా అనే ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే మీకు పూర్తి సమాధానం ఇవ్వగలం. అయితే మాకు అర్థమయినదాన్ని బట్టి... మీ బాబులో ఏవైనా నరాలకు సంబంధించి అసాధారణ రుగ్మతలు లేదా ఫిట్స్, మూర్ఛ వంటి ఏమైనా ఉండి ఉండవచ్చునని మీ బాబుకు చికిత్స చేస్తున్న డాక్టర్ అనుమానించి ఉండవచ్చు. అందుకే ఎమ్మారై, ఈఈజీ పరీక్షలు చేయించమని సలహా ఇచ్చి ఉంటారు. ఒక్కోసారి జన్యుసంబంధిత పరీక్షలు చేయించవలసి రావచ్చు. డాక్టర్లు అయినా చిన్న పిల్లలకు సంబంధించి అన్ని విధాలైన కేస్ స్టడీస్ చేసి, ఆయా పరీక్షల రిపోర్టులు వచ్చిన తర్వాతగానీ చికిత్స మొదలు పెట్టలేరు కదా! పెరుగుదలకు సంబంధించిన సమస్యలు అంటే పారాడటం, నడక, మాట్లాడటం, మెదడు అభివృద్ధి చెందటం వంటివి ఆటిజమ్ ఉన్నవారికే ఉండాలని లేదు. ఎవరికైనా రావచ్చు. శిశువులో ఎదుగుదల ఆలస్యం అవుతోందనుకుంటే వైద్యుడి సలహాను బట్టి విటమిన్లు, ధాతువులు, ఇతర పోషకాలు కలిగిన ఆహారాన్ని లేదా నేరుగా విటమిన్ మాత్రలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ను తగిన మోతాదులో బిడ్డకు అందించవలసి ఉంటుంది. మాటకు సంబంధించి స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ వంటి చికిత్సల ద్వారా మెరుగైన ఫలితాలను రాబట్టవచ్చు. అన్నింటికన్నా ముఖ్యం... కొందరిలో కొన్ని ఆలస్యంగా కూడా జరగవచ్చు. అంతమాత్రానికే తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు భయపడిపోయి, బెంబేలెత్తిపోయి మీ బిడ్డకు ఇక మాటలు రావేమో, నడవలేడేమో అని కుంగిపోవలసిన అవసరం లేదు. బిడ్డ ఎదుగుదలను జాగ్రత్తగా పరిశీలిస్తూ, ఇంటిలోని ఇతర పెద్దల సలహా మేరకు సత్ఫలితాలను పొందడానికి చేయగలిగిన ప్రయత్నాలు చేస్తూ... మరీ ఆలస్యం అవుతోందనుకుంటే డాక్టర్ సలహా తీసుకుని వాటిని ఆచరణలో పెట్టడం అవసరం. మీ బాబుకు మూడేళ్లే అన్నారు కదా, ఇప్పటికి ఏమీ మించి పోలేదు. మీ ఫ్యామిలీ హిస్టరీలో ఇలా ఆలస్యంగా నడక, మాటలు వచ్చిన వారున్నారేమో మీ పెద్దల ద్వారా తెలుసుకుని, అందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూనే, చైల్డ్ సైకియాట్రిస్ట్ను కూడా సంప్రదించండి. విష్ యు ఆల్ ది బెస్ట్. డాక్టర్ కల్యాణ్ సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్