Yash Dhull
-
సచిన్ రికార్డు బ్రేక్ చేసిన ముషీర్ ఖాన్!
దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తూ రైజింగ్ స్టార్గా ప్రశంసలు అందుకుంటున్నాడు ముంబై బ్యాటర్ ముషీర్ ఖాన్. దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-‘బి’ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు. ఇండియా-‘ఏ’ జట్టుతో మ్యాచ్ సందర్భంగా మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేయగా వన్డౌన్ బ్యాటర్ ముషీర్ ఖాన్ పట్టుదలగా నిలబడ్డాడు.ఫోర్ల వర్షంమొత్తంగా 373 బంతులు ఎదుర్కొని 181 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో 16 ఫోర్లు, 5 సిక్స్లు ఉన్నాయి. స్పిన్నర్ల బౌలింగ్లో దూకుడుగా ఆడుతూ ఈ మేర పరుగులు రాబట్టాడు. అయితే, చైనామన్ స్పి న్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ముషీర్ అవుట్ కావడం గమనార్హం.ఇక ముషీర్కు తోడు టెయిలెండర్ నవదీప్ సైనీ అర్ధ శతకం(144 బంతుల్లో 56)తో రాణించాడు. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా ఇండియా- ‘బి’ తొలి ఇన్నింగ్స్లో 321 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.సచిన్ రికార్డు బద్దలుకాగా జట్టును పటిష్ట స్థితిలో నిలపడంలో కీలక పాత్ర పోషించిన ముషీర్ ఖాన్.. ఈ మ్యాచ్ సందర్భంగా అరుదైన ఘనత సాధించాడు. టీనేజ్లోనే దులిప్ ట్రోఫీలో అరంగేట్రం చేసి అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ను ముషీర్ వెనక్కినెట్టాడు.కాగా 1991, జనవరిలో గువాహటి వేదికగా జరిగిన దులిప్ ట్రోఫీలో వెస్ట్ జోన్కు ప్రాతినిథ్యం వహించిన సచిన్.. ఈస్ట్జోన్తో మ్యాచ్లో 159 పరుగులు చేశాడు. తాజాగా.. పందొమిదేళ్ల ముషీర్ సచిన్ను అధిగమించాడు.అన్నను మించిపోతాడేమో!దేశవాళీ క్రికెట్లో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్న ముషీర్ ఖాన్ టీమిండియా యువ సంచలనం సర్ఫరాజ్ ఖాన్కు తోడబుట్టిన తమ్ముడు. మిడిలార్డర్లో రాణించగల సత్తా ఉన్న స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. గత రంజీ సీజన్లో ఓ ద్విశతకం బాదిన ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. ఓవరాల్గా 529 పరుగులు సాధించాడు. అంతేకాదు... అండర్-19 వరల్డ్కప్ టోర్నీలోనూ సత్తా చాటాడు. ఇప్పుడు దులిప్ ట్రోఫీలోనూ తనదైన మార్కు చూపిస్తున్నాడు. ఈ క్రమంలో నెటిజన్లు ముషీర్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అన్నను మించిన తమ్ముడు అంటూ కొనియాడుతున్నారు.దులిప్ ట్రోఫీ అరంగేట్రంలో టీనేజ్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లు19 ఏళ్ల వయసులో బాబా అపరాజిత్- 212 పరుగులు(2013లో)19 ఏళ్ల వయసులో యశ్ ధుల్- 193 పరుగులు(2022లో)19 ఏళ్ల వయసులో ముషీర్ ఖాన్- 181 పరుగులు(2024లో)18 ఏళ్ల వయసులో సచిన్ టెండుల్కర్-159 పరుగులు (1991లో).A 6⃣ that hits the roof & then caught in the deep!Kuldeep Yadav bounces back hard and a magnificent innings of 181(373) ends for Musheer Khan 👏#DuleepTrophy | @IDFCFIRSTBankFollow the match ▶️ https://t.co/eQyu38Erb1 pic.twitter.com/OSJ2b6kmkk— BCCI Domestic (@BCCIdomestic) September 6, 2024 -
‘గుండె’ ధైర్యంతో ముందుకు.. క్రికెటర్గా రాణిస్తూ (ఫొటోలు)
-
భారత స్టార్ క్రికెటర్ గుండెలో రంధ్రం.. సర్జరీ తర్వాత ఇలా..
అండర్-19 ప్రపంచకప్-2022 గెలిచిన భారత కెప్టెన్ యశ్ ధుల్ గత కొంతకాలంగా ఫామ్లేమితో సతమతమవుతున్నాడు. ఈ ఏడాది అట్టహాసంగా ఆరంభించిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్(డీపీఎల్)లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్కు సారథిగా ఎంపికైన అతడు పూర్తిగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో కెప్టెన్సీని జాంటీ సిద్ధుకు అప్పగించిన యశ్ ధుల్.. కేవలం ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగుతున్నాడు.బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకున్నా ఫలితం లేకపోవడంతో ఓ మ్యాచ్కు దూరమయ్యాడు కూడా!.. ఇప్పటివరకు డీపీఎల్లో ఆడిన ఐదు ఇన్నింగ్స్లో కలిపి కేవలం 93 పరుగులే చేయగలిగాడు యశ్ ధుల్. ఈ నేపథ్యంలో కామెంటేటర్లు, విశ్లేషకులు ఈ 21 ఏళ్ల బ్యాటర్ ప్రదర్శనపై విమర్శలు గుప్పిస్తున్నారు.క్రికెటర్ గుండెలో రంధ్రం.. ఇటీవలే సర్జరీఈ క్రమంలో యశ్ ధుల్ తన అనారోగ్యానికి సంబంధించిన షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. యశ్ ధుల్కు బాల్యం నుంచే గుండెలో రంధ్రం ఉందని.. ఇటీవలే ఇందుకు సంబంధించిన సర్జరీ ఒకటి జరిగిందని అతడి తండ్రి విజయ్ న్యూస్18తో అన్నారు. కొన్నాళ్ల క్రితం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందినపుడు అక్కడి నిపుణులు యశ్ ధుల్ సమస్యను గుర్తించి.. శస్త్ర చికిత్స చేయించుకోవాలని సూచించినట్లు తెలిపారు.అందుకే ఆడలేదుఈ క్రమంలో ఢిల్లీలో సర్జరీ చేయించామని.. బీసీసీఐ వైద్య బృందం ఎప్పటికప్పుడు అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తోందని విజయ్ వెల్లడించారు. ఇక ఇటీవల యశ్ ధుల్కు ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా జారీ చేశారని అతడి కోచ్ ప్రదీప్ కొచ్చర్ తెలిపారు. అయితే, ఎండ, ఆర్ద్రత ఎక్కువగా ఉన్న సమయంలో యశ్ ధుల్ విశ్రాంతి తీసుకుంటున్నాడని.. అందుకే కొన్ని మ్యాచ్లకు దూరమయ్యాడన్నారు. రంజీ ట్రోఫీ ఆడే క్రమంలో ఇప్పటి నుంచే ఈ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.సానుకూల దృక్పథంతో ఉన్నాఇక ఈస్ట్ ఢిల్లీ రైడర్స్తో మంగళవారం నాటి మ్యాచ్లో 11 బంతులు ఎదుర్కొని కేవలం ఎనిమిది పరుగులే చేసిన అనంతరం ధుల్ మాట్లాడుతూ.. ‘‘గత కొన్ని రోజులుగా అనుకోని సంఘటనలు జరిగాయి. ఇప్పుడిప్పుడే నేను కోలుకుంటున్నాను. త్వరలోనే పూర్తిస్థాయిలో రాణిస్తాననే సానుకూల దృక్పథంతో ఉన్నాను. వంద శాతం ఎఫర్ట్ పెట్టి ఆడతా’’ అని పేర్కొన్నాడు. కాగా ఇటీవల ప్రకటించిన దులిప్ ట్రోఫీ-2024 రెడ్ బాల్ టోర్నీలో యశ్ ధుల్కు చోటు దక్కలేదు. ఇక ఐపీఎల్-2023లో యశ్ ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ -
పసికూన చేతిలో పరాభవం.. కెప్టెన్సీ కోల్పోయిన స్టార్ క్రికెటర్
చిన్న జట్టు చేతిలో పరాభవం ఓ యువ క్రికెటర్ కెప్టెన్సీకి ఎసరు తెచ్చిపెట్టింది. రంజీ ట్రోఫీ 2024లో భాగంగా పసికూన పుదుచ్చేరి చేతిలో ఓడటంతో ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ తమ కెప్టెన్ యశ్ ధుల్ను పదవి నుంచి తొలగించింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న పుదుచ్చేరి చేతిలో పటిష్టమైన తమ జట్టు ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేని ఢిల్లీ పెద్దలు మరో ఆలోచన లేకుండా కెప్టెన్పై వేటు వేశారు. కెప్టెన్సీ నుంచి యశ్ ధుల్ను తొలగించడంపై ఢిల్లీ హెడ్ కోచ్ దేవాంగ్ పటేల్ మాట్లాడుతూ.. యశ్ ధుల్ను కెప్టెన్సీ నుంచి తొలగించడం అనేది సెలెక్టర్ల నిర్ణయం. నా వరకైతే యశ్ ఢిల్లీ క్రికెట్తో పాటు టీమిండియాకు భవిష్యత్తు. ఇలాంటి ఆటగాడు కెప్టెన్సీ కారణంగా పరుగులు చేయలేకపోతున్నాడు. యశ్ ముందుగా పరుగులు చేయడంపై దృష్టి పెట్టాలని నేను కూడా కోరుకుంటున్నాను. యశ్ను పరుగులు చేయనీకుండా నియంత్రించే దేన్నైనా ముందుగా పక్కకు పెట్టాలి. కెప్టెన్సీ భారం అతన్ని బ్యాటింగ్పై దృష్టి పెట్టనీయకుండా చేస్తుంది. అందుకే సెలెక్టర్లు అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించారని భావిస్తున్నాను. తదుపరి జరిగే మ్యాచ్కు యశ్ ధుల్ స్థానంలో మిడిలార్డర్ ఆటగాడు హిమ్మత్ సింగ్ ఢిల్లీ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. ఆయుశ్ బదోని హిమ్మత్ సింగ్కు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) వ్యవహరిస్తానడి దేవాంగ్ పటేల్ తెలిపాడు. కాగా, సొంత మైదానమైన అరుణ్ జైట్లీ స్టేడియంలో పసికూన పుదుచ్చేరి చేతిలో ఢిల్లీ జట్టు 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో దారుణంగా విఫలమైన ఢిల్లీ తొలి ఇన్నింగ్స్లో 148, రెండో ఇన్నింగ్స్లో 145 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్లో 244 పరుగులు చేసిన పుదుచ్చేరి, సెకెండ్ ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 51 పరుగులు చేసి ఢిల్లీపై సంచలన విజయం సాధించింది. పుదుచ్చేరి బౌలర్ గౌరవ్ యాదవ్ 10 వికెట్లు తీసి ఢిల్లీ పతనాన్ని శాశించాడు. ఢిల్లీ జట్టులో ఇషాంత్ శర్మ, నవ్దీప్ సైనీ లాంటి స్టార్ పేసర్లు ఉన్నారు. -
ఢిల్లీకి ఊహించని షాక్.. 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన పుదుచ్చేరి
రంజీ ట్రోఫీ-2024 సీజన్ తొలి మ్యాచ్లోనే ఢిల్లీ జట్టుకు ఘోర పరాభావం ఎదురైంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఎలైట్ గ్రూప్ డి మొదటి మ్యాచ్లో ఢిల్లీను 9 వికెట్ల తేడాతో పుదుచ్చేరి చిత్తు చేసింది. రంజీ ట్రోఫీ చరిత్రలో పుదుచ్చేరి సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటిగా ఈ మ్యాచ్ నిలిచిపోనుంది. పుదుచ్చేరి చారిత్రత్మక విజయంలో పేసర్ గౌరవ్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించిన గౌరవ్ యాదవ్.. రెండో ఇన్నింగ్స్లో కూడా 3 వికెట్లతో చెలరేగాడు. ఓవరాల్గా 10 వికెట్లు పడగొట్టి గౌరవ్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఢిల్లీ 148 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీ బ్యాటర్లలో హర్ష్ త్యాగీ(34) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం పుదుచ్చేరి తమ మొదటి ఇన్నింగ్స్ను 244 పరుగుల వద్ద ముగించి 96 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్ మొదలుపెట్టిన ఢిల్లీ అదే ఆటతీరును కొనసాగించింది. రెండో ఇన్నింగ్స్లో సైతం కేవలం 145 పరుగుల చూపచుట్టేసింది. ఈ క్రమంలో 51 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే పుదుచ్చేరి ముందు ఢిల్లీ ఉంచగల్గింది. 51 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్ మాత్రమే పుదుచ్చేరి ఛేదించింది. కాగా ఈ మ్యాచ్లో ఢిల్లీ కెప్టెన్ యష్ ధుల్ దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్లు కలిపి కేవలం 25 పరుగులు మాత్రమే చేశాడు. కాగా వ్యక్తిగత ప్రదర్శన మాత్రమే కాకుండా కెప్టెన్ ధుల్ విఫలమయ్యాడు. చదవండి: Pak Vs NZ: పాక్ క్రికెట్తో ప్రయాణం ముగిసిపోయింది.. ఇక సెలవు! -
Asia Cup 2023: టీమిండియాకు పరాభవం.. ఫైనల్లో పాక్ చేతిలో ఓటమి
ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్-ఏ.. భారత-ఏ జట్టుకు షాకిచ్చింది. కొలొంబో వేదికగా ఇవాళ (జులై 23) జరిగిన తుది సమరంలో పాక్ 128 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. 353 భారీ లక్ష్య ఛేదనలో తడబడిన టీమిండియా.. 224 పరుగులకు ఆలౌటైంది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియాకు సైతం శుభారంభమే లభించినప్పటికీ, భారత ప్లేయర్లు దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు. 61 పరుగులు చేసిన ఓపెనర్ అభిషేక్ శర్మ టాప్ స్కోరర్గా నిలువగా.. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (29), కెప్టెన్ యశ్ ధుల్ (39) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో సుఫియాన్ ముఖీమ్ 3 వికెట్లు పడగొట్టి టీమిండియాను దెబ్బకొట్టగా.. అర్షద్ ఇక్బాల్, మెహ్రాన్ ముంతాజ్, మహ్మద్ వసీం జూనియర్ తలో 2 వికెట్లు, ముబాసిర్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు సైమ్ అయూబ్ (51 బంతుల్లో 59; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సాహిబ్జాదా ఫర్హాన్ (62 బంతుల్లో 65; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించగా.. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన తయ్యబ్ తాహిర్ (71 బంతుల్లో 108; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. పాక్ ఇన్నింగ్స్లో అయూబ్, ఫర్హాన్, తాహిర్లతో పాటు ఒమైర్ యూసఫ్ (35), ముబాసిర్ ఖాన్ (35) కూడా రాణించారు. భారత బౌలర్లలో హంగార్గేకర్, రియాన్ పరాగ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, మానవ్ సుతార్, నిషాంత్ సింధు తలో వికెట్ దక్కించుకున్నారు. -
IND VS PAK Final: పాక్ బ్యాటర్ విధ్వంసకర శతకం.. టీమిండియా ముందు భారీ లక్ష్యం
ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్-ఏ.. భారత-ఏ జట్టు ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. కొలొంబో వేదికగా ఇవాళ (జులై 23) మధ్యాహ్నం మొదలైన తుది సమరంలో టాస్ గెలిచిన భారత్.. పాకిస్తాన్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్కు ఓపెనర్లు సైమ్ అయూబ్ (51 బంతుల్లో 59; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సాహిబ్జాదా ఫర్హాన్ (62 బంతుల్లో 65; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించగా.. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన తయ్యబ్ తాహిర్ (71 బంతుల్లో 108; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది. పాక్ ఇన్నింగ్స్లో అయూబ్, ఫర్హాన్, తాహిర్లతో పాటు ఒమైర్ యూసఫ్ (35), ముబాసిర్ ఖాన్ (35) కూడా రాణించారు. ఖాసిం అక్రమ్ (0), కెప్టెన్ మహ్మద్ హరీస్ (2), మెహ్రన్ ముంతాజ్ (13) విఫలం కాగా.. మహ్మద్ వసీం జూనియర్ (17), సూఫియాన్ ముఖీమ్ (4) నాటౌట్గా నిలిచారు. 14 పరుగులు ఎక్స్ట్రాల రూపంలో వచ్చాయి. భారత బౌలర్లలో హంగార్గేకర్, రియాన్ పరాగ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, మానవ్ సుతార్, నిషాంత్ సింధు తలో వికెట్ దక్కించుకున్నారు. భారత బౌలరల్లో నిషాంత్ (5.30) మినహా అందరూ 6 అంతకంటే ఎక్కువ ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు. హర్షిత్ రాణా 6 ఓవర్లలో 51 పరుగులు, హంగార్గేకర్ 6 ఓవర్లలో 48, అభిషేక్ శర్మ 9 ఓవర్లలో 54, యువ్రాజ్ సింగ్ దోడియా 7 ఓవర్లలో 56, మానవ్ సుతార్ 9 ఓవర్లలో 68, రియాన్ పరాగ్ 4 ఓవర్లలో 24.. ఇలా ప్రతి భారత బౌలర్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. బ్యాటర్లకు స్వర్గధామమైన పిచ్పై టీమిండియా కెప్టెన్ యశ్ ధుల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం పెద్ద తప్పిదమని విశ్లేషకులు అంటున్నారు. ప్రత్యర్ధి భారీ టార్గెట్ నిర్ధేశించినప్పటికీ బ్యాటింగ్ ట్రాక్ కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని, టీమిండియా బ్యాటింగ్ డెప్త్ ఎక్కువగా ఉందని, ఎలాగైనా తామే గెలుస్తామని భారత అభిమానులు సోషల్మీడియా వేదికగా యువ భారత జట్టుకు ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. -
భారత్-పాకిస్తాన్ ఫైనల్ పోరు.. ఏ జట్టు ఫేవరేట్ అంటే?
ఆసియా ‘ఎమర్జింగ్’ కప్ టోర్నీ తుది పోరుకు రంగం సిద్ధమైంది. కొలంబోలో నేడు జరిగే ఫైనల్లో పాకిస్తాన్ ‘ఎ’తో భారత్ ‘ఎ’ తలపడుతుంది. బలాబలాలను బట్టి చూస్తే యశ్ ధుల్ నాయకత్వంలోని భారత జట్టే ఫేవరెట్గా ఉంది. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో భారత్ 8 వికెట్ల తేడాతో పాక్ను చిత్తు చేసింది. టోర్నీలో చెరో సెంచరీ, హాఫ్ సెంచరీ చేసిన ధుల్, సాయి సుదర్శన్ మంచి ఫామ్లో ఉన్నారు. బౌలింగ్లో కూడా నిశాంత్ సింధు 10 వికెట్లతో టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. పాకిస్తాన్ టీమ్ను చూస్తే పలువురు ఆటగాళ్లు మొహమ్మద్ వసీమ్, కెప్టెన్ మొహమ్మద్ హారిస్, ఫర్హాన్, అర్షద్ ఇక్బాల్లకు ఇప్పటికే సీనియర్ టీమ్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో వీరు చెలరేగితే టీమిండియా తీవ్ర పోటీ ఎదురువ్వక తప్పదు. తుది జట్లు(అంచనా): భారత్: సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ, యశ్ ధుల్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, నికిన్ జోస్, నిశాంత్ సింధు, హర్షిత్ రాణా, మానవ్ సుతార్, రాజవర్ధన్ హంగర్గేకర్, యువరాజ్ పాకిస్తాన్: సయీమ్ అయూబ్, తయ్యబ్ తాహిర్, మహ్మద్ హారీస్ (కెప్టెన్), సాహిబ్జాదా ఫర్హాన్, ఒమైర్ యూసుఫ్, ఖాసిం అక్రమ్, ముబాసిర్ ఖాన్, అమద్ బట్, మహ్మద్ వసీం జూనియర్, అర్షద్ ఇక్బాల్, సుఫియాన్ ముఖీమ్ చదవండి: IND vs WI: అశ్విన్తో అట్లుంటది మరి.. విండీస్ కెప్టెన్ ఫ్యూజ్లు ఔట్! వీడియో వైరల్ -
Asia Cup: చెలరేగిన స్పిన్నర్లు.. ఫైనల్కు దూసుకెళ్లిన భారత్! పాకిస్తాన్తో ఢీ
ACC Mens Emerging Teams Asia Cup 2023- India A vs Bangladesh A: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023లో భారత- ఏ జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. కొలంబోలో శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్ను 51 పరుగులతో చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. తద్వారా తొలి సెమీస్లో శ్రీలంకను ఓడించి ఫైనల్కు చేరిన పాకిస్తాన్తో టైటిల్ వేటలో తలపడనుంది. యశ్ ధుల్ కెప్టెన్ ఇన్నింగ్స్ టాస్ గెలిచిన బంగ్లాదేశ్ యువ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్, గత మ్యాచ్లో అజేయ సెంచరీతో మెరిసిన సాయి సుదర్శన్ 21 పరుగులకే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 34 పరుగులు సాధించాడు. ఇక నిశాంత్ సింధు 5, రియాన్ పరాగ్ 12, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ 1, హర్షిత్ రాణా 9, మానవ్ సుతార్ 21(రనౌట్), రాజవర్ధన్ హంగేర్గకర్ 15, యువరాజ్సిన్హ్ దోడియా 0(నాటౌట్) నిరాశ పరిచారు. 49.1ఓవర్లలో కేవలం 211 పరుగులు మాత్రమే చేసిన యశ్ ధుల్ సేన ఆలౌట్ అయింది. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్, తంజీ హసన్ షకీబ్, రకీబుల్ హసన్ తలా రెండు వికెట్లు తీయగా.. రిపన్ మొండాల్, కెప్టెన్ సైఫ్ హసన్, సౌమ్యా సర్కార్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. చెలరేగిన స్పిన్నర్లు స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆరంభంలో దంచికొట్టింది. ఓపెనర్లు మహ్మద్ నయీమ్ 38, తంజీద్ హసన్ 51 పరుగులతో రాణించారు. వన్డౌన్లో వచ్చిన జాకీర్ హసన్ మాత్రం 5 పరుగులకే చేతులెత్తేయగా.. భారత స్పిన్నర్లు మానవ్ సుతార్, నిశాంత్ సింధు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టారు. మానవ్ 3 వికెట్లు సాధించగా.. నిశాంత్ ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్ను కకావికలం చేశారు. యువరాజ్సిన్హ్ దోడియా , అభిషేక్ శర్మ ఒక్కో వికెట్ తీశారు. దీంతో 160 పరుగులకే బంగ్లా ఆలౌట్ అయింది. 51 పరుగులతో భారత జయభేరి మోగించింది. యశ్ ధుల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక జూలై 23న ఫైనల్లో పాకిస్తాన్ను భారత్ ఢీకొట్టనుంది. చదవండి: అయ్యో రోహిత్.. అలా జరుగుతుందని అస్సలు ఊహించలేదుగా! వీడియో వైరల్ -
సెమీస్లో యశ్ ధుల్ హాఫ్ సెంచరీ.. భారత్ 211 ఆలౌట్! పాక్ మాత్రం ఏకంగా..
ACC Mens Emerging Teams Asia Cup 2023- India A vs Bangladesh A: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన భారత- ఏ జట్టు సెమీస్లో నామమాత్రపు స్కోరు చేసింది. బంగ్లాదేశ్- ఏ జట్టుతో మ్యాచ్లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయింది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో శుక్రవారం ఇరు జట్ల మధ్య సెమీ ఫైనల్-2 మొదలైంది. యశ్ ధుల్ కెప్టెన్ ఇన్నింగ్స్ టాస్ గెలిచిన బంగ్లాదేశ్ యువ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్, గత మ్యాచ్లో అజేయ సెంచరీతో మెరిసిన సాయి సుదర్శన్ 21 పరుగులకే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 34 పరుగులు సాధించాడు. వన్డౌన్ బ్యాటర్ నికిన్ జోస్ 17, ఆ తర్వాతి స్థానాల్లో ఆడిన యశ్ ధుల్ 66, నిశాంత్ సింధు 5, రియాన్ పరాగ్ 12, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ 1, హర్షిత్ రాణా 9, మానవ్ సుతార్ 21(రనౌట్), రాజవర్ధన్ హంగేర్గకర్ 15, యువరాజ్సిన్హ్ దోడియా 0(నాటౌట్) పరుగులు సాధించారు. కెప్టెన్ యశ్ ధుల్ అర్ధ శతకం కారణంగా భారత జట్టు 211 పరుగులు చేయగలిగింది. 49.1 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్, తంజీ హసన్ షకీబ్, రకీబుల్ హసన్ రెండేసి వికెట్లు తీయగా.. రిపన్ మొండాల్, కెప్టెన్ సైఫ్ హసన్, సౌమ్యా సర్కార్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఫైనల్లో పాకిస్తాన్ ఇక పాకిస్తాన్- ఏ జట్టుతో బుధవారం జరిగిన మ్యాచ్లో యశ్ ధుల్ సేన 8 వికెట్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతకుముందు యూఏఈ, నేపాల్లపై కూడా భారీ తేడాతో గెలుపొందింది. అయితే, సెమీ ఫైనల్లో బంగ్లాను చిత్తు చేస్తేనే ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. ఆడిన మూడు మ్యాచ్లలో చెలరేగిన భారత బౌలర్లు కీలక మ్యాచ్లో ఎలా రాణిస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది. కాగా సెమీ ఫైనల్-1లో శ్రీలంకపై గెలుపొందిన పాక్ ఫైనల్కు దూసుకెళ్లింది. చదవండి: మొన్న రుతురాజ్ గైక్వాడ్.. ఇప్పుడు టీమిండియాకు మరో కొత్త కెప్టెన్! Leading from the front 💪 50* for skipper Yash Dhull 👏#EmergingAsiaCupOnFanCode #INDvBAN pic.twitter.com/tqPay3zS1Z — FanCode (@FanCode) July 21, 2023 -
Asia Cup 2023: జులై 23న భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్..!
ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 టోర్నీలో నిన్న (జులై 19) భారత్-ఏ, పాక్-ఏ జట్ల మధ్య గ్రూప్ దశ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో యువ భారత్ 8 వికెట్ల తేడాతో పాక్ సేనను మట్టికరిపించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా అన్ని విభాగాల్లో రాణించి, అద్భుత విజయాన్ని అందుకుంది. తొలుత హంగార్గేకర్ (5/42), మానవ్ సుతార్ (3/36) బంతితో విజృంభించగా.. ఆతర్వాత ఐపీఎల్ హీరో సాయి సుదర్శన్ (110 బంతుల్లో 104 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్ సెంచరీతో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. అతనికి నికిన్ జోస్ (53), కెప్టెన్ యశ్ ధుల్ (21 నాటౌట్), అభిషేక్ శర్మ (20) సహకరించారు. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే భారత్, పాక్లు ఇదివరకే సెమీస్కు చేరాయి. కాగా, ఇదే టోర్నీలో భారత్, పాక్లు మరోసారి తలపడే అవకాశం ఉంది. ఇదివరకే సెమీస్కు చేరిన భారత్, పాక్లు ఈ గండాన్ని అధిగమిస్తే ఫైనల్లో మరోసారి ఎదురెదురుపడే ఛాన్స్ ఉంది. రేపు (జులై 21) తొలి సెమీఫైనల్లో శ్రీలంక-పాకిస్తాన్ జట్లు.. రెండో సెమీఫైనల్లో భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచ్ల్లో విజేతలు జులై 23న కొలొంబో వేదికగా జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ టోర్నీలో ఆటగాళ్ల ఫామ్ దృష్ట్యా శ్రీలంక, బంగ్లాదేశ్లతో పోలిస్తే భారత్, పాక్లకే ఫైనల్కు చేరే అవకాశాలు అధికంగా ఉన్నాయి. సో.. ఇదే ఆసియా కప్లో భారత్-పాక్లు మరోసారి తలపడటం ఖాయం. సెమీఫైనల్ (తొలి సెమీస్ ఉదయం 10 గంటలకు), ఫైనల్ మ్యాచ్లు ఆయా తేదీల్లో స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతాయి. -
Ind Vs Pak: సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్.. పాక్ను చిత్తు చేసిన భారత్
ACC Mens Emerging Teams Asia Cup 2023- Pakistan A vs India A: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023లో భాగంగా భారత యువ జట్టు పాకిస్తాన్పై ఘన విజయం సాధించింది. ఎనిమిది వికెట్ల తేడాతో పాక్ను చిత్తు చేసింది. శ్రీలంకలోని కొలంబో వేదికగా భారత్-ఏ- పాకిస్తాన్- ఏ జట్లు బుధవారం తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, పాక్కు ఆదిలోనే షాకిచ్చాడు భారత యువ పేసర్ రాజ్వర్ధన్ హంగర్గేకర్. ఓపెనర్ సయీమ్ ఆయుబ్ను డకౌట్ చేశాడు. ఐదు వికెట్లతో చెలరేగిన హంగర్గేకర్ అంతేకాదు.. వన్డౌన్ బ్యాటర్ ఒమైర్ యూసఫ్తో కూడా సున్నా చుట్టించాడు. దీంతో ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన పాక్ను ఓపెనర్ షాహిజాదా ఫర్హాన్(35), హసీబుల్లా ఖాన్(27) ఆదుకున్నారు. అయితే, భారత స్పిన్నర్ మానవ్ సుతార్, ఫాస్ట్బౌలర్ హంగేర్గకర్ వారిని ఎక్కువసేపు నిలవనీయలేదు. వీరిద్దరి విజృంభణతో పాక్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన కాసిం అక్రమ్(48) కాసేపు పోరాడాడు. అతడికి తోడుగా.. ముబాసిర్ ఖాన్(28) రాణించాడు. ఆఖర్లో మెహ్రాన్ మంతాజ్ 25 పరుగులతో అజేయంగా నిలవడంతో 48 ఓవర్లలో పాకిస్తాన్ 205 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో హంగేర్గకర్ అత్యధికంగా ఐదు వికెట్లు పడగొట్టగా.. మానవ్కు మూడు, రియాన్ పరాగ్, నిషాంత్ సింధు ఒక్కో వికెట్ తీశారు. సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్ స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్ సాయి సుదర్శన్ అదిరిపోయే ఆరంభం అందించాడు. సెంచరీ(104)తో చెలరేగి జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు. వరుసగా రెండు సిక్సర్లు బాది శతకం పూర్తి చేసుకుని వారెవ్వా అనిపించాడు. ఇక మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(20) నిరాశ పరచగా.. వన్డౌన్లో వచ్చిన నికిన్ జోస్ అర్ధ శతకం(53)తో రాణించి సాయితో కలిపి మెరుగైన భాగస్వామ్యం నమోదు చేశాడు. మెహ్రాన్ బౌలింగ్లో నికిన్ అవుట్ అయ్యాడు. హ్యాట్రిక్ విజయం అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ యశ్ ధుల్ 19 బంతుల్లో 21 పరుగులతో అజేయంగా నిలిచాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సాయి సుదర్శన్ అజేయ శతకం, నికిన్ జోస్ హాఫ్ సెంచరీ కారణంగా భారత్ 36.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కేవలం రెండు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. కాగా ఈ టోర్నీలో భారత-ఏ జట్టుకు ఇది హ్యాట్రిక్ విజయం. అంతకు ముందు యూఏఈ, నేపాల్లపై భారీ విజయాలు నమోదు చేసింది. చదవండి: దీనస్థితిలో ధోని సొంత అన్న? బయోపిక్లో ఎందుకు లేడు? అయినా అతడితో.. -
Asia Cup 2023: రేపే భారత్-పాక్ సమరం
ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 టోర్నీలో రేపు (జులై 19) భారత్-ఏ, పాకిస్తాన్-ఏ జట్లు కత్తులు దూసుకోనున్నాయి. గ్రూప్-బిలోని ఆఖరి మ్యాచ్లో ఈ ఇరు జట్లు ఎదురెదురుపడనున్నాయి. కొలొంబో వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఒకే గ్రూప్లో ఉన్న భారత్, పాక్లు గ్రూప్ దశలో చెరి రెండు మ్యాచ్లు గెలిచి పాయింట్ల పరంగా సమంగా ఉన్నాయి. అయితే పాక్ (2.875)తో పోలిస్తే భారత్ (3.792)కు మెరుగైన రన్రేట్ ఉండటంతో ప్రస్తుతానికి యంగ్ ఇండియా గ్రూప్ టాపర్గా ఉంది. గ్రూప్ దశలో భారత్, పాక్లు.. యూఏఈ, నేపాల్ జట్లపై విజయాలు సాధించాయి. మరోవైపు గ్రూప్-ఏలో రసవత్తర పోరు సాగుతుంది. ఆప్ఘనిస్తాన్ ఆడిన 2 మ్యాచ్ల్లో విజయాలతో గ్రూప్ టాపర్గా ఉండగా.. బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు 2 మ్యాచ్ల్లో చెరో మ్యాచ్ గెలిచి గ్రూప్లో రెండో బెర్తు కోసం పోటీపడుతున్నాయి. ఈ గ్రూప్లో ఒమన్ ఆడిన 2 మ్యాచ్ల్లో ఓటమిపాలై పోటీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-ఏ, గ్రూప్-బిలో టాపర్లుగా ఉన్న రెండు జట్లు సెమీఫైనల్లో తలపడతాయి. గ్రూప్-ఏలో భాగంగా ఇవాళ (జులై 18) బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్తాన్ జట్లు.. శ్రీలంక- ఒమన్ జట్లు తలపడనున్నాయి. రేపు భారత్-పాక్ మ్యాచ్తో పాటు నేపాల్-యూఏఈ మ్యాచ్ కూడా జరుగనుంది. కాగా, ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్లో యువ భారత్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. యూఏఈపై 8 వికెట్ల తేడాతో, నేపాల్పై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. యూఏఈపై బౌలర్లలో హర్షిత్ రాణా (4), నితీష్ రెడ్డి (2), మానవ్ సుతార్ (2), అకాశ్ సింగ్ (1) రాణించగా.. బ్యాటింగ్లో కెప్టెన్ యశ్ ధుల్ అజేయ శతకంతో (108) మెరిశాడు. నికిన్ జోస్ (41 నాటౌట్) పర్వాలేదనిపించాడు. నేపాల్తో జరిగిన మ్యాచ్లో బౌలింగ్లో నిషాంత్ సింధు (4), హంగార్గేకర్ (3), హర్షిత్ రాణా (2), మానవ్ సుతార్ (1) రాణించగా.. బ్యాటింగ్లో సాయి సుదర్శన్ (58 నాటౌట్), అభిషేక్ శర్మ (87) దృవ్ జురెల్ (21 నాటౌట్) మెరిశారు. -
శతక్కొట్టిన యశ్ ధుల్.. ఆసియా కప్లో టీమిండియా బోణీ
ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్లో టీమిండియా బోణీ కొట్టింది. యూఏఈతో ఇవాళ (జులై 14) జరిగిన మ్యాచ్లో భారత్-ఏ.. యూఏఈ-ఏపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ యశ్ ధుల్ అజేయమైన సూపర్ సెంచరీతో (84 బంతుల్లో 108; 20 ఫోర్లు, సిక్స్) మెరిసి, టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. అతనికి నికిన్ జోస్ (41 నాటౌట్) సహకరించాడు. ఫలితంగా భారత్.. మరో 23.3 ఓవర్లు మిగిలుండగానే విజయఢంకా మోగించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. హర్షిత్ రాణా (4/41), నితిశ్ రెడ్డి (2/32), మానవ్ సుథార్ (2/28), ఆకాశ్ సింగ్ (1/10) ధాటికి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు మాత్రమే చేయగలిగింది. యూఏఈ ఇన్నింగ్స్లో అయాన్ష్ శర్మ (38), కెప్టెన్ చిదంబరం (46), అలీ నసీర్ (10), మొహమ్మద్ ఫరాజుద్దీన్ (35), జష్ గియనాని (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. శతక్కొట్టిన యశ్ ధుల్.. నిరాశపరచిన సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ 176 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత-ఏ.. యశ్ ధుల్ సెంచరీతో మెరవడంతో ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేరుకుంది (26.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి). ఓపెనర్లు, ఐపీఎల్-2023 స్టార్లు సాయి సుదర్శన్ (8), అభిషేక్ శర్మ నిరాశపరిచినప్పటికీ, యశ్ ధుల్.. నికిన్ జోస్ సహకారంతో టీమిండియాను గెలిపించాడు. యూఏఈ బౌలర్లలో జవాదుల్లా, అలీ నసీర్ తలో వికెట్ పడగొట్టారు. నేపాల్ను మట్టికరిపించిన పాక్.. ఇవాళే జరిగిన మరో మ్యాచ్లో పాకిస్తాన్-ఏ.. నేపాల్-ఏపై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్.. 37 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌట్ కాగా.. పాక్ 32.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నేపాల్ ఇన్నింగ్స్లో సోంపాల్ కామీ (75) టాప్ స్కోరర్గా నిలువగా.. పాక్ బౌలర్లు షానవాజ్ దహానీ (5/38), మహ్మద్ వసీం జూనియర్ (4/51) విజృంభించారు. పాక్ ఇన్నింగ్స్లో తయ్యబ్ తాహిర్ (51) టాప్ స్కోరర్ కాగా.. నేపాల్ బౌలర్లు లలిత్ రాజబంశీ (3/50), పవన్ సర్రాఫ్ (2/15) రాణించారు. -
ఆసియా కప్-2023 జట్టు ప్రకటన.. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్రెడ్డికి చోటు
ACC Men’s Emerging Teams Asia Cup 2023: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023కి భారత్ జట్టును ప్రకటించింది. వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్న ఈ టోర్నీకి జూనియర్ క్రికెట్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన ఇండియా- ఏ జట్టును ఎంపిక చేసింది. మరో నలుగురికి స్టాండ్ బై ప్లేయర్లుగా అవకాశమిచ్చింది. ఎనిమిది ఆసియా దేశాల మధ్య ఇండియా- ఏ జట్టుకు యశ్ ధుల్ ఈ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనుండగా.. అభిషేక్ శర్మ అతడి డిప్యూటీగా ఎంపికయ్యాడు. తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్రెడ్డి సైతం జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ టీమ్కి సితాంషు కొటక్ హెడ్కోచ్గా వ్యవహరించనున్నాడు. శ్రీలంకలో.. జూలై 13 నుంచి జూలై 23 వరకు శ్రీలంకలోని కొలంబోలో ఎమర్జింగ్ ఆసియా కప్-2023 నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులో గ్రూప్-బిలో భారత్తో పాటు.. నేపాల్, యూఏఈ, పాకిస్తాన్- ఏ జట్లు.. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఒమన్- ఏ జట్లు గ్రూప్-ఏలో ఉన్నాయి. ఇరు గ్రూపులలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన రెండు జట్లు సెమీ ఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఆరోజు ఫైనల్ ఇందులో గ్రూప్-ఏ టాపర్తో గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టు తొలి సెమీ ఫైనల్లో.. గ్రూప్-బి టాపర్తో గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉన్న జట్టు రెండో సెమీ ఫైనల్లో తలపడతాయి. జూలై 23న ఈ టోర్నీ ఫైనల్ జరుగనుంది. ఇదిలా ఉంటే తొలిసారి నిర్వహించిన మహిళల ఎమర్జింగ్ ఆసియా కప్ విజేతగా భారత జట్టు అవతరించిన విషయం తెలిసిందే. ఫైనల్లో బంగ్లాదేశ్-ఏ జట్టును చిత్తు చేసి భారత మహిళల- ఏ జట్టు చాంపియన్గా నిలిచింది. ఎమర్జింగ్ ఏసియా కప్-2023 భారత- ఏ జట్టు సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ(వైస్ కెప్టెన్), నికిన్ జోస్, ప్రదోష్ రంజన్ పాల్, యశ్ ధుల్(కెప్టెన్), రియాన్ పరాగ్, నిశాంత్ సంధు, ప్రభ్షిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), మానవ్ సుతార్, యువరాజ్సిన్హ్ దోడియా, హర్షిత్ రానా, ఆకాశ్ సింగ్, నితీశ్ కుమార్రెడ్డి, రాజ్వర్దన్ హంగ్రేకర్. స్టాండ్ బై ప్లేయర్లు: హర్ష్ దూబే, నేహాల్ వధేరా, స్నెల్ పటేల్, మోహిత్ రేద్కార్. కోచింగ్ స్టాఫ్: సితాంశు కొటక్(హెడ్కోచ్), సాయిరాజ్ బహూతులే (బౌలింగ్ కోచ్), మునిష్ బాలి(ఫీల్డింగ్ కోచ్). చదవండి: Ashes: ‘బజ్బాల్’తో బొక్కబోర్లా.. ఇంగ్లండ్కు భారీ షాక్.. సిరీస్ మొత్తానికి.. -
వారిపై ఢిల్లీ క్యాపిటల్స్కు అమితమైన ఆసక్తి.. కోహ్లి విషయంలో మాత్రం ఎందుకో అలా..
WPL Auction 2023: నిన్న (ఫిబ్రవరి 13) జరిగిన తొలి మహిళల ఐపీఎల్ వేలంలో టీమిండియా డాషింగ్ ఓపెనర్, అండర్-19 వరల్డ్ కప్ 2023 విన్నింగ్ కెప్టెన్, లేడీ సెహ్వాగ్గా పేరొందిన షెఫాలీ వర్మను ఢిల్లీ క్యాపిటల్స్ 2 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. షెఫాలీ కోసం ఆర్సీబీ సైతం తీవ్రంగా పోటీపడినప్పటికీ పట్టు వదలని ఢిల్లీ ఎట్టకేలకు భారత సివంగిని దక్కించుకుంది. షెఫాలీని ఢిల్లీ దక్కించుకున్న తర్వాత సోషల్మీడియాలో ఓ ఆసక్తికర విషయం విపరీతంగా ట్రోల్ అయ్యింది. ఢిల్లీ క్యాపిటల్స్ గతంలోకి ఓసారి తొంగి చూస్తే.. ఈ ఫ్రాంచైజీ అండర్-19 వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్ల అడ్డాగా పేరొందింది. అండర్-19 వరల్డ్కప్లో భారత్ను జగజ్జేతగా నిలిపిన ఉన్ముక్త్ చంద్ 2011-13 మధ్యలో నాటి ఢిల్లీ డేర్డెవిల్స్కు ప్రాతినిధ్యం వహించగా.. 2018 అండర్-19 వరల్డ్కప్లో టీమిండియాను విశ్వవిజేతగా నిలిపిన పృథ్వీ షా.. గత నాలుగు సీజన్లు ఢిల్లీ ఫ్రాంచైజీకే ఆడుతున్నాడు. వీరి తర్వాత భారత్ను అండర్-19 వరల్డ్కప్-2022 విజేతగా నిలిపిన యశ్ ధుల్ను 2022 ఐపీఎల్ సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కోటి రూపాయలు వెచ్చించి సొంతం చేసుకుంది. తాజాగా తొలి మహిళల అండర్-19 టీ20 వరల్డ్కప్ నెగ్గిన భారత యువ జట్టు కెప్టెన్ షెఫాలీ వర్మను ఢిల్లీ క్యాపిటల్స్ 2 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే ఇక్కడ ఓ ఆసక్తికర విషయం ఏంటంటే.. భారత అండర్-19 వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్లపై అమితాసక్తి కనబరుస్తూ వస్తున్న ఢిల్లీ ఫ్రాంచైజీ, 2008 అండర్-19 వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్, నేటి భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిని మాత్రం ఎందుకో ఆర్సీబీకి వదిలేసింది. పై పేర్కొన్న ఆటగాళ్లలో కొందరు ఢిల్లీకి చెందిన వారు కానప్పటికీ కొనుగోలు చేసిన డీసీ ఫ్రాంచైజీ.. కోహ్లి ఢిల్లీ వాస్తవ్యుడైనప్పటికీ అతన్ని మిస్ చేసుకుంది. -
ఢిల్లీ బ్యాటర్ల అద్భుత పోరాటం.. ఆంధ్ర జట్టుకు నిరాశ
న్యూఢిల్లీ: చివరి వికెట్ తీయడంలో విఫలమైన ఆంధ్ర జట్టు బౌలర్లు ఢిల్లీ జట్టుతో జరిగిన రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయారు. మ్యాచ్ ‘డ్రా’గా ముగిసినా 29 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించినందుకు ఢిల్లీ జట్టుకు మూడు పాయింట్లు లభించగా... ఆంధ్ర ఖాతాలో ఒక పాయింట్ మాత్రమే చేరింది. ఓవర్నైట్ స్కోరు 300/4తో ఆట చివరిరోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఢిల్లీ జట్టు 9 వికెట్లకు 488 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్నైట్ బ్యాటర్లలో ధ్రువ్ షోరే మరో 43 పరుగులు జోడించి వ్యక్తిగత స్కోరు 185 వద్ద అవుటవ్వగా... హిమ్మత్ సింగ్ (104; 10 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హిమ్మత్ సింగ్ అవుటైనపుడు ఢిల్లీ స్కోరు 423/9. చివరి వికెట్ తీసిఉంటే ఆంధ్ర జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతోపాటు మూడు పాయింట్లు లభించేవి. కానీ ఢిల్లీ బ్యాటర్లు హర్షిత్ రాణా (46 బంతుల్లో 33 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), దివిజ్ మెహ్రా (38 బంతుల్లో 32 నాటౌట్; 6 ఫోర్లు) మొండి పట్టుదలతో ఆడి చివరి వికెట్కు అజేయంగా 65 పరుగులు జోడించారు. ఐదు మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఆంధ్ర గ్రూప్ ‘బి’ 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. -
Ranji Trophy: ఉనాద్కట్ సంచలనం.. రంజీ చరిత్రలోనే తొలి బౌలర్గా
Ranji Trophy 2022-23- Saurashtra vs Delhi: భారత లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ ఉనాద్కట్ రంజీ ట్రోఫీ టోర్నీలో సంచలనం సృష్టించాడు. ఢిల్లీతో మ్యాచ్లో వేసిన మొదటి ఓవర్లోనే మూడు వికెట్లు కూల్చి హ్యాట్రిక్ నమోదు చేశాడు ఈ సౌరాష్ట్ర కెప్టెన్. మూడు, నాలుగు, ఐదో బంతికి వరుసగా ఢిల్లీ ఓపెనర్ ధ్రువ్ షోరే, వన్డౌన్ బ్యాటర్ వైభవ్ రావల్ సహా యశ్ ధుల్లను పెవిలియన్కు పంపాడు. ముగ్గురినీ డకౌట్ చేశాడు. రంజీ చరిత్రలోనే తొలిసారి కాగా రంజీ ట్రోఫీ చరిత్రలో తొలి ఓవర్లోనే ఇలా హ్యాట్రిక్ నమోదు కావడం ఇదే తొలిసారి. ఇలా అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్న జయదేవ్.. రెండో ఓవర్లోనూ విజృంభించాడు. వెంటనే మరో రెండు వికెట్లు తీశాడు. ఢిల్లీ బ్యాటర్లు లలిత్ యాదవ్(0), లక్ష్యయ్ తరేజా(1)లను అవుట్ చేశాడు. అంతేకాదు.. తద్వారా... ఫస్ట్క్లాస్ క్రికెట్లో 21వ సారి.. ఒకే ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు కూల్చిన ఘనత సాధించాడు ఉనాద్కట్. ఆ తర్వాత జాంటీ సిద్ధు(4)ను కూడా పెవిలియన్కు పంపి మొత్తంగా ఆట మొదలైన గంటలోనే ఆరు వికెట్లు(మూడు ఓవర్లలో) తీసి ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ను అతలాకుతలం చేశాడు. కాగా బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ నేపథ్యంలో జయదేవ్ ఇటీవలే భారత జట్టులో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కుదేలైన ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ రంజీ ట్రోఫీ టోర్నీలో భాగంగా ఎలైట్ గ్రూప్- బిలో ఉన్న సౌరాష్ట్ర- ఢిల్లీ మధ్య మంగళవారం (జనవరి 3) మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ యశ్ ధుల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఉనాద్కట్ దెబ్బకు టాపార్డర్ కుదేలైంది. ఇందుకు తోడు, చిరాగ్ జానీ ఒక వికెట్, ప్రేరక్ మన్కడ్ ఒక వికెట్ తీశారు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి ఢిల్లీ 8 వికెట్లు నష్టపోయి 108 పరుగులు చేసింది. చదవండి: Hardik Pandya: స్లెడ్జింగ్తో పనిలేదు.. వాళ్లకు మా బాడీ లాంగ్వేజ్ చాలు! మాట ఇస్తున్నా.. BCCI: బిగ్ ట్విస్ట్.. రేసు నుంచి వెంకటేశ్ ప్రసాద్ అవుట్!? చీఫ్ సెలక్టర్గా మళ్లీ అతడే! -
ఢిల్లీ జట్టు కెప్టెన్గా యశ్ ధుల్.. 20 ఏళ్ల వయస్సులోనే
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ తొలి రెండు మ్యాచ్లకు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు 20 ఏళ్ల యశ్ ధుల్ సారథ్యం వహించనున్నాడు. జట్టులో ఇషాంత్ శర్మ, నితీష్ రాణా వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ జట్టు మేనేజేమెంట్ యశ్ ధుల్కి సారథ్య బాధ్యతలు అప్పజెప్పడం గమనార్హం. కాగా అతడి సారథ్యంలోనే యువ భారత జట్టు ఈ ఏడాది అండర్-19 ప్రపంచకప్ ను భారత్ కైవసం చేసుకుంది. అతడి కెప్టెన్సీ నైపుణ్యాలు చూసి ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ తమ జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇక గత రంజీ సీజన్ లో ఢిల్లీ తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసిన యశ్దుల్ అద్భుతంగా రాణించాడు. ఈ సీజన్లో 8 మ్యాచ్లు ఆడిన అతడు 820 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో 4 సెంచరీలు ఉన్నాయి. ఇక ఏడాది రంజీ సీజన్లో ఢిల్లీ తమ తొలి మ్యాచ్లో మహారాష్ట్రతో తలపడనుంది. ఈ మ్యాచ్ డిసెంబర్ 17 నుంచి పుణే వేదికగా ప్రారంభం కానుంది. ఢిల్లీ జట్టు: యశ్ ధుల్ (కెప్టెన్), హిమ్మత్ సింగ్ (వైస్ కెప్టెన్), ధ్రువ్ షోరే, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), వైభవ్ రావల్, లలిత్ యాదవ్,నితీష్ రాణా, ఆయుష్ బదోని, హృతిక్ షోకీన్, శివంక్ వశిష్త్, వికాస్ మిశ్రా, జాంటీ సిద్ధు, ఇషాంత్ శర్మ, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, సిమర్జీత్ సింగ్ లక్షయ్ థరేజా, ప్రన్షు విజయరన్ -
ఇదేం షాట్ అయ్యా యష్ ధుల్ .. నేనెక్కడా చూడలే.. బంతిని చూడకుండానే!
ఐపీఎల్-2022కు సమయం దగ్గర పడడంతో అన్ని జట్లు నెట్స్లో చెమట్చోడుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఆటగాడు, భారత అండర్-19 కెప్టెన్ యష్ ధుల్ నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. నెట్ సెషన్లో అద్భుతమైన షాట్లు ఆడుతూ యష్ ధుల్ అలరించాడు. అయితే ప్రాక్టీస్లో భాగంగా బంతిని చూడకుండానే 'అప్పర్ కట్' షాట్ ఆడి అందరనీ యష్ ఆశ్చర్యపరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ ట్విటర్లో షేర్ చేసింది. ఇక అండర్-19 ప్రపంచకప్లో అదరగొట్టిన యష్ ధుల్ను ఐపీఎల్ మెగా వేలంలో రూ.50 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. అండర్-19 ప్రపంచకప్ 2022లో భారత జట్టును ఛాంపియన్ యశ్ ధుల్ నిలిపిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లకు విదేశీ స్టార్ ఆటగాళ్లు దూరం కానున్నారు. పాకిస్తాన్ పర్యటన కారణంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, మిచ్ల్ మార్ష్ ఢిల్లీ జట్టు ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నారు. మరో వైపు ఆ జట్టు పేస్ బౌలర్ అన్రీచ్ నోర్జే జట్టులో చేరినప్పటికీ అతడు అందుబాటుపై ఇంకా సందిగ్ధం నెలకొంది. ఇక మార్చి 26 నుంచి ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. ఢిల్లీ క్యాపిటిల్స్ తమ తొలి మ్యాచ్లో మార్చి 27న ముంబై ఇండియన్స్తో తలపడనుంది. చదవండి: IPL 2022: 'అతడు అద్భుతమైన ఆటగాడు.. భారత ప్రపంచకప్ జట్టులో చోటు ఖాయం' That No-look was S.M.O.O.T.H 🤌 🔝 Upper Cut 🔥 @YashDhull2002 🤩#YehHaiNayiDilli #IPL2022 pic.twitter.com/vrnyoso5MS — Delhi Capitals (@DelhiCapitals) March 21, 2022 -
IPL 2022: సిక్సర్లు బాదిన రిషభ్ పంత్.. రెప్పవాల్చని యువ ఆటగాళ్లు
IPL 2022- Rishabh Pant: ఐపీఎల్-2022 సమరానికి జట్లు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే ఆయా జట్ల ఆటగాళ్లు ప్రాక్టీసు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ ప్లేయర రిషభ్ పంత్ సైతం నెట్స్లో చెమటోడ్చాడు. వరుస షాట్లతో సిక్సర్ల వర్షం కురిపిస్తూ అలరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఢిల్లీ ఫ్రాంఛైజీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో పంత్ బ్యాటింగ్ చేస్తుండగా.. యువ ఆటగాళ్లు యశ్ ధుల్, సర్ఫరాజ్ ఖాన్, కమలేష్ నాగర్కోటి అలా చూస్తూ ఉండిపోయారు. పంత్ ఆటను నిశితంగా గమనించారు. కాగా శ్రీలంకతో ఇటీవల స్వదేశంలో ముగిసిన టెస్టు సిరీస్లో పంత్ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బెంగళూరు వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టు అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్తో చేరాడు. ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్లో బస చేస్తున్న జట్టుతో కలిశాడు. ఇక శ్రీలంకతో సిరీస్లో పంత్ అద్భుత ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. కాగా మార్చి 26 నుంచి క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ ఆరంభం కానుంది. ఇక ఢిల్లీ.. మార్చి 27 న ముంబై ఇండియన్స్తో జరిగే మ్యాచ్తో ఈ సీజన్ను ఆరంభించనుంది. చదవండి: Shane Warne: నా గుండె నొప్పితో విలవిల్లాడుతోంది: వార్న్ మాజీ ప్రేయసి భావోద్వేగం 🎶 𝘿𝙞𝙡𝙡𝙞 𝙠𝙤 𝙠𝙖𝙧𝙖𝙖𝙧 𝙖𝙖𝙮𝙖 🔥#YehHaiNayiDilli #IPL2022 @RishabhPant17 pic.twitter.com/thTbpJb9X8 — Delhi Capitals (@DelhiCapitals) March 20, 2022 -
యశ్ ధుల్ వీర విజృంభణ.. డబుల్ సెంచరీతో చెలరేగిన ఢిల్లీ డైనమైట్
Yash Dhull Scores Double Century: అండర్-19 ప్రపంచకప్ 2022లో యువ భారత్ను జగజ్జేతగా నిలిపిన యశ్ ధుల్.. అరంగేట్రం రంజీ సీజన్లోనే అదరగొడుతున్నాడు. ఆరంగ్రేటం మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లోనూ(113, 113 నాటౌట్) సెంచరీ బాది చరిత్ర సృష్టించిన ధుల్.. తాజాగా ఛత్తీస్ఘడ్తో జరిగిన మ్యాచ్లో అజేయమైన డబుల్ సెంచరీ (200; 26 ఫోర్లు)తో సత్తా చాటాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఛత్తీస్ఘడ్ అమన్దీప్ కారే (156 నాటౌట్), శశాంక్ సింగ్ (122) శతకాలతో రాణించడంతో 482/9 వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఢిల్లీ 295 పరుగులకే ఆలౌటై ఫాలోఆన్ ఆడింది. ఈ క్రమంలో యశ్ ధుల్, దృవ్ షోరే (100; 13 ఫోర్లు), నితీశ్ రాణా (57 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో ఢిల్లీ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 396 పరుగులు చేసి, మ్యాచ్ను డ్రా చేసుకోగలిగింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో ధుల్ 29 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ప్రస్తుత రంజీ సీజన్లో ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడిన ధుల్ 479 పరుగులు చేశాడు. ఇందులో డబుల్ సెంచరీ, రెండు సెంచరీలు ఉన్నాయి. చదవండి: శతకం చేజార్చుకున్న ఉస్మాన్ ఖ్వాజా.. పాక్కు ధీటుగా బదులిస్తున్న ఆసీస్ -
టీమిండియా క్రికెటర్లకు అవమానం.. వ్యాక్సిన్ వేసుకోలేదని..!
ICC U19 World Cup 2022: అండర్ 19 ప్రపంచకప్ 2022 గెలిచిన భారత యువ జట్టుకు కరీబియన్ గడ్డపై అవమానం జరిగినట్లు తెలుస్తుంది. కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేని కారణంగా ఏడుగురు భారత క్రికెటర్లను పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఎయిర్ పోర్టు అధికారులు ఒక రోజంతా అడ్డుకున్నారని జట్టు మేనేజర్ లోబ్జాంగ్ జీ టెన్జింగ్ తాజాగా వెల్లడించాడు. అంతటితో ఆగకుండా ఆ ఏడుగురు ఆటగాళ్ల(రవికుమార్, రఘువంశీ తదితరులు)ను తిరిగి భారత్కు వెళ్లిపోవాలని ఇమిగ్రేషన్ అధికారులు హెచ్చరించారని, భారత ప్రభుత్వ అనుమతి వచ్చేవరకూ వారిని కరీబియన్ గడ్డపై అడుగుపెట్టనిచ్చేది లేదని బెదిరించారని బాంబు పేల్చాడు. భారత్లో టీనేజీ కుర్రాళ్లకి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించలేదని ఎంత వివరించినా ఇమిగ్రేషన్ అధికారులకు వినలేదని, ఆ ఏడుగురిని తర్వాతి ఫ్లయిట్లో ఇండియాకి తిరిగి పంపిచేస్తామంటూ బెదిరించారని తెలిపాడు. 24 గంటల తర్వాత ఐసీసీ, బీసీసీఐ అధికారుల చొరవతో ఆటగాళ్లు మ్యాచ్ వేదిక అయిన గయానాకు చేరుకున్నారని పేర్కొన్నాడు. కాగా, అండర్ 19 ప్రపంచ కప్ కోసం వెస్టిండీస్లో అడుగు పెట్టిన భారత యువ జట్టు, రెండు మ్యాచ్ల తర్వాత కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. జట్టులోని ఐదుగురు కీలక ప్లేయర్ల (కెప్టెన్ యశ్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్, ఆరాధ్య యాదవ్ తదితరులు)తో పాటు అడ్మినిస్టేషన్ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. అయినప్పటికీ యువ భారత క్రికెటర్లు ఏ మాత్రం తగ్గకుండా ఐదోసారి ప్రపంచకప్ నెగ్గి చరిత్ర సృష్టించారు. చదవండి: ఈ ఫోటోలో విరాట్ కోహ్లి ఎక్కడున్నాడో గుర్తు పట్టండి..! -
చరిత్ర సృష్టించిన యష్ ధుల్... 8 ఏళ్లలో ఒకే ఒక్కడు!
అండర్- 19 ప్రపంచకప్ టోర్నీలో భారత్కు ప్రపంచకప్ సాధించి పెట్టిన కెప్టెన్ యశ్ ధుల్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. అరంగేట్ర మ్యాచ్లో యష్ సెంచరీల మోత మోగించాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ, తమిళనాడు జట్లు మొదటి మ్యాచ్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే తొలి ఇన్నింగ్స్లో సెంచరీ సాధించిన యశ్ ధుల్..రెండో ఇన్నింగ్స్లో కూడా సెంచరీతో మెరిశాడు. ఈ నేపథ్యంలో యశ్ ధుల్ అరుదైన ఫీట్ సాధించాడు. రంజీ ట్రోఫీ అరంగేట్ర మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లోను సెంచరీలు సాధించిన మూడో ఆటగాడిగా యష్ధుల్ నిలిచాడు. అంతకు ముందు గుజరాత్ బ్యాటర్ నారీ కాంట్రాక్టర్ ఈ ఫీట్ సాధించిన మొదటి వ్యక్తి కాగా, మహారాష్ట్ర బ్యాటర్ విరాగ్ అవతే రెండో ఆటగాడిగా ఉన్నాడు. 1952-53 రంజీట్రోఫీ సీజన్లో కాంట్రాక్టర్ ఈ ఘనత సాధించగా, 2012-13 సీజన్లో విరాగ్ అవతే ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో 113 పరుగులు చేసిన యష్.. రెండో ఇన్నింగ్స్లోనూ 113 పరగులు సాధించాడు. కాగా ఐపీఎల్ మెగా వేలం-2022లో భాగంగా ఢిల్లీ ఫ్రాంఛైజీ 50 లక్షల రూపాయలు వెచ్చించి యశ్ ధుల్ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: Rashid Khan: గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించిన రషీద్ ఖాన్.. ఎందుకో తెలుసా? Only the 3rd player in the history of #RanjiTrophy to hit 2⃣ centuries on debut 🔥 A dream start for @YashDhull2002 💙#YehHaiNayiDilli #DELvTN pic.twitter.com/ZXY6Gt00aQ — Delhi Capitals (@DelhiCapitals) February 20, 2022 -
"అతడు త్వరలోనే టీమిండియా లోకి వస్తాడు"
Vinod Kambli Hails Yash Dhull After Ranji Ton: ఫస్ట్క్లాస్ క్రికెట్ అరంగేట్ర మ్యాచ్లోనే సెంచరీ సాధించిన యష్ ధుల్పై టీమిండియా మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. యష్ ధుల్ త్వరలోనే టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తాడని కాంబ్లీ అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ తరుపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన యష్.. తమిళనాడుపై అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్లో 150 బంతుల్లో 113 పరుగులు యష్ చేశాడు. ఇక అండర్- 19 ప్రపంచకప్ టోర్నీలో కెప్టెన్గా యష్ ధుల్ భారత్కు ప్రపంచకప్ సాధించి పెట్టిన సంగతి తెలిసిందే. "ఫస్ట్ క్లాస్ క్రికెట్లో యష్ ధుల్ తన కేరిర్ను ఘనంగా ఫ్రారంభించాడు. తొలి సెంచరీను తన దైన శైలిలో సాధించాడు. అతడు దేశీయ స్ధాయి, ఐపీఎల్లో అద్భుతంగా రాణిస్తాడని భావిస్తున్నాను. యష్ ఖచ్చితంగా భారత్ తరుపున త్వరలోనే అరంగేట్రం చేస్తాడు. కంగ్రాట్స్ మిస్టర్ ధూల్" అని కాంబ్లీ పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్-2022 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ యష్ ధుల్ను రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. చదవండి: తొలి మ్యాచ్లోనే ట్రిపుల్ సెంచరీ.. ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా! -
Ranji Trophy 2022: వారెవ్వా యశ్ ధుల్.. అరంగేట్రంలోనే సెంచరీ.. మరో కోహ్లి!
అండర్- 19 ప్రపంచకప్ టోర్నీలో భారత్కు ప్రపంచకప్ సాధించి పెట్టిన కెప్టెన్ యశ్ ధుల్ ఫస్ట్క్లాస్ క్రికెట్ కెరీర్ను ఘనంగా ఆరంభించాడు. అరంగేట్ర మ్యాచ్లోనే సెంచరీ సాధించి సత్తా చాటాడు. తద్వారా ఆడిన మొదటి రంజీ మ్యాచ్ను మరింత ప్రత్యేకంగా మార్చుకున్నాడు. కాగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడుతూ వస్తున్న దేశవాళీ రంజీ టోర్నీ రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు ఫిబ్రవరి 17న మొదలైంది. ఇందులో భాగంగా ఢిల్లీ, తమిళనాడు జట్లు మొదటి మ్యాచ్లో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన తమిళనాడు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనింగ్కు దిగిన ఢిల్లీ బ్యాటర్ యశ్ ధుల్ 136 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 150 బంతులు ఎదుర్కొన్న అతడు 113 పరుగులు చేశాడు. ఇందులో 18 ఫోర్లు ఉన్నాయి. కాగా యశ్ ధుల్కు ఇదే మొదటి రంజీ మ్యాచ్ కావడం విశేషం. ఇక తమిళనాడు వంటి పటిష్ట జట్టుపై అరంగేట్ర మ్యాచ్లోనే ఇలా అదరగొట్టడంపై అభిమానులు ఫిదా అవుతున్నారు. యశ్ ధుల్ మరో కోహ్లి అవుతాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నీలాంటి అత్యుత్తమ ఆటగాడిని ఢిల్లీ క్యాపిటల్స్ లక్కీగా తక్కువ ధరకే సొంతం చేసుకుందని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్ మెగా వేలం-2022లో భాగంగా ఢిల్లీ ఫ్రాంఛైజీ 50 లక్షల రూపాయలు వెచ్చించి యశ్ ధుల్ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: Rohit Sharma- Ravi Bishnoi: అందుకే అతడిని జట్టులోకి తీసుకున్నాం.. అదరగొట్టాడు: రోహిత్ శర్మ ప్రశంసలు FIFTY on First-Class debut! 👏 👏 Yash Dhull - India's #U19CWC-winning captain - begins his #RanjiTrophy journey in style. 👍 👍 @Paytm #DELvTN Follow the match ▶️ https://t.co/ZIohzqOWKi pic.twitter.com/mrbYBHNrBL — BCCI Domestic (@BCCIdomestic) February 17, 2022 𝙒𝙝𝙖𝙩 𝘼 𝙈𝙤𝙢𝙚𝙣𝙩! 👌 👌 💯 on Ranji Trophy debut! 👏 👏 This has been a fantastic batting performance from Yash Dhull in his maiden First Class game. 👍 👍 @Paytm | #RanjiTrophy | #DELvTN | @YashDhull2002 Follow the match ▶️ https://t.co/ZIohzqOWKi pic.twitter.com/uaukVSHgUq — BCCI Domestic (@BCCIdomestic) February 17, 2022 -
టీమిండియా కెప్టెన్ను సొంతం చేసుకున్న ఢిల్లీ.. ధర ఎంతంటే!
టీమిండియా అండర్-19 కెప్టెన్ యష్ ధుల్ ఐపీఎల్లో అరంగట్రేం చేయనున్నాడు. ఐపీఎల్-2022 మెగా వేలంలో యష్ ధుల్ను రూ. 50 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. అతడి కోసం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డాయి. చివరకి ఢిల్లీ యష్ ధుల్ను కైవసం చేసుకుంది. ఇక అండర్-19 ప్రపంచ కప్ను యష్ ధుల్ అందించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్లో యష్ బ్యాట్తో అద్భుతంగా రాణించాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ సెంచరీ నమోదు చేశాడు. అదే విధంగా యష్ ఢిల్లీ తరపున రంజీ ట్రోఫీలో కూడా అరంగేట్రం చేయబోతున్నాడు. ఇక రెండో రోజు వేలంలో ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్కు భారీ ధర దక్కింది. వేలంలో లివింగ్స్టోన్ని రూ11.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది. డేవిడ్ మలన్,మార్నస్ లబుషేన్, ఇయాన్ మోర్గాన్,సౌరభ్ తివారి,ఆరోన్ ఫించ్ వంటి స్టార్ ఆటగాళ్లు రెండో రోజు వేలంలో అమ్ముడు పోలేదు. చదవండి: IPL 2022 Auction: చేతన్ సకారియాకి బంపర్ ఆఫర్.. అప్పుడు 1.2 కోట్లు.. ఇప్పడు ఏకంగా..! -
IPL 2022 Auction: షేక్ రషీద్ సహా మిగతా ఆటగాళ్లకు లైన్ క్లియర్
ఐపీఎల్ మెగావేలం ప్రారంభానికి ముందు అండర్-19 ఆటగాళ్లకు ఊరట లభించింది. అండర్-19 ప్రపంచకప్ సాధించిన యంగ్ ఇండియా జట్టు నుంచి 10 మంది ఆటగాళ్లు వేలంలో పేరును రిజిస్టర్ చేసుకున్న సంగతి తెలిసిందే. కెప్టెన్ యశ్ ధుల్, షేక్ రషీద్, విక్కీ ఒస్త్వాల్, రాజ్ బవా, రాజ్వర్దన్ హంగ్కర్కర్, దినేష్ బానా, రవి కుమార్, నిశాంత్ సింధు, గర్వ్ సంగ్వాన్, అంగ్క్రిష్ రఘువంశీలు ఈ లిస్టులో ఉన్నారు. కాగా నాలుగు రోజుల క్రితం కనీసం 19 ఏళ్ల ఏజ్ లిమిట్, స్టేట్ సీనియర్ టీమ్కు ఒక మ్యాచ్ అయినా ఆడి ఉండాలని బీసీసీఐ నిబంధన తెచ్చింది. దీంతో యశ్ ధుల్ మినహా మిగతా ఆటగాళ్లు వేలానికి దూరం కావాల్సి వచ్చింది. అయితే ఇలాంటి యువ ఆటగాళ్లకు ఐపీఎల్ వేలంలో అవకాశం కల్పిస్తే బాగుంటుందని మెజారిటీ వర్గం అభిప్రాయపడింది. దీంతో బీసీసీఐ కూడా అండర్-19 ఆటగాళ్లకు వేలంలో పాల్గొనేందుకు వేలానికి ఒక్కరోజు ముందు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా 10 మంది అండర్-19 ఆటగాళ్లకు లైన్ క్లియర్ కావడంతో ఆక్షన్లో పాల్గొనే ప్లేయర్ల సంఖ్య 600కు పెరిగింది. -
18 నెలల్లో టీమిండియాలోకి వస్తా.. యశ్ ధుల్
అండర్-19 ప్రపంచకప్లో యంగ్ ఇండియాను జగజ్జేతగా నిలబెట్టి, రాత్రికిరాత్రి హీరోగా మారిపోయిన యశ్ ధుల్.. టీమిండియాలో చోటు సంపాదించేందుకు తనకు తాను టార్గెట్ను సెట్ చేసుకున్నానని తెలిపాడు. మరో 18 నెలల్లో టీమిండియాకు తప్పక ఆడతానని ధీమా వ్యక్తం చేశాడు. ఒకవేళ టార్గెట్ను రీచ్ కాని పక్షంలో మరింతగా శ్రమిస్తానని, భారత జట్టులో స్థానం సంపాదించడం కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నానని, ఇందుకు తన కుటుంబ సభ్యులు కూడా ప్రిపేరై ఉన్నారని వెల్లడించాడు. ఢిల్లీ రంజీ జట్టు నుంచి పిలుపు అందుకున్న అనంతరం ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ధుల్ ఈ విషయాలను ప్రస్తావించాడు. టీమిండియా స్టార్ ఆటగాడు, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిని అమితంగా ఆరాధిస్తానని, అతని అనువనువును రెగ్యులర్గా ఫాలో అవుతానని చెప్పిన ధుల్.. కోహ్లి తరహాలోనే తన కెరీర్ను ప్లాన్ చేసుకుంటానని తెలిపాడు. ప్రపంచకప్ విజయానంతరం తనపై పెరిగిన అంచనాల దృష్ట్యా ఒత్తిడికి లోనవుతారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించదలచుకోలేదని, దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని, లక్ష్యం దిశగా సాగడంపైనే తన దృష్టంతా ఉందని చెప్పుకొచ్చాడు. ప్రపంచకప్ గెలిచాక కోహ్లితో ఓసారి మాట్లాడానని, అతను తన అండర్-19 ప్రపంచకప్ అనుభవాలను తనతో పంచుకున్నాడని చెప్పాడు. వరల్డ్ కప్ విజయానంతరం సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించుకుని మంగళవారం స్వదేశానికి చేరుకున్నామని, సొంతగడ్డపై అడుగుపెట్టిన నాటి నుంచి రెస్ట్ లేకుండా తిరుగుతున్నానని, కొద్ది రోజులు విరామం తీసుకుని రంజీ ప్రాక్టీస్లో పాల్గొంటానని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా, ఢిల్లీ నుంచి విరాట్ కోహ్లి, ఉన్ముక్త్ చంద్ల తర్వాత భారత అండర్-19 జట్టును విశ్వవిజేతగా నిలిపిన కెప్టెన్గా యశ్ ధుల్ రికార్డుల్లోకెక్కిన విషయం తెలిసిందే. వీరిలో కోహ్లి కెరీర్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించగా, ఉన్ముక్త్ చంద్ మాత్రం ఆశించిన ప్రదర్శన కనబర్చలేక కనుమరుగైపోయాడు. చదవండి: IPL 2022 : బ్యాడ్ న్యూస్.. వార్నర్ సహా పలువురు స్టార్ క్రికెటర్లు దూరం..? -
షేక్ రషీద్ సహా ఏడుగురు అండర్-19 ఆటగాళ్లకు బిగ్షాక్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఆడాలన్న కలతో ఉన్న భారత అండర్-19 కుర్రాళ్లకు గట్టిషాక్ తగిలింది. అండర్-19 ప్రపంచకప్ సాధించిన యంగ్ ఇండియాలోని 8 మంది ఆటగాళ్లు ఐపీఎల్ మెగావేలానికి దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాగా ఫైనల్ మ్యాచ్లో అర్థసెంచరీతో రాణించిన ఆంధ్ర కుర్రాడు.. వైస్కెప్టెన్ షేక్ రషీద్ సహా మరో ఏడుగురు లిస్ట్లో ఉన్నారు. వయసు, ఇతర కారణాల రిత్యా వీరందరు వేలంలో పాల్గొనే అవకాశం లేనట్లు తెలిసింది. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ►ఐపీఎల్ వేలంలో పాల్గొనాలంటే.. కనీసం ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లేదా లిస్ట్ ఏ మ్యాచ్ ఆడిన అనుభవం ఉండాలి. ►ఆటగాడికి దేశవాళీ క్రికెట్ ఆడిన అనుభవం లేకపోతే, అతను ఐపీఎల్ వేలంలో కూడా భాగం కాలేడు. ►అంతేకాదు వేలంలో పాల్గొనడానికి ఆటగాడి వయస్సు కూడా 19 సంవత్సరాలు ఉండాలి. ఇది ఇప్పుడు 8 మంది ఆటగాళ్లకు పెద్ద అవరోదంగా మారింది. చదవండి: Mohammed Siraj: 'క్రికెట్ వదిలేయ్.. మీ నాన్నతో వెళ్లి ఆటో తోలుకో' కాగా అండర్19 ప్రపంచ విజేత భారత జట్టు నుంచి కెప్టెన్ యశ్ ధుల్ సహా వైస్ కెప్టెన్ షేక్ రషీద్, వికెట్ కీపర్ దినేష్ బానా, ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ రవికుమార్, ఆల్ రౌండర్లు నిశాంత్ సింధు, సిద్ధార్థ్ యాదవ్, ఓపెనర్ అంగ్క్రిష్ రఘువంశీ, మానవ్ ప్రకాష్, గర్వ్ సంగ్వాన్లు ఐపీఎల్ మెగావేలం ఫైనల్ లిస్టులో చోటు దక్కించుకున్నారు. కెప్టన్ యశ్ ధుల్ మినహా ఏ ఒక్క ఆటగాడి వయసు కనీసం 19 సంవత్సరాలు నిండలేదు. అంతేకాదు ఈ ఎనిమిది మంది ఆటగాళ్లలో ఒక్కరు కూడా దేశవాలీ క్రికెట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దీంతో యష్ ధుల్ ఒక్కడే వేలంలో కనిపించే అవకాశం ఉంది. అయితే ఈ ఎనిమిది ఆటగాళ్లు దేశవాలీ టోర్నీలు ఆడకపోవడానికి పరోక్షంగా బీసీసీఐ కారణం. కరోనా కారణంగా ఈ రెండేళ్లలో దేశవాలీలో మేజర్ టోర్నీలు ఎక్కువగా జరగలేదు. రెండేళ్లపాటు నిర్వహించని రంజీ ట్రోఫీని కూడా ఈ ఏడాదే నిర్వహించనున్నారు. అయితే ఈ ఆటగాళ్లు ఆడతారా లేదా అనే దానిపై బీసీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కరోనా కారణంగా గత రెండేళ్లలో దేశవాళీ క్రికెట్ అంతగా ఆడలేదని బోర్డులోని కొందరు అభిప్రాయపడ్డారు. దీంతో నిబంధనల్లో సడలింపు ఇచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి 17 నుంచి రంజీ ట్రోఫీని నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ క్రీడాకారుల రాష్ట్ర జట్టు అవకాశం కల్పించినా.. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగే వేలానికి అర్హులు కారు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో మొత్తం 590 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఇందులో 228 క్యాప్డ్, 355 అన్క్యాప్డ్ ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. చదవండి: ఆర్సీబీ కెప్టెన్గా జాసన్ హోల్డర్.. రాయుడుతో పాటు.. రూ. 27 కోట్లతో భారీ స్కెచ్..! -
కోహ్లి బ్యాటింగ్, ధోని కెప్టెన్సీ స్కిల్స్ కలగలిపితే యశ్ ధుల్..
అండర్ 19 ప్రపంచకప్ 2022లో యువ భారత జట్టును అద్భుతంగా ముందుండి నడిపించడంతో పాటు వ్యక్తిగతంగా కూడా రాణించి, టీమిండియా ఐదో ప్రపంచకప్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన యశ్ ధుల్పై అతని వ్యక్తిగత కోచ్ రాజేశ్ నగార్ ప్రశంసల వర్షం కురిపించాడు. యశ్ ధుల్ సాధించిన ఈ ఘనత తనకెంతో గర్వకారణమని, కరీబియన్ దీవుల నుంచి అతని రాక కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని అన్నాడు. జట్టును గెలిపించడం కోసం యశ్ ఆకలిగొన్న పులిలా ఉంటాడని, అతను కచ్చితంగా ప్రపంచకప్ టైటిల్ సాధిస్తాడని తనకు ముందే తెలుసని చెప్పుకొచ్చాడు. ప్రపంచకప్ గెలిచిన అండర్ 19 జట్టు చాలా బలమైన జట్టు అని, ఈ జట్టుతో యశ్ అద్భుతాలు చేస్తాడని ముందే ఊహించానని ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ఈ సందర్భంగా రాజేశ్ నగార్.. యశ్ ధుల్కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. యశ్.. తన స్కూల్ డేస్ నుంచి విరాట్ కోహ్లికి వీరాభిమాని అని, కోహ్లి బ్యాటింగ్ను రెగ్యులర్ ఫాలో అవుతూ అమితంగా ఆరాధించేవాడని, విరాట్ లాంటి క్రికెటర్గా తయారవ్వడమే అతని లక్ష్యంగా ఉండేదని తెలిపాడు. కోహ్లిలా బ్యాటింగ్ చేయడం కోసం యశ్ ఎంతో కష్టపడ్డాడని, ఇప్పుడు అతని బ్యాటింగ్ చూస్తే అచ్చం కోహ్లి బ్యాటింగ్ చూసినట్టే ఉంటుందని గర్వపడుతూ చెప్పుకొచ్చాడు. యశ్లో సమర్ధవంతమైన నాయకుడు కూడా ఉన్నాడని, అతని కెప్టెన్సీ స్టైల్ టీమిండియా మాజీ కెప్టెన్ ధోనిని పోలి ఉంటుందని తెలిపాడు. ఇదిలా ఉంటే, అండర్-19 ప్రపంచకప్ 2022 ఫైనల్లో ఇంగ్లండ్ను మట్టికరిపించిన యువ భారత జట్టు ఐదో ప్రపంచకప్ టైటిల్ను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ నిర్ధేశించిన 190 పరుగుల లక్ష్యాన్ని యంగ్ ఇండియా మరో 2 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. నిషాంత్ సింధు 50 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా.. వైస్ కెప్టెన్ షేక్ రషీద్(50), రాజ్ బవా(35) రాణించారు. అంతకుముందు టీమిండియా పేసర్లు రాజ్ బవా(5/31), రవికుమార్(4/34)ల ధాటికి ఇంగ్లండ్ జట్టు 44.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. చదవండి: కీలక టోర్నీ నుంచి తప్పుకున్న హార్దిక్ పాండ్యా.. కారణం అదేనా? -
అప్పుడు ధోని.. ఇప్పుడు దినేష్ బనా; అదే విన్నింగ్ సిక్స్
''ధోని ఫినీషెస్ ఆఫ్ ఇస్ స్టైల్.. ఏ మాగ్నిఫిషియెంట్ స్ట్రైక్ ఇన్టూది క్రౌడ్.. ఇండియా లిప్ట్స్ ది వరల్డ్కప్ ఆఫ్టర్ 28 ఇయర్స్''.. ఈ పదం క్రికెట్ను అభిమానించే ప్రతీ భారతీయుడు తమ ఊపిరి ఉన్నంతవరకు మరిచిపోడు. మన చెవుల తుప్పు వదిలేలా ఎన్నోసార్లు ఈ వీడియోనూ యూట్యూబ్ల్లో ప్లేచేసిన సందర్భం కోకోల్లలు. 28 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా 2011 ప్రపంచకప్ అందుకున్న మధుర క్షణాలవి. ఇక ఆరోజు శ్రీలంకతో ఫైనల్లో ఎంఎస్ ధోని కొట్టిన విన్నింగ్ సిక్స్ ఎన్నోసార్లు టీవీలో చూసుంటాం. అయినా అది మరిచిపోయే విషయం కాదని కూడా తెలుసు. ఆ ఫైనల్లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన మహీ 90 పరుగులు నాటౌట్గా నిలిచి చరిత్రలో నిలిచిపోయాడు. అయితే ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారనుకుంటున్నారా. విషయం ఏంటంటే.. శనివారం ముగిసిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో యువ భారత్.. ఇంగ్లండ్ను చిత్తు చేసి ఐదోసారి చాంపియన్స్గా నిలిచింది. అయితే ఈ మ్యాచ్లో ఆఖర్లో వికెట్ కీపర్ దినేష్ బనా కొట్టిన విన్నింగ్ సిక్స్ అచ్చం ధోని సిక్స్లా కనిపించింది. అక్కడ ధోని ఎలా అయితే సిక్స్ కొట్టి టీమిండియాకు వరల్డ్కప్ అందించాడో.. అచ్చం అదే తరహాలో దినేష్ బనా కూడా లాంగాన్ మీదుగా భారీ సిక్స్ కొట్టి ఇండియాను ఐదోసారి అండర్-19 వరల్డ్ చాంపియన్స్లా నిలిపాడు. ఇంకేముంది కొన్ని నిమిషాల్లోనే బనా కొట్టిన సిక్స్ను ధోని సిక్స్తో పోలుస్తూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఐసీసీ కూడా బనా సిక్స్ వీడియోనూ షేర్ చేస్తూ.. ''ఇంతకముందు ఇలాంటి సిక్స్తో ముగిసిన ఎండింగ్ను మీరెక్కడైనా చూశారా'' అంటూ ఫన్నీగా కామెంట్ చేసింది. ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఎంఎస్ ధోని.. దినేష్ బనాలు ఇద్దరు వికెట్ కీపర్లు కావడమే. చదవండి: Yash Dhull: యశ్ ధుల్ ఖాతాలో మరో అరుదైన ఘనత 'నీ ఆట అమోఘం.. ప్రత్యర్థివైనా మెచ్చుకోకుండా ఉండలేం' View this post on Instagram A post shared by ICC (@icc) -
యశ్ ధుల్ ఖాతాలో మరో అరుదైన ఘనత
అండర్-19 టీమిండియా యంగ్ కెప్టెన్ యశ్ ధుల్ మరో అరుదైన ఘనత సాధించాడు. యశ్ ధుల్ నేతృత్వంలోని యువ భారత్ ఇంగ్లండ్ను ఫైనల్లో మట్టికరిపించి ఐదోసారి అండర్-19 ప్రపంచ చాంపియన్స్గా నిలిచింది. ఈ సందర్భంగా ఐసీసీ యశ్ ధుల్ను ప్రత్యేకంగా గౌరవించింది. అండర్-19 ప్రపంచకప్ 2022లో విన్నింగ్ కెప్టెన్గా నిలిచిన యశ్ ధుల్ను ఐసీసీ అప్స్టోక్స్ మోస్ట్ వాల్యుబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ కెప్టెన్గా ఎంపిక చేసింది. అండర్-19 ప్రపంచకప్ ముగిసిన ప్రతీసారి ఐసీసీ మోస్ట్ వాల్యుబుల్ టీమ్ను ఎంపిక చేయడం ఆనవాయితీ. ఈ సందర్భంగానే యశ్ ధుల్ కెప్టెన్గా.. ఈ టోర్నీలో పాల్గోన్న ఎనిమిది దేశాల నుంచి అత్యంత మెరుగ్గా రాణించిన మరో 11 మంది భవిష్యత్తు స్టార్లను జట్టుగా ఎంపికచేసింది. ఈ జాబితాలో ఇండియా నుంచి యశ్ ధుల్తో పాటు.. టోర్నమెంట్లో విశేషంగా రాణించిన ఆల్రౌండర్ రాజ్ బవాతో పాటు స్పిన్నర్విక్కీ ఓస్త్వాల్కు చోటు దక్కింది. ఈ అత్యుత్తమ జట్టును ఐసీసీ మ్యాచ్ రిఫరీ గ్రీమి లాబ్రోయ్, జర్నలిస్ట్ సందీపన్ బెనర్జీ, కామెంటేటర్స్ సామ్యూల్ బద్రి, నాటల్లీ జెర్మనోస్ కలిసి ఎంపిక చేశారు. చదవండి: Under 19 World Cup: చాంపియన్ యువ భారత్ 12 మందితో కూడిన జట్టులో ఓపెనర్లుగా హసీబుల్లాఖాన్(పాకిస్తాన్, వికెట్ కీపర్), టీగు విల్లీ(ఆస్ట్రేలియా).. ఇక టోర్నమెంట్లో పరుగుల వరద పారించి జూనియర్ ఏబీగా పేరు తెచ్చుకున్న డెవాల్డ్ బ్రెవిస్(దక్షిణాఫ్రికా) వన్డౌన్కు ఎంపికయ్యాడు. అండర్-19 ప్రపంచకప్ విజేతగా టీమిండియాను నిలిపిన కెప్టెన్ యశ్ ధుల్ నాలుగో స్థానంలో, ఇంగ్లండ్కు చెందిన టామ్ పెర్స్ట్ ఐదో స్థానంలో చోటు దక్కించుకున్నాడు. ఆల్రౌండర్ కోటాలో టీమిండియా నుంచి రాజ్ బవా.. శ్రీలంకు నుంచి దునిత్ వెల్లలగే ఎంపికయ్యారు. ఇక స్పిన్నర్గా టీమిండియా తరపున విశేషంగా రాణించిన విక్కీ ఓస్త్వాల్కు చోటు దక్కింది. ఇక పేసర్లుగా ఇంగ్లండ్కు చెందిన జోష్ బోయెడెన్, పాకిస్తాన్కు చెందిన అవైస్ అలీ, బంగ్లాదేశ్కు చెందిన రిపన్ మోండోల్ ఎంపికయ్యారు. ఇక జట్టులో పన్నెండవ ఆటగాడిగా అఫ్గనిస్తాన్కు చెందిన ఆల్రౌండర్ నూర్ అహ్మద్ ఎంపికయ్యాడు. ఈ ఆల్రౌండర్ 10 వికెట్లు తీయడంతో పాటు విలువైన పరుగులు సాధించాడు. చదవండి: Washington Sundar: ఐదేళ్ల తర్వాత రీఎంట్రీ.. గోడకు కొట్టిన బంతిలా ఐసీసీ అండర్-19 మోస్ట్ వాల్యుబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్: హసీబుల్లా ఖాన్ (వికెట్ కీపర్, పాకిస్థాన్) టీగ్ విల్లీ (ఆస్ట్రేలియా) డెవాల్డ్ బ్రెవిస్ (దక్షిణాఫ్రికా) యశ్ ధుల్ (కెప్టెన్, ఇండియా) టామ్ పెర్స్ట్ (ఇంగ్లండ్) దునిత్ వెల్లలాగే (శ్రీలంక) రాజ్ బవా (భారతదేశం) విక్కీ ఓస్త్వాల్ (భారతదేశం) రిపన్ మోండోల్ (బంగ్లాదేశ్) అవైస్ అలీ (పాకిస్థాన్) జోష్ బోడెన్ (ఇంగ్లండ్) నూర్ అహ్మద్ (ఆఫ్ఘనిస్తాన్) -
U19 WC: జట్టులో స్టార్స్ లేరు.. వందకు వంద శాతం ఎఫర్ట్ పెడతాం: యశ్ ధుల్
Under 19 World Cup Final India Vs England -Yash Dhull Comments: ‘‘జట్టులో స్టార్స్ అంటూ ఎవరూ లేరు. మేమంతా సమష్టిగా ఆడతాం. ఎవరో ఒక్కరు బాగా ఆడినంత మాత్రాన ఇదంతా సాధ్యం కాదు. ప్రతి ఆటగాడు రాణిస్తేనే గెలుపు అవకాశాలు పెరుగుతాయి. విజయాల్లో ప్రతి ఒక్కరు తమ వంతు పాత్ర పోషించారు. అలా ఇక్కడి దాకా చేరుకున్నాం. ఇప్పుడు మా దృష్టి అంతా ఫైనల్ మ్యాచ్ మీదే ఉంది’’ అని అండర్ 19 భారత జట్టు కెప్టెన్ యశ్ ధుల్ అన్నాడు. అభిమానుల అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ తుదిమెట్టు వరకు చేరుకోవడం సంతోషంగా ఉందన్నాడు. కాగా అండర్ 19 ప్రపంచకప్లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్లో యశ్ ధుల్ అద్భుత సెంచరీతో మెరవగా.. వైస్ కెప్టెన్ షేక్ రషీద్ 94 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో కంగారూలను మట్టికరిపించి యువ భారత్ టోర్నీ ఫైనల్ మ్యాచ్కు అర్హత సాధించింది. ఇంగ్లండ్తో తుదిపోరులో తలపడనుంది. ఈ నేపథ్యంలో యశ్ ధుల్ మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్ జట్టు చాలా బాగుంది. టోర్నీ ఆసాంతం వారు బాగా ఆడారు. ఈ మ్యాచ్లో హోరాహోరీ తప్పదు. సహజమైన ఆట తీరుతో ముందుకు సాగుతాం. వందుకు వంద శాతం కష్టపడతాం. ఇక ఫలితం ఎలా ఉంటుందో మ్యాచ్ తర్వాత మీరే చూస్తారు’’ అని చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్, అండర్ 19 వరల్డ్కప్ విజేత విరాట్ కోహ్లితో సంభాషణ గురించి చెబుతూ.. ‘‘మాకు విష్ చేయడానికి కోహ్లి కాల్ చేశాడు. బాగా ఆడుతున్నామని చెప్పాడు. గేమ్ ప్లాన్ గురించి మాట్లాడాడు. కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాడు. ఆత్మవిశ్వాసం నింపాడు. సీనియర్లు ప్లేయర్ల మద్దతు లభించడం సంతోషకరం’’అని హర్షం వ్యక్తం చేశాడు. అదే విధంగా కెప్టెన్గా, ఆటగాడిగా తన శక్తి మేరకు జట్టు, దేశం గెలుపు కొరకు కృషి చేస్తానని యశ్ ధుల్ వ్యాఖ్యానించాడు. భారత్కు ఐదో టైటిల్ అందించేందుకు శాయశక్తులా కృషి చేస్తామని పేర్కొన్నాడు. చదవండి: U19 WC Aus Vs Afg: ఆఖరి వరకు ఉత్కంఠ.. అదరగొట్టిన భారత సంతతి కుర్రాడు.. ఆసీస్దే విజయం Yash Dhull: యశ్ ధుల్ ఎలా కొట్టావయ్యా ఆ సిక్స్.. క్రికెట్ పుస్తకాల్లో పేరుందా! “There is no one star in the team, we play as a unit." India captain Yash Dhull speaks before their all-important #U19CWC 2022 Final against England 📽️ pic.twitter.com/Z46rQ2IHlp — ICC (@ICC) February 5, 2022 🗣️🗣️ "When a senior player speaks with the team, the team morale goes up." India U19 captain Yash Dull speaks about @imVkohli's interaction with the #BoysInBlue ahead of the #U19CWC 2022 Final. 👍#INDvENG pic.twitter.com/8c9zG90y2I — BCCI (@BCCI) February 5, 2022 -
U19 WC: 8వ వరుస బ్యాటర్ దాకా పరుగులు చేసే సత్తా వాళ్లది.. మన బౌలర్లు తక్కువేం కాదు!
U19 WC Final India Vs England:- నార్త్సౌండ్ (అంటిగ్వా): అండర్–19 ప్రపంచకప్లో ఐదో టైటిల్పై యువ భారత్ గురిపెట్టింది. టైటిల్ ఫేవరెట్గా కరీబియన్ వచ్చాక... తీరా అసలు మ్యాచ్లు మొదలయ్యాక కరోనా కలకలం రేపింది. అయినా సరే కుర్రాళ్ల పట్టుదల ముందు వైరస్ కూడా జట్టుపై ప్రభావం చూపలేక తోకముడిచింది. ఇప్పుడు అజేయంగా ఫైనల్కు వచ్చింది. ఎనిమిదో ఫైనల్లో ఐదో చాంపియన్షిప్పై కుర్రాళ్లంతా మనసు పెట్టారు. అందుకేనేమో భారత అండర్–19 జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో ఎవరెదురైనా అదరగొట్టేస్తోంది. శనివారం వివి యన్ రిచర్డ్స్ స్టేడియంలో జరిగే ఫైనల్లో ఇంగ్లండ్తో అమీతుమీకి యువ భారత్ సిద్ధమైంది. ఆత్మవిశ్వాసంతో కుర్రాళ్లు వరుస విజయాలతో భారత కుర్రాళ్లు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మ్యాచ్లు జరుగుతున్న కొద్దీ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా మారింది. బౌలింగ్ దళం దుర్భేద్యంగా తయారైంది. అందువల్లేనేమో సెమీస్లో ఆస్ట్రేలియా ఆరంభంలోనే కంగారు పెట్టినా నిలకడైన బ్యాటింగ్తో కుదుటపడింది. తర్వాత చెలరేగింది. సెమీఫైనల్లో విఫలమైన ఓపెనర్లు అంగ్క్రిష్, హర్నూర్ సింగ్లు తుదిపోరులో జాగ్రత్తపడాలి. లోయర్ మిడిలార్డర్లో నిశాంత్, దినేశ్ వరకు జట్టులో మెరుపులు మెరిపించే సమర్థులు ఉండటం జట్టుకు బాగా కలిసొచ్చే అంశం. నిశాంత్ బౌలింగ్లోనూ అదరగొడుతున్నాడు. అతనితో పాటు రెగ్యులర్ బౌలర్లు రవికుమార్, కౌశల్, విక్కీలు శనివారం జరిగే ఆఖరి పోరులో సమష్టిగా జూలు విదిల్చితే అండర్–19 ప్రపంచకప్ చరిత్రలో భారత్ ఫైవ్స్టార్ జట్టుగా ఎదుగుతుంది. అజేయంగా ఇంగ్లండ్ భారత్లాగే ఇంగ్లండ్ కూడా ఈ టోర్నీలో అజేయంగా ఫైనల్ చేరింది. గతంలో ఒక్కసారి (1998) మాత్రమే టైటిల్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు మళ్లీ ఇన్నేళ్లయినా తుదిమెట్టుపై నిలువలేదు. ఇన్నాళ్లకు వచ్చిన టైటిల్ అవకాశాన్ని జారవిడవద్దనే కసితో ఆ జట్టు ఉంది. తుది 11 మందిలో ఏకంగా 8వ వరుస బ్యాటర్ దాకా పరుగులు చేసే సత్తా ఇంగ్లండ్ను దుర్భేద్యమైన ప్రత్యర్థిగా మార్చింది. ఈ టోర్నీలో బ్యాటింగ్, బౌలింగ్లతో తమకెదురైన ప్రత్యర్థుల్ని చిత్తు చేస్తూ ఇక్కడికొచ్చింది. హాట్ ఫేవరెట్ భారత్పై గెలిచేందుకు అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్న ఇంగ్లండ్తో ఫైనల్ హోరాహోరీగా జరగడం ఖాయమైంది. బ్యాటింగ్లో ఓపెనర్ జార్జ్ థామస్, కెప్టెన్ ప్రెస్ట్ సహా మిడిలార్డర్లో జార్జ్బెల్, అలెక్స్ హార్టన్ ఫామ్లో ఉన్నారు. బౌలింగ్లో బైడెన్, రేహన్ అహ్మద్, అస్పిన్వాల్ ప్రత్యర్థి బ్యాటర్స్కు సవాళ్లు విసురుతున్నారు. గత ఈవెంట్లో బంగ్లాదేశ్ చేతిలో ప్రపంచకప్ను కోల్పోయిన భారత్ ఈ సారి ఫలితాన్ని మార్చాలనుకుంటే సమవుజ్జీ అయిన ప్రత్యర్థిని పక్కావ్యూహంతో ‘ఢీ’ కొట్టాల్సి ఉంటుంది. జట్లు (అంచనా) భారత్ అండర్–19: యశ్ ధుల్ (కెప్టెన్) అంగ్క్రిష్ రఘువంశీ, హర్నూర్ సింగ్, షేక్ రషీద్, రాజ్వర్ధన్, నిశాంత్, దినేశ్, కౌశల్ తాంబే, రాజ్ బావా, విక్కీ ఓస్త్వాల్, రవికుమార్. ఇంగ్లండ్ అండర్–19: టామ్ ప్రెస్ట్ (కెప్టెన్), థామస్, బెథెల్, జేమ్స్ ర్యూ, లక్స్టన్, జార్జ్ బెల్, రేహాన్ అహ్మద్, అలెక్స్ హార్టన్, సలెస్, అస్పిన్వాల్, జొషువా బైడెన్. చదవండి: అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో తొలి క్రికెటర్గా.. WHAT A HIT 🔥 Yash Dhull's stunning six dancing down the track is the @Nissan #POTD winner from the #U19CWC Super League semi-final clash between India and Australia 👏 pic.twitter.com/rFiEAsv2G4 — ICC (@ICC) February 3, 2022 -
యశ్ ధుల్ ఒక సంచలనం.. కోహ్లితో ఉన్న పోలికేంటి!
''అండర్-19 ప్రపంచకప్లో భారత జట్టుకు సభ్యుడిగా ఉంటేనే ఒక బంపర్ టోర్నమెంట్లో ఆడుతున్నాడు.. కెరీర్కు మేజర్ స్టార్ట్ దొరికినట్లేనని అంతా అంటారు.. మరి అలాంటిది అదే అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టుకు కెప్టెన్గా నువ్వు ఉంటే.. ఇక నీ పేరు క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది.''.. అండర్-19 పెను సంచలనం.. యశ్ ధుల్కు తన చిన్ననాటి కోచ్ చెప్పిన మాటలివి.. ఈ మాటలను నిజం చేయడానికి యశ్ ధుల్ ఒక్క అడుగుదూరంలో ఉన్నాడు. శనివారం టీమిండియా ఇంగ్లండ్తో ఫైనల్లో అమితుమీ తేల్చుకోనుంది. ఐదో టైటిల్పై కన్నేసిన టీమిండియా కళను యశ్ ధుల్ తీర్చనున్నాడా అనేది తేలిపోనుంది. మరి అలాంటి యశ్ ధుల్ ఎక్కడి నుంచి వచ్చాడు.. క్రికెట్లోకి ఎలా అడుగుపెట్టాడు అన్న విషయాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. జనవరి 19,2022.. అండర్-19 ప్రపంచకప్ ప్రారంభమై అప్పటికి ఐదు రోజులు కావొస్తుంది. టీమిండియా తన తొలి మ్యాచ్లో శుభారంభం చేసింది. ఇక రెండో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇంతలో జట్టును కరోనా కుదుపేసింది. టీమిండియా కెప్టెన్ యశ్ ధుల్ సహా కొంతమంది ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. ఇది యశ్ ధుల్ను బాగా భయపెట్టింది. టీమిండియా అండర్-19లో ఐదో ప్రపంచకప్ టైటిల్ అందివ్వాలనుకున్న కోరిక నెరవేరదేమోనని అనుకున్నాడు. ఒక్కరోజు వ్యవధిలోనే డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. అయితే ఆ సమయంలో తన చిన్ననాటి కోచ్ రాజేష్ నగర్ గుర్తొచ్చారు. వెంటనే ఆయనకు ఫోన్ చేసి మాట్లాడాడు. నగర్ ఒక్కటే విషయం చెప్పారు.. భయపడకు.. కంట్రోల్లో ఉంటే అన్ని కంట్రోల్లోనే ఉంటాయి'' అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. చదవండి: Yash Dhull: యశ్ ధుల్ ఎలా కొట్టావయ్యా ఆ సిక్స్.. క్రికెట్ పుస్తకాల్లో పేరుందా! కోచ్ నగర్ మాటలు యశ్ ధుల్కు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. ఐసోలేషన్లో ఉన్న యశ్ ధుల్ మూడో రోజు నుంచే తను ఉన్న రూమ్లోనే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. దాన్నంతా ఒక కెమెరాలో బంధించి తర్వాత రీప్లే చేసుకొని షాట్ల ఎంపికను చూసుకునేవాడు. ఆ తర్వాత కోచ్ వివిఎస్ లక్ష్మణ్కు తన వీడియోలను పంపించి బ్యాటింగ్ టెక్నిక్స్ అడిగేవాడు. ఇదంతా చూసిన లక్ష్మణ్.. యశ్ ధుల్ నీ పోరాట పటిమ అద్భుతం.. ఇండియా ఎలెవెన్లో కెప్టెన్ ఆర్మ్బాండ్ ధరించి మ్యాచ్లు ఆడతావు రెడీగా ఉండు.. అని చెప్పాడు. అన్నట్లే యశ్ ధుల్ బంగ్లాదేశ్తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ సమయానికి కోలుకొని మళ్లీ అండర్-19 ప్రపంచకప్లో అడుగుపెట్టాడు. ఆ మ్యాచ్లో 20 పరుగులతో నాటౌట్గా నిలిచి మ్యాచ్ను గెలిపించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ ఒక చరిత్ర. కష్టాల్లో పడిన టీమిండియాను షేక్ రషీద్ సాయంతో.. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన యశ్ ధుల్ సూపర్సెంచరీతో మెరిశాడు. 96 పరుగులుతో విజయం సాధించిన భారత్ ఎనిమిదోసారి ఫైనల్లో అడగుపెట్టింది. టీమిండియాకు అండర్-19 ప్రపంచకప్ అందించడానికి ఒక్క అడుగుదూరంలో ఉన్నాడు. చదవండి: Shaik Rasheed: అవరోధాలు అధిగమించి.. మనోడి సూపర్ హిట్టు ఇన్నింగ్స్ పదేళ్ల వయసు నుంచే.. యశ్ ధుల్ చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే అమితమైన ఆసక్తి ఉండేది. తన పదేళ్ల వయసు నుంచే క్రికెట్పై దృష్టి పెట్టిన యశ్ధుల్ అండర్-19లో టీమిండియాకు కప్ అందించాలని కోరుకున్నాడు. అలా ద్వారకాలోని బాల్ భవన్ స్కూల్లో క్రికెట్లో ఓనమాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఆరో తరగతి వచ్చిన తర్వాత కోచ్ రాజేశ్ నగర్ యశ్కు పరిచయమయ్యాడు. అప్పటినుంచి అతని ఆట పూర్తిగా మారిపోయింది. ఒక నెల వ్యవధిలోనే 15 మ్యాచ్లు ఆడి సూపర్ ఫామ్ను కొనసాగించి మంచి రన్స్ సాధించాడు. కేవలం 15 మ్యాచ్లు మాత్రమే ఆడిన ఇతను 2వేల మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా కనిపిస్తున్నాడని కొందరు కోచ్లు మెచ్చుకున్నారు. ఆ తర్వాత అండర్-19 కేటగిరిలో శ్రీలంక, నేపాల్, మలేషియాలో కీలక టోర్నీలు ఆడాడు. 15 ఏళ్ల వయసులో నేపాల్లో జరిగిన అండర్-19 టోర్నమెంట్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకొని అందరి దృష్టిలో పడ్డాడు. అయితే యశ్ ధుల్ 16 ఏళ్లకే ఇంత పేరు తెచ్చుకోవడం వెనుక కోహ్లి కూడా ఒక కారణమని అతని కోచ్ నగర్ ఒక సందర్భంలో పేర్కొన్నారు. కోహ్లితో అనుబంధం.. అతనితో పోలిక ''ఢిల్లీలో యశ్ ధుల్ ఇంటికి.. కోహ్లి ఇంటికి ఆరు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండేది. కోహ్లి ఆటను దగ్గరుండి గమనించిన యశ్ ధుల్ అతన్నే అనుకరించడం మొదలుపెట్టాడు. అండర్-19 జట్టులో మూడోస్థానంలోనే బ్యాటింగ్కు వచ్చే యశ్ ధుల్ అచ్చం కోహ్లిని తలపిస్తున్నాడు. ఒక వన్డే మ్యాచ్లో 50 ఓవర్లు ఎలా ఆడాలో కోహ్లి నుంచే నేర్చుకున్నాడు. కోహ్లి తన ఇన్నింగ్స్ను ఎలా అయితే స్టార్ట్ చేస్తాడో.. అచ్చం అదే మాదిరి యశ్ధుల్ కూడా సింగిల్స్, డబుల్స్కు ప్రాధాన్యం ఇచ్చేవాడు. ఓపెనర్లు ఔటైతే.. ఆ తర్వాత వన్డౌన్లో వచ్చే ఆటగాడు ఎంత కీలకమో తెలుసుకున్నాడు. యశ్ ధుల్ కోహ్లి టెక్నిక్ను అందుకోలేకపోవచ్చు.. కానీ అతనిలా మాత్రం ఇన్నింగ్స్లు నిర్మించగలడు.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అండర్-19 ప్రపంచకప్లో చోటు దక్కించుకునేందుకు యశ్ ధుల్ బాగా కష్టపడ్డాడు. సెప్టెంబర్- అక్టోబర్ 2021లో జరిగిన వినూ మాన్కడ్ ట్రోఫీలో యశ్ ధుల్ సూపర్ ప్రదర్శన చేశాడు. ఆ ట్రోఫీలో ఢిల్లీ గ్రూప్ స్టేజీ దాటకపోయినప్పటికి యశ్ మాత్రం 302 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఆసియా కప్లో టీమిండియా కెప్టెన్గా జట్టును ముందుండి నడిపించాడు. ఇప్పుడు వరల్డ్కప్లోనూ టీమిండియాకు ఐదో టైటిల్ అందించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతని కోరిక నెరవేరి త్వరలోనే టీమిండియాలోకి కూడా అడుగుపెట్టాలని ఆశిద్దాం. చదవండి: Under-19 World Cup: అప్పుడు కుర్రాళ్లు.. ఇప్పుడు సూపర్స్టార్లు -
U19 WC Final: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ?
U19 World Cup Final- India Vs Eng: అండర్ 19 ప్రపంచకప్ టోర్నీ ఫైనల్కు రంగం సిద్ధమైంది. వెస్టిండీస్లోని అంటిగ్వా వేదికగా భారత్, ఇంగ్లండ్ తుది పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. కాగా ఇప్పటికే భారత్ నాలుగుసార్లు టైటిల్ గెలవగా.. 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఇంగ్లండ్ ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో ఇరు జట్ల మధ్య జరుగనున్న ఆసక్తికర పోరు కోసం అభిమానులు ఆతురతగా ఎదురుచూస్తున్నారు. మరి మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయానికి ఆరంభమవుతుంది, లైవ్ టెలికాస్ట్ తదితర అంశాలు మీకోసం.. ►అండర్ 19 వరల్డ్కప్ ఫైనల్: ఫిబ్రవరి 5(శనివారం) ►వేదిక: అంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం ►సమయం: భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ఆరంభం ►ప్రసారమయ్యే చానెల్: స్టార్స్పోర్ట్స్ నెట్వర్క్స్, డిస్నీ+ హాట్స్టార్లోనూ లైవ్ స్ట్రీమింగ్ జట్లు: భారత్: యశ్ ధుల్(కెప్టెన్), హార్నూర్ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, షేక్ రషీద్(వైస్ కెప్టెన్), నిషాంత్ సింధు, సిద్దార్థ్ యాదవ్, దినేశ్ బనా(వికెట్ కీపర్), ఆరాధ్య యాదవ్(వికెట్ కీపర్), రాజ్ అంగద్ బవా, మానవ్ పరేఖ్, కౌశాల్ తంబే, ఆర్ఎస్ హంగేర్కర్, వాసు వట్స్, విక్కీ ఒస్త్వాల్, రవికుమార్, గర్వ్ సంగ్వాన్. స్టాండ్ బై ప్లేయర్లు: రిషిత్ రెడ్డి, ఉదయ్ సహారన్, అన్ష్ గోసాయ్, అమిత్ రాజ్ ఉపాధ్యాయ్, పీఎం సింగ్ రాథోడ్. ఇంగ్లండ్: రెహాన్ అహ్మద్, టామ్ అస్పిన్వాల్, సోని బేకర్, నాథన్ బర్న్వెల్, జార్జ్ బెల్, జాకోబ్ బెథెల్, జోష్, బోయిడెన్, జేమ్స్ కోల్స్, అలెక్స్ హార్టన్, విల్ లక్స్టన్, టామ్ ప్రెస్ట్(కెప్టెన్), జేమ్స్ రూ, జేమ్స్ సేల్స్, ఫతేహ్ సింగ్, జార్జ్ థామస్. రిజర్వు ప్లేయర్లు: జోష్ బేకర్, బెన్ క్లిఫ్. చదవండి: Yash Dhull: యశ్ ధుల్ ఎలా కొట్టావయ్యా ఆ సిక్స్.. క్రికెట్ పుస్తకాల్లో పేరుందా! Shaik Rasheed: అవరోధాలు అధిగమించి.. మనోడి సూపర్ హిట్టు ఇన్నింగ్స్.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. View this post on Instagram A post shared by ICC Cricket World Cup (@cricketworldcup) -
ఇంగ్లండ్తో ఫైనల్.. కుర్రాళ్లకు విరాట్ కోహ్లి కీలక సూచనలు!
అండర్-19 ప్రపంచకప్ తుది సమరానికి చేరుకుంది. శనివారం జరగనున్న ఫైనల్లో ఇంగ్లండ్తో భారత్ తలపడునంది. ఈ నేపథ్యంలో ఫైనల్కు ముందు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి భారత యువ ఆటగాళ్లకి కీలక సూచనలు చేశాడు. భారత యువ ఆటగాళ్లతో కోహ్లి ఆన్లైన్ ఇంటరాక్షన్ అయ్యాడు. విరాట్ తన కెప్టెన్సీలో 2008లో భారత జట్టును అండర్-19 ఛాంపియన్గా నిలిపిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లితో సంభాషణకి సంబంధించిన వీడియోను అండర్- ఆటగాళ్లు కౌశల్ తాంబే, రవ్జర్ధన్ హంగర్గేకర్ ఇనస్ట్రాగమ్లో పోస్ట్ చేశారు. "ఫైనల్స్కు ముందు కింగ్ కోహ్లి మాకు కొన్ని విలువైన చిట్కాలు, సూచనలు అందించాడు" అని కౌశల్ తాంబే క్యాప్షన్గా పెట్టాడు. "విరాట్ భయ్యా... మీతో సంభాషించడం చాలా బాగుంది . మీ నుంచి జీవితం, క్రికెట్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాను. నాకు అవి రాబోయే కాలంలో మరింత మెరుగవడానికి సహాయపడతాయి" అని హంగర్గేకర్ రాసుకొచ్చాడు. అండర్-19 ప్రపంచ కప్లో టీమిండియా వరుసగా నాలుగో సారి ఫైనల్కు చేరింది. భారత అండర్–19 జట్టు నాలుగు సార్లు ప్రపంచ కప్ను గెలుచుకుంది. 2000లో (కెప్టెన్ మొహమ్మద్ కైఫ్), 2008లో (కెప్టెన్ విరాట్ కోహ్లి), 2012లో (కెప్టెన్ ఉన్ముక్త్ చంద్), 2018 (కెప్టెన్ పృథ్వీ షా) జట్టు చాంపియన్గా నిలిచింది. మరో మూడు సార్లు (2006, 2016, 2020) ఫైనల్లో ఓడి రన్నరప్గా నిలిచింది. చదవండి: Dewald Brevis- Shikhar Dhawan: సంచలన ఇన్నింగ్స్.. ఒకే ఒక్క పరుగు.. ధావన్ రికార్డు బద్దలు.. ప్రొటిస్ యువ కెరటం ఏబీడీ 2.0 ఘనత -
'టీమిండియాదే ప్రపంచకప్.. యష్ ధుల్ మరోసారి చెలరేగడం ఖాయం'
Yash Dhull Father About U19 WC Finals: అండర్-19 ప్రపంచ కప్లో టీమిండియా వరుసగా నాలుగో సారి ఫైనల్కు చేరింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి యువ భారత్ ఫైనల్లో అడుగు పెట్టింది. కాగా భారత విజయంలో కెప్టెన్ యష్ ధుల్ 110 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. ఇక శనివారం జరగబోయే ఫైనల్లో ఇంగ్లండ్తో టీమిండియా తలపడనుంది. ఈ నేపథ్యంలో యష్ ధుల్ తండ్రి విజయ్ ధుల్ కీలక వాఖ్యలు చేశాడు. అండర్-19 ప్రపంచ కప్ టైటిల్ను భారత్ కచ్చితంగా కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. అదే విధంగా యష్ క్రికెట్ ఫీల్డ్లో చాలా చురుకుగా ఉంటాడు, భారత్ ప్రపంచ కప్ గెలవడంలో యష్ కీలక పాత్ర పోషిస్తాడు అని అతడు తెలిపాడు. ‘‘భారత్కు కచ్చితంగా ప్రపంచకప్ వస్తుంది. ఈ టోర్నమెంట్లో యువ భారత్ జట్టు అద్భుతంగా రాణిస్తుంది. ఇంగ్లండ్ జట్టు కూడా గట్టి పోటీస్తుంది అనడంలో సందేహం లేదు. దేశం మొత్తం టీమిండియా వెనుక ఉంది. ఫైనల్లో భారత్ గెలిచి చరిత్ర సృష్టిస్తుందని అందరూ అశిస్తున్నారు. యష్ క్రికెట్ ఫీల్డ్లో చాలా చురుకుగా ఉంటాడు. జట్టు కష్టపరిస్ధితుల్లో ఉన్నప్పడు బ్యాటర్గా, సారధిగా తాను ఎంటో నిరూపించుకుంటాడు. ఆదే విధంగా ఏ బ్యాటర్కు ఏ బౌలర్ను ఊపయోగించాలో అతడికి బాగా తెలుసు’’ అని విజయ్ ధుల్ పేర్కొన్నాడు. ఇక భారత అండర్–19 జట్టు నాలుగు సార్లు ప్రపంచ కప్ను గెలుచుకుంది. 2000లో (కెప్టెన్ మొహమ్మద్ కైఫ్), 2008లో (కెప్టెన్ విరాట్ కోహ్లి), 2012లో (కెప్టెన్ ఉన్ముక్త్ చంద్), 2018 (కెప్టెన్ పృథ్వీ షా) జట్టు చాంపియన్గా నిలిచింది. మరో మూడు సార్లు (2006, 2016, 2020) ఫైనల్లో ఓడి రన్నరప్గా నిలిచింది. చదవండి: నాపై ప్రేమ చూపించినందుకు ధన్యవాదాలు.. నేను బాగానే ఉన్నా: శిఖర్ ధావన్ -
యశ్ ధుల్ ఎలా కొట్టావయ్యా ఆ సిక్స్.. క్రికెట్ పుస్తకాల్లో పేరుందా!
అండర్-19 ప్రపంచకప్లో టీమిండియా ఫైనల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కెప్టెన్ యశ్ ధుల్ సూపర్ సెంచరీకి(110 పరుగులు) తోడు షేక్ రషీద్(94) రాణించడంతో యువ భారత్.. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను 96 పరుగులతో మట్టికరిపించింది. శనివారం జరగనున్న ఫైనల్లో ఇంగ్లండ్తో అమితుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే అండర్-19 ప్రపంచకప్లో నాలుగుసార్లు విజేతగా నిలిచిన టీమిండియా ఐదోసారి టైటిల్పై కన్నేసింది. చదవండి: U19 World Cup Semi Final: ఆసీస్పై సెంచరీతో విరాట్ కోహ్లీ సరసన చేరిన యశ్ ధుల్ ఇదిలాఉంటే.. సూపర్ సెంచరీతో మెరిసిన యశ్ ధుల్ ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. అతను కొట్టిన ఒకే ఒక్క సిక్స్ ఇప్పుడు క్లాసిక్గా మిగిలిపోనుందని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఆసీసీ బౌలర్ టామ్ విట్నీ వేసిన ఇన్నింగ్స్ 45వ ఓవర్ ఐదో బంతిని యష్ ధుల్ లాంగాన్ మీదుగా భారీ సిక్స్ కొట్టాడు. బంతి షార్ట్పిచ్ అవగా.. ఫ్రంట్ఫుట్కు వచ్చిన యష్.. డ్యాన్స్ మూమెంట్ ఇస్తూ బ్యాట్ ఎడ్జ్ను తగిలించాడు. అంతే.. బంతి లాంగాన్ మీదుగా వెళ్లి స్టాండ్స్ టాప్లో పడింది. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ ట్విటర్లో షేర్ చేస్తూ.. ''ఒక్క క్లాసిక్ సిక్స్తో ఐసీసీ ప్లే ఆఫ్ ది డే అవార్డు కొల్లగొట్టాడు.. ఇంతకీ యష్ ధుల్ కొట్టిన సిక్స్కు క్రికెట్ పుస్తకాల్లో ఏ పేరుందో కాస్త చెప్పండి'' అంటూ పేర్కొంది. చదవండి: హార్దిక్ పాండ్యాపై నిప్పులు చెరిగిన కోహ్లి చిన్ననాటి కోచ్ WHAT A HIT 🔥 Yash Dhull's stunning six dancing down the track is the @Nissan #POTD winner from the #U19CWC Super League semi-final clash between India and Australia 👏 pic.twitter.com/rFiEAsv2G4 — ICC (@ICC) February 3, 2022 -
U19 World Cup: విరాట్ కోహ్లీ సరసన చేరిన యశ్ ధుల్
అండర్ 19 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై సెంచరీతో కదంతొక్కిన యువ భారత కెప్టెన్ యశ్ ధుల్(110 బంతుల్లో 110; 10 ఫోర్లు, సిక్స్).. అరుదైన ఘనతను సాధించాడు. ఈ విభాగపు వరల్డ్ కప్ టోర్నీల్లో సెంచరీ చేసిన మూడో భారత కెప్టెన్గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో విరాట్ కోహ్లి (2008), ఉన్ముక్త్ చంద్(2012)లు మాత్రమే ఈ ఘనత సాధించారు. యాదృచ్చికంగా ఈ ముగ్గురు ఢిల్లీకి చెందిన వారే కావడం విశేషం. కాగా, సెమీఫైనల్లో కెప్టెన్ యశ్ ధుల్తో పాటు వైస్ కెప్టెన్ షేక్ రషీద్(108 బంతుల్లో 94; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో టీమిండియా.. ఆసీస్ను 96 పరుగుల తేడాతో ఓడించి, వరుసగా నాలుగోసారి ఫైనల్కు చేరింది. 2016, 2018, 2020 సీజన్లలో కూడా యువ భారత్ తుది పోరుకు అర్హత సాధించి టైటిల్ ఫైట్లో నిలిచింది. 2000 సంవత్సరంలో మహ్మద్ కైఫ్ సారధ్యంలో తొలిసారి ప్రపంచకప్ నెగ్గిన యువ భారత్.. 2008లో కోహ్లి నాయకత్వంలో, 2012లో ఉన్ముక్త్ చంద్, 2018లో పృథ్వీ షా కెప్టెన్సీల్లో టైటిల్ సాధించింది. ఇదిలా ఉంటే, ఆసీస్తో సెమీస్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేయగా, ఆసీస్ 41. 5 ఓవర్లలో 194 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. భారత జట్టులో యష్ ధుల్, షేక్ రషీద్ మూడో వికెట్కు 204 పరుగులు జోడించడంతో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. అనంతరం భారత యువ బౌలర్లలో విక్కీ వత్సల్ మూడు వికెట్లతో ఆసీస్ను దెబ్బ తీయగా, నిషాంత్ సింధు, రవి కుమార్లు తలో రెండు వికెట్లతో మెరిశారు. కౌశల్ తాంబే, రఘువంశీలు చెరో వికెట్ తీశారు. ఫిబ్రవరి 5న జరిగే ఫైనల్లో యువ భారత్.. ఇంగ్లండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. చదవండి: కోహ్లి వందో టెస్ట్ కోసం భారీ ఏర్పాట్లు.. కన్ఫర్మ్ చేసిన గంగూలీ -
Yash Dhull: మరో ఉన్ముక్త్ చంద్ కాకుంటే చాలు.. అశ్విన్ కౌంటర్!
టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్విటర్, ఇన్స్టాగ్రామ్లో ఎప్పటికపుడు తన అప్డేట్లు పంచుకునే అశూ.. యూట్యూబ్ చానెల్లో క్రికెట్కు సంబంధించి తన అభిప్రాయాలు పంచుకుంటాడు. ఇటీవల పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు అశ్విన్ తనదైన శైలిలో బ్యాట్ చేతబట్టి స్టెప్పులేసి అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఫ్యాన్స్ మనసు గెలుచుకున్నాడు. అండర్-19 భారత జట్టు కెప్టెన్ యశ్ ధుల్కు అండగా నిలిచాడు. ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్ టోర్నీలో భారత్ ఫైనల్ చేరుకున్న సంగతి తెలిసిందే. యశ్ ధుల్ సారథ్యంలోని జట్టు సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి తుది పోరుకు అర్హత సాధించింది. కెప్టెన్గా తనదైన వ్యూహాలతోనే కాదు... బ్యాటర్గానూ 110 పరుగులతో రాణించి విజయంలో కీలక పాత్ర పోషించాడు యశ్. ఈ క్రమంలో అతడిపై అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు ట్విటర్ వేదికగా... ‘‘కెప్టెన్ యశ్ ధుల్ తన తొలి సెంచరీ నమోదు చేశాడు. అద్భుత ప్రయాణానికి ఇది నాంది అని చెప్పవచ్చు’’ అని పేర్కొన్నాడు. ఇందుకు స్పందించిన ఓ నెటిజన్... ‘‘ఏదేమైనా యశ్... మరో ఉన్ముక్త్ చంద్లా అయిపోకూడదు’’ అంటూ కామెంట్ చేశాడు. ఇందుకు అశూ కౌంటర్ వేశాడు. ‘‘కాస్త ఆశావాదాన్ని ప్రోత్సహించండయ్యా’’ అని సదరు నెటిజన్కు అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. కాగా 2012లో ఉన్ముక్త్ చంద్ సారథ్యంలో భారత జట్టు అండర్–19 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే, జాతీయ జట్టు తరఫున ఆడాలన్న అతడి కల మాత్రం నెరవేరలేదు. ఈ క్రమంలో రిటైర్మెంట్ ప్రకటించిన ఉన్ముక్త్ అమెరికాకు వెళ్లిపోయాడు. ఆస్ట్రేలియా బిగ్బాష్ లీగ్లో ఆడే అవకాశం దక్కించుకుని.. ‘బిగ్బాష్’ మ్యాచ్ ఆడిన తొలి భారతీయ క్రికెటర్గా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఉన్ముక్త్ మాదిరే.. యశ్ ధుల్ కాకూడదంటూ నెటిజన్ పేర్కొనగా.. అశూ అందుకు తనదైన శైలిలో బదులిచ్చాడు. చదవండి: IPL 2022 Mega Auction: వేలంలో అతడికి ఏకంగా రూ.11 కోట్లు.. అయ్యర్కి మరీ ఇంత తక్కువా! hope it doesnt goes the unmukt chand way — Rohit Pungalia (@RohitPungalia) February 2, 2022 View this post on Instagram A post shared by ICC (@icc) -
సెమీఫైనల్లో సెంచరీతో చెలరేగాడు.. భారత్ను ఫైనల్కు చేర్చాడు.. దటీజ్ యష్ ధుల్!
Yash Dhull U19 World Cup: అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో యువ భారత్ ఫైనల్కు చేరింది. ఆంటిగ్వా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో 96 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో శనివారం జరగనున్న ఫైనల్లో ఇంగ్లండ్తో టీమిండియా తలపడనుంది. కాగా భారత విజయంలో కెప్టెన్ యష్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్ కీలక పాత్ర పోషించారు. యష్ ధుల్ సెంచరీ(114)తో చెలరేగగా, షేక్ రషీద్ 94 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 37 పరుగులకే రెండు వికెట్లుకోల్పోయి కష్టాల్లో పడింది. ఆనంతరం యష్ ధుల్, షేక్ రషీద్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్కు 204 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 290 పరుగులు చేసింది. అనంతరం 291 పరుగుల పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 194 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో విక్టీ ఓస్టావల్ మూడు వికెట్లు సాధించగా, నిషాంత్ సింధు, రవి కుమార్లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. దటీజ్ యశ్ ధుల్ న్యూఢిల్లీకి చెందిన యశ్ దుల్కి ఢిల్లీ అండర్-16, అండర్-19, ఇండియా ‘ఎ’ అండర్-19 జట్లకు నాయకత్వం వహించాడు. ఇక ఇటీవల ముగిసిన వినూ మన్కడ్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడుగా ఉన్నాడు. డీడీసీఈ(ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్) తరుపున 5 మ్యాచ్లు ఆడిన యశ్ దుల్ 302 పరుగులు చేశాడు. అదే విధంగా ఆసియా అండర్–19 క్రికెట్ టోర్నీలో భారత జట్టుకు సారథ్యం వహించిన యశ్ ధుల్.... జట్టును చాంపియన్గా నిలిపాడు. యశ్ కెప్టెన్సీలో భారత యువ జట్టు ఫైనల్లో శ్రీలంకను 9 వికెట్ల తేడాతో ఓడించి విజేతగా అవతరించింది. ఇక ఇప్పుడు ఐసీసీ మేజర్ టోర్నీ వరల్డ్కప్లోనూ జట్టును ఫైనల్కు చేర్చి కెప్టెన్గా తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. ముఖ్యంగా సెమీ ఫైనల్లో 110 బంతుల్లో 110 పరుగులు సాధించి బ్యాటర్గానూ జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. చదవండి: IND vs WI: క్రికెట్ అభిమానులకు భారీ షాక్.. భారత్- విండీస్ తొలి వన్డే వాయిదా! Who Is Yash Dhull: ఎవరీ యశ్ దుల్.. భారత జట్టు కెప్టెన్గా ఎలా ఎంపిక చేశారు! -
అండర్ 19 వరల్డ్కప్ ఆసీస్ షాక్ ఫైనల్కు టీమిండియా (ఫోటోలు)
-
ఆసీస్పై భారీ విజయం.. ఫైనల్లో టీమిండియా
కూలిడ్జ్ (ఆంటిగ్వా): అండర్-19 వరల్డ్కప్లో టీమిండియా ఫైనల్కు చేరింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్లో భారత్ 96 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 290 పరుగులు చేయగా, ఆసీస్ 41. 5 ఓవర్లలో 194 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది. భారత యువ బౌలర్లలో విక్టీ ఓస్టావల్ మూడు వికెట్లతో ఆసీస్ను దెబ్బ తీయగా, నిషాంత్ సింధు, రవి కుమార్లు తలో రెండు వికెట్లతో మెరిశారు. కౌశల్ తాంబే, రఘువంశీలు చెరో వికెట్ తీశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు యష్ ధుల్ (110 బంతుల్లో 110; 10 ఫోర్లు, 1 సిక్స్), షేక్ రషీద్ (108 బంతుల్లో 94; 8 ఫోర్లు, 1 సిక్స్) మూడో వికెట్కు 204 పరుగులు జోడించడంతో భారీ స్కోరును బోర్డుపై ఉంచారు. భారీ భాగస్వామ్యం... టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు అంగ్కృష్ రఘువంశీ (6), హర్నూర్ సింగ్ (16) తడబడుతూ మొదలు పెట్టడంతో పరుగులు బాగా నెమ్మదిగా వచ్చాయి. తక్కువ వ్యవధిలో వీరిద్దరిని అవుట్ చేసి ఆసీస్ ఆధిక్యం ప్రదర్శించింది. ఈ స్థితిలో ధుల్, రషీద్ ఇన్నింగ్స్ను నిర్మించే బాధ్యత తీసుకున్నారు. ఆరంభంలో జాగ్రత్తగా ఆడినా, నిలదొక్కుకున్న తర్వాత చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. ధుల్ 64 బంతుల్లో, రషీద్ 78 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకోగా, ఆ తర్వాత ఒకరితో మరొకరు పోటీ పడి పరుగులు సాధించారు. ఈ జోడీని విడదీయడానికి ఆసీస్ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. విట్నీ ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టిన ధుల్ 106 బంతుల్లోనే శతకం మార్క్ను అందుకున్నాడు. పార్ట్నర్షిప్ 200 పరుగులు దాటిన తర్వాత 46వ ఓవర్లో వీరిద్దరు వరుస బంతుల్లో అవుటయ్యారు. విట్నీ వేసిన చివరి ఓవర్లో భారత్ వరుసగా 4, 6, 1, 6, 4, 6తో ఏకంగా 27 పరుగులు రాబట్టింది. దినేశ్ బానా ఆడిన 4 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు కొట్టడం విశేషం. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ జట్టులో లాచ్లాన్ షా(51) మాత్రమే హాఫ్ సెంచరీ చేయగా, కోరీ మిల్లర్(38), క్యాంప్బెల్ కెల్లావే(30)లు మోస్తరుగా మెరిశారు. ఫైనల్లో భారత జట్టు.. ఇంగ్లండ్తో తలపడనుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఒక వైపు కెప్టెన్, వైస్ కెప్టెన్కి పాజిటివ్.. అయినా టీమిండియా ఘన విజయం..
U-19 World Cup, IND Vs Ire: అండర్-19 ప్రపంచకప్లో భారత్ జోరు కోనసాగుతోంది. ట్రినిడాడ్ వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్లో భాగంగా ఐర్లాండ్పై 174 పరుగుల భారీ తేడాతో టీమిండియా అద్భుత విజయాన్ని సాధించింది. ఈ విజయంతో క్వార్టర్ ఫైనల్ బెర్త్ను భారత్ ఖరారు చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 307 పరుగులు చేసింది. ఓపెనర్లు హర్నూర్ సింగ్(88), రఘువంశీ(79) అద్భుతమైన ఇన్నింగ్స్తో భారత్ భారీ స్కోర్ సాధించగల్గింది. 308 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 39 ఓవర్లలో 133 పరుగులకే కూప్పకూలింది. భారత బౌలర్లలో సంగ్వాన్, అనీశ్వర్ గౌతమ్, కౌషల్ తంబే తలో రెండు వికెట్లు తీయగా... విక్కీ ఓస్వాల్, రవికుమార్, రాజవర్ధన్ తలో వికెట్ సాధించారు. భారత అండర్-19 ఆరుగురు పాజిటివ్ కాగా మ్యాచ్కు ముందు భారత శిబిరంలో కరోనా కలకలం రేపింది. భారత జట్టులో ఏకంగా ఆరుగురు ఆటగాళ్లకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. భారత కెప్టెన్ యశ్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్తో పాటు మరో నలుగురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. దీంతో ఈ మ్యాచ్లో నిశాంత్ సింధు భారత జట్టుకు నాయకత్వం వహించాడు. చదవండి: SA vs IND: తొలి వన్డేలో టీమిండియా ఓటమి... నిరాశపర్చిన రాహుల్ కెప్టెన్సీ.. -
U19 World Cup: ఐర్లాండ్తో మ్యాచ్... ఇండియా క్వార్టర్స్ చేరేనా?
U19 World Cup: India Vs Ireland: అండర్–19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా యువ భారత్ జట్టు నేడు ఐర్లాండ్తో తలపడనుంది. గ్రూప్ ‘బి’లో భారత్, ఐర్లాండ్ జట్లు తమ తొలి లీగ్ మ్యాచ్ల్లో గెలిచాయి. దక్షిణాఫ్రికాపై 45 పరుగుల తేడాతో నెగ్గిన భారత్ వరుసగా రెండో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది. తొలి మ్యాచ్లో కెప్టెన్ యశ్ ధుల్ ఒక్కడే బ్యాటింగ్లో ఆకట్టుకున్నాడు. బౌలింగ్లో విక్కీ ఒస్త్వాల్, రాజ్ బావా మెరిశారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం గం. 6:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్ను స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–2లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. వెస్టిండీస్లోని టరూబాలో గల బ్రియన్ లారా స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. భారత జట్టు: హర్నూర్ సింగ్, అంగ్క్రిష్ రఘువంశి, షేక్ రషీద్, యశ్ ధుల్, ఆరాధ్య యాదవ్, నిశాంత్ సింధు, దినేశ్ బనా(వికెట్ కీపర్), కుశాల్ తంబే, రవి కుమార్, సిద్దార్థ్ యాదవ్, రాజ్వర్ధన్ హంగర్గేకర్, నామవ్ ప్రకాశ్, అనీశ్వర్ గౌతమ్, రాజ్ బవా, వసు వాట్స్, విక్కీ ఒస్త్వాల్, గర్వ్ సంగ్వాన్. చదవండి: Ind Vs Sa 1st ODI: భారీ స్కోరుకు అవకాశం.. టాస్ గెలిస్తే... -
ind vs sa: శెభాష్.. దక్షిణాఫ్రికాపై భారత్ అద్భుత విజయం! ఏకంగా..
U 19 World Cup Ind Vs Sa: అండర్–19 ప్రపంచకప్లో భారత జట్టు అద్భుత విజయంతో టోర్నిని ఆరంభించింది. దక్షిణాఫ్రికాను మట్టికరిపించి 45 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. సారథి యశ్ ధుల్ 82 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా... బౌలర్ విక్కీ ఒత్వాల్ అద్భుతంగా రాణించాడు. 10 ఓవర్లు బౌలింగ్ చేసిన విక్కీ.. కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. కాగా వెస్టిండీస్ వేదికగా అండర్- 19 ప్రపంచకప్ ఈవెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గ్రూప్- బిలోని భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారం మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకోగా... యశ్ సేన 232 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనకు దిగిన ప్రొటిస్ యువ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు జాన్ డకౌట్ కాగా... వాలంటైన్ 25 పరుగులు చేసి నిష్క్రమించాడు. వన్డౌన్లో వచ్చిన బ్రెవిస్ ఒక్కడే 65 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్ విక్కీ 5 వికెట్లు కూల్చి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. రాజ్ బవా 4 వికెట్లతో రాణించాడు. ఈ క్రమంలో 187 పరుగులకే దక్షిణాఫ్రికా చాపచుట్టేసింది. దీంతో 45 పరుగుల తేడాతో విజయం భారత జట్టు సొంతమైంది. ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా శుక్రవారం ముగిసిన మూడో టెస్టులో ఘోర వైఫల్యంతో సిరీస్ను చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే మన యువ జట్టు ప్రొటిస్ టీమ్పై సాధించిన విజయాన్ని ప్రశంసిస్తూ... అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘‘శెభాష్... మీ స్థాయికి తగ్గట్లు రాణించారు.. కనీసం మీరైనా గెలిచారు. దెబ్బకొట్టారు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అండర్-19 ప్రపంచకప్ స్కోర్లు: భారత్- 232-10 (46.5 ఓవర్లు) దక్షిణాఫ్రికా- 187-10 (45.4 ఓవర్లు) చదవండి: Rohit Sharma- Virat Kohli: కోహ్లి నిర్ణయం విని షాకయ్యాను.. రోహిత్ శర్మ పోస్టు వైరల్ -
ind vs Sa: భారత జట్టు ముందు సఫారీలు నిలవడం కష్టమే!
Under 19 World Cup 2022- జార్జ్టౌన్ (గయానా): వెస్టిండీస్ వేదికగా అండర్–19 ప్రపంచకప్లో భారత కుర్రాళ్ల పోరు శనివారం ఆరంభం కానుంది. యశ్ ధుల్ నేతృత్వంలోని యువ భారత్ తమ తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. నాలుగు సార్లు చాంపియన్ అయిన భారత్ టోర్నీ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. ఇక ఇటీవలే జరిగిన జూనియర్ ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత్ జోరు ముందు సఫారీ నిలవడం కష్టమే! భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. భారత జట్టు: హర్నూర్ సింగ్, అంగ్క్రిష్ రఘువంశి, షేక్ రషీద్, యశ్ ధుల్, ఆరాధ్య యాదవ్, నిశాంత్ సింధు, దినేశ్ బనా(వికెట్ కీపర్), కుశాల్ తంబే, రవి కుమార్, సిద్దార్థ్ యాదవ్, రాజ్వర్ధన్ హంగర్గేకర్, నామవ్ ప్రకాశ్, అనీశ్వర్ గౌతమ్, రాజ్ బవా, వసు వాట్స్, విక్కీ ఒత్వాల్, గర్వ్ సంగ్వాన్. దక్షిణాఫ్రికా జట్టు: ఈథన్ జాన్ కనింగ్హాం, వాలంటైన్ కిటిమె, డేవడ్ బ్రెవిస్, జీసే మ్యారీ, జార్జ్ వాన్ హీర్డన్, ఆండిలే సిమెలేన్, మిక్కీ కోప్లాండ్, మాథ్యూ బోస్ట్, లియామ్ ఆల్డర్, అఫివే న్యాండ, క్వెనా మఫాకా, ఆసఖే షాకా, జేడ్ స్మిత్ , కేడన్ సోలోమన్, జోషువా స్టీఫెన్సన్. చదవండి: Ind Vs Sa: కోహ్లికి భారీ జరిమానా విధించాలి.. నిషేధించాలి! ఐసీసీకి ఇదే నా విజ్ఞప్తి -
IND Vs PAK: పాక్తో మ్యాచ్.. పోరాడి ఓడిన భారత్
అండర్-19 ఆసియాకప్లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన లీగ్ మ్యాచ్లో టీమిండియా పోరాడి ఓడిపోయింది. యూఏఈతో జరిగిన మ్యాచ్లో భారీ విజయాన్ని అందుకున్న టీమిండియా ఆ మ్యాజిక్కు పాక్పై రిపీట్ చేయలేకపోయింది. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 49 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌటైంది. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా పరుగులు చేయడంలో విఫలమైంది. ఒక దశలో 96 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో 150 మార్క్ చేరుతుందా అన్న అనుమానం కూడా కలిగింది. టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైన చోట లోయర్ ఆర్డర్లో వికెట్ కీపర్ ఆరాధ్య యాదవ్ అర్థసెంచరీ(83 బంతుల్లో 50 పరుగులు), కుషాల్ తంబే 32, రాజ్వర్దన్ హంగార్గేకర్ 33 పరుగులు సాధించడంతో టీమిండియా 237 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. పాక్ బౌలర్లలో జీషన్ జమీర్ 5 వికెట్లు తీయగా, అవైస్ అలీ 2 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. పాకిస్తాన్ బ్యాటింగ్లో ముహమ్మద్ షెహజాద్ 81 పరుగులతో మెరవగా.. ఇర్ఫాన్ ఖాన్ 32, రిజ్వాన్ మెహమూద్ 29 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రాజ్ భవా 4 వికెట్లతో మెరిశాడు. భారత బౌలర్లు పాకిస్తాన్ బ్యాటర్లను తమ బౌలింగ్తో ఇబ్బందిపెట్టినప్పటికి చేధించాల్సిన స్కోరు ఎక్కువగా లేకపోవడం పాక్కు కలిసివచ్చింది. ఇక టీమిండియా తన తర్వాతి మ్యాచ్ను అఫ్గానిస్తాన్తో ఆడనుంది. -
Ind Vs Pak: పాక్తో మ్యాచ్.. భారత బ్యాటర్ల స్కోర్లు.. 0, 6,0,8, 6, 1.. ఆరాధ్య ఒక్కడే 50!
ACC Asia Cup U19 Ind Vs Pak: ఆసియా కప్ అండర్–19 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా పాకిస్తాన్తో మ్యాచ్లో భారత యువ క్రికెటర్ ఆరాధ్య యాదవ్ అర్ధ సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు ఓపెనర్ హర్నూర్ సింగ్(46) మెరుగ్గా రాణించడంతో భారత్ 237 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ యశ్ ధుల్ సహా మిడిలార్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు. దుబాయ్లో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత జట్టు... 49 ఓవర్లలో 237 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ అంగ్క్రిష్ రఘువంశి, షేక్ రషీద్, యశ్ ధుల్, నిషాంత్ సింధు, విక్కీ, రవికుమార్ వరుసగా 0, 6,0,8, 6, 1 పరుగులు చేశారు. ఇక హర్నూర్, వికెట్ కీపర్ బ్యాటర్ ఆరాధ్య చెప్పుకోదగ్గర స్కోర్లు చేశారు. వీరికి తోడు రాజ్ బవా(25 పరుగులు), కుశాల్ తంబే(32 పరుగులు), రాజవర్ధన్(33 పరుగులు) చేయడంతో భారత్ 200 మార్కు దాటగలిగింది. పాక్ బౌలర్లలో జీషన్ జమీర్కు అత్యధికంగా ఐదు వికెట్లు దక్కాయి. 238 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ బ్యాటింగ్ కొనసాగుతోంది. చదవండి: Who Is Yash Dhull: ఎవరీ యశ్ దుల్.. భారత జట్టు కెప్టెన్గా ఎలా ఎంపిక చేశారు! ACC U19 Asia Cup 2021 India U19 vs Pakistan U19 India set Pakistan a target of 238 runs. 🇮🇳 237 all out (49 ov)#INDvPAK | #U19AsiaCup | #PakistanFutureStars 📸: ACC pic.twitter.com/0uDmB6bDFO — Pakistan Cricket Live (@TheRealPCB_Live) December 25, 2021 -
ఆసియా కప్లో భారత్ శుభారంభం.. దుమ్మురేపిన హర్నర్, యశ్ధుల్
దుబాయ్: ఆసియా కప్ అండర్–19 క్రికెట్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా గురువారం జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ 154 పరుగుల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టుపై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 5 వికెట్లకు 282 పరుగులు చేసింది. హర్నూర్ సింగ్ (130 బంతుల్లో 120; 11 ఫోర్లు) సెంచరీతో కదం తొక్కాడు. కెప్టెన్ యశ్ ధుల్ (68 బంతుల్లో 63; 4 ఫోర్లు) రాణించాడు. ఆంధ్ర క్రికెటర్ షేక్ రషీద్ (35; 1 ఫోర్) ఫర్వాలేదనిపించాడు. చివర్లో రాజ్వర్ధన్ (23 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు; 2 సిక్స్లు) మెరిపించాడు. ఛేదనలో యూఏఈ 34.3 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. రాజ్వర్ధన్ (3/24) బంతితోనూ మెరిశాడు. గర్వ్ సాంగ్వాన్, విక్కీ, కుశాల్ తాంబే తలా రెండు వికెట్లు తీశారు. యూఏఈ ఓపెనర్ కై స్మిత్ (70 బంతుల్లో 45; 6 ఫోర్లు) మినహా మిగిలిన వారు విఫలమయ్యారు. రేపు జరిగే రెండో లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్తో భారత్ ఆడనుంది. చదవండి: బోర్డుతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా.. టెస్టులు ఆడటం కష్టమే: స్టార్ ఆల్రౌండర్ -
ఎవరీ యశ్ దుల్.. భారత జట్టు కెప్టెన్గా ఎలా ఎంపిక చేశారు!
వచ్చే ఏడాది జనవరిలో జరిగే అండర్-19 ప్రపంచకప్కు భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. 17 మంది ప్లేయర్లు, ఐదుగురు స్టాండ్ బై ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఇక అండర్-19 ప్రపంచకప్ భారత జట్టు కెప్టెన్గా ఢిల్లీ ఆటగాడు యశ్ దుల్, వైస్ కెప్టెన్గా ఆంధ్రా ప్లేయర్ షేక్ రషీద్ ఎంపికయ్యాడు. అండర్-19 జట్టుకు కెప్టెన్గా ఎంపికైన యశ్ దుల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.. ఎవరీ యశ్ దుల్.. న్యూఢిల్లీలోని జనక్పురికి చెందిన యశ్ దుల్కి ఢిల్లీ అండర్-16, అండర్-19, ఇండియా ‘ఎ’ అండర్-19 జట్లకు నాయకత్వం వహించిన అనుభవం ఉంది. యశ్ దుల్ 11 ఏళ్ల వయస్సులో బాల్ భవన్ స్కూల్ అకాడమీలోకి ప్రవేశించి అక్కడి నుంచే తన కలలు సాకారం చేసుకునే దిశగా అడుగులు వేశాడు. ఈ యువ ఆటగాడు ఇటీవల ముగిసిన వినూ మన్కడ్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడుగా ఉన్నాడు. డీడిసీఈ(ఢిల్లీ ఎండ్ జిల్లా క్రికెట్ అసోసియేషన్) తరుపున 5 మ్యాచ్లు ఆడిన యశ్ దుల్ 302 పరుగులు చేశాడు. ఇక యష్ తండ్రి కాస్మెటిక్ బ్రాండ్లో ఎగ్జిక్యూటివ్గా పనిచేసేవాడు, కానీ తన పిల్లల కెరీర్కోసం తన ఉద్యోగాన్ని వదులుకోవలసి వచ్చింది. ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. "చిన్న వయస్సు నుంచే యశ్కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. అతడు ఆడటానికి చిన్నతనంలోనే మంచి క్రికెట్ కిట్ నేను కొనిచ్చాను. నేను అతడికి అత్యుత్తమ ఇంగ్లీష్ విల్లో బ్యాట్లను ఇచ్చాను. యశ్ కేరిర్ కోసం మేము మా ఖర్చులను తగ్గించుకున్నాము. మా నాన్న ఆర్మీ మేన్, తనకు వచ్చిన పింఛను ఇంటి నిర్వహణకు ఉపయోగపడేది. అతడు తన కేరిర్లో అద్బుతంగా రాణిస్తాడని ఆశిస్తున్నాను" అని యష్ దుల్ తండ్రి పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: ఒడిశా ఆటగాడికి బంఫర్ ఆఫర్.. ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్కు!