Recipes In Telugu
-
క్రాబ్స్తో కేక్ పాపర్స్.. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా?
కేక్ పాపర్స్ తయారీకి కావల్సినవి: పీతల గుజ్జు – అరకేజీ; బటర్ – రెండు టేబుల్ స్పూన్లు; స్ప్రింగ్ ఆనియన్ తరుగు – పావు కప్పు; ఎర్రక్యాప్సికం తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; సెలెరీ తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; కోషర్ సాల్ట్ – రుచికి సరిపడా; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను; గుడ్డు – ఒకటి; సోయా సాస్ – పావు టీస్పూను; మయనైజ్ – పావు కప్పు; ఆవ పొడి – పావు టీస్పూను; మిరియాల పొడి – పావు టీస్పూను; బ్రెడ్ క్రంప్స్ – ఒకటింబావు కప్పులు; నూనె – ఒకటిన్నర కప్పులు. స్పైసీడిప్: మయనైజ్ – అరకప్పు; నిమ్మరసం – టేబుల్ స్పూను; వెల్లుల్లి రెబ్బ – పెద్దది ఒకటి(సన్నగా తర గాలి); చిల్లీ సాస్ – టీస్పూను. తయారీ విధానమిలా: బాణలిలో బటర్ వేసి, కరిగిన తరువాత.. స్ప్రింగ్ ఆనియన్ , క్యాప్సికం, సెలెరీ తరుగు వేసి వేయించాలి ∙ముక్కలన్నీ మెత్తబడిన తరువాత పీతల గుజ్జు, కొత్తిమీర తరుగు వేసి వేయించాలి ∙ఇది వేగుతుండగానే.. ఒక గిన్నెలో గుడ్డు సొన, సోయా సాస్, మయనైజ్, ఆవపొడి, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి ∙కలిపిన వెంటనే వేగుతున్న పీతల గుజుజపెన ఈ మిశ్రమాన్ని వేసి ఐదు నిమిషాలు మగ్గనిచ్చి దించేయాలి. చల్లారాక మీడియం సైజు బాల్స్లా చుట్టుకోవాలి. బాల్స్ అన్నీ తయారయ్యాక.. బ్రెడ్ క్రంప్స్లో ముంచి కోటింగ్లా పట్టించి రిఫ్రిజిరేటర్లో పెట్టాలి ∙అరగంట తరువాత నూనెలో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేస్తే క్రాబ్ కేక్ పాపర్స్ రెడీ ∙స్పైసీడిప్ కోసం తీసుకున్న పదార్థాలను గిన్నెలో వేసి కలిపి.. వేడివేడి క్రాబ్ కేక్ పాపర్స్తో సర్వ్ చేసుకోవాలి. -
ఆరోగ్యానికి హెల్తీ స్నాక్: స్వీట్ మఖానా, ఇలా సింపుల్గా..
స్వీట్ మఖానా తయారీకి కావల్సిన పదార్థాలు పూల్ మఖానా – 1 కప్పు; బెల్లం – 1/4 కప్పు; నెయ్యి – 2 టీస్పూన్లు. తయారీ విధానం: మూకుడులో ఒక స్పూన్ నెయ్యి వేసి మఖానాలను తక్కువ మంట మీద కరకరలాడే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి ∙నాన్ స్టిక్ పాన్లో ఒక స్పూన్ నెయ్యి, బెల్లం వేసి, బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి ∙బెల్లం కరిగాక వేయించి పెట్టుకున్న మఖానా కూడా వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి ∙నెయ్యి రాసి పెట్టుకున్న పళ్లెంలోకి తీసుకొని కొద్దిగా చల్లారాక విడివిడిగా అయ్యేలా చేసుకోవాలి. -
పోమోగ్రానేట్ షాంపైన్ సార్బెట్.. రెస్టారెంట్ స్టైల్లో చేసేయండిలా
పోమోగ్రానేట్ షాంపైన్ సార్బెట్ తయారీకి కావల్సినవి: బ్రూట్ షాంపైన్ – ఒకటిన్నర కప్పులు; పంచదార – కప్పు; లైట్ కార్న్ సిరప్ – టేబుల్ స్పూను; దానిమ్మ రసం – ఒకటీ ముప్పావు కప్పులు; విప్డ్ప్ క్రీమ్ – రెండు టేబుల్ స్పూన్లు; దానిమ్మ గింజలు – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ విధానమిలా: సాస్పాన్లో షాంపైన్, కార్న్ సిరప్, పంచదార వేసి మీడియం మంట మీద పంచదార కరిగేంత వరకు మరిగించి, దించిన తర్వాత దానిమ్మ రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని రిఫ్రిజిరేటర్లో పెట్టాలి.రెండుగంటల తరువాత మిశ్రమాన్ని ఐస్క్రీమ్ మేకర్తో బీట్ చేయాలి.క్రీమ్లా మారిన మిశ్రమాన్ని షాంపైన్ గ్లాస్లో వేయాలి. పైన విప్డ్ క్రీమ్, దానిమ్మ గింజలతో గార్నిష్ చేస్తే పోమోగ్రానేట్ షాంపైన్ సార్బెట్ రెడీ. -
స్వీట్ పొటాటో పీజా బాల్స్.. సింపుల్గా చేసుకోండిలా
స్వీట్ పొటాటో పీజా బాల్స్ తయారీకి కావల్సినవి: చిలగడ దుంపలు – అరకేజీ(తొక్కతీసి ముక్కలు తరగాలి); మటన్ ఖీమా – అరకప్పు; చీజ్ తురుము – ముప్పావు కప్పు; పీజా సాస్ – రెండు టేబుల్ స్పూన్లు; గోధుమ పిండి – ముప్పావు కప్పు; గుడ్లు – రెండు(సొనను బాగా కలిపి పెట్టుకోవాలి); బ్రెడ్ క్రంప్స్ – కప్పు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; ఉప్పు – రుచికి తగినంత. తయారీ విధానమిలా: చిలగడ దుంప ముక్కల్ని మెత్తగా ఉడకబెట్టి, చిదుముకోవాలి. ఇందులో మటన్ ఖీమా, చీజ్ తురుము, పీజా సాస్, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి, బాల్స్లా చుట్టి పెట్టుకోవాలి గోధుమ పిండి, గుడ్లసొన, బ్రెడ్ క్రంప్స్ను వరుసగా పెట్టుకోవాలి. దుంపల బాల్స్ను ముందుగా గోధుమ పిండి, తరువాత గుడ్ల సొన, చివరిగా బ్రెడ్క్రంప్స్లో ముంచి డీప్ ఫ్రైచేసుకోవాలి ∙బాల్స్ క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి మారాక తీసేసి నచ్చిన సాస్తో సర్వ్ చేసుకోవాలి. -
అటుకుల పోహాతో కేక్..ఎప్పుడైనా ట్రై చేశారా?
పోహా కేక్ తయారీకి కావల్సినవి: మైదా పిండి – 3 కప్పులు అటుకులు – ఒకటిన్నర కప్పులు (నానబెట్టి గుజ్జులా చేసుకోవాలి) అరటి పండు – 1 (ముక్కలు చేసుకోవాలి),పంచదార – 2 కప్పులు పీనట్ బటర్, బటర్ – పావు కప్పు చొప్పున బేకింగ్ సోడా – 2 టీ స్పూన్లు,పాలు – 2 కప్పులు వెనిలా ఎసెన్స్ – అర టీ స్పూన్ తయారీ విధానమిలా: ముందుగా మిక్సీ బౌల్లో పంచదార వేసుకుని పొడి చేసుకుని, అందులో బటర్, పీనట్ బటర్, అరటిపండు ముక్కలు వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఒక బౌల్లోకి ఆ మిశ్రమాన్ని తీసుకుని.. అందులో బేకింగ్ సోడా, పాలు, మైదాపిండి, అటుకుల పేస్ట్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం నచ్చిన షేప్లో కేక్ మేకర్ తీసుకుని.. అందులో ఈ మిశ్రమం వేసుకుని సుమారు 45 నిమిషాల పాటు ఓవెన్లో బేక్ చేసుకోవాలి. ఆ కేక్ని కాస్త చల్లారనిచ్చి.. నచ్చిన విధంగా క్రీమ్, ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకుని, కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. -
టొమాటో ఉప్మా రెసిపి.. ఇలా ఈజీగా చేసుకోండి
టొమాటో ఉప్మా తయారీకి కావల్సినవి: బొంబాయి రవ్వ›– ఒక కప్పు,టొమాటో ముక్కలు – పావు కప్పు, క్యారట్ తరుగు – పావు కప్పు,ఉల్లిపాయ తరుగు – అర కప్పు, బఠాణీ – అర కప్పు (నానబెట్టుకోవాలి), పచ్చిమిర్చి – 1, అల్లం తరుగు – కొద్దిగా, కరివేపాకు – ఒక రెబ్బ, కొత్తిమీర తరుగు– కొద్దిగా, జీడి పప్పు – గుప్పెడు (నేతిలో వేయించాలి), ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర – 1 టీ స్పూన్ చొప్పున, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె –2 టేబుల్ స్పూన్లు, నెయ్యి – సరిపడా, నీళ్లు– 3 కప్పులు తయారీ విధానమిలా: ముందుగా చిన్న సెగ మీద.. రవ్వను నేతిలో దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అనంతరం అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని.. తాలింపు సామాన్లు వేసుకుని ఆ వెనుకే ఉల్లిపాయ ముక్కలూ వేసి వేయించుకోవాలి. అనంతరం టొమాటో ముక్కలు, క్యారట్ తరుగు, ఆ తర్వాత బఠాణీలు వేసి మగ్గనివ్వాలి. కరివేపాకు వేసుకుని వేగిన తర్వాత పసుపు వేసుకుని మరోసారి గరిటెతో తిప్పాలి. క్యారట్ ముక్క 80 శాతం ఉడికిన తర్వాత నీళ్లు పోసుకుని.. ఎసరు మరగనివ్వాలి. అనంతరం రవ్వ వేసుకుంటూ ఉండలు కాకుండా గరిటెతో తిప్పుతూ ఉండాలి. దగ్గరపడే సమయంలో కొత్తిమీర తురుము, జీడిపప్పు, మిగిలిన నెయ్యి వేసుకుని బాగా కలిపి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. -
పనీర్తో స్పెషల్గా క్రిస్పీ స్టిక్స్.. టేస్ట్ అదిరిపోద్ది
పనీర్ క్రిస్పీ స్టిక్స్ తయారీకి కావల్సినవి పనీర్ – అరకిలో (నిలువుగా కట్ చేసుకోవాలి), కొబ్బరి తురుము, బ్రెడ్ పౌడర్ – పావు కప్పు చొప్పున, గుడ్లు – 3, పాలు – 2 టేబుల్ స్పూన్లు (చిక్కటివి), పచ్చిమిర్చి పేస్ట్ – 1 టీ స్పూన్, అల్లం – వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, ఇంగువ – చిటికెడు, చాట్ మసాలా, నిమ్మరసం, ధనియాల పొడి, జీలకర్ర పొడి – అర టీ స్పూన్ చొప్పున, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా తయారీ విధానమిలా: ముందుగా ఒకపెద్ద బౌల్ తీసుకుని అందులో పచ్చిమిర్చి పేస్ట్, అల్లం – వెల్లుల్లి పేస్ట్, ఇంగువ, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి.. ఆ మిశ్రమాన్ని పనీర్ ముక్కలకు పట్టించి 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో మొక్కజొన్న పిండి, ఇంకో బౌల్లో పాలు–గుడ్ల మిశ్రమం, మరో బౌల్లో కొబ్బరి తురుము లేదా బ్రెడ్ పౌడర్ వేసుకుని.. ఒక్కో పనీర్ ముక్క తీసుకుని, మొదట మొక్కజొన్న పిండిలో, తర్వాత గుడ్ల మిశ్రమంలో, ఆ తర్వాత కొబ్బరి తురుము లేదా బ్రెడ్ పౌడర్ను బాగా పట్టించి.. నూనెలో ఫ్రై చేసుకోవాలి. -
క్రిస్మస్ స్పెషల్: ఇటాలియన్ పీచ్ కుకీస్, ఇంట్లోనే చేసుకోవచ్చు
ఇటాలియన్ పీచ్ కుకీస్ తయారీకి కావల్సినవి: మైదా – మూడున్నర కప్పులు; వంటసోడా – టేబుల్ స్పూను; కోషర్ సాల్ట్ – పావు టీస్పూను; బటర్ – అరకప్పు; పంచదార – రెండు కప్పులు; గుడ్లు – రెండు కప్పులు; వెనీలా ఎసెన్స్ – రెండు టీస్పూన్లు; పాలు – కప్పు; ఎరుపు, పసుపు ఫుడ్ కలర్ – నాలుగు చుక్కలు (ఒక్కోటి రెండు చుక్కలు). పీనట్ బటర్ క్రీమ్: బటర్ – పావు కప్పు; వెనీలా ఎసెన్స్ – అర టీస్పూను; కోషర్ సాల్ట్ – చిటికెడు; పంచదార పొడి – కప్పు; పీచ్ ప్యూరీ – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ విధానమిలా: ►ఒక గిన్నెలో వంటసోడా, ఉప్పు వేసి కలపాలి ∙దీనిలో బటర్, కప్పు పంచదార వేసి క్రీమ్లా మారేంత వరకు హ్యాండ్ మిక్సర్తో కలపాలి. తరువాత క్రీమ్ను పక్కన పెట్టుకోవాలి ∙మిక్సర్ను తక్కువ స్పీడ్లో పెట్టి గుడ్ల సొన, వెనీలా ఎసెన్స్ వేసి రెండు నిమిషాలు బీట్ చేసుకోవాలి ∙తరువాత మైదా, బటర్ మిశ్రమం అరకప్పు పాలు పోసి అన్ని చక్కగా కలిసేంత వరకు బీట్ చేయాలి. ► ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కూప్ పరిమాణంలో తీసుకుని గుండ్రని బాల్స్లా చేసి పైన కొద్దిగా వత్తి పీచ్ ఫ్రూట్ ఆకారంలోకి తీసుకు రావాలి ∙ఇలా అన్ని కుకీస్ రెడీ అయిన తరువాత అవెన్లో పెట్టి 350 డిగ్రీల ఫారిన్ హీట్స్ వద్ద పదిహేను నిమిషాలు బేక్ చేయాలి ∙పీచ్ క్రీమ్కోసం తీసుకున్న బటర్, వెనీలా ఎసెన్స్, కోషర్ సాల్ట్ లనుగిన్నెలో వేసి హ్యాండ్ మిక్సర్తో కలపాలి. ► ఇవన్నీ చక్కగా కలిపిన తరువాత మిక్సర్ స్పీడు తగ్గించి పంచదార పొడి, పీచ్ ప్యూరీవేసి మీడియం హై లో నిమిషం పాటు మిక్సర్తో కలపాలి ∙మిగిలిన అరకప్పు పాలను రెండు సగాలుగా చేసి రెండు వేర్వేరు గిన్నెల్లో పోయాలి. ఒకదానిలో ఎరుపు, మరో దానిలో పసుపు ఫుడ్ కలర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ► మరోగిన్నెలో మిగిలిన పంచదారను పెట్టుకోవాలి.కుకీస్ బేక్ అయిన తరువాత..వేడిగా ఉన్నప్పుడే కుకీస్ మధ్యలో చిన్న గాటు పెట్టి.. మధ్యలో పీచ్క్రీమ్ను వేసి శాండ్విచ్లా కొద్దిగా వత్తాలి ∙ఇప్పుడు కుకీకి ఒకవైపు ఎరు రంగు కలపిన పాలు, మరోవైపు పసుపు రంగు కలపిన పాలు అద్దాలి. చివరిగా పంచదార అద్దితే ఇటాలియన్ పీచ్ కుకీస్ రెడీ. -
కేవలం 15 నిమిషాల్లో గ్రీన్ కేక్ మిక్స్ కుకీస్ రెడీ
గ్రీన్ కేక్ మిక్స్ కుకీస్ తయారీకి కావల్సినవి: వెనీలా కేక్ మిక్స్ – మూడు కప్పులు; నూనె – ముప్పావు కప్పు; గుడ్లు – రెండు; వెనీలా ఎసెన్స్ – అరటీస్పూను; గ్రీన్ ఫుడ్ కలర్ – టీస్పూను(జెల్); పంచదార పొడి – ముప్పావు కప్పు; హార్ట్ షేప్ క్యాండీస్ – గార్నిష్కు సరిపడా. తయారీ విధానమిలా: కేక్ మిక్స్,నూనె, గుడ్ల సొన, వెనీలా ఎసెన్స్ను, గ్రీన్ఫుడ్ కలర్ను ఒక గిన్నెలో వేసి ముద్దలా కలపాలి. తరువాత రిఫ్రిజిరేటర్లో పెట్టాలి ∙ఇరవై నిమిషాల తరువాత పిండి ముద్దను బయటకు తీసి స్కూప్ పరిమాణంలో పిండిని తీసుకుని ఉండలు చేయాలి. ఈ ఉండలను పంచదార పొడిలో ముంచి కోటింగ్లా అద్దాలి.తరువాత ఉండలను బేకింగ్ ట్రేలో పెట్టి, కుకీ షేప్ వచ్చేలా వత్తుకోవాలి ∙కుకీ మధ్యలో హార్ట్ ఆకారంలో ఉన్న క్యాండీని పెట్టి బేకింగ్ ట్రేని అవెన్లో పెట్టాలి ∙350 డిగ్రీల ఫారిన్ హీట్స్ వద్ద పదిహేను నిమిషాలు బేక్ చేస్తే గ్రీన్ కేక్ మిక్స్ కుకీస్ రెడీ. -
బేకరీ స్టైల్లో కుకీస్.. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు
స్నీకర్ డూడుల్ కుకీస్ తయారీకి కావల్సినవి: మైదా – మూడు కప్పులు; టార్టారిక్ యాసిడ్ – రెండు టీస్పూన్లు; కోషర్ సాల్ట్ – టీస్పూను; వంటసోడా – ముప్పావు టీస్పూను; బటర్ –కప్పు; పంచదార – ఒకటిన్నర కప్పులు; వెనీలా ఎసెన్స్– టీస్పూను; దాల్చినచెక్క పొడి – టేబుల్ స్పూను తయారీ విధానమిలా: పెద్దగిన్నెలో మైదా, టార్టారిక్ యాసిడ్, వంటసోడా వేసి కలపాలి ∙అన్నీ కలిసిన తరువాత బటర్, ఒకటింబావు కప్పుల పంచదార వేసి మెషిన్ మిక్సర్తో కలపాలి ∙మిశ్రమం క్రీమ్లా మారిన తరువాత వెనీలా ఎసెన్స్ వేసి కలిపి రిఫ్రిజిరేటర్లో ఉంచాలి ∙మిగిలిన పంచదారలో దాల్చినచెక్క పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ∙గంట తర్వాత రిఫ్రిజిరేటర్నుంచి తీసిన మిశ్రమాన్ని రెండు టేబుల్ స్పూన్ల చొప్పున తీసుకుని బాల్స్లా చేసి దాల్చినచెక్క పొడి అద్ది బేకింగ్ ట్రేలో పెట్టాలి ∙కుకీస్ అన్నీ తయారయ్యాక.. బేకింగ్ ట్రేని 350 డిగ్రీల ఫారిన్ హీట్స్ వద్ద, ఇరవై నిమిషాలు బేక్ చేస్తే స్నీకర్ డూడుల్ కుకీస్ రెడీ. -
స్నాక్స్ కోసం.. మైసూర్ బోండాలు, సింపుల్గా ఇలా చేసుకోవచ్చు
గోధుమ మైసూర్ బోండాలు కావలసినవి: గోధుమ పిండి – 400 గ్రాములు పెరుగు – ముప్పావు కప్పు , బొంబాయి రవ్వ – 2 టేబుల్ స్పూన్లు, బేకింగ్ సోడా, పంచదార – 1 టేబుల్ స్పూన్ చొప్పున ఉప్పు – తగినంత, నీళ్లు – సరిపడా, జీలకర్ర– 1 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి – 1 టీ స్పూన్ (సన్నని తరుగు), చిన్నచిన్న కొబ్బరి ముక్కలు – 2 టీ స్పూన్లు (తురుము కూడా వేసుకోవచ్చు), కరివేపాకు – 2 రెమ్మలు (సన్నగా తురుముకోవాలి), నూనె – సరిపడా తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్లో బేకింగ్ సోడా, పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో ఉప్పు, బోంబాయి రవ్వ వేసుకుని కలుపుకోవాలి. అనంతరం గోధుమ పిండి, కొద్దిగా నూనె వేసుకుని బాగా కలపాలి. సుమారుగా 5 నుంచి 6 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ జారుగా, జిగటగా అయ్యేలా చేసుకోవాలి. దాన్ని రెండు గంటల పాటు నానివ్వాలి. ఆ తర్వాత అందులో జీలకర్ర,, పచ్చిమిర్చి ముక్కలు, కొబ్బరిముక్కలు, కరివేపాకు తురుము వేసుకుని రెండుమూడు నిమిషాలు బాగా కలిపి.. కాగుతున్న నూనెలో కొద్దికొద్దిగా బొండాల్లా వేసుకుంటూ దోరగా వేయించుకోవాలి. -
క్రిస్మస్ స్పెషల్: సుగర్ కుకీస్, పిల్లలు ఇష్టంగా తింటారు
సుగర్ కుకీస్ తయారీకి కావల్సినవి: బటర్ – పావు కప్పు; క్రీమ్ చీజ్ – పావుకప్పు; పంచదార – ఒకటిన్నర కప్పులు; గుడ్లు – రెండు; వెనీలా ఎసెన్స్ – ఒకటిన్నర టీస్పూన్లు; బాదం ఎసెన్స్ – పావు టీస్పూను; మైదా – రెండున్నర కప్పులు; కార్న్స్టార్చ్ – టేబుల్ స్పూను; వంటసోడా – టీస్పూను; ఉప్పు – పావు టీస్పూను; ఎరుపు, పచ్చరంగు కలిపిన పంచదార –గార్నిష్కు సరిపడా. తయారీ విధానమిలా: ఒక పెద్దగిన్నెలో బటర్, క్రీమ్ చీజ్, పంచదార, గుడ్లు, వెనీలా, బాదం ఎసెన్స్ వేసి హ్యాండ్ మిక్సర్తో ఐదు నిమిషాల పాటు కలపాలి ∙తరువాత మైదా, కార్న్ స్టార్చ్, వంటసోడా, ఉప్పు వేసి పిండి ముద్దలా కలపాలి ∙ఈ పిండి ముద్దను రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. రెండు గంటల తరువాత తీసి చిన్నచిన్న ఉండలుగా చేసి బేకింగ్ ట్రేలో పెట్టాలి.ఫోర్క్ సాయంతో ఉండపైన ఇంటూ ఆకారంలో ముద్ర పడేటట్లు వత్తాలి ∙ఇలా అన్నిటినీ వత్తుకున్నాక ఎరుపు, పచ్చరంగు పంచదారను ఈ కుకీస్పైన చల్లాలి ∙ఇప్పుడు బేకింగ్ ట్రేని అవెన్లో పెట్టి 350 డిగ్రీల ఫారిన్ హీట్స్వద్ద పదిహేను నిమిషాలు బేక్ చేస్తే సుగర్ కుకీస్ రెడీ. -
మిగిలిపోయిన అన్నంతో చిటికెలో దోసె వేసుకోండి..
అన్నం దోసె తయారీకి కావల్సినవి: అన్నం – 2 కప్పులు పుల్లని పెరుగు, రవ్వ, గోధుమ పిండి– 1 కప్పు చొప్పున ఉప్పు – రుచికి సరిపడా వంట సోడా›– 1 టీ స్పూన్ నీళ్లు – తగినన్ని తయారీ: ముందుగా మిక్సీలో అన్నం, పెరుగు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం అందులో రవ్వ, గోధుమపిండి, వంట సోడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని, కొద్దిగా నీళ్లు పోసుకుని.. ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని దోసెల్లా వేసుకోవాలి. అభిరుచిని బట్టి ఉల్లిపాయముక్కలు, క్యారెట్ తురుము వంటివి వేసుకుని గార్నిష్ చేసుకోవచ్చు. -
క్రిస్టమస్ స్పెషల్: సాఫ్ట్ కుకీస్.. బేకరీ స్టైల్లో
క్రిస్టమస్ సాఫ్ట్ కుకీస్: కావలసినవి: మైదా – మూడున్నర కప్పులు; వంటసోడా›– టీస్పూను; ఉప్పు – అర టీస్పూను; పంచదార – ఒకటిన్నర కప్పులు; బటర్ – కప్పు; గుడ్లు – రెండు; వెనీలా ఎసెన్స్ – రెండు టీ స్పూన్లు. తయారీ విధానమిలా: ►మైదా, వంటసోడా, ఉప్పుని ఒక గిన్నెలో వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ∙బటర్లో పంచదార వేసి క్రీమ్లా మారేంత వరకు బీటర్తో కలపాలి. తరువాత ఈ క్రీమ్ను రెండు గంటలు రిఫ్రిజిరేటర్లో పెట్టాలి ∙రెండు గంటల తరువాత బటర్ క్రీమ్లో గుడ్లసొన, వెనీలా ఎసెన్స్, మైదా మిశ్రమం వేసి ముద్దగా కలుపుకోవాలి పిండి ముద్దను రిఫ్రిజిరేటర్లో పెట్టాలి ►రెండు గంటల తరువాత పిండి ముద్దను రొట్టెల్లా వత్తుకోవాలి ∙ఈ రొట్టెను క్రిస్టమస్ ట్రీ, స్టార్స్, బొమ్మల ఆకారంలో కట్ చేసి బేకింగ్ ట్రేలో పెట్టాలి. కుకీస్ ఆకారాన్ని బట్టి ఫుడ్ కలర్ వేసుకోవచ్చు ∙ఈ బేకింగ్ ట్రేను 400 డిగ్రీల ఫారిన్ హీట్ వద్ద పదినిమిషాలు బేక్ చేస్తే ఎంతో రుచికరమైన క్రిస్టమస్ సాఫ్ట్ కుకీస్ రెడీ. -
ఇన్స్టంట్గా చేసుకునే స్వీట్ కార్న్ గారెలు
స్వీట్ కార్న్– తోటకూర గారెలు తయారీకి కావల్సినవి: లేత స్వీట్ కార్న్ గింజలు, లేత తోటకూర ఆకులు – రెండున్నర కప్పుల చొప్పున (శుభ్రం చేసి పెట్టుకోవాలి) అల్లం – కొద్దిగా,వెల్లుల్లి రెమ్మలు – 7,ఉప్పు – తగినంత జీలకర్ర – ఒక టీ స్పూన్,సోంపు – అర టీ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు (చిన్నగా కత్తిరించుకోవాలి) బియ్యప్పిండి – పావు కప్పు పచ్చిమిర్చి – 4 (చిన్నగా తరగాలి),నూనె – సరిపడా తయారీ విధానమిలా: ముందుగా మిక్సీలో స్వీట్ కార్న్, వెల్లుల్లి రెమ్మలు, అల్లం, తోటకూర ఆకులు (కాడల్లేకుండా) బరకగా మిక్సీ పట్టుకోవాలి. అవసరం అయితే కొన్ని నీళ్లు కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని.. జీలకర్ర, సోంపు, బియ్యప్పిండి, ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. మిశ్రమం మరీ జారుగా మారితే బియ్యప్పిండి పెంచుకోవచ్చు. వీటిని చిన్న చిన్న వడల్లా చేసుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి. -
బనానాతో బర్ఫీ.. సింపుల్గా, క్షణాల్లో చేసుకోవచ్చు
బనానా జాంగ్రీ బర్ఫీ తయారీకి కావల్సినవి: అరటిపండ్లు – 3 (చిన్న చిన్న ముక్కలుగా తరిగి మిక్సీ పట్టుకోవాలి) కొబ్బరి కోరు – ఒకటిన్నర కప్పులు, నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు, మిల్క్ పౌడర్ – 1 కప్పు, బెల్లం తురుము (జాంగ్రీ) – ముప్పావు కప్పు, ఏలకుల పొడి – అర టీ స్పూన్ (అభిరుచిని బట్టి), చిక్కటి పాలు – పావు కప్పు (కాచినవి), జీడిపప్పు, బాదం ముక్కలు – గార్నిష్కి సరిపడా తయారీ విధానమిలా: ఒక పాత్రలో కొబ్బరి కోరు, బెల్లం తురుము, పాలు పోసుకుని.. సిమ్ ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టుకుని గరిటెతో కలుపుతూండాలి. కాస్త దగ్గర పడుతున్న సమయంలో నెయ్యి, అరటిపండు గుజ్జు, మిల్క్ పౌడర్, ఏలకుల పొడి వేసి గరిటెతో తిప్పుతూండాలి. మిశ్రమం మొత్తం దగ్గర పడగానే.. ఒక బౌల్లోకి తీసుకుని జీడిపప్పు, బాదం ముక్కలతో గార్నిష్ చేసి మూడు నాలుగు గంటల పాటు ఫ్రిజ్లో పెట్టుకోవాలి. అనంతరం కావలసిన షేప్లో ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. -
మీల్మేకర్ స్టఫ్డ్ చపాతీ.. భలే రుచిగా ఉంటాయి
మీల్మేకర్ స్టఫ్డ్ చపాతీ తయారీకి కావలసినవి: మీల్మేకర్ – పావు కప్పు (మెత్తగా ఉడికించుకుని, చల్లారాక తురుములా చేసుకోవాలి), గోధుమ పిండి – ఒకటిన్నర కప్పులు, వేడి నీళ్లు, నూనె – సరిపడా, మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత, ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు చొప్పున, పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్, పసుపు – చిటికెడు, కారం – 1 టీ స్పూన్ , అల్లం– వెల్లుల్లి పేస్ట్ – అర టేబుల్ స్పూన్ , టొమాటో ముక్కలు – 1 టేబుల్ స్పూన్ (చిన్నవి), కరివేపాకు, కొత్తిమీర తురుము – కొద్దిగా తయారీ విధానమిలా: ముందుగా గోధుమ పిండి, మొక్కజొన్న పిండి, మూడు గరిటెల నూనె, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని కొద్దికొద్దిగా వేడి నీళ్లు పోసుకుంటూ ముద్దలా చేసుకుని, తడి గుడ్డ పరచి 20 నిమిషాల పాటు పక్కనపెట్టుకోవాలి. ఈలోపు ఒక కళాయిలో 2 గరిటెల నూనె వేసుకుని.. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను దోరగా వేయించుకుని.. మీల్మేకర్ తురుమునూ వేసుకుని బాగా కలుపుకోవాలి. అల్లం–వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలిపి.. పసుపు, కారం, ఉప్పు, టొమాటో ముక్కలు వేసి తిప్పుతూ బాగా ఉడికించుకోవాలి. చివరగా కరివేపాకు, కొత్తిమీర తురుము వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అనంతరం చపాతీలు చేసుకుని, ఒక్కోదానిలో కొద్దికొద్దిగా మీల్మేకర్ మిశ్రమాన్ని పెట్టుకుని.. ఫోల్డ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. వీటిని వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి. -
అన్నంలోకి నిమిషాల్లో రుచులు
ఇంట్లో పేరెంట్స్ లేని సమయంలో సింపుల్గా చేసుకునే కొన్ని వెరైటీలను చూద్దామిప్పుడు. మ్యాగీ, పాస్తా, శాండ్విచ్, చాకోస్ వంటివన్నీ పిల్లలు.. చిటికెలో చేసుకుని, తినగలిగినవే. నిజానికి ఇదివరకటి పిల్లలైతే అటుకులు, మరమరాలు వంటివి ఇంట్లో ఉంటే చాలు.. వాటితో ఎన్నో వెరైటీలను ఇట్టే చేసుకునేవారు.అటుకులు, బెల్లం కోరు, శనగపప్పు, కొబ్బరికోరు కలుపుకొని తింటే... బలమే కాదు చాలాసేపటి వరకు ఆకలినీ ఆపుతుంది. బెల్లం పాలు కాచుకుని అటుకులు వేసుకుని తినడం, లేదంటే అటుకుల్లో కాస్త ఉప్పు, కారం వేసి దోరగా వేయించుకోవడం వంటివి చిటికెలో చేసుకోవచ్చు. ఇక మరమరాలు తడిపి.. ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, టొమాటో ముక్కలు వంటివి వేసి క్షణాల్లో రుచికరమైన స్నాక్ని రెడీ చేసుకోవచ్చు. 3 నిమిషాల్లో మజ్జిగ చారు కావాల్సినవి: పెరుగు – పావు కప్పు (కొద్దిగా నీళ్లు పోసుకుని.. పలుచగా చేసుకోవాలి) ఉల్లిపాయ ముక్కలు – టేబుల్ స్పూన్, కరివేపాకు, కొత్తిమీర – కొద్దికొద్దిగా, ఉప్పు – కొద్దిగా, నూనె – 2 టేబుల్ స్పూన్లు ఎండుమిర్చి – 2 (ముక్కలు చేసుకోవాలి), పసుపు – పావు టీ స్పూన్ ఆవాలు, పచ్చి శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, అల్లం తురుము – కొద్దికొద్దిగా.. తయారీ: ముందు కళాయిలో నూనె వేసుకుని.. అందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. దానిలో ఉప్పు వేసుకుని, ఎండుమిర్చి ముక్కలు, అల్లం తురుము, పసుపు వేసుకుని తిప్పుకోవాలి. ఇప్పుడు ఆ తాలింపు మిశ్రమాన్ని పలుచగా చేసుకున్న పెరుగులో కలిపి బాగా తిప్పాలి. అందులో కొత్తిమీర తురుము కూడా వేసుకుని అన్నంలోకి తింటే అదిరిపోతుంది. తాలింపు వేసే సమయంలో, వేడి పాత్రను పట్టుకునేప్పుడు జాగ్రత్తలు అవసరం. 5 నిమిషాల పచ్చడి కావాల్సినవి: పచ్చిమిర్చి – 5, చింతపండు – అర నిమ్మకాయ సైజ్ (గింజలు లేకుండా తీసి, కడిగి, నానబెట్టుకోవాలి), కరివేపాకు – 2 రెమ్మలు, జీలకర్ర – అర టీ స్పూన్, ఉప్పు – కొద్దిగా, ఉల్లిపాయ – చిన్నది (నాలుగైదు ముక్కలు చేసుకోవాలి), నూనె – 1 టీ స్పూన్ (కాచాల్సిన పనిలేదు) తయారీ: పచ్చిమిర్చి, చింతపండు, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు వేసుకుని కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకుని.. దానిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని, మరోసారి మిక్సీలో కచ్చాబిచ్చాగా గ్రైండ్ చేసుకుని.. కొత్తిమీర తురుము, నూనె వేసుకుని, వేడి వేడి అన్నంతో తింటే సూపర్బ్గా ఉంటుంది. ఇంట్లో ఏం లేనప్పుడు.. పెద్దలు అందుబాటులో లేనప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో ఈ పచ్చడి చేసుకోవచ్చు. 10 నిమిషాల లోపు కర్రీ కావాల్సినవి: ఉల్లిపాయ–1(చిన్నగా తరగాలి), టొమాటోలు – 6 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), పచ్చిమిర్చి – 2, ఉప్పు – సరిపడా, అల్లం– వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్ పైనే, కారం – 2 టీ స్పూన్, ధనియాల పొడి, గరం మసాలా – 1 టీ స్పూన్ చొప్పున, నూనె – 2 టేబుల్ స్పూన్లు పైనే.. తయారీ: ముందుగా చిన్న కుకర్లో నూనె వేసుకుని ఉల్లిపాయలు వేగించుకుని.. టొమాటో ముక్కలు వేసి నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఆ తర్వాత అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి మరో నిమిషం మగ్గించుకోవాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ వేసి గ్లాసున్నర వాటర్ పోసి.. మూతపెట్టి, మూడు విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి. ఈ ప్రాసెస్ మొత్తం ఐదు నిమిషాల్లో పూర్తి అవుతుంది. కాస్త చల్లారాక.. మూత ఓపెన్ చేసి.. అందులో కరివేపాకు వేసుకుని, ఇంకాస్త గ్రేవీలా అయ్యేందుకు.. చిన్నమంటపై కాసేపు మగ్గించుకోవచ్చు. ఆ సమయంలో గరిటెతో ఇంకాస్త మెత్తగా చేసుకోవచ్చు. చివర్లో కొత్తిమీర తురుము వేసుకుని.. బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇదే మాదిరి టొమాటో ముక్కల బదులు బంగాళదుంప ముక్కలు, ఆనపకాయ ముక్కలు ఇలా చాలా కూరగాయలతోనూ ఈ వంటకాన్ని చేసుకోవచ్చు. -
మష్రూమ్ ఆరోగ్యానికి చాలా మంచిది, సూప్ చేసుకొని తాగేయండి
మష్రుమ్ సూప్ తయారీకి కావల్సినవి మష్రుమ్- 100 గ్రా (సన్నగా తరగాలి) కొత్తిమీర- ఒక కట్ట; ఉప్పు - తగినంత దాల్చిన చెక్క- చిన్న ముక్క, మిరియాల పొడి - పావుటీ స్పూన్ వెన్న లేదా నూనె- ఒక టేబుల్ స్పూన్ , మైదా- 50 గ్రా; వెల్లుల్లి రేకలు- నాలుగు తయారీ: ఒక గిన్నెలో పావు లీటరు నీరు పోసి అందులో కొత్తిమీర (సగం), దాల్చిన చెక్క, మిరియాలపొడి, ఉప్పు వేసి ఉడికించాలి. పెనంలో వెన్న వేసి మష్రుమ్స్ ముక్కలు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. ఇప్పుడు అదే పెనంలో వెల్లుల్లి రేకలు, మైదా వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న మిశ్రమాన్ని పోసి బాగా మరిగిన తర్వాత వడకట్టాలి. వడపోసిన మిశ్రమంలో మష్రుమ్ వేసి కొత్తిమీర, మిరియాల పొడి చల్లి సర్వ్ చేయాలి. -
ఇంట్లోనే పీనట్ బటర్ తయారు చేసుకోండిలా..
పీనట్ బటర్ తయారీకి కావల్సినవి పల్లీలు – ఒక కప్పు; తేనె – ఒక టేబుల్ స్పూను; పల్లీ నూనె – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – కొద్దిగా తయారీ విధానమిలా: స్టౌ మీద బాణలి వేడయ్యాక పల్లీలు వేసి బాగా దోరగా వేయించి దింపేయాలి ∙పప్పు గుత్తితో ఒత్తుతూ పైన పొట్టును తీసేయాలి ∙పల్లీలను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙ఒక టేబుల్ స్పూను పల్లీ నూనె, ఒక టేబుల్ స్పూను తేనె, అర టీ స్పూను ఉప్పు వేసి మరోమారు మిక్సీ పట్టాలి ∙ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకునే పీనట్ బటర్ రెడీ. దీన్ని చపాతీతో కాని, బ్రెడ్తో కాని తింటే రుచిగా ఉంటుంది. -
గోధుమ బిస్కట్స్.. చిటికెలో ప్రిపేర్ చేసుకోవచ్చు
గోధుమ బిస్కట్స్ తయారీకి కావలసినవి: గోధుమ పిండి– 2 కప్పులు పంచదార పొడి – ముప్పావు కప్పు పైనే(అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు), ఉప్పు – కొద్దిగా, కుకింగ్ సోడా – చిటికెడు పుచ్చగింజలు – 1 టీ స్పూన్ సోంపు – 1 టీ స్పూన్ నువ్వులు – 2 టీ స్పూన్లు, నెయ్యి, నీళ్లు – పావు కప్పు చొప్పున నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, పంచదార పొడి, ఉప్పు, కుకింగ్ సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో పుచ్చగింజలు, సోంపు, నువ్వులు, నెయ్యి, నీళ్లు పోసుకుని బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. ఆ ముద్దను 15 నిమిషాల పాటు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని మరోసారి బాగా మెత్తగా చేత్తో కలిపి.. చిన్న చిన్న బిస్కట్స్లా చేసుకుని.. నూనెలో దోరగా వేయించుకోవాలి. -
బనానా బ్రెడ్ రోల్స్.. టేస్ట్ అదిరిపోద్ది, ట్రై చేశారా?
బనానా బ్రెడ్ రోల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు అరటిపండ్లు – 2, బటర్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్ల చొప్పున, పంచదార – 3 టేబుల్ స్పూన్లు (అభిరుచిని బట్టి తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు) బ్రెడ్ స్లైస్ – 6 లేదా 8 తయారీ విధానమిలా: ముందుగా అరటిపండ్లను ముక్కలుగా చేసుకుని.. ఒక టేబుల్ స్పూన్ బటర్లో బాగా వేగించాలి. మెత్తగా గుజ్జులా మారిపోయే వరకూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. అనంతరం అందులో పంచదార, నెయ్యి వేసుకుని.. పంచదార కరిగిన వెంటనే ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి. ఈలోపు బ్రెడ్ స్లైస్ని నాలుగువైపులా బ్రౌన్ కలర్ పీస్ని కట్ చేసి తీసేసి.. మిగిలిన బ్రెడ్ స్లైస్ని ఒకసారి చపాతీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు ప్రతి బ్రెడ్ స్లైస్లోనూ కొద్దికొద్దిగా బనానా మిశ్రమాన్ని వేసుకుని.. రోల్స్లా చుట్టుకుని.. తడిచేత్తో అంచుల్ని అతికించుకోవాలి. ఫోర్క్ సాయంతో కొనలను నొక్కి, బాగా అతికించుకోవాలి. మిగిలిన బటర్తో వాటిని ఇరువైపులా వేయించుకుని సర్వ్ చేసుకోవాలి. -
చిక్కుడు కాయ పప్పు.. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా?
చిక్కుడు కాయ పప్పు తయారీకి కావల్సినవి: చిక్కుడు కాయలు – పావు కేజీ; పెసరపప్పు – అరకప్పు; పసుపు – పావు టీస్పూను; పచ్చికొబ్బరి తురుము – అరకప్పు; ఎండుమిర్చి – నాలుగు; జీలకర్ర – టీస్పూను; కరివేపాకు – నాలుగు రెమ్మలు;ఉప్పు – తగినంత ఆవాలు – పావు టీస్పూను; నూనె – తగినంత; మినప్పప్పు – టీస్పూను; తయారీ విధానమిలా: పెసరపప్పుని కడిగి కుకర్ గిన్నెలో వేయాలి. దీనిలో కప్పునీళ్లు, పసుపు, 1/2 టీస్పూను ఉప్పు వేసి మూతపెట్టి రెండు విజిల్స్ రానివ్వాలి. చిక్కుడు కాయలను కడిగి ఈ నూనె తీసి ముక్కలు చేసుకోవాలి. తగినన్ని నీళ్లు, చిటికెడు ఉప్పు వేసి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పచ్చికొబ్బరి, జీలకర్ర, కరివేపాకు, ఎండు మిర్చిని మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్లుపోసి పేస్టు చేయాలి. ఉడికిన పెసరపప్పులో.. చిక్కుడు ముక్కలు, నూరుకున్న మసాలా పేస్టు, ఉప్పువేసి కలపాలి. ఒక పాత్రలో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, మినప్పప్పు వేసి చిటపటలాడాక మిగతా కరివేపాకు వేసి వేయించి అందులో పప్పు మిశ్రమాన్ని కలిపితే చిక్కుడుకాయ పప్పు రెడీ. అన్నం, చపాతీ, రోటీల్లోకి చాలా బావుంటుంది. -
అరటికాయతో కారం పొడి.. అన్నంలోకి సూపర్ ఉంటుంది
అరటికాయ కారం పొడి తయారీకి కావలసినవి: అరటికాయలు – మూడు; పసుపు – 1/2 టీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; మినప్పప్పు – రెండు టీ స్పూన్లు; పచ్చిశనగ పప్పు – టీస్పూను; ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు; ఎండుమిర్చి – ఐదు; మిరియాలు – టీస్పూను; ఎండు కొబ్బరి తురుము – నాలుగు టీస్పూన్లు; కరివేపాకు – ఐదు రెమ్మలు; ఇంగువ – చిటికెడు; నూనె – నాలుగు టీస్పూన్లు; ఆవాలు – అరటీస్పూను. తయారీ విధానమిలా: స్టవ్ వెలిగించి మీడియం మంట మీద అరటికాయలను కాల్చాలి. చక్కగా కాలాక మంట మీద నుంచి తీసి చల్లారాక తొక్కతీసేసి, సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలిపెట్టి టీస్పూను మినప్పప్పు, పచ్చి శనగపప్పు, ధనియాలు, ఎండు మిర్చి, మిరియాలు, ఎండు కొబ్బరి తురుము, మూడు రెమ్మల కరివేపాకు, ఇంగువ వేసి దోరగా వేగాక, చల్లారనిచ్చి పొడిచేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద బాణలిపెట్టి నూనె వేయాలి. ∙వేడెక్కిన తరువాత మిగిలిన మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి. చిటపటలాడాక అరటికాయ తురుము, పసుపు, రుచికి సరిపడా ఉప్పువేసి వేయించాలి. తరువాత మసాలా పొడి వేసి కలిపి మూతపెట్టి, సన్న మంట మీద ఐదు నిమిషాలు మగ్గనిస్తే అరటికాయ పొడి రెడీ. -
క్యాబేజ్తో ఎగ్ భుర్జి.. ఎప్పుడైనా ట్రై చేశారా? చపాతీలో బావుంటుంది
క్యాబేజ్ ఎగ్ భుర్జి తయారీకి కావల్సినవి క్యాబేజీ తురుము – రెండు కప్పులు; నూనె – మూడు టేబుల్ స్పూన్లు; ఉల్లిపాయ తరుగు – అరకప్పు; అల్లం వెల్లుల్లి పేస్టు – ఒకటిన్నర టీస్పూన్లు; పచ్చిమిర్చి – చిన్నవి ఆరు(సన్నగా తరగాలి); ధనియాల పొడి – అరటీస్పూను; పసుపు – అరటీస్పూను; కారం – ముప్పావు టీస్పూను; గుడ్లు – నాలుగు; ఉప్పు – రుచికి సరిపడా; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ విధానమిలా: ►స్టవ్ మీద మందపాటి బాణలి పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ తరుగు వేసి వేయించాలి. ఉల్లిపాయ వేగాక, అల్లం వెల్లుల్లి పేస్టువేసి వేయించాలి. ► అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తరువాత పచ్చిమిర్చి తరుగు వేయాలి. మిర్చి వేగిన తరువాత ధనియాల పొడి, కారం, పసుపు, క్యాబేజీ తరుగు, రుచికి సరిపడా ►ఉప్పు వేసి కలిపి బాణలి మీద మూతపెట్టి సన్న మంట మీద మగ్గనివ్వాలి. ►గుడ్లసొనను ఒక గిన్నెలో వేసి బీటర్ లేదా ఫోర్క్తో కలిపి పక్కన పెట్టాలి. ∙క్యాబేజీ ఉడికి దగ్గర పడుతున్నప్పుడు గుడ్ల సొనవేసి కలుపుతూ వేయించాలి. ► చక్కగా వేగిన తర్వాత కొత్తిమీర చల్లుకుని దించేయాలి. ∙రోస్టెడ్ బ్రెడ్, చపాతీ, రోటీలోకి ఇది మంచి సైడ్ డిష్. -
మరమరాలతో వడ.. సింపుల్గా ఇలా చేసుకోండి
మరమరాల వడ.. తయారీకి కావలసిన పదార్ధాలు మరమరాలు – 3 కప్పులు (నీటిలో నానబెట్టి, గట్టిగా పిండి ఒక బౌల్ల్లోకి తీసుకోవాలి) పెరుగు – 3 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి – పావు కప్పు మైదా పిండి – పావు కప్పు అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, సోంపు – 1 టీ స్పూన్ చొప్పున తెల్ల నువ్వులు – 1 టీ స్పూన్ + గార్నిష్కి కారం – ఒకటిన్నర టీ స్పూన్, నీళ్లు – కొన్ని ఉప్పు – తగినంత, గరం మసాలా – పావు టీ స్పూన్, పంచదార – 2 టీ స్పూన్లు, నిమ్మ రసం – 1 టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర తురుము – కొద్దిగా తయారీ విధానం ముందుగా మరమరాలను గట్టిగా పిసికి, అందులో పెరుగు వేసుకుని బాగా కలిపి, 15 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోవాలి. అనంతరం అందులో గోధుమ పిండి, మైదా పిండి, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, సోంపు, 1 టీ స్పూన్ తెల్ల నువ్వులు, కారం, ఉప్పు, గరం మసాలా, పంచదార, నిమ్మరసం, 3 టీ స్పూన్ల నూనె, కొత్తిమీర తురుము వేసుకుని బాగా ముద్దలా చేసుకోవాలి. అవసరమయితే కొద్దిగా నీళ్లు కలుపుకోవాలి. ఆ ముద్దను చిన్న చిన్న కట్లెట్స్ మాదిరి చేసుకుని, ప్రతి కట్లెట్కి కాస్త తడి చేసి, పైన నువ్వులు పెట్టి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. -
పీనట్ ఐస్క్రీమ్ ఎప్పడైనా ట్రై చేశారా? సింపుల్ రెసిపి
పీనట్ ఐస్క్రీమ్ తయారీకి కావల్సినవి: స్వీటెండ్ కండెన్సడ్ మిల్క్ – 400 గ్రాములు హెవీ క్రీమ్ – 480 ఎమ్ఎల్,పీనట్ బటర్ – 250గ్రాములు వేరుశనగలు – 70 గ్రాములు (దోరగా వేయించి, తొక్క తీసి, కచ్చాబిచ్చా చేసుకోవాలి) తయారీ విధానమిలా: ముందుగా ఒక పెద్ద గిన్నెలో హెవీ క్రీమ్ వేసుకుని హ్యాండ్హెల్డ్ మిక్సర్తో బాగా నురుగు వచ్చేలా, క్రీమీగా చేసుకోవాలి. దానిలో కండెన్సడ్ మిల్క్, పీనట్ బటర్ వేసుకుని.. బాగా కలుపుకోవాలి. మెత్తగా క్రీమీగా మారిన తర్వాత.. దానిలో కచ్చాబిచ్చా చేసుకున్న వేరుశనగ ముక్కల్ని కలుపుకోవాలి. అనంతరం ఆ మొత్తం మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని.. సమాంతరంగా చేసుకోవాలి. 6 గంటలు పాటు ఫ్రిజ్లో పెట్టుకుని.. ఆ తర్వాత సర్వ్ చేసుకోవాలి. -
బేకరి స్టైల్లో స్వీట్ రైస్ కేక్.. ఇలా చేసుకోండి
స్వీట్ రైస్ కేక్ తయారీకి కావల్సినవి: బియ్యప్పిండి –100 గ్రాములు మైదాపిండి, మొక్కజొన్న పిండి – అర టేబుల్ స్పూన్ చొప్పున బ్రౌన్ షుగర్ – 60 గ్రాములు,నీళ్లు – 1 కప్పు (గోరువెచ్చగా చేసుకోవాలి) నూనె – 2 టేబుల్ స్పూన్లు,గుడ్డు – 1 తయారీ విధానమిలా: ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు గోరువెచ్చని నీటిలో బ్రౌన్ షుగర్ను కరిగించాలి. అందులో బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, మైదాపిండి ఒకదాని తర్వాత ఒకటి జల్లెడ పట్టుకోవాలి. అనంతరం ఉండలు లేకుండా కలుపుకోవాలి. అందులో నూనె జోడించి, హ్యాండ్హెల్డ్ మిక్సర్తో బాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న కేక్ కంటైనర్ లోపల కొద్దిగా నూనె రాసి, అందులో ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి. అనంతరం 45 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించుకోవాలి. కేక్ చల్లారాక రాత్రంతా ఫ్రిజ్లో పెట్టుకోవాలి. అనంతరం నచ్చిన విధంగా కట్ చేసుకుని.. వాటిని గుడ్డు మిశ్రమంలో ముంచి ఇరువైపులా పాన్ పై వేయించుకుని సర్వ్ చేసుకోవాలి. -
ఒడిశా పాపులర్ డిష్:హబీషా దాల్మా..సింపుల్గా, టేస్టీగా
హబీసా దాల్మా తయారీకి కావల్సినవి: పెసర పప్పు – కప్పు; అరటికాయ – పెద్దది ఒకటి; చేమదుంపలు – నాలుగు; టొమాటో – ఒకటి; పచ్చిబొ΄్పాయి – చిన్నది ఒకటి; అల్లం – అంగుళం ముక్క; నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు; బిర్యానీ ఆకులు – నాలుగు; ఎండు మిర్చి – ఏడు; జీలకర్ర – మూడు టేబుల్ స్పూన్లు; ఆవాలు – టీస్పూను; పచ్చికొబ్బరి తురుము – రెండు టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా. తయారీ విధానమిలా: ►ముందుగా నాలుగు ఎండు మిర్చి, రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రను దోరగా వేయించి పొడిచేసి పెట్టుకోవాలి. అరటికాయ, చేమ దుంపలు, బొప్పాయి తొక్కతీసి ముక్కలుగా తరగాలి. అల్లం, టొమాటోను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. పెసరపప్పు కడిగి కుక్కర్లో వేయాలి.అందులో మూడు కప్పుల నీళ్లు, అరటి, చేమ, బొప్పాయి, అల్లం ముక్కలు, బిర్యానీ ఆకులు వేయాలి. ► రుచికి సరిపడా ఉప్పు వేసి మూతపెట్టాలి. పెద్ద మంటమీద ఒక విజిల్ రానిచ్చి దించేయాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి నెయ్యి వేయాలి. వేడెక్కిన నెయ్యిలో మిగిలిన ఎండు మిర్చి, జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. ∙ఇవి వేగాక కుక్కర్లో ఉడికిన పప్పు మిశ్రమాన్ని వేసి కలపాలి. ∙ఇప్పుడు కొత్తిమీర తరుగు, పచ్చికొబ్బరి తరుము, మిర్చి, జీలకర్ర పొడి వేసి ఐదు నిమిషాలు మగ్గనిస్తే హబీసా దాల్మా రెడీ. వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోవాలి. -
స్వీట్ పొటాటోతో బిస్కెట్స్.. మీరెప్పుడైనా ట్రై చేశారా?
స్వీట్ పొటాటో బిస్కెట్స్ తయారీకి కావల్సినవి: చిలగడ దుంపలు – పావు కేజీ; పాలు – ముప్పావు కప్పు; మైదా – ఒకటిన్నర కప్పులు; కార్న్ స్టార్చ్ – రెండు టేబుల్ స్పూన్లు; పంచదార – రెండున్నర టేబుల్ స్పూన్లు; వంటసోడా – టేబుల్ స్పూను; ఉప్పు – ఒకటింబావు టీస్పూన్లు; బటర్ – అరకప్పు. తయారీ విధానమిలా: ►చిలగడ దుంపలను ఉడికించి తొక్కతీసి చిదిమి, అందులో పాలుపోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మిక్సీజార్లో కార్న్ స్టార్చ్, పంచదార, మైదా, వంటసోడా వేసి రెండు నిమిషాలు గ్రైండ్ చేయాలి. ► ఇప్పుడు బటర్, ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకోవాలి. దీనిలో చిలగడ దుంప చిదుము వేసి పిండి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేటులో పెట్టి ముప్పావు అంగుళం మందంలో ఉండేలాగా, సమంగా ఒకటే మందంలో ఉండేటట్లు సర్దాలి. ► ఇప్పుడు చాకుతో ఇష్టమైన ఆకారంలో ముక్కలుగా కట్ చేయాలి. పిండి చేతులకు అతుక్కుంటూ ఉంటే పొడి పిండి (మైదా) చల్లుకోవాలి. ఈ ముక్కలను బేకింగ్ ట్రేలో పెట్టి 360 డిగ్రీల ఉష్ణోగ్రతలో పదిహేను నిమిషాలు బేక్ చేయాలి. ముక్కలు గోల్డెన్ కలర్లోకి మారితే స్వీట్ పొటాటో బిస్కెట్స్ రెడీ ∙గాలి చొరబడని డబ్బాలో నిల్వచేస్తే మూడు నెలలు పాడవకుండా ఉంటాయి. -
కమ్మని కార్తీకం.. కొర్రలతో లడ్డూ, రోజుకి ఒకటి తింటే చాలు
కార్తీక మాసం కావడంతో... కోవెళ్లు, లోగిళ్లు దీపాలతో కళకళలాడిపోతున్నాయి. మరో రెండురోజుల్లో కార్తీకపౌర్ణమి. పగలంతా ఉపవాసం ఉన్నవారికి సాయంత్రం చంద్రోదయం కాగానే రుచిగా... శుచిగా కమ్మని వంటలతో ఉపవాస విరమణ చేయమని చెబుతోంది ఈ వారం వంటిల్లు. తినాయ్(కొర్ర) లడ్డు తయారీకి కావల్సినవి: కొర్రలు – కప్పు; పల్లీలు – కప్పు; బెల్లం తరుగు – కప్పు; యాలకులు – మూడు. తయారీ విధానమిలా: ►కొర్రలను శుభ్రంగా కడిగి అరగంట నానబెట్టాలి. అరగంట తరువాత నీటిని వంపేసి ఎండలో ఆరబోయాలి. తడిలేకుండా ఎండిన కొర్రలను బాణలిలో వేసి బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు దోరగా వేయించాలి. ► కొర్రలు వేగిన బాణలిలోనే పల్లీలను వేసి వేయించాలి. పల్లీలు చక్కగా వేగిన తరువాత పొట్టుతీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇదే బాణలిలో బెల్లం, రెండు టేబుల్ స్పూన్ల నీళ్లుపోసి సన్నని మంట మీద పెట్టాలి. ►బెల్లం కరిగిన తరువాత వడగట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న కొర్రలు, పల్లీలు, యాలకులను మిక్సీజార్లో వేసి పొడి చేయాలి.కొర్రలు, పల్లీల పొడిని ప్లేటులో వేసుకుని, ఆ పొడిలో బెల్లం నీళ్లు వేస్తూ లడ్డులా చుట్టుకుంటే తినాయ్ లడ్డు రెడీ. బెల్లం ఇష్టపడని వారు తేనెతో లడ్డులూ చుట్టుకోవచ్చు. ఈ లడ్డు మూడు నాలుగురోజుల పాటు తాజాగా ఉంటుంది. -
ఆరేంజ్ జ్యూస్తో హల్వా.. ఎప్పుడైనా ట్రై చేశారా?
ఆరెంజ్ హల్వా తయారీకి కావల్సినవి: ఆరెంజ్ – 3 (జ్యూస్ తీసుకుని, వడ కట్టుకోవాలి) మొక్కజొన్న పిండి – అర కప్పు పంచదార – 1 కప్పు (నీళ్లు పోసుకుని లేతగా పాకం పట్టుకోవాలి) దాల్చినచెక్క పొడి – చిటికెడు ఫుడ్ కలర్ – ఆరెంజ్ కలర్ నట్స్ తరుగు – కొద్దిగా (గార్నిష్కి) తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్లో మొక్కజొన్న పిండి తీసుకుని.. అందులో ఆరెంజ్ జ్యూస్, ఫుడ్ కలర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. పంచదార పాకంలో నిమ్మరసం, దాల్చినచెక్క వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమం దగ్గర పడుతున్న సమయంలో ఆరెంజ్ మిశ్రమాన్ని వేసుకుని తిప్పుతూ ఉండాలి. బాగా దగ్గరపడిన తర్వాత ఒక బౌల్కి నెయ్యి రాసి.. అందులో ఆ మిశ్రమాన్ని వేసుకుని, నట్స్ తరుగు జల్లుకుని చల్లారనివ్వాలి. దగ్గర పడిన తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలి. -
క్రిస్పీ చికెన్ నూడుల్స్.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్ది
నూడుల్ చికెన్ తయారీకి కావల్సినవి: బోన్ లెస్ చికెన్ – అర కిలో (సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి) నూడుల్స్ – 2 కప్పులు (ఉడికించి, కాస్త చల్లార్చినవి) గుడ్డు – 1,చిల్లీ సాస్ – 1 టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్ – పావు కప్పు+1 టేబుల్ స్పూన్ అల్లం–వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా – అర టేబుల్ స్పూన్ చొప్పున టొమాటో సాస్ – 2 టేబుల్ స్పూన్లు మిరియాల పొడి – పావు టీ స్పూన్ ఉప్పు – తగినంత నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా: ముందుగా చికెన్ ముక్కల్లో చిల్లీ సాస్, గరం మసాలా, అల్లం–వెల్లుల్లి పేస్ట్, టొమాటో సాస్, కారం, మిరియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్, గుడ్డు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలిపి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత ఉడికించిన నూడుల్స్లో కార్న్ పౌడర్ వేసుకుని అటూ ఇటూ గరిటెతో కలిపి.. ఒక ప్లేట్లో కొన్ని నూడుల్స్ పరచుకుని.. ఒక్కో చికెన్ ముక్కను అందులో పెట్టి చుట్టుకోవాలి. పుల్ల గుచ్చి.. ఒక్కొక్కటిగా కాగుతున్న నూనెలో వేసుకుని, దోరగా వేయించుకోవాలి. -
ఆమ్లా ఛుందా..ఇలా చేస్తే ఎక్కువకాలం తాజాగా ఉంటుంది
ఆమ్లఛుందా తయారీకి కావల్సినవి: ఉసిరికాయలు – అరకేజీ; బెల్లం – అరకేజీ; అల్లం – చిన్నముక్క; బ్లాక్సాల్ట్ – ఒకటిన్నర టీస్పూన్లు; మిరియాలు – టీస్పూను; యాలక్కాయలు – ఎనిమిది; దాల్చిన చెక్క – అంగుళం ముక్క; పసుపు – టీస్పూను; కశ్మీరీ కారం – ఒకటిన్నర టీస్పూన్లు; గరం మసాలా – అర టీస్పూను; నిమ్మకాయలు – రెండు. తయారీ విధానమిలా: ►ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, ఆవిరి మీద మెత్తగా (10 నిమిషాలు) ఉడికించాలి ∙అల్లాన్ని సన్నగా తురిమి పెట్టుకోవాలి ∙యాలక్కాయలు, మిరియాలను విడివిడిగా దంచి పెట్టుకోవాలి ∙ఉడికిన ఉసిరికాయలు చల్లారాక గింజలు తీసి సన్నగా తురుముకోవాలి. ఉసిరి తురుములో బెల్లం వేసి మీడియం మంట మీద పెట్టాలి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ►నీరు పైకి తేలగానే అల్లం తురుము, బ్లాక్ సాల్ట్, మిరియాల పొడి, యాలకుల పొడిని వేయాలి ∙దాల్చిన చెక్కను తుంచి వేయాలి ∙చివరిగా పసుపు వేసి కలుపుతూ ఉడికించాలి ∙మీడియం మంట మీదే ఉంచి కలుపుతూ మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు కారం, గరంమసాలా వేసి కలపాలి. బాగా కలిసిన తరువాత దించేసి, నిమ్మరసం పిండితే ఆమ్లా ఛుందా రెడీ. గమనిక: గాజు లేదా పింగాణీ పాత్రల్లో నిల్వ చేస్తే ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. -
క్యాన్సర్ ముప్పుని తగ్గించే ఉసిరి.. పచ్చడి పెట్టుకోండిలా
తిన్న తిండి ఒంటికి పట్టేలా చేయడంతో ఉసిరి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచడం, క్యాన్సర్ ముప్పుని తగ్గించడంలో ఉసిరి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇన్ని సుగుణాలు ఉన్న ఉసిరి ప్రస్తుతం మార్కెట్లో దండిగా దొరుకుతోంది. అందుకే ఊరించే ఉసిరిని మరింత రుచిగా ఇలా చేసుకోమని చెబుతోంది ఈ వారం మన వంటిల్లు... స్పైసీ పచ్చడి తయారికి కావలసినవి: ఉసిరికాయలు – ఆరు; పచ్చి శనగపప్పు – పావు కప్పు; పచ్చిమిర్చి – మూడు; వెలుల్లి రెబ్బలు – నాలుగు; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – టీస్పూను; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీస్పూను; పసుపు – పావు టీస్పూను; ఇంగువ – చిటికెడు; కరివేపాకు – రెండు రెమ్మలు; కొత్తిమీర తరుగు – కాస్తంత తయారీ విధానమిలా: పచ్చిశనగపప్పుని శుభ్రంగా కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ∙ఉసిరికాయలను శుభ్రంగా కడిగి గింజలు తీసేసి ముక్కలుగా తరుగుకోవాలి. ∙ఉసిరికాయ ముక్కలు, నానిన శనగపప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లుపోసి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ అయిన పచ్చడిని గిన్నెలోకి తీసుకోవాలి ∙బాణలిలో నూనె వేసి, ఆవాలు జీలకర్ర, ఇంగువ, పసుపు, కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి ∙ఈ తాలింపుని పచ్చడిలో వేసి కలపాలి. చివరిగా కొత్తిమీర తరుగు వేసి కలిపితే స్పైసీ పచ్చడి రెడీ. చపాతీ, రోటీ, అన్నంలోకి ఈ పచ్చడి చాలా బావుంటుంది. -
పిల్లలకు ఇష్టమైన బనానా మోదక్.. ఇలా ట్రై చేయండి
బనానా మోదక్ తయారికి కావలసినవి: గోధుమ పిండి – కప్పు; అరటిపండ్లు – రెండు; బెల్లం – మువు కప్పు; పచ్చికొబ్బరి తురుము – టేబుల్ స్పూను; అటుకులు – రెండు టేబుల్ స్పూన్లు; సూజీ రవ్వ – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు – చిటికెడు; నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు; యాలకుల పొడి – పావు టీస్పూను; నూనె – డీప్ఫ్రైకి సరిపడా. తయారీ విధానమిలా: అరటిపండ్లు, బెల్లం, కొబ్బరి తురుము, అటుకులు, సూజీరవ్వను మిక్సీజార్లో వేసి కొద్దిగా నీళ్లుపోసి పేస్టులా గ్రైండ్ చేయాలి ∙ఈ పేస్టుని పెద్దగిన్నెలో వేసి... గోధుమ పిండి, ఉప్పు, నెయ్యి, యాలకుల పొడి అన్ని కలిసిపోయేలా చక్కగా కలపాలి ∙ఇప్పుడు ఈ పిండిని మోదక్లా లేదా నచ్చిన ఆకారంలో చేసుకుని మరుగుతోన్న నూనెలో వేసి డీప్ ఫ్రైచేయాలి ∙మీడియం మంట మీద రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రె చేస్తే బనానా మోదక్ రెడీ. -
పాలపొడితో దీపావళి కోసం స్పెషల్ స్వీట్.. చేసుకోండిలా
షీర్ పీరా తయారికి కావల్సినవి: పంచదార – కప్పు; పాల పొడి – రెండు కప్పులు; బాదం పలుకులు – టేబుల్ స్పూను; జీడిపప్పు పలుకులు – టేబుల్ స్పూను; పిస్తా పలుకులు – టేబుల్ స్పూను; కిస్మిస్ – టేబుల్ స్పూను; యాలకులు – నాలుగు; నెయ్యి – టేబుల్ స్పూను; గార్నిష్ కోసం.... పిస్తా, బాదం, జీడిపప్పు పలుకులు – టేబుల్ స్పూను (పెద్దసైజువి). తయారీ విధానమిలా: డ్రైఫ్రూట్స్ పలుకులు సన్నగా పొడవుగా ఉండేలా తీసుకోవాలి. మందపాటి బాణలిలో పంచదార, కప్పు నీళ్లుపోసి మంటమీద పెట్టాలి తీగపాకం వచ్చేంత వరకు మరిగించాలి.తీగపాకం వచ్చినప్పుడు సన్నమంటమీద ఉంచాలి ∙ఇప్పుడు పాల పొడిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి.పాలపొడి దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి ∙ దగ్గర పడుతున్నప్పుడు బాదం, జీడిపప్పు, పిస్తా పలుకులు, కిస్మిస్ ముక్కలను వేసి కలపాలి ∙చివరిగా యాలకులను పొడిచేసి వేయాలి ∙ప్లేటుకును నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని వేయాలి ∙ప్లేటంతా సమంగా పరుచుకుని పైన కొద్దిగా పిస్తా, బాదం, జీడిపప్పు పలుకులు చల్లాలి ∙స్పూను పెట్టి పైన కూడా సమంగా వత్తుకుని ప్లేటుని రిఫ్రిజిరేటర్లో పెట్టాలి ∙రెండు గంటల తరువాత నచ్చిన ఆకారంలో ముక్కలు కట్చేసి సర్వ్ చేసుకోవాలి. -
సాయంత్రం టీలోకి బెస్ట్ ఆప్షన్.. మక్ పారా ఫ్లవర్స్
మక్ పారా ఫ్లవర్స్ తయారికి కావల్సినవి: మైదా– 2 కప్పులు, పంచదార పొడి– అర కప్పు, మిరియాల పొడి– అర టీస్పూన్, ఉప్పు– కొద్దిగా నూనె– 3 టేబుల్ స్పూన్లు,చిక్కటి పాలు– సరిపడా (కాచి చల్లారిన వి) నూనె– డీప్ ఫైకి సరిపడా, లవంగమొగ్గలు– కొన్ని(అభిరుచిని బట్టి) తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మైదాపిండి, మిరియాలపొడి, పంచదార పొడి, తగినంత ఉప్పు వేసుకుని కొద్దికొద్దిగా పాలు పోసుకుంటూ ముద్దల్లా చేసుకుని.. 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అనంతరం నచిన విధంగా ఫ్లవర్లా చేసుకోవచు. లేదా అభిరుచిని బట్టి ఒక ఫ్లవర్పై మరో ఫ్లవర్ ఉంచి, మధ్యలో ఒక్కో లవంగమొగ్గ గుచ్చి, కదలకుండా పెట్టుకోవచ్చు. అనంతరం వాటిని నూనెలో డీప్ ఫై చేసుకుంటే సరిపోతుంది. -
స్నాక్స్ కోసం బెస్ట్ రెసిపి.. పోహా వెజ్ కట్లెట్
పోహా వెజ్ కట్లెట్ తయారికి కావల్సినవి: అటుకులు – కప్పు; ఉడికించిన బంగాళ దుంపలు – రెండు; క్యాప్సికం తరుగు – రెండు టీస్పూన్లు; క్యారట్ తురుము – రెండు టీస్పూన్లు; పచ్చిబఠాణి – రెండు టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; ధనియాల పొడి – టీస్పూను; చాట్ మసాలా – టీస్పూను; కారం – టీస్పూను; పచ్చిమిర్చి పేస్టు – టీస్పూను; కార్న్ఫ్లోర్ – రెండు టేబుల్ స్పూన్లు; బ్రెడ్ ముక్కల పొడి – కప్పు; ఉప్పు – రుచికి సరిపడా;నూనె – డీప్ఫ్రైకి సరిపడా. తయారీ విధానమిలా: ►అటుకులను శుభ్రంగా కడిగి పదినిమిషాలు నానబెట్టుకోవాలి ∙పదినిమిషాల తరువాత నానిన అటుకుల్లో తొక్కతీసిన దుంపలు, బఠాణి, క్యాప్సికం, క్యారట్, కొత్తిమీర తరుగు వేయాలి ∙ ► పచ్చిమిర్చి పేస్టు, చాట్ మసాలా, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పువేసి ముద్దలా కలపాలి ∙పిండిని ఉండలుగా చేసి, కట్లెట్లా వత్తుకుని పక్కన పెట్టుకోవాలి ∙కార్న్ఫ్లోర్లో నీళ్లు పోసి పేస్టులా కలపాలి. ► ఒక్కో కట్లెట్ను కార్న్ఫ్లోర్ పేస్టులో ముంచి, తరువాత బ్రెడ్ ముక్కల పొడిని అద్దాలి ∙బ్రెడ్ ముక్కల పొడి అద్దిన తరువాత డీప్ ఫ్రై చేసుకోవాలి ∙గోల్డెన్ కలర్లోకి మారాక తీసి సాస్ లేదా గ్రీన్ చట్నీతో సర్వ్ చేయాలి. -
గుడ్డుతో పొంగనాలు.. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా?
మసాలా ఎగ్ పనియరం తయారీకి కావల్సినవి: గడ్డ పెరుగు – 2 కప్పులు గుడ్డు – 3, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు – 1 టేబుల్ స్పూన్ చొప్పున కొత్తిమీర తురుము – కొద్దిగా అల్లం తురుము – అర టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్ మిరియాల పొడి – పావు టీ స్పూన్ ఉప్పు – తగినంత, నూనె – సరిపడా తయారీ విధానమిలా: ముందుగా పెరుగును రెండుమూడు సార్లు అటూ ఇటూ తిరగబోసుకుని సాఫ్ట్గా అయ్యేలా చేసుకోవాలి. అందులో గుడ్లు పగలగొట్టుకుని బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని.. దానిపై పొంగనాల పెనం పెట్టుకుని.. ప్రతి గుంతలో కొద్దికొద్దిగా నూనె వేసుకుని.. కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని వాటిలో వేసుకుని ఇరువైపులా వేయించుకోవాలి. వీటిని.. నచ్చిన చట్నీలో వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి. -
కోకోనట్ మిల్క్ కేక్.. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు
కోకోనట్ మిల్క్ కేక్ తయారీకి కావల్సినవి: కొబ్బరి పాలు – అర లీటరు, పాలు – పావు లీటరు, పంచదార – పావు కప్పు, నిమ్మరసం – 1 టీ స్పూన్ పిస్తా, బాదం తురుము – గుప్పెడు(అభిరుచిని బట్టి మరిన్ని, నేతిలో వేయించుకోవాలి) తయారీ విధానమిలా: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. ఒక పాత్రలో పాలు పోసి.. చిన్న మంట మీద మరిగించాలి. తర్వాత కాసేపటికి నిమ్మరసాన్ని ఒక టేబుల్ స్పూన్ నీళ్లలో బాగా కలిపి.. మరుగుతున్న పాలలో చుక్క చుక్క చొప్పున వేస్తూ ఉండాలి. పాలు చిక్కబడే వరకు గరిటెతో తిప్పుతూ ఉండాలి. పాలు చిక్కబడుతున్నప్పుడు అందులో కొబ్బరిపాలు, పంచదార కలపాలి. కోవాలా అయ్యే వరకు మరిగించాలి. దగ్గరపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ బౌల్ తీసుకుని, దాని లోపల నెయ్యి రాసి, ఈ మిశ్రమం మొత్తం వేసుకుని.. బాదం పిస్తా పలుకులు చల్లాలి. చల్లారిన తర్వాత నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. లేదంటే నచ్చిన విధంగా క్రీమ్స్తో గార్నిష్ చేసుకుని బర్త్డే కేక్లా తయారుచేసుకోవచ్చు. -
పాలక్ మేథీ పూరీ..ఇలా చేస్తే లొట్టలేసుకొని తింటారు
పాలక్ మేథీ పూరీ తయారీకి కావల్సినవి: జీలకర్ర – టేబుల్ స్పూను; సోంపు – టేబుల్ స్పూను; వాము – టీస్పూను; నువ్వులు – టేబుల్ స్పూను; ధనియాల పొడి – టేబుల్ స్పూను; రెండు కప్పులు; శనగపిండి – పావు కప్పు; పసుపు – అరటేబుల్ స్పూను; ఉప్పు – రుచికి సరిపడా; కారం – టేబుల్ స్పూను; నూనె –డీప్ఫ్రైకి సరిపడా పచ్చిమిర్చి – మూడు; అల్లం తరుగు – టీస్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; పాలకూర తరుగు – రెండు కప్పులు; మెంతికూర తరుగు – కప్పు; గోధుమ పిండి –రెండు కప్పులు తయారీ విధానం: జీలకర్ర, సోంపు, నువ్వులు, వాము, ధనియాల పొడి, పచ్చిమిర్చి; అల్లం తరుగు, కరివేపాకుని మిక్సీజార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పాలకూర, మెంతికూర తరుగుని గిన్నెలో వేయాలి. దీనిలోనే గోధుమపిండి, శనగపిండి, కారం, పసుపు, గ్రైండ్ చేసిన మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు, టేబుల్ స్పూను నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా వేడినీళ్లు చల్లుకుంటూ ముద్దలా కలపాలి ∙పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీలా మందంగా వత్తుకోవాలి ∙గుండ్రని గిన్నె లేదా చిన్న గ్లాసుతో పూరీని చిన్న చిన్న చెక్కల్లా కట్ చేయాలి ∙అన్నీ రెడీ అయ్యాక క్రిస్పీగా మారేంత వరకు డీప్ ఫ్రై చేస్తే రుచికరమైన పాలక్ మేథీ పూరీ రెడీ. -
బెస్ట్ స్నాక్ రెసిపి.. పనీర్ కుర్కురే, ఎప్పుడైనా ట్రై చేశారా?
పనీర్ కుర్కురే తయారీకి కావల్సినవి: నిలువుగా కోసిన పనీర్ ముక్కలు – రెండు కప్పులు; పసుపు – టీస్పూను; కారం – టీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; కసూరీ మేథీ – టేబుల్ స్పూన్; వాము – అరటీస్పూను; చాట్ మసాలా – టీస్పూను; గరం మసాలా – టీస్పూను; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; అల్లం వెల్లుల్లి పేస్టు – టేబుల్ స్పూను; కార్న్ఫ్లేక్స్ – రెండు కప్పులు; శనగపిండి – రెండు కప్పులు; నూనె – డీప్ఫ్రైకి సరిపడా. తయారీ విధానమిలా: ►పనీర్ ముక్కలపైన చిటికెడు సాల్ట్, కారం, టేబుల్ స్పూను కొత్తిమీర తరుగు, చాట్ మసాలా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ► పెద్ద గిన్నె తీసుకుని శనగపిండి, వాము, అల్లం వెల్లుల్లి పేస్టు, కసూరీ మేథీ, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి ► ఇప్పుడు నీళ్లు పోసి బజ్జీపిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ∙ఒక ప్లేటులో కార్న్ ఫ్లేక్స్ను నలిపి పెట్టుకోవాలి ► ఇప్పుడు ఒక్కో పనీర్ ముక్కను తీసుకుని ముందుగా శనగపిండి మిశ్రమంలో ముంచాలి. తరువాత కార్న్ఫ్లేక్స్ను అద్ది సలసలా కాగుతోన్న నూనెలో వేసి డీప్ఫ్రై చేయాలి ∙పనీర్ ముక్క క్రిస్పీగా మారితే పన్నీర్ కుర్కురే రెడీ. -
కర్ణాటక పాపులర్ స్వీట్ రెసిపి మండిగె.. టేస్ట్ అదిరిపోతుంది
మండిగే తయారీకి కావల్సినవి: బొంబాయి రవ్వ – రెండు కప్పులు; గోధుమ పిండి – కప్పు; ఉప్పు – చిటికెడు; బెల్లం తరుగు – అరకప్పు; నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు; పచ్చకర్పూరం – చిటికెడు. తయారీ విధానం ఇలా: పెద్ద గిన్నెలో బొంబాయి రవ్వ, గోధుమ పిండి, ఉప్పు, టేబుల్ స్పూను నెయ్యివేసి కలపాలి. ఇప్పుడు నీళ్లు చల్లుకుంటూ చపాతీ ముద్దలా చేసుకోవాలి. దీనిపైన మూతపెట్టి ఇరవై నిమిషాలు పక్కన పెట్టాలి. బెల్లంలో మిగిలిన నెయ్యి, పచ్చకర్పూరం వేసి, కలిపి పక్కన పెట్టుకోవాలి ∙20 నిమిషాల తరువాత పిండిముద్దను ఉండలుగా చుట్టి, చపాతీలా వత్తుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీ తీసుకుని,పైన రెండు టీస్పూన్ల బెల్లం మిశ్రమం వేసి చపాతీ అంతా పరచాలి. బెల్లం పరిచిన చపాతీపై మరో చపాతీని వేసి చ΄ాతీకర్రతో ఒకసారి వత్తుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీని పెనం మీద వేసి రెండు వైపులా క్రిస్పీగా మారేంత వరకు కాల్చి తీసేయాలి. ఇలా కాలిన మండిగేను రెండు మూడు మడతలు వేసి సర్వ్ చేసుకోవాలి. -
అటుకులతో స్వీట్ రెసిపి.. టేస్ట్ బావుంటుంది ట్రై చేయండి
అటుకుల శక్కర్ పారే తయారీకి కావల్సినవి: అటుకులు – అర కప్పు (మిక్సీ పట్టుకుని పొడిలా చేసుకోవాలి) మైదా – 2 కప్పులు పంచదార – అర కప్పు నెయ్యి – 6 టేబుల్ స్పూన్లు నీళ్లు – కావాల్సినన్ని నువ్వులు – కొద్దిగా నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పంచదార, కొద్దిగా నీళ్లు పోసుకుని పంచదార కరిగేవరకు కలుపుకోవాలి. ఇప్పుడు అందులో నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత మైదా పిండి, అటుకుల పొడి, నువ్వులు వేసుకుని ముద్దలా చేసుకుని సుమారు గంటన్నర సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీల్లా ఒత్తుకుని నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. వాటిని నూనెలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది. -
బ్రెడ్ తో రుచికరమైన స్నాక్స్..
కావలసినవి: బ్రెడ్ ముక్కలు – 1 కప్పు, ధనియాలు, జీలకర్ర – 1 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మెంతులు, మిరియాలు – పావు టీ స్పూన్ చొప్పున ఎండుమిర్చి – 3 లేదా 4. వెల్లుల్లి రెబ్బలు – 5, చింతపండు గుజ్జు – 1 టీ స్పూన్, పెరుగు – 5 టేబుల్ స్పూన్లు, పసుపు – అర టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు (చిన్నగా కట్ చేసుకోవాలి) కరివేపాకు – కొద్దిగా, నిమ్మకాయ రసం – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత నూనె – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ముందుగా ఒక పాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి.. అందులో ధనియాలు, జీలకర్ర , ఆవాలు, మెంతులు, మిరియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసుకుని దోరగా వేయించి.. మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని.. అందులో బ్రెడ్ ముక్కలు, మిక్సీ పట్టుకున్న ధనియాలు–వెల్లుల్లి మిశ్రమం, పసుపు, పెరుగు, నిమ్మరసం వేసుకుని ముక్కలకు ఆ మిశ్రమం మొత్తం పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు పాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని.. అందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకుని దోరగా వేగిన తర్వాత ధనియాలు–వెల్లుల్లి మిశ్రమం పట్టించిన బ్రెడ్ ముక్కలను వేసుకుని 2 నిమిషాల పాటు గరిటెతో తిప్పుతూ ఉండాలి. అభిరుచిని బట్టి చివరిలో తాలింపు వేసుకుని కలియ తిప్పి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. (చదవండి: ఈ శాండ్విచ్ ధర వింటే..కళ్లు బైర్లు కమ్మడం ఖాయం! ) -
బెంగాల్ పాపులర్ స్వీట్ లవంగ్ లతిక ఎప్పుడైనా ట్రై చేశారా?
లవంగ్ లతిక తయారీకి కావల్సినవి: మైదా – ముప్పావు కప్పు; ఉప్పు – రుచికి సరిపడా; పంచదార – కప్పు; లవంగాలు – పన్నెండు; నెయ్యి – డీప్ఫ్రైకి సరిపడా. స్టఫింగ్ కోసం: కోవా తురుము – ముప్పావు కప్పు; బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులు – అరకప్పు; వేడిపాలు – అరటీస్పూను; కుంకుమ పువ్వు రేకులు – పావు టీస్పూను; పంచదార పొడి – పావు టీస్పూను; యాలకుల పొడి – అరటీస్పూను. తయారీ విధానమిలా: మైదాలో టేబుల్ స్పూను నెయ్యి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. కొద్దికొద్దిగా నీళ్లు చల్లుకుంటూ ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలి ∙పంచదారలో ఒకటిన్నర కప్పుల నీళ్లుపోసి మీడియం మంట మీద తిప్పుతూ సిరప్ తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ∙స్టఫింగ్ కోసం తీసుకున్న పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలో వేసి కలిపి పెట్టుకోవాలి.నానిన పిండిముద్దను ఉండలుగా చుట్టుకోవాలి. ఈ ఉండలను పూరీల్లా వత్తుకుని మధ్యలో రెండు రెండు టీస్పూన్ల స్టఫింగ్ను వేయాలి ∙ఇప్పుడు స్టఫింగ్ బయటకు రాకుండా రెండు పక్కలా పూరీని మూయాలి పూరీని తిరగేసి తెరచి ఉన్న మరోవైపుని కొద్దిగా తడిచేసి మూసివేయాలి. మడత ఊడి΄ోకుండా లవంగం గుచ్చాలి ఇలా అన్ని లతికలను తయారు చేసుకోవాలి. ఇప్పుడు సలల కాగుతోన్న నెయ్యిలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు డీప్ఫ్రై చేయాలి ∙చక్కగా వేగిన లతికలను టిష్యూపేపర్ మీద వేసుకోవాలి వీటిని తినాలనుకున్నప్పుడు పంచదార సిరప్ను వేడిచేసి దానిలో లతికలను వేసి పదిహేను నిమిషాలు ఉంచి, ఆ తరువాత సర్వ్ చేయాలి. -
మిల్లెట్స్తో హెల్దీగా కుకీస్.. పిల్లలు ఇష్టంగా తింటారు
ఊదల కుకీస్ తయారీకి కావల్సినవి: మైదా – 1 కప్పు, ఊదల పిండి – ఒకటిన్నర కప్పులు, బాదం పప్పు పొడి – ముప్పావు కప్పు సాల్టెడ్ బటర్, పీనట్ బటర్ – 100 గ్రా. చొప్పున చిక్కటి పాలు – కొద్దిగా, చాక్లెట్ క్రీమ్ – 1 కప్పు (చిప్స్ లేదా బిట్స్ని ఓవెన్లో కరిగించి పెట్టుకోవాలి) తయారీ విధానమిలా: మొదట పెద్ద బౌల్ తీసుకుని పటికబెల్లం పొడిని జల్లెడ పట్టుకోవాలి. అందులో సాల్టెడ్ బటర్, పీనట్ బటర్ వేసుకుని హ్యాండ్ బ్లెండర్తో బాగా బీట్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో ఊదల పిండి, బాదం పప్పు పొడి వేసుకుని చేత్తో ముద్దలా కలపాలి. అవసరాన్ని బట్టి.. సరిపడా గోరు వెచ్చని పాలు పోసి కలుపుకోవచ్చు. దీన్ని అరగంట పాటు ఫ్రిజ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత చేత్తో బిస్కట్స్లా ఒత్తుకుని, ప్రీ హీట్ చేసిన ఓవెన్లో 170 డిగ్రీల సెల్సియస్ వద్ద 20 లేదా 25 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అనంతరం... కరిగిన చాక్లెట్ క్రీమ్లో ముంచి తీసి, పైన చాక్లెట్ కోన్ సాయంతో నచ్చిన షేప్లో డిజైన్స్ వేసుకుని.. కాసేపు ఆరనిచ్చి సర్వ్ చేసుకోవాలి. -
సగ్గుబియ్యం టిక్కీ.. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు
సగ్గుబియ్యం టిక్కీ తయారీకి కావలసినవి: సగ్గుబియ్యం – కప్పు; వేయించిన పల్లీలు – కప్పు; బంగాళ దుంపలు – రెండు; అల్లం – రెండు అంగుళాల ముక్క; పచ్చిమిర్చి – రెండు; జీలకర్ర – టీస్పూను; కొత్తిమీర తరుగు – పావు కప్పు; నిమ్మకాయ – అరచెక్క; ఉప్పు – రుచికి సరిపడా. తయారీ విధానమిలా: సగ్గుబియ్యాన్ని దోరగా వేయించి, చల్లారాక పొడిచేసి పెట్టుకోవాలి ∙పల్లీలను బరకగా గ్రైండ్ చేసి సగ్గుబియ్యం పొడిలో కలపాలి. బంగాళ దుంపలను తొక్కతీసి ముక్కలుగా తరగాలి. ∙పచ్చిమిర్చి, అల్లం కూడా ముక్కలుగా తరగాలి. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర తరుగు వేసి గ్రైండ్ చేయాలి. నలిగిన మిశ్రమాన్నీ, సగ్గుబియ్యం పొడిలో వేసి, రుచికి సరిపడా ఉప్పు, నిమ్మచెక్కను పిండి రసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పదిహేను నిమిషాల తరువాత పిండిని టిక్కీల ఆకారంలో వత్తుకుని డీప్ఫ్రై చేస్తే సగ్గుబియ్యం టిక్కీలు రెడీ ∙కొత్తిమీర చట్నీతో ఈ టిక్కీలు చాలా రుచిగా ఉంటాయి. సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి -
చపాతీతో క్రిస్పీ రోల్స్.. వెరైటీగా చేసుకోండిలా
క్రిస్పీ రోల్స్ తయారీకి కావల్సినవి: చపాతీలు – మూడు ; కొత్తిమీర తరుగు – అరకప్పు ; ఉడికించిన బంగాళ దుంపలు – రెండు; కారం – అరటీస్పూను; ధనియాల పొడి – టీస్పూను; గరం మసాలా – రెండు టీస్పూన్లు ; పచ్చిమిర్చి – రెండు; ఉల్లిపాయ – ఒకటి; చాట్ మసాలా – ఒకటిన్నర టీస్పూన్లు; గోధుమ పిండి –అర కప్పు; బియ్యప్పిండి – స్పూను; కార్న్ఫ్లోర్ – మూడు టీ స్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – డీప్ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా: ►చపాతీలను సన్నగా పొడవుగా తరిగి, రుచికి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమంపై కొద్దిగా నీళ్లుచల్లి మరోసారి కలపాలి ∙ఇప్పుడు మెత్తగా మారిన చపాతీ మిశ్రమంలో కార్న్ఫ్లోర్, బియ్యప్పిండి కలిపి పక్కన పెట్టుకోవాలి. ∙ఉల్లిపాయ, పచ్చిమిర్చిని సన్నని ముక్కలుగా తరగాలి. ► బంగాళదుంపలు తొక్కతీసి చిదుముకోవాలి. దీనిలో ధనియాల పొడి, గరం మసాలా; పచ్చిమిర్చి, ఉల్లి తరుగు, ఛాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. ► ఇప్పుడు చేతులకు కొద్దిగా నూనె రాసుకుని దుంప మిశ్రమాన్ని రోల్స్గా చుట్టుకోవాలి గోధుమపిండిలో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా కలపాలి ∙ఇప్పుడు దుంపరోల్స్ను గోధుమపిండిలో ముంచి, తరువాత చపాతీ మిశ్రమాన్ని రోల్కు అద్దాలి. ► ఇప్పుడు రోల్ను మరుగుతోన్న నూనెలో వేసి, గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు వేయించి తీయాలి ∙ఇలా రోల్స్ అన్నింటిని వేయిస్తే క్రిస్పీ రోల్స్ రెడీ. -
ఫిష్ – చీజ్ బాల్స్.. టేస్ట్ అదిరిపోతుంది, ట్రై చేయండి
ఫిష్ – చీజ్ బాల్స్ తయారీకి కావల్సినవి: చేప ముక్కలు – పావు కిలో (మెత్తగా ఉడికించి, చల్లారాక మధ్యలో ముల్లు తొలగించి, పొడిపొడి తురుములా చేసుకోవాలి) బ్రెడ్ స్లైస్ – 8 లేదా 10 (నలువైపులా కట్ చేసుకుని పెట్టుకోవాలి) చీజ్ తురుము – 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్ పసుపు – కొద్దిగా, గరం మసాలా – 1 టీ స్పూన్, కోడిగుడ్లు – 2 బ్రెడ్ పౌడర్ – పావు కప్పు, చిక్కటి పాలు – కొన్ని, ఉప్పు – తగినంత నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించిన ఫిష్ తురుము, చీజ్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, గరం మసాలా వేసుకొని బాగా కలిపి ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్రతి బ్రెడ్ ముక్కను పాలలో నానబెట్టి.. గట్టిగా ఒత్తి.. అందులో కొద్దికొద్దిగా ఫిష్ మిశ్రమం పెట్టుకుంటూ బాల్లా చేసి, నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. -
చిలకడదుంపతో కేక్, ఎప్పుడైనా ట్రై చేశారా? టేస్ట్ బావుంటుంది
వాల్నట్ – స్వీట్పొటాటో కేక్ తయారీకి కావల్సినవి: చిలగడదుంప›– 1(పెద్దది, సుమారు 450గ్రాములు ఉండాలి.) వాల్నట్ – 100 గ్రాములు,పంచదార – 200 గ్రాములు బ్రౌన్ షుగర్ – 50గ్రాములు, వెజిటబుల్ నూనె – 120 మిల్లీలీటర్లు నీళ్లు – 80 మిల్లీలీటర్లు, గుడ్లు – 2, ఉప్పు – తగినంత మైదాపిండి – 220 గ్రాములు, బేకింగ్ పౌడర్ – 1 టీ స్పూన్ దాల్చినచెక్క పొడి – అర టీ స్పూన్,జాజికాయ పొడి – పావు టీ స్పూన్ తయారీ విధానమిలా: చిలగడ దుంపను సిల్వర్ పేపర్లో చుట్టి.. ఓవెన్లో బాగా బేక్ చేసుకుని.. చల్లారిన తర్వాత.. మెత్తగా చిదుముకోవాలి. అనంతరం ఒక బౌల్ తీసుకుని.. అందులో గుడ్లు, పంచదార, బ్రౌన్ షుగర్ వేసుకుని.. హ్యాండ్ బ్లెండర్తో మిక్స్ చేసుకోవాలి. తర్వాత నూనె, నీళ్లు పోసుకుని మరోసారి హ్యాండ్ బ్లెండర్తో బాగా కలుపుకోవాలి. ఇంతలో మరో బౌల్ తీసుకుని.. అందులో మైదాపిండి, బేకింగ్ పౌడర్, దాల్చిన చెక్క పొడి, ఉప్పు, జాజికాయ పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ మిశ్రమంలో మైదా మిశ్రమం కలిపి.. హ్యాండ్ బ్లెండర్తో మరోసారి కలపాలి. దానిలో చిలగడదుంప గుజ్జుని వేసుకుని.. బాగా కలిపి.. నచ్చిన షేప్లోని బేకింగ్ బౌల్ తీసుకుని.. అందులో ఈ మిశ్రమం మొత్తం పోసుకుని.. సమాంతరంగా పరచి ఓవెన్లో బేక్ చేసుకోవాలి. అనంతరం చాక్లెట్ బిట్స్, క్రీమ్స్తో నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. -
బనానా – ఓట్స్తో వెరైటీగా కజ్జికాయలు.. ఓసారి ట్రై చేయండి
బనానా – ఓట్స్ కజ్జికాయలు తయారీకి కావల్సినవి: అరటిపండు గుజ్జు – 1 కప్పు ఓట్స్ పౌడర్ – అర కప్పు (1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని దోరగా వేయించుకోవాలి) కొబ్బరి కోరు – పావు కప్పు పంచదార పొడి 2 టేబుల్ స్పూన్లు సోయా పాలు – పావు కప్పు నూనె – 4 టేబుల్ స్పూన్లు మైదాపిండి – 1 కప్పు, ఉప్పు – కొద్దిగా తయారీ విధానమిలా: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. అందులో కొబ్బరికోరు, ఓట్స్ పౌడర్ వేసుకుని దోరగా వేయించి.. అరటిపండు గుజ్జు, పంచదార పొడి వేసుకుని కలుపుతూ ఉండాలి. చివరిగా సోయా పాలు పోసుకుని తిప్పుతూ మూత పెట్టి చిన్న మంటపైన మగ్గనివ్వాలి. ఈలోపు మైదాపిండిలో 2 టేబుల్ స్పూన్ల నూనె, తగినంత ఉప్పు వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని ముద్దలా చేసుకుని పావు గంట పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఆ మిశ్రమంతో చిన్న చిన్న ఉండలు చేసుకుని చపాతీల్లా ఒత్తుకుని, మధ్యలో బనానా–ఓట్స్ మిశ్రమం పెట్టుకుని కజ్జికాయలుగా చుట్టుకోవాలి. వాటిని నూనెలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి నిలువ ఉండవు. -
రొయ్యలతో స్ప్రింగ్రోల్స్.. భలే రుచిగా ఉంటాయి
రొయ్యలు–పీనట్ రోల్స్ తయారీకి కావల్సినవి: రొయ్యలు – 15 లేదా 20 (పెద్దవి, శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. అభిరుచిని బట్టి తోక ఉంచుకోవచ్చు లేదా కట్ చేసుకోవచ్చు) స్ప్రింగ్రోల్ రేపర్స్ – 8 పైనే (మడతలు వేసుకుని.. క్రాస్గా ముక్కల్లా కట్ చేసుకోవాలి) టొమాటో సాస్ – 2 టేబుల్ స్పూన్లు చిల్లీ సాస్ – అర టీ స్పూన్ పీనట్ సాస్ –3 టేబుల్ స్పూన్లు తులసి ఆకులు – గుప్పెడు (తాజావి తీసుకుని కడిగి, చిన్నచిన్నగా తరిగి పెట్టుకోవాలి. అభిరుచిని బట్టి వాడుకోవచ్చు) నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా: ముందుగా రొయ్యల్లో టొమాటో సాస్, చిల్లీ సాస్, పీనట్ సాస్ అన్నీ వేసుకుని.. బాగా కలుపుకోవాలి. అనంతరం ఒక్కో స్ప్రింగ్రోల్ రేపర్స్ ముక్క పరచుకుని.. మధ్యలో రొయ్యను ఉంచుకుని.. తోక కిందకు వచ్చేలా చేసుకుని.. పైన తులసి ఆకు ముక్కలు కొద్దిగా వేసుకుని.. రోల్స్లా చుట్టుకోవాలి. చివరిగా తడి చేత్తో రేపర్స్ని ఒత్తి.. ఊడిపోకుండా నొక్కాలి. కాగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా వేసుకుని.. దోరగా వేయించి టొమాటో సాస్తో సర్వ్ చేసుకోవాలి. వీటిని వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి. -
నోరూరించే చిల్లీ పనీర్.. కెచప్తో తింటే అదిరిపోతుంది
చిల్లీ పనీర్ తయారీకి కావల్సినవి: పనీర్ – 250 గ్రా (చిన్న ముక్కలు లేదా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి) మొక్కజొన్న పిండి – 4 టేబుల్ స్పూన్లు మిరియాల పొడి – ముప్పావు టీ స్పూన్ మైదా పిండి – 5 టేబుల్ స్పూన్లు క్యాప్సికమ్ – 2 (పెద్దపెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి) ఉల్లిపాయ – 1 (పెద్దగా కట్ చేసుకోవాలి) ఉల్లికాడ ముక్కలు – పావు కప్పు, పండు మిర్చి – 4 లేదా 5 అల్లం ముక్కలు – 2 టీ స్పూన్లు వెల్లుల్లి రెబ్బలు – 4 (రెండేసి ముక్కలుగా చేసుకోవాలి) పచ్చిమిర్చి – 2 (నిలువుగా కట్ చేసుకోవాలి) టొమాటో కెచప్ – 1 టేబుల్ స్పూన్, తేనె – 1 టీ స్పూన్, సోయా సాస్ – 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం – 1 టీ స్పూన్, నీళ్లు – పావు కప్పు, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా తయారీ: ముందుగా బాగా మరిగిన వేడి నీళ్లల్లో పండుమిర్చి, 1 టీ స్పూన్ అల్లం వేసుకుని 10 నిమిషాలు నానబెట్టి పక్కనే పెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత ఆ నీళ్లతోనే మిక్సీలో పేస్ట్లా చేసుకోవాలి. ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి, 2 టేబుల్ స్పూన్ల చిక్కటి పాలు పోసుకుని బాగా కలిపి ఉంచుకోవాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకుని.. అందులో మైదాపిండి, 3 టేబుల్ స్పూన్ల మొక్కజొన్న పిండి, పావు టీ స్పూన్ మిరియాల పొడి, తగినంత ఉప్పు, అర టీ స్పూన్ నూనె వేసుకుని, కొద్దిగా నీళ్లు పోసుకుని చిక్కగా పేస్ట్లా చేసుకోవాలి. దానిలో పనీర్ ముక్కలు ముంచి నూనెలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అనంతరం మరో కళాయిలో 2 టీ స్పూన్ల నూనె వేసుకుని వేడి కాగానే 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుని కొద్దిగా వేగాక.. పండుమిర్చి మిశ్రమాన్ని వేసుకోవాలి. వెంటనే ఆ మిక్సీ బౌల్లో కొద్దిగా నీళ్లు పోసుకుని అటూ ఇటూ కలిపి ఆ వాటర్ కూడా పోసుకోవాలి. అనంతరం గరిటెతో మధ్యమధ్యలో తిప్పుతూ, నూనె వేరుపడేవరకూ ఉడికించి, ఆ మిశ్రమాన్ని బౌల్లోకి తీసి పక్కనపెట్టుకోవాలి. అదే కళాయిలో 1 టీ స్పూన్ నూనె వేసుకుని.. పెద్ద మంట మీద ఉల్లిపాయ ముక్కలను లైట్గా వేయించాలి. తర్వాత అందులో క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని తిప్పుతూ ఉండాలి. అదే మంట మీద బాగా ఎక్కువగా కాకుండా ఓ మాదిరిగా ఉడికిన క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కల్లో.. పక్కన పెట్టుకున్న పండుమిర్చి మిశ్రమంతో పాటు.. తేనె వేసుకుని తిప్పుతూ ఉండాలి. నిమిషం తర్వాత నిమ్మరసం, సోయా సాస్, కొద్దిగా నీళ్లు పోసుకుని బాగా తిప్పాలి. తర్వాత మొక్కజొన్న పిండి–పాల మిశ్రమాన్ని వేసుకుని తిప్పాలి. ఇక అదంతా క్రీమ్లా మారగానే టొమాటో కెచప్, ఉల్లికాడ ముక్కలు, పనీర్ ముక్కలు వేసుకుని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. -
పైనాపిల్ తో నోరూరించే స్వీట్
కావలసినవి: అనాసకాయ ముక్కలు – 3 కప్పులు (మెత్తగా గుజ్జులా చేసుకుని, వడకట్టుకోవాలి) జీడిపప్పు – పావు కప్పు (నానబెట్టి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి) పంచదార పొడి – అర కప్పు చిక్కటి పాలు – 3 కప్పులు కొబ్బరి పొడి – అర కప్పు (అభిరుచిని బట్టి) ఫుడ్ కలర్ – కొద్దిగా (నచ్చిన కలర్) ఏలకుల పొడి – అర టీ స్పూన్ డ్రైఫ్రూట్స్ ముక్కలు – కొద్దిగా తయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, పాత్రలో పాలు పోసుకుని, గరిటెతో తిప్పుతూ.. చిన్న మంటపైన కాచాలి. తర్వాత అనాస గుజ్జు, జీడిపప్పు పేస్ట్, కొబ్బరి పొడి వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. కాస్త దగ్గర పడిన తర్వాత పంచదార, ఏలకుల పొడి, ఫుడ్ కలర్ వేసుకుని బాగా కలుపుకుని.. దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత నచ్చిన షేప్లో బర్ఫీలు చేసుకుని.. డ్రైఫ్రూట్స్ ముక్కలతో వాటిపై ఒత్తుకుని సర్వ్ చేసుకోవాలి. (చదవండి: సాయంత్రం స్నాక్స్ గా చిలకడదుంప బజ్జీలు) -
సాయంత్రం స్నాక్స్ గా చిలకడదుంప బజ్జీలు
కావలసినవి: చిలగడదుంప గుజ్జు – ఒకటిన్నర కప్పులు పచ్చిమిర్చి ముక్కలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు – అర టీ స్పూన్ చొప్పున ఉల్లిపాయముక్కలు – 1 టేబుల్ స్పూన్ (చిన్నగా కట్ చేసుకోవాలి) బఠాణీలు – పావు కప్పు (నానబెట్టినవి) ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు గరం మసాలా – 1 టీ స్పూన్ కరివేపాకు తురుము, కొత్తిమీర తురుము – కొద్దికొద్దిగా శనగపిండి – పావు కప్పు బియ్యప్పిండి – 3 టేబుల్ స్పూన్లు బేకింగ్ సోడా, కారం – 1 టీ స్పూన్ చొప్పున నీళ్లు – సరిపడా, నూనె – డీప్ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా పాన్ లో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకుని.. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని దోరగా వేయించుకోవాలి. అందులో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బఠాణీలు, చిలగడదుంప గుజ్జు, తగినంత ఉప్పు, పసుపు, గరం మసాలా, కరివేపాకు తురుము, కొత్తిమీర తురుము వేసుకుని గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారనివ్వాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకుని శనగపిండి, బియ్యప్పిండి, బేకింగ్ సోడా, కారం వేసుకుని సరిపడా నీళ్లు పోసుకుని పలుచగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. చిలగడదుంప–గరం మసాలా మిశ్రమాన్ని నిమ్మకాయ సైజ్లో బాల్స్లా చేసుకుని.. వాటిని శనగపిండి మిశ్రమంలో బాగా ముంచి, బజ్జీల్లా.. కాగుతున్న నూనెలో డీప్ఫ్రై చేసుకోవాలి. (చదవండి: కొత్త టెక్నిక్ తో రుచికరమైన వంటలు.. ) -
మటన్ కీమాతో పాలక్ సమోసా.. భలే రుచిగా ఉంటాయి
కీమా పాలక్ సమోసా తయారీకి కావల్సినవి: కీమా – పావు కప్పు (మసాలా, ఉప్పు వేసి, మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి), క్యారెట్ తురుము – పావు కప్పు సోయా సాస్, టొమాటో సాస్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్ల చొప్పున మైదా పిండి – 2 కప్పులు, గోధుమ పిండి – 1 కప్పు మిరియాల పొడి – 1 టీ స్పూన్, పాలకూర గుజ్జు– ఒకటిన్నర కప్పులు (చపాతి ముద్ద కోసం), ఫుడ్ కలర్ – ఆకుపచ్చ రంగు (అభిరుచిని బట్టి పాలకూరలో కలిపి పెట్టుకోవాలి), ఉప్పు – తగినంత, నూనె – సరిపడా తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్ తీసుకుని, అందులో క్యారెట్ తురుము, మిరియాల పొడి, కీమా, సోయా సాస్, టొమాటో సాస్, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో బౌల్లో మైదా పిండి, గోధుమ పిండి, అర టేబుల్ స్పూన్ నూనె, పాలకూర గుజ్జు, కొద్దిగా ఉప్పు వేసుకుని.. అవసరమైతే కాసిన్ని నీళ్లు కలుపుతూ చపాతీ ముద్దలా చేసుకోవాలి. అనంతరం ఆ ముద్దపైన తడిబట్ట కప్పి, అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని, ఆ ఉండల్ని చపాతీలా ఒత్తి, సమోసాలా చుట్టి అందులో కీమా మిశ్రమాన్ని పెట్టి ఫోల్డ్ చెయ్యాలి. వాటిని కాగిన నూనెలో వేయించి తీస్తే... భలే రుచిగా ఉంటాయి. -
క్యారట్తో వెరైటీగా పరియాళ్ చేసుకోండిలా
క్యారట్ పరియాళ్ తయారీకి కావల్సినవి: క్యారట్ ముక్కలు – కప్పున్నర; నూనె – రెండు టేబుల్ స్పూన్లు; ఆవాలు – పావు టీస్పూను; జీలకర్ర – పావు టీస్పూను; ఎండు మిర్చి – రెండు; కరివేపాకు – రెండు రెమ్మలు; ఉల్లిపాయ – ఒకటి (సన్నగా తరగాలి); పచ్చిమిర్చి చీలికలు – మూడు; ఉప్పు – అరటీస్పూను; పసుపు – అర టీస్పూను; ఇంగువ – చిటికడు; పచ్చికొబ్బరి తురుము – పావు కప్పు. తయారీ విధానమిలా: ∙క్యారట్ ముక్కలను మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి ∙మందపాటి బాణలిలో నూనెవేసి కాగనివ్వాలి ∙వేడివేడి నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చివేసి చిటపటలాడనివ్వాలి ∙ఇవి వేగాక కరివేపాకు ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి వేసి తిప్పాలి ∙ఐదునిమిషాలు మగ్గాక పసుపు, ఇంగువ వేసి కలపాలి ∙ఇప్పుడు ఉడికించిన క్యారట్ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కొబ్బరి తురుము వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి ∙నూనె పైకి తేలిన తరువాత దించేసి సర్వ్చేసుకోవాలి. -
స్నాక్స్ కోసం టేస్టీ చెగోడీలు.. ఇలా చేసుకోండి
అటుకుల చెగోడీలీకు కావల్సిన పదార్థాలు: అటుకులు – అర కప్పు,పుట్నాల పప్పు – పావు కప్పు బియ్యప్పిండి – 1 కప్పు,నెయ్యి – 1 టేబుల్ స్పూన్ నీళ్లు – 1 కప్పు+ఇంకొన్ని,కారం – 1 టీ స్పూన్ ఉప్పు – తగినంత,వాము – అర టీ స్పూన్ నువ్వులు – 2 టీ స్పూన్లు,ఇంగువా – పావు టీ స్పూన్ నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా: ముందుగా అటుకులు, పుట్నాల పప్పును మిక్సీలో వేసుకుని మెత్తటి పొడిలా చేసుకుని జల్లెడ పట్టుకోవాలి. అందులో బియ్యప్పిండి కూడా జల్లెడ పట్టి, ఆ రెండిటినీ బాగా కలపాలి. అనంతరం స్టవ్ ఆన్ చేసుకుని, చిన్న మంట మీద ఆ మొత్తం పిండిని దోరగా వేయించి, అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేశాక కూడా మరోసారి గరిటెతో కలిపి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత అందులో కారం, ఉప్పు, నువ్వులు, వాము, ఇంగువా వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. ఈలోపు బియ్యప్పిండి తీసుకున్న కప్పుతోనే నీళ్లనూ తీసుకుని, వేడి చేసి.. ఈ మిశ్రమంలో పోసుకుని గరిటెతో అటూ ఇటూగా కలపాలి. తర్వాత చల్లారే వరకు ఓ పది నిమిషాలు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆపైన కొద్దికొద్దిగా నీళ్లు చిలకరిస్తూ.. చిన్నచిన్న ఉండల్లా తీసుకుని.. చెగోడీలు చేసుకుని.. నూనెలో దోరగా వేయించుకోవాలి. -
దానిమ్మతో కేక్ టేస్ట్ అదిరిపోతుంది.. వీకెండ్లో ట్రై చేయండి
దానిమ్మ రైస్ కేక్ తయారీకి కావల్సినవి: అన్నం – 2 కప్పులు దానిమ్మ గింజలు – అర కప్పు పైనే కొబ్బరి కోరు – 2 టేబుల్ స్పూన్లు అరటి పండు గుజ్జు – 4 టేబుల్ స్పూన్లు పాలు – పావు లీటర్ పంచదార – 1 కప్పు నెయ్యి – 1 లేదా 2 టీ స్పూన్లు దాల్చిన చెక్కపొడి – గార్నిష్కి సరిపడా తయారీ విధానమిలా: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, కళాయిలో పాలు, పంచదార వేసి, పంచదార కరిగేవరకు తిప్పుతూ మరిగించాలి. ఆ మిశ్రమంలో అరటి పండు గుజ్జు, కొబ్బరికోరు వేసి మరోసారి కలుపుకోవాలి. చివరిగా అన్నం వేసి బాగా తిప్పి.. కాస్త దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అనంతరం నచ్చిన షేప్లో ఉండే చిన్నచిన్న బౌల్స్ తీసుకుని, వాటికి నూనె లేదా నెయ్యి రాసి.. ఆ మిశ్రమాన్ని కొంచెం కొంచెం వేసుకుని, సమాతరంగా ఒత్తుకుని.. గట్టిపడనివ్వాలి. వాటిపై దాల్చిన చెక్క పొడి, దానిమ్మ గింజలు వేసుకుని సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది. -
క్యారట్ చికెన్ మఫిన్స్.. చిన్న పిల్లలు ఇష్టం తింటారు
క్యారట్ చికెన్ కప్స్ తయారీకి కావల్సినవి: క్యారట్ తురుము – కప్పు; వెల్లుల్లి తురుము – పావు కప్పు; బాదం పప్పు పొడి – ముప్పావు కప్పు; చీజ్ తురుము – ముప్పావు కప్పు; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను; గుడ్డు – ఒకటి; చికెన్ ఖీమా – అరకప్పు; ఉప్పు, మిరియాల పొడి – రుచికి సరిపడా తయారీ విధానమిలా: పెద్ద గిన్నెలో క్యారట్, వెల్లుల్లి, చీజ్ తురుములు, కొత్తిమీర చికెన్ ఖీమా, రుచికిసరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి ∙చివరిగా గుడ్డుసొనను కూడా వేసి కలపాలి ∙ఈ మిశ్రమాన్ని మఫిన్ ట్రేలో వేసి ఇరవై నిమిషాల పాటు బేక్ చేయాలి ∙గోల్డెన్ బ్రౌన్ కలర్లో క్రిస్పీగా మారితే చికెన్ క్యారట్ కప్స్ రెడీ. -
కొత్తిమీరతో గ్రీన్ దోశ.. టేస్ట్తో పాటు హెల్తీ కూడా
గ్రీన్ దోశ తయారీకి కావల్సినవి: బియ్యం – కప్పు; మినప పప్పు – కప్పు: మెంతులు – టీస్పూను; కొత్తిమీర – కప్పు; పుదీనా – కప్పు; కరివేపాకు – అరకప్పు; జీలకర్ర – అరటీస్పూను; వాము – చిటికెడు; ఉల్లిపాయ – ఒకటి; పచ్చిమిర్చి – నాలుగు; ఉప్పు – టీస్పూను; నూనె –పావు కప్పు. తయారీ విధానమిలా: ∙బియ్యం, మినపపప్పు, మెంతులను శుభ్రంగా కడిగి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి ∙నానాక వీటన్నింటినీ గ్రైండర్లో వేసి రుబ్బుకోవాలి ∙సగం మెదిగిన తరువాత అందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను వేయాలి ∙అవసరాన్ని బట్టి నీళ్లు చల్లుకుంటూ పిండిని మెత్తగా రుబ్బుకోవాలి ∙చక్కగా మెదిగిన పిండిని గిన్నెలో తీసుకుని అందులో ఉప్పు, జీలకర్ర, వాము కలపాలి ∙కాలిన పెనంపైన పిండిని దోశలా పోసుకుని కొద్దిగా నూనె వేయాలి ∙రెండువైపులా చక్కగా కాల్చుకుంటే ఎంతో రుచికరమైన గ్రీన్ దోశ రెడీ. -
గోంగూరతో మిర్చి.. బజ్జీ ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా?
గోంగూర బజ్జీ కావలసినవి: తాజా గోంగూర – కప్పు; సెనగపిండి – కప్పు; బియ్యప్పిండి – మూడు టేబుల్ స్పూన్లు; కారం – టీస్పూను; పసుపు –పావు టీస్పూను; ఇంగువ – చిటికెడు; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – పావు కేజీ. తయారీ విధానమిలా: ∙గోంగూరను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ∙సెనగపిండిలో బియ్యప్పిండి, ఇంగువ, కారం, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి ∙కొద్దిగా నీళ్లు పోసి చిక్కగా కలుపుకోవాలి. చివరిగా టేబుల్ స్పూన్ నూనె వేసి కలపాలి ∙ఇప్పుడు గోంగూర ఆకులను ఈ పిండిలో ముంచి మరుగుతోన్న నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్లోకి మారేంత వరకు వేయించి తీసేయాలి ∙నూనె ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే బజ్జీలను టిష్యూ పేపర్ మీద వేసి, నూనెను పేపర్ పీల్చుకున్న తరువాత సర్వ్ చేసుకోవాలి. -
గుడ్డుతో భలే వెరైటీలు.. ఎగ్ ఫింగర్స్ ఎప్పుడైనా ట్రై చేశారా?
ఎగ్ ఫింగర్స్ తయారికి కావల్సినవి: గుడ్లు – 4, మిరియాల పొడి – 1 టీ స్పూన్ ఉప్పు – తగినంత, మైదా పిండి – పావు కప్పు చాట్ మసాలా, కారం – పావు టీ స్పూన్ చొప్పున బ్రెడ్ పౌడర్ – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్లో మూడు గుడ్లు పగలగొట్టి.. అందులో అర టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని బాగా కలిపి.. ఆ మిశ్రమాన్ని చతురస్రాకారపు పాత్రకు నూనె రాసి.. దానిలో వేసుకుని.. స్టీమ్ చేసుకోవాలి. అనంతరం దాన్ని నచ్చిన షేప్లో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంతలో ఒక చిన్న పాత్రలో మిగిలిన గుడ్డు పగలగొట్టి, స్పూన్తో గిలకొట్టి పెట్టుకోవాలి. మరో పాత్రలో మైదా పిండి, చాట్ మసాలా, కారం వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇంకో చిన్న పాత్రలో బ్రెడ్ పౌడర్ వేసుకుని.. ఒక్కో ముక్కను మొదట మైదా మిశ్రమంలో.. తర్వాత గుడ్డు మిశ్రమంలో ముంచి అటూ ఇటూ తిప్పి.. బ్రెడ్ పౌడర్ పట్టించి.. నూనెలో దోరగా వేయించుకోవాలి. వీటిని టొమాటో సాస్తో తింటే భలే రుచిగా ఉంటాయి. -
మహారాష్ట్ర పాపులర్: రొయ్యలతో పోహా, భలే రుచిగా ఉంటుంది
ప్రాన్స్ పోహ తయారీకి కావల్సినవి: కావలసినవి: రొయ్యలు – 10 (మీడియం సైజ్ లేదా పెద్దవి.. తల, తోక తొలగించి.. శుభ్రం చేసుకోవాలి) అటుకులు – 3 కప్పులు (నీళ్లల్లో కడిగి.. నీళ్లు పోయేలా వడకట్టుకోవాలి), ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు (చిన్నగా కట్ చేసుకోవాలి), బంగాళదుంప›– 1 (తొక్క తీసి చిన్న చిన్న ముక్కలు తరగాలి), పచ్చి బఠాణీ – అర కప్పు (నానబెట్టి, ఉడికించుకోవాలి) వేరుశనగలు – అర కప్పు, అల్లం తురుము – అర టీ స్పూన్ కొబ్బరి కోరు – 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తురుము – కొద్దిగా కరివేపాకు – కొద్దిగా, ఆవాలు – 1 టీ స్పూన్ పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత నూనె – 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి – 1 టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు – పావు టీ స్పూన్ తయారీ విధానమిలా: ముందుగా నూనెలో ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము వేసుకుని.. అర నిమిషం పాటు గరిటెతో తిప్పుతూ.. దోరగా వేయించుకోవాలి. అందులో వేరుశనగలు, బంగాళదుంప ముక్కలు వేసుకుని తిప్పుతూ ఉడికించుకోవాలి. బంగాళదుంప ఉడికిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తిప్పాలి. తర్వాత రొయ్యలు, బఠాణీలు వేసుకుని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. పసుపు వేసుకోవాలి. ఉప్పు రొయ్యలు ఉడికాక.. కొబ్బరి కోరు, కొత్తిమీర తురుము వేసుకుని తిప్పాలి. ఇక చివరిగా అటుకులు వేసి ఇటూ అటూ గరిటెతో తిప్పాలి. అనంతర స్టవ్ ఆఫ్ చేసుకుని.. వేడివేడిగా ఉన్నప్పుడే కొద్దిగా అల్లం ముక్కను తురిమి.. నిమ్మకాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుందీ డిష్. -
క్యారట్ డిలైట్.. హెల్తీ అండ్ టేస్టీగా ఇలా చేసుకోండి
క్యారట్ డిలైట్ తయారీకి కావల్సినవి: క్యారట్స్ – అరకేజీ; పంచదార – అరకప్పు; కార్న్ఫ్లోర్ – పావు కప్పు; నీళ్లు – కప్పు; నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు; ఎండుకొబ్బరి తురుము – గార్నిష్కు సరిపడా. తయారీ విధానమిలా: క్యారట్ తొక్కతీసి శుభ్రంగా కడిగి ముక్కలు తరగాలి ∙ముక్కలు మునిగే అన్ని నీళ్లు పోసి రెండు విజిల్స్ రానిచ్చి, చల్లారనివ్వాలి.ముక్కలు చల్లారాక పేస్టులా గ్రైండ్ చేయాలి ∙మెత్తని పేస్టుని వడగట్టాలి ∙వడగట్టిన పేస్టులో పంచదార, కార్న్ఫ్లోర్, నీళ్లు వేసి కలపాలి. మిశ్రమాన్ని చక్కగా కలిపిన తరువాత మందపాటి బాణలిలో వేయాలి ∙మీడియం మంట మీద తిప్పుతూ ఉడికించాలి.మిశ్రమం చిక్కబడినప్పుడు నెయ్యి వేసి తిప్పాలి ∙అడుగంటుతున్నప్పుడు తీసి నెయ్యి రాసిన ప్లేటులో సమానంగా పోయాలి ∙గంట తరువాత నచ్చిన ఆకారంలో ముక్కలు కోసి, కొబ్బరి తురుము అద్దుకుని సర్వ్ చేసుకోవాలి. -
బ్రేక్ఫాస్ట్ కోసం సేమియా పనియారం.. రెసిపి ఇలా చేసుకోండి
సేమియా పనియారం తయారీకి కావల్సినవి: సేమియా – 1 కప్పు, రవ్వ – అర కప్పు పెరుగు – 1 కప్పు, కొబ్బరి పాలు – పావు కప్పు, ఉప్పు – రుచికి సరిపడా కొత్తిమీర తురుము – 1 టీస్పూన్, పచ్చిమిర్చి – 2 (సన్నగా తరిగినవి) కరివేపాకు – కొద్దిగా (చిన్నగా తురుమాలి), క్యారెట్ తురుము – 3 టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, పసుపు – అర టీ æస్పూన్, నూనె – సరిపడా నీళ్లు – చాలినన్ని, నెయ్యి – 1 టీస్పూన్ తయారీ విధానమిలా: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. కళాయిలో నెయ్యి వేడి చేసుకుని అందులో సేమియా, రవ్వను దోరగా వేయించుకోవాలి. పెరుగు, ఉప్పు వేసుకుని గరిటెతో తిప్పుతూ.. ఉడికించాలి. అనంతరం కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ తురుము వేసుకుని.. కొద్దిగా నీళ్లు పోసుకుని తిప్పుతూ ఉండాలి. పసుపు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు తురుము, కొబ్బరి పాలు, ఒక కప్పు నీళ్లు పోసుకుని బాగా ఉడికించుకోవాలి. తర్వాత పొంగనాల పెనం తీసుకుని.. ప్రతి గుంతలో కొద్దికొద్దిగా నూనె పోసుకుని.. గుంత గరిటె సాయంతో సేమియా మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇరువైపులా దోరగా వేగిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. అంతే బ్రేక్ఫాస్ట్కి ఈ రెసిపి చక్కగా సరిపోతుంది. -
బీట్రూట్తో హెల్తీగా చీజ్ కేక్.. టేస్ట్ చేస్తే అస్సలు వదిలిపెట్టరు
బీట్రూట్ చీజ్ కేక్ తయారీకి కావల్సినవి: వాల్నట్స్ – 150 గ్రాములు ఎండు అంజీరాలు – 8, దాల్చినచెక్క పొడి – అర టీ స్పూన్ ఉప్పు – చిటికెడు, బీట్రూట్ తురుము – 300 గ్రాములు కోకోనట్ చీజ్ – 200 గ్రాములు కోకో పౌడర్, కొబ్బరి నూనె, నెయ్యి, మేపుల్ సిరప్ (మార్కెట్లో దొరుకుతుంది) – 4 టేబుల్ స్పూన్ల చొప్పున బాదం పాలు – 2 టేబుల్ స్పూన్లు, పిస్తా పొడి – 3 టేబుల్ స్పూన్లు తయారీ విధానమిలా: ముందుగా వాల్నట్స్ని మిక్సీ పట్టుకోవాలి. అందులో ఎండు అంజీరాలు, దాల్చిన చెక్క పొడి, 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని.. నెయ్యి కలిపి, పక్కన పెట్టుకోవాలి. అనంతరం బీట్ రూట్ తురుము, కోకోనట్ చీజ్, బాదం పాలు, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, 2 టేబుల్ స్పూన్ల మేపుల్ సిరప్ వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక కేక్ ట్రేలో ముందు వాల్నట్ మిశ్రమాన్ని .. దానిపైన బీట్రూట్ మిశ్రమాన్ని పరచి.. కాస్త ఆరి, గట్టిపడిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకునే ముందు.. మిగిలిన కోకో పౌడర్, కొబ్బరి నూనె, మేపుల్ సిరప్ వేసుకుని బాగా కలిపి.. కోన్ మాదిరి కవర్లో చుట్టి.. నచ్చిన డిజైన్లో కేక్ ముక్కలపై గార్నిష్ చేసుకుని.. వాటిపై పిస్తా పొడిని జల్లుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. -
కోకోనట్ చికెన్ ఫ్రై.. భలే రుచిగా ఉంటుంది
కోకోనట్ చికెన్ తయారీకి కావల్సినవి: చికెన్ – అర కిలో మొక్కజొన్న పిండి – పావు కప్పు కొబ్బరి కోరు – అర కప్పు నూనె – సరిపడా, ఉప్పు – తగినంత మిరియాల పొడి – కొద్దిగా కారం – 1 టీ స్పూన్ గుడ్లు – 3 తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్లో మొక్కజొన్న పిండి, మిరియాల పొడి, కారం, కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. మరో బౌల్లో గుడ్లు కొట్టి, 2 టీ స్పూన్ల కొబ్బరి పాలు పోసుకుని, బాగా గిలగ్గొట్టి పెట్టుకోవాలి. ఇంకో బౌల్లోకి కొబ్బరి కోరు తీసుకోవాలి. ముందుగా ఒక్కో చికెన్ ముక్కను మొక్కజొన్న పిండిలో వేసి బాగా పట్టించాలి. తర్వాత దాన్ని గుడ్డు మిశ్రమంలో ముంచి వెంటనే కొబ్బరి కోరు పట్టించాలి. అనంతరం వాటిని నూనెలో దోరగా వేయించి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే.. ఈ కోకోనట్ చికెన్ ముక్కలు భలే రుచిగా ఉంటాయి. -
అరటికాయతో బజ్జీలు కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి!
కావలసినవి: అరటికాయలు – 2 (మీడియం సైజువి, ముందుగా ఉడికించి, తొక్క తీసి, చల్లారాక మధ్యలో గింజల భాగం తొలగించి, మెత్తగా గుజ్జులా చేసుకోవాలి) అటుకులు – అర కప్పు (కొన్ని నీళ్లల్లో నానబెట్టి, పేస్ట్లా చేసుకోవాలి), కొత్తిమీర తరుగు – కొద్దిగా జొన్నపిండి – పావు కప్పు, జీలకర్ర – అర టీ స్పూన్ జీడిపప్పులు – 10 (నానబెట్టి పేస్ట్లా చేసుకోవాలి) చాట్ మసాలా – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్ పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు – కొద్దికొద్దిగా (అభిరుచిని బట్టి) నూనె – సరిపడా. ఉప్పు – తగినంత తయారీ: ముందుగా అరటికాయ గుజ్జు, అటుకుల పేస్ట్ వేసుకుని దానిలో కారం, చాట్ మసాలా, జొన్నపిండి, తగినంత ఉప్పు, జీలకర్ర, జీడిపప్పు పేస్ట్, కొత్తిమీర తరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఇతర కూరగాయల తురుము వంటివి కలుపుకోవచ్చు. అనంతరం ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి ఫింగర్స్లా, పొడవుగా చిత్రంలో ఉన్న విధంగా ఒత్తుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి. వాటిని వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. (చదవండి: దేశ దేశాల నామాయణం! పేర్లు మార్చకున్న దేశాలు ఇవే! ) -
వీకెండ్ స్పెషల్: క్యారట్ చట్నీ.. సింపుల్గా ఇలా చేసుకోండి
క్యారట్ చట్నీ తయారీకి కావల్సినవి: నూనె – టీస్పూను; పచ్చిమిర్చి – ఆరు; వెల్లుల్లి రెబ్బలు – రెండు; అల్లం తరుగు – టీస్పూను; చింతపండు – గోలీకాయంత; క్యారట్ – మీడియంసైజు మూడు; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; వేయించిన వేరుశనగ గింజలు – రెండు టేబుల్ స్పూన్లు; పచ్చికొబ్బరి తురుము – టేబుల్ స్పూను;జీలకర్ర – టీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా తాలింపు కోసం: నూనె – టీస్పూను; ఆవాలు – టీస్పూను; జీలకర్ర – టీస్పూను; మినపప్పు – అరటీస్పూను; పచ్చిశనగపప్పు – అరటీస్పూను; ఎండుమిర్చి – రెండు; ఇంగువ – చిటికెడు; కరివేపాకు – రెమ్మ. తయారీ విధానమిలా: ∙బాణలిలో నూనెవేసి పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపేస్టు వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి ∙ఇవన్నీ వేగిన తరువాత చింతపండు వేసి నిమిషం తర్వాత దించేయాలి ∙ఇదే బాణలిలో క్యారట్, కొత్తిమీర తరుగు, కరివేపాకు వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి ∙ఇప్పుడు వేయించిన పచ్చిమిర్చి మిశ్రమం, క్యారట్ తురుము, వేరుశనగ గింజలు, కొబ్బరి తురుము, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పువేసి గ్రైండ్ చేయాలి ∙చట్నీ మెత్తగా గ్రైండ్ చేసాక... తాలింపు దినుసులతో తాలింపు పెట్టి చట్నీలో వేయాలి ∙ఈ క్యారట్ చట్నీ ఇడ్లీ, దోశ, రోటి, అన్నంలోకి మంచి కాంబినేషన్. -
కీమాతో చీజ్ పఫ్స్.. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు
కీమా – చీజ్ పఫ్స్ తయారీకి కావల్సినవి: మటన్ కీమా – 400 గ్రాములు,చీజ్ తురుము – 4 టేబుల్ స్పూన్లు నూనె – 2 టేబుల్ స్పూన్లు,ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు వెల్లుల్లి పొడి, పసుపు, జీలకర్ర – 1 టీ స్పూన్ చొప్పున ఉప్పు – తగినంత,మసాలా పొడి – 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు – 1 టేబుల్ స్పూన్,కొత్తిమీర తరుగు – కొద్దిగా పఫ్ పేస్ట్రీ షీట్ – 1(మందంగా ఉండేది, లేదా షీట్స్ చిన్నచిన్నవి 4 లేదా 5 మార్కెట్లో దొరుకుతాయి) గుడ్డు – 1(ఒక బౌల్లో పగలగొట్టి.. కొద్దిగా పాలు కలిపి పెట్టుకోవాలి) నల్ల నువ్వులు – 1 టీ స్పూన్ పైనే(గార్నిష్కి) తయారీ విధానమిలా: ముందుగా నూనెలో 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ ముక్కలు వేసుకుని.. దోరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి పొడి, కీమా వేసుకుని.. మూతపెట్టి బాగా ఉడికించుకోవాలి. అందులో పసుపు, మసాలా పొడి, జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసుకుని.. గరిటెతో బాగా కలిపి.. బాగా ఉడకనివ్వాలి. అనంతరం పఫ్ పేస్ట్రీ షీట్లో కీమా మిశ్రమాన్ని నింపుకుని.. దానిపైన ఉల్లిపాయ ముక్కలు, చీజ్ తురుము, కొద్దిగా కొత్తిమీర తురుము వేసుకుని ఊడిపోకుండా తడి చేత్తో గట్టిగా ఒత్తాలి. దానిపైన గుడ్డు–పాల మిశ్రమాన్ని బ్రష్తో బాగా రాసి.. నువ్వులతో గార్నిష్ చేసి బేక్ చేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే కొత్తిమీర తురుము జల్లి సర్వ్ చేసుకోవాలి. అభిరుచిని బట్టి చిన్న చిన్న పఫ్ పేస్ట్రీ షీట్స్లో కూడా కీమా, చీజ్, ఉల్లిపాయ ముక్కల మిశ్రమాన్ని ఉంచి.. త్రిభుజాకారంలో పఫ్స్ చుట్టుకోవచ్చు. -
క్యారట్తో మూంగ్దాల్ సలాడ్, ఓసారి ట్రై చేయండి
పచ్చిగా, కచ్చాపచ్చాగా, ఉడికించి... ఎలా తిన్నా టేస్టీగానే ఉంటుంది క్యారట్.aఅందుకే కరకరల క్యారట్ను మరింత రుచిగా ఇలా కూడా వండుకోవచ్చని చెబుతోంది ఈ వారం వంటిల్లు... క్యారట్ మూంగ్దాల్ సలాడ్ తయారీకి కావల్సినవి: క్యారట్ తురుము – కప్పు; పెసరపప్పు –పావు కప్పు; పచ్చికొబ్బరి తురుము – రెండు టేబుల్ స్పూన్లు; పచ్చిమిర్చి తరుగు – రెండు టీస్పూన్లు; నిమ్మరసం – రెండు టీస్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను. తయారీ విధానమిలా: పెసరపప్పుని శుభ్రంగా కడిగి గంటసేపు నానబెట్టుకోవాలి.నానిన పప్పులో నీళ్లు వంపేసి పప్పుని పెద్ద గిన్నెలో వేయాలి ∙ఈ పప్పులో క్యారట్ తురుము, కొబ్బరి, పచ్చిమిర్చి తురుము, నిమ్మరసం, ఉప్పువేసి చక్కగా కల΄ాలి ∙చివరిగా కొత్తిమీర తరుగుతో వేసి సర్వ్చేసుకోవాలి. -
అలోవెరాతో ఐస్క్రీమ్.. ఎప్పుడైనా తిన్నారా?
అలోవెరా ఐస్క్రీమ్ తయారీకి కావల్సినవి: కలబంద ముక్కలు – పావు కప్పు, పండిన కర్బూజా ముక్కలు – అర కప్పు కీర దోస –1(తొక్క తీసి, ముక్కలుగా చేసుకోవాలి) పుదీనా ఆకులు – 8 మిల్క్మెయిడ్ – అర కప్పు, మ్యాపుల్ సిరప్ – 1 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ – 1 కప్పు (ఇవి మార్కెట్లో దొరుకుతాయి), ఫుడ్ కలర్ – గ్రీన్ కలర్ (అభిరుచిని బట్టి) తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్లో ఫ్రెష్ క్రీమ్ వేసుకుని.. హ్యాండ్ బ్లెండర్తో బాగా గిలకొట్టాలి. తర్వాత ఒక మిక్సీ బౌల్లో పుదీనా ఆకులు, కలబంద ముక్కలు, కర్బూజా ముక్కలు, కీరదోస ముక్కలు వేసుకుని మిక్సీ పట్టుకుని ఆ మిశ్రమాన్ని.. ఫ్రెష్ క్రీమ్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం మిల్క్మెయిడ్, మ్యాపుల్ సిరప్, కొద్దిగా ఫుడ్ కలర్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. బాగా కలిపి.. సుమారు 8 గంటల పాటు ఫ్రిజ్లో పెట్టుకుంటే రుచికరమైన అలోవెరా ఐస్క్రీమ్ రెడీ అయిపోతుంది. -
సున్నండలు.. తింటే మంచి బలం, మీరూ ట్రై చేయండి
సున్నండలు తయారీకి కావల్సినవి: మినప్పప్పు – 2 కప్పులు, పంచదార పొడి – 2 కప్పులు, నెయ్యి – 1 కప్పు, ఏలకులపొడి – 1/2 టీ స్పూన్ తయారు చేసే విధానం : మినప్పప్పు దోరగా వేయించుకోవాలి. చల్లారిన తరువాత పొడి చేసుకొని, అందులో వేడి చేసిన నెయ్యి పంచదారపొడి, మినప్పిండి, ఏలకుల పొడి కలిపి ఉండలుగా చేసుకోవాలి. అంతే సున్నండలు రెడీ. ఇవి రుచిగా ఉండటమే కాకుండా మంచి బలాన్నిస్తుంది. మీరూ ట్రై చేసి చూడండి. -
వినాయక చవితి స్పెషల్: స్వీట్ సందేశ్ చేసుకోండి ఇలా
స్వీట్ సందేష్ ఇలా చేసుకోండి కావలసినవి: ఉడికించిన చిలగడ దుంప – పెద్దది ఒకటి; పచ్చికొబ్బరి తురుము – ముప్పావు కప్పు; జీడిపప్పు పొడి – పావు కప్పు; కొబ్బరి పాలు – అరకప్పు; పంచదార – అరకప్పు; యాలకులపొడి – అరటీస్పూను; రోజ్ వాటర్ – టీస్పూను. తయారీ: చిలగడ దుంప తొక్క తీసి ఉండలు లేకుండా మెత్తగా చిదుముకోవాలి ∙చిదుముకున్న చిలగడ దుంప మిశ్రమంలో జీడిపప్పు పొడి వేసి కలపాలి. పంచదారలో కొద్దిగా నీళ్లుపోసి సుగర్ సిరప్ను తయారు చేసుకోవాలి ∙సిరప్ తయార య్యాక కొబ్బరి తురుము వేసి కలుపుతూ ఉండాలి. తీగ పాకం వచ్చినప్పుడు చిలగడదుంప మిశ్రమాన్ని వేసి కలపాలి ∙మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు కొద్దిగా కొబ్బరిపాలు వేయాలి ∙మధ్యలో కొబ్బరి పాలతో΄పాటు యాలకులపొడి, రోజ్వాటర్ వేసి కలుపుతూ మొత్తం కొబ్బరి పాలు అయిపోయేంత వరకు మగ్గనివ్వాలి ∙ దాదాపు ఇరవై నిమిషాల తరువాత ఈ మిశ్రమం దగ్గర పడుతుంది. అప్పుడు స్టవ్ ఆపేసేయాలి ∙ గోరువెచ్చగా ఉన్నప్పుడే మిశ్రమాన్ని చేతులతోగానీ, మౌల్డ్స్లోవేసి నచ్చిన ఆకారంలో వత్తుకుంటే స్వీట్ సందేష్ రెడీ. -
వినాయక చవితి స్పెషల్: కేసి మిథోయ్
కేసి మిథోయ్ కావలసినవి: తాజా బియ్యప్పిండి – రెండు కప్పులు; పచ్చికొబ్బరి తురుము – కప్పు; పంచదార పొడి – అరకప్పు; యాలకుల పొడి అరటీస్పూను; కొబ్బరి నీళ్లు – అరకప్పు. తయారీ: ►తడి బియ్యప్పిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి ∙దీనిలో కొబ్బరి తురుము, పంచదార పొడి, యాలకుల ΄పొడి వేసి కలపాలి. ► అవసరాన్ని బట్టి కొబ్బరి నీళ్లను కొద్దికొద్దిగా వేసి పిండిని ముద్దలా కలుపుకోవాలి. ► పిండి ముద్దను చిన్న భాగాలుగా చేసి, ఉండలుగా చుట్టుకోవాలి ∙పిండిమొత్తాన్ని ఉండలుగా చుట్టుకుంటే కేసి మిథాయ్ రెడీ. ► కొబ్బరి నీళ్లకు బదులు కొద్దిగా నెయ్యికూడా కలుపుకోవచ్చు ∙రిఫ్రిజిరేటర్లో రెండుమూడురోజుల వరకు ఇవి తాజాగా ఉంటాయి. -
వీకెండ్ స్పెషల్: పాలకూర చికెన్ ఎగ్ బైట్స్, సింపుల్గా ఇలా
పాలకూర చికెన్ ఎగ్ బైట్స్ తయారీకి కావల్సినవి: పాలకూర – రెండు కప్పులు; గుడ్లు – పది; పాలు – ముప్పావు కప్పు; చీజ్ తరుగు – అరకప్పు; ఉడికించిన చికెన్ ముక్కలు – పది; ఉప్పు, మిరియాల పొడి – రుచికి సరిపడా. తయారీ విధానమిలా: ►పాలకూర, చికెన్ ముక్కలను సన్నగా తరిగి పెట్టుకోవాలి.పెద్దగిన్నెలో గుడ్ల సొన వేయాలి. దీనిలో పాలు, చికెన్, పాలకూర ముక్కలు వేసి కలపాలి. ► చివరిగా రుచికి సరిపడా, ఉప్పు, మిరియాల పొడి వేసి నురగ వచ్చేంత వరకు బాగా కలపాలి. ► ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కూప్లతో మఫిన్ ట్రేలో వేసి అరటగంట పాటు బేక్ చేస్తే పాలకూర చికెన్ ఎగ్ బైట్స్ రెడీ. -
పనస పండుతో పాఠోలి స్వీట్, టేస్ట్ అదిరిపోద్ది
పనస పాఠోలి తయారీకి కావల్సినవి: బియ్యం – కప్పు; పనసపండు తురుము – ఒకటిన్నర కప్పులు (తొనలను సన్నగా తురమాలి); పచ్చికొబ్బరి తురుము – పావు కప్పు; అరటి ఆకులు – పాఠోలీకి సరిపడా. స్టఫింగ్ కోసం: పచ్చికొబ్బరి తురుము – కప్పు; బెల్లం – ముప్పావు కప్పు; యాలుకలు పొడి – అరటీస్పూను. పనసపండుతో పాఠోలి.. తయారీ విధానమిలా: ►బియ్యాన్ని కడిగి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.మందపాటి బాణలిలో బెల్లం, నాలుగు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి వేసి మరిగించాలి. ► బెల్లం కరిగి నురగలాంటి బుడగలు వస్తున్నప్పుడు పచ్చికొబ్బరి తురుము వేయాలి. పాకంలో గరిట పెట్టి కలియతిప్పుతూ మిశ్రమం దగ్గర పడేంత వరకు మగ్గనివ్వాలి. ► నీరంతా ఇంకిపోయినప్పుడు అర టీస్పూను యాలకుల పొడి కలిపి చల్లారనివ్వాలి. ► ఇప్పుడు నానిన బియ్యంలో నీళ్లు తీసేసి బ్లెండర్లో వేయాలి ∙దీనిలోనే పనసపండు తురుము, కొబ్బరి తురుము వేసి మెత్తని పేస్టులా గ్రైండ్ చేయాలి. ► గ్రైండ్ అయిన మిశ్రమాన్ని గిన్నెలో తీసుకోవాలి ∙ఇప్పుడు అరటి ఆకులను శుభ్రంగా కడిగి, తడిలేకుండా తుడుచుకోవాలి. ► రుబ్బుకున్న బియ్యం పేస్టుని అరటి ఆకులపైన మందపాటి పొరలాగా వేసుకోవాలి. పొర మరీ మందంగా, మరీ పలుచగా కాకుండా మీడియంగా ఉండాలి ► చల్లారిన బెల్లం కొబ్బరి తురుముని పొరపైన మధ్యలో వేయాలి ∙ఇప్పుడు అరటి ఆకుని నిలువుగా మడిచి ఆవిరి పాత్రలో పెట్టుకోవాలి ∙ఈ ఆకులను ముఫ్పై నిమిషాల పాటు ఆవిరిమీద ఉడికిస్తే పనస పాఠోలీ రెడీ. -
వినాయక చవితి స్పెషల్: సేమిలా లడ్డు.. ఇలా చేసుకోండి
ఈసారి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్లు, ఇతర నైవేద్యాలతో పాటు... వైవిధ్యభరితమైన మరెన్నో స్వీట్లను తినిపించి ప్రసన్నం చేసుకుందాం.... సేమియా లడ్డు తయారీకి కావల్సినవి: కావలసినవి: వేయించిన సేమియా – కప్పు; కోవా – అరకప్పు; పంచదార – ఐదు టేబుల్ స్పూన్లు; రోజ్వాటర్ – టీస్పూను; బాదం పలుకులు – మూడు టేబుల్ స్పూన్లు. తయారీ విధానమిలా: ►బాణలిలో పంచదార వేసి సన్నని మంటమీద కరగనివ్వాలి. ► పంచదార కరుగుతున్నప్పుడే కోవా వేసి తిప్పాలి ∙పంచదార కరిగి మిశ్రమం దగ్గర పడినప్పుడు సేమియా, బాదం పలుకులు వేసి కలపాలి. ► అన్ని చక్కగా కలిసిన తరువాత రోజ్వాటర్ వేసి మరోసారి కలిపి స్టవ్ మీద నుంచి దించేయాలి ∙ఇప్పుడు మిశ్రమాన్ని లడ్డుల్లా చుట్టుకుంటే వర్మిసెల్లి లడ్డు రెడీ. -
మొక్కజొన్న పిండితో బిస్కెట్లు.. సింపుల్గా ఇలా చేసుకోండి
కార్న్ – చాక్లెట్ కుకీస్ తయారీకి కావల్సినవి: బటర్ – 125 గ్రాములు, పంచదార – 150 గ్రాములు, నూనె – 80 మిల్లీ లీటర్లు, గుడ్లు – 2, ఉప్పు – తగినంత, వనిలిన్ పౌడర్ – పావు టీ స్పూన్(మార్కెట్లో దొరుకుతుంది), మొక్కజొన్న పిండి – 80 గ్రాములు శనగపిండి – 350 గ్రాములు, బేకింగ్ పౌడర్ – 6 గ్రాములు తయారీ విధానమిలా: ►ముందుగా బటర్, పంచదార, నూనె వేసుకుని హ్యాండ్ బ్లెండర్ సాయంతో బాగా కలుపుకోవాలి. ► అందులో గుడ్లు, ఉప్పు, మొక్కజొన్న పిండి వేసుకుని మళ్లీ కలుపుకోవాలి. ► అనంతరం వనిలిన్ పౌడర్, శనగపిండి, బేకింగ్ పౌడర్ వేసుకుని ముద్దలా చేసుకోవాలి. ► తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్లో ఉండ చేసుకుని.. దాన్ని బిస్కట్లా ఒత్తుకుని.. పైభాగంలో నచ్చిన షేప్ని ప్రింట్ చేసి.. బేక్ చేసుకోవాలి. ► అభిరుచిని బట్టి రెండేసి కుకీస్ తీసుకుని.. మధ్యలో చాక్లెట్ క్రీమ్ పెట్టుకుని సర్వ్ చేసుకోవచ్చు. -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఇలా చేయండి
రైస్ పకోడా ఎలా చేయాలంటే.. కావల్సిన పదార్థాలు: అన్నం – 1 కప్పు,ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి – పావు కప్పు చొప్పున కారం – 1 టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్ ధనియాల పొడి – 1 టీ స్పూన్ , కొత్తిమీర తురుము – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో అన్నం వేసుకుని.. మెత్తగా పప్పు రుబ్బు కర్రతో ఒత్తుకుకోవాలి. అనంతరం దానిలో శనగపిండి, కారం, పసుపు, ధనియాల పొడి, కొత్తిమీర తురుము, ఉప్పు.. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకుని ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలి. అనంతరం కాగే నూనెలో.. పకోడీల్లా దోరగా వేయించుకుని.. సర్వ్ చేసుకోవాలి. -
ఎక్కువ టైం లేదా? క్షణాల్లో గుడ్డుతో ఇలా వండేసుకోండి
ఎగ్ పనియారం తయారీకి కావల్సినవి: గుడ్లు – నాలుగు; మిరియాల పొడి – అరటీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; ఉల్లిపాయ – ఒకటి; పచ్చిమిర్చి – ఒకటి; క్యాప్సికం – ఒకటి; క్యారట్ – ఒకటి; బంగాళ దుంప – ఒకటి; కారం – అరటీస్పూను; ధనియాల పొడి – అరటీస్పూను; పసుపు – చిటికెడు; గరంమసాలా – పావుటీస్పూను; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను; నూనె – మూడు టేబుల్ స్పూన్లు. తయారీ విధానమిలా: ►క్యారట్, పచ్చిమిర్చి, క్యాప్సికం, ఉల్లిపాయ, బంగాళ దుంపలను సన్నని ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ► బాణలిలో టేబుల్ స్పూను నూనె వేసి కాగనివ్వాలి. బాగా వేడెక్కిన నూనెలో ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. ► ఉల్లిపాయ వేగాక క్యారట్, బంగాళ దుంప ముక్కలు వేసి కలియబెట్టాలి. మూతపెట్టి ఐదు నిమిషాలు మగ్గాలి. ► తరువాత క్యాప్సికం ముక్కలు వేసి 5 నిమిషాలు వేయించాలి ∙ఇప్పుడు కారం, ధనియాల పొడి, పసుసు, గరంమసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ► ముక్కలన్నీ చక్కగా మగ్గాక కొత్తిమీర తరుగు వేసి మరోసారి కలిపి దించేయాలి ∙ఒకగిన్నెలో గుడ్లసొన, మిరియాల పొడి వేసి నురగ వచ్చేంతవరకు కలుపుకోవాలి ► ఇప్పుడు చల్లారిన ముక్కల మిశ్రమం గుడ్లసొనలో వేసి కలపాలి. ► పనియారం ప్లేటులో నూనెవేసి వేడెక్కనివ్వాలి. బాగా కాగిన నూనెలో గుడ్ల మిశ్రమం వేసి మూతపెట్టాలి. ► సన్నని మంటమీద మూడు నిమిషాలు కాల్చాలి. తరువాత రెండోవైపు తిప్పి నిమిషం పాటు కాల్చితే వేడివేడి ఎగ్ పనియారం రెడీ. -
కొబ్బరితో కార్న్ ఇడ్లీ..రుచి మాత్రమే కాదు, చాలా బలం కూడా
కోకోనట్ – కార్న్ ఇడ్లీలు తయారీకి కావల్సినవి: మొక్కజొన్న నూక – 2 కప్పులు,కొబ్బరి పాలు – 1 కప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్లు ఆవాలు – 1 టేబుల్ స్పూన్, శనగపప్పు – 1 టీ స్పూన్ చాయ పప్పు – 1 టీ స్పూన్,వేరుశనగలు – పావు కప్పు అల్లం తురుము – 2 టీ స్పూన్లు,పచ్చిమిర్చి –2 (చిన్నగా తరగాలి) ఉప్పు – తగినంత,బేకింగ్ సోడా – 1 టీ స్పూన్, నెయ్యి – కొద్దిగా తయారీ విధానమిలా: ముందుగా నూనె వేడి చేసుకుని అందులో వేరుశనగలు, శనగపప్పు, చాయ పప్పు, ఆవాలు, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని చిన్న మంట మీద వేయించుకోవాలి. అందులో మొక్కజొన్న నూక వేసుకుని నిమిషం పాటు గరిటెతో అటూ ఇటూ తిప్పుతూ వేయించుకోవాలి. ఆ తర్వాత కొబ్బరిపాలు, బేకింగ్ సోడా కలుపుకుని ఇడ్లీ పిండిలా చేసుకోవాలి. అనంతరం ఇడ్లీ రేకుకు నెయ్యి రాసుకుని.. కొద్దికొద్దిగా మిశ్రమం వేసుకుని ఆవిరిపై ఉడికించుకోవాలి. ఇవి బలానికి బలాన్నీ, రుచికి రుచినీ అందిస్తాయి. -
వెరైటీగా గుడ్డుతో బాదం బర్ఫీ.. ఎప్పుడైనా ట్రై చేశారా?
ఎగ్ బాదం బర్ఫీ తయారీకి కావల్సినవి: గుడ్లు – 7, పంచదార, కోవా – 250 గ్రాముల చొప్పున, ఏలకుల పొడి, కుంకుమ పువ్వు , బటర్ – 4 టేబుల్ స్పూన్లు (కరిగించాలి), బాదం – 40 పైనే (మిక్సీలో పొడి చేసుకోవాలి), నెయ్యి – కొద్దిగా తయారీ విధానమిలా: ముందుగా గుడ్లను మిక్సీలో పగలగొట్టి వేసుకుని.. బాగా మిక్సీ పట్టుకోవాలి.అందులో పంచదార, కోవా, ఏలకుల పొడి, కుంకుమ పువ్వు, కరిగించిన బటర్, బాదం పొడి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి. అనంతరం బౌల్ తీసుకుని.. దాని అడుగున బాగా నెయ్యి రాసి.. గుడ్లు–పంచదార మిశ్రమం వేసుకుని.. ఓవెన్లో పెట్టుకోవాలి. సుమారు 170 డిగ్రీల సెల్సియస్లో 45 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. నచ్చిన షేప్లో కట్ చేసుకుని మీ అభిరుచిని బట్టి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని.. సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. -
చికెన్ ఖీమా బుర్జి.. చపాతీలోకి చాలా బావుంటుంది
చికెన్ ఖీమా బుర్జి తయారికి కావల్సినవి: చికెన్ ఖీమా – పావుకేజీ; గుడ్లు – మూడు; ఉల్లిపాయ – ఒకటి; పచ్చిమిర్చి – రెండు; మిరియాలపొడి – టేబుల్ స్పూను; గరం మసాలా – టీస్పూను; పసుపు – అరటీస్పూను; జీలకర్ర పొడి – పావు టీస్పూను; ఆవాలు – టీస్పూను; మినప గుళ్లు – టీస్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; నూనె – మూడు టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా; కొత్తిమీర తరుగు – గార్నిష్కు సరిపడా. తయారీ విధానమిలా: చికెన్ ఖీమాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ∙బాణలిలో నూనె వేసి కాగనివ్వాలి. వేడెక్కిన నూనెలో ఆవాలు, మినపగుళ్లువేసి వేయించాలి ∙ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయను ముక్కలు తరగి వేయాలి ∙ ఉల్లిపాయ ముక్కలు వేగాక ఖీమా, కొద్దిగా ఉప్పువేసి మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ∙ సగం ఉడికిన ఖీమాలో పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, మిరియాల పొడి వేసి కలపాలి. ఖీమా పూర్తిగా ఉడికేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఖీమా ఉడికిన తరువాత గుడ్లసొనను వేసి రెండు నిమిషాలు పెద్ద మంట మీద తిప్పుతూ వేయించాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి. గుడ్ల సొన చక్కగా వేగి నూనె పైకి తేలుతున్నప్పుడు కొత్తిమీర చల్లుకుని దించేయాలి. అన్నం, చపాతీ,రోటీలకు ఇది మంచి సైడ్ డిష్. -
పొటాటో పాప్ కార్న్.. ఇలా చేస్తే భలే రుచిగా ఉంటాయి
పొటాటో పాప్ కార్న్ తయారీకి కావల్సినవి: బంగాళదుంపలు – 3 (తొక్క తీసి.. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి) చాట్ మసాలా – పావు టీ స్పూన్, కార్న్ పౌడర్ – 1 టేబుల్ స్పూన్ ఉప్పు – తగినంత, కారం – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా: ముందుగా బంగాళదుంప ముక్కల్ని నీటిలో ఐదు నిమిషాల పాటు ఉడికించి..ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కాస్త చల్లారాక మెత్తటి క్లాత్తో పైపైన ఒత్తుకుని.. తడి లేకుండా చేసుకోవాలి. అనంతరం వాటిని ఒక బౌల్లో వేసుకుని.. కొద్దిగా ఉప్పు, చాట్ మసాలా, కార్న్ పౌడర్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. బౌల్తోనే అటు ఇటు కుదపాలి. అప్పుడే కార్న్ పౌడర్, చాట్ మసాలా, ఉప్పు.. ముక్కలకు బాగా పడతాయి. తర్వాత వాటిని కాగుతున్న నూనెలో దోరగా వేయించుకుని.. ఒక ప్లేట్లోకి తీసుకుని.. వాటిపైన కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం జల్లి.. సర్వ్ చేసుకోవాలి. -
రొయ్యలతో ఘీ ఇడ్లీ.. ఎప్పుడైనా ట్రై చేశారా?
రొయ్యలతో ఇడ్లీ కావలసినవి: రొయ్యలు – పావు కప్పు (శుభ్రం చేసుకుని, ఉప్పు, కారం, పసుపు దట్టించి ఉడికించుకోవాలి. చల్లారాక ముక్కలుగా చేసుకోవాలి) ఇడ్లీపిండి – 4 కప్పులు (ముందుగా సిద్ధం చేసుకోవాలి) బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము – 2 టేబుల్ స్పూన్ల చొప్పున గరం మసాలా – 1 టీ స్పూన్, నెయ్యి – పావు కప్పు ధనియాల పొడి – 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర తురుము – కొద్దిగా తయారీ విధానమిలా: ముందుగా రొయ్యల ముక్కల్ని నేతిలో వేయించాలి. అందులో క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, గరం మసాలా వేసి.. దోరగా వేగాక.. తీసి పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఇడ్లీ ప్లేట్ తీసుకుని.. ప్రతి గుంతలో మినప్పిండి మిశ్రమం కొద్దికొద్దిగా వేసుకుని.. ఆపై చిన్న గరిటెతో కొద్దిగా రొయ్యల మిశ్రమాన్ని పెట్టుకుని.. అది కనిపించకుండా మళ్లీ మినప్పిండితో కవర్ చేసుకుంటూ ఇడ్లీ గుంతలు నింపుకోవాలి. ఇంతలో మరో స్టవ్ మీద.. కళాయిలో నెయ్యి వేసుకుని.. ధనియాల పొడీ వేసి.. ఒక నిమిషం పాటు గరిటెతో తిప్పి.. ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇడ్లీలు ఆవిరిపై ఉడికిన తర్వాత.. సర్వ్ చేసుకునే ముందు ప్లేట్లోకి తీసుకుని.. వాటిపై ధనియాల–నెయ్యి మిశ్రమాన్ని వేసుకుని.. కొత్తిమీర తురుము గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. -
వీకెండ్ స్పెషల్: ఎగ్మటన్ నర్గీసి కోఫ్తా, టేస్ట్ మామూలుగా ఉండదు
ఎగ్మటన్ నర్గీసి కోఫ్తా తయారీకి కావల్సినవి: ఉడికించిన గుడ్లు – ఆరు; మటన్ ఖీమా – అరకేజీ; కారం – టీస్పూను; పసుపు – పావు టీస్పూను; అల్లం వెల్లుల్లి పేస్టు – టీస్పూను; గరం మసాలా – టీస్పూను; మిరియాల పొడి – టీస్పూను; కొత్తిమీర తరుగు – మూడు టేబుల్ స్పూన్లు; పచ్చిమర్చి తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; పుదీనా తరుగు – టేబుల్ స్పూను; బ్రెడ్ ముక్కల ΄÷డి – రెండు టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా; నూనె –డీప్ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా: ►శుభ్రంగా కడిగిన మటన్ ఖీమాను మిక్సీజార్లో వేయాలి. ► దీనిలో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, మిరియాల పొడి, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, బ్రెడ్ ముక్కల పొడి, టేబుల్ స్పూను నూనె వేసి మెత్త్తగా గ్రైండ్ చేయాలి. ► గ్రైండ్ అయిన మిశ్రమాన్ని ఒక మాదిరి పరిమాణంలో ఉండలుగా చుట్టుకోవాలి. ► ఇప్పుడు ఉడికించిన గుడ్ల పెంకు తీసేయాలి ∙ఖీమా ఉండను తెరిచి గుడ్డును లోపలపెట్టి ఖీమా మిశ్రమంతో కోఫ్తాలా వత్తుకోవాలి. ► ఇలా ఆరు గుడ్లను కోఫ్తాలా తయారు చేసుకున్నాక, సన్నని మంటమీద డీప్ఫ్రైచేయాలి. ► కోఫ్తా బంగారు వర్ణంలోకి మారేంత వరకు వేయించితే ఎగ్మటన్ నర్గీసి కోఫ్తా రెడీ . ► కోఫ్తాను మధ్యలో రెండు సగాలుగా కట్ చేసి నచ్చిన సాస్తో సర్వ్చేసుకోవాలి. -
బ్రేక్ఫాస్ట్లో సింపుల్గా అప్పం.. ఇలా చేసుకోండి
అప్పం తయారీకి కావలసినవి: పొట్టు తీసిన పెసరపప్పు – కప్పు ; మినపపప్పు – అరకప్పు ; సోంపు – అరటీస్పూను; అల్లం – అంగుళం ముక్క ; క్యారట్, బీట్ రూట్, ప్రెంచ్ బీన్స్, బేబీ కార్న్, పచ్చి బఠాణి – అన్నీ కలిపి కప్పు; ఉప్పు – రుచికి సరిపడా ; నూనె – వేయించడానికి తగినంత. తయారీ విధానమిలా.. ►పప్పులను శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి . ►నానిన పప్పుల్లో అల్లం, సోంపు కొద్దిగా నీళ్లు వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ►ఇప్పుడు రుబ్బిన పిండిలో కూరగాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ►గుంత పునుగుల ప్లేట్లకి కొద్దిగా నూనె రాసి పిండి మిశ్రమాన్ని అప్పల్లా వేయాలి కొద్దిగా నూనె వేసి రెండువైపులా చక్కగా కాల్చుకుంటే హెల్దీ అప్పం రెడీ. -
క్యారెట్–కోకోనట్ ఢోక్లా.. చేసుకోండి ఇలా
క్యారెట్–కోకోనట్ ఢోక్లా తయారీకి కావల్సినవి: క్యారెట్ తురుము – 1 కప్పు సగ్గుబియ్యం – పావు కప్పు (పిండిలా చేసుకోవాలి) బియ్యప్పిండి – పావు కప్పు, కొబ్బరి పాలు – అర కప్పు నీళ్లు – సరిపడా, బేకింగ్ సోడా – పావు టీ స్పూన్ జీలకర్ర – 1 టీ స్పూన్, నిమ్మరసం – 2 టీ స్పూన్లు కరివేపాకు, ఆవాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, ధనియాలు – కొద్దికొద్దిగా (అన్నింటినీ ఒక టీ స్పూన్ నూనెలో పోపు పెట్టుకోవాలి) తయారీ విధానమిలా: ►ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని.. అందులో క్యారెట్ తురుము, బియ్యప్పిండి, సగ్గుబియ్యం పిండి, కొబ్బరి పాలు, చిటికెడు ఉప్పు వేసి సుమారు రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మరోసారి బాగా కలిపి.. 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అందులో నిమ్మరసం జోడించాలి. ► ఇప్పుడు ఒక పాత్ర తీసుకుని, దానికి కొద్దిగా నూనె రాసి, దానిలో ఆ మిశ్రమాన్ని వేసుకుని చదునుగా చేసుకోవాలి. 15 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించి, పోపు పెట్టిన కరివేపాకు, ఆవాల మిశ్రమాన్ని వాటిపై వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. అనంతరం కట్ చేసుకుని, సర్వ్ చేసుకోవాలి. -
ఇలాంటి స్వీట్ చేస్తే ఎవరైనా బీట్రూట్ని ఇష్టంగా తింటారు
బీట్రూట్ – మిల్క్ సందేశ్ తయారీకి కావల్సినవి: బీట్రూట్ – 2 (ముక్కలు కట్ చేసుకుని మెత్తటి గుజ్జులా చేసుకోవాలి) పాల పొడి – పావు కప్పు నెయ్యి – 2 లేదా 3 టేబుల్ స్పూన్లు పంచదార పొడి – ముప్పావు కప్పు తయారీ విధానమిలా: ముందుగా స్టవ్ మంటను సిమ్లో పెట్టుకుని.. పాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని.. అందులో బీట్రూట్ గుజ్జు వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. కాస్త దగ్గర పడుతున్న సమయంలో పాలపొడి, పంచదార పొడి వేసుకుని.. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. రెండు మూడు నిమిషాలకొకసారి కొద్దికొద్దిగా నెయ్యి వేస్తూ దగ్గర పడేదాకా అలానే ఉండికించాలి. దగ్గర పడిన తర్వాత ఒక పాత్రకు నెయ్యి రాసి.. దానిలో వేసుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత చిన్నచిన్న ఉండలుగా తీసుకుంటూ.. వాటిని నచ్చిన షేప్లోకి మలిచి సర్వ్ చేసుకోవాలి. -
పాలకూరతో పొంగనాలు.. భలే రుచిగా ఉంటాయి
పాలక్ పనియారం తయారీకి కావల్సినవి కావలసినవి: పాలకూర –2 కప్పులు (పేస్ట్ చెయ్యాలి) అటుకులు – పావు కప్పు (ఒకసారి కడిగేసుకుని, 2 లేదా 3 నిమిషాల పాటు.. కొద్దిగా మంచినీటిలో నానబెట్టి, గుజ్జులా చేసుకోవాలి) ఉప్మా రవ్వ – ముప్పావు కప్పు, బియ్యప్పిండి – పావు కప్పు మజ్జిగ – పావు కప్పుపైనే, శనగపప్పు – 1 టేబుల్ స్పూన్ ఉప్పు, నూనె – సరిపడా తయారీ విధానమిలా.. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో.. పాలకూర గుజ్జు, ఉప్మా రవ్వ, బియ్యప్పిండి, ఉప్పు, నానబెట్టిన అటుకుల గుజ్జు వేసుకుని.. కొద్ది కొద్దిగా మజ్జిగ వేసుకుంటూ బాగా కలిపి.. 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో రవ్వ, తగినంత ఉప్పు వేసుకుని.. మజ్జిగతో కాస్త జారుగా చేసుకోవాలి. ఇప్పుడు పొంగనాల పాన్ లో ప్రతి గుంతలోనూ కొద్ది కొద్దిగా నూనె వేసుకుని.. అందులో రవ్వ మిశ్రమాన్ని వేసుకుని ఇరువైపులా దోరగా వేయించుకోవాలి. టమోటో సాస్తో తింటే ఇవి భలే రుచిగా ఉంటాయి. -
నోరూరించే శాండ్విచ్.. ఇలా చేస్తే బయట కొనాల్సిన పనిలేదు
పనీర్ – కీమా శాండ్విచ్ తయారీకి కావల్సినవి పనీర్ ముక్కలు – 1 కప్పు,కీమా – అర కప్పు (మసాలా, ఉప్పు జోడించి మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి) చీజ్ స్లైస్ – 6 లేదా 8 (చిన్న చిన్నవి),బచ్చలికూర తురుము – పావు కప్పు స్వీట్ కార్న్ – 3 టేబుల్ స్పూన్లు (ఉడకబెట్టుకోవాలి),క్యాప్సికమ్ తరుగు – 2 టేబుల్ స్పూన్లు వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, కారం – అర టీ స్పూన్ చొప్పున, బ్రెడ్ స్లైస్ – 5 లేదా 6 (గ్రిల్ చేసుకున్నవి), నూనె – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత తయారీ విధానమిలా: ముందుగా ఒక పాన్లో నూనె వేసుకుని వేడి కాగానే.. బచ్చలికూర తురుము, క్యాప్సికమ్ తరుగు వేసుకుని కాసేపు గరిటెతో తిప్పుతూ ఉండాలి. తర్వాత ఉడికిన స్వీట్ కార్న్, వెల్లుల్లి పేస్ట్, కారం, సరిపడా ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని తిప్పుతూ ఉండాలి. అనంతరం పనీర్ ముక్కలు, కీమా, మిరియాల పొడి వేసుకుని బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ మిశ్రమం కాస్త చల్లారిన తర్వాత ప్రతి బ్రెడ్ స్లైస్లో కొంత పనీర్ మిశ్రమం పెట్టుకుని, ఒక్కో చీజ్ స్లైస్ దానిపై వేసుకుని.. ఓవెన్ లో బేక్ చేసుకోవాలి. తర్వాత క్రాస్గా త్రిభుజాకారంలో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. -
ఒకే కుకర్లో రెండు రకాల వంటలు వండేయొచ్చు
మంచి భోజన ప్రియులకు పసందైన వంటకాలను అందించడంలో ఈ కుకర్కి సాటి లేదు. 3 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ కుకర్లో అవసరాన్ని బట్టి ఒకేసారి రెండు ఐటమ్స్ని రెడీ చేసుకోవచ్చు. గ్రిల్, బేక్, స్లో కుకింగ్ వంటి ఆప్షన్స్తో.. ఫిష్ ఫ్రై, చికెన్ గ్రిల్లతో పాటు పాన్ కేక్స్, బ్రెడ్ ఆమ్లెట్, సూప్స్ వంటివెన్నో వండుకోవచ్చు. మేకర్ ముందు స్మాల్, మీడియం, బిగ్ అనే ఆప్షన్స్తో టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు డివైస్లోని బౌల్స్ రెండు రకాలు ఉంటాయి. బేస్ కుకర్కి సరిపడా పెద్ద బౌల్తో పాటు.. రెండుభాగాలుగా ఉన్న పెద్ద పాత్ర కూడా డివైస్తో పాటు లభిస్తుంది. ఆ పాత్రలను మార్చుకుంటూ దీనిలో చాలా వంటకాలను వండివార్చుకోవచ్చు. అదనపు సౌకర్యాలను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. ధర 43 డాలర్లు (రూ.3,572) -
మరమరాలకు ఫుల్ క్రేజ్.. కేరాఫ్ అడ్రస్గా మారిన కట్టంగూర్
టైంపాస్కు ఏదైనా తినాలని అనిపిస్తే వెంటనే గుర్తొచ్చేవి మరమరాలు. గుప్పెడు మరమరాలకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం నూనె, కారం, వేయించిన పల్లీలు వేసి కలుపుకుని తింటే ఆ అనుభూతి చెప్పనలవి కాదు. ఇంటికొచ్చే అతిథులకు సైతం కరకరలాడే మరమరాలను స్నాక్స్గా అందించవచ్చు. ఇప్పుడు మరమరాలతో రకరకాల రెసిపీలు తయారు చేస్తున్నారు. మన రాష్ట్రంలోనే కాదు.. పక్కనున్న ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రలోనూ మరమరాలకు ఫుల్ క్రేజ్ ఉంది. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మధుమేహ వ్యాధి గ్రస్తులు సైతం వీటిని నేరుగా తినొచ్చు. వీటి తయారీకి కేరాఫ్గా నిలుస్తోంది కట్టంగూర్. కట్టంగూర్లో 80 సంవత్సరాల క్రితం కుటీర పరిశ్రమగా మరమరాల తయారీ ప్రారంభమైంది. పద్మశాలీలు ప్రారంభించిన ఈ కుటీర పరిశ్రమను గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు చేపట్టారు. మొదట్లో సుమారు 50 కుటుంబాల వారు బట్టీల ద్వారా మరమరాలు తయారు చేసేవారు. 30 సంవత్సరాల నుంచి బట్టీల స్థానంలో మిషన్లు (రోస్టర్లు) వచ్చాయి. అయితే.. రానురాను ముడి సరుకుల ధరలు పెరగడం, పెద్దగా లాభాలు లేకపోవడంతో చాలా కుటుంబాలు మరమరాల పరిశ్రమకు దూరమయ్యాయి. బట్టీల విధానం ఉన్నప్పుడు.. అంటే 1995 సంవత్సరం వరకు కట్టంగూర్లో సుమారు వంద బట్టీలు ఉండేవి. ఒక్కో ఇంట్లో రెండు బట్టీలను కూడా నడిపారు. అయితే, దుమ్ము, పొగ కారణంగా మరమరాల పరిశ్రమలు గ్రామానికి దూరంగా వచ్చాయి. ప్రస్తుతం పది మిల్లులు ఉన్నాయి. వీటిలో రోస్టర్, ఆధునిక పరిజ్ఞానంతో రూపొందించిన మిల్లుల్లో మరమరాలు తయారవుతున్నాయి. సిద్దిపేటలోనూ మనవారే.. కట్టంగూర్కు చెందిన వారే సిద్దిపేటలో మరమరాల పరిశ్రమను విస్తరించారు. ఆ జిల్లాలో మొక్కజొన్న పంట ఎక్కువగా ఉంటుంది. అక్కడ మక్కల అటుకులు, పోహ తయారీ పరిశ్రమలు ఉన్నాయి. దానికి అనుబంధంగా 15 మరమరాల మిల్లులు కూడా ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల్లోనూ మార్కెటింగ్ కట్టంగూరులో తయారైన మరమరాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు కర్నాటక, మహారాష్ట్రలో మార్కెటింగ్ చేస్తున్నారు. కట్టంగూర్ నుంచి నేరుగా వివిధ ప్రాంతాలకు సరఫరా ఉంటుంది. 50 శాతం తెలంగాణలో మార్కెటింగ్ జరిగితే.. మిగతా అన్ని ప్రాంతాల్లో కలిపి 50 శాతం విక్రయం ఉంటోంది. వివిధ బ్రాండ్ల పేరుతో హైదరాబాద్లో విక్రయాలు జరుపుతుంటారు. మహారాష్ట్రలో దీపావళి పండుగ సమయంలో మరమరాల వినియోగం అధికంగా ఉంటుంది. అంతటా మరమరాల ధర సమానంగానే ఉంటున్నప్పటికీ ట్రాన్స్పోర్ట్ చార్జీలతో కలిసి వాటి ధర నిర్ణయిస్తారు. దూర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నప్పుడు రవాణా చార్జీలు కూడా కలుపుతారు. మరమరాలను కర్నాటక రాష్ట్ర ప్రజలు ఉదయం అల్పాహారంలో ఎక్కువ తీసుకుంటారు. తెలంగాణలో చూస్తే.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మరమరాల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఆ జిల్లాలోని ప్రతి చిన్న గ్రామంలోనూ మరమరాలు దొరుకుతాయి. మరింత ప్రోత్సాహం అవసరం 1010 రకం ధాన్యం క్వింటా రూ.2500 ఉందని.. ధాన్యం ధర పెరగడం వల్ల తమకు గిట్టుబాటు కావడం లేదని అంటున్నారు. రోస్టర్లో వాడుతున్న సముద్రపు ఇసుక టన్ను ధర రూ.2500 పలుకుతుంది. ఇసుకను మచిలీపట్నం నుంచి తెప్పించుకుంటున్నారు. క్వింటా మరమరాల ఉత్పత్తికి 10 కిలోల సముద్రపు ఇసుక అవసరం. ఒక క్వింటా మరమరాలు తయారయ్యే ప్రక్రియకు.. వేడి నీళ్ల కోసం మండించే కట్టె పొట్టు, ఇసుక, ఉప్పుకు కలిపి రూ.250 ఖర్చు వస్తుంది. దీనికి ధాన్యం ధర అదనం. ప్రభుత్వం సహకారం అందించాలి మరమరాల పరిశ్రమకు ప్రభుత్వ సహకారం కావాలి. ధాన్యం సంవత్సరంలో మూడు నెలలే ఉంటుంది. మా పరిశ్రమకు సంవత్సరానికి సరిపడా ధాన్యాన్ని ఒకేసారి కొనుగోలు చేయాలంటే ఎంతో ఆర్థిక భారం అవుతుంది. ఐకేపీ కేంద్రాల ద్వారా సబ్సిడీపై ధాన్యం సరఫరా చేయాలి. బ్యాంకుల ద్వారా ఓడీ సౌకర్యం కల్పించాలి. ఈ పరిశ్రమను ప్రభుత్వం ఆదుకుంటే మరింత అభివృద్ధి చెందుతుంది. మరి కొందరు మరమరాల పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తారు. – గంజి వెంకన్న, మరమరాల మిల్లు యజమాని, కట్టంగూర్ ధాన్యం కేటాయించాలి ఐకేసీ ధాన్యాన్ని రైస్ మిల్లులకు కేటాయిస్తున్న విధంగా.. మాకు కూడా ధాన్యం కేటాయించాలి. మేము అందుకు నగదు చెల్లిస్తాం. పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు చిన్న తరహా పరిశ్రమల కింద సబ్సిడీ రుణాలు ఇస్తున్నా.. వ్యాపారానికి కూడా రుణం ఇవ్వాలి. బ్యాంకుల ద్వారా ఓడీ ఇవ్వాలి. విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలి. మా పరిశ్రమలకు 24 విద్యుత్ సౌకర్యం కల్పించాలి. – రాపోలు వెంకటేశ్వర్లు, మరమరాల తయారీదారుడు, కట్టంగూర్ -
పండగొస్తుంది.. తియ్యటి వేడుక చేసుకుందాం, చమ్చమ్తో
చమ్చమ్ తయారీకి కావలసినవి వెన్నతీయని ఆవుపాలు – నాలుగు కప్పులు; నిమ్మరసం – రెండు టేబుల్ స్పూన్లు; మైదా – టేబుల్ స్పూను; చక్కెర – ఒకటిన్నర కప్పులు; నీళ్లు – ఎనిమిది కప్పులు; యాలకులు – రెండు; నెయ్యి – టీస్పూను; పాలు – పావు కప్పు; క్రీమ్ – రెండు టేబుల్ స్పూన్లు; పాలపొడి – అరకప్పు; కుంకుమ పువ్వు కలిపిన పాలు – రెండు టేబుల్ స్పూన్లు; చక్కెరపొడి –టేబుల్ స్పూను; కొబ్బరి తురుము – పావు కప్పు; ట్యూటీఫ్రూటీ –మూడు టేబుల్ స్పూన్లు తయారీ విధానమిలా: ► పాలను చక్కగా కాయాలి..కాచిన పాలల్లో నిమ్మరసం వేసి విరగగొట్టి.. పన్నీర్ను వేరు చేసి పక్కనపెట్టుకోవాలి. ► అరగంట తరువాత పన్నీర్ మిశ్రమంలో మైదా వేసి ముద్దలా కలపాలి ∙ముద్దను పొడవాటి రోల్స్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ► ఇప్పుడు పంచదారలో ఎనిమిది కప్పులు నీళ్లుపోసి 10 నిమిషాలు మరిగించాలి. ► తరువాత యాలకులు, పన్నీర్ రోల్స్ను వేసి పదిహేను నిమిషాలు మరిగించి పక్కన పెట్టుకోవాలి ∙బాణలిలో నెయ్యి, పావు కప్పు పాలు పోసి మరిగించాలి. ► రెండు నిమిషాల తరువాత క్రీమ్ వేసి కలపాలి. మిశ్రమం చిక్కబడిన తరువాత కుంకుమ పువ్వు కలిపిన పాలు, పంచదార పొడి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మిశ్రమం బాగా చిక్కబడినప్పుడు దించేస్తే కోవా రెడీ. ► ఇప్పుడు సుగర్ సిరప్లో ఉడికించిన రోల్స్ను బయటకు తీసి మధ్యలో నిలువుగా గాటు పెట్టి చల్లారిన కోవా మిశ్రమాన్ని స్టఫ్చేసి గాటుని మూసేయాలి. ► ఈ రోల్స్కు కొబ్బరి తురుము అద్ది, పైన టూటీఫ్రూటీపెట్టాలి ∙ఇలా అన్నీ రోల్స్ను చేస్తే చమ్చమ్ రెడీ. -
ఆనపకూయతో సాంబార్ ఒకటే కాదు, పూరీలు కూడా చేసుకోవచ్చు
ఆనపకాయ పూరీ తయారీకి కావల్సినవి: ఆనపకాయ – 1 (తొక్క తీసేసి.. గింజలు తొలగించి.. ముక్కలను మెత్తగా ఉడికించి, కాస్త చల్లారాక మిక్సీ పట్టుకోవాలి) గోధుమ పిండి –3 కప్పులు, గోరువెచ్చని నీళ్లు – సరిపడా మైదాపిండి – 1 టేబుల్ స్పూన్, జీలకర్ర, వాము – అర టీ స్పూన్ చొప్పున (కచ్చాబిచ్చా మిక్సీ చేసుకోవాలి) కొత్తిమీర తురుము – 2 టేబుల్ స్పూన్లు, ఎండు మిర్చి పొడి– 1 టీ స్పూన్ (ఎండు మిరపకాయలను కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టాలి) పసుపు – చిటికెడు,ఉప్పు – తగినంత,నూనె – సరిపడా \ తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో ఆనపకాయ గుజ్జు, గోధుమ పిండి, మైదాపిండి, కొత్తిమీర తురుము, ఎండుమిర్చి పొడి, జీలకర్ర, వాము మిశ్రమం, ఉప్పు, పసుపు, అర టీ స్పూన్ నూనె వేసుకుని, సరిపడా గోరువెచ్చని నీళ్లతో మెత్తగా ముద్దలా చేసుకోవాలి. 20 నిమిషాలు పక్కన పెట్టుకుని.. నూనె అప్లై చేసుకుంటూ చిన్న చిన్న పూరీల్లా సిద్ధం చేసుకోవాలి. తర్వాత కళాయిలో నూనె కాగనిచ్చి.. పూరీలను వేయించాలి. -
క్యారట్, క్యాప్సికంతో చట్నీ.. ఇడ్లీ, దోశల్లో మంచి కాంబినేషన్
క్యారట్ క్యాప్సికమ్ చట్నీ తయారీకి కావల్సినవి: క్యారట్లు – పెద్దవి రెండు; క్యాప్పికం –పెద్దది ఒకటి; అల్లం – అంగుళన్నర ముక్క; పచ్చిమిర్చి –ఐదు; జీలకర్ర –టీస్పూను; ధనియాలు –టీస్పూను; ఆవాలు – అరటీస్పూను; పచ్చిశనగపప్పు – టీస్పూను; ఇంగువ – చిటికెడు; కరివే΄ాకు – రెండు రెమ్మలు; కొత్తిమీర తరుగు – పావు కప్పు; చింతపండు గుజ్జు – రెండు టీస్పూన్లు; నూనె – నాలుగు టీస్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా. తయారీ విధానమిలా: ►క్యారట్, క్యాప్సికం, అల్లంను సన్నని ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.జీలకర్ర, ధనియాలను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ► బాణలిలో మూడు టీస్పూన్ల నూనె వేసి వేడెక్కిన తరువాత పచ్చిమిర్చి, అల్లం, క్యారట్, క్యాప్పికం ముక్కలు వేసి వేయించాలి. ► కొద్దిగా ఉప్పు, కొద్దిగా నీళ్లుపోసి ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించి దించేయాలి. ► వేయించిన ధనియాలు, జీలకర్ర మిక్సీజార్లో వేసి గ్రైండ్ చేయాలి ∙ఇవి నలిగిన తరువాత ఉడికించిన క్యాప్సికం క్యారట్ ముక్కలను వేయాలి. ► చింతపండు గుజ్జు, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ► మిగిలిన టీస్పూను నూనె వేడెక్కిన తరువాత ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. తరువాత శనగపప్పు, కరివేపాకు వేసి వేయించాలి. ► చివరిగా ఇంగువ వేసి దించేయాలి ∙ఈ తాంలిపుని పచ్చడిలో కలిపితే క్యారట్ క్యాప్సికం చట్నీ రెడీ. ఇడ్లీ, దోశ, రోటీల్లో ఇది మంచి కాంబినేషన్. -
రసగుల్లాతో ఐస్క్రీం..ఎప్పుడైనా ట్రై చేశారా? అదిరిపోద్దంతే!
రసగుల్లా ఐస్క్రీమ్ తయారీకి కావల్సినవి: వెనీలా ఐస్క్రీమ్ – నాలుగు కప్పులు; రసగుల్లాలు – ఎనిమిది; స్ట్రాబెరీ – ఆరు; బాదం పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ విధానమిలా: గడ్డకట్టిన ఐస్క్రీమ్ను రిఫ్రిజిరేటర్ నుంచి తీసి పదినిమిషాలు బయటపెట్టాలి ∙రసగుల్లాలను గట్టిగా పిండి సిరప్ను తీసేయాలి. పూర్తిగా పిండకూడదు. కొద్దిగా సిరప్ తేమ ఉండేలా పిండాలి ∙పిండిన రసగుల్లాలను చిన్నచిన్న ముక్కలు చేయాలి. స్ట్రాబెరీలను కూడా కడిగి సన్నగా తరగాలి ∙ఇప్పుడు ఐస్క్రీమ్లో రసగుల్లా ముక్కలు వేసి కలపాలి . దీనిలో స్ట్రాబెరీ ముక్కలు, బాదం పలుకులు వేసి మరోసారి చక్కగా కలపాలి. ఈ ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని గిన్నెలో వేసి మూతపెట్టి రాత్రంతా లేదా కనీసం నాలుగు గంటల పాటు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి . రిఫ్రిజిరేటర్లో నుంచి తీసిన పదిహేను నిమిషాల తరువాత రసగుల్లా ఐస్క్రీమ్ను సర్వ్చేసుకోవాలి. -
చాక్లెట్ ట్రఫెల్స్.. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు
చాక్లెట్ ట్రఫెల్స్ తయారీకి కావల్సినవి: బాదం పప్పు – కప్పు; ఎండు కొబ్బరి తురుము – ముప్పావు కప్పు; కర్జూరాలు – పదిహేను; బాదం బటర్ – ము΄్పావు కప్పు; డార్క్ చాక్లెట్ ముక్కలు – పావు కప్పు; కొబ్బరి నూనె – అరటీస్పూను; బరకగా దంచిన పిస్తా పలుకులు – పావు కప్పు; బాదం పలుకులు – పావు కప్పు; నల్లని పొరతీసి తురిమిన ఎండు కొబ్బరి – పావు కప్పు; స్ట్రాబెరీ పొడి – పావు కప్పు. తయారీ విధానమిలా: ►కర్జూరాలను ఒకసారి కడిగి పదిహేను నిమిషాల పాటు వేడినీటిలో నానబెట్టుకోవాలి ∙బాదం పప్పు, ఎండు కొబ్బరి తురుముని దోరగా వేయించి మిక్సీజార్లో వేయాలి. ► నానబెట్టిన కర్జూరాలను నీరు లేకుండా తీసి మిక్సీజార్లో వేసి గ్రైండ్ చేయాలి ∙సగం నలిగిన మిశ్రమంలో బాదం బటర్ వేసి గ్రైండ్ చేయాలి. ► అవసరాన్ని బట్టి రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ∙ఇప్పుడు గ్రైండ్ అయిన మిశ్రమాన్ని బయటకు తీసిన నచ్చిన పరిమాణంలో లడ్డుల్లా చుట్టుకోవాలి. ► బాదం, పిస్తా పలుకులను పొడిచేసి పక్కన పెట్టుకోవాలి ∙చాక్లెట్ముక్కల్లో కొబ్బరి నూనెవేసి అవెన్లో 45 సెకన్లు ఉంచాలి. చాక్లెట్ కరిగిన తరువాత పక్కన పెట్టుకోవాలి. ► ఇప్పుడు ముందుగా చేసుకున్న లడ్డులాను ఒక్కోక్కటి ఎండుకొబ్బరి తురుము, పిస్తా, బాదం, స్ట్రాబెరీ పొడులు, చాక్లెట్ మిశ్రమంలో ముంచి అద్దుకుంటే ట్రఫెల్స్ రెడీ. రిఫ్రిజిరేటర్లో నిల్వచేసుకుంటే ఇవి పదిరోజుల పాటు తాజాగా ఉంటాయి. -
క్యారట్ లడ్డు.. ఒకసారి తిన్నారంటే మైమరచిపోతారు
క్యారట్ లడ్డు తయారీకి కావల్సినవి: క్యారట్ తురుము – రెండు కప్పలు; ఎండు కొబ్బరి తురుము – ఒకటిన్నర కప్పులు; కండెన్స్డ్ మిల్క్ – కప్పు; బాదం పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు; రోజ్వాటర్ – అరటీస్పూను; యాలకుల పొడి – అరటీస్పూను; నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు; పచ్చికొబ్బరి తురుమ – గార్నిష్కు సరిపడా. తయారీ విధానమిలా: రెండు స్పూన్ల నెయ్యివేసి కొబ్బరి తురుముని ఐదు నిమిషాల పాటు దోరగా వేయించాలి. కొబ్బరి వేగిన తరువాత క్యారట్ తురుము వేసి మీడియం మంట మీద పదినిమిషాలు వేయించాలి. ఇప్పుడు బాదం పలుకులు, కండెన్స్డ్ మిల్క్ వేసి కలపాలి. ఐదు నిమిషాల తరువాత రోజ్ వాటర్. యాలకుల పొడి వేసి సన్నని మంట మీద తిప్పుతూ మగ్గనివ్వాలి. మిశ్రమం చిక్కబడిన తరువాత దించేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని చల్లారిన మిశ్రమాన్ని లడ్డుల్లా చుట్టుకుని,పైన కొద్దిగా పచ్చికొబ్బరితో గార్నిష్ చేసి సర్వ్చేసుకోవాలి. -
తాటి చాక్లెట్ పాన్కేక్ ..సింపుల్ రెసిపి ఇలా చేసుకోండి
తాటి చాక్లెట్ పాన్కేక్ తయారీకి కావల్సినవి: తాటిపండు గుజ్జు – ఒకటిన్నర కప్పులు కోకో పౌడర్ – 1 కప్పు, మైదాపిండి, బియ్యప్పిండి – ముప్పావు కప్పు చొప్పున, మొక్కజొన్నపిండి – పావు కప్పు, కొబ్బరి తురుము – అర కప్పు పంచదార – 2 కప్పులు చిక్కటి పాలు – సరిపడా(కాచి చల్లార్చినవి) ఉప్పు – చిటికెడు, నెయ్యి – చాలినంత తయారీ విధానమిలా: ముందుగా తాటì పండు గుజ్జు, కోకోపౌడర్, కొబ్బరి తురుము, పంచదార కొద్దికొద్దిగా పాలు మిక్సీలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో ఆ మిశ్రమంతో పాటు.. మైదాపిండి, బియ్యప్పిండి, మొక్కజొన్నపిండి, కోకో పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా పాలు కలుపుకుంటూ దోశల పిండిలా సిద్ధం చేసుకుని, రెండు గంటలు ఫ్రిజ్లో పెట్టుకోవాలి. తర్వాత పాన్లో నెయ్యి వేసుకుని.. మందంగా పాన్ కేక్స్ చేసుకుని.. ఇరువైపులా దోరగా కాల్చుకోవాలి. వాటిపై చాక్లెట్ క్రీమ్, ఫ్రూట్స్ వేసుకుని సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. -
చపాతీలోకి సూపర్ కాంబినేషన్.. సగ్గుబియ్యం పచ్చడి
సగ్గుబియ్యం పచ్చడి తయారీకి కావల్సినవి సగ్గుబియ్యం – అరకప్పు; పెరుగు – రెండున్నర కప్పులు; అల్లం తురుము –టేబుల్ స్పూను; క్యారట్ తురుము – రెండు టేబుల్ స్పూన్లు; ఆవాలు – టీస్పూను; జీలకర్ర – టీస్పూను; పచ్చిశనగపప్పు –టీస్పూను; పసుపు – అరటీస్పూను; కొత్తిమీర తరుగు – పావు కప్పు; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – మూడు టీస్పూన్లు; కరివేపాకు – రెండు రెమ్మలు; ఇంగువ – చిటికెడు. తయారీ విధానమిలా: ►సగ్గుబియ్యాన్ని పదినిమిషాల పాటు మీడియం మంట మీద వేయించి పక్కన పెట్టుకోవాలి. ► సగ్గుబియ్యం చల్లగా అయిన తరువాత పెరుగు వేసి కలపాలి. పెరుగు చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్లుపోసుకోని ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి. ► సగ్గుబియ్యం పట్టుకుంటే మెత్తగా అయ్యేంతవరకు నానాక... కొత్తిమీర తరుగు , రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి ► బాణలిలో నూనెవేసి, వేడెక్కిన తరువాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి వేయించాలి. ► ఇవన్నీ వేగిన తరువాత పసుపు, ఇంగువ, క్యారట్ తరుగు వేసి నిమిషం పాటు వేయించి తీసేయాలి ► ఈ తాలింపు మిశ్రమాన్ని సగ్గుబియ్యం మిశ్రమంలో వేసి కలిపితే సగ్గుబియ్యం పచ్చడి రెడీ. అన్నం, చపాతీల్లోకి ఈ చట్నీ మంచి కాంబినేషన్. -
ఆరోగ్యానికి చాలా మంచిది.. కరివేపాకుతో పచ్చడి, టిఫిన్స్లో బావుంటుంది
కరివేపాకు పచ్చడి తయారీకి కావల్సినవి: కరివేపాకులు – రెండు కప్పులు; ఎండుమిర్చి – 10; చింతపండు – పెద్ద ఉసిరికాయ అంత పరిమాణం; పొట్టుతీసిన మినపగుళ్లు – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; నువ్వులు – టీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; పచ్చికొబ్బరి తురుము – ముప్పావు కప్పు; బెల్లం – టేబుల్ స్పూను; ఉప్పు రుచికి సరిపడా. తయారీ విధానమిలా: ►బాణలిలో నూనెవేసి కాగనివ్వాలి. కాగిన నూనెలో మినపగుళ్లు, ఎండు మిర్చి వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ► ఇదే బాణలిలో నువ్వులు వేసి దోరగా వేయించాలి. ఇవి వేగిన తరువాత కరివేపాకు ఆకులు, చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసి వేయించాలి. ► కరివేపాకు వేగిన తరువాత దించేసి, కొబ్బరి తురుము వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ► కరివేపాకు మిశ్రమం వేడి తగ్గిన తరువాత బెల్లం వేసి మెత్తగా నూరుకుంటే కరివేపాకు పచ్చడి రెడీ. అన్నం, చపాతీ, ఇడ్లీ, దోశల్లోకి బావుంటుంది. -
ఫ్రైడ్రైస్లోకి కశ్మీరీ చట్నీ సూపర్ కాంబినేషన్.. ఇలా చేసుకోండి
కశ్మీరీ చట్నీ తయారీకి కావల్సినవి: కశ్మీరీ మిరపకాయలు – ఇరవై; నూనె – ఐదు టేబుల్ స్పూన్లు; వెల్లుల్లి తురుము – ఐదు టేబుల్ స్పూన్లు; అల్లం తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు –రెండు టేబుల్ స్పూన్లు; టొమాటో కెచప్ – ఐదు టేబుల్ స్పూన్లు; రెడ్చిల్లీ సాస్ – రెండు టేబుల్ స్పూన్లు; సోయాసాస్ – టేబుల్ స్పూను; మిరియాల పొడి – టేబుల్ స్పూను; అరోరూట్ పొడి – టేబుల్ స్పూను, చక్కెర – టేబుల్ స్పూను; వెనిగర్ – మూడు టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా. తయారీ విధానమిలా: మిరపకాయలను నీటిలో వేసి రెండు గంటల పాటు నానబెట్టాలి.మిరపకాయలు చక్కగా నానాక మిక్సీజార్లో వేసి పేస్టుచేసి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె మొత్తం వేసి వేడెక్కనివ్వాలి. బాగా కాగిన నూనెలో వెల్లుల్లి తురుము, అల్లం తరుగు, కొత్తిమీర తరుగు వేసి మీడియం మంట మీద వేయించాలి తరువాత ఎండుమిర్చి పేస్టు వేసి వేయించాలి.తరువాత టొమాటో కెచప్, రెడ్చిల్లీసాస్, సోయాసాస్, మిరియాల పొడి, అరోరూట్ పోడి, చక్కెర వేసి ఐదు నిమిషాలు తిప్పాలి. చివరిగా రుచికి సరిపడా ఉప్పు, వెనిగర్ వేసి రెండు నిమిషాల పాటు వెయించి దించేయాలి. నెలరోజుల పాటు నిల్వ ఉండే ఈ చట్నీ ఇడ్లీ, దోశ, నూడుల్స్, ఎగ్ఫ్రైడ్రైస్ల్లోకి మంచి కాంబినేషన్. -
టిఫిన్స్లోకి నిమ్మకాయ ఇన్స్టంట్ పచ్చడి.. ఇలా చేసుకోండి
ఉల్లి, పల్లి, కొబ్బరి, వెల్లుల్లి, పుట్నాల పచ్చళ్లు తినితిని చప్పగా మారిన నాలుకకు ఊరించే చట్నీలు కనిపిస్తే ప్రాణం లేచివస్తుంది. అందుకే చూడగానే నోరూరించే చట్నీలతో ఈ వారం వంటిల్లు మీకోసం... నిమ్మకాయ ఇన్స్టంట్ పచ్చడి తయారికి కావల్సినవి: నిమ్మకాయలు – పది; బెల్లం – అరకప్పు; జీలకర్ర – నాలుగు టీస్పూన్లు; ఎండు మిర్చి – ఇరవై; ఉప్పు – రుచికి సరిపడా. తయారీ విధానమిలా: ►నిమ్మకాయలను నాలుగు ముక్కలుగా కట్ చేయాలి.ముక్కల్లో ఉన్న గింజలన్నింటినీ తీసేయాలి (గింజలు ఉంటే పచ్చడి చేదుగా వస్తుంది). ► నిమ్మకాయ ముక్కలు, జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా పేస్టుచేయాలి ► ఎండు మిర్చి, బెల్లంను కలిపి పొడిచేయాలి ∙ఇప్పుడు నిమ్మకాయ పేస్టులో ఎండుమిర్చి పొడి, రుచికి సరిపడా ఉప్పువేసి కలపాలి. ► తాలింపు కావాలంటే వేసుకోవచ్చు. తాలింపు లేకపోయినా బావుంటుంది. ► ఈ చట్నీని వెంటనే కూడా తినవచ్చు. కానీ రెండుమూడు రోజులు మాగాక మరింత రుచిగా ఉంటుంది. ► ఇడ్లీ,దోశ, పరాటా, చపాతీ, అన్నంలోకి ఈ చట్నీ చాలా బావుంటుంది. -
శ్రావణమాసం స్పెషల్.. టేస్టీ హల్వా చేసుకోండి ఇలా
క్యారెట్–ఖర్జూరం హల్వా తయారీకి కావల్సినవి: ఖర్జూరం – పావు కప్పు (గింజలు తీసి, కడిగి, కొన్ని మంచి నీళ్లలో కొంత సేపు నానబెట్టి తీసి, ఉడికించి, మిక్సీ పట్టుకోవాలి) క్యారెట్ తురుము– 1 కప్పు, కొబ్బరి పాలు– 2 కప్పులు కొబ్బరి కోరు, కస్టర్డ్ మిల్క్– పావు కప్పు చొప్పున, నెయ్యి, పంచదార– పావు కప్పు చొప్పున (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు), కుంకుమ పువ్వు – చిటికెడు, వెనీలా ఎసెన్స్– 1 టీ స్పూన్ కిస్మిస్ గుజ్జు– 1 టేబుల్ స్పూన్, డ్రై ఫ్రూట్స్ ముక్కలు– కొన్ని (నేతిలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి), ఫుడ్ కలర్– క్యారెట్ కలర్ (అభిరుచిని బట్టి) తయారీ విధానమిలా.. ►ముందుగా ఖర్జూరం గుజ్జు, కొబ్బరి పాలు, పంచదార, ఏలకుల పొడి వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ► అనంతరం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ బౌల్లో నెయ్యి వేడి చేసుకుని.. అందులో ఖర్జూరం మిశ్రమం మొత్తం వేసుకుని చిన్న మంట మీద, గరిటెతో తిప్పుతూ ఉడికించుకోవాలి. ► కాస్త దగ్గర పడుతున్నప్పుడు క్యారెట్ తురుము, కస్టర్డ్ మిల్క్, ఫుడ్ కలర్ వేసుకుని తిప్పుతూ ఉండాలి. ► ఆ తర్వాత కిస్మిస్ గుజ్జు, కొబ్బరి కోరు, వెనీలా ఎసెన్స్ ఒకదాని తరవాత ఒకటి వేసుకోవాలి. ► ఆ మిశ్రమం మరింత దగ్గర పడగానే, డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఒకసారి అటు ఇటు కలిపి, సర్వ్ చేసుకోవాలి. -
సొరకాయతో 'సొరాటా'.. పేరు డిఫరెంట్ ఉన్నా, టేస్ట్ బావుంటుంది
సొరాటా తయారీకి కావల్సినవి: సొరకాయ లేదా గుమ్మడి తురుము – మూడు టేబుల్ స్పూన్లు; శనగపిండి – రెండు టేబుల్ స్పూన్లు; పుదీనా తరుగు – టేబుల్ స్పూను; అల్లం తరుగు – టేబుల్ స్పూను; పసుపు – ముప్పావు టీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – టీస్పూను; నెయ్యి – టీస్పూను. తయారీ విధానమిలా: పెద్దగిన్నెలో సొరకాయ తురుము, శనగపిండి, పుదీనా, అల్లం తరుగులు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. చివరిగా నూనె వేసి ముద్దలా కలుపుకోవాలి ∙ఈ ముద్దను ఉండలుగా చేసి పరాటాల్లా వత్తుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసి రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే సొరాట రెడీ. -
సాఫ్ట్ అండ్ హెల్తీ.. మొలకల డోక్లా, సింపుల్గా ఇలా చేసుకోండి
మొలకల డోక్లా తయారికి కావల్సినవి: శనగ మొలకలు – కప్పు; పాలకూర తరుగు – అరకప్పు; శనగపిండి –రెండు టేబుల్ స్పూన్లు; రాక్సాల్ట్ – టీస్పూను; నూనె – టేబుల్ స్పూను; నువ్వులు – టీస్పూను ; ఇంగువ – అరటీస్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు. తయారీ విధానమిలా: ►మొలకలు, పాలకూరను మిక్సీజార్లో వేసి కొద్దిగా నీళ్లుపోసి గ్రైండ్ చేయాలి. ► గ్రైండ్ అయిన మిశ్రమాన్ని గిన్నెలో తీసుకుని..శనగపిండి, రాక్ సాల్ట్ వేసి కలపాలి. ► ఈ మిశ్రమాన్ని ప్లేటులో పోసి ఆవిరి మీద పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి. ► బాణలిలో నూనెవేసి కాగిన తరువాత నువ్వులు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. ► ఇప్పుడు ఉడికిన డోక్లాపై ఈ తాలింపుని వేసి, నచ్చిన ఆకారంలో ముక్కలు కోసి సర్వ్ చేసుకోవాలి. -
చిరుజల్లుల్లో... క్రిస్పీగా సూజీ టోస్ట్, ఎలా చేయాలంటే
చల్లని సాయంకాలం ఓ మాదిరిగా పడుతోన్న వర్షం చినుకులు చూస్తు టీ తాగితే ఆ అనుభూతే వేరు. పొగలు గక్కే టీని సిప్ చేస్తూ క్రిస్పీగా, కారకారంగా ఉండే వేడివేడి స్నాక్స్ మరింత ఆనందాన్ని ఇస్తాయి. పకోడీ, బజ్జీ,సమోసాలు ఎప్పుడూ తినేవే కాబట్టి ఈసారి వంటిల్లు చెబుతోన్న స్నాక్స్తో టీని సిప్ చేసి చూడండి. సూజీ టోస్ట్ తయారీకి కావలసినవి: బ్రెడ్ స్లైస్లు – ఆరు, సూజీ రవ్వ – అరకప్పు; పెరుగు – పావు కప్పు; క్యారట్ తురుము – టేబుల్ స్పూను; ఉల్లిపాయ ముక్కలు – రెండు టేబుల్ స్పూన్లు; టొమాటో తరుగు – టేబుల్ స్పూను; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను; కారం – టీస్పూను; బటర్ – టోస్టు వేయించడానికి సరిపడా; ఉప్పు – రుచికి సరిపడా. తయారీ విధానమిలా: బ్రెడ్ స్లైలు తప్పించి మిగతా పదార్థాలన్నింటిని గిన్నెలో వేసి కలపాలి. రుచికి సరిపడా ఉప్పు, కొద్దికొద్దిగా నీళ్లుపోసుకుంటూ చిక్కగా కలపాలి. కలిపిన మిశ్రమాన్ని బ్రెడ్ స్లైస్మీద మందంగా పరుచుకోవాలి. ఇలా స్లైసులన్నింటికి రాశాక, నాన్స్టిక్ పాన్పై బటర్ వేసి రెండు వైపులా చక్కగా కాల్చాలి. టోస్టు బంగారు వర్ణంలో, క్రిస్పీగా మారేంత వరకు కాల్చి తీసేయాలి. -
క్షణాల్లో ఓట్స్ స్మూతీ.. సింపుల్ రెసిపి
ఓట్స్ స్మూతీ తయారీకి కావల్సినవి: ఓట్స్ –మూడు టేబుల్ స్పూన్లు; వేయించి పొట్టుతీసిన పల్లీలు – పావు కప్పు ; అవిసెగింజలు – టేబుల్ స్పూను; సబ్జాగింజలు – టీస్పూను; దాల్చిన చెక్క – అరంగుళం ముక్క; కర్జురాలు – నాలుగు; బాగా పండిన అరటి పండు – ఒకటి. తయారీ విధానమిలా: ►ఓట్స్ను పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి నానిన తరువాత శుభ్రంగా కడిగి మిక్సీజార్లో వేయాలి. దీనిలో కప్పు నీళ్లుపోయాలి. ► పల్లీలు, అవిసె, సబ్జా గింజలు, దాల్చిన చెక్క, కర్జూరాలు, అరటిపండు ముక్కలు కూడా వేయాలి. ► వీటన్నింటిని చక్కగా గ్రైండ్ చేస్తే స్మూతీ రెడీ. -
స్టఫ్డ్ బ్రెడ్ పకోడి..చాట్ మసాలాతో తింటే అదిరిపోద్ది
స్టఫ్డ్ బ్రెడ్ పకోడి తయారికి కావల్సినవి: వైట్ బ్రెడ్స్లైసులు – నాలుగు; పన్నీర్ – రెండు స్లైసులు; పుదీనా, కొత్తిమీర చట్నీ – నాలుగు టీస్పూన్లు; నూనె – డీప్ఫ్రైకి సరిపడా.స్టఫింగ్ : ఉడికించి చిదుముకున్న బంగాళ దుంప – కప్పు ; ఉల్లిపాయ – ఒకటి ; పచ్చిమిర్చి – రెండు; అల్లం వెల్లుల్లి పేస్టు – టీస్పూను; జీలకర్ర పొడి – టీస్పూను; ధనియాల పొడి – టీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; కారం – అరటీస్పూను ; ఆమ్ చూర్ పొడి – టీస్పూను; చాట్ మసాలా – టీస్పూను; గరం మసాలా –అరటీస్పూను; కొత్తిమీర తరుగు – రెండు టీస్పూన్లు. బ్యాటర్: శనగపిండి – ఒకటిన్నర కప్పులు; బియ్యప్పిండి – మూడు టేబుల్ స్పూన్లు; వాము – అరటీస్పూను ; ఉప్పు – రుచికి సరిపడా; కారం – అరటీస్పూను ; వంటసోడా – పావు టీస్పూను. తయారీ విధానమిలా: ఉల్లిపాయ, పచ్చిమిర్చిని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. పెద్ద గిన్నెతీసుకుని స్టఫింగ్ కోసం తీసుకున్న పదార్థాలన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో బ్యాటర్ కోసం తీసుకున్న పదార్థాలు, తగినన్ని నీళ్లుపోసి పకోడి పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ అంచులను తీసేసి పుదీనా కొత్తిమీర చట్నీని రాయాలి ∙దీనిపైన బంగాళదుంపల స్టఫింగ్ మిశ్రమాన్ని పెట్టాలి. చివరిగా పన్నీర్ స్లైస్ను పెట్టి మరో బ్రెడ్స్లైస్తో కప్పేసి రెండు ముక్కలుగా కట్ చేయాలి. ఇప్పుడు బ్యాటర్లో బేకింగ్ సోడా వేసి కలపాలి. శాండ్విచ్లా స్టఫ్ చేసిన బ్రెడ్ స్లైసులను బ్యాటర్లో ముంచి... సలసల మరుగుతోన్న నూనెలో డీప్ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాక తీసేసి చాట్ మసాలా చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. -
స్పెషల్ డేస్ కోసం ప్రత్యేకంగా ఖీర్.. ఇలా చేసుకోండి
స్వీట్ పొటాటో ఖీర్ తయారీకి కావల్సినవి: చిలగడదుంప – 300 గ్రాములు (తొక్క తీసేసి.. దుంపల్ని తురుములా చేసుకోవాలి) పాలు – 1 లీటరు, నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు, ఏలకులు – 3 కుంకుమపువ్వు – చిటికెడు, చక్కెర – అర కప్పు, ఉప్పు – చిటికెడు కస్టర్డ్ మిల్క్ – అర కప్పు, నట్స్ ముక్కలు – 3 టేబుల్ స్పూన్లకు పైనే (గార్నిష్కి) తయారీ విధానమిలా... ముందుగా పాన్లో నెయ్యి వేడి చేసుకుని, అందులో చిలగడదుంప తురుము వేసుకుని చిన్నమంట మీద గరిటెతో తిప్పుతూ 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. అనంతరం మరో పాత్రలో పాలు వేడి చేసుకుని.. అందులో కుంకుమ పువ్వు, ఏలకులు వేసుకుని తిప్పుతూ ఉండాలి. పాన్లో వేయించిన చిలగడదుంప తురుమును.. పాలల్లో వేసుకుని, చిన్న మంట మీద.. మధ్యమధ్యలో గరిటెతో తిప్పుతూ మెత్తగా ఉడికించుకోవాలి. అనంతరం పంచదార వేసుకుని గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. పంచదార కరిగిన తర్వాత కస్టర్డ్ మిల్క్ వేసుకుని 3 లేదా 4 నిమిషాలు ఉడకనివ్వాలి. కాస్త దగ్గర పడిన తర్వాత కొన్ని నట్స్ ముక్కలను అందులో కలిపి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకునే ముందు మిగిలిన నట్స్ ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి. -
కడుపునిండా తిన్నా బరువు తగ్గించే పరోటా రెసిపి
బరువు పెరగకుండా ఉండేందుకు, పెరిగిన బరువు తగ్గించుకునేందుకు తిండి మానేస్తుంటారు. కానీ తింటూనే బరువు తగ్గాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అందుకే కడుపునిండా తింటూ బరువుని తగ్గించుకునే వంటకాలతో ఈ వారం వంటిల్లు... ఓట్స్ బీట్రూట్ పన్నీర్ పరాటా తయారీకి కావల్సినవి: వేయించిన ఓట్స్ – కప్పు; బీట్రూట్ ప్యూరీ – కప్పు; పన్నీర్ తరుగు – అరకప్పు; గోధుమ పిండి – అరకప్పు ; జీలకర్ర – అరటీస్పూను; వాము – అరటీస్పూను; కారం – అరటీస్పూను; ఉప్పు – అరటీస్పూను ; నూనె – రెండు టీస్పూను. తయారీ విధానమిలా: పెద్దగిన్నెలో ఓట్స్, బీట్రూట్ ప్యూరీ, పనీర్ తరుగు, గోధుమ పిండి, జీలకర్ర, వాము, కారం, ఉప్పు వేసి కలపాలి. కొద్దికొద్దిగా నీళ్లుపోసుకుంటూ పరాటా పిండి ముద్దలా కలుపుకోవాలి. ఈ ముద్దను ఉండలుగా చేసుకుని పరాటాల్లా వత్తుకోవాలి. పరాటాలను రెండువైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు కాల్చుకుంటే పరాటా రెడీ.పెరుగు లేదా చట్నీతో సర్వ్చేసుకోవాలి. -
బ్రెడ్ – యాపిల్ కుల్ఫీ టేస్ట్ అదిరిపోద్ది.. ట్రై చేయండి
బ్రెడ్ – యాపిల్ కుల్ఫీ తయారీకి కావల్సినవి బ్రెడ్ స్లైసెస్ – 4 (నలువైపు బ్రౌన్ కలర్ ముక్కను తొలగించి.. మిగిలిన ముక్కల్ని మిక్సీ పట్టుకోవాలి) యాపిల్ ముక్కలు – అర కప్పు చిక్కటి పాలు – 2 కప్పులు పంచదార – పావు కప్పు (పెంచుకోవచ్చు) డ్రైఫ్రూట్స్ ముక్కలు – పావు కప్పు (అభిరుచిని బట్టి) కుంకుమ పువ్వు – కొద్దిగా తయారీ విధానమిలా ముందుగా బౌల్లో పాలు పోసుకుని గరిటెతో తిప్పుతూ కాచుకోవాలి. పంచదార, కుంకుమ పువ్వు వేసుకుని తిప్పుతూ సగం వరకూ మరిగించుకుని చల్లారబెట్టాలి. తర్వాత యాపిల్, బ్రెడ్ పౌడర్ను మిక్సీలో వేసుకుని.. ఒకసారి మిక్సీ పట్టి.. అందులో చల్లార్చిన పాలను పోసుకుని మరోసారి మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా కుల్ఫీ మేకర్లో వేసుకుని.. సుమారు 8 గంటల పాటు ఫ్రిజ్లో పెట్టుకుంటే సరిపోతుంది. -
మష్రూమ్స్తో లాలీపాప్స్.. ఎప్పుడైనా ట్రై చేశారా?
మష్రూమ్ లాలీపాప్స్ తయారీకి కావల్సినవి: పుట్టగొడుగులు – అర కప్పు (వేడి నీళ్లల్లో ఉడికించి, శుభ్రం చేసుకుని మిక్సీ పట్టుకోవాలి), ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, క్యారెట్ తరుగు, కొత్తిమీర తురుము – 2 టేబుల్ స్పూన్ల చొప్పున, బఠాణీ, స్వీట్ కార్న్ – 3 టేబుల్ స్పూన్ల చొప్పున(ఉడికించినవి), పచ్చిమిర్చి ముక్కలు – అర టీ స్పూన్, కారం, గరం మసాలా, ఆమ్ చూర్ పౌడర్, చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్ చొప్పున, బ్రెడ్ పౌడర్ – పావు కప్పు, నీళ్లు – అర కప్పు, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా.. ముందు ఒక బౌల్ తీసుకుని, అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, క్యారెట్ తరుగు, కొత్తిమీర తురుము, ఉడికించిన పుట్టగొడుగుల గుజ్జు, బఠాణీ, స్వీట్ కార్న్, పచ్చిమిర్చి ముక్కలు, కారం, గరం మసాలా, ఆమ్ చూర్ పౌడర్, చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రెడ్ పౌడర్, కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలిపి ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని.. ఒక్కో ఉండకు ఒక్కో ఐస్క్రీమ్ పుల్ల గుచ్చి.. నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. అనంతరం టమోటా సాస్ లేదా కొత్తిమీర చట్నీలో ముంచి సర్వ్ చేసుకోవచ్చు. -
ఇది తింటే ప్రోటీన్..మీల్మేకర్తో మొలకల టిక్కా..
మీల్మేకర్ మొలకల టిక్కా తయారీకి కావల్సినవి: మీల్మేకర్ – ఒకటిన్నర కప్పులు; పెసర మొలకలు – అరకప్పు; పాలకూర – చిన్నకట్ట ఒకటి; అల్లం – అంగుళం ముక్క; బియ్యప్పిండి – నాలుగు టేబుల్ స్పూన్లు; శనగపిండి – మూడు టేబుల్ స్పూన్లు; ధనియాల ΄÷డి – ఒకటిన్నర టీస్పూను; జీలకర్ర పొడి – టీస్పూను; రాక్ సాల్ట్ – అరటీస్పూను; కొత్తిమీర, పుదీనా తరుగు – అరకప్పు; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – టిక్కి వేయించడానికి సరిపడా. తయారీ విధానమిలా: ముందుగా వేడినీటిలో మీల్ మేకర్ వేసి పదినిమిషాల పాటు నానబెట్టాలి. నానిన మీల్ మేకర్ను మూడుసార్లు నీటితో కడగాలి చివరిగా మీల్ మేకర్లోని నీటిని పిండి పక్కన పెట్టుకోవాలి ∙పాలకూరను శుభ్రంగా కడిగి, మరుగుతోన్న నీటిలో వేసి రెండు నిమిషాలు ఉంచాలి. రెండు నిమిషాల తరువాత తీసి చల్లని నీటిలో వేసి, నీటిని పిండి పక్కన పెట్టుకోవాలి ∙మిక్సీజార్లో పుదీనా, కొత్తిమీర, అల్లం వేసి గ్రైండ్ చేయాలి. ఇవన్నీ నలిగిన తరువాత పెసర మొలకలు వేసి గ్రైండ్ చేయాలి. చివరగా... నీళ్లు పోయకుండా మీల్మేకర్, పాలకూర వేసి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని ధనియాల పొడి, బియ్యప్పిండి, శనగపిండి, జీలకర్ర పొడి, రాక్ సాల్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి పక్కనపెట్టుకోవాలి. పదినిమిషాల తరువాత పిండిమిశ్రమాన్ని టిక్కిల్లా చేసుకోవాలి ∙మీడియం మంటమీద నూనె వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు టిక్కీలను కాల్చుకుని సర్వ్ చేసుకోవాలి. -
వర్షాకాలంలో బెస్ట్ స్నాక్స్.. క్రిస్పీ మసాలా మత్రీ చేసుకోండి ఇలా
క్రిస్పీ మసాలా మత్రీ తయారికి కావల్సినవి గోధుమ పిండి – రెండు కప్పులు; వాము – అరటీస్పూను; కసూరీ మేథి – రెండు టేబుల్ స్పూన్లు; కారం – అరటేబుల్ స్పూను; గరం మసాలా – అరటేబుల్ స్పూను; కార్న్ స్టార్చ్ – టేబుల్ స్పూను ; నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – డీప్ఫ్రైకి సరిపడా. తయారీ విధానమిలా: గోధుమ పిండిలో వాము, కసూరీ మేథి, కారం, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. దీనిలో టేబుల్ స్పూను నెయ్యివేసి మరోసారి కలపాలి ∙ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ ముద్దలాగ కలపాలి. మిగిలిన టేబుల్ స్పూను నెయ్యిని కార్న్స్టార్చ్లో వేసి పేస్టులా కలపాలి. పిండి ముద్దను మందపాటి గుండ్రని చెక్కల్లా వత్తుకోవాలి. ఈ చెక్కలపైన కార్న్ పేస్టురాయాలి. చెక్కలను మీడియం మంటమీద క్రిస్పీగా మారేంత వరకు డీప్ప్రై చేసుకుంటే మసాలా మత్రీ రెడీ. -
కోకోనట్ ఓట్స్ కేక్.. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు
కోకోనట్ ఓట్స్ కేక్ తయారీకి కావల్సినవి: కొబ్బరి పాలు – పావు లీటర్, కొబ్బరి తురుము – 1 కప్పు ఓట్స్ పౌడర్ – ఒకటిన్నర కప్పులు,బియ్యప్పిండి – పావు కప్పు బ్రెడ్ పౌడర్ – 1 కప్పు, పంచదార – ఒకటిన్నర కప్పులు నెయ్యి – 1 లేదా 2 టీ స్పూన్లు, నీళ్లు – 2 కప్పులు తయారీ విధానమిలా.. ముందుగా స్టవ్ ఆన్ చేసి.. పాత్రలో కొబ్బరిపాలు, పంచదార వేసి.. పంచదార కరిగేవరకూ తిప్పుతూ మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అనంతరం గరిటె సాయంతో ఒక బౌల్లో ఓట్స్ పౌడర్, బ్రెడ్ పౌడర్ వేసుకుని కొద్దికొద్దిగా కొబ్బరి పాల మిశ్రమాన్ని పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో బియ్యప్పిండి, కొబ్బరి తురుము వేసి మరోసారి కలుపుకోవాలి. తర్వాత కేక్ తయారు చేసే పాత్రకు అడుగున నెయ్యి రాసి.. అందులో ఈ మిశ్రమం వేసి.. ఓవెన్లో బేక్ చేసుకుంటే సరిపోతుంది. అభిరుచిని బట్టి క్రీమ్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. -
స్నాక్స్ కోసం..చీజ్ కార్న్ రోల్స్ ఇలా చేసుకోండి
చీజ్ కార్న్ రోల్స్ రెసిపికి కావల్సినవి బంగాళ దుంపలు – మూడు; కార్న్ గింజలు – అరకప్పు; చీజ్ – అరకప్పు; వెల్లుల్లి తురుము – టీస్పూను; కార్న్ స్టార్చ్ – టేబుల్ స్పూను; బ్రెడ్ స్లైసులు –నాలుగు; కారం – అరటీస్పూను; గరం మసాలా – పావు టీస్పూను; ఛాట్ మసాలా – అరటీస్పూను; మిరియాల పొడి – అరటీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – డీప్ఫ్రైకి సరిపడా. తయారీ విధానమిలా.. బంగాళ దుంపలు, కార్న్ గింజలను విడివిడిగా ఉడికించాలి ∙బంగాళ దుంపల తొక్క తీసి చిదుముకోవాలి ∙దీనిలో కార్న్ గింజలు, వెల్లుల్లి తురుము, కార్న్స్టార్చ్, కారం, గరం మసాలా, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి ∙ఈ మిశ్రమంలో సన్నగా తరిగిన బ్రెడ్స్లైసులను వేసి అన్నీ కలిసిపోయేలా కలిపి, చిన్నచిన్న ఉండలు చేసుకోవాలి. ఈ ఉండలకు వేలితో రంధ్రం చేసి చీజ్ను సన్నగా తురిమి పెట్టాలి తరువాత రంధ్రాలని మూసేసి రోల్స్ ఆకారం లో వత్తుకోవాలి ∙ఇలా అన్ని ఉండలను రోల్స్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు డీప్ఫ్రై చేసి, సాస్తో సర్వ్ చేసుకోవాలి. -
బేకరీ స్టైల్లో.. ఫ్లఫీ పాన్కేక్ తయారీ ఇలా
ఫ్లఫీ పాన్కేక్ తయారీకి కావల్సినవి: గుడ్లు – రెండు; లు – రెండు టేబుల్ స్పూన్లు; వెనీలా ఎసెన్స్ – పావు టీస్పూను; గోధుమ పిండి – పావు కప్పు; వంటసోడా – టీస్పూను; చక్కెర – రెండు టేబుల్ స్పూన్లు; ఉప్పు – చిటికెడు. తయారీ విధానమిలా: గుడ్లలోని పచ్చసొనను ఒక గిన్నెలోకి తీసుకుని పాలు, వెనీలా ఎసెన్స్ వేసి ఐదు నిమిషాల పాటు నురగవచ్చేంత వరకు చక్కగా కలపాలి. ఇప్పుడు దీనిలో గోధుమ పిండి వేసి పేస్టులా కలిపి పక్కన పెట్టాలి. గుడ్ల తెల్ల సొనలో చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. ఒక్కో స్పూను చక్కెర వేస్తూ నురగ వచ్చేంత వరకు కలపాలి. నురగ వచ్చిన మిశ్రమాన్ని గుడ్ల పచ్చసొన మిశ్రమంలో వేసి కలపాలి. వేడెక్కిన నాన్స్టిక్ పాన్ పై కొద్దిగా నెయ్యిరాసి కేక్లా పోసుకోవాలి. ఈ కేక్ చుట్టూ రెండు మూడు స్పూన్ల నీళ్లుపోసి మూత పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు రెండువైపులా చక్కగా ఉడికిస్తే జపనీస్ ఫ్లఫీ పాన్కేక్ రెడీ వేడిగా ఉన్నప్పుడే బటర్, మేపిల్ సిరప్తో సర్వ్చేసుకోవాలి. -
అరటిపండుతో నిమిషాల్లో స్వీట్ తయారీ.. చేయండిలా
అరటిపండు మైసూర్ పాక్ తయారికి కావల్సినవి: శనగపిండి – కప్పు; నెయ్యి – కప్పు; ఎర్ర అరటి పండ్లు – రెండు; చక్కెర – కప్పు. తయారీ విధానమిలా శనగపిండిని పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి. అరటిపండ్లు తొక్కతీసి ప్యూరీలా గ్రైండ్ చేయాలి.వేగిన పిండిలో కొద్దిగా నెయ్యి వేసి పేస్టులా కలిపి దించేయాలి. చక్కెరలో కప్పు నీళ్లుపోసి మరిగించాలి.తీగపాకం వచ్చిన తరువాత శనగపిండి పేస్టు, అరటిపండు ప్యూరిని వేసి బాగా కలపాలి. మిశ్రమం చిక్కగా దగ్గరపడినప్పుడు దించేసి, నెయ్యిరాసిన ప్లేటులో వేసి ముక్కలుగా కట్ చేస్తే బనానా పాక్ రెడీ. -
కీమాతో పనీర్ బన్స్.. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా?
కీమా – పనీర్ బన్స్ తయారికి కావల్సినవి: కీమా – అర కప్పు (శుభ్రం చేసుకుని, మసాలా జోడించి మెత్తగా ఉడికించుకోవాలి), గోధుమ పిండి – 2 కప్పులు పంచదార – 2 టేబుల్ స్పూన్లు, నీళ్లు – సరిపడా, పనీర్ తురుము – పావు కప్పు ఉల్లిపాయ – 1(చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), బంగాళదుంప – 1 (ముక్కలు చేసుకోవాలి), కారం – అర టీ స్పూన్ , కొత్తిమీర తురుము – 1 టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్. ఆమ్చూర్ పౌడర్ – అర టీ స్పూన్ , ఉప్పు – తగినంత, నూనె – సరిపడా,నువ్వులు – కొద్దిగా (గార్నిష్కి) తయారీ విధానమిలా ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ల నూనె, పంచదార, కొద్దిగా ఉప్పు.. వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలా చేసుకుని తడి కర్చీఫ్ కప్పి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని.. కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకుని, అందులో ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, పనీర్ తురుము, కీమా వేసుకుని గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కారం, కొత్తిమీర తురుము, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పౌడర్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉడికించుకోవాలి. అనంతరం గోధుమ మిశ్రమాన్ని చిన్న చిన్న పూరీ ఉండల్లా చేసుకుని.. అందులో పనీర్ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా పెట్టుకుని.. బాల్స్లా చేసుకుని, పైన నువ్వులతో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని ఓవెన్లో బేక్ చేసుకుంటే సరిపోతుంది. -
చెర్రీ చాక్లెట్ బాల్స్.. ఒక్కసారి రుచి చూస్తే వదలిపెట్టరు
చెర్రీ – చాక్లెట్ బాల్స్ తయారీకి కావల్సినవి: చెర్రీలు – 3 కప్పులు (గింజలు తీసి, శుభ్రం చేసి, గుజ్జులా చేసుకోవాలి), చాక్లెట్ చిప్స్ – అర కప్పు (ఓవెన్లో క్రీమ్లా మెల్ట్ చేసుకోవాలి) వాల్ నట్స్ – 1 కప్పు (మెత్తగా పౌడర్ చేసుకోవాలి) జీడిపప్పులు – పావు కప్పు (కచ్చాబిచ్చా మిక్సీ పట్టుకోవాలి) ఖర్జూరం గుజ్జు – పావు కప్పు (గింజలు తీసి, ముక్కలు చేసి పెట్టుకోవాలి) ఉప్పు – చిటికెడు, దాల్చినచెక్క పొడి – కొద్దిగా, కొబ్బరి పాలు – 100 గ్రాములు కొబ్బరి తురుము – గార్నిష్కి సరిపడా (అభిరుచిని బట్టి), నెయ్యి – కొద్దిగా తయారీ విధానమిలా: ముందుగా మిక్సీ బౌల్లో ఖర్జూరం ముక్కలు, 50 గ్రాముల కొబ్బరి పాలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అందులో చెర్రీ గుజ్జు, దాల్చినచెక్క పొడి, మిగిలిన కొబ్బరి పాలూ పొసుకుని మరోసారి మిక్సీ పట్టుకుని మొత్తం మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ మిశ్రమంలో చాక్లెట్ క్రీమ్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కచ్చాబిచ్చాగా చేసుకున్న జీడిపప్పు ముక్కలు, వాల్నట్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం నేతిని చేతులకు రాసుకుని.. ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసుకుని.. కొబ్బరి తురుముతో లేదా కోకోనట్ బటర్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఇవి భలే రుచిగా ఉంటాయి. -
ఇలా చేస్తే క్యారట్స్ను పిల్లలు ఇష్టంగా తింటారు..
క్యారట్ డేట్స్ స్వీట్ తయారికి కావల్సినవి: క్యారట్ తురుము – పావు కప్పు ; విత్తనాలు తీసేసిన డేట్స్ – పావు కప్పు; బెల్లం – పావు కప్పు; శనగపిండి – అరకప్పు; బ్రౌన్సుగర్ – కప్పు; నెయ్యి – అరకప్పు; నూనె- పావు కప్పు. తయారీ విధానమిలా.. శనగపిండిని జల్లెడ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ∙టేబుల్ స్పూను నెయ్యి వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి మందపాటి బాణలిలో మిగిలిన నెయ్యి, నూనె వేసి ఐదు నిమిషాలు వేడి చేసి పక్కనపెట్టుకోవాలి. బెల్లంలో పావు కప్పు నీళ్లుపోసి మరిగించాలి. బెల్లం కరిగిన తరువాత వడగట్టి పక్కన పెట్టాలి ∙ క్యారట్,డేట్స్, బెల్లం నీళ్లుపోసి మెత్తగా గ్రైండ్ చేయాలి .గ్రైండ్ చేసి ప్యూరీని ముక్కలు లేకుండా వడగట్టి తీసుకోవాలి. బాణలిలో బ్రౌన్ సుగర్, అరకప్పు నీళ్లుపోసి మరిగించాలి ∙షుగర్ కరిగిన తరువాత క్యారట్ డేట్స్ ప్యూరిని వేసి సన్ననని మంట మీద తిప్పుతూ ఉండాలి . తీగ పాకం వచ్చాక శనగపిండి వేసి ఉండలు లేకుండా కలపాలి.ఇప్పుడు కాచి పెట్టుకున్న నెయ్యి /నూనెను కొద్దికొద్దిగా వేస్తూ కలపాలి నెయ్యి మొత్తాన్ని మిశ్రమం పీల్చుకుని దగ్గరపడిన తరువాత దించి నెయ్యిరాసిన ప్లేటులో పోసుకోవాలి మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు ముక్కలు కట్ చేసుకుంటే క్యారట్, డేట్స్ పాక్ రెడీ. ఇలా చేస్తే పిల్లలు క్యారట్ను ఎంతో ఇష్టంగా తింటారు. -
కొబ్బరి జీడిపప్పుతో మైసూర్ పాక్.. సింపుల్గా ఇలా చేసుకోండి
కొబ్బరి జీడిపప్పు మైసూర్ పాక్ తయారీకి కావల్సినవి: శనగపిండి – కప్పు; పచ్చికొబ్బరి తురుము – కప్పు; సన్నగా తరిగిన జీడిపప్పు పలుకులు – ముప్పావు కప్పు ; చక్కెర – రెండు కప్పులు ; నెయ్యి – ముప్పావు కప్పు ; యాలకులు – నాలుగు; నీళ్లు – ఒకటి ముప్పావు కప్పులు. తయారీ విధానమిలా.. శనగపిండిని జల్లెడపట్టుకుని, అరకప్పు నెయ్యి వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి మందపాటి గిన్నెలో చక్కెర, నీళ్లు పోసి తీగపాకం వచ్చేంత వరకు మరిగించాలి. తీగపాకం వచ్చిన తరువాత కొబ్బరి తురుము, జీడిపప్పు పలుకులు వేసి కలపాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న శనగపిండి వేసి కలపాలి. చివరిగా యాలకులను దంచి వేయాలి ∙ఈ మిశ్రమంలో మిగిలిన నెయ్యిని టేబుల్ స్పూను చొప్పున వేస్తూ కలుపుతూ ఉండాలి. నెయ్యి మొత్తం వేసిన తరువాత చక్కగా కలిపి, మిశ్రమం గట్టిపడకముందే దించేయాలి. ఇప్పుడు నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేటులో ఈ మిశ్రమాన్ని వేసి ఆరనివ్వాలి ∙పదినిమిషాల తరువాత ముక్కలుగా కట్ చేస్తే కొబ్బరి జీడిపప్పు మైసూర్ పాక్ రెడీ. -
మనసు దోచే మైసూరు పాకం బీట్రూట్తో.. ఇలా చేసుకోండి
ప్రపంచంలో ఎక్కువమంది ఇష్టంగా తినే స్ట్రీట్ ఫుడ్స్లో మన మైసూర్ పాక్ కూడా ఒకటి. ఎంతోమంది మనసులు గెలుచుకున్న మైసూర్ పాక్ను మరింత వైవిధ్యంగా కూడా చేయొచ్చు. అందుకే విభిన్న మైసూర్΄ాక్లతో మీ ముందుకొచ్చింది.ఈ వారం వంటిల్లు... బీట్రూట్ మైసూర్ పాక్ తయారీకి కావల్సినవి: బీట్ రూట్ జ్యూస్ – అరకప్పు; శనగపిండి – కప్పు; నెయ్యి – ఒకటిన్నర కప్పులు; చక్కెర – కప్పు. తయారీ విధానమిలా.. శనగపిండిని సన్నని మంట మీద పచ్చివాసన పోయేంతవరకు వేయించి దించేయాలి ∙వేగిన పిండి జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో నెయ్యి వేసి ఉండలు లేకుండా చక్కగా కలుపుకొని పక్కన పెట్టాలి మందపాటి బాణలిలో పంచదార, బీట్రూట్ జ్యూస్ వేసి సన్నని మంటమీద తిప్పుతూ తీగపాకం రానివ్వాలి పాకం వచ్చిన తరువాత కలిపిపెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేస్తూ కలుపుకోవాలి. చక్కగా కలిపాక అరకప్పు నెయ్యిని కొద్దికొద్దిగా వేస్తూ కలపాలి.నెయ్యి మొత్తం మిశ్రమంలో ఇగిరిపోయి , చిక్కబడిన తరువాత దించేసి, నెయ్యి రాసిన ప్లేటులో పోయాలి. గంట ఆరాక ముక్కలు కోసుకుని సర్వ్చేసుకోవాలి. అంతే టేస్టీ అండ్ హెల్తీ బీట్రూట్ మైసూర్ పాక్ రెడీ. -
లో క్యాలరీస్ కోసం కాలిఫ్లవర్ బ్రెడ్ ట్రై చేయండి
కాలీఫ్లవర్ బాదం బ్రెడ్ తయారీకి కావల్సినవి: కాలీఫ్లవర్ – 1 (వేడి నీళ్లతో బాగా శుభ్రం చేసుకుని, మిక్సీ పట్టుకోవాలి) బాదం తురుము – ఒకటింపావు కప్పులు, గుడ్లు – 6 ఆలివ్ నూనె – పావు కప్పు, ఉప్పు – కొద్దిగా ఓరెగాన్ , బేకింగ్ పౌడర్ – 1 టీ స్పూన్ చొప్పున తయారీ విధానమిలా.. ముందుగా ఒక పెద్ద బౌల్లో గుడ్లు పగలగొట్టుకుని.. హ్యాండ్ బ్లెండర్తో నురుగు వచ్చేలా బాగా మిక్సీ పట్టుకోవాలి. అందులో కాలీఫ్లవర్ తురుము, ఆలివ్ నూనె, బాదం తురుము, ఓరెగాన్ , బేకింగ్ పౌడర్, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని బ్రెడ్ మేకర్లో వేసుకుని బేక్ చేసుకుంటే సరిపోతుంది. సర్వ్ చేసుకునే ముందు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. -
ఈజీ అండ్ ఫాస్ట్గా మిల్క్ దాల్ హల్వా
మిల్క్ దాల్ హల్వా తయారీకి కావల్సినవి చిక్కటి పాలు, పుట్నాల పప్పు – 2 కప్పులు చొప్పున పంచదార – 2 కప్పులు (పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు) జీడిపప్పులు –10, నెయ్యి – 5 లేదా 6 టేబుల్ స్పూన్లు ఏలకులు – 2 (అభిరుచిని బట్టి) తయారీ విధానమిలా.. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. ఒక పాత్రలో పాలు వేడి చేసుకుని అందులో పుట్నాల పప్పు వేసుకుని గరిటెతో తిప్పుతూ, చిన్న మంట మీద, పాలను ఒక పొంగు రానివ్వాలి. వెంటనే మరోసారి కలిపి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పాలు చల్లారాక ఆ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకుని మెత్తగా చేసుకోవాలి. అందులోనే జీడిపప్పు, పంచదార, ఏలకులు వేసుకుని మరోసారి మెత్తగా చేసుకోవాలి. మిక్సీ చేసుకునేటప్పుడు అవసరమైతే కొద్దిగా పాలు లేదా నీళ్లు పోసుకోవచ్చు. మరోసారి స్టవ్ ఆన్ చేసుకుని.. ముందు వాడిన పాత్రను ఒకసారి క్లీన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని.. వేడి కాగానే పాలు, పప్పు మిశ్రమాన్ని అందులో వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ దగ్గర పడే వరకూ తిప్పుతూ ఉండాలి. దగ్గర పడగానే.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివరిగా మిలిగిన కాస్త నెయ్యి కూడా వేసుకుని బాగా కలపాలి. అనంతరం నచ్చిన పాత్రకు కొద్దిగా నూనె లేదా నెయ్యి రాసి, ఈ మొత్తం మిశ్రమాన్ని అందులో వేసి చదును చెయ్యాలి. కాసేపటికి ముక్కలు కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. -
కోల్కతా స్టైల్లో కీమాతో నూడుల్స్ కట్లెట్.. ఈసారి ట్రై చేయండి
కీమా నూడుల్స్ కట్లెట్ తయారీకి కావల్సినవి: కీమా – పావు కప్పు (మసాలా జోడించి మెత్తగా ఉడికించుకోవాలి) నూడుల్స్ – 1 కప్పు (నీళ్లల్లో ఉడికించి, జల్లెడ గరిటెతో వడకట్టి పక్కన పెట్టుకోవాలి) బంగాళ దుంపలు – 2 (మీడియం సైజ్, మెత్తగా ఉండికించి ముద్దలా చేసుకోవాలి) ఉల్లిపాయ – 1 (చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి) పచ్చిమిర్చి – 1 (చిన్నగా తరగాలి) క్యారెట్ – 2 టేబుల్ స్పూన్లు (తురుముకోవచ్చు లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు) క్యాప్సికం –2 టేబుల్ స్పూన్లు పచ్చి బఠాణీ – 1 టేబుల్ స్పూన్ (నానబెట్టుకోవాలి) కారం – అర టీ స్పూన్, పసుపు – చిటికెడు ఉప్పు – తగినంత జీలకర్ర పొడి, మసాలా – 1 టీ స్పూన్ చొప్పున నూడుల్స్ ముక్కలు – పావు కప్పు (అభిరుచిని బట్టి, నూడుల్స్ని ఉడికించకముందు విరిచి.. కారప్పూసలా చేసుకోవాలి) గుడ్లు – 2 (చిన్న బౌల్లో 1 గరిటెడు పాలు, గుడ్లు కలిపి పక్కన పెట్టుకోవాలి), నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా.. ముందుగా ఒక పెద్ద బౌల్లో ఉడికిన నూడుల్స్, కీమాతో పాటు బంగాళదుంప ముద్ద, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు లేదా తురుము, పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికం ముక్కలు, బఠాణీలు, కారం, పసుపు, జీలకర్ర పొడి, మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. చివరిగా తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి.. కట్లెట్స్లా చేసుకుని, నూనెలో దోరగా వేయించుకోవాలి. అభిరుచిని బట్టి వేయించుకునే ముందే ప్రతి కట్లెట్ని గుడ్డు, పాల మిశ్రమంలో ముంచి, నూడుల్స్ ముక్కల్లో దొర్లించి.. అప్పుడు వేయించుకోవచ్చు. వీటిని టొమాటో సాస్తో లేదా కొత్తిమీర చట్నీతో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి. -
కర్ణాటక స్టైల్లో.. మిగిలిపోయిన అన్నంతో రొట్టెలు
రైస్ రొట్టి తయారీకి కావల్సినవి: మిగిలిన అన్నం – మూడు కప్పులు ; ఉల్లిపాయ తరుగు – అరకప్పు ; క్యారట్ తురుము – కప్పు ; పచ్చిమిర్చి – నాలుగు (సన్నగా తరగాలి) ; అల్లం – అంగుళం ముక్క (తురమాలి) ; కరివేపాకు – మూడు రెమ్మలు ; కొత్తిమీర తరుగు – పావు కప్పు ; జీలకర్ర – అరటీస్పూను ; బియ్యప్పిండి – ముప్పావు కప్పు ; ఉప్పు – రుచికి సరిపడా ; నూనె – రొట్టి వేగడానికి సరిపడా. తయారీ విధానమిలా.. అన్నాన్ని నీళ్లు పోయకుండా పేస్టులా గ్రైండ్ చేయాలి. అన్నం పేస్టుని గిన్నెలో వేసి..ఉల్లిపాయ ముక్కలు , క్యారట్ తురుము, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, కొత్తిమీర తరుగు, అల్లం తరుగు, జీలకర్ర రుచికి సరిపడా ఉప్పువేసి చక్కగా కలుపుకోవాలి. కొద్దిగా బియ్యప్పిండి వేసి ముద్దగా కలుపుకుని పదినిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చేతులు తడిచేసుకుని పిండిని టెన్నిస్ బంతి పరిమాణంలో ఉండలుగా చేయాలి. ఈ ఉండలను అరిటాకు లేదా కవర్ మీద పెట్టి రొట్టెలా చేతితో వత్తుకోవాలి. పలుచగా వత్తుకున్న రొట్టెపై అక్కడక్కడ రంధాల్రు చేయాలి. ఈ రొట్టెను చక్కగా కాలిన పెనం మీద వేసి సన్నని మంట మీద కొద్దిగా నూనె వేసి రెండు వైపులా చక్కగా కాల్చుకుని వేడివేడిగా సర్వ్చేసుకోవాలి. -
వర్షాకాలంలో వడియాలు.. ఈసారి అన్నంతో ట్రై చేయండి
అన్నం వడియం తయారీకి కావల్సినవి: అన్నం – కప్పు ; ఎండు మిర్చి – మూడు ; జీలకర్ర – రెండు టీస్పూన్లు ; ఉల్లిపాయ – ఒకటి ; పచ్చిమిర్చి – ఒకటి ; కరివేపాకు – రెమ్మ ; ఉప్పు – రుచికి సరిపడా ; నూనె – డీప్ఫ్రైకి సరిపడా. తయారీ విధానమిలా.. అన్నం మునిగేలా నీళ్లుపోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే నీళ్లు తీసేసి అన్నాన్ని మిక్సీ జార్లో వేయాలి. దీనిలో ఎండుమిర్చి, జీలకర్ర వేసి బరకగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమంలో సన్నగా తరిగిన ఉల్లిపీయను, పచ్చిమిర్చిని వేయాలి. కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసి చక్కగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలు చేసి మూడు రోజులు ఎండలో ఆరబెట్టాలి. ఉండలు చక్కగా ఆరాక, గాలిచొరబడని డబ్బాలో వేసి నిల్వచేయాలి. స్నాక్స్ సమయం లేదా అన్నం తినేటప్పుడు ఈ ఉండలను గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు డీప్ఫ్రై చేసి సర్వ్చేసుకోవాలి. -
మిగిలిపోయిన అన్నంతో ఇన్స్టంట్ ఊతప్పం..ఇలా చేసుకోండి
లంచ్, డిన్నర్లలో వండిన అన్నం కొన్నిసార్లు మిగిలిపోతుంటుంది. అలా మిగిలిన అన్నాన్ని పులిహోర, ఎగ్రైస్, వెజ్ రైస్ చేసుకోవడం మామూలే. తరచూ మసాలా రైస్ తినబుద్దికాదు. అందువల్ల మిగిలిపోయిన అన్నాన్నీ మరింత రుచిగా ఇలా కూడా చేయవచ్చని చెబుతోంది ఈ వారం వంటిల్లు... ఇన్స్టంట్ ఊతప్పం తయారీకి కావల్సినవి: మిగిలిన అన్నం – కప్పు ; బొంబాయి రవ్వ – అరకప్పు ; పెరుగు – కప్పు; క్యారట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టొమాటో ముక్కలు – కప్పు; అల్లం తరుగు – టీస్పూను ; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు ; జీలకర్ర – టీస్పూను ; ఉప్పు – రుచికి సరిపడా; నూనె ఊతప్పం వేయించడానికి – తగినంత. తయారీ విధానమిలా.. పెద్దగిన్నెలో రవ్వ, పెరుగు వేసి కలిపి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అన్నంలో కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన అన్నాన్ని రవ్వ మిశ్రమంలో వేసి కలపాలి. దీనిలో కప్పు నీళ్లుపోసి కలపాలి. ఇప్పుడు కూరగాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర వేసి కలపాలి.ఈ మిశ్రమాన్ని వేడెక్కిన పెనంపై నూనె వేసి ఊతప్పంలా వేయాలి. డువైపులా నూనె చల్లుకుంటూ చక్కగా కాల్చుకుంటే ఇన్స్టంట్ ఊతప్పం రెడీ. ∙కూరగాయ ముక్కలను పిండిలో కలపకుండా ఊతప్పం పైన చల్లుకుని కూడా కాల్చుకోవచ్చు. -
ఇంట్లోనే పనీర్ జిలేబీ చేసుకోండి ఇలా..
పనీర్ కార్న్ జిలేబీ తయారీకి కావల్సినవి: పనీర్ తురుము 300 గ్రాములు పంచదార 1 కప్పు, కుంకుమ పువ్వు కొద్దిగా కార్న్ పౌడర్ పావు కప్పు, మైదా పిండి 2 టేబుల్ స్పూన్లు, ఏలకుల పొడి పావు టీ స్పూన్, బేకింగ్ సోడా అర టీ స్పూన్, నెయ్యి సరిపడా, నీళ్లు కొన్ని పిస్తా ముక్కలు లేదా జీడిపప్పు ముక్కలు గార్నిష్కి తయారీ విధానమిలా.. ముందుగా పెద్ద బౌల్లో కార్న్ పౌడర్, మైదాపిండి, బేకింగ్ సోడా వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని, ఉండలు లేకుండా పలచగా కలుపుకోవాలి. అనంతరం ఆ మిశ్రమంలో పనీర్ తురుము వేసుకుని బాగా కలిపి.. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ పేస్ట్ని ఒక కవర్లో వేసుకుని, ఆ కవర్ని కోన్లా తయారు చేసుకోవాలి. మరుగుతున్న నేతిలో జిలేబీల్లా చుట్టుకుని, దోరగా వేయించుకోవాలి. ఈ లోపు మరో స్టవ్ మీద పంచదార, కుంకుమ పువ్వు, ఏలకుల పొడి, సరిపడా నీళ్లు పోసుకుని లేతపాకం పెట్టుకుని.. వేడివేడిగా ఉన్న జిలేబీలను అందులో వేసుకుని పాకం పట్టించాలి. అనంతరం ప్లేట్లోకి తీసుకుని, పిస్తా ముక్కలు లేదా జీడిపప్పు ముక్కలు వేసుకుని సర్వ్ చేసుకోవాలి. -
టమాటా లేకపోతేనేం.. ఇలా వంటలు చేసుకోండి
చాలామందికి టొమాటో కలపనిదే కూర చేయబుద్ధి కాదు. అయితే ఇటీవల కొద్దికాలం నుంచి సెంచరీ కొట్టినా .. కిందకి దిగనంటోంది టొమాటో. అయినా ఏం పర్వాలేదు, టొమాటో లేకపోయినా కూరలను రుచిగా వండొచ్చని చేసి చూపిస్తోంది ఈ వారం వంటిల్లు.... బైగన్ కా బార్తా తయారీకి కావల్సినవి: మీడియం సైజు వంకాయలు – రెండు వెల్లుల్లి రెబ్బలు – నాలుగు నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు వెల్లుల్లి తరుగు – రెండు టీస్పూన్లు ; అల్లం – అంగుళం ముక్క (సన్నగా తురుముకోవాలి) పచ్చిమిర్చి తరుగు – రెండు టీస్పూన్లు ; ఉల్లిపాయ తరుగు – అరకప్పు కారం – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి – టీస్పూను ఉప్పు – రుచికి తగినంత; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ విధానమిలా.. ♦ వంకాయలను శుభ్రంగా కడిగి తడిలేకుండా తుడుచుకోవాలి. ♦ ఇప్పుడు వంకాయలకు కొద్దిగా నూనె రాసి మూడు వైపులా మూడుగాట్లు పెట్టాలి. ఈ చీలిక మధ్యలో వెల్లుల్లి రెబ్బలను లోపలికి పోయేలా పెట్టాలి. ♦ ఇప్పుడు వంకాయను మంటమీద నేరుగా పెట్టి చక్కగా కాల్చుకోవాలి. ♦ వంకాయ కాలిన తరువాతచల్లారనిచ్చి, వెల్లుల్లి రెబ్బలను బయటకు తీసి సన్నగా తరగాలి. వంకాయను మెత్తగా చిదుముకోవాలి. ♦ బాణలిలో నూనెవేసి, కాగిన తరువాత వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి తరుగు వేసి రెండు నిమిషాలు వేయించాలి. ♦ ఇప్పుడు చిదుముకున్న వంకాయ గుజ్జు, ఉడికించి తరిగిన వెల్లుల్లిని వేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. ♦ కారం, ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పువేసి కలపాలి. ♦ నూనె పైకి తేలేంత వరకు మగ్గనిచ్చి కొత్తిమీర తరుగు చల్లుకుని దించేస్తే బైగాన్ బార్తా రెడీ. రోటీల్లోకి మంచి సైడ్ డిష్. -
వేడివేడి అన్నంలో కాకరకాయ పచ్చడితో ఇలా టేస్టీగా..
కాకరకాయ పచ్చడి తయారీకి కావల్సినవి: కాకరకాయలు – పెద్దవి రెండు; పచ్చిమిర్చి – పన్నెండు చిన్న ఉల్లిపాయలు – పదిహేను; అల్లం – అంగుళం ముక్క పచ్చికొబ్బరి తురుము – అరకప్పు ; గడ్డపెరుగు – రెండు కప్పులు ఆవాలు – అరటీస్పూను, మెంతులు – పావు టీస్పూను ఎండు మిర్చి – రెండు ; కరివేపాకు – ఐదు రెమ్మలు నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు, కారం – చిటికెడు. తయారీ విధానం ఇలా.. కాకరకాయలను నీటిలో నానబెట్టి శుభ్రంగా కడిగి విత్తనాలు తీసేయాలి. ఇప్పుడు కాకరకాయలను చిన్నచిన్న ముక్కలుగా తరుక్కోవాలి. అల్లం తొక్కతీసి సన్నగా తరగాలి. 10 పచ్చిమిర్చి, 12 ఉల్లిపాయలను కూడా సన్నని ముక్కలుగా కట్ చేయాలి. కాకరకాయ, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను ఒక గిన్నెలో వేయాలి. దీనిలో కరివేపాకు, కొద్దిగా ఉప్పు, టీస్పూను నూనెవేసి చక్కగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం మొత్తాన్ని బాణలిలో వేసి రెండు నిమిషాలు పెద్దమంట మీద వేయించాలి. తరువాత మూతపెట్టి సన్న మంట మీద పది నిమిషాలు మగ్గనివ్వాలి. మధ్యలో కలుపుతూ అడుగంటితే మరో టీస్పూను నూనె వేయాలి. కొబ్బరి తురుముకు మూడు ఉల్లిపాయలు, రెండు పచ్చిమిరపకాయలు, రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు జోడించి పేస్టు చేయాలి. బాణలిలో మగ్గుతున్న మిశ్రమంలో ఈ పేస్టు వేసి, కలిపి ఐదు నిమిషాల తరువాత దించేయాలి. పెరుగుని సమంగా కలుపుకుని మగ్గిన మిశ్రమంలో వేయాలి. రుచికి సరిపడా ఉప్పు కలిపి తిప్పాలి. ∙మిగిలిన నూనెతో ఆవాలు, మెంతులు, ఎండు మిర్చి. కరివేకుతో తాలింపు వేసి కలుపుకోవాలి. చివరిగా కారం చల్లుకుని సర్వ్చేసుకోవాలి. -
రుచికీ, ఆరోగ్యానికీ బీర.. బీరకాయ నువ్వుల పచ్చడి తయారీ ఇలా..
డయాబెటిస్... హైబీపీ... రాజ్యమేలుతున్న రోజులివి. ఈ జంట సమస్యలు లేని ఇంటి కోసం భూతద్దంతో వెతకాల్సిందే. స్క్రీన్లతో స్మార్ట్గా కళ్లకు అద్దాలు జోడవుతున్నాయి. వీటికి జవాబులు మన ‘వంటిల్లు’లో వెతుకుదాం. వేడిని తగ్గించి, కంటికి మేలు చేసి, రక్తాన్ని వృద్ధి చేసే... బీరకాయతో... రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. బీరాలు పోవడం లేదు... బీరకాయ కూర చేస్తున్నాం. బీరకాయ నువ్వుల పచ్చడి కావలసినవి: ►బీరకాయ ముక్కలు – కప్పు ►టొమాటో ముక్కలు – అర కప్పు ►చింతపండు– చిన్న గోళీ అంత ►మినప్పప్పు – టీ స్పూన్ ►పచ్చి శనగపప్పు – టీ స్పూన్ ►నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు ►ఆవాలు– పావు టీ స్పూన్ ►జీలకర్ర – పావు టీ స్పూన్ ►ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి – 6 ►నూనె – టీ స్పూన్ ►ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి. పోపు కోసం... ఆవాలు– అర టీ స్పూన్ ►జీలకర్ర– అర టీ స్పూన్ ►వెల్లుల్లి రేకలు – 6 ►కరివేపాకు రెమ్మలు – 2 ►తెల్ల నువ్వులు – అర టీ స్పూన్. తయారీ: ►మందపాటి పెనంలో (నూనె లేకుండా) పచ్చి శనగపప్పు, మినప్పప్పు, నువ్వులు, మిర్చి, జీలకర్ర వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ►అదే పెనంలో నూనె వేడి చేసి బీరకాయ ముక్కలను ఒక మోస్తరుగా వేయించి పక్కన పెట్టాలి. ►అదే పెనంలో టొమాటో ముక్కలను వేసి సన్న మంట మీద మగ్గనివ్వాలి. ►ఈలోపు వేయించిన గింజలు, మిర్చి చల్లారి ఉంటాయి. ►వాటిని మిక్సీ జార్లో మెత్తగా చేసి అందులో బీరకాయ ముక్కలు వేసి గ్రైండ్ చేయాలి. ►చివరగా టొమాటో ముక్కలు, చింతపండు, ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి ►ఇప్పుడు పోపు పెట్టాలి. ►పెనంలో నూనె వేడి చేసి పోపుకోసం తీసుకున్న దినుసులన్నీ వేసి వేగిన తరవాత అందులో మిక్సీలో గ్రైండ్ చేసిన చట్నీని వేసి కలిపితే బీరకాయ చట్నీ రెడీ. ఇది ►ఇడ్లీ, దోశెలు, చపాతీలు, అన్నంలోకి కూడా మంచి రుచినిస్తుంది. -
ఆరోగ్యాన్నిచ్చే కాకరతో.. కేరళ కర్రీ ‘తోరన్’ తయారీ ఇలా! ఒక్కసారి తింటే..
Kakarakaya Health Benefits: కాకర డయాబెటిస్ను నియంత్రిస్తుంది. వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది. అంటువ్యాధులు... వాపులను తగ్గిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది... మంచి ఊపిరినిస్తుంది. కళ్లు... ఎముకలు... లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. సెల్ డ్యామేజ్ని అడ్డుకుని చర్మానికి మేలు చేస్తుంది. ఇన్ని ‘మేళ్లు’ చేయడం కాకరకాయకే సాధ్యం. అందుకే... ఈ చేదు రుచులను స్వాగతిద్దాం. ఈ వారం మన ‘వంటిల్లు’ను కాకరకు వేదిక చేద్దాం. తోరన్... కావలసినవి: ►కాకరకాయలు – అర కేజీ ►పచ్చి కొబ్బరి తురుము – పావు కేజీ ►పచ్చి మిర్చి– 10 (సన్నగా తరగాలి) ►బెల్లం లేదా బెల్లం పొడి– 3 టేబుల్ స్పూన్లు ►ఉప్పు – టీ స్పూన్ ►పసుపు– అర టీ స్పూన్ ►కరివేపాకు – 2 రెమ్మలు ►నూనె– 5 టేబుల్ స్పూన్లు. తయారీ: ►కాకరకాయలను శుభ్రంగా కడగాలి. చివరలు తొలగించి కాయను నిలువుగా చీల్చాలి. ►స్పూన్తో కాయలోని గింజలను, మెత్తటి భాగాన్ని తీసేయాలి. కాయ పై భాగాలను చిన్న ముక్కలుగా తరగాలి. ►ఈ ముక్కలను మందపాటి పాత్రలో వేయాలి. అందులో బెల్లం, పచ్చిమిర్చి తరుగు, కొబ్బరి తురుము వేసి (నీరు పోయకుండా) సన్న మంట మీద ఉడికించాలి. ►కొద్దిగా వేడెక్కిన తర్వాత పసుపు, పసుపు, నూనె కూడా వేసి కలిపి మూత పెట్టి ఐదు నిమిషాల సేపు ఉడకనివ్వాలి. ►ఆ తరవాత తరచూ కలుపుతూ ఉడికించాలి. ►అవసరం అనిపిస్తే మరికొద్దిగా నూనె వేయాలి. ►కరివేపాకు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ►ఈ కేరళ కర్రీ అన్నంలోకి రొట్టెల్లోకి కూడా మంచి కాంబినేషన్. -
ఆఫ్ఘన్ మటన్ బిర్యానీ తయారు చేసుకోండిలా!
ఆఫ్ఘన్ మటన్ బిర్యానీ తయారీ ఇలా! కావలసినవి: ►మటన్– కిలో ►బాసుమతి బియ్యం – ముప్పావు కిలో ►లవంగాలు– పది ►దాల్చిన చెక్క – మూడంగుళాల ముక్కలు రెండు ►ఉప్పు – 2 టీ స్పూన్లు ►అల్లం వెలుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్ ►నీళ్లు– 8 కప్పులు ►నూనె– కప్పు ►ఉల్లిపాయ ముక్కలు – 100 గ్రా ►యాలకులు – 8 ►జీలకర్ర– టీ స్పూన్ ►క్యారట్ తురుము– పావు కేజీ ►కిస్మిస్ – అర కప్పు ►పైన్ నట్స్ లేదా బాదం – అరకప్పు ►ఖర్జూరాలు ; పది. తయారీ: ►మటన్ ముక్కలను శుభ్రంగా కడగాలి. ►బియ్యాన్ని కడిగి మునిగేటట్లు నీటిని పోసి పక్కన ఉంచాలి. ►మందపాటి పెద్ద పాత్రలో మాంసం ముక్కలు, ఒక దాల్చిన చెక్కను పలుకులు చేసి వేయాలి. ►సగం లవంగాలు, ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి నీటిని పోసి ఉడికించాలి. ►ముక్క ఉడకడానికి దాదాపు ముప్పావు గంట పడుతుంది. ►బియ్యంలో నీటిని వడపోసి చిల్లుల పాత్రలో వేసి రెండు నిమిషాల సేపు ఉంచాలి. ►మరొక పెనంలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి పైన్ నట్స్ లేదా బాదం, కిస్మిస్, క్యారట్లను వేయించి పక్కన ఉంచాలి. ►ఇప్పుడు పెద్ద పెనం పెట్టి నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలను ఎర్రగా వేయించి అందులో మరో దాల్చిన చెక్క పలుకులు, మిగిలిన సగం లవంగాలు, యాలకులు, జీలకర్ర వేయాలి. ►ఇవి కొద్దిగా వేగిన తరవాత ఉడికించిన మాంసాన్ని నీరు ఇతర దినుసులతో సహా ఇందులో వేయాలి. ►ఉడకడం మొదలైన తర్వాత బియ్యాన్ని వేసి కలిపి మూత పెట్టాలి. ►మీడియం మంట మీద ఉడికించాలి. పది నిమిషాల్లో ఉడుకుతుంది. ►మధ్యలో ఓ సారి జాగ్రత్తగా మసాలా దినుసులు సమంగా కలవడం కోసం బియ్యం విరగకుండా కలపాలి. ►ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న క్యారట్, కిస్మిస్ మిశ్రమాన్ని, ఖర్జూరాలను బిర్యానీ మీద సమంగా పరిచినట్లు అమర్చి గట్టిగా మూత పెట్టి, మంట తగ్గించాలి. ►ఏడెనిమిది నిమిషాలకు బిర్యానీ రెడీ అవుతుంది. ►వేడిగా ఉన్నప్పుడే రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది. -
రంజాన్ స్పెషల్ రెసిపీ.. మటన్ రోగన్ జోష్
కావలసినవి: ►మటన్ – కిలో; పాలు– కప్పు; కుంకుమ పువ్వు– చిటికెడు; నెయ్యి– అర కప్పు; ఇంగువ – అర టీ స్పూన్; జీలకర్ర– టీ స్పూన్; ►దాల్చిన చెక్క – 2 అంగుళాల ముక్క; నల్ల యాలకులు – 5; మిరియాలు – టీ స్పూన్; ►ఎండుమిర్చి– 4; పెరుగు– 150 గ్రా; గోధుమపిండి– టేబుల్ స్పూన్; శొంఠిపొడి – 2 టీ స్పూన్లు; ►ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి; ధనియాల పొడి– టేబుల్ స్పూన్; ►కశ్మీరీ మిరపపొడి– టేబుల్ స్పూన్; సోంపు పొడి– టేబుల్ స్పూన్; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్. తయారీ: ►మటన్ను శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ►పాలను వేడి చేసి అందులో కుంకుమ పువ్వు వేసి పక్కన ఉంచాలి. ►ప్రెషర్ పాన్లో నెయ్యి వేడి చేసి దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, ఇంగువ, జీలకర్ర, ఎండుమిర్చి వేసి సన్న మంట మీద వేయించాలి. అవి వేగిన తరవాత అందులో మటన్ వేసి కలిపి మూత పెట్టి మీడియం మంట మీద ఐదారు నిమిషాల సేపు ఉంచాలి. ఇప్పుడు మూత తీసి అరకప్పు నీటిని పోసి మూత పెట్టి పది– పదిహేను నిమిషాల సేపు ఉడికించాలి. ►మరొక పాత్రలో పెరుగు, గోధుమ పిండి కలిపి అందులో కుంకుమ పువ్వు కలిపిన పాలు, ఉప్పు, సోంపు పొడి, ధనియాల పొడి, కశ్మీరీ మిరప్పొడి, శొంఠిపొడి కలిపి ఈ మొత్తం మిశ్రమాన్ని మటన్ మిశ్రమంలో కలిపి చిక్కదనం చూసుకుని అవసరమైతే మరికొంత నీటిని కలిపి, ప్రెషర్ పాన్ మూత పెట్టి ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ►వేడి, ప్రెషర్ తగ్గిన మూత తీసిన కొత్తిమీర తరుగు చల్లి వెంటనే మూత పెట్టాలి. ఈ మటన్ రోగన్ జోష్ చపాతీ, పుల్కాలతోపాటు అన్నంలోకి కూడా బాగుంటుంది. -
ఈ పదార్థాలు ఉంటే చాలు.. షీర్ కుర్మా ఇంట్లో తయారు చేసుకోవచ్చు!
అమావాస్య వెళ్లిపోయింది... నెలవంక కోసం ఎదురు చూపు మొదలైంది. చంద్ర దర్శనం నేడు కావచ్చు... లేదా రేపు కావచ్చు. ‘ఈద్ ఉల్ ఫిత్ర్’ వేడుకకు ఇంటిని సిద్ధం చేద్దాం. పాకిస్థానీ షీర్ కుర్మా కావలసినవి: ►సన్న సేమ్యా – పావుకేజీ ►వెన్న తీయని పాలు – లీటరు ►చక్కెర – పావుకేజీ ►నెయ్యి – కప్పు ►జీడిపప్పు – అర కప్పు ►బాదం – అర కప్పు ►పిస్తా – పావు కప్పు ►గులాబీ రెక్కలు– గుప్పెడు ►యాలకులు – పది. తయారీ: ►ఏ జీడిపప్పు, బాదం, పిస్తాలను తరగాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి వీటన్నింటినీ వేసి సన్నమంట మీద దోరగా వేయించాలి. ►వేగిన తర్వాత గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ►మిగిలిన నెయ్యిలో సేమ్యా వేసి వేగిన తరవాత పాలు పోసి కలుపుతూ మరిగించాలి. ►యాలకులను నలగ్గొట్టి పాలలో వేయాలి. పదిహేను నిమిషాల పాటు మరిగిన తర్వాత చక్కెర వేసి అడుగు పట్టకుండా గరిటతో కలుపుతూ మరిగించాలి. ►ఖీర్ చిక్కబడిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న గింజలను, పూలరెక్కలను వేసి కలిపి దించేయాలి. -
మటన్ ఖీమా సమోసా తయారీ ఇలా! పుదీనా చట్నీతో తిన్నారంటే..
Mutton Keema Samosa: మటన్ ఖీమా సమోసా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండిలా! కావలసినవి: ►మటన్ కీమా – అర కేజీ ►పచ్చి బఠాణీ– 100 గ్రాములు ►ఉల్లిపాయ – 1 (తరగాలి) ►ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ►అల్లం వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్ ►పచ్చి మిర్చి – 2 (సన్నగా తరగాలి) ►మిరప్పొడి– టీ స్పూన్ ►ధనియాల పొడి– టీ స్పూన్ ►జీలకర్ర పొడి – టేబుల్ స్పూన్ ►బంగాళ దుంపలు – 2 ►కొత్తిమీర తరుగు – కప్పు ►నూనె – పావు కేజీ ►గోధుమ పిండి – పావు కేజీ. తయారీ: ►గోధుమ పిండిలో చిటికెడు ఉప్పు, వేడి నీటిని పోసి చపాతీలకు కలుపుకున్నట్లు ముద్దలా కలుపుకుని తడి వస్త్రాన్ని కప్పి పక్కన పెట్టాలి. ►బంగాళదుంపలను కడిగి చెక్కు తీసి చిన్న ముక్కలుగా తరగాలి. ►పచ్చి బఠాణీలను కడిగి చిటికెడు చక్కెర వేసి ఒక మోస్తరుగా ఉడికించి పక్కన పెట్టాలి. ►ఖీమాను శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి మరోసారి కడగాలి. ►మందపాటి పెనంలో టీ స్పూన్ నూనె వేసి ఖీమా వేసి రంగు మారేవరకు సన్నమంట మీద వేయించాలి. ►ఆ తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, బఠాణీ, అల్లంవెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, మిరప్పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. ►పదిహేను నిమిషాల సేపు సన్న మంట మీద ఉడికించాలి. ►ఖీమా, బంగాళదుంప ముక్కలు ఉడికిన తర్వాత కొత్తిమీర తరుగు వేసి కలిపి ఒకసారి రుచి చూసి అవసరం అనిపిస్తే మరికొంత ఉప్పు, మిరప్పొడి కలుపుకోవాలి. ►చివరగా కొద్దిసేపు మూత తీసి మంట పెంచి కలుపుతూ ఉడికించాలి. ►తేమ ఆవిరై పోయి ఖీమా కర్రీ సమోసా స్టఫ్ చేయడానికి తగినట్లు రావాలి. ►గోధుమ పిండిని చపాతీల్లా వత్తుకుని ఒక్కో చపాతీని సగానికి కట్ చేసుకోవాలి. ►ఒక ముక్కని ఐస్క్రీమ్ కోన్లాగ చేసుకోవాలి. ►టీ స్పూన్ ఖీమా కర్రీ పెట్టి అంచులను అతికిస్తే సమోసా ఆకారం వస్తుంది. ►ఒక చపాతీతో రెండు సమోసాలన్నమాట. ►అన్నింటినీ ఇలాగే చేసుకుని ఆ తర్వాత బాణలిలో నూనె వేడి చేసి సమోసాలను దోరగా కాల్చుకోవాలి. ►ఈ సమోసాల్లోకి పుదీనా చట్నీ మంచి కాంబినేషన్. ట్రై చేయండి: ఆవకాయ.. పచ్చడి తయారీ ఇలా! నూనెను మరిగించకుండా పచ్చిగా వేసినా -
ఆవకాయ.. పచ్చడి తయారీ ఇలా! నూనెను మరిగించకుండా పచ్చిగా వేసినా
ఎండాకాలాన్ని వెంటాడుతూ వస్తుంది ఆవకాయ కాలం. మామిడి కాయలు చెట్టుకొమ్మలకు వేళ్లాడుతూ ఆకుల్లోంచి తొంగి చూస్తూ నోరూరిస్తుంటాయి. మామిడి కాయలతో చేసుకునే ఊరగాయలు పచ్చళ్లను చూద్దాం. నీళ్లూరుతున్న జిహ్వను లాలిద్దాం. ఆవకాయ కావలసినవి: ►మామిడికాయ ముక్కలు – 4 కప్పులు ►నూనె– 2 కప్పులు ►ఆవపిండి– కప్పు ►మిరప్పొడి– కప్పు (గుంటూరు కారం రుచికి బాగుంటుంది. కశ్మీరీ కారం వాడితే ఆకర్షణీయంగా కనిపిస్తుంది) ►ఉప్పు – కప్పు (కల్లుప్పును పొడి చేయాలి, టేబుల్ సాల్ట్ వేయాలనుకుంటే ముప్పావు కప్పు సరిపోతుంది) ►మెంతిపిండి – అర కప్పు ►వెల్లుల్లి రేకలు – అర కప్పు (పొట్టు వలిచినవి) ►ఆవాలు – పావు కప్పు. తయారీ: ►మామిడి కాయలను శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత పొడి వస్త్రంతో తుడవాలి. ►సొనపోవడానికి తొడిమలను తొలగించాలి. ►ఆ తర్వాత టెంకతో సహా ముక్కలు చేయాలి. ►మీడియం సైజు కాయను 12 ముక్కలు చేయవచ్చు. ►టెంకలోని గింజను తొలగించి, టెంకకు గింజకు మధ్య ఉండే పొరను కూడా తీసేసి ముక్కలను సిద్ధంగా పెట్టుకోవాలి. ►వెడల్పు పాత్ర తీసుకుని తేమలేకుండా శుభ్రంగా తుడిచి కొద్దిసేపు ఎండలో పెట్టాలి. ►ఆ తర్వాత ఆ పాత్రలో మిరప్పొడి, ఆవపిండి, మెంతి పిండి, ఉప్పు, వెల్లుల్లి రేకలు వేసి కలపాలి. ►అందులో మామిడికాయ ముక్కలను వేసి ఆవపిండి మిశ్రమం ముక్కలకు సమంగా పట్టే వరకు తడి లేని గరిటెతో కలపాలి. ►ఆవపిండి కారంలో ఉప్పు చూసుకుని రుచిని బట్టి అవసరమైతే కొద్దిగా కలుపుకోవాలి. ►బాణలిలో నూనె మరిగించి అందులో ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆపేయాలి. ►నూనె బాగా చల్లారిన తర్వాత ఆవకాయ ముక్కల్లో పోసి గరిటెతో కలపాలి. ►ఈ మిశ్రమాన్ని జాడీలో నింపాలి. ►ఆవకాయ మీద నూనె తేలుతూ ఉండాలి. గమనిక: నూనెను మరిగించకుండా పచ్చిగా కూడా వేసుకోవచ్చు. ఆవకాయ, ఇతర ఊరగాయలను నిల్వ చేసే జాడీలను శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో తుడిచి పది నిమిషాల సేపు ఎండలో ఉంచాలి. ఎండలో నుంచి తీసిన తర్వాత జాడీ వేడి తగ్గిన తరవాత మాత్రమే ఊరగాయలను నింపాలి. -
మినప వడియాలు చేసుకోండిలా! అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి..
ఎండలు మండిపోతున్నాయి. అందుకే... ఎండబెట్టి వండుకునే వడియాలను చేద్దాం. ఇంతకీ ఇవి అర్కపక్వాలా? అగ్నిపక్వాలా? ఎండలో ఎండుతాయి... మంటకు పొంగుతాయి. వంటకాలకు తోడయ్యి... జిహ్వను సంతోషపరుస్తాయి. సంతృప్తికరమైన భోజనానికి మినిమమ్ గ్యారంటీనిస్తాయి. మినప వడియాల తయారీ ఇలా! కావలసినవి: ►మినప్పప్పు – అర కేజీ ►పచ్చి మిర్చి – 7 లేదా 8 ►జీలకర్ర– టీ స్పూన్ ►అల్లం– రెండు అంగుళాల ముక్క ►ఉప్పు – టేబుల్ స్పూన్. తయారీ: ►మినప్పప్పు కడిగి మునిగేలా నీటిని పోసి రాత్రంతా నానబెట్టాలి. ►ఉదయాన్నే గ్రైండర్లో మెత్తగా రుబ్బాలి. ►మినప్పప్పు మెదిగేటప్పుడు అందులో ఉప్పు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేయాలి. ►మొత్తం మెత్తగా మెదిగిన తరవాత ఒక గిన్నెలోకి తీసుకుని కలిపితే వడియాల పిండి రెడీ. ►తడి వస్త్రాన్ని లేదా పాలిథిన్ షీట్ని ఎండలో పరిచి దాని మీద వడియాలు పెట్టుకోవాలి. ►ఒక గిన్నెలో నీటిని తీసుకుని అందులో స్పూన్ని ముంచి అప్పుడు పిండి తీసుకుంటే పిండి సులువుగా జారుతుంది. ►చేత్తో పెట్టాలన్నా అంతే... వేళ్లను తడుపుకుంటూ పెట్టాలి. రెండు రోజుల పాటు ఎండనివ్వాలి. ►మూడవ రోజు వలిచి మళ్లీ ఎండబెట్టాలి. అప్పుడు గలగలలాడుతాయి. ►ఏడాది పాటు నిల్వ ఉంటాయి. ►నూనె వేడి చేసి పచ్చి వడియాలను నూనెలో వేసి రెండు వైపులా దోరగా వేగిన తరవాత తీసేయాలి. ►ఈ వడియాలను పెద్ద మంట మీద వేయించరాదు. ►మీడియం ఫ్లేమ్లో వేయిస్తే చక్కగా వేగి కరకరలాడుతాయి. ట్రై చేయండి: బూడిద గుమ్మడికాయ, పచ్చి శనగపప్పు.. కన్నడ స్టైల్ మజ్జిగచారు తయారీ ఇలా -
బూడిద గుమ్మడికాయ, పచ్చి శనగపప్పు.. కన్నడ స్టైల్ మజ్జిగచారు తయారీ ఇలా
వేసవిలో కడుపులో చల్లచల్లగా ఉండాలంటే ఈసారి కన్నడ కుంబలకాయ్ మజ్జిగె హులి ట్రై చేసి చూడండి! కన్నడ స్టైల్ మజ్జిగచారుతో ఎంచక్కా భోజనం చేసేయండి! కావలసినవి: ►బూడిద గుమ్మడికాయ ముక్కలు – పావు కేజీ (చెక్కు, గింజలు తొలగించి ముక్కలు చేయాలి) ►పచ్చి శనగపప్పు – టేబుల్ స్పూన్ ►పచ్చి కొబ్బరి తురుము– కప్పు ►పచ్చిమిర్చి– 3 ►అల్లం– అంగుళం ముక్క ►ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ►పెరుగు – కప్పు. ►పోపు కోసం: వంట కొబ్బరి నూనె – టీ స్పూన్; ఆవాలు – అర టీ స్పూన్ ; జీలకర్ర – అర టీ స్పూన్ ; ఇంగువ – పావు టీ స్పూన్; కరివేపాకు – 4 రెమ్మలు. తయారీ: ►ముందుగా పచ్చిశనగపప్పును కడిగి నీటిలో 20 నిమిషాల సేపు నానబెట్టాలి. ►పెరుగులో కప్పు నీరు పోసి చిలికి పక్కన ఉంచాలి. ►గుమ్మడి కాయ ముక్కలను ప్రెషర్ కుక్కర్ లేదా నేరుగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ►శనగపప్పును నీటి నుంచి తీసి మరో గిన్నెలో వేసి అందులో కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేయాలి. ►పెనంలో ఉడికించిన గుమ్మడికాయ ముక్కలు, మిక్సీలో రుబ్బిన పేస్ట్ వేసి కప్పు నీటిని పోసి వేడి చేయాలి. ►ఈ మిశ్రమం ఉడకడం మొదలైన తర్వాత చిలికిన పెరుగు వేసి దించేయాలి. ►పోపు లేని మజ్జిగె హులి సిద్ధమైందన్నమాట. ►ఇప్పుడు మరొక పెనంలో నూనె వేడి చేసి ఆవాలు వేసి చిటపటలాడిన తరవాత జీలకర్ర వేయాలి. ►అవి కూడా వేగిన తర్వాత కరివేపాకు, ఇంగువ వేసి కలిపి ఈ పోపును మజ్జిగె హులిలో కలపాలి. చదవండి: అతి తక్కువ వర్షంతో పండే ఎడారి పంట.. . మెట్ట రైతుకు అండ.. -
Recipe: టొమాటో, అటుకులు.. వడియాలు తయారు చేసుకోండిలా!
టొమాటో, అటుకులతో వడియాలు తయారు చేసుకోండిలా! కావలసినవి: ►నువ్వులు – 50 గ్రాములు ►టొమాటోలు – పావు కేజీ ►అటుకులు – ఒక కప్పు ►మిరప్పొడి – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ►ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ►జీలకర్ర – టీ స్పూన్ ►పచ్చిమిర్చి– 3 ►ఉల్లిపాయలు – 3 (తరగాలి) ►కరివేపాకు – నాలుగు రెమ్మలు. తయారీ: ►నువ్వులను కడిగి వడపోసి ఆరబెట్టాలి. ►టొమాటోలను శుభ్రంగా కడిగి మెత్తగా గ్రైండ్ చేసి వెడల్పుగా ఉన్న పాత్రలో వేయాలి ►పచ్చిమిర్చి, జీలకర్ర, మిరప్పొడి, ఉప్పు కలిపి మెత్తగా రుబ్బి టొమాటో ప్యూరీలో కలపాలి. ►ఇందులో కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అటుకులు వేసి కలిపి పది నిమిషాల సేపు నాననివ్వాలి. ►చివరగా నువ్వులు వేసి కలిపి ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న గోళీలుగా చేసుకోవాలి. ►తడి వస్త్రం మీద లేదా పాలిథిన్ పేపర్ మీద ఒక్కో గోళీని వడల్లా వత్తి ఎండబెట్టాలి. ►రెండు రోజులు ఎండిన తర్వాత మూడవ రోజు ఉదయం క్లాత్ నుంచి ఒలిచి రెండవ వైపు ఎండబెట్టాలి. -
Sweet Recipe: మూడు రోజుల వరకు తాజాగా ఉండేలా ఫిర్ని తయారీ ఇలా!
ఈ హోలీ రోజు ఇంట్లో వాళ్లకు ఇలా ఫిర్ని చేసిపెట్టండి! ఫిర్ని తయారీకి కావలసినవి: ►బియ్యం – పావు కప్పు ►వెన్న తీయని పాలు – లీటరు ►చక్కెర – అర కప్పు ►బాదం పప్పు – 10 ►పిస్తా – 10 ►యాలకుల పొడి – అర టీ స్పూన్ ►కుంకుమ పువ్వు – 15 రేకలు ►పన్నీరు – 2 టీ స్పూన్లు (ఇష్టమైతేనే) ►కిస్మిస్: 20 ►జీడిపప్పు: 10. తయారీ: ►బియ్యం కడిగి దళసరి బట్ట మీద వేసి నీడలో ఆరబెట్టి, తేమ పోయిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేయాలి (మరీ మెత్తగా అక్కరలేదు). ►ఈ లోపు ఒక చిన్న పాత్రలో నీటిని వేడి చేసి అందులో బాదం, పిస్తా వేసి మూత పెట్టాలి. ►అరగంట తర్వాత నీటిని వడపోసి పొట్టు వలిచి, సన్నగా తరగాలి. ►వెడల్పుగా, మందంగా ఉన్న పాత్రలో పాలు మరిగించాలి. ►ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక గరిటెడు పాలను చిన్న పాత్రలోకి తీసుకుని కుంకుమ పువ్వు రేకలు వేసి నానబెట్టాలి. ►పాత్రలో పాలను మరో రెండు నిమిషాల సేపు మరిగించిన తర్వాత మంట తగ్గించి బియ్యప్పిండి, చక్కెర వేసి అడుగు పట్టకుండా, ఉండకట్టకుండా గరిటెతో కలుపుతూ ఉడికించాలి. ►చిక్కబడుతున్నప్పుడు యాలకుల పొడి వేయాలి. ►మిశ్రమం చిక్కబడిన తర్వాత కుంకుమపువ్వు కలిపిన పాలు, బాదం, పిస్తా సగం వేసి కలపాలి. ►ఇవన్నీ వేసిన తర్వాత మరో రెండు లేదా మూడు నిమిషాల సేపు మరగనిచ్చి పన్నీరు వేసి కలిపి స్టవ్ ఆపేయాలి. ఫిర్నీ రెడీ. ఈ ఫిర్నీని కప్పులో పోసిన తర్వాత మిగిలిన బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్తో అలంకరించాలి. ఈ ఫిర్నీని గోరువెచ్చగా తినవచ్చు లేదా చల్లబరిచి తినవచ్చు. ఫ్రిజ్లో రెండు– మూడు రోజులు తాజాగా ఉంటుంది. ఇవి కూడా ట్రై చేయండి: రస్మలై ఇష్టమా! ఈ పదార్థాలు ఉంటే చాలు ఇంట్లోనే ఇలా ఈజీగా.. హోలీకి రైస్ ఖీర్ తయారు చేసుకోండిలా! -
రస్మలై ఇష్టమా! ఈ పదార్థాలు ఉంటే చాలు ఇంట్లోనే ఇలా ఈజీగా..
తీపిని ఇష్టపడే వారు ఇలా ఇంట్లోనే రస్మలై తయారు చేసుకోండి. నోరూరించే స్వీట్తో ఈ హోలీని సెలబ్రేట్ చేసుకోండి! రస్మలై తయారీకి కావాల్సినవి: ►రసగుల్లాలు – 15 (ఇంట్లో చేయడం కుదరకపోతే రెడీమేడ్వి తీసుకోవచ్చు) ►పాలు – లీటరు ►చక్కెర – 5 టేబుల్ స్పూన్లు ►బాదం –10 ; పిస్తా– 10 ►యాలకుల పొడి– టీ స్పూన్ ►కుంకుమ పువ్వు – 20 రేకలు తయారీ: ►అరకప్పు వేడి నీటిలో బాదం, పిస్తాలను అరగంట సేపు నానబెట్టి పొట్టు తీసి తరగాలి. ►పావు కప్పు వేడి పాలలో కుంకుమ పువ్వు వేసి పక్కన ఉంచాలి. ►మందపాటి బాణలిలో పాలు మరిగించాలి. ►పైకి తేలిన మీగడను స్పూన్తో తీసి ఒక గిన్నెలో వేసుకుంటూ పాలు అడుగు పట్టకుండా కలుపుతూ, పాలు సగమయ్యే వరకు మరిగించాలి. ఇప్పుడు చక్కెర వేసి కరిగే వరకు కలుపుతూ మరిగించాలి. ►యాలకుల పొడి, బాదం, పిస్తా (సగం), కుంకుమ పువ్వు పాలు కలిపి వీటి రుచి పాలకు పట్టే వరకు సన్నమంట మీద మరిగించాలి. ►ఇప్పుడు రసగుల్లాను ఒక ప్లేట్లోకి తీసుకుని గరిటె లేదా అట్లకాడ సాయంతో లేదా వేళ్లతో చక్కెర పాకం జారిపోయేటట్లు మెల్లగా నొక్కాలి. ►ఇలా రసగుల్లాలన్నింటినీ నొక్కి జాగ్రత్తగా పాలలో వేయాలి. ►రెండు నిమిషాలపాటు పాలలో ఉడకనిచ్చి స్టవ్ ఆపేయాలి. ►రసమలై చల్లారిన తర్వాత కప్పులో వేసి మీగడ(ఇష్టమైతే), బాదం, పిస్తాలతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. ఇవి కూడా ట్రై చేయండి: Rice Kheer Recipe: హోలీకి రైస్ ఖీర్ తయారు చేసుకోండిలా! Rasgulla Recipe: రసగుల్ల తయారీ ఇలా! చక్కెర ద్రవం పాకం వస్తే అంతే సంగతి!