104 employees
-
ఏపీ ప్రభుత్వ నిరంకుశ నిర్ణయం!
సాక్షి, అమరావతి : ఏపీ ప్రభుత్వ నిరంకుశ నిర్ణయం తీసుకుంది. 104 ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించింది. సమస్యల పరిష్కారం కోసం గతనెలలో ప్రభుత్వానికి 104 ఉద్యోగులు సమ్మె నోటీసులు జారీ చేశారు. ఏ క్షణమైనా సమ్మెలోకి వెళ్తామని ప్రకటించారు. ఈ తరుణంలో రేపు కలెక్టరేట్ వద్ద 36 గంటల నిరాహార దీక్షకు పిలుపు నిచ్చారు. అయితే, 104 ఉద్యోగుల దీక్ష నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అసలేమిటీ ఎస్మా చట్టం? దీనికి ఉన్న విస్తృతి ఏమిటి? ఎస్మా ప్రయోగిస్తే ఏమవుతుంది తదితర అంశాలు పరిశీలిస్తే..‘ఎస్మా’ అనేది ‘ఎసెన్సియల్ సర్వీసెస్ మెయిన్టీనెన్స్ యాక్ట్’కు సంక్షిప్త రూపం. అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు తమ విధులకు హాజరు కాకుండా ఆయా సేవలకు విఘాతం కలిగేలా సమ్మెలోకి దిగితే.. జనజీవనానికి ఇబ్బంది కలగకుండా చూసేందుకు ప్రభుత్వానికి ఈ చట్టాన్ని ప్రయోగించే అధికారం ఉంటుంది.కార్మిక చట్టాల్లో కొన్ని మార్పులు కోరుతూ.. 1980లలో కార్మిక సంఘాల నిరసనలతో దేశం అట్టుడికి పోయింది. ఆ మరుసటి ఏడాది కార్మిక సంఘాలు ఏకంగా పార్లమెంట్ ముందు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. దేశవ్యాప్తంగా పరిశ్రమలన్నింటా పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మె కూడా చేయాలని పిలుపునిచ్చాయి. ఈ ఉద్యమం తీవ్రరూపం దాలుస్తున్నట్టు గుర్తించిన ప్రభుత్వం.. తొలుత 12 పరిశ్రమల్లో సమ్మెను నిషేధిస్తూ ‘ఎస్మా’ ఆర్డినెన్స్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత ఈ ఆర్డినెన్స్ స్థానంలో ‘ఎస్మా’ చట్టం చేసింది.ఎస్మా నిబంధనలను అతిక్రమించి సమ్మెకు దిగినా.. దిగొచ్చనే బలమైన అనుమానం కలిగినా సరే.. పోలీసు అధికారులు వారెంట్ లేకుండానే అరెస్టు చేయవచ్చు. ఎస్మా నిబంధనలకు విరుద్ధంగా సమ్మె ప్రారంభించే, పాటించే ఉద్యోగులను డిస్మిస్ చేయడంతో సహా వివిధ రకాల క్రమశిక్షణా చర్యలూ చేపట్టవచ్చు. సమ్మెలో పాల్గొంటున్నవారికి, వారిని ప్రోత్సహిస్తున్న వారికి కూడా జైలు శిక్ష, జరిమానా, లేదా రెండూ విధించవచ్చు. -
Gallery Image Test 600x900-1200x900
-
108, 104 ఉద్యోగుల సమ్మె లేదు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో 108, 104 ఉద్యోగులు సమ్మె యోచనను విరమించుకున్నారు. 108, 104 ఉద్యోగ సంఘాల నాయకులతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని శనివారం గుంటూరులో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. తమ సమస్యల పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించారని, ఈ నెల 22 నుంచి జరపతలపెట్టిన సమ్మెను విరమించుకుంటున్నట్లు సంఘాల నేతలు ప్రకటించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే ఉద్యోగులకు గుర్తింపు, గౌరవం: మంత్రి రజిని ఈ చర్చల్లో ఉద్యోగుల డిమాండ్లపై మంత్రి రజిని ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు తగిన గుర్తింపు, గౌరవం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే దక్కాయని వివరించారు. 108, 104 వాహనాల ఉద్యోగులను ఆప్కాస్లో చేర్చాలనే వినతిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళతామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజిపైనా ప్రతిపాదనలు తయారు చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులు కోరుతున్నవాటిలో ప్రధానమైన శ్లాబ్ పద్ధతిని వెంటనే అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ప్రతినెలా క్రమం తప్పకుండా ఉద్యోగులకు వేతనాలు అందిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో 104, 108 ఉద్యోగుల జీతాలను సమయానికి ఇచ్చేవారు కాదని గుర్తు చేశారు. ఇకపై కూడా ప్రతి నెలా మొదటి వారంలోనే ఉద్యోగులందరికీ జీతాలు అందేలా కృషి చేస్తామన్నారు. సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా 104, 108 వ్యవస్థను, వాహనాలను బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని, ఈ విభాగాల్లోని ఉద్యోగులకు కూడా ఏ సమస్యలు రానీయరని తెలిపారు. అత్యవసర సేవలు అందించే విషయంలో 108 సిబ్బంది చేస్తున్న కృషి ఎంతో గొప్పదని చెప్పారు. 104, 108 ఉద్యోగులకు అండగా ఉంటామని, ఏ సమస్యలున్నా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. సీఎం జగన్ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకుండా ప్రజలకు ఎలా సేవ చేస్తోందో, ఉద్యోగులకు కూడా ఏ సమస్యలూ రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మంత్రి హామీలకు ఉద్యోగుల సంఘ నేతలు అంగీకరించారు. ఈ సమావేశంలో 108 ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.కిరణ్కుమార్, ఉపాధ్యక్షుడు ఎన్.మహేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.శ్రీనివాసరావు, 104 ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.ఫణికుమార్, ఉపాధ్యక్షుడు రాంబాబు, అరబిందో సంస్థ నుంచి ఎంవీ సత్యనారాయణ, రాకేష్ పాల్గొన్నారు. -
ఎమ్మెల్యేలకు ‘ఎర’ కేసులో కొత్త ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. నోటీసులు జారీ చేసిన ముగ్గురిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళ బీడీజేఎస్ అధినేత తుషార్, కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామిలపై లుకౌట్ నోటీసులు జారీ చేసింది. వీరంతా సోమవారం నాడు విచారణకు హాజరు కాకపోవడంతో లుకౌట్ నోటీసులు ఇచ్చింది. ఇక ఈ కేసులో బండి సంజయ్ అనుచరుడు, అడ్వకేట్ శ్రీనివాస్ను ఇప్పటికే ప్రశ్నించిన సిట్ మంగళవారం మరోసారి విచారణకు హాజరు కావాలని తెలిపింది. కాగా సోమవారం ఉదయం బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విచారణకు హాజరు కావాల్సిందిగా బీఎల్ సంతోష్కు తొలిసారి జారీ చేసిన నోటీసులో సిట్ పేర్కొంది. కానీ సంతోష్ గైర్హాజరయ్యారు. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. సంతోష్తో పాటు కరీంనగర్కు చెందిన న్యాయవాది శ్రీనివాస్, తుషార్ వెల్లాపల్లి, కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామిలకూ సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే శ్రీనివాస్ మినహా మిగిలిన ముగ్గురూ విచారణకు హాజరుకాలేదు. నోటీసులు అందిన తర్వాత విచారణకు హాజరుకాకపోతే 41–ఏ (3), (4) సీఆర్పీసీ కింద అరెస్టు చేస్తామని విచారణాధికారి, రాజేంద్రనగర్ ఏసీపీ బి.గంగాధర్ తొలి నోటీసులో పేర్కొన్నారు. అయితే ఆ నోటీసులపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సంతోష్ను అరెస్టు చేయవద్దని సిట్ను న్యాయస్థానం ఆదేశించింది. చదవండి: కానిస్టేబుల్ ఈశ్వర్.. ఇతని రూటే సపరేటు.. దొంగలతో చేతులు కలిపి -
క్రేజీ ఫెలో కోసం బరువు తగ్గాను
‘‘క్రేజీ ఫెలో’ని ఎంజాయ్ చేస్తూ, చేశాను. ప్రేక్షకులకు మంచి ఎంటర్టైనర్ మూవీ చూశామనే అనుభూతి కలిగిస్తుంది’’ అన్నారు ఆది సాయికుమార్. ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో ఆది సాయికుమార్ హీరోగా కేకే రాధామోహన్ నిర్మించిన ‘క్రేజీ ఫెలో’ ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆది సాయికుమార్ చెప్పిన విశేషాలు... ► చెప్పింది పూర్తిగా వినకుండా కష్టాలు కొని తెచ్చుకునే యువకుడి పాత్రను ‘క్రేజీ ఫెలో’లో చేశాను. ఫణికృష్ణ చాలా మంచి కథ రాసుకున్నాడు. ఈ చిత్రంలో ఆర్గానిక్ కామెడీ ఉంటుంది. కామెడీ టైమింగ్లోనూ ఫణి స్పెషల్ కేర్ తీసుకున్నాడు. సినిమా పట్ల అందరం చాలా ఎగ్జయిటింగ్గా ఉన్నాం. కథలో సెకండాఫ్ మంచి ఎమోషన్ సీన్స్ ఉన్నాయి. ఈ సినిమా కోసం ఫ్రెష్ లుక్ ట్రై చేశాను.. బరువు తగ్గాను. ► నేను హీరోగా చేసే కొన్ని సినిమాల కథలను నాన్న (నటుడు సాయికుమార్)గారు వింటారు. ‘క్రేజీ ఫెలో’ కథ విని, హ్యాపీ ఫీలయ్యారు. నాన్నగారి అభిప్రాయం తీసుకోకుండా నేను చేసిన కొన్ని సినిమాలు అంతగా వర్కౌట్ కాలేదు. ‘గాలిపటం’ సినిమా కథ బాగుంది కానీ క్లయిమాక్స్ కాస్త మార్చితే బాగుంటుందని నాన్నగారు సలహా ఇచ్చారు. కానీ మేం ఒప్పుకోలేదు. ఆడియన్స్ ఆ క్లయిమాక్స్ ఒప్పుకోలేదు. ఇలా నాన్నగారి జడ్జ్మెంట్ బాగుంటుంది. ► ప్రస్తుతం ‘టాప్ గేర్’, ‘సీఎస్ఐ: సనాతన్’ సినిమాలు చేస్తున్నాను. అలాగే ‘పులి–మేక’ అనే వెబ్ సిరీస్ చేశాను. నవంబరులో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కావొచ్చు. ‘అమరన్ ఇన్ సిటీ’ సినిమా షూటింగ్ ఇరవై శాతం పూర్తయింది. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా తాత్కాలికంగా ఆగింది. -
మరింత మెరుగ్గా 108, 104 సేవలు
సాక్షి, అమరావతి: 108 అంబులెన్సులు, 104 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ)ల సేవలను ప్రజలకు మరింత మెరుగ్గా అందించాలని అధికారులను వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఆదేశించారు. బుధవారం మంగళగిరిలోని వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో 108, 104ల పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. టెండర్ అగ్రిమెంట్ ప్రకారం సేవలందించడం లేదంటూ ఐటీ విభాగంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 108 అంబులెన్సులలో జీపీఎస్ సౌకర్యంపై ఆరా తీశారు. వాహనాల మరమ్మతుల విషయంలో జాప్యం చేయొద్దని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో వాహనాల బఫర్ స్టాక్ తప్పనిసరిగా ఉంచాలన్నారు. రెండు వారాల్లో సేవలు మెరుగుపడకపోతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. తిరుమల పర్యటనలో సీఎం వైఎస్ జగన్ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. తిరుపతి గ్రామదేవత, శ్రీవారి సోదరి శ్రీతాతయ్యగుంట గంగమ్మను ఆయన దర్శించుకున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ పోస్టుల భర్తీని పూర్తిచేయాలి: సీఎం జగన్ పశు సంవర్ధక శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పశువుల ఆస్పత్రుల్లో నాడు– నేడు, పశువులకు బీమా, ఫ్యామిలీ డాక్టర్ తరహాలో పశువులకు వైద్య సేవలు తదితర అంశాలపై అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ఉద్దవ్ థాక్రేకు బిగ్ షాక్.. షిండేకు అనుకూలంగా వెలువడ్డ సుప్రీం తీర్పు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకు భారీ ఎదురు దెబ్బ తగిలింది.శివసేన పార్టీ గుర్తింపు వ్యవహారంలో.. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు అనుకూలంగా సుప్రీం కోర్టులో తీర్పు వెలువడింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. రష్యా చెర నుంచి బయటపడిన ఉక్రెయిన్ సైనికుడి షాకింగ్ ఫోటోలు రష్యన్ల బంధిఖానా నుంచి బయటపడిన ఉక్రెయిన్ సైనికుడి షాకింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలను ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వశాఖ మైఖైలో డయానోవ్ అనే ఉక్రెయిన్ సైనికుడి ఫోటోలను ట్విట్టర్లో పంచుకుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ‘నీ కొడుకు మీద ప్రమాణం చేసి చెప్పు లోకేష్.. అమ్మవారి కిరీటాలు ఎత్తుకెళ్లిందెవరు?’ ఇటీవలి కాలంలో టీడీపీ నేతలు ప్రతీ విషయాన్ని వివాదాస్పదం చేస్తూ రెచ్చిపోతున్నారు. లేనిది ఉన్నట్టుగా ఊహించుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓవర్గా కామెంట్స్ చేసిన నారా లోకేష్కు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కౌంటర్ ఇచ్చారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. బంగారు మైన్స్లో పెట్టుబడులు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్న ఈడీ! ఇటీవలి కాలంలో పలు కేసుల్లో తెలంగాణలో ఈడీ, ఐటీ అధికారులు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేయడం, విచారించడం తెలంగాణలో సంచలనంగా మారింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఈ ముగ్గురిని ఎంపిక చేసి తప్పుచేశారా? వీళ్లకు బదులు.. టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ ఆరంభానికి సమయం ఆసన్నమవుతోంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి ఈ ఐసీసీ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో పాల్గొనే దేశాలు ఇప్పటికే జట్లను ప్రకటించాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. నోట్ల రద్దు రాజ్యాంగ బద్ధమేనా? సుప్రీంలో విచారణ దేశంలో 86 శాతం చలామణిలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2016లో తీసుకున్న సంచలన నిర్ణయం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. నల్లధనం, నకిలీ నోట్ల చలామణికి చెక్ పెట్టేందుకంటూ రాత్రికి రాత్రే ప్రకటించిన ఈ నిషేధం పెను దుమారాన్ని సృష్టించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. విషాదం.. జబర్దస్త్ కమెడియన్ కన్నుమూత టాలీవుడ్లో విషాదం నెలకొంది.మిమిక్రీ ఆర్టిస్ట్, జబర్దస్త్ కమెడియన్ మూర్తి కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్తో బాధ పడుతున్న ఆయన మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు అరుణ్ స్వయంగా ధ్రువీకరించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఆనందం మాటున పొంచి వున్న ప్రమాదాలు గత రెండేళ్లుగా వేసవి, సంక్రాంతి, దసరా వంటి సెలవులు వచ్చినప్పటికీ.. కరోనా కారణంగా ప్రజలు ఎవరూ కూడా ఆనందంగా గడిపి ఆస్వాదించలేక పోయారు. ఇక విద్యార్థులు కూడా సెలవుల్లో ఆటలకు దూరంగా ఉన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Azadi Ka Amrit Mahotsav: విభజన నెహ్రూ పుణ్యమే బీజేపీ వ్యాఖ్యలు.. మండిపడ్డ కాంగ్రెస్
న్యూఢిల్లీ: విభజన గాయాల స్మారక దినం సందర్భంగా ఆదివారం బీజేపీ విడుదల చేసిన వీడియో వివాదానికి దారి తీసింది. 1947లో దేశ విభజనకు దారి తీసిన ఘట్టాలను అందులో చూపించారు. పాకిస్తాన్ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలన్న ముస్లిం లీగ్ డిమాండ్కు నెహ్రూ తలొగ్గారంటూ ఆరోపించారు. వీడియో అంతా పదే పదే నెహ్రూ విజువల్స్ చూపించారు. ఈ వీడియోపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆధునిక సావర్కర్లు, జిన్నాలు ఇప్పటికీ జాతిని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ మండిపడ్డారు. విద్వేషాలను రెచ్చగొట్టేందుకు విభజన విషాదాన్ని వాడుకుంటూ ప్రధాని మోదీ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. రెండు దేశాల థియరీని తెరపైకి తెచ్చింది బీజేపీ ఆరాధించే సావర్కరేనని ఆరోపించారు. దాన్ని జిన్నా అందుకున్నారన్నారు. విభజనకు ఒప్పుకోకుంటే చిన్న చిన్న భాగాలుగా విడిపోయి దేశం సర్వనాశనం అయ్యేదన్నారు. భారతావనని ఏకతాటిపైకి తెచ్చేది ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీయేనని జైరాం అన్నారు. -
తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న 104 అంబులెన్స్ సేవలకు స్వస్థి పలికింది. 104 వాహనాల సేవలను రద్దు చేస్తూ బుధవారం జీవోను విడుదల చేసింది. దీంతో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అంబులెన్స్ సేవలను కోల్పోనున్నారు. ఇక, 104 వాహనాల సేవలు నిలిచిపోనుండటంతో పనిచేస్తున్న అంబులెన్సులను త్వరలో వేలం వేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. తెలంగాణవ్యాప్తంగా ఉన్న వాహనాలను వేలం వేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఇదిలా ఉండగా, 104 అంబులెన్స్ సర్వీసులను 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. మారుమూల ప్రాంతాల్లో బీపీ, షుగర్, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి స్థానికంగా ట్రీట్మెంట్ అందించేందుకు ఈ అంబులెన్స్లను తీసుకువచ్చారు. ప్రభుత్వం ఈ వాహనాల్లో ఫార్మసిస్ట్, ఏఎన్ఎం, ల్యాబ్టెక్నీషియన్, మెడికల్ అసిస్టెంట్, డ్రైవర్లను నియమించింది. ఇది కూడా చదవండి: రోగులకు మందుల సరఫరాకు బ్రేక్ -
ఆస్ట్రేలియాలో 13 మంది మహిళా మంత్రులు
కెన్బెరా: ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోని అల్బానెసె తన కేబినెట్లో మహిళలకు పెద్ద పీట వేశారు. రికార్డు స్థాయిలో 13 మందికి మంత్రులుగా అవకాశం కల్పించారు. వీరిలో ఆనీ అలీ అనే ముస్లిం కూడా ఉన్నారు. దేశ చరిత్రలో తొలి ముస్లిం మహిళా మంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. అయ్యారు. కెన్బెరాలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జనరల్ డేవిడ్ హర్లీ కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. లేబర్ పార్టీకి చెందిన ఆంటోని ప్రధాని అయిన 11 రోజుల తర్వాత 30 మందితో కొత్త మంత్రివర్గం కొలువు తీరింది. ఇలాంటి ఒక సమీకృత ప్రభుత్వానికి సారథిగా ఉండడం గర్వంగా ఉందని ఆంటోని ట్విటర్లో పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ఎంత భిన్నత్వంతో కూడుకొని ఉందో, తన కేబినెట్ కూడా అంతే భిన్నంగా ఉందన్నారు. -
108, 104 ఉద్యోగులకు వేతన బకాయిల చెల్లింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 108 అంబులెన్సులు , 104 మొబైల్ మెడికల్ యూనిట్ సర్వీసుల్లో పనిచేస్తున్న 6 వేల మంది ఉద్యోగులకు వేతన బకాయిల చెల్లింపును ప్రారంభించినట్టు అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ సంపత్రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సాంకేతిక కారణాల దృష్ట్యా బిల్లులు పెండింగ్లో ఉండటంతో సకాలంలో వేతనాలను విడుదల చేయలేకపోయామన్నారు. ప్రభుత్వం నుంచి రూ.70 కోట్లు నిధులు రావటంతో 2 నెలల వేతన బకాయిలను చెల్లిస్తున్నట్టు వివరించారు. -
వైద్య సేవల్లో లోపాలుంటే 104కు చెప్పండి
సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తి సమయంలో ఆపద్బాంధవిగా ప్రజలకు విశిష్ట సేవలందించిన 104 కాల్ సెంటర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక సేవను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు ఎదురయ్యే సమస్యలపై ఈ కాల్ సెంటర్కు ఫోన్చేసి ఫిర్యాదు చేసే వీలును కల్పించబోతోంది. ఇందుకోసం వైద్య, ఆరోగ్య శాఖ ప్రణాళిక రచిస్తోంది. ప్రభుత్వాస్పత్రులకు వచ్చే నిరుపేద, మధ్యతరగతి రోగులు చికిత్స అనంతరం సంతోషంగా ఇళ్లకు తిరిగి వెళ్లాలనే సంకల్పంతో సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు మారుస్తున్నారు. ఈ కార్యక్రమానికి రూ.16వేల కోట్లకు పైగా భారీ నిధులను ప్రభుత్వం ఖర్చుచేస్తోంది. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, వైద్యసిబ్బంది కొరతకు తావులేకుండా చేస్తోంది. 2019 నుంచి ఇప్పటివరకు వైద్య శాఖలో 39వేల పోస్టుల భర్తీ చేపట్టింది. అవసరమైన మౌలిక వసతులనూ సమకూరుస్తోంది. ఇంత చేస్తున్నప్పటికీ ఇటీవల పలు ప్రభుత్వాస్పత్రుల్లో రోగులు ఇబ్బందులకు గురైన ఘటనలు వెలుగుచూశాయి. దీంతో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆసుపత్రుల్లో రోగులకు ఎదురయ్యే ఇబ్బందులు, సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని పరిష్కరించాలని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో 104 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించనున్నారు. కరోనా రోజుల్లో 12లక్షల మందికి సేవలు కరోనా కష్టకాలంలో 104 కాల్ సెంటర్ ద్వారా కోవిడ్కు సంబంధించిన సమాచారం, వైద్య పరీక్షలు, ఇతర సేవలన్నింటినీ ఈ కాల్ సెంటర్ ద్వారా ప్రజలకు అందించారు. 12 లక్షల మందికి పైగా ప్రజలు కాల్ సెంటర్కు ఫోన్చేసి కరోనా మూడు దశల్లో సేవలు పొందారు. ఫోన్చేస్తే కరోనా నిర్ధారణ పరీక్షలకు టోకెన్ రైజ్ చేయడం మొదలు, పాజిటివ్ అయితే ఆసుపత్రికి తరలించే అంబులెన్స్ను అందుబాటులోకి తీసుకురావడం, ఆసుపత్రిలో బెడ్ను సమకూర్చడం ఇలా అనేక రకాల సేవలు కాల్ సెంటర్ ద్వారా అందాయి. వారం రోజుల్లో బలోపేతం ప్రభుత్వాస్పత్రుల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై ఫిర్యాదులు స్వీకరించేందుకు వీలుగా 104 కాల్ సెంటర్ను వారం రోజుల్లో బలోపేతం చేస్తాం. వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడం.. సెక్యూరిటీ, శానిటేషన్, మహాప్రస్థానం, అంబులెన్స్ సహా ఇతర సేవల్లో ఇబ్బందులు ఎదురైతే రోగులు ఫిర్యాదు చేయడానికి వీలు కల్పిస్తాం. వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపడతాం. రోగులు ఏ చిన్న ఇబ్బందికీ గురికాకూడదు అనేది ప్రభుత్వ ఉద్దేశం. అందుకనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటాం. – ఎం.టి. కృష్ణబాబు, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి -
Jagananna Amma Vodi: అమ్మ ఒడిపై ‘ఎల్లో’ విషం
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న అమ్మ ఒడి పథకంపై టీడీపీ నేత చంద్రబాబు, నారా లోకేశ్ ఎల్లో మీడియా ద్వారా విషం చిమ్ముతూ లేనిపోని అపోహలు సృష్టించి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. ఈ పథకానికి మార్పులు చేస్తూ సర్క్యులర్ జారీ చేశారనేది టీడీపీ, ఎల్లో మీడియా దుష్ప్రచారం మాత్రమేనని, నిజంగా ఆ సర్క్యులర్ ఉంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు. శుక్రవారం హైదరాబాద్ లేక్వ్యూ గెస్ట్హౌస్లో మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ పథకం కింద రెండుసార్లు పిల్లల తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున, దాదాపు రూ.13 వేల కోట్లకు పైగా మొత్తాన్ని ప్రభుత్వం జమ చేసిందన్నారు. కరోనా మహమ్మారితో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా నిరుపేద కుటుంబాలకు మేలు ఆగకూడదన్న సంకల్పంతో సీఎం ఈ పథకాన్ని అమలు చేశారన్నారు. టీడీపీ నేతలు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నట్టు ఈ పథకంలో అర్హతలకు సంబంధించి కొత్తగా నియమావళి రూపొందించలేదని, గతం కంటే ఇంకా ఎక్కువ మందికి అవకాశం కల్పించేందుకు గతేడాది అర్హత నియమాలు సవరించినట్లు చెప్పారు. మరింత ఎక్కువ మందికి అందేలా.. ఈ పథకంలో అర్హత కోసం కుటుంబ నెలవారీ ఆదాయం 2019–20లో గ్రామీణ ప్రాంతాల్లో రూ.5 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.6,250 ఉంటే.. దాన్ని 2020–21లో గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12వేలకు ప్రభుత్వం పెంచిందని మంత్రి తెలిపారు. ఆ కుటుంబాల భూకమతాలకు సంబంధించి 2019–20లో 2.5 ఎకరాల పొలం మాగాణి లేదా 5 ఎకరాల మెట్ట భూమి ఉన్న వారిని అర్హులుగా పరిగణిస్తే.. 2020–21లో దాన్ని 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట భూమి ఉన్న వారికి కూడా వర్తింపచేసినట్టు తెలిపారు. ఇంకా 2019–20లో నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే వారినే అర్హులుగా పరిగణిస్తే.. 2020–21లో దాన్ని 300 యూనిట్లకు పెంచినట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అర్హులు కారని, అయితే కొత్తగా శానిటరీ వర్కర్లకు పథకాన్ని వర్తింపజేశామన్నారు. ఫోర్వీలర్ రూల్ను సవరించి ట్యా క్సీలు, ట్రాక్టర్లు, ఆటో కలిగి ఉన్న వారికి కూడా ఇస్తున్నామన్నారు. పట్టణాల్లో గతంలో 700 చదరపు అడుగుల ఇల్లున్న వారు మాత్రమే అర్హులు కాగా.. ఇప్పుడు 1000 చదరపు అడుగుల ఇల్లున్న వారికి కూడా వర్తింప చేస్తున్నామని వివరించారు. 2 లక్షలకు పైగా పెరిగిన లబ్ధిదారులు 2019–20లో ఈ పథకంలో 42,33,098 మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తే.. 2020–21లో ఆ సంఖ్య 44,48,865కు పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. అంటే 2,15,767 మంది తల్లులకు అదనంగా పథకంలో ఆర్థిక సహాయం చేశామని తెలిపారు. విద్యార్థుల హాజరుకు సంబంధించి కొత్తగా నియమావళి ఏం మార్చలేదని, 75 శాతం హాజరు ఉండాలని తొలి జీవో 63లో నిర్దేశించినట్లు తెలిపారు. హాజరు 75 శాతం ఉండాలన్న నిబంధన అమలు చేస్తూ ఈ ఏడాది పథకాన్ని జనవరి నుంచి జూన్కు మార్చామని స్పష్టం చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే నారా లోకేశ్తో పాటు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తూ విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు. -
Ola S1 Pro Real Range Test: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రియల్ రేంజ్ ఇంతేనా..?
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ గత ఏడాది(2021) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రెండు ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ల(ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రొ)ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్కూటర్లు ఒక్కరోజులో లక్షకు ప్రీ బుకింగ్ ఆర్డర్స్ అందుకొని రికార్డు సృష్టించాయి. గత నెలలో సంస్థ కస్టమర్లకు ఈ స్కూటర్లను డెలివరీ చేయడం ప్రారంభించింది. అయితే, ఈ స్కూటర్ ఇంత క్రేజ్ రావడానికి ప్రధాన కారణం ఆ స్కూటర్ రేంజ్. ఓలా సంస్థకు చెందిన ఎస్1 ప్రొ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్టింగ్ రేంజ్ వచ్చేసి 181 కిలోమీటర్లు అని కంపెనీ క్లెయిమ్ చేసింది. కానీ, వాస్తవానికి ఈ స్కూటర్ రేంజ్ ఎంతో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఓలా సంస్థకు చెందిన ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్న యజమాని సిద్ధార్థ్ రెడ్డి ఈ స్కూటర్ రియల్ రేంజ్ వీడియో రికార్డు చేసి "ప్రదీప్ఆన్ వీల్స్" యూట్యూబ్ చానెల్లో అప్ లోడ్ చేశారు. ఈ యూట్యూబ్ వీడియోలో ఎస్1 ప్రొ స్కూటర్ వాస్తవ పరిస్థితులలో ఎంత రేంజ్ అనేది మనం చూడవచ్చు. స్కూటర్ యజమాని సిద్ధార్థ్ రెడ్డి తన ఎలక్ట్రిక్ స్కూటర్ని ఫుల్(100%) చార్జ్ చేసిన తర్వాత రోడ్డు మీదకు టెస్ట్ రైడ్ కోసం బయలుదేరుతాడు. అయితే, మనం ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ స్కూటర్లో మూడు రైడ్ మోడ్స్(నార్మల్, స్పోర్ట్, హైపర్)ఉన్నాయి అనే విషయం మరిచిపోవద్దు. ఆటోమేటిక్'గా ఎకో మోడ్కు పడిపోయిన వేగం ఈ వీడియోలో తను పేర్కొన్న వివరాల ప్రకారం.. స్పోర్ట్, హైపర్ మోడ్స్ లో ప్రయాణించినట్లు తెలిపాడు. హైవేలపై మీద 60-70 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినట్లు పేర్కొన్నాడు. 93 కిలోమీటర్లు పాటు విస్తృతంగా ప్రయాణించిన తర్వాత ఈ స్కూటర్ బ్యాటరీ స్థాయి 15 శాతానికి పడిపోయింది. ఆ తర్వాత స్కూటర్ దానంతట అదే "ఎకో" మోడ్కు మారుతుంది. ఈ ఎకో మోడ్లో స్కూటర్ గరిష్ట వేగం గంటకు 40 కిలోమీటర్లు. ఆ తర్వాత 7 కిమీ ప్రయాణించిన తర్వాత 3 శాతానికి పడిపోయింది. ఆ తర్వాత ఛార్జింగ్ పెట్టాలని స్కూటర్ ఆగిపోయింది. (చదవండి: ఊసరవెల్లిలా రంగులు మార్చే ఫోన్ చూశారా..?) ఎస్1 ప్రో స్కూటర్ రియల్ రేంజ్ కాబట్టి, మొత్తంగా ఒకసారి ఈ స్కూటర్ని ఫుల్ చార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు వెళ్లనుంది. కానీ, ఇది ఏఆర్ఏఐ ద్వారా పరీక్షించినప్పుడు పొందిన 181 కిలోమీటర్ల రేంజ్ క్లెయిం కంటే చాలా తక్కువ. అయితే, ఎస్1 ప్రో వాస్తవ పరిస్థితులలో 135 కిలోమీటర్లు ఇచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని ఓలా పేర్కొంది. అయితే, ఈ స్కూటర్ మీద 70 కిలోల కంటే ఎక్కువ బరువు లేని ఒకే ఒక వ్యక్తి మాత్రమే ఉండాలి. స్కూటర్ మీద అదనపు లోడ్ తీసుకెళ్లరాదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 8.5 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ మోటార్ కలిగి ఉంది. అంతేకాకుండా 3.92 లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని 3.6 సెకండ్లలో అందుకుంటుంది అని కంపెనీ పేర్కొంది. -
ఇక ‘104’ వైద్యసేవలుండవ్
సాక్షి, హైదరాబాద్: పల్లెరోగులకు సేవలందించిన సంచార వైద్యవాహనం ఇక కనుమరుగు కానుంది. ‘104’వైద్య సంచార వాహన సేవలను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు అక్కడే నెలనెలా వైద్యపరీక్షలు నిర్వహించి, నెలకు సరిపడా మందులను ఒకేసారి ఇచ్చేందుకు ప్రభుత్వం ‘104’వాహనసేవలను ఉపయోగించుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతినెలా 20వ తేదీ వరకు నిర్దేశిత గ్రామాల్లో ఈ వాహనాలు సంచరిస్తుంటాయి. ఆ సంచార వైద్యవాహనంలో వైద్యుడు, ఏఎన్ఎం, ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, సహాయకుడు ఉంటారు. ఈ పథకాన్ని నిలిపివేయాలని నిర్ణయించిన వైద్య ఆరోగ్యశాఖ, అందులో పనిచేస్తున్న దాదాపు 1,250 మంది ఉద్యోగులను ఆ శాఖలోనే ఇతర పథకాల పరిధిలో సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే అమలులో ఉన్న జీవనశైలి వ్యాధుల నివారణ పథకం ద్వారా ఇంటింటికీ మందులను సరఫరా చేస్తున్నారు. మరోవైపు, త్వరలో పల్లె దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభించాలని నిర్ణయించడంతో ‘104’సేవలను నిలిపివేస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
11.99 లక్షల మందికి 104 కాల్ సెంటర్ వైద్యసేవలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 104 కాల్ సెంటర్ ద్వారా ఇప్పటి వరకు 11,99,927 మంది వైద్యసేవలు పొందారు. కరోనా తీవ్ర వ్యాప్తి సమయంలో ప్రభుత్వాస్పత్రుల్లో మినహా ప్రైవేటు ఆస్పత్రులన్నీ ఔట్ పేషెంటు సేవల్ని నిలిపేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఫోన్ చేస్తే వైద్యసేవలు అందేలా ప్రభుత్వం 104 కాల్ సెంటర్ను ఏర్పాటు చేసి భారీగా వైద్యులను నియమించింది. ఇప్పటి వరకు వైద్యసేవలు పొందిన వారిలో కరోనా పాజిటివ్గా నిర్ధారణై ఇంట్లో చికిత్స పొందుతున్నవారే 10.14 లక్షలమంది ఉన్నారు. 5,579 మంది పీడియాట్రిక్ వైద్యసేవలు పొందగా మిగిలినవారు వివిధ వ్యాధులకు సలహాలు తీసుకున్నారు. 13,797 సచివాలయాల పరిధిలో నిల్ రాష్ట్రవ్యాప్తంగా 15,001 గ్రామ, వార్డు సచివాలయాలుండగా ప్రస్తుతం 13,797 సచివాలయాల పరిధిలో కరోనా యాక్టివ్ కేసులు లేవు. 859 సచివాలయాల పరిధిలో ఒక్కో యాక్టివ్ కేసు, 222 సచివాలయాల పరిధిలో రెండేసి కేసులున్నాయి. 116 సచివాలయాల పరిధిలో 3 నుంచి 9, ఐదు సచివాలయాల పరిధిలో 10 నుంచి 19, రెండు సచివాలయాల పరిధిలో 20 నుంచి 29 యాక్టివ్ కేసులున్నాయి. గత వారం రోజుల్లో ప్రభుత్వం రోజుకు సగటున 27,656 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించింది. 90 శాతం, అంతకుమించి టీకాలు.. రాష్ట్రంలో 12,834 సచివాలయాల పరిధిలో 18 ఏళ్లు పైబడిన వారిలో 90 శాతం, అంతకంటే ఎక్కువమందికి ప్రభుత్వం కరోనా టీకాలు వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో 11,137 సచివాలయాలకుగాను 9,345, పట్టణ ప్రాంతాల్లో 3,864 సచివాలయాలకుగాను 3,489 సచివాలయాల పరిధిలో 90 శాతం, అంతకంటే ఎక్కువ మందికి టీకా వేశారు. -
నల్లగొండ జిల్లా పర్యటన ఉద్రిక్తం: బండి సంజయ్పై కేసు నమోదు
సాక్షి, నల్లగొండ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్పై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ ఏవీ రంగనాథ్ తెలిపారు. బండి సంజయ్ పర్యటనకు అనుమతి తీసుకోలేదని, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడం కారణంగా సభలు, సమావేశాలకు అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. ముందస్తు అనుమతి లేకుండా సమావేశాలు, పర్యటను నిర్వహించదని సూచించారు. కాగా నల్లగొండ జిల్లా పర్యటన నేపథ్యంలో జరిగిన ఘటనలో బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీల నేతలపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో వీడియో ఆధారాలతో కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ ఏవీ. రంగనాథ్ పేర్కొన్నారు. చదవండి: రైతుల కోసం ఎందాకైనా వస్తా: బండి సంజయ్ బండి సంజయ్ ఐకేపీ కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించే క్రమంలో టీఆర్ఎస్ నేతలు ఆయన పర్యటనను అడ్డుకునే క్రమంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం లాఠీచార్జీ చేయడం జరిగిందని ఎస్పీ వెల్లడించారు. అదే క్రమంలో బీజేపీ నేతలు బండి సంజయ్ పర్యటన కోసం జిల్లా యంత్రాంగం నుంచి కానీ, పోలీస్ శాఖ ద్వారా కానీ ఎలాంటి అనుమతి తీసుకోలేదని, చివరి నిమిషంలో బండి సంజయ్ నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత అనుమతి కోసం లేఖ ఇచ్చారన్నారు. చదవండి: కొనుడుపై కొట్లాట..! టీఆర్ఎస్, బీజేపీ పరస్పర దాడులు నల్లగొండ పట్టణ శివారులోని అర్జాలబావి ఐకేపి కేంద్రం వద్ద పర్యటన ప్రారంభం అయినప్పటి నుంచి ప్రతి ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుందని, ముందస్తు సమాచారం, అనుమతి లేని కారణంగా అందుబాటులో ఉన్న సిబ్బందితోనే భద్రతా చర్యలు చేపట్టాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. బండి సంజయ్ కాన్వాయిపై సైతం రాళ్లు, కోడిగుడ్లు వేస్తున్నారనే సమాచారంతో అప్పటికప్పుడు ఉన్న సిబ్బందితోనే పరిస్థితికి అనుగుణంగా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. పోలీస్ సిబ్బందికీ గాయాలు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ షబ్ డివిజన్ పరిధిలో బండి సంజయ్ పర్యటనను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నంలో జరిగిన ఘటనలో పలువురు పోలీస్ సిబ్బందికి సైతం గాయాలు అయ్యాయని ఎస్పీ తెలిపారు. రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి రాజకీయ పార్టీల ప్రతినిధులు, నాయకులు ముందస్తు అనుమతులు తీసుకోకుండా పర్యటనలు, సమావేశాలు నిర్వహించవద్దని ఆయన సూచించారు. అనుమతులు లేకుండా చేసే పర్యటనల క్రమంలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అయితే అప్పటికప్పుడు భద్రతా చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని, ముందుగా అనుమతి తీసుకోవడం ద్వారా కార్యక్రమానికి అనుగుణంగా తాము అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. మరో పక్క ఎమ్మెల్సీ కోడ్ అమలులో ఉన్న క్రమంలో అనుమతులు లేకుండా కార్యక్రమాలు నిర్వహించవద్దని, శాంతి భద్రతల సమస్యలు రాకుండా తమతో సహకరించాలని ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని తెలిపారు. -
మెలోడీ క్వీన్, లెజెండ్రీ సింగర్స్, ఆసక్తికర విషయాలు
సాక్షి, హైదరాబాద్ : తెలుగు నేపథ్య సంగీతంలో ఆమె గళం అమరం. భావితరాలకు మెలోడీ క్వీన్ పాటే కొండంత వెలుగు..ఒక పాఠశాల. ఏ దేశమేగినా అని దేశభక్తిని పొంగించినా.. మీర జాలగలడా నా ఆనతి అని పాడినా.. వస్తాడు నా రాజు అంటూ ఆమె గళమెత్తినా, ‘ఆడే పాడే పసివాడా ఆడేనోయి నీతోడ ఆనందం పొంగేనోయి దీపావళి’, ‘చీకటి వెలుగుల రంగేళి... జీవితమే ఒక దీపావళి’ అని రేడియోలో పాట ప్రసారం కాని లేని దీపావళి లేదు. ముత్యముంతా పసుపు ముఖమంతా ఛాయ అన్నా, ఝుమ్మంది నాదం సై అంది పాదం అని మురిపించినా ఆమెకు ఆమే సాటి. లతాజీతో గురుబంధం తనకు ఇష్టమైన గాయని లతా మంగేష్కర్ అని స్వయంగా సుశీలమ్మ గారే చాలా సందర్భంగా గర్వంగా ప్రకటించారు. ఆమె పాటలు వింటూ ఎదిగిన తాను, ఆమె గొంతును దొంగిలించాను అంటారామె. అలా లతాజీ తన మానసిక గురువు ఆమె అని చెబుతారు. అలాగే లతాజీ కూడా సుశీలమ్మను తన నాల్గవ చెల్లెలుగా భావిస్తారు. చెన్నై ఎప్పుడొచ్చినా సుశీలగారిని చూడకుండా వెనుదిరిగేవారు కాదు. అలాగే ముంబాయి వెళితే లతాజీని కలవకుండాక రారు సుశీలమ్మ. అంతటి స్నేహం, గురుభావం ఇద్దరి మధ్య ఉంది. హిందీ సినిమాలలో లతా మంగేష్కర్ ‘మహల్’ (1949) సినిమాతో స్టార్డమ్లోకి వస్తే పి.సుశీల ‘మిస్సమ్మ’ (1955) సినిమాతో స్టార్డమ్లోకి వచ్చారు. సుశీలమ్మను సౌత్ ఇండియా లతా మంగేష్కర్ అని కూడా పిలుచుకుంటారట. వీరిద్దరి మధ్య స్నేహం ఉండేదట. ముఖ్యంగా 1969లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి సంవత్సరమే జాతీయ ఉత్తమ గాయనిగా సుశీల ఎంపికయ్యారు. ఈ సందర్భంగా చెన్నైలో ఏవీయం అధినేత మెయ్యప్పన్ చెట్టియార్గారు ఏర్పాటు చేసిన అభినందన సభకు ముఖ్య అతిథిగా లతామంగేష్కర్ విచ్చేశారు. తన తోటిగాయనిని ప్రత్యేకంగా సత్కరించడమే కాకుండా మరుసటిరోజు సుశీలగారి ఇంటికి వెళ్లి ఆమెకు బంగారు నెక్లెస్ను కూడా బహుకరించారు. అలాగే ఒకసారి చెన్నై వచ్చి సుశీలమ్మ తలుపు తట్టి ఆశ్చర్యపరిచారట లతా మంగేష్కర్. సుశీలమ్మ బయోపిక్, ఏ ఆర్ రహ్మాన్ సంగీత దర్శకుడు , ఆస్కార్ విన్నర్ ఏఆర్రహమాన్ ఇటీవల వెల్లడించారు. తొలి ప్రొడక్షన్ , క్లాసిక్ మూవీ ‘‘99 సాంగ్స్’’ ప్రమోషన్లో భాగంగా సుశీల తన బయోపిక్ను తీయాలనే తన కోరికను వ్యక్తం చేసినట్లు రెహమాన్ వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 16న థియేటర్లలో విడుదలైన అనంతరం దీనఇన ఓటీటీలో కూడా విడుదల చేశారు. ఈ మూవీకి సంబంధించిన ఫీడ్బ్యాక్పై ఈఏడాది మేలో ట్విటర్ స్పేస్ సెషన్లో రెహమాన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. నెట్ఫ్లిక్స్లో ఉన్న 99 సాంగ్స్ చూశారా అని అడిగినపుడు చూడలేదని చెప్పారని, అయితే ఈ మూవీ తెలుగు వెర్షన్ను చూడాలని కోరినట్టు తెలిపారు. తన కోరిక మేరకు సినిమా చూసిన సుశీలమ్మ సినిమా చాలా బాగుందని ప్రశంసించడంతోపాటు, తన తన కథను ఈ విధంగా చేయాలనుకుంటున్నాను, మీరు సహాయం చేస్తారా? అని అడిగారని ఆ సందర్భంగా రివీల్ చేశారు. అంతేకాదు తన ఫ్యావరెట్ సింగర్ తన సినిమాకి ఈ విధంగా ప్రతిస్పందించడం చాలా సంతోషంగా అనిపించిందన్నారు. దీంతో తమ అభిమాన గాయని బయోపిక్పై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జానకికి తొలి అవార్డు జానకితోపాటు, తోటిగాయనీ మణులందరితోనూ కూడా సన్నిహిత సంబంధాలను కలిగి ఉండేవారు సుశీల. ముఖ్యంగా తన పేరిట తీసుకొచ్చిన తొలి అవార్డును ఎస్ జానకికి ఇచ్చి సత్కరించడాన్ని ఇండస్ట్రీలో గొప్పగా చెప్పుకుంటారు. రెండో ఏడాది గానగంధర్వుడు ఎస్ పీ బాలూకి, మూడవ ఏడాది కేజే ఏసుదాసుగారికి ఇచ్చారు. అంతేకాదు కొన్నివేల మంది గాయకులకు 2 వేలు పెన్షన్ అందిస్తున్నారు. ఫ్యామిలీ సుశీలమ్మగారి సోదరుడి కోసం వచ్చిన మోహన్రావు గారు సుశీలమ్మను చూసి ఇష్టపడ్డారు. ఆయనకు లతా మంగేష్కర్ అంటే మహా ఇష్టం. అయితే అప్పటికే పాటలు పాడుతున్న సుశీలగారు అభిమాని కావడంలో ఆశ్చర్యమేముంది. అలా ఆ తరువాత భర్త అయ్యారు. వివాహం తరువాత ఆయనకు నేనే లతా మంగేష్కర్. సుశీల భర్త వృత్తిరీత్యా వైద్యుడైన మోహనరావు. వీరికి జయకృష్ణ అనే కుమారుడు.. జయశ్రీ- శుభశ్రీ అనే ఇద్దరు మనమరాళ్ళు ఉన్నారు. ఆమె కోడలు సంధ్య జయకృష్ణ `ఇరువర్` అనే తమిళ చిత్రంలో ఏఆర్ రహమాన్తో కలసి అరంగేట్రం చేశారామె. అలా రెహామాన్కి సుశీలమ్మ కుటుంబంతో గొప్ప అనుబంధం ఉంది. -
104కు వచ్చిన కాల్స్ 6 లక్షలకు పైనే..
సాక్షి, అమరావతి: కోవిడ్ సమయంలో అమల్లోకి తెచ్చిన 104 కాల్ సెంటర్ మరో మైలురాయిని అధిగమించింది. సోమవారం నాటికి 104కు కాల్ చేసిన వారి సంఖ్య 6 లక్షలు దాటింది. ఇందులో 2.60 లక్షల మందికి పైగా వివిధ ఆరోగ్య సమస్యల సమాచారం తెలుసుకునేందుకు కాల్ చేశారు. 87 వేల మందికి పైగా కోవిడ్ టెస్టు ఫలితాల కోసం, టీకా కోసం 37 వేల మందికి పైగా, కోవిడ్ టెస్ట్ల కోసం 1.12 లక్షల మంది, ఆస్పత్రుల్లో అడ్మిషన్ల కోసం 96 వేల మందికి పైగా కాల్ చేశారు. సోమవారం నాటికి వివిధ సమస్యల కోసం 104 కాల్ సెంటర్కు ఫోన్ చేసిన వారి సంఖ్య 6,01,410కి చేరింది. ఇప్పటికీ 104 కాల్ సెంటర్లో 333 మంది సిబ్బందితో పాటు వైద్యులు మూడు షిఫ్ట్లలో పనిచేస్తున్నారు. సోమవారం ఒక్క రోజే 489 ఫోన్ కాల్స్ వచ్చినట్టు కాల్ సెంటర్ అధికారులు చెప్పారు. -
10 లక్షలమందికి ఫోన్లో వైద్యసేవలు
సాక్షి, అమరావతి: కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 104 కాల్సెంటర్ బాధితులకు గొప్ప ఊరటనిచ్చింది. 2021 మే 1వ తేదీనుంచి 104 కాల్సెంటర్లో రిజిస్టర్ అయిన 5,523 మంది వైద్యులు ఇప్పటివరకు 10 లక్షలమంది బాధితులకు ఫోన్లో వైద్యసలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ వైద్యుల్లో 1,132 మంది స్పెషలిస్టులు. వీళ్లు టెలీ కన్సల్టేషన్ కింద ఈనెల 21వ తేదీ నాటికి 10,16,760 మందికి వైద్యసేవలు అందించారు. సేవలు పొందిన వారిలో 7.20 లక్షల మంది ఇంట్లో చికిత్స తీసుకుంటున్న వారే ఉన్నారు. కోవిడ్ సమయంలో బయటకు వెళ్లలేక ఇబ్బందులున్న పరిస్థితుల్లో ఏ రాష్ట్రంలోను చేయని విధంగా ఏపీలో మాత్రమే 104 కాల్సెంటర్ నుంచి టెలీకన్సల్టెన్సీ ద్వారా వైద్యులు సేవలు అందించారు. -
104 తక్షణం స్పందించాలి
సాక్షి, అమరావతి: కోవిడ్ బాధితులకు తక్షణం సేవలందించేలా 104 కాల్ సెంటర్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, ఈ వ్యవస్థ పటిష్టంగా పనిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. 104 కాల్ సెంటర్ పనితీరులో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. ఈ విషయాన్ని అధికారులు సీరియస్గా తీసుకోవాలని స్పష్టం చేశారు. అ«ధికారులు ప్రతిరోజూ మాక్ కాల్స్ చేసి ఆ వ్యవస్థ పని తీరును పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి ఆస్పత్రిలోనూ ఆరోగ్య మిత్ర ఉండాలని, ఎవరైనా సమస్య ఎదుర్కొంటే ఫిర్యాదు చేసేందుకు ప్రతి ఆస్పత్రిలోనూ నంబర్ ప్రదర్శించాలని ఆదేశించారు. కోవిడ్–19 నియంత్రణ, నివారణ, చికిత్సలపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో కోవిడ్ స్పెషల్ ఆఫీసర్లు, టాస్క్ఫోర్స్ బృందంతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలు ఇవీ.. ఆస్పత్రుల ఆవరణల్లో జర్మన్ హేంగర్స్ కోవిడ్ రోగుల రద్దీ ఎక్కువగా ఉన్న జిల్లాల్లో అవసరాన్ని బట్టి ఆస్పత్రుల ఆవరణల్లోనే తాత్కాలికంగా జర్మన్ హేంగర్స్ను ఏర్పాటు చేసి అదనపు బెడ్లు ఏర్పాటు చేయాలి. దీనివల్ల పేషెంట్లు బయట వేచిచూసే పరిస్థితులు తొలగిపోయి సత్వరమే వైద్యం అందుతుంది. వాటికి ఆక్సిజన్ సదుపాయం కల్పించటాన్ని పరిశీలించాలి. సమీపంలోనే డాక్టర్లు ఉంటారు కాబట్టి పర్యవేక్షించేందుకు వీలుగా ఉంటుంది. 104కు కాల్ చేసిన వెంటనే కచ్చితంగా స్పందన ఉండాలని, అవసరమైన వారికి వెంటనే బెడ్ కల్పించాల్సిందేనని ఆదేశించారు. 104కు కాల్ చేస్తే ఫోన్ కలవలేదని, స్పందన లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదన్నారు. 104కు కాల్ చేసిన తర్వాత కోవిడ్ బాధితులకు కచ్చితంగా సహాయం అందాల్సిందేనని స్పష్టం చేశారు. బెడ్ అవసరం లేదనుకుంటే పరిస్థితిని బట్టి కోవిడ్ కేర్ సెంటర్లకు పంపించాలని సూచించారు. 3 గంటల్లో మందుల కిట్లు ప్రస్తుత పరిస్థితుల్లో జ్వరం వస్తే కోవిడ్ లక్షణంగా భావించి వెంటనే మందులు ఇచ్చేలా చూడాలని వైద్య నిపుణులు పేర్కొన్నారని, ఆ మేరకు అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇంట్లో చికిత్స పొందాల్సిన రోగికి 3 గంటల్లోగా మందుల కిట్ పంపాలని ఆదేశించారు. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు కమ్యూనిటీ ఆస్పత్రుల నుంచి బోధనాసుపత్రుల వరకు పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేసి సత్వరమే వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్లాక్ మార్కెటింగ్ నిరోధించేందుకు గట్టి చర్యలు రెమ్డెసివెర్ ఇంజక్షన్ల బ్లాక్ మార్కెటింగ్ను నిరోధించేందుకు గట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం జగన్ ఆదేశించారు. దీనిపై ఆడిట్ తప్పనిసరిగా ఉండాలని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వినియోగంపై ఆడిటింగ్ నిర్వహించాలని స్పష్టం చేశారు. ఆస్పత్రుల్లో అవసరమైన ఇంజక్షన్లు రోగులకు అందుబాటులో ఉంచాలని, ఇంజక్షన్ల పేరిట దోచుకునే వ్యవహారాలకు అడ్డుకట్ట వేయాలని సీఎం ఆదేశించారు. కోవిడ్– కర్ఫ్యూ రాష్ట్రంలో కర్ఫ్యూ అమలవుతున్న తీరుపై ప్రతి జిల్లానుంచి రోజూ నివేదిక ఇవ్వాలని డీజీపీని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిర్దేశించిన సమయంలో కర్ఫ్యూ అమలు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాల్లో ప్రతి బుధవారం కోవిడ్రివ్యూ కమిటీలు సమావేశం కావాలని సీఎం ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను ప్రజా ప్రతినిధులు అధికారులకు వివరించే అవకాశం కలుగుతుందని, ఈ సమావేశంలో అందుతున్న ఫీడ్బ్యాక్ను పరిశీలించి సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించాల్సిందిగా సీఎం సూచించారు. హోం ఐసోలేషన్లో లక్షన్నర మంది రాష్ట్రంలో కోవిడ్ ఆస్పత్రులు, బెడ్ల వివరాలను అధికారులు సమీక్షా సమావేశంలో వివరించారు. రాష్ట్రానికి 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించగా, ఈనెల 8న 571 టన్నులు తీసుకున్నామని చెప్పారు. కనీసం 10 ఐఎస్ఓ క్రయోజనిక్ ట్యాంకర్లు కేటాయించాలని కేంద్రాన్ని ప్రత్యేకంగా కోరామని తెలిపారు. తమిళనాడు, కర్ణాటక నుంచి అదనంగా ఆక్సిజన్ కోసం ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. తమిళనాడు నుంచి కనీసం 60 మెట్రిక్ టన్నులు, కర్ణాటక నుంచి 130 మెట్రిక్ టన్నులు ఆక్సిజన్ వస్తే కనీస అవసరాలు తీరుతాయని వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 638 కోవిడ్ ఆçస్పత్రుల్లో మొత్తం 47,644 బెడ్లు ఉండగా 39,271 బెడ్లు ఆక్యుపై అయినట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద 24,645 మంది చికిత్స పొందుతుండగా, కోవిడ్ కేర్ సెంటర్లలో మరో 15 వేల మంది ఉన్నారని తెలిపారు. ఐసీయూల్లో 6,789 బెడ్లు ఉండగా 6,317 ఆక్యుపై అయినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పుడు పూర్తిగా ప్రైవేటు ఆస్పత్రి అనేవి లేవని, అన్నీ ఎంప్యానెల్ లేదా తాత్కాలిక ఎంప్యానెల్ ఆస్పత్రులేనని అధికారులు పేర్కొన్నారు. 102 కోవిడ్ కేర్ సెంటర్లలో 49,438 బెడ్లు ఉండగా 15,107 బెడ్లు ఆక్యుపైడ్ అని, హోం ఐసొలేషన్లో దాదాపు 1.5 లక్షల మంది ఉన్నారని అధికారులు తెలిపారు. కోవిడ్ నియంత్రణకు 17,901 మంది నియామకం కోవిడ్ నియంత్రణ, నివారణ కోసం మొత్తం 20,793 మంది నియామకానికి ఆమోదం తెలపగా ఇప్పటి వరకు 17,901 మంది నియామకాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. కోవిడ్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్కు చెందిన దాదాపు 3,500 మందిని తాత్కాలికంగా విధుల్లో నియమిస్తున్నామని తెలిపారు. -
104 Medical Helpline: 104కు భారీ స్పందన
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్కు సంబంధించి సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక్క ఫోన్ పలకరింపుతో పరిష్కారం చూపుతున్న 104 కాల్ సెంటర్ ఇప్పుడు సంజీవనిలా అయింది. ఫోన్ చేయగానే బాధితుడికి ఏం కావాలో అడిగి పరిష్కరిస్తున్నారు. కోవిడ్ టెస్టులు ఎక్కడ చేస్తున్నారు? కోవిడ్ చికిత్సకు అనుమతులు ఉన్న ఆస్పత్రులు ఎక్కడున్నాయి? ఏ ఆస్పత్రుల్లో పడకలున్నాయి? ఎక్కడ ఆక్సిజన్ లభ్యత ఉంది? వ్యాక్సిన్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయి? ఇలాంటి సమాచారం కోసం ఎక్కువ మంది 104కు ఫోన్ చేస్తున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి 27వ తేదీ రాత్రి వరకూ 52,325 ఫోన్కాల్స్ వచ్చాయి. మూడు షిఫ్టుల్లో కాల్సెంటర్ ప్రస్తుతం గన్నవరంలో ఏర్పాటు చేసిన 104 కాల్ సెంటర్ 3 షిఫ్టుల్లో 300 మందికి పైగా ఎగ్జిక్యూటివ్లతో పనిచేస్తోంది. 21 మంది డాక్టర్లు ఇక్కడ పనిచేస్తున్నారు. వీళ్లు కాకుండా 2,243 మంది వైద్యులు టెలీ కన్సల్టెంట్లుగా 104 కాల్సెంటర్కు అనుసంధానమయి ఉన్నారు. కాల్సెంటర్లో పనిచేస్తున్న వైద్యులు బిజీగా ఉంటే వెంటనే ఆ కాల్స్ను కన్సల్టెంట్ డాక్టర్కు డైవర్ట్ చేస్తారు. దీనివల్ల ఏ బాధితుడికీ ఇబ్బంది లేకుండా వెంటనే సమాధానం లభిస్తోంది. రోజుకు సగటున 7వేలకు పైగా కాల్స్ వస్తున్నాయి. 104 కాల్ సెంటర్ ద్వారా గడిచిన 12 రోజుల్లో 6,732 మందికి పడకలు లభించాయి. కోవిడ్ సమస్యలన్నిటికీ ఇక్కడే పరిష్కారం.. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ సమస్యతో ఎవరు ఫోన్ చేసినా 104 కాల్ సెంటర్ నుంచి పరిష్కారం అయ్యేలా చేస్తున్నాం. ఎక్కడా సమాచారం రాదు అనుకున్నది కూడా 104కు చేస్తే లభిస్తుంది అనేలా చేశాం. సీఎం జగన్ ఆదేశాల మేరకు టెలీ కన్సల్టేషన్ డాక్టర్లను భారీగా పెంచాం. ప్రధానంగా పడకల కేటాయింపుపై దృష్టి సారించాం. – బాబు ఎ, 104 కాల్ సెంటర్ పర్యవేక్షణాధికారి -
కోవిడ్ కిట్ల నుంచి బెడ్లు దాకా.. 3 గంటల్లోనే..
104 కాల్సెంటర్ పూర్తి స్థాయిలో సమర్థంగా పని చేసేలా కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలి. ఆ నంబర్కు ఫోన్ చేసిన వారికి తక్షణమే పరిష్కారం చూపాలి. ఆస్పత్రికి వెళ్లడమా? క్వారంటైన్కు పంపడమా? హోం ఐసొలేషనా?.. ఏం చేయాలన్నది స్పష్టంగా చెప్పాలి. కోవిడ్కు సంబంధించిన అన్ని సమస్య లకు 104 నంబర్ వన్ స్టాప్ సొల్యూషన్ అన్నది ప్రజల్లోకి బలంగా వెళ్లాలి. ఆ స్థాయిలో కాల్ సెంటర్ పని చేయాలి. 104కి ఫోన్ చేసిన వెంటనే 3 గంటల్లోగా బెడ్తో సహా రోగులకు ఏది అవసరమో అది కేటాయించాలని మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. 104 కాల్సెంటర్లో తగిన సంఖ్యలో వైద్యులు అందుబాటులో ఉండాలి. అన్ని వ్యవస్థలు 104తో అనుసంధానం కావాలి. – సీఎం వైఎస్ జగన్ 48 గంటల్లో నియామకాలు.. పడకల సామర్థ్యానికి తగినట్లుగా అన్ని ఆస్పత్రులలో వైద్య సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది పూర్తి స్థాయిలో ఉండాలి. ఎక్కడ ఖాళీలున్నా వెంటనే వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించండి. 48 గంటల్లో నియామకాలు పూర్తి చేయాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: కోవిడ్ నియంత్రణ, నివారణకు సంబంధించి 104కి ఫోన్ చేసిన మూడు గంటల్లోగా కోవిడ్ కిట్ల నుంచి బెడ్స్ వరకు ఏదైనా సరే వెంటనే కేటాయించాలని సీఎం వైఎస్ జగన్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. 104 కాల్సెంటర్ మరింత సమర్థంగా పనిచేసేలా కలెక్టర్లు దృష్టి సారించాలని సూచించారు. జిల్లా స్థాయిలో ప్రైవేట్ కోవిడ్ ఆస్పత్రులను క్లస్టర్లుగా విభజించి ఫ్లయింగ్ స్క్వాడ్లతో నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది పూర్తి స్థాయిలో ఉండాలని స్పష్టం చేశారు. ఖాళీల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించి 48 గంటల్లోగా నియామకాలను పూర్తి చేయాలన్నారు. కోవిడ్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, మాస్క్లు ధరించాలని, శానిటైజర్లు వాడాలని విజ్ఞప్తి చేశారు. ఏ కార్యక్రమంలోనూ 50 మందికి మించి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కోవిడ్పై పుకార్లు సృష్టించడం, తప్పుడు సమాచారం ప్రసారం చేయడం లాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించడంతోపాటు అరెస్టు చేసి జైలుకు పంపాలని ఆదేశించారు. కోవిడ్ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్పై కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులకు సీఎం మార్గనిర్దేశం చేశారు. ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ వివరాలివీ.. కోవిడ్ ఆస్పత్రులు–బెడ్లు: కోవిడ్ చికిత్స కోసం అన్ని జిల్లాల్లో 355 ఆస్పత్రులను కలెక్టర్లు గుర్తించగా వాటిలో 28,377 బెడ్లున్నాయి. ప్రస్తుతం 17,901 బెడ్లు ఆక్యుపై అయ్యాయి. ఆ ఆస్పత్రులలో వైద్యం పూర్తిగా ఉచితం. మందులు కూడా ఫ్రీగా ఇవ్వాలి. కలెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జేసీలు పూర్తి దృష్టి సారించాలి.. జేసీలు (గ్రామ, వార్డు సచివాలయాలు – అభివృద్ధి) ఇక నుంచి కోవిడ్పైనే దృష్టి పెట్టాలి. ఆ అధికారి అదేపనిలో నిమగ్నం కావాలి. అప్పుడే అనుకున్న స్థాయిలో సేవలందించగలుగుతాం. ప్రభుత్వ ఆస్పత్రులు, కోవిడ్ చికిత్స చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు, కోవిడ్ చికిత్స అందించే ఆరోగ్యశ్రీ ఆస్పత్రులను కూడా జేసీ పర్యవేక్షించాలి. నాణ్యతతో కూడిన ఆహారం, శానిటేషన్, ఔషధాల లభ్యత, తగినంత మంది వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, హెల్ప్డెస్క్లు, ఆరోగ్యమిత్రలు, సీసీటీవీ కెమెరాలు పని చేస్తున్నాయా? లేదా? అన్నది ప్రతి రోజూ చూడాలి. దాదాపు 355 కోవిడ్ ఆస్పత్రులు (ప్రభుత్వ ఆస్పత్రులు, కోవిడ్ చికిత్సకు అనుమతించిన ప్రైవేట్ ఆస్పత్రులు, కోవిడ్ చికిత్స చేస్తున్న ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు) వద్ద నిరంతరం పర్యవేక్షణ జరగాలి. కోవిడ్ కేర్ సెంటర్లు (సీసీసీ).. జిల్లాలో తగినన్ని కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో 59 సీసీసీలు పని చేస్తుండగా 33,327 బెడ్లున్నాయి. కోవిడ్ కేర్ సెంటర్లలో నాణ్యతతో కూడిన ఆహారం, శానిటేషన్, ఔషధాల లభ్యత, వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, హెల్ప్ డెస్క్లు, ఆరోగ్యమిత్రలు, సీసీటీవీ కెమెరాలు, రోగులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నారా? లేదా? అన్నది ప్రతి కలెక్టర్ చూడాలి. ఎక్కడా బెడ్ల కొరత లేకుండా కలెక్టర్లు శ్రద్ధ చూపాలి. ఆక్సిజన్ సరఫరా.. ప్రస్తుతం రోజుకు 320 నుంచి 340 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా అవుతోంది. ఇది ప్రస్తుతానికి సరిపోతోంది. ఆక్సిజన్ అవసరమైన వారికి తప్పనిసరిగా వెంటనే ఇవ్వాలి. ఆక్సిజన్ లెవెల్ 94 కంటే తక్కువ ఉంటే వెంటనే అందచేసేలా చర్యలు తీసుకోవాలి. నిరంతర తనిఖీలు.. జిల్లా స్థాయిలో కోవిడ్ ఆస్పత్రులను క్లస్టర్లుగా విభజించి ఇన్ఛార్జ్లను నియమించాలి. జిల్లా స్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్ల ద్వారా నిరంతర తనిఖీలు జరపాలి. అందులో ఔషధ నియంత్రణ విభాగం అధికారులు కూడా ఉంటారు. వీటన్నింటినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కోసం రాష్ట్ర స్థాయిలో ఒక టాస్క్ఫోర్స్ను కూడా ఏర్పాటు చేశాం. 50 మందికి మించి వద్దు.. ప్రజలు ఒకే చోట గుమికూడకుండా జాగ్రత్తలు పాటించాలి. పెళ్లిళ్లకు కేవలం 50 మందికి మాత్రమే అనుమతి ఉంది. జిమ్లు, పార్కుల్లో అందరూ ఒకేచోట చేరకుండా చూడాలి. ఎక్కడా ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోకూడదు. అదే సమయంలో కోవిడ్ నిబంధనలు తప్పనిసరి. ఏ కార్యక్రమంలోనూ 50 మందికి మించి చేరకూడదు. వారి పట్ల కఠినంగా వ్యవహరించండి.. పుకార్లు, తప్పుడు సమాచారం ప్రచారం చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించండి. అరెస్టు చేయండి. అలాంటి వారిని జైలుకు పంపే అధికారం కూడా మీకు (అధికార యంత్రాంగం) ఉందన్న విషయం మర్చిపోవద్దు. ఈ విషయంలో అవసరమైతే ఎస్పీలు కఠినంగా వ్యవహరించాలి. ప్రతి రోజూ అధికారిక బులెటిన్ ఇస్తారు. దాన్నే అందరూ తీసుకోవాలి. కోవిడ్ వల్ల ఇప్పటికే అందరూ భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లేనిపోని పుకార్లు సృష్టించి అసత్యాలు ప్రచారం చేస్తే, ప్రజల్లో ఆందోళన తీవ్రమవుతుంది. కాబట్టి అసత్య ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దు. లాక్డౌన్తో ప్రజలకు నాలుగింతలు నష్టం.. కోవిడ్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కలెక్టర్లు వచ్చే కొద్ది నెలలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. లాక్డౌన్ వల్ల ప్రభుత్వానికి ఒక్క రూపాయి నష్టం కలిగితే సామాన్యుడికి నాలుగు రూపాయలు నష్టం వాటిల్లుతుంది. గత ఏడాది లాక్డౌన్ వల్ల ప్రభుత్వానికి దాదాపు రూ.20 వేల కోట్ల నష్టం జరిగితే ప్రజలకు దాదాపు రూ.80 వేల కోట్ల నష్టం జరిగింది. కోవిడ్తో కలసి జీవించక తప్పని పరిస్థితి.. దేశంలో ప్రస్తుతం నెలకు 7 కోట్ల వాక్సిన్ ఉత్పత్తి జరుగుతుండగా అందులో కోవాక్సిన్ కోటి డోస్లు తయారవుతున్నాయి. మిగతాది కోవిషీల్డ్. రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడిన వారిలో ఇప్పటివరకు 11.30 లక్షల మందికి రెండు డోసులు, దాదాపు 45.48 లక్షల మందికి సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చారు. 18 – 45 ఏళ్ల వారికి కూడా వాక్సిన్ ఇస్తాం. అందరూ కోవిడ్తో కలసి జీవించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. అందరికీ టీకాల కార్యక్రమం పూర్తయ్యే వరకు కోవిడ్ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. – ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, బొత్స సత్యనారాయణ, చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నీరబ్ కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సీఎస్ అజయ్జైన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పుష్ప: ఆ రోల్ చేయడానికి ఐశ్వర్య ఒప్పుకుంటుందా?
సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో అల్లుఅర్జున్ లారీ డ్రైవర్గా కనిపించనుండగా, ఆయనకు జోడీగా రష్మిక మందన్నా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరలవుతోంది. ఈ సినిమాలో కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ నటించనున్నట్లు సమాచారం. పుష్పరాజ్ (బన్నీ)కు చెల్లెలుగా ఐశ్వర్యా కనిపించనున్నట్లు టాక్. అంతేకాకుండా అనుకోసి పరిస్థితుల్లో ఐశ్వర్యా చనిపోతుందని, దీనికి ఓ పోలీసు అధికారే కారణం అవుతాడని,దీంతో అతడిపై పుష్పరాజ్ ఎలా పగ తీర్చుకుంటాడన్న కథాంశాంతో మూవీ ఉండనుందట. మరి ఈ రోల్కు ఐశ్వర్యా ఓకే చెబుతుందా? లేక సిస్టర్ రోల్ అని సైడ్ అవుతుందా అన్నది చూడాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పహాద్ ఫాజిల్ విలన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా బాలీవుడ్ నటి ఊశ్వరిరౌటేలా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయనుంది. ఇలా అన్ని హంగులతో సినిమాపై ఇప్పటికే పాజిటివ్ హైప్ క్రియేట్ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చదవండి : మరో రికార్డు సొంతం చేసుకున్న సిద్ శ్రీరామ్ 'ఆ ఫోటోలు పెడుతున్నారు..కొంచెమైనా సిగ్గుండాలి' -
104 కమాండ్ కంట్రోల్ రూమ్ సేవలు బలోపేతం
-
టెక్ దిగ్గజం బోనస్ బొనాంజా : పండగే
సాక్షి, ముంబై: టెక్ మేజర్ హెచ్సీఎల్ టెక్నాలజీస్ (హెచ్సీఎల్) తన ఉద్యోగులకు తీపికబురు అందించింది. అంచనాలకు మించిన త్రైమాసిక లాభాలను సాధించిన సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1.5 లక్షల మంది ఉద్యోగులకు భారీ ప్రత్యేక బోనస్ బొనాంజా ప్రకటించింది. సుమారు 700 కోట్ల రూపాయల విలువైన వన్టైమ్ స్పెషల్ బోనస్ను అందిస్తున్నట్టు వెల్లడించింది. కోవిడ్-19 మహమ్మారి సంక్షోభ సమయంలో కూడా తమ ప్రతీ ఉద్యోగి అపారమైన నిబద్ధతతో సేవలందించారని ఇదే సంస్థ వృద్ధికి దోహదపడిందని సంస్థ పేర్కొంది. అంతేకాదు ఉద్యోగులే తమకు అత్యంత విలువైన ఆస్తి అని కంపెనీ ప్రకటించడం విశేషం. 2020 జనవరి-డిసెంబర్ మధ్యకాలంలో తొలిసారి 10 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అధిగమించిన తరువాత హెచ్సీఎల్ ఈ బంపర్ఆఫర్ ప్రకటించింది. సుమారు 90 మిలియన్ డాలర్లు (రూ. 650 కోట్లకు పైగా) ప్రత్యేక బోనస్ను ఫిబ్రవరిలో ఉద్యోగులకు చెల్లించనుంది. ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ సర్వీసు ఉన్న ఉద్యోగులందరికీ ఈ బోనస్ అందుతుందని, ఇది పది రోజుల జీతానికి సమానమని హెచ్సీఎల్ టెక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా సంస్థలోని ప్రతీ ఉద్యోగికి హెచ్సీఎల్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ వీవీ అప్పారావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కాగా హెచ్సీఎల్ టెక్నాలజీస్ 2020 డిసెంబర్ త్రైమాసికంలో సంవత్సరానికి నికర లాభం 31.1 శాతం ఎగిసి 3,982 కోట్ల రూపాయలుగా నమోదైంది. త్రైమాసిక ప్రాతిపదికన, హెచ్సిఎల్ లాభం 26.7 శాతం పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఈక్విటీ షేరుకు రూ .4 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ట్రంప్ ఐటీ 750 డాలర్లు!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2016, 2017 సంవత్సరాల్లో ఏటా కేవలం 750 డాలర్ల ఆదాయపన్ను చెల్లించారని న్యూయార్క్టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. అదే 2017లో ఆయన, ఆయన కంపెనీలు భారత్లో పన్ను రూపేణా 1,45,400 డాలర్లు చెల్లించారని తెలిపింది. అదే సంవత్సరంలో పనామాలో 15,598 డాలర్లు, ఫిలిప్పీన్స్లో 1,56,824 డాలర్ల పన్నును చెల్లించినట్లు వివరించింది. కానీ స్వదేశానికి వచ్చేసరికి గత 15 సంవత్సరాల్లో పదేళ్లు ఎలాంటి పన్ను చెల్లించలేదని పేర్కొంది. ఆయా సంవత్సరాల్లో తనకు లాభాల కన్నా నష్టాలే ఎక్కువని ట్రంప్ చూపినట్లు తెలిపింది. గత ఇరవై సంవత్సరాల టాక్స్ రిటర్న్ డేటాను విశ్లేషించి ఈ విషయం రాబట్టినట్లు తెలిపింది. త్వరలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో పన్ను ఆరోపణలు రావడం ట్రంప్నకు ఇబ్బందేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇవన్నీ అవాస్తవ కథనాలని ట్రంప్ కొట్టి పారేశారు. తాను పన్నులు చెల్లించానని, ప్రస్తుతం తన టాక్స్ రిటర్న్స్ ఆడిటింగ్లో ఉన్నాయని, పూర్తయ్యాక చెక్ చేసుకోవచ్చని తెలిపారు. న్యూయార్క్టైమ్స్ అనవసరంగా తనపై బురదజల్లుతోందన్నారు. పలు రాష్ట్రాల్లో తాను ఎంతో సొమ్మును పన్నుల రూపంలో చెల్లించానన్నారు. తనకున్న పలు కంపెనీలన్నింటి వివరాలతో కలిపి తన ట్యాక్స్ ఫైలింగ్స్ 108 పేజీలుంటుందని చెప్పారు. మంగళవారం మాటల పోరు నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల కోలాహలం ఈ నెల 29 నుంచి మరింత ఊపందుకోనుంది. మంగళవారం రోజు ప్రధాన పార్టీల అభ్యర్ధులు ట్రంప్, జోబైడెన్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో పాల్గొననున్నారు. ఎన్నికలకు ముందు ఇలాంటి ప్రధానడిబేట్లు 3 జరుగుతాయి. ‘సూపర్ బౌల్ ఆఫ్ అమెరికన్ డెమొక్రసీ’ పేరిట జరిగే ఈ కార్యక్రమంలో ఇరువురు వివిధ అంశాలపై తమపై సంధించే ప్రశ్నలకు సమాధానాలిస్తారు. అక్టోబర్ 7న ఉపాధ్యక్ష అభ్యర్ధులు మైక్ పెన్స్, కమలాహారిస్లు డిబేట్లో పాల్గొంటారు. -
కరోనా : ఇజ్రాయెల్లో రెండోసారి లాక్డౌన్
జెరూసలేం:దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో మూడువారాల లాక్డౌన్ విధిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించింది. రెండవసారి వైరస్ సంక్రమణను అడ్డుకునేందుకు ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రపంచంలోనే ఇలాంటి చర్య తీసుకున్న మొదటి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఇజ్రాయెల్ నిలిచింది. మూడు వారాల పాటు కఠినమైన లాక్డౌన్ కు కేబినెట్ అంగీకరించిందని, దీనిని పొడిగించే అవకాశం కూడా ఉందని దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదివారం ప్రకటించారు. రోజుకు 4వేలకు పైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయనీ దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. మహమ్మారి కారణంగా ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థపై రెండవ లాక్డౌన్ ద్వారా 6.5 బిలియన్ల షెకెల్లు (1.88 బిలియన్ డాలర్లు) మేర నష్టం ఏర్పడనుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా. దేశంలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుతుండడంతో సెప్టెంబర్ 18నుంచి రెండు వారాల లాక్డౌన్ కొనసాగనుంది. లాక్డౌన్ కాలంలో సూపర్ మార్కెట్లు, ఫార్మసీలు వంటి అత్యసర సేవలు మినహా ఉదయం 6 గంటలకు వరకు పూర్తిస్థాయి ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా దేశంలోని అన్ని పాఠశాలలు, కిండర్ గార్టెన్లు రెండు రోజుల ముందుగానే సెప్టెంబర్ 16న మూసివేస్తారు. అయితే యూదుల నూతన సంవత్సరం ముఖ్యమైన సెలవుల ప్రారంభానికి కొన్ని గంటల ముందు ప్రధానంగా ప్రాయశ్చిత్త దినం, సుక్కోట్ ముందు వెలువడిన ఈ నిర్ణయంపై తీవ్ర నిరసర వ్యక్తమవుతోంది. తాజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గృహశాఖా మంత్రి యాకోవ్ లిట్జ్మాన్ రాజీనామా చేశారు, ఇది ఇజ్రాయెల్ యూదులకు అగౌరవమని ఆయన అన్నారు. మార్చిలో కఠినమైన లాక్డౌన్ అమలుద్వారా కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టినందుకు ఇజ్రాయెల్ సర్కార్ మొదట్లో ప్రశంసలు అందుకుంది. కానీ ఆ తరువాత కేసులు బాగా పెరగడంతో మహమ్మారిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శలు చెలరేగాయి. నెతన్యాహు రాజీనామా చేయాలని వందలాది మంది ప్రదర్శనకారులు ర్యాలీలు చేశారు. ఇజ్రాయెల్లో ఇప్పటివరకు 153,759 కరోనా కేసులు నమోదు కాగా 1,108 మంది వ్యాధి బారిన పడి మరణించారు. -
పల్లెకు 104 పరుగులు
పాడేరు: పల్లె సంజీవనిగా మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన 104 వాహనాల సేవలను సీఎం జగన్మోహన్ రెడ్డి మరింత విస్తృతం చేశారు. జిల్లాలోని 42 మండలాలకు 104 వాహనాలను అన్ని సౌకర్యాలతో అందుబాటులో తెచ్చారు. గత నెల 1న రాష్ట్ర వ్యాప్తంగా కొత్త 104 వాహనాల సేవలను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ మేరకు విశాఖ జిల్లాకు కూడా ఈ వాహనాలు చేరుకున్నాయి. అయితే కోవిడ్–19 కారణంగా వీటి సేవలను తాత్కాలికంగా జిల్లా అధికారులు వాయిదా వేశారు. 42 మండలాలకు 42 కొత్త వాహనాలు చేరుకున్నాయి. ఆయా వాహనాలను మండలాల్లోని పీహెచ్సీల వద్ద భద్రంగా ఉంచారు. 104 సేవలను జిల్లా వ్యాప్తంగా ప్రారంభించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో శుక్రవారం నుంచి ఈ సేవలను అందుబాటులోకి తెస్తున్నారు. ప్రతి వాహనంలో వైద్యుడు అన్ని సౌకర్యాలతో కూడిన నూతన 104 వాహనాల్లో వైద్యుడిని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. వైద్యుడితో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్ ఉంటారు. 104 వాహనం వెళ్లే గ్రామాల వివరాలను ముందుగానే తెలియజేస్తారు. గ్రామ సచివాలయాల్లో ఆరోగ్య కార్యకర్తలు, సబ్ సెంటర్లో ఏఎన్ఎంలు, ఇతర వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలను కూడా 104 వాహన సేవలకు అనుసంధానం చేశారు. వైద్య పరీక్షల సమయంలో వారి సేవలను కూడా ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ప్రజలకు అందే సేవలు ♦ వైద్య సేవలకు దూరంగా ఉన్న గ్రామాల్లోని ప్రజలు ఆస్పత్రికి వెళ్లే పనిలేకుండా రోగుల చెంతకే 104 ద్వారా వైద్య సేవలు అందనున్నాయి. ♦ఈ కొత్త వాహనాల్లో ఆక్సిజన్ సౌకర్యాన్ని కూడా అందుబాటులో తెచ్చారు. ♦వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం విలువైన మందులు రోగులకు పంపిణీ చేస్తారు. ఈ మేరకు 52 రకాల మందులను కూడా 104 వాహనాల్లో సిద్ధం చేశారు. ♦బీపీ, సుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా అవసరమైన చికిత్స అందించనున్నారు. గ్రా మాల్లోని గర్భిణులకు కూడా ప్రతినెల వైద్య పరీక్షలు జరపుతారు. ♦ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు 104 ద్వారా వైద్యులు, సిబ్బంది గ్రామాల్లో అందుబాటులో ఉంటారు. ♦నీటి కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు నీటి శుద్ధికి కూడా చర్యలు తీసుకుంటారు. సత్వర వైద్యం కొయ్యూరు, జీకే వీధి మండలాలు మినహా 104 సేవలను జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి ప్రారంభిస్తున్నాం. మండలాల్లోని ప్రధాన పీహెచ్సీల వద్ద నుంచి గ్రామాలకు వాహనాలను పంపి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను కల్పిస్తాం. వీటి సేవలను సద్వినియోగం చేసుకోవాలి. గ్రామాలను సందర్శించే వివరాలను కూడా ముందుగానే ఆయా వైద్య బృందాల ద్వారా గ్రామాల్లో ప్రచా రం చేస్తాం. – జి.మహేశ్వరరావు, 104 సేవల జిల్లా ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ -
సీఎం జగన్ నిర్ణయంపై 108,104 సిబ్బంది హర్షం
-
పల్లె సంజీవని మళ్లీ రెడీ
విజయనగరం ఫోర్ట్: పల్లె ప్రాంత ప్రజలకు తమ గ్రామాల్లోనే వైద్య సేవలు అందించేలా నాడు మహానేత రూపొందించిన పల్లె సంజీవని మళ్లీ సిద్ధమవుతోంది. ఆస్పత్రులకు వెళ్లలేని రోగులకోసం నేరుగా 104 వాహనా లు ఉదయం 7 గంటలకే గ్రామానికి చేరుకు ని అక్కడి రోగులకు అవసరమైన వైద్య పరీక్షలు చేసి, నెలకు సరిపడా మందులు అందించేవారు.దీనివల్ల రోగులు ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. ఆయన మరణానంతరం ఆ సేవలు సన్నగిల్లాయి. నెలల తరబడి వైద్యంకోసం రోగులు ఎదు రు చూడాల్సిన దుస్థితి దాపురించింది. వారి సమస్యలు తెలుసుకున్న ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మళ్లీ వాటికి పునరుద్ధరించేందుకు చర్యలు చపట్టారు. ఆధునిక హంగులతో వాహనాలు వాహనాల రూపురేఖలు పూర్తిగా మార్చేసి అత్యాధునిక వసతులతో కూడిన 104 మొ బైల్ హెల్త్ సర్వీస్లను అందుబాటులోకి తెస్తున్నారు. మండలానికి ఒకటి చొప్పన 104 వాహనాలను జిల్లాకు 34 కేటాయించా రు. వాహనాల్లో నాణ్యమైన మందులు, నిపు ణులైన వైద్యులు, సిబ్బంది ఉండేలా చర్య లు చేపట్టారు. జూలై ఒకటో తేదీ నుంచి కొ త్త వాహనాలు అందుబాటులోకి వచ్చే అవ కాశం ఉంది. ఈ సౌకర్యం అందుబాటులో ఉన్న రోజుల్లో గ్రామీణ ప్రాంత ప్రజలు బీపీ, మధుమేహం, ఆస్తమా, మూర్చ, దగ్గు, జలుబు, జ్వరం వంటి వాటికి 104 వాహనాలపైనే ఆధారపడేవారు. వారికి నెలకు సరిపడా మందులను 104వాహనాల ద్వారా అందించేవారు. టీడీపీ హయాంలో కనుమరుగు: గత టీడీపీ ప్రభుత్వం 104 వాహనాలను పూర్తిగా మూలకు నెట్టేసింది. మందులను కూడా అంతంత మాత్రంగానే అందించేది. వైఎస్సార్ హయంలో నెలలో 28 రోజులు గ్రామాలకు వెళ్లే వాహనాలు టీడీపీ హయాంలో నామమాత్రంగా వెళ్లేవి. కొన్ని వాహనాలు శిథిలావస్థకు చేరుకున్నా... పట్టించుకోలేదు. మళ్లీ సర్కారు తాజా నిర్ణయంతో సేవలు అందుబాటులోకి రానున్నాయి. గ్రామాల్లోనే వైద్య సేవలు: ఆరోగ్య సమస్యలతో గ్రామీణ ప్రాంత ప్రజలు దూరంగా ఉండే పిహెచ్సీలకు వెళ్లే పనిలేకుండా 104 వాహనంలోనే అవసరమైన వారికి పరీక్షలు చేసి మందులు సైతం అందజేస్తారు. 104 వాహనంలో అందే సేవలు వాహనంలో ల్యాబ్టెక్నీషియన్ ఉంటారు. అక్కడే రక్త పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేస్తారు. దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, మధుమేహం వంటి జబ్బులకు, గర్బిణులకు మందులు అందజేస్తారు. కొత్త వాహనంలో ఆక్సిజన్ సిలిండర్తోపాటు, వైద్యుడు, డేటా ఎంట్రీ ఆపరేటర్ను నియమించనున్నారు. ఎవరు ఏ సమయంలో వచ్చినా అందరికీ మందులు అందజేసేలా చర్యలు చేపడుతున్నారు. 104 వాహనాల్లో వైద్యులు పరీక్ష చేసిన తర్వాత ఏదైనా అనారోగ్యంతో ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి వస్తే 104 వాహనంలో పరీక్షలు చేసిన డాక్టరే మళ్లీ పరీక్షిస్తారు. దీని వల్ల రోగికి ఒకే డాక్టర్తో పూర్తి స్థాయి వైద్యసేవలు అందుతాయి.ఫ్యామిలీ డాక్టర్ విధానంలో 104 వాహనాల వైద్యులు సేవలు అందిస్తారు. రోగి సమాచారా న్ని డిజిటలైజేషన్ చేస్తారు. తర్వాత 104 వాహనంలో ఒకసారి చికిత్స చేయించు కున్న రోగి వివరాలు ఎక్కడైనా తెలుసుకుని ఆ రోగికి ఫాలోఅప్ వైద్యం సులభంగా అందించే అవకాశం ఉంది. పల్లెవాసులకు ఆధునిక వైద్యం గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కొత్తగా 34 వాహనాలను మంజూరు చేసింది. అత్యాధునిక వసతులతో వాహనాలను రూ పొందించారు. కొత్త వాహనాల ద్వారా పల్లె ప్రజలకు అధునాతన వైద్య సేవలు అందనున్నాయి. – బి.సూర్యారావు, 104 జిల్లా మేనేజర్ -
‘సంపద సృష్టికే బడ్జెట్ పెద్దపీట’
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వ వ్యయ కేటాయింపులు సంపద సృష్టించే లక్ష్యంతో చేపట్టినవని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ నిధుల ప్రవాహానికి సంబంధించి బడ్జెట్పై అంచనాలున్నా తాము ఆచితూచి ఆస్తుల సృష్టి కోసమే వెచ్చించాలనే విధానంతో ముందుకెళ్లామని చెప్పారు. ఢిల్లీలో సోమవారం ఫిక్కీ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ ఉత్తేజానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుందని ప్రజలు అంచనాతో ఉండవచ్చని అయితే వనరులు తగినంత ఉంటే ఖర్చు చేసేందుకు తాము సిద్ధమని, గతంలో జరిగిన దుబారా వంటి పొరపాట్లను తాము తిరిగి చేయదలుచుకోలేదని స్పష్టం చేశారు. తాము ప్రస్తుతం సంపద సృష్టించే కోణంలోనే వెచ్చిస్తున్నామని చెప్పుకొచ్చారు. మౌలిక రంగంలో ప్రభుత్వ నిధులు వెచ్చిస్తే బహుళ ప్రయోజనాలు ఉంటాయని స్పష్టం చేశారు. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సమకూరిన నిధులను రెవిన్యూ ఖర్చుల కోసం వెచ్చించమని వాటిని ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే మౌలిక రంగంపై వెచ్చిస్తామని వివరించారు. బడ్జెట్లో రంగాల వారీగా ముందుకు వెళ్లలేదని, అయితే ఆర్థిక వ్యవస్థను బడ్జెట్ స్థూలంగా ఆవిష్కరించిందని చెప్పుకొచ్చారు. చదవండి : బంగారు బాతును చంపేస్తారా? -
ఇది చరిత్రాత్మకమైన బిల్లు
-
శివసేనకు షాకిచ్చిన గవర్నర్..!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ అనూహ్యంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ కేంద్రానికి లేఖ పంపినట్టు ప్రచారం జరగడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రభుత్వ ఏర్పాటు కోసం నిన్న (సోమవారం) శివసేనకు అవకాశమిచ్చిన గవర్నర్.. నేడు (మంగళవారం) ఎన్సీపీని ఆహ్వానించారు. ఎన్సీపీ తన నిర్ణయాన్ని వెల్లడించడానికి రాత్రి 8.30 గంటలవరకు గడువు కూడా ఇచ్చారు. ఆ గడువు ముగియకముందే గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ.. కేంద్రానికి లేఖ పంపారని ప్రసార భారతి వర్గాలు వెల్లడించాయి. ఒకవైపు తాము అడిగిన గడువు ఇవ్వకపోగా.. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు వీలులేకుండా రాష్ట్రపతి పాలన దిశగా గవర్నర్ సాగుతున్నట్టు వస్తున్న వార్తలతో శివసేన, ఎన్సీపీ కంగుతిన్నాయి. ఒకవేళ గవర్నర్ రాష్ట్రపతి పాలన విధిస్తే.. ఆయన నిర్ణయాన్ని సవాలుచేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని శివసేన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై కాంగ్రెస్ నేతలు కపిల్ సిబల్, అహ్మద్ పటేల్తో శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే చర్చలు జరిపారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీకి మూడు రోజుల గడువు ఇచ్చిన గవర్నర్.. తమకు అంత గడువు ఇవ్వడానికి నిరాకరించడంపైనా శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు గవర్నర్ తీరుపై ఎన్సీపీ కూడా గుర్రుగా ఉంది. తమకు ఇచ్చిన గడువు ముగియకముందే రాష్ట్రపతి పాలన అంటూ లీకులు ఇస్తున్నారని మండిపడింది. ఇక, శివసేనకు మద్దతిచ్చే విషయమై ఎన్సీపీ-కాంగ్రెస్ మధ్య జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. ఎన్సీపీ నేతలతో చర్చించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లిఖార్జున్ ఖర్గే, అహ్మద్ పటేల్ ముంబై చేరుకున్నారు. సేనకు మద్దతుపై కాంగ్రెస్-ఎన్సీపీ కలిసి ఉమ్మడిగా నిర్ణయం తీసుకుంటాయని ఖర్గే తెలిపారు. -
సీఎం జగన్ను కలిసిన 108, 104 ఉద్యోగులు
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని గురువారం 108, 104 అంబులెన్స్ ఉద్యోగులు కలిసి తమ సమస్యలు విన్నవించారు. ఉద్యోగ భదత్ర కల్పిస్తానని సీఎం స్పందించడం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘108’ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బల్లి కిరణ్కుమార్ మీడియాతో మాట్లాడుతూ..108లలో పనిచేసే టెక్నిషియన్లకు రూ.30వేలు, పైలెట్లకు రూ.28వేలు జీతాలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. ‘104’లో పనిచేసే ఉద్యోగులకు రూ.28వేలు, డ్రైవర్లకు 26వేలు జీతాలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని ‘104’ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఫణి, సింహాచలం వెల్లడించారు. ‘104’ వైద్యులకు సర్వీస్ వెయిటేజీ ఇచ్చి రాబోయే నియామకాల్లో లబ్ధి చేస్తామని సీఎం తెలిపారన్నారు. -
టీడీపీ రాజకీయ కుట్రలు చేస్తోంది: పుష్ప శ్రీవాణి
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాలుగు నెలల్లోనే లక్షా 26వేల ఉద్యోగాలు భర్తీ చేసి చరిత్ర సృష్టించారని ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. కురుపాం నియోజకవర్గ పరిధి కొమరాడ మండలం గంగరేగువలస, గరుగుబిల్లి మండలం రావివలసలో గ్రామసచివాలయాలను గురువారం ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ గాంధీజీ కలలు గన్న గ్రామస్వరాజ్య స్థాపనకే సచివాలయ వ్యవస్థ ఆవిర్భవించిందని చెప్పారు. సాక్షి, గరుగుబిల్లి(విజయనగరం): రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు ఓ సువర్ణాధ్యాయమని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. జాతిపిత గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సచివాలయాలతోనే సాధ్యమని దీన్ని గుర్తించే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థకు రూపకల్పన చేశారన్నారు. మండలంలోని రావివలస గ్రామంలో సచివాలయాన్ని గురువారం ఆమె ప్రారంభించారు. అనంతరం ఎంపీడీఓ ఎంవీ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు సచివాలయాలు తోడ్పడతాయన్నారు. వైఎస్సార్సీపీ అరకు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగు లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తే తెలుగుదేశం రాజకీయం చేసేందుకు కుట్రలు పన్నిందన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. కార్యక్రమంలో వీటీ సూర్యనారాయణ థాట్రాజ్, పార్టీ మండల కన్వీనర్ ఉరిటి రామారావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.ధర్మారావు, మాజీ సర్పంచ్ ఎం.బలరాంనాయుడు, బాపూజీనాయుడు, గ్రామ ప్రత్యేకాధికారి బి.తిరుపతిరావు, జియ్యమ్మవలస మండల కన్వీనర్ మూడడ్ల గౌరీశంకరరావు, నాయకులు కలిశెట్టి ఇందుమతి, బొబ్బిలి అప్పలనాయుడు, ముదిలి గౌరునాయుడు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు రావివలసలో నెలకొన్న సమస్యలను మాజీ సర్పంచ్ బలరాంనాయుడు మంత్రికి వివరించారు. మొక్కలు పర్యావరణ నేస్తాలు గరుగుబిల్లి: మొక్కలు పర్యావరణ నేస్తాలని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. మండలంలోని రావివలస సచివాలయ ప్రాంగణంలో పలు రకాల మొక్కలను గురువారం నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు అందించాలంటే ఇప్పటి నుంచే ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. మొక్కల పెంపకం ఆవశ్యకతను మరింతగా ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు, మండల కన్వీనర్ ఉరిటి రామారావు తదితరులు ఉన్నారు. -
audio - అర్బన్ హౌసింగ్పై సీఎం జగన్ సమీక్ష
-
సోషల్ మీడియా ఎంట్రీకి హీరో ముహూర్తం ఫిక్స్
-
ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి
సాక్షి, చింతకాని(ఖమ్మం): చినమండవ, తిమ్మినేనిపాలెం మున్నేరు ప్రాంతాల నుంచి జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాకు తక్షణమే అడ్డుకట్ట వేయాలని మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మండల స్థాయి అధికారులతో భట్టి సమీక్ష నిర్వహించారు. చినమండవ, తిమ్మినేనిపాలెం మున్నేరు ప్రాంతాల నుంచి ప్రతిరోజు వందలాది టాక్టర్లతో ఇసుకను అక్రమంగా తరలిస్తుంటే రెవెన్యూ అధికారులు ఎందుకు అరికట్టలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఆర్ఏ నుంచి తహసీల్దార్ వరకు ఎవరి ప్రమేయం లేకుండానే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందా... అని అధికారులను ప్రశ్నించారు. మండలంలో ఇకనుంచి ఇసుక అక్రమ రవాణా జరిగితే జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్కు దృష్టికి తీసుకెళ్లి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాగునీరు కలుషితం మండలంలో మిషన్ భగీరథ పథకం ద్వారా సరఫరా అవుతున్న తాగునీరు కలుషితంగా ఉంటున్నాయని, మిషన్ భగీరథ నీటిని తాగలేకపోతున్నామని మండల ప్రజాప్రతినిధులు భట్టికి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే మిషన్ భగీరథ పథకానికి సంబంధించిన పనుల కోసం గ్రామాల్లోని సీసీ రోడ్లను నాశనం చేస్తున్నారని, ఇష్టారాజ్యంగా సీసీ రోడ్లను తవ్వి వదిలేస్తున్నారని తెలిపారు. మిషన్ భగీరథ పథకం కింద సీసీ రోడ్లను తవ్వితే సంబంధిత కాంట్రాక్టర్తో రోడ్లకు మరమ్మతు పనులు చేయించాలని పీఆర్ ఏఈని ఆదేశించారు. మండలంలో పట్టాదారు పాసుపుస్తకాలు రాని రైతులు చాలామంది ఉన్నారని, పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చిన కొంతమంది రైతులకు సంబంధించిన విస్తీర్ణం పుస్తకాల్లో నమోదు కాలేదని భట్టి విన్నవించారు. రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా పెండింగ్లో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాల సమస్యను వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్ను ఆదేశించారు. కిసాన్ పథకం డబ్బులు జమ కావడం లేదు రైతుబంధు సాయంతో పాటు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం డబ్బులు మండలంలో చాలామంది రైతుల ఖాతాల్లో జమ కావటం లేదని, వ్యవసాయాధికారులను అడిగితే సరైన సమాచారం చెప్పటం లేదని రైతులు భట్టికి ఫిర్యాదు చేశారు. రైతుబంధు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ డబ్బుల్ని రైతుల ఖాతాలకు జమ అయ్యేట్లు వ్యవసాయాధికారులు చర్యలు తీసుకోవాలని భట్టి తెలిపారు. మండలంలో ఉద్యాన అధికారుల జాడే లేదని, విత్తనాలు కూడా సరిపడా రాలేదని తెలిపారు. పాతర్లపాడు రైల్వేకాలనీ ప్రాధమిక పాఠశాల శిథిలావస్థలో ఉందని, నూతన భవనాన్ని నిర్మించాలని పాఠశాల హెచ్ఎం భట్టికి విన్నవించారు. వ్యవసాయ విద్యుత్ లైన్లకు సంబంధించి స్తంభాలను ఏర్పాటు చేయాలని, గాంధీనగర్కాలనీ, జగన్నాథపురం, రాఘవాపురం గ్రామాల్లోని ఇళ్లపై నుంచి వెళ్లిన 33 కేవీ విద్యుత్ లైన్లను మార్చాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. చింతకాని దేవాలయ భూముల సమస్యను భట్టి దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తూ మండల ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని భట్టి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దాసరి సామ్రాజ్యం, జెడ్పీటీసీ సభ్యులు కూరపాటి తిరీషా, ఎంపీడీఓ లలితకుమారి, తహశీల్దార్ కె. సత్యనారాయణ, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
ఉసురు తీసిన వేగం
తూర్పుగోదావరి, గండేపల్లి (జగ్గంపేట): ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన వాహనమే ప్రమాదానికి కారణమై ఓ యువకుడి ప్రాణాలను తీసింది. మరొకరు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఎస్సై బి. తిరుపతిరావు తెలిపిన వివరాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందించే 104 వాహనం గురువారం రామయ్యపాలెం, సింగరంపాలెం గ్రామాల్లో వైద్య సేవలు అందించి సాయంత్రం జగ్గంపేట బయల్దేరింది. తాళ్లూరు గ్రామం వద్ద మోటారు సైకిల్తో రోడ్డుదాటేందుకు వేచిఉన్న ఒబిణ్ని కృష్ణ వేగంగా వస్తున్న 104 వాహనాన్ని గమనించి తన మోటార్ సైకిల్ను విడిచిపెట్టి ఒక్క ఉదుటున పక్కకు తప్పుకున్నాడు. 104 వాహనం కృష్ణ మోటార్ సైకిల్పై నుంచి దూసుకెళ్లి సమీపంలో మోటార్ సైకిల్తో వేచిఉన్న వంకాయల ప్రసాద్ (21)ను ఢీకొంది. అతని తలపై నుంచి వాహనం వెళ్లడంతో తలపగిలి ప్రసాద్ అక్కడిక్కడే మృతి చెందాడు. మోటార్ సైకిల్ను సుమారు 100 మీటర్ల మేర 104 వాహనం ఈడ్చుకుపోయినట్టు స్థానికులు, పోలీసులు తెలిపారు. జెడ్ రాగంపేటకు చెందిన ప్రసాద్ కుటుంబ సభ్యులు కొంతకాలంగా నీలాద్రిరావుపేట కొత్త కాలనీలో నివాసం ఉంటున్నారు. ప్రసాద్ జగ్గంపేటలో మల్లేపల్లికి చెందిన సత్యనారాయణ వస్త్రదుకాణంలో పనిచేస్తున్నాడు. తన యజమాని బాకీల వసూళ్ల కోసం తాళ్లూరు వచ్చిన ప్రసాద్ ఈ ప్రమాదానికి గురయ్యాడు. సంఘటన స్థలానికి చేరుకున్న మృతుడి తల్లిదండ్రులు సత్యవతి, అప్పారావు, అన్నయ్య స్వామి, అక్క లోవ, బంధువుల రోదనలతో ఆప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 104 వాహనం డ్రైవర్ పలివెల చిట్టిబాబు అజాగ్రత్తవల్ల ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. వాహనం వస్తున్న తీరును గమనించి భీతిల్లి మోటార్ సైకిల్ను విడిచిపెట్టి తప్పుకోవడంతో ప్రాణాలతో బతికిఉన్నానని ఒబిణ్ని కృష్ణ పేర్కొన్నాడు. ప్రమాదస్థలం వద్దకు చేరుకున్న పోలీసులు ప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం తరలించారు. ప్రమాదానికి కారకుడైన 104 వాహనం డ్రైవర్ పలివెల చిట్టిబాబును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై వరహాలరాజు, హెచ్సీ ప్రసాద్ తెలిపారు. -
ఇక ‘104’ కష్టాలు తీరినట్లే..!
కడప రూరల్: టీడీపీ పాలనలో గాడి తప్పిన 104 సంచార చికిత్స వైద్య విధానంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లా వ్యాప్తంగా 22 సంచార చికిత్స వాహనాలు ఉన్నాయి. వీటికి కండీషన్ జబ్బు పట్టుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వాటిని బాగు చేసి గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలను అందించే దిశగా అడుగులు వేశారు. సంచార వైద్యం ఇలా.. జిల్లా వ్యాప్తంగా 22 సంచార వాహనాలు ఉన్నాయి. ఇందులో ప్రతి వాహనానికి వైద్యుడు, నర్స్, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, డ్రైవర్తో ఐదు మంది సిబ్బంది ఉంటారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సూచనల (రోడ్ మ్యాప్) ప్రకారం ఈ వాహనాలు నిర్ధేశించిన గ్రామాలకు వెళ్లాల్సి ఉంది. ఉదాహరణకు ఒక నెలలో మొదటి వారంలో ఒక గ్రామానికి వెళితే, మరుసటి నెలలో అదే రోజు అదే గ్రామానికి ఈ సంచార వాహనం వెళ్లాలి. ఆ మేరకు వైద్యం కోసం ఒక వాహనం వద్దకు రోజుకు దాదాపు 100 మంది రోగులు (ఔట్ పేషెంట్స్) వస్తారు. ఇక్కడికి వచ్చే గ్రామీణులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (పీహెచ్సీ) ఎలాంటి వైద్య సేవలు లభిస్తాయో.. దాదాపు అన్నీ ఈ 104 సంచార వాహనం ద్వారా లభించాల్సి ఉంది. గతంలో అన్నింటికీ కొరతే.. దాదాపుగా నిర్ధేశించిన గ్రామానికి ఒక వాహనం నెలకు ఒక సారి వెళితే.. అక్కడికి వచ్చే రోగులకు నెలకు సరిపడా మందులను ఇవ్వాలి. అయితే ప్రతి నెలా ఏదొక మందు కొరత ఉండేది. ప్రధాన గ్రామీణ ప్రాంతాల వారికి జ్వరాలు, ఒళ్లు నొప్పులు, బీపీ, ఘగర్ వ్యాధులతో బాధపడుతుంటారు. అంతేకాక కూలి పనులకు వెళతారు కాబట్టి గాయాలవుతుంటాయి. వీరికి 104 వైద్య సేవలు అందాలి. మందులు, పరికారాల కొరత వేధిస్తోంది. దీంతో 104 సిబ్బంది చేసేది లేక ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న మందులను ఇ స్తూ కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో గ్రామీణులకు పూర్తిస్థాయిలో చికిత్స అందక పట్టణం బాట పడుతున్నారు. ఈ వాహనంలో రక్త, మల, మూత్ర ప రీక్షలతో పాటు కాస్త పెద్ద వ్యాధులను కూడా నిర్ధారించాలి. అయితే చాలా వాహనాల్లో పరికరాల కొరతతో అది వీలుకావడంలేదు. పలు వాహనాల్లో ఈసీజీ పరికరాలు పని చేయడంలేదు. ఎఫ్సీ, ఇన్సూరెన్స్కు నోచని వైనం.. ప్రతి వాహనానికైనా ఎఫ్సీ (ఫిట్నెస్ సర్టిఫికెట్), ఇన్సూరెన్స్ సౌకర్యం తప్పని సరిగా ఉండాలి. అయితే 104 వాహనాల్లో చాలా వాటికి ఆ సౌర్యం లేకపోవడం గమనార్హం. దాదాపుగా 2008 నుంచి ఉన్న వాహనాలనే నడుపుతున్నారు. అలాగే మొత్తం 22 వాహనాలకు గానూ సగం వాటికి టైర్లు అరిగిపోయాయి. అయినా అలాగే నడిపేస్తున్నారు. దీంతో పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సిబ్బంది వాపోతున్నారు. ఇలాంటి సమస్యలతో 104 వాహనం సకాలంలో గ్రామాలకు వెళ్లలేని పరిస్ధితి. సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి.. గ్రామీణుల చెంతకే వెళ్లి వైద్య సేవలు అందించే 104 సంచార వాహన వ్యవస్థపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అన్ని వాహనాలు కండీషన్లో ఉండాలని.. మందులకు కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. దీంతో మరో కొద్ది నెలల్లోనే 104 సంచార చికిత్స విధానం గాడిలో పడనుందని వైద్య శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. 2008 నుంచి 104 వైద్య సేవలు.. గ్రామీణుల చెంతకే వైద్య సేవలు వెళ్లాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి సంకల్పించారు. ఆ మేరకు 2008 ఆగష్టులో 104 సంచార వైద్య సేవలను ఆయన ప్రారంభించారు. నాటి నుంచి గ్రామీణుల చెంతకే వైద్య సేవలు వెళ్లేవి. అనంతరం అధికారంలోకి చంద్రబాబు ఆ బాధ్యతలను 2016లో పెరమిల్ స్వాశ్య మేనేజ్మెంట్ రీసెర్స్ ఇన్స్టిట్యూట్ (పీఎస్ఎంఆర్ఐ)కు అప్పగించారు. దీనికి చంద్రన్న 104 సంచార చికిత్సగా నామకరణం చేశారు. అయినప్పటికీ గ్రామీణులకు సక్రమంగా వైద్యం అందకుండా పోయింది. -
చంద్రన్న బండి..ముందుకెళ్లదండి..
ఇది జమ్మలమడుగుకు చెందిన చంద్రన్న 104సంచార చికిత్స వాహనం. మూడు రోజుల క్రితంమోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్(ఎంవీఐ) తనిఖీచేశారు. వాహనానికి సంబంధించి ఎఫ్సీ (ఫిట్నెస్సర్టిఫికెట్), ఇన్సూరెన్స్ లేక పోవడంతో రూ.2000అపరాధ రుసుం చెల్లించాలని ఆదేశించారు.అది చెల్లించాకే లైసెన్స్ ఇస్తామని డ్రైవరు నుంచిలైసెన్సును ఎంవీఐ తీసుకెళ్లారు. ఇదీ జిల్లాలోని‘చంద్రన్న 104 సంచార చికిత్స’ వాహనాలపరిస్థితి. చాలా వాహనాలది ఇదే పరిస్థితి.పదేళ్లవడంతో సామర్థ్యం కోల్పోయాయి.రోడ్డెక్కితే మొరాయిస్తున్నాయి. మందులకు కొరతనెలనెలా వెంటాడుతోంది. దీంతో గ్రామీణ వైద్యం‘104’ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కడప రూరల్: గ్రామీణ ప్రాంత వాసులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ‘ 104 సంచార చికిత్స’ పదేళ్ల క్రితం ప్రారంభమైంది. ఓ వైద్యుడు, నర్స్, ఫార్మాసిస్ట్, ,ల్యాబ్ టెక్నీషియన్, డ్రైవర్తో కలిపి ఐదుగురు సిబ్బంది వాహనంలో ఉండేలా నిబంధనలను రూపొందించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సూచనల ప్రకారం ఈ వాహనం ఈ వాహనాలు గ్రామాలకు వెళ్లి వైద్య సేవలందించాలి. నెల మొదటి వారంలో ఒక గ్రామానికి వెళితే, మరుసటి నెల ఆదే రోజు మళ్లీ ఆ గ్రామానికి సంచార వాహనం వెలుతుంది. రోజుకు దాదాపు 100 మంది రోగులు (ఔట్ పేషెంట్స్) వస్తుంటారు. ఇక్కడికి వచ్చే గ్రామీణులకు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో (పీహెచ్సీ)లో ఎలాంటి వైద్య సేవలు లభిస్తాయో..దాదాపు అన్ని వైద్య సదుపాయలు సంచారవాహనం ద్వారా అందించాలి. మందులకు కొరత...పనిచేయని పరికరాలు..! గ్రామీణ ప్రాంతాలలో వివిధ రకాల జ్వరాలు, నొప్పులు, బీపీ, ఘగర్ వ్యాధులతో రోగులు వాహనాల వద్దకు వస్తుంటారు. వివిధ సంఘటనల్లో గాయపడిన వారూ వస్తుంటారు. వాహనం వద్దకు వచ్చేసరికి వీరికి నిరాశ ఎదురవుతోంది. ప్రతి నెలా ఏదో ఒక మందుకు కొరత ఏర్పడుతోంది. సాధారణ జ్వరానికి వాడే ‘పేరాసెట్మాల్’తో పాటు ఒళ్లు నొప్పులకు మరికొన్ని రోగాలకు మందులూ లేవంటున్నారు. మందుల్లేవని చెప్పడానికి సిబ్బందిఇబ్బందులు పడుతున్నారు. ఉన్న మందులను ఇచ్చి పంపుతున్నారు. దీంతో రోగులు నమ్మకం కోల్పోయి పట్టణాలకు వెళుతున్నారు. వాహనంలోని ల్యాబ్ ఉన్నా వైద్య పరీక్షల పరికరాలకు కొరత ఏర్పడినట్లు తెలిసింది. ఫలితంగా వైద్య పరీక్షలు చేయలేకపోతున్నట్లు భోగట్టా. ఎఫ్సీ, ఇన్సూరెన్స్ లేకుండానే... వాహనాలకు ఎఫ్సీ (ఫిట్నెస్ సర్టిఫికెట్), ఇన్సూరెన్స్ సౌకర్యం తప్పనిసరి. ఎక్కువ 104 వాహనాలకు ఈ పత్రాలు లేవు. దీంతో మోటార్ వెహికల్ ఇన్స్పెక్లర్ల నుంచి సమస్య ఎదురవుతోంది. ఇన్సూరెన్స్ సౌకర్యం లేనందున ఏౖదైనా ప్రమాదం జరిగితే అందుకు ఎవరు బాధ్యులనే అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 2008 నుంచి ఈ వాహనాలను దాదాపుగా నడుపుతున్నారు. 22 వాహనాలకు గాను 13 బండ్లకు పైగా వాహనాలకు టైర్లు అరిగిపోయాయి. అయినా అలాగే నడిపేస్తున్నారు.. కొన్ని బండ్లు మధ్యలోనే మొరాయిస్తున్నాయి. ‘104’ నిర్వహణ బాధ్యతలను ‘పెరామిల్’ సంస్ధ నిర్వహించేది. కాలపరిమితి ముగయడంతో వైద్య ఆరోగ్య శాఖ ప్రన్సిపల్ సెక్రటరీ రెండు నెలల కిత్రం బాధ్యతలను ఆయా జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖలకు అప్పగించారు. ఈ నెలాఖరుకు ‘104’వ్యవస్ధ మరో కొత్త సంస్ధ పరిధిలోకి వెళ్లనుంది. వాస్తవానికి ప్రభుత్వమే నిర్వహిస్తే నెలకు సగం ఖర్చు తగ్గగుతుంది. నెలకు వాహనానికి రూ1.25 లక్షలవుతుంది. ఇతర సంస్ధలకు అప్పగించడం వలన ప్రభుత్వం వాహనానికి రూ.2.50 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. ఇదంతా పాలకుల మాయాజాలమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2008 నుంచి ‘104’ సేవలు... గ్రామీణుల చెంతకే మెరుగైన వైద్య సేవలు తీసుకువెళ్లాలని 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి సంకల్పించారు. అదే ఏడాది ఆగస్టులో 104 సంచార చికిత్సను ప్రారంభించారు. నాటి నుంచి గ్రామీణులు పట్టణాలకు రాకుండానే ఇంటి ముంగిటనే వైద్యం పొందుతున్నారు. 2016లో టీడీపీ ప్రభుత్వం వాహన బాధ్యతలను పెరమిల్ స్వాశ్య మేనేజ్మెంట్ రీసెర్స్ ఇన్స్టిట్యూట్ (పీఎస్ఎంఆర్ఐ)కు అప్పగించింది. పథకం పేరును ‘చంద్రన్న 104 సంచార చికిత్స’గా మార్చేసింది. పథకం మారిన తర్వాత లక్ష్యం తీరు కూడా మారిపోయిందనే విమర్శలున్నాయి. పథకం నిర్వహణను సరిగ్గా పట్టించుకోవడంలేదు. -
జమ్మలమడుగు బహిరంగ సభలో వైఎస్ జగన్
-
అంబానీ వియ్యంకుడంటే అంతేమరి!
సాక్షి, అమరావతి: పేదల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చి, కమీషన్లు దండుకునే పనిలో ప్రభుత్వ పెద్దలు మునిగి తేలుతున్నారు. రాష్ట్రంలో ‘104’ వాహనాల (చంద్రన్న సంచార చికిత్స) నిర్వహణను పిరమాల్ స్వాస్థ్య అనే బడా కార్పొరేట్ సంస్థ దక్కించుకుంది. రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ వియ్యంకుడికి చెందినదే ఈ పిరమాల్ సంస్థ. అంబానీకి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు మధ్య సంబంధాల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ‘104’ వాహనాల నిర్వహణ టెండర్ను 2016లో వక్రమార్గంలో పిరమాల్ సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వ ఖజానా నుంచి కోట్లాది రూపాయల బిల్లులు తీసుకుంది. ‘104 ’వాహనాలు ప్రభుత్వానివే, మందులు కూడా ప్రభుత్వమే ఇస్తుంది. వాహనాలకు డీజిల్, సిబ్బందికి వేతనాలకు గాను ఓక్కో వాహనానికి ప్రభుత్వం నెలకు రూ.2.44 లక్షలు చెల్లిస్తోంది. నిర్వహణ పేరిట ఈ సొమ్మంతా పిరమాల్ ఖాతాలోకే చేరుతోంది. కానీ, ఆ సంస్థ ఒక్కో వాహనం నిర్వహణకు నెలకు రూ.లక్ష కూడా ఖర్చు చేయడం లేదు. అంటే ఒక్కో వాహనం పేరిట అక్షరాలా రూ.1.44 లక్షలు జేబులో వేసుకుంటోంది. హైకోర్టు ఆదేశాలు బేఖాతర్ ఒక్కో వాహనానికి నెలకు రూ.2.44 లక్షల చొప్పున మూడేళ్లలో పిరమాల్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.244 కోట్లు చెల్లించింది. 2019 మార్చి 31వ తేదీతో కాంట్రాక్టు కాలపరిమితి ముగియనుంది. ఈ సంస్థ పేదలకు సక్రమంగా మందులు ఇవ్వకున్నా, ప్రభుత్వం నుంచి నిధులు తీసుకుందని ఆరోపిస్తూ పలువురు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఎలాగూ గడువు ముగుస్తోంది కాబట్టి ఈలోగా టెండర్ ప్రక్రియ పూర్తిచేసి, ఏప్రిల్ 1వ తేదీ నుంచి మరో సంస్థకు వాహనాల నిర్వహణ కాంట్రాక్టు ఇవ్వాలని హైకోర్టు 2018 అక్టోబర్లో స్పష్టం చేసింది. కానీ, ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. టెండర్ ప్రక్రియను ప్రారంభించలేదు. ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేసింది. ఇప్పుడు ఎన్నికల కోడ్ సాకుతో మళ్లీ పిరమాల్ సంస్థకే ‘104’ వాహనాల నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. దీని వెనుక ఉన్న లోగుట్టు ఏమిటో సులభంగా అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ‘104’ అంబులెన్స్ల దుస్థితి ఇదీ... + రాష్ట్రంలో మెజారిటీ వాహనాలకు ఫిట్నెస్ లేదు. + ఇన్వర్టర్, బ్యాటరీలు లేవు. టైర్లు అరిగిపోయినా మార్చడం లేదు. + నెలలో 15,432 గ్రామాలకు వాహనాలు వెళ్లి మందులు ఇవ్వాలి. ఇందులో సగం గ్రామాలకు కూడా వాహనాలు వెళ్లడం లేదు. + కొన్ని వాహనాలు మరమ్మతులకు గురై షెడ్డుకే పరిమితం అయ్యాయి. కానీ, అవి గ్రామాల్లో తిరుగుతున్నట్టు చూపించి నెలకు రూ.2.44 లక్షల చొప్పున తీసుకుంటున్నారు. + 2018 ఆగస్ట్ నుంచి సిబ్బందికి ట్రావెలింగ్ అలవెన్సు, డిసెంబరు నుంచి డెయిలీ అలవెన్సు చెల్లించడం లేదు. + వాహనాలు మరమ్మతులకు గురైతే పట్టించుకోవడం లేదు. + వాహనంలో 60 రకాల మందులు ఉండాలి. కానీ, 27 రకాల మందులు కూడా ఉండడం లేదు. + గర్భిణులకు, మధుమేహ రోగులకు, మూర్ఛ సంబంధిత జబ్బులకు వాహనాల్లో మందులు లేవు. + ప్రతి వాహనానికి ఒక డాక్టరు ఉండాలి. కానీ, 60 శాతం వాహనాల్లో డాక్టర్లు లేరు. -
చావు ఇంట బేరసారాలకు దిగిన అధికారులు
-
104 ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలిపిన వైఎస్సార్సీపీ
-
8వ రోజు 104ఉద్యోగుల దీక్ష
-
104 ఉద్యోగులపై వేటుకు సర్కార్ సిద్ధం!
సాక్షి, అమరావతి : 104 సంచార వైద్య శాలలు (చంద్రన్న సంచార చికిత్స) పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోవడంతో ఈ నెల 22 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 104లో పనిచేస్తున్న 1642 మంది సమ్మెకు దిగారు. సమస్యలు పరిష్కరిస్తానని సీఎం చంద్రబాబు మాట ఇచ్చి మోసం చేశారని, విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు దిగినట్టు సిబ్బంది ప్రకటించారు. ఈ నేపథ్యంలో వారిపై వేటు వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 25న వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా మధ్య సుదీర్ఘ చర్చలు జరిగినట్టు సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 104 వాహనాల నిర్వహణను పిరమిల్ స్వాస్థ్య సంస్థ చూస్తోంది. ఈ సంస్థకు మూడేళ్ల వ్యవధికి నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. వచ్చే మార్చితో ఈ వ్యవధి ముగుస్తుంది. అప్పుడు తిరిగి టెండర్లు నిర్వహించి నిర్వహణ సంస్థతో పాటే సిబ్బందినీ మార్చాలని నిర్ణయించినట్టు సమాచారం. ఉద్యోగులంతా 2008లో నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 104 పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి పనిచేస్తున్నవారే. గత నాలుగున్నరేళ్లుగా 104 సిబ్బందికి వేతనాలు పెంచకపోవడం, ప్రశ్నించినవారిని బదిలీ చేయడం, తొలగించడం చేస్తున్నారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ గత కొంతకాలంగా సిబ్బంది పోరాడుతూనే ఉన్నారు. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో సిబ్బంది సమ్మె చేస్తున్నారు. మందులు అందక రోగుల ఇబ్బందులు ఈ నెల 22 నుంచి సిబ్బంది సమ్మెలోకి వెళ్లడంతో 292 వాహనాలు గ్రామాలకు వెళ్లడం లేదు. దీంతో లక్షలాది మంది వృద్ధులు, గర్భిణులు, బాలింతలు మందులు అందక ఇబ్బందులు పడుతున్నారు. వీరేకాకుండా మధుమేహం, మూర్చ, రక్తపోటు, హైపర్టెన్షన్ వంటి వ్యాధులతో బాధపడుతున్న మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మందులు అందడం లేదు. దీంతో వారంతా అల్లాడుతున్నారు. కార్పొరేట్ సంస్థకు ఏడాదికి రూ.85.44 కోట్లు ప్రభుత్వం 104 సిబ్బందికి వేతనాలు సరిగా ఇవ్వకపోయినా, రోగులకు మందులివ్వకపోయినా తూతూమంత్రంగా వాహనాలను తిప్పుతున్న పిరమిల్ స్వాస్థ్య సంస్థకు మాత్రం ఏడాదికి రూ.85.44 కోట్లు చెల్లిస్తోంది. ఒక్కో వాహనానికి నెలకు రూ.2.44 లక్షలు ఇస్తోంది. అంటే నెలకు రూ.7.12 కోట్లకు పైగా చెల్లిస్తోంది. మూడేళ్ల కాంట్రాక్టులో భాగంగా నిర్వహణ సంస్థకు ప్రభుత్వం చెల్లించింది అక్షరాలా రూ.256.32 కోట్లు. నాలుగున్నరేళ్లుగా ఉద్యోగులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించకుండా నిర్వహణ సంస్థకు మాత్రం భారీగా లబ్ధి చేకూర్చింది. చివరకు ఉద్యోగులకు ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించకుండా సంస్థ నిర్లక్ష్యం వహించినా సర్కారు పట్టించుకోకపోవడం వల్లే పోరాటాలకు దిగాల్సి వచ్చిందని సిబ్బంది చెబుతున్నారు. స్వయానా ముఖ్యమంత్రే వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి అమలు చేయకుండా మోసం చేశారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 104లో సిబ్బంది వివరాలు ఇలా.. కేడర్ ఉద్యోగుల సంఖ్య నర్సు/ఏఎన్ఎంలు 321 ఫార్మసిస్టులు 321 ల్యాబ్ టెక్నీషియన్లు 320 డ్రైవర్లు 326 వాచ్మెన్లు 165 డాక్టర్లు 189 -
104 ఉద్యోగుల పై వేటుకు సర్కార్ సిద్దం
-
ఏపీ గ్రామీణ వైద్యానికి చంద్రగ్రహణం
-
ఫైనల్కు ‘సై’నా
జకార్తా: భారత సీనియర్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఈ సీజన్లో తొలి టైటిల్కు చేరువైంది. ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో ఆమె ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఎనిమిదో సీడ్ సైనా 18–21, 21–12, 21–18తో ఆరో సీడ్ హి బింగ్జియావో (చైనా)పై విజయం సాధించింది. నేడు జరిగే టైటిల్ పోరులో 28 ఏళ్ల భారత వెటరన్... ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో తలపడనుంది. మరో సెమీస్లో మారిన్ 17–21, 21–11, 23–21తో చెన్ యుఫె (చైనా)పై నెగ్గింది. నేటి ఫైనల్స్ ఉదయం గం. 11.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం -
సీఎం మాటిచ్చి మోసం చేశారు
సాక్షి, అమరావతి: మాట ఇచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా 104 (చంద్రన్న సంచార చికిత్స) సిబ్బంది ధర్మపోరాట దీక్షలకు దిగారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని రాష్ట్ర సర్కారు ఇచ్చిన జీవో నెం.151 అమలు కావడం లేదని గత కొంతకాలంగా సిబ్బంది పోరాటం చేస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందించి 2018 మే 1 నుంచి జీవో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ ఇప్పటి వరకూ అమలు కాలేదు. దీంతో ముఖ్యమంత్రి హామీ ఇచ్చి మోసం చేశారని, 104లో పనిచేస్తున్న 1,642 మంది సిబ్బంది అరకొర వేతనాలతో అలమటిస్తున్నా సర్కారుకు చీమకుట్టినట్టయినా లేదని ధర్మపోరాట దీక్షకు దిగారు. ప్రతి జిల్లాలో కలెక్టరేట్లు, జిల్లా వైద్యాధికారి కార్యాలయాల ఎదుట సిబ్బంది దీక్షలకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 292.. 104 వాహనాలను నిలిపివేశారు. 104 వాహనాల నిర్వహణ చేపట్టిన పిరమిల్ స్వాస్థ్య సంస్థ ఉద్యోగులను వేధిస్తోందని, ఈఎస్ఐ, పీఎఫ్లు కూడా కట్టడం లేదని సర్కారుకు పలు సార్లు విన్నవించినా ప్రభుత్వం నిర్వహణా సంస్థకే వత్తాసు పలుకుతుండటం దారుణమని ఉద్యోగులు విలపిస్తున్నారు. తాము నిరవధిక సమ్మెలో ఉన్నా పథకం కొనసాగుతోందని ప్రభుత్వం చెబుతున్న మాటలు అవాస్తవమని, ఎక్కడా వాహనాలు పల్లెలకు వెళ్లడం లేదని, ప్రతి పల్లెలోనూ బాధితులు మందులు అందక తల్లడిల్లుతున్నారని, దీనికి పూర్తి బాధ్యత సర్కారుదేనని చెబుతున్నారు. ఏ వాహనంలోనూ మందులు లేవని, ఈ విషయాన్ని ప్రభుత్వం, నిర్వహణా సంస్థ బయటికి పొక్కకుండా మభ్యపెడుతున్నాయని, దీనిపై సిబ్బంది ప్రశ్నిస్తే అక్రమంగా బదిలీలు చేస్తున్నారని వాపోతున్నారు. -
మధ్యంతర భృతి ఇవ్వాలి
సాక్షి, అమరావతి: పదకొండో వేతన సవరణ కమిషన్ నివేదిక ఇంకా రానందున ప్రస్తుతానికి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కోరారు. ఎలక్షన్ కోడ్ వచ్చేలోపు ఐఆర్ ప్రకటించి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన విధానం తరహాలోనే రాష్ట్రంలోనూ సీపీఎస్ రద్దు చేయాలన్నారు. ప్రభుత్వ సంస్థలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేసే వారికి సైతం పీఆర్సీ అమలు చేయాలని కోరారు. అలాగే కాంట్రాక్టు ఉద్యోగులను దశలవారీగా క్రమబద్ధీకరిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. దీనిపై సీఎం స్పందిస్తూ మధ్యంతర భృతిపై రాష్ట్ర కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సానుకూలంగా లేకపోవడంతో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఆటంకంగా ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. -
చేతికి సంకెళ్లు ధరించి.. ధర్నా!
సాక్షి, విశాఖపట్నం: నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద 104 ఉద్యోగులు గురువారం ధర్నా చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలంటూ చేతికి సంకెళ్ళు ధరించి ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం 104 ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు సర్కార్ తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. నెల్లూరు జిల్లాలోనూ.. నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట 104 ఉద్యోగులు ధర్మపోరాట దీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ జిల్లాలోనూ.. వైఎస్సార్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో 104 కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళన చేపట్టారు. తమకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల పరిష్కరించడంతోపాటు 151 జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. వీరి ఆందోళనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిత్యానందరెడ్డి, షఫీ, ఖాజా రహమతుల్లా తదితరులు మద్దతు తెలిపారు. -
రామా.. బాబుకు మంచి బుద్ధిని ప్రసాదించు
కడప రూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మంచి బుద్ధిని ప్రసాదించాలని, తమ సమస్యలను పరిష్కరించాలని చంద్రన్న 104 సంచార వైద్య సిబ్బంది కోరారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజక వర్గాల కేంద్రాల్లో ఎన్టీఆర్ విగ్రçహా లకు వినతి పత్రం సమర్పించారు. జీఓ 151– ని అమలు చేయాలని, తమను ప్రభుత్వ రంగ సంస్ధ ఉద్యోగులుగా పరిగణించాలని కోరుతూ వీరు చేపట్టిన సమ్మె బుధవారానికి రెండో రోజుకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం 104 ఉద్యోగులు చేపడుతున్న సమ్మెను నిర్వీర్యం చేయడానికి ఉక్కుపాదం మోపుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో అద్దెకు వాహనాలు, డ్రైవర్లను తీసుకొచ్చి పల్లెలకు పంపిస్తున్నారు. ఉదాహరణకు సిద్దవటంలో ఒక డ్రైవర్ను తీసుకువచ్చి 104 వాహనాన్ని తీసుకెళ్లడానికి ప్రయత్నించగా ఆ విభాగం ఉద్యోగులు అడ్డగించారు. డ్రైవర్ను లైసెన్స్ను చూపించమని అడిగారు. అతని వద్ద లైసెన్స్ లేకపోవడంతో ఎందుకు ఇలా చేస్తున్నారని నిర్వాహకులను సిబ్బంది ప్రశ్నించారు. దీంతో అద్దెకు ఒక వాహనాన్ని, డ్రైవర్ను తీసుకొని వెళ్లారు. జిల్లాలో ప్రలు ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. తమ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ‘104’అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు భాస్కర్, కార్యదర్శి ఆనంద్ వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఉమా సుందరిని కోరారు. ఈమేరకు వినతి పత్రం సమరించారు. -
కొనసాగుతున్న 104 ఉద్యోగుల సమ్మె
-
వేతనాలు పెంచుతామని చంద్రబాబు మాట తప్పారు
-
104 కష్టాలు
సాక్షి కడప/కడప రూరల్ : చంద్రన్న 104 సంచార చికిత్సకు సంబంధించిన ఉద్యోగులకు కష్టమొచ్చింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాం నుంచి పనిచేస్తున్నా వారిని ఇంతవరకు ప్రభుత్వం గుర్తించ లేదు. 104 వాహనాలను అనేక రకాల సమస్యలు వెంటాడుతున్నా.. ప్రజలకు మాత్రం ఇబ్బందులు రాకుండా చూసుకున్న సిబ్బందికి ఇబ్బంది వచ్చింది. కడుపు కాలిన వారు సమ్మెబాట పట్టడంతో వైద్య విధానం గాడితప్పింది. సమ్మెను నిర్వీ ర్యం చేసేందుకు ఏకంగా పోలీసుల సహకారంతో.. అద్దె డ్రైవర్లను నియమించి వాహనాలను నడపేందుకు యత్నించడంపై పలువురు సంచార వైద్య సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 22 సంచార చికిత్స వాహనాలు ఉండగా.. అందులో పనిచేస్తున్న దాదాపు 134 మంది ఉద్యోగులకు ‘ఉద్యోగ భద్రత’ కొరవడింది. దీంతో వారు ఆందోళన బాట పట్టారు. వెరసి గ్రామీణ వైద్యానికి గ్రహణం పట్టుకుంది. 2008 నుంచి పనిచేస్తున్నా..ఆదుకోని ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న సంకల్పంతో 2008 ఆగస్టులో దివంగత సీఎం వైఎస్సార్ 104 పేరుతో సంచార వాహనాలను ప్రారంభించారు. నెలలో ఒక రోజు పల్లెలకు వెళుతూ.. వైద్య సేవలను అందిస్తూ ప్రజా మన్ననలు అందుకున్నారు. అయితే వైఎస్ మరణానంతర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో 104 సిబ్బంది వేదన వర్ణణాతీతంగా మారింది. జిల్లాలో 22 సంచార వాహనాలు ఉన్నాయి. ఒక వాహనానికి ఒకరి చొప్పున వైద్యుడు, నర్స్, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, డ్రైవర్ మొత్తం ఐదుగురు సిబ్బంది ఉంటారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సూచనల (రోడ్ మ్యాప్) ప్రకారం ఈ వాహనాలు నిర్దేశించిన గ్రామాలకు వెళతాయి. ఆ మేరకు వైద్యం కోసం ఒక వాహనం వద్దకు ఒక రోజుకు 100–150 మంది రోగులు (ఔట్ పేషెంట్స్) వస్తారు. ఇక్కడికి వచ్చే గ్రామీణులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (పీహెచ్సీ)లో ఎలాంటి వైద్య సేవలు లభిస్తాయో..దాదాపు అన్ని వైద్య సదుపాయాలు ఈ సంచార వాహనం ద్వారా లభించాలి. దీంతో గ్రామీణులు పట్టణాలకు రాకుండానే తమ ఇంటి ముంగిటనే వైద్యం పొందుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టాక 104 నిర్వహణ బాధ్యతలను 2016లో పెరమిల్ స్వాశ్య మేనేజ్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (పీఎస్ఎంఆర్ఐ) కు అప్పగించడంతో పాటు చంద్రన్న 104 సంచార చికిత్సగా నామకరణం చేశారు. సమ్మెలోకి సంచార వైద్య సిబ్బంది జిల్లాలో పనిచేస్తున్న సంచార వైద్య సిబ్బంది మంగళవారం నుంచి వాహనాలు నిలిపివేసి ఆందోళనబాట పట్టారు. మైదుకూరులో చంద్రన్న సంచార 104 వైద్య సేవ కో ఆర్డినేటర్ రామచంద్రయ్యను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. డిమాండ్లు నెరవేర్చకపోవడంతో సమ్మెలోకి వెళ్లామని.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించేలా కృషి చేయాలని కోరారు. సిబ్బంది సమ్మెలోకి వెళ్లడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. పోలీసుల ద్వారా.. అద్దె డ్రైవర్లతో... సంచార వైద్య సేవ సిబ్బంది సమ్మెకు దిగడంతో ఈ సమ్మెను ఎలాగైనా నిర్వీర్యం చేయాలన్న ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. ఇందులో భాగంగా పోలీసుల ద్వారా 104 సంచార వైద్య వాహనాలకు అద్దె డ్రైవర్లను నియమించి కొన్నిచోట్లకు పంపినట్లు తెలియవచ్చింది. ఈ వ్యవహారంపై సమ్మె చేస్తున్న సిబ్బందితోపాటు నాయకులు మండిపడుతున్నారు. చంద్రన్న సంచార 104 సిబ్బంది డిమాండ్స్ ♦ చంద్రన్న సంచార 104 వాహనాలను ప్రభుత్వమే నడపాలి. ♦ 2016 మే 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా జీఓ 151 ప్రకారం వేతనాలను చెల్లించాలి. ♦ ప్రస్తుతం పెరిగిన నిత్యావసరాలకు అనుగుణంగా డైలీ ఫుడ్ అలవెన్స్ను రూ. 150కు పెంచాలి. ♦ ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగులు సౌకర్యాలను కల్పించాలి ♦ 104లో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసులను రెగ్యులర్ చేయాలి. యాక్ట్ 2–94 ను తొలగించాలి. ♦ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. ♦ హెచ్ఎంవీ నిబంధనల ప్రకారం ని యామకాలు చేపట్టిన డ్రైవర్లకు ఆ నిబం« దనల ప్రకారమే వేతనాలు చెల్లించాలి. ♦ 11వ పీఆర్సీని ప్రారంభ తేదీ నుంచి వర్తింప చేయాలి. ♦ వాహనాలలో మెరుగైన సేవల కోసం డేటాఎంట్రీ ఆపరేటర్ను నియమించాలి. ♦ ఔషధి, వీహెచ్ఎస్డీ డేటా చేస్తున్న ఫార్మసిస్ట్, నర్స్లకు పీహెచ్సీలలో మాదిరిగా అదనపు పారితోషికం చెల్లించాలి. ♦ వాహనాలకు ఆర్సీ, ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్, ఫిట్నెస్ కల్పించాలి. మరమ్మతులను పూర్తి స్థాయిలో చేయించాలి. ♦ ప్రజలకు మరింతగా మెరుగైన సేవలను అందించడానికి చర్యలు చేపట్టాలి. -
విశాఖలో సమ్మెబాట పట్టిన 104 ఉద్యోగులు
-
నేటినుంచి 104 వాహనాలకు బ్రేకులు!
సాక్షి, అమరావతి: ఏపీలో నేటి నుంచి 104 వాహనాలకు బ్రేకులు పడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 292 వాహనాలను ఆపేసి సమ్మెలోకి చేపడుతున్నట్లు 104 ఉద్యోగుల సంఘం ప్రకటించింది. జిల్లా కలెక్టరేట్ల ఎదుట, వైద్యాధికారి కార్యాలయాల ఎదుట నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు ఉద్యోగులు తెలిపారు. గతంలో వేతనాల పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ.. అది అమలు కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చినప్పటికీ.. అది నెరవేరలేదని, తమను ప్రభుత్వం మర్చిపోయారని 104 ఉద్యోగులు అంటున్నారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
నేటి నుంచి 104 ఉద్యోగ సంఘాల సమ్మె
-
గ్రామీణ వైద్యానికి చంద్రగ్రహణం
తూర్పుగోదావరి, రాయవరం (మండపేట): గ్రామీణ ప్రాంత ప్రజలకు ‘చంద్ర’గ్రహణం పట్టుకుంది. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన 104 సేవలపై నీలినీడలు కమ్ముకోవడంతో రోగాలు విజృంభిస్తున్నాయి. వైఎస్ హయాంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందాయి. ప్రస్తుత ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని నీరుగారుస్తుందనే విమర్శలున్నాయి. ఇదిలా ఉంటే 104 సిబ్బందికి 151 జీవో ప్రకారం పూర్తి స్థాయిలో వేతనాలు చెల్లించాలనే ప్రధాన డిమాండ్తో మంగళవారం నుంచి సమ్మెకు సిద్ధమవుతున్నారు. దీంతో జిల్లాలో ఉన్న 30 చంద్రన్న సంచార వైద్యశాలలు మూలకు చేరనున్నాయి. గ్రామాలకు వైద్యసేవలు గ్రామీణ ప్రజలకు వైద్యసేవలు అందించే చంద్రన్న సంచార చికిత్స (104) వాహనాల ద్వారా ప్రతి నెలా మారుమూల గ్రామాల్లో, నిర్దేశించిన రోజుల్లో (ఫిక్స్డ్ సర్వీస్) వైద్యసేవలు అందిస్తున్నారు. అయితే 104 వాహన సేవలపై ప్రభుత్వం చూపించిన నిర్లక్ష్యం కారణంగా మందులు అందుబాటులో లేని దుస్థితి నెలకొంటోంది. ఒక్కో వాహనానికి ఒక్కో డాక్టర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఏఎన్ఎం, పైలట్, వాచ్మన్ ఉంటారు. వీరంతా 104 వాహనాల్లో గ్రామాలకు వెళ్లి వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రధానంగా రక్తపోటు, చక్కెర, ఆస్తమా, ఫిట్స్, వంటి దీర్ఘకాలిక వ్యాధులతోపాటు గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్ల లకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందిస్తున్నారు. అయితే వీరందరూ పనికి తగ్గట్టు వేతనాలు అందకపోవడంతో సమ్మె సైరన్ మోగించారు. జీవో 151 ప్రకారం... జీవో 151 ప్రకారం నర్సులకు, పైలెట్లకు రూ.13,780 నుంచి రూ.15వేలకు పెంచాలి. ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులకు రూ.14,452 నుంచి రూ.17,500, సెక్యూరిటీ (వాచ్మెన్) సిబ్బందికి రూ.9,519 నుంచి రూ.12 వేలకు పెంచాలి. ఈ జీవో 2018 మే ఒకటో తేదీన జారీ అయినా ఇంత వరకూ నూతన వేతనాలు అమలుకు నోచుకోలేదు. స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒప్పందం చేస్తూ పీఎస్ఎంఆర్ఐ (పిరమళ్ల స్వస్థ మేనేజ్మెంట్ రీచార్జ్ ఇనిస్టిట్యూట్) యాజమాన్యానికి ఉత్తర్వులు జారీ చేశారు. అయినా పూర్తి స్థాయిలో వేతనాలు అమలు చేయకుండా, యాజమాన్యం మొండి వైఖరిని ప్రదర్శిస్తుందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం పీఎఫ్, ఈఎస్ఐ నిమిత్తం ఉద్యోగి వాటాతోపాటు, యాజమాన్యం వాటాను తమ వేతనాల నుంచి చెల్లించడాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. చట్టం ప్రకారం పీఎఫ్, ఈఎస్ఐ యాజమాన్యం భరాయించాల్సి ఉండగా, ఆ బాధ్యత నుంచి తప్పించుకోవడాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. యాజమాన్యం చెల్లించాల్సిన వాటాను తమ వేతనాల్లో కట్ చేస్తున్నా ప్రభుత్వం మిన్నకుండడాన్ని వారు తప్పుబడుతున్నారు. గత తొమ్మిది నెలలుగా సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వ అధికారులు, యాజమాన్యం వద్దకు తిరిగినా ఫలితం లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో సమ్మె బాట పడుతున్నట్లు బాధితులు చెబుతున్నారు. నీరుగారుతున్న వైఎస్ ఆశయం... అందరికీ ఆరోగ్యం అందించాలన్న సదుద్దేశంతో ప్రవేశపెట్టిన 104 విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం నీరుగారుస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో గంగా వాహనాలకు సరిగ్గా మందులు సరఫరా చేయకపోవడం, డీజిల్ ఖర్చులు, నిర్వహణకు సక్రమంగా నిధులు మంజూరు చేయకపోవడం, వాహనాలు మరమ్మతులకు గురవుతున్నా పట్టించుకోక పోవడంతో క్రమేపీ ఈ సేవలు రోగులకు దూరమవుతున్నాయి. 2008లో 104 పథకం హెచ్ఎంఆర్ఐ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించగా, 2011లో డీఎంఅండ్హెచ్వో పరిధిలో నడిచింది. 2016 నుంచి పీఎస్ఎంఆర్ఐ సంస్థకు అప్పగించారు. అప్పటి నుంచీ సేవలు ఎలుకతోక వాటంగా తయారవుతున్నాయి. జీవో సక్రమంగా అమలు చేయాలి 104 వాహనాల్లో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు పెంచాలి. అన్ని అర్హతలున్న మాకు కొన్నేళ్లుగా వేతనాలు పెంచలేదు. 151 జీవో జారీ చేసినా వేతనాలు పెంచకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. జీవోను సక్రమంగా అమలు చేయాలి. న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకూ సమ్మెబాట వీడం. వాహనాలను యాజమాన్యానికి అప్పగించేసాం.– ఎం.త్రిమూర్తులు, జిల్లా అధ్యక్షుడు,104 చంద్రన్న సంచార చికిత్స కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం, కాకినాడ. -
గ్రామీణ వైద్యానికి ‘చంద్ర’గ్రహణం
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి 104 సేవలు ప్రవేశపెట్టారు. ఆయన హయాంలో గ్రామీణులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా వైద్య సేవలు అందాయి. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఆ మహోన్నత లక్ష్యాన్ని నీరుగారుస్తోంది. 104 సిబ్బంది సమస్యలు పరిష్కరించకపోవడంతో మంగళవారం నుంచి సమ్మెకు సిద్ధమవుతున్నారు. చిత్తూరు, తిరుపతి (అలిపిరి) : గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించే చంద్రన్న సంచార చికిత్స (104) సేవలకు గ్రహణం పట్టింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 104 వాహనాల్లో మందులు అందుబాటులోని లేని దుస్థితి నెలకొంది. ఒక్కోసారి సూది, దూది కూడా లేకపోవడం సిబ్బందికి తలనొప్పిగా మారింది. పైగా జీఓ 151 ప్రకారం సిబ్బందికి వేతనాలు పెంచాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో సిబ్బంది సమ్మె సైరన్ మోగించారు. మంగళవారం నుంచి విధులు బహిష్కరించి సమ్మె చేపట్టనున్నారు. జిల్లాలో 24 చంద్రన్న సంచార చికిత్స వాహనాలు ఉన్నాయి. 26 మంది పైలెట్లు, 26 మంది ఫార్మసిస్టులు, 26 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 26 మంది నర్సులు, 20 మంది సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరందరూ పనికి తగ్గట్టు వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. జీఓ 151 ప్రకారం వేతనాలు ఇలా.. జీఓ 151 ప్రకారం నర్సులకు రూ.13,780 నుంచి రూ.15వేలకు పెంచాలి. ఫార్మసిస్టులకు రూ.14,452 నుంచి రూ.17,500, ల్యాబ్ టెక్నీషియన్లకు రూ.14,452 నుంచి 17,500, పైలెట్లకు రూ.13,780 నుంచి రూ.15వేలు, సెక్యూరిటీ(వాచ్మెన్) రూ.9,519 నుంచి రూ.12వేలకు పెంచాలి. ఈ జీఓ 2018 ఏప్రిల్ ఒకటో తేదీ జారీ అయినా ఇంతవరకు నూతన వేతనాలు అమలు చేయలేదు. నీరుగారుతున్న రాజన్న లక్ష్యం.. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి 104 సేవలు ప్రారంభించారు. ప్రస్తుత ప్రభుత్వం క్రమంగా దాన్ని నిర్వీర్యం చేస్తోంది. ఇందులో భాగంగా 104 వాహనాలకు మందులు ఇవ్వడం లేదు. పెట్రోల్, డీజిల్ ఖర్చులకూ డబ్బు మంజూరు చేయడం లేదని సిబ్బంది ఆరోపిస్తున్నారు. మరమ్మతులకు గురైతే వాహనాల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారని అంటున్నారు. 2008లో 104 పథకం హెచ్ఎంఆర్ఐ సంస్థ, 2011లో డీఎం అండ్ హెచ్ఓ పరిధిలో నడిచింది. 2016 నుంచి పీఎస్ఎంఆర్ఐ సంస్థకు అప్పగించారు. అప్పటి నుంచి సేవలు పేలవంగా మారాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. వేతనాలు పెంచాలి.. 104 వాహనాల్లో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు పెంచాలి. అన్ని అర్హతలున్న మాకు కొన్నేళ్లుగా వేతనాలు పెంచలేదు. జీఓ 151 జారీ అయినా వేతనాలు పెంచకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. వచ్చే జీతాలతో కుటుంబాలు గడవడం కష్టంగా ఉంది.– విజయ్శేఖర్, జిల్లా అధ్యక్షుడు, 104 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్, చిత్తూరు సేవలు మెరుగుపరచాలి.. జిల్లాలో 108 సేవలు మెరుగుపరచాలి. సంచార వైద్య సేవలు ప్రజలకు పూర్తి స్థాయిలో అందాలి. మాకు అరకొర వేతనాలు మంజూరు చేస్తూ గొడ్డు చాకిరీ చేయిస్తున్నారు. నూతన వేతన విధానాన్ని అమలు చేసి న్యాయం చేయాలి.– పి.ధనలక్ష్మి, ప్రధాన కార్యదర్శి, 104 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్, చిత్తూరు -
‘104’ సమస్యలు
ఆదిలాబాద్: గ్రామీణులకు మెరుగైన వైద్యం అం దించే 104 వాహనాలను మరమ్మతు సమస్యలు వెంటాడుతున్నాయి. 2008లో ప్రారంభించిన వా హనాలకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో మరమ్మతులకు నిధులు విడుదల చేయకపోవడంతో ఒక్కొక్కటిగా మూలనపడుతున్నాయి. జిల్లా అధికారులు రూ.10 వేల నుంచి రూ.15 వేలకు వెచ్చించి మరమ్మతులు చేయిస్తున్నా.. అంతకుమించి ఖర్చయ్యే పక్షంలో చేతులెత్తేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో మూడు వాహనాలు మూలకుపడ్డాయి. వైద్య పరికరాల సరఫరా కూడా లేకపోవడంతో మూలనపడడానికి కారణమవుతోంది. వాహనాల్లోని సిబ్బందిని కుదించడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది వీటి వైపు రాకపోవడంతో సరైన వైద్యం అందడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 24 ‘104’ వాహనాలు నిత్యం గ్రామాల్లో విద్య శిబిరాలు నిర్వహిన్నాయి. మొదట్లో ఇవి హెచ్ఏంఆర్ఐ అదీనంలో ఉన్నా తర్వాత ప్రభుత్వం తన అదీనంలోకి తీసుకుంది. జిల్లాల విభజనకు ముందు 17 సీహెచ్ఎన్సీ(కమ్యూనిటీ హెల్త్ అండ్ న్యూట్రీషన్ సెంటర్)లకు అప్పగించింది. జిల్లాల విభజన అనంతరం ఉమ్మడి జిల్లాలో ఏడు ఉప ఆరోగ్య వైద్యాధికారి కార్యాలయాలకు వీటి బాధ్యతలను అప్పగించింది. మొదట్లో ప్రతి వాహనంలో ముగ్గురు ఏఎన్ఎంలు, ఫార్మాసిస్టు, ల్యాబ్టెక్నీషియన్, డీఈఓ, డ్రైవర్ చొప్పున విధులు నిర్వర్తించేవారు. వైద్య శిబిరం నిర్వహించే చోట సంబంధిత పీహెచ్సీ వైద్యాధికారి, గ్రామంలోని ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు హాజరయ్యేవారు. ప్రభుత్వం సిబ్బందిని కుదిస్తూ ప్రతీ వాహనంలో ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, డ్రైవర్లకే పరిమితం చెసింది. డీఈఓలను క్లస్టర్ కార్యాలయాల్లో నియమించింది. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించే సమయంలో ఆయా పరిధి పీహెచ్సీ వైద్యాధికారి, మొదటి రెండవ ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న చోట వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు కానరావడం లేదు. ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారుల కొరతతోపాటు సిబ్బందికి పనిభారంతో గైర్హాజరు అవుతున్నారు. దీంతో గ్రామీణులకు సరైన వైద్యం అందడం లేదు. కానరాని వైద్య పరికరాలు. హిమోగ్లోబిన్ శాతాన్ని పరీక్షించే హెచ్బీ ట్యూబ్లు, రక్త పరీక్షల కోసం నమూనాలు సేకరించే పిపెట్లు వాటిపై ఉండే గుర్తులు చెదిరి పోవడంతో పరీక్షల సమయంలో ఇబ్బందులు తప్పడం లేదు. పిపెట్లకు పగుళ్లు వచ్చినా గత్యంతరం లేక వాటినే వినియోగిస్తూన్నారు. 15 వాహనాల్లో బరువు తూచే యంత్రాలు పని చేయడం లేదు. చిన్నపిల్లల బరువు చూడడానికి ఏర్పాటు చేసిన బేబీ వేయింగ్ మిషన్లు అటకెక్కాయి. గర్భిణుల ఎత్తు కొలవడం, చిన్నపిల్లల్లో వయస్సుకు తగ్గ ఎదుగుదల ఉందో లేదో తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేసిన హైట్ చార్టులు సుమారు 12 వాహనాల్లో కనిపించడం లేదు. ఉన్న వాహనాల్లో చిరగడంతో పనికి రాకుండా పోయాయి. గర్భిణుల్లో పిండం కదలికల్లో వచ్చే శబ్దాలను అంచనా వేస్తూ ఎదుగుదల తదితర చర్యలను నిర్ధారిస్తూ వైద్యం అందించడానికి ఇచ్చిన ఫీటర్స్కోప్లు మూలనపడ్డాయి. గ్లూకోమీటర్లతో షుగర్ శాతం తెలుసుకోవడం కష్టంగా మారింది. బీపీ మీటర్లు మూలకుపడడంతో పరీక్షల సమయంలో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. మరమ్మతుకు నోచుకోక.. వాహనాల్లో బ్యాటరీలు మొరాయిస్తున్నాయి. టీవీల ద్వారా ఆరోగ్య రక్షణపై అవగాహన కల్పించడానికి ప్రతీ వాహనంలో రూ.50 వేల విలువైన టీవీ, డీవీడీలు ఏర్పాటు చేశారు. ఇవి వాహనాల్లో ఉన్నా బ్యాటరీలకు రీచార్జి లేక బ్యాటరీలు మూలనపడడంతో పని చేయడం లేదు. మంచిర్యాల, ఉట్నూర్ ప్రాంతాల్లోని మూడు వాహనాల్లో టీవీలు లేవని తెలిసింది. గతంలో ఓ వాహనంలోని టీవీ కనిపించకపోవడంతో ఏడీసీ స్థాయి అధికారిపై కేసు నమోదైంది. చాలా వాహనాల్లో సైరన్లు మూగబోయాయి. హెడ్లైట్లు తప్పితే వాహనం చుట్టూ ఉండే లైట్లకు మరమ్మతులు లేక వెలగడం లేదు. అత్యవసర సమయంలో వాహనంలో లోపల ఉన్న సిబ్బంది క్యాబీన్లోని డ్రైవర్ ఇతర సిబ్బందితో మాట్లాడటానికి ఉపయోగించే ఇంటర్ కమ్ ఫోన్ సౌకర్యాలు కనుమరుగు అయ్యాయి. వాహనంలో రెండు వైపుల రూ.60 వేలతో ఏర్పాటు చేసిన టెంట్లు పని చేయడం లేదు. కుర్చీలు, టేబుళ్లు విరిగిపోవడంతో వైద్య శిబిరం నిర్వహించే చోట గ్రామస్తులను ఆశ్రయించాల్సి వస్తోంది. మందుల సరఫరా అంతంతే.. మొదట్లో ప్రతి వాహనంలో వంద రకాల మందులు సరఫరా అయ్యేవి. ఇందుకోసం ప్రభుత్వం నెలకు సుమారు రూ.40 వేలు కేటాయించేది. దీంతో జిల్లా కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్(సీడీసీ) నుంచి 104లకు చేరేవి. ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు దాదాపు 53 రకాల మందులు సరఫరా చేయాల్సి ఉండగా 20 రకాలు కూడా సరఫరా కావడం లేదని తెలిసింది. గ్రామాల్లో ఎక్కువగా ఉపయోగించే షుగర్, బీపీ, అస్తమా మందులు వస్తున్నా ఇతర వ్యాధులకు సంబంధించిన మందులు పూర్తి స్థాయిలో సరఫరా లేదు. దీంతో ప్రైవేట్గా కొనుగోలు చేయాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. -
చేతబడి చేసి తీసుకెళ్లారు : చంద్రముఖి
బంజారాహిల్స్: గోషామహల్ బీఎల్ఎఫ్ అభ్యర్ధి, ట్రాన్స్జెండర్ ఎం.రాజేష్ అలియాస్ చంద్రముఖి(32) అదృశ్యంపై మిస్టరీ వీడింది. రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న చంద్ర ముఖి బుధవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ప్రత్యక్షం కావడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. తన కూతురు కనిపించడం లేదని చంద్రముఖి తల్లి హైకోర్టులో హెబియస్కార్పస్ పిటీషన్ దాఖలు చేయడంతో బుధవారం పోలీసులకు చెమటలు పట్టాయి. ఏమాత్రం ఆచూకి లేని చంద్రముఖిని గురువారం ఉదయంలోగా హైకోర్టులో ఎలా ప్రవేశపెట్టాలో తెలియక సతమతమయ్యారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు, టాస్క్ఫోర్స్ పోలీసులు బృందాలుగా విడిపోయి తెలుగు రాష్ట్రాలను జల్లెడపట్టారు. ఎట్టకేలకు రాత్రి 11 ప్రాంతంలో చంద్రముఖి సికింద్రాబాద్లోని లంబా థియేటర్ సమీపంలో ఉన్నట్లు సమాచారం అంద డంతో పోలీసులు ఆమెను స్టేషన్కు ర ప్పించడంతో కథ సఖాంతమైంది. గురువారం ఉదయం ఆమెను హైకోర్టులో న్యాయమూర్తి ఎదుట ప్రవే శపెట్టారు. అంతకుముందు ఆమె విలేకరులతో మాట్లా డుతూ.. ఆ రోజు ఉదయం 8 గంటలకు రూ.25 వేలు బ్యాంకులో జమ చేసేందుకు వెళుత్తుండగా ఓ ఆటో ఎక్కడం జరిగిందన్నారు. ఆ ఆటో వాల తనను కోఠిలోని ఓ వీధిలోకి తీసుకెళ్లాడని అక్కడ మరో ఆటో ఎక్కి ఎల్బీనగర్లో దిగానన్నా రు. అక్కడ బస్సు ఎక్కి విజయవాడలో, అక్కడి నుం చి తిరుపతి, అక్కడి నుంచి చెన్నై వెళ్లినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఎవరో తనను చేతబడి చేసి ముందుకు నడిపించినట్లుగా ఉందని చెప్పారు. -
కాసులకు కక్కుర్తి పడి...
విజయనగరం, బొబ్బిలి: నకిలీ నోట్లు, నిషేధిత బాణసంచా వ్యాపారం, రియల్టర్ల హత్యాయత్నాలు, గన్ కల్చర్తో చెడ్డ పేరు సంపాదించుకున్న బొబ్బిలికి తాజాగా మరో మరక అంటింది. డబ్బులకు ఆశపడి కొంతమంది ప్రముఖులే దొంగల నుంచి బంగారం కొంటున్నారు. ఈ విషయాన్ని విశాఖ పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన అంతర్రాష్ట్ర నేరగాడు దున్న కృష్ణ విశాఖలో బంగారాన్ని దొంగతనం చేశారు. ఈ బంగారాన్ని బొబ్బిలి మెయిన్రోడ్డులో చెప్పుల దుకాణం నిర్వహిస్తున్న యజమాని ద్వారా ఇద్దరు ప్రముఖ వ్యాపారులకు విక్రయించాడు. వస్త్ర వ్యాపారం చేస్తున్న ఓ వ్యాపారి 750 గ్రాములు... ఇటీవలే బలిజిపేట రోడ్డులో బంగారు నగల దుకాణం పెట్టిన ఓ యువ వ్యాపారి 450 గ్రాముల బంగారం కొనుగోలు చేశారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తితో కలిసి చెప్పుల దుకాణ యజమాని ఈ బంగారాన్ని వ్యాపారులకు విక్రయించాడు. తులం రూ.36 వేలున్న బంగారం చవగ్గా వస్తుండడంతో బంగారం తెచ్చిన వారికి అంత స్థాయి ఉందా లేదానన్న విషయం చూడకుండా వ్యాపారులు కొనుగోలు చేసేశారు. వాస్తవానికి ఇద్దరికీ ఆ స్థాయి వ్యాపారాలు లేనప్పటికీ తక్కువకు వస్తుందన్న దురాశతో బంగారం కొన్నారు. అయితే ఈ విషయం విశాఖ కమిషనర్కు తెలియడంతో సిబ్బందిని మఫ్టీలో బొబ్బిలి పంపించి వ్యాపారులను ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు వ్యాపారులతో పాటు విక్రయించిన మరో ఇద్దరు ప్రస్తుతం విశాఖ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. అయితే బంగారాన్ని రికవరీ చేసిన పోలీసులు వారిని ఇంకా విడిచిపెట్టలేదని సమాచారం. కొనుగోలు చేసిన బంగారం విలువ ఇంకా ఎక్కువ ఉందా లేదానన్న విషయంలో విశాఖ సీపీ సిబ్బంది వాకబు చేస్తున్నట్లు తెలిసింది. గతంలో ఈ ముఠా విషయమై బొబ్బిలి పోలీసులు ఆరా తీసినా ఇతరత్రా పనులతో ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారనే వాదన వినిపిస్తోంది. ఇతర జిల్లాల నుంచి ఇక్కడకు వచ్చిన పోలీసులు దర్యాప్తు చేసి ఇంటరాగేషన్ చేసేవరకూ ఇక్కడి పోలీసులకు తెలియని పరిస్థితి నెలకొందంటే స్థానిక పోలీసుల పనితీరుపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. ఏది ఏమైనా దొంగ బంగారం కొనుగోలులో నలుగురు అరెస్ట్ కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే బంగారాన్ని అమ్మజూపిన వారు కూడా పాత నేరస్తులేనని సమాచారం. గతంలో నగల దుకాణం యజమాని నుంచి పార్వతీపురానికి సంబంధించిన ఓ దొంగతనం కేసులో బంగారాన్ని కూడా రికవరీ చేయించినట్టు తెలిసింది. విశాఖ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దొంగ బంగారం కొనుగోలు కేసులో పట్టణానికి చెందిన వారిని విశాఖ సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నట్లుంది. పూర్తి వివరాలు కూడా వారికే తెలుస్తాయి.– దాడి మోహనరావు, సీఐ బొబ్బిలి -
మా పరిస్థితి దయనీయం..
ప్రజా సంకల్పయాత్ర బృందం: రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకుల పరిస్థితి దయనీయంగా మారిందని ప్రైవేట్ ఉపాధ్యాయ, అధ్యాపకుల వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ దుర్గాప్రసాద్, తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. బొబ్బిలి నియోజకవర్గంలో గల బాడంగి మండలం ముగడ వద్ద ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రోజుకు 10 నుంచి 12 గంటల పాటు నిల్చునే పాఠాలు చెబుతున్నామన్నారు. మా ఒరిజినల్ సర్టిఫికెట్లు యాజమాన్యాలు తమవద్దే ఉంచుకుని మానసికంగా వేధిస్తున్నాయని జననేత దృష్టికి తీసుకువచ్చారు. ఖాళీ చెక్కుల మీద సంతకాలు.. ప్రాంశరీ నోట్లు రాయించుకుని ఒక్కరోజు సెలవు పెడితే రెండు రోజుల వేతనాన్ని తగ్గించేస్తున్నారని వాపోయారు. విద్యార్థుల ప్రవేశాల పేరుతో వేసవిలో రోడ్లమీద తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా ఉద్యోగులకు మెటర్నటీ సెలవులు కూడా ఇవ్వడం లేదని... ఆదివారం, రెండో శనివారం వంటి జాతీయ సెలవు దినాల్లో కూడా తరగతులు నిర్వహిస్తున్నారని వాపోయారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కోరారు. మార్కెట్యార్డుకు పేదల భూములు.. పేదల కోసం గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన భూములను టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కెట్ యార్డుకు కేటాయించి పేదలకు అన్యాయం చేశారని రామభద్రాపురం మండలం వైఎస్సార్సీపీ నాయకుడు డబ్ల్యూవీఎల్ఎన్ రాయులు జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. బాడంగి మండలం డొంకినవలస వద్ద ప్రజా సంకల్పయాత్రలో ఉన్న జగన్మోహన్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహానేత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రామభద్రాపురం నుంచి బాడంగి వెళ్లే ప్రధాన మార్గంలో 17 ఎకరాల భూమిని పేదల కోసం కేటాయించారన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు అందులో పది ఎకరాలను మార్కెట్యార్డుకు కేటాయించారని తెలిపారు. మిగిలిన ప్రాంతలంలో రూ. కోటితో రైతుబజార్ ఏర్పాటు కోసం షెడ్డులు నిర్మించడానికి ప్రయత్నించగా, స్థానికులు అడ్డుకున్నారని చెప్పారు. పేదల భూములు వారికే చెందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మా హక్కులను కోల్పోతున్నాం.. తెలంగాణలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న తాము స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు కోల్పోయి కష్టాలు పడాల్సి వస్తోందని నాన్లోకల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. మోహన్రావుతో పాటు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో జగన్మోహన్రెడ్డిని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 1997 నుంచి పనిచేస్తున్నా తమకు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు వచ్చే అవకాశం లేకపోయిందని వాపోయారు. తెలంగాణలో కేవలం 426 మంది ఆంధ్రాకు చెందిన ఉపాధ్యాయులుండగా, ఈ ప్రభుత్వం తమను సొంత రాష్ట్రానికి తీసుకురాలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు 2014 నుంచి పలుమార్లు దరఖాస్తులు ఇస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. పోలవరం ముంపు ప్రాంతాలైన ఏడు మండలాల్లో పనిచేస్తున్న తెలంగాణ ఉపాధ్యాయులు సుమారు 200 మందిని తెలంగాణా ప్రభుత్వం తీసుకుపోయినా... మమ్మలను మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడే విడిచిపెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ బీసీ కులస్తులుగా ఉన్న 26 కులాలను తెలంగాణాలో ఓసీలుగా మార్చడంతో రిజర్వేషన్ పరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు. ముసలివారైన తల్లిదండ్రులు ఆంధ్రాలో ఉంటే మేము తెలంగాణాలో ఉండాల్సి వస్తోందని వాపోయారు. దీనికి జగన్మోహన్రెడ్డి స్పందిస్తూ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. -
151వ జీవో అమలు చేయాలని 104ఉద్యోగులు విజ్ఞప్తి
-
తొలి రౌండ్లోనే బోపన్న జంట ఓటమి
న్యూఢిల్లీ: షాంఘై మాస్టర్స్ ఏటీపీ టెన్నిస్ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్లో బరిలోకి దిగిన బోపన్న (భారత్)–వాసెలిన్ (ఫ్రాన్స్) ద్వయం తొలి రౌండ్లో... దివిజ్ శరణ్ (భారత్)– సితాక్ (న్యూజిలాండ్) జోడీ రెండో రౌండ్లో ఓటమి చవిచూశాయి. బోపన్న–వాసెలిన్ జంట 6–7 (4/7), 4–6తో మెక్లాచ్లాన్ (జపాన్)–స్ట్రఫ్ (జర్మనీ) జోడీ చేతిలో ఓడిపోయింది. కుబోట్ (పోలాండ్)–మెలో (బ్రెజిల్) జంట 6–3, 6–4తో దివిజ్–సితాక్ ద్వయంపై గెలిచింది. దివిజ్–సితాక్ జంటకు 27,450 డాలర్లు (రూ. 20 లక్షల 37 వేలు), బోపన్న–వాసెలిన్ జోడీకి 14,480 డాలర్లు (రూ. 10 లక్షల 74 వేలు ) ప్రైజ్మనీగా లభించాయి. -
కంటికి కన్ను
చిల్లర సరుకుల్లా.. స్పై కెమెరాలు ఫుట్పాత్ మీద కూడా దొరుకుతున్నాయి. కొనేవారికి హద్దులు లేవు, అమ్మేవారికి పరిమితులు లేవు. ఫలితం.. మన అమ్మ, అక్క, చెల్లి, వదిన.. వీళ్ల నగ్నచిత్రాలు వీధికెక్కుతున్నాయి. అవమానంతో కృంగిపోయి.. వాళ్ల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇలాంటి మరణాలను అరికట్టడానికే ‘హెవెన్ హోమ్ సొసైటీ’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ‘యాంటీ రెడ్ ఐ’ పేరుతో ఓ ఉద్యమ పోరాటం చేస్తున్నారు వరలక్ష్మి. అందులో భాగంగా షార్ట్ఫిల్మ్లు తీసి ప్రజల్లో ఈ సమస్యపై చైతన్యం తెస్తున్నారు. మిస్డ్ కాల్తో ఓటింగ్ ద్వారా సమస్యను చట్టసభల్లోకి తీసుకెళ్లబోతున్నారు. ‘‘నరకాసుర వధకు ఓ స్త్రీ శక్తి సరిపోయిందేమో కాని, ఈ స్పై కెమెరా విష సంస్కృతిని సమూలంగా ఛేదించడానికి అందరి చేయూత కావాలి’’ అంటున్నారు వరలక్ష్మి. ఆ అమ్మాయి షాపింగ్మాల్కి వెళ్లింది. డ్రెస్ సెలక్ట్ చేసుకుంది. ట్రైల్ రూమ్లోకి వెళ్లి సైజు సరిపోయిందో లేదో చూసుకుంది. మళ్లీ తన డ్రెస్ వేసుకుని బయటకు వచ్చేసింది. కావలసిన బట్టలు కొనుక్కుంది. వారం తర్వాత.. ట్రైల్ రూమ్లో తను బట్టలు మార్చుకున్న వీడియోలు నెట్లో సర్క్యులేట్ అవడం గమనించి షాక్ తింది. సిగ్గుతో చచ్చిపోయింది. ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకుంది. సురేఖ దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతోంది. ఒకరోజున వారి ఏకాంతానికి సంబంధించిన ఫొటోలు వాట్సాప్కి వచ్చాయి. భార్యాభర్తలిద్దరూ ఆశ్చర్యపోయారు. ఇది ఎలా జరిగిందా అని ఆలోచించారు. ఇంటి గోడలకున్న చిన్న చిన్న మేకులలో స్పై కెమెరాలు ఉన్నట్లు తెలిసింది. ఆ దంపతులు చాలాకాలం ఎవ్వరికీ కనపడకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.నిజామాబాద్ మాక్లూర్ మండలానికి చెందిన బీటెక్ విద్యార్థి రమ్యకృష్ణ. ఆమెకు ప్రసాద్ అనే వ్యక్తి ఫేస్బుక్లో పరిచయమయ్యాడు. వృత్తిరీత్యా అతడు కువైట్లో ఉంటున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ విషయం ఆమెకు తెలియకపోవడంతో, అతనితో స్నేహం చేసింది. తెలియక చేసిన స్నేహానికి ఇప్పుడు ఆమెను సాధిస్తున్నాడు. ఇవే కాదు..! కేరళలో ఒక ఫొటోగ్రాఫర్ వివాహ వేడుకలో ఫొటోలు తీయడానికి వచ్చాడు. అక్కడ ఫొటోలు తీసి, వాటిని మార్ఫింగ్ చేసి 50 వేల మందికి సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. భద్రాచలంలో ఒక యువకుడు తనకు సోదరి వరుస అయిన యువతి నగ్న చిత్రాలు తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. బోయినపల్లిలో ఒక యువతికి తెలియకుండా వీడియో తీసి బ్లాక్మెయిల్ చేయడంతో ఆ యువతి సజీవదహనం అయిపోయింది. విచ్చలవిడి విష సంస్కృతి ఇటువంటి అనేక ఘటనలు అనునిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఎంతోమంది ఆడపిల్లలు తమకు తెలియకుండానే స్పైటెక్ వలలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. మనోవ్యధ చెందుతున్నారు. ఇటువంటి బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. తమకు తెలియకుండా జరుగుతున్న ఈ అఘాయిత్యాలను ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితి. ఒక మహిళను ఆమె అనుమతి లేకుండా ఫొటో లేదా వీడియోలో షూట్ చెయ్యడం, వాటిని షేర్ చేయడం తీవ్రమైన నేరం. అయినప్పటికీ ఈ తరహా నేరాలు ఆగడం లేదంటే అందుకు ఉపకరిస్తున్నవి స్పై కెమెరాలు. ఈ సంస్కృతికి అడ్డుకట్టు వేసేదెలా మరి? ‘‘దేశవ్యాప్తంగా విచ్చలవిడిగా జరుగుతున్న స్పై కెమెరాల అమ్మకాలను క్రమబద్ధీకరించాలి. ప్రతి సంస్థ మహిళా కస్టమర్ల భద్రతని తమ స్వంత బాధ్యతగా తీసుకొని వారి వ్యాపార సంస్థలు, హోటల్స్, మాల్స్, హాస్టల్స్ వంటి వాటిలో తమ సిబ్బంది కాని, ఎవరైనా ఇతరులు కాని స్పై కెమెరాలు బిగించారా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. చట్టపరంగా కూడా బాధితులకు తక్షణ న్యాయం జరగేలా చూడాలి’’ అంటున్నారు ‘యాంటీ రెడ్ ఐ’ వ్యవస్థాపకురాలు శ్రీమతి జి. వరలక్ష్మి. యాంటీ రెడ్ ఐ ఆవిర్భావం వరలక్ష్మి ఖమ్మం జిల్లాలో జన్మించారు. తండ్రి సూర్య ప్రకాశ్ పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేశారు. తల్లి సౌదామిని గృహిణి. భర్త జి. ఎన్. వి. సంజయ్ కుమార్ సొంతంగా వ్యాపారం చేస్తున్నారు. అమ్మాయి భార్గవి ఉద్యోగం చేస్తోంది. అబ్బాయి కిరీటి బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. వరలక్ష్మి ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబరుగా పని చేస్తున్న రోజుల్లో కొన్ని కేసులను టెక్నికల్ టీమ్ ఇన్వెస్టిVó ట్ చేస్తున్నప్పుడు చూశారు. స్పయింగ్ ఎలా జరుగుతోందో తెలుసుకుని కదిలిపోయారు. ఎంతోమంది ఇటువంటి సంఘటనల కారణంగా మనోవ్యధకు గురవుతున్నారని, కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని తెలుసుకున్నాను. స్పై కెమెరాలను దుర్వినియోగం చేయడం వల్ల అత్యాచారాలు కూడా జరుగుతున్నాయని, స్పై కెమెరాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా యాంటీ రెడ్ ఐ క్యాంపెయిన్ ప్రారంభించారు. షీ టీమ్లను పెంచాలి చట్టాల్లోని లొసుగులతో ఇటువంటి నేరాలకు పాల్పడుతున్న వారంతా వెంటనే బెయిలు మీద బయటకు వచ్చేస్తున్నారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానికి కూడా ఒక షాపింగ్ మాల్లో ఇలాంటి చేదు అనుభవమే ఎదురైనప్పుడు నిందితులు ఐదు వేల రూపాయలు జరిమానా కట్టి, మర్నాడే బయటకు వచ్చేశారంటే సాధారణ మహిళ భద్రత సంగతి ఏమిటి? ‘‘కఠిన చట్టాలు ఉండాలి. అవి సక్రమంగా అమలవ్వాలి. ఓటింగ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం చట్టాలు అమలుచేసేలా రాజకీయ నేతలు, అధికారులు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు... అందరూ సమన్వయంతో మహిళల తరఫున పోరాడటమే దీనికి పరిష్కారం’’ అంటున్నారు వరలక్ష్మి. స్పయింగ్ని రూట్ లెవల్ నుంచి పెకలించడానికి షీటీమ్స్ పెంచడం ఆమె సూచిస్తున్న ఒక మార్గం. దురదృష్టం ఏమిటంటే.. వరలక్ష్మి ఎనిమిది నెలల పాటు దీనిపై గ్రౌండ్ వర్క్ చేసి, అనేక సంఘటనల నేపథ్యం అర్థం చేసుకుని, కోర్టులో పిల్ వేసి ఏడాది గడుస్తున్నా, ఇంతవరకు ఆ కేసు బెంచ్ మీదకు రాకపోవడం! నివేదిక ఇవ్వలేదు! ‘‘ప్రస్తుత సమాజం మొత్తం టెక్నాలజీ మీదే నడుస్తోంది. ముందు ముందు ఈ సాంకేతికత కారణంగా సమాజం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. పిల్ వేసిన తరవాత, డీజీపీ నెలరోజులలో నివేదిక ఇవ్వాలి.ఇవ్వలేదు! వారే కనుక వెంటనే యాక్షన్ తీసుకుని నివేదిక కోర్టుకి ఇచ్చి ఉంటే కొన్నైనా ఇలాంటి ఘటనలు జరక్కుండా ఉండేవి’ అని వరలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘దక్షిణ కొరియాలో ఇటీవల మహిళలు పెద్ద ఎత్తున స్పై కెమెరాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. వారి పోరాటం ఫలించింది. ఆ పని మన దేశానికి ఎందుకు చేతనవడం లేదు?’’ అని ప్రశ్నిస్తున్నారు వరలక్ష్మి. రోజుకో ఘటన! ఆ మధ్య ఓ మంత్రిగారి చొరవతో, ఓ షోరూమ్ లో ట్రయల్ రూమ్లో బయటపడిన సీసీ కెమెరాలు, ఎంత మంది అమ్మాయిల మానసిక క్షోభకు కారణమయ్యాయో తెలిసిందే. పబ్లిక్ ప్లేసులు, ప్రైవేట్ స్థలాలు, హోటల్ రూమ్స్ చివరకు కట్టుకున్న భార్యపై అనుమానంతో బెడ్రూమ్లో కెమెరా అమర్చిన శాడిస్ట్, భార్య స్నానపు దృశ్యాలనే కెమెరాలో బంధించి, స్నేహితులకు షేర్ చేసిన పైశాచికపు మృగాడు.చెప్పుకుంటూ పోతే రోజుకో ఘటన, పూటకో అవమానం, క్షణానికో అఘాయిత్యం. నాన్ బెయిలబుల్ అవ్వాలి మన దగ్గర గన్ ఉండాలంటే అనుమతి కావాలి. డ్రగ్స్ తీసుకోవాలంటే అనుమతి కావాలి. లిక్కర్ తీసుకోవాలంటే అనుమతి కావాలి. నిద్ర మాత్రలు వేసుకోవాలంటే అనుమతి కావాలి. మరి స్పై కెమెరాల కొనుగోలుకు అనుమతి ఎందుకు అవసరం లేదు. ఇష్టానుసారం కొనుక్కుని, వాడుకోవచ్చా! ప్రభుత్వం వీటిని నియంత్రించాలి. ఆన్లైన్లో ఆఫ్లైన్లో స్పై కెమెరాల అమ్మకం సరైన మార్గంలో ఉండాలి. 354సి, 2013 యాక్టులో నాన్బెయిలబుల్ చేయాలి. పోర్న్ ఫొటోగ్రఫీ మీద సైట్లు 40 లక్షల దాకా ఉన్నాయి. వాటిని నియంత్రించాలి. ఇందుకోసం ప్రతిఒక్కరూ8099259925కి మిస్డ్ కాల్ ఇవ్వండి. యాంటీ రెడ్ ఐ టీమ్ ద్వారా మహిళలకు ఈ సమస్యను ఎదుర్కోవటానికి కావలసిన సాంకేతిక అవగాహన మేము కలిగిస్తాం. – జి. వరలక్ష్మి సంభాషణ: వైజయంతి పురాణపండ -
జగమంత అభిమానం
సాక్షి, విశాఖపట్నం: జననేత రాకతో వాల్తేరు హోరెత్తిపోయింది. సాగర తీరానికి ఎగసిపడే అలలతో పోటీగా జననేత అడుగులో అడుగు వేసేందుకు జనకెరటాలు ఎగసి పడ్డాయి. అలల హోరుకు జనహోరు తోడైంది. బారులు తీరిన అభిమానులతో వాల్తేరురోడ్లు కిక్కిరిసిపోయాయి. పిల్లాపాపలతో రోడ్లపైకి తరలివచ్చిన జనసందోహం మధ్య అడుగుతీసి అడుగు వేయలేకపోయారు. రాత్రి బస నుంచి రాష్ట్రస్థాయి సమావేశం జరిగే బీచ్రోడ్డుకు కేవలం రెండుకిలోమీటర్లే...కానీ రెండు గంటలకు పైగా సమయం పట్టిందంటే ఏ స్థాయిలో జనం వెల్లువెత్తారో చెప్పనక్కర్లేదు. రాజన్న బిడ్డ తమ ప్రాంతంలో బస చేశాడని తెలుసుకున్న ఆ ప్రాంత వాసులు ఆయనను చూసేందుకు గంటల తరబడి నిరీక్షించారు. వెలకట్టలేని ప్రజల ప్రేమాభిమానాల మధ్య ప్రజాసంకల్పయాత్ర అప్రతిహాతంగా దూసుకెళ్తోంది. వేలాది అడుగులు ఒక్కటై పాదయాత్రికుడి వెంట నడవడంతో రహదారులు జన దారులయ్యాయి. పులివేషాలు, తప్పెటగుళ్లు, గరగనృత్యాలు, గిరిజన సంప్రదాయ కొమ్ము నృత్యాలు, కోలాటాలతో దారిపొడవునా స్వాగతం పలికారు. గడిచిన నాలుగున్నరేళ్లలో తాము పడుతున్న కష్టాలను జననేత దృష్టికి తీసుకొచ్చారు. ‘ఒక్క ఆరునెలలు ఓపిక పట్టండి మనందరి ప్రభుత్వం రాగానే మీ అందరి కష్టాలు తీరుతాయి. ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాన’ంటూ జననేత వారికి భరోసా నిచ్చారు. ప్రజాసంకల్పయాత్ర 260వ రోజు విశాఖ తూర్పు నియోజక వర్గపరిధిలో సాగింది. చినవాల్తేరు కనకమహాలక్ష్మి ఆలయ ప్రాంగణంలో బస చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఉదయం 8.50 గంటలకు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అమ్మవారి ఆల యం వద్ద బస చేసిన జనవేల్పును చూసేందుకు ఆలయం నుంచి రెల్లి వీధి రోడ్డు వరకు మహిళలు, వృద్ధులు, చిన్నారులు బారులు తీరారు. గంటలతరబడి క్యూలైన్లో నిల్చొని మరీ జననేతను చూసేందుకు పోటీపడ్డారు. ఆయనతో కరచాలనం చేసేందుకు.. సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపారు. తూర్పు కో ఆర్డినేటర్ వంశీకృష్ణ శ్రీనివాస్, విశాఖ సిటీ అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్, పార్లమెంటు కో ఆర్డినేటర్ ఎంవీవీ సత్యనారాయణలు వెంటరాగ జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధిలోని చినవాల్తేరు కనకమహాలక్ష్మి ఆలయం నుంచి రెల్లివీధి, పీతల వీధి, చినవాల్తేరు మెయిన్రోడ్డు, ఈస్ట్ పాయింట్ కాలనీ, బీచ్రోడ్డు, పెదజాలరి పేట, లాసెన్స్బే కాలనీ వరకు పాదయాత్ర చేశారు. ఉదయం 8.50 గంటలకు బయల్దేరిన జగన్ బీచ్రోడ్లోని పెదజాలరిపేట ప్రాంతంలో ఉన్న విశాఖ ఫంక్షన్ హాలులో రాష్ట్ర స్థాయి సమన్వయకర్తల సమావేశానికి చేరుకున్నారు. సమావేశం అనంతరం తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకు బయల్దేరి లాసెన్స్బే కాలనీ సమీపంలో బీచ్రోడ్డులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకున్నారు. దారిపొడవునా సమస్యల వెల్లువ చినవాల్తేరు పరిధిలోని సర్వే నెం.19–23లో జగన్నాథస్వామి ఆలయానికి చెందిన పూర్వీకుల నుంచి తమ ఆధీనంలో ఉన్న 71.01 ఎకరాల భూములను ఎలాంటి పరిహారం ఇవ్వకుండా వుడా స్వాధీనం చేసుకుందంటూ పెదవాల్తేరుకు చెందిన ఉమ్మిడి రామిరెడ్డి జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ఎంబీబీఎస్ మాదిరిగామాది కూడా నాలుగేళ్ల కాలపరిమితితోనే చదివామని, అందు వలన తమను అసిస్టెంట్ డాక్టర్లుగా నియమించాలని బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులు జగన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మీ కష్టం చూడలేక పోతున్నామన్నా మేమంతా ఈసారి మీకే ఓటేస్తామన్నా అంటూ పెద వాల్తేరుకు చెందిన యువకులు జగన్ను కలిసి మాట ఇచ్చారు. మళ్లీ వచ్చేటప్పుడు సీఎంగా రావాలంటూ ఆకాంక్షను వ్యక్తం చేశారు. పాదయాత్రలో రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, పాదయాత్ర ప్రొగ్రామ్స్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురామ్, శాసనసభ పక్ష ఉపనాయకుడు బూడి ముత్యాలనాయుడు, అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త వరుదు కల్యాణి, గుంటూరు జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, మాజీమంత్రులు బలిరెడ్డి సత్యరావు, మత్స్యరాస బాలరాజు, మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు, తిప్పల నాగిరెడ్డి, కె.కె.రాజు, కోలా గురువులు, అక్కరమాని విజయనిర్మల, అన్నంరెడ్డి అదీప్రాజు, కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకరగణేష్, గొల్ల బాబూరావు, యు.వి.రమణమూర్తిరాజు, చెట్టి పల్గుణ, పీలా వెంకటలక్ష్మి, కాకర్లపూడి శ్రీకాంత్, కుంభా రవిబాబు,తెలిదేవర విజయచందర్, కొయ్య ప్రసాదరెడ్డి, తాడి విజయభాస్కరరెడ్డి, పక్కి దివాకర్, రవిరెడ్డి, తుళ్లి చంద్రశేఖర్ యాదవ్, పసుపులేటి ఉషాకిరణ్, చొక్కాకుల వెంకటరావు, కిరణ్రాజు, పూర్ణ పాల్గొన్నారు. వైద్య విభాగం ఆధ్వర్యంలో వంద వైద్యశిబిరాలు.. వైఎస్సార్సీపీ వైద్యవిభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కనీసం వంద వైద్యశిబిరాలు నిర్వహించనున్నట్టు ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శివభరత్రెడ్డి తెలిపారు. మంగళవారం చినవాల్తేరులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా డెంగీ, మలేరియా, టైఫాయి డ్ జ్వరాలు తీవ్రరూపం దాల్చాయన్నారు. ఇటీవల ఉత్తరాంధ్రలో పలువురు జ్వరాలభారిన పడి మరణించారన్నారు. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదన్నారు. వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి లేకపోవడంతో వ్యాధులను అరికట్టేందుకు, ప్రజలను అప్రమత్తం చేసేవారే లేరన్నారు. ఆయనతో పాటు ప్రధాన కార్యదర్శి డాక్టర్ అశోక్, డాక్టర్లు మెహబూబ్ షేక్, గణేష్రెడ్డి, ఎస్.ఎన్.భాను, ఉదయభాస్కర్, జిల్లా ఇంచార్జ్లు డాక్టర్ లక్ష్మీకాంత్, డాక్టర్ ప్రతాప్ పాల్గొన్నారు. -
మందుల్లేవ్..
పశ్చిమగోదావరి , భీమవరం (ప్రకాశం చౌక్): పేదల ఆరోగ్యం కోసం, ఉత్తమ వైద్య సేవలందించేందుకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రూపొం దిం చిన 104 పథకానికి ‘చంద్రన్న సంచార చికిత్స’గా పేరుమార్చిన తెలుగుదేశం పాలకులు పథకం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 104 వాహనంలో గ్రామాలకు చేరుకుని అక్కడే పేదలకు వైద్య సేవలతో పాటు మందులు అందజేసేలా పథకాన్ని రూపొందించారు. వైఎస్ హ యాంలో 104 సేవలు ప్రతి గ్రామంలో పూర్తిస్థాయిలో అందాయి. ఆయన మరణాంతరం పథకం అరకొర సేవలతో నడుస్తోంది. 2014లో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత పథ కం పేరును ‘చంద్రన్న సంచార చికిత్స’గా మా ర్చారు. అయితే ఈ సేవలు గ్రామీణులకు పూర్తిస్థాయిలో అందడం లేదు. నెలలో ఒక్కసారి గ్రామానికి వచ్చి పేదలకు సేవలు అందించే 104 వాహనాల్లో కనీసం మందులు కూడా ఉండటం లేదు. దీంతో గ్రామీణులు ఇబ్బందులు పడుతున్నారు. బీపీ (రక్తపోటు), షుగర్ మందులు కొరత సర్వసాధారణంగా మారిపోయింది. దీంతో 104 వాహనాల వద్దకు వచ్చిన వృద్ధులు మందులు లేక నిట్టూరుస్తూ వెనుదిరుగుతున్నారు. రెండు నెలల నుంచి.. జిల్లాలో 104 వాహనాలు 21 ఉన్నాయి. రెండు నెలలుగా ఆయా వాహనాల్లో బీపీ (ఎథనోలాల్) మందులు, బి.కాంప్లెక్స్ మందులు లేవు. ప్రతి గ్రామంలో బీపీ బాధితులు అధిక సంఖ్యలో ఉన్నారు. దీంతో ప్రతి గ్రామంలో వాహనం వద్దకు 50 నుంచి 70 మంది వరకు బీపీ మందుల కోసం వస్తున్నారు. బీపీ మందుల్లో కచ్చితంగా ఉండాల్సిన ఎథనోలాల్ మందులు రెండు నెలలుగా లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. 104 సిబ్బంది ప్రతిపాదనలు పంపినా ఇప్పటికీ సరఫరా కాలేదు. దీంతో రోగులకు వీరు అందించలేకపోతున్నారు. దీంతో పాటు బి.కాంప్లెక్స్ మందులు కూడా 104 వాహనాల్లో లేవు. మహానేత వైఎస్సార్ హయాంలో 108, 104 పథకాలు సమర్థవంతంగా నిర్వహించారని, ఆయన మరణాంతరం పథకాల అమలుపై ప్రభుత్వాలు అలసత్వం వహిస్తున్నాయని వృద్ధులు వాపోతున్నారు. వారంలో సరఫరా చేస్తాం 104 వాహనాల్లో అందుబాటులో లేని బీపీ రకం, బి.కాంప్లెక్సు మందుల కోసం ప్రతిపాదనలు పంపించాం. వారంలో అన్ని వాహనాల్లో మందులు ఉంచి కొరత లేకుండా చర్యలు తీసుకుంటాం. – డీఎం వీఎస్ఎన్మూర్తి, 104 జిల్లా మేనేజర్ -
వైఎస్ జగన్ను కలిసిన 104 ఉద్యోగులు
సాక్షి, అనపర్తి : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర అనపర్తి నియోజకవర్గంలోని పెద్దాడ చేరుకుంది. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక ప్రజలు, పార్టీ నేతల నుంచి ఘనస్వాగతం లభించింది. పాదయాత్రలో ప్రజలు తమ సమస్యలను రాజన్న బిడ్డతో ఏకరవు పెట్టుకున్నారు. అందరికి న్యాయం చేస్తామని జగన్ భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్ను కలిసిన 104 సిబ్బంది తమ గోడు వెల్లబోసుకున్నారు. చంద్రబాబు హయాంలో ప్రవేటు సంస్థలోకి వెళ్లిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెరిగేల చూడాలని కోరారు. వారి సమస్యలను విన్న ఆయన తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
డాక్టర్స్ డే శుభాకాంక్షలు చెప్పారు
తూర్పుగోదావరి : ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తున్నారని తెలిసి మురమళ్ల వద్ద పాదయాత్రలో కలిశానని మురమళ్లలోని డాక్టర్ జంజాల సీతారామారావు తెలిపారు. డాక్టర్స్డే ప్రస్తావన రాగా నాకు జగన్సార్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారని ఆయన అన్నారు. నా వద్ద ఉన్న డాక్టర్స్ ఓవర్ కోటు, స్టెత్లను ఇచ్చాను. ఆయన ఎంతో అభిమానంతో వాటిని ధరించారు. -
జగన్ సీఎం అవ్వడం ఖాయం
తూర్పుగోదావరి : ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసే ఏకైక వ్యక్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని లక్కవరానికి చెందిన రామేశ్వరపు నారాయణమూర్తి అన్నారు. సీఎం అవ్వడం ఖాయమన్నారు. ఆయన సీఎం అయితే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని జగన్కు వివరించాడు. -
నాకు ఎదురు తిరిగింది రాయుడొక్కడే
-
సమ్మెలో 104 సిబ్బంది
పాడేరు : ఏజెన్సీలోని 104 వైద్యసిబ్బంది ఆకస్మికంగా సమ్మె చేపట్టడంతో మంగళవారం నుంచి గ్రామాల్లో ఈ సంచార వైద్య ఆరోగ్య సేవలు స్తంభించాయి. సిబ్బంది సమ్మెకు దిగడంతో ఏజెన్సీ 11 మండలాల పరిధిలోని ఏడు 104 సంచార వాహనాలు నిలిచిపోయాయి. 104 వాహనాల్లో పని చేస్తున్న వైద్యసిబ్బంది, వైద్యులు, స్టాఫ్నర్సులు, ఫార్మసిస్ట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, డ్రైవర్స్, సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ఏజెన్సీలోని సుమారు 50 మంది 104 సిబ్బంది విధులను బహిష్కరించారు. గత శనివారం బొబ్బిలి సమీపంలో 104 వాహనం, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాద ఘటనలో 104 వాహనం నడుపుతున్న డ్రైవర్తోపాటు ఇందులో ఉన్న స్టాఫ్ నర్సు మృతి చెందారు. ఈ వాహనానికి సంబంధించిన రికార్డులు లేకపోవడంతో ప్రమాదానికి గురై మృతి చెందిన సిబ్బందికి నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. ఇది వరకే 104 వాహనాలకు సరైన రికార్డులను నిర్వహించకపోవడంపై ఇందులో పని చేస్తున్న ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. ఇప్పుడీ ప్రమాదం చోటు చేసుకోవడంతో 104 సిబ్బందిలో ఆందోళనకు దారితీసింది. దీంతో అత్యవసరంగా 104 సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఇంటి ముంగిటకే నాణ్యమైన వైద్యం అందించాలని 2008లో అప్పటి వైఎస్ ప్రభుత్వం ఈ 104 సర్వీస్లను ప్రారంభించింది. డీఎస్సీ ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ జిల్లా కలెక్టర్ మరియు వైద్య ఆరోగ్యశాఖ ఆధీనంలో సిబ్బందిని నియమించి ఉద్యోగ భద్రత, కార్మిక చట్టాలు, కనీస వేతన చట్టాలు అమలు చేస్తూ జీవో నంబర్ 3 ప్రకారం జీతాలు చెల్లించేవారు. 2016లో టీడీపీ ప్రభుత్వం ఈ 104 సేవలను చంద్రన్న సంచార చికిత్సగా మార్చి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో పీఎస్ఎంఆర్ఐ సంస్థకు సర్వీస్ ప్రొవైడర్గా బాధ్యతలను అప్పగించి 277 వాహనాలు, ఇందులో పని చేస్తున్న సిబ్బందిని టేకోవర్ చేస్తూ వైద్య ఆరోగ్యశాఖకు ఆదేశాలు జారీ చేసింది. నాటి నుంచి 104 నిర్వహణ అలక్ష్యానికి గురైంది. వాహనాలకు సరైన రికార్డులు లేవని, ప్రతి నెలా చేయవలసిన సాధారణ తనిఖీలు, రిపేర్లు నిర్వహించడం లేదని, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని 104 డ్రైవర్లు తెలిపారు. ప్రమాదాలు లేదా ఏదైనా వాహనాలకు సంబంధించి అవాంతరాలు ఎదురైనప్పుడు డ్రైవర్ల తప్పిదం లేకపోయినా సంస్థ నిర్వాకం, ప్రభుత్వ అలక్ష్యం వల్ల తామే మూల్యం చెల్లించాల్సి వస్తోందని వారు వాపోయారు. 104 సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని, కనీస వేతన చట్టాలను అమలు చేస్తూ జీవో 151 ప్రకారం వేతనాలు చెల్లించాలని, వాహనాలకు సక్రమంగా రికార్డులు నిర్వహించాలని, వాహనాల కండిషన్ మెరుగుపర్చాలని సమ్మె చేపట్టిన పాడేరులోని 104 సిబ్బంది సతీష్ కన్నా, రామకృష్ణ, క్రాంతి, రవిచంద్ర, ఎస్.బాలరాజు డిమాండ్ చేశారు. -
చర్చించకుండానే ఎలా సస్పెండ్ చేస్తారు?
సాక్షి, హైదరాబాద్: ఉభయ సభల్లో కాంగ్రెస్ సభ్యులపై చర్యలు ఏకపక్ష నిర్ణయమని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ.. సభలో చర్చించకుండానే ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్షనేత జానారెడ్డి కుర్చీలో నుంచి లేవకపోయినా సస్పెండ్ చేయడం సబబుకాదన్నారు. కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ అత్యంత హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. -
104 లో జీతాలు పెంచడం లేదు
పీసీపల్లి: 104లో పనిచేస్తున్న ఉద్యోగులు జీతాలు చాలక చాలా ఇబ్బందులు పడుతున్నారని అద్దంకి డివిజన్ 104 నాయకుడు శేషు జగన్ను కలసి విన్నవించారు. ఎంతోకాలం నుంచి పనిచేస్తున్నా ఉద్యోగభద్రత లేదని తెలిపారు. జీతాలు పెంచేలా ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని కోరారు. – శేషు రాఖీ కట్టిన మహిళలు ఉలవపాడు: వెంకటాపురం గ్రామానికి చెందిన ఐదుగురు మహిళలు జగన్కు రాఖీ కట్టారు. ప్రజా సంకల్పయాత్రలో ఉన్న జగన్ను కలసిన యమ్.అంజమ్మ, అనసూర్య, జ్యోతి, రమ, అంజమ్మలు సోదరబావంతో రాఖీ కట్టినట్లు తెలిపారు. – రాఖీలు కట్టిన మహిళలు వైఎస్ దయ వల్లే బతికాను... ఉలవపాడు: వైఎస్ రాజశేఖరరెడ్డి దయ వల్లే నేను ఈ రోజు బతికి ఉన్నానని అలవలపాడు కుచెందిన జాన్ సైదా జగన్ను కలసి తెలిపారు. మొదట మెదడువాపు వ్యాధి వచ్చిందని, తరువాత బ్రెయిన్ టీబీ వచ్చిందిని చెప్పారు. అందరూ నన్ను చనిపోతారు అనుకున్న పరిస్థితుల్లో వైఎస్సార్ దయ వల్ల ఆపరేషన్లు చేయించుకుని బతికానన్నారు. ప్రస్తుతం మందులకు నెలకు రూ. 5 వేలు పైనే అవుతున్నాయని ఉచితంగా వచ్చేలా చూడాలని జగన్ ను కలసినట్లు తెలిపారు. – జాన్ సైదా -
పోరుబాట..
సూర్యాపేట : వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో పాటు, రెండో ఏఎన్ఎంలు, ఆర్బీఎస్కే, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, 104 ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ పోరుబాట పట్టారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పదిరోజులనుంచి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లేందుకు పోస్టుకార్డుల ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీకి ఉత్తరాలు, నిరసనలు, ధర్నాలు తెలియజేస్తూ వస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 1,168 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు.. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 45 శాతం వేయిటేజీ మార్కులు కల్పించి రెగ్యులర్ నోటిఫికేషన్ విడుదల చేసి ఖాళీగా ఉన్న పోస్టులరు భర్తీ చేయాలని కోరుతున్నారు. అదే విధంగా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనంతో పాటు జాతీయ ఆరోగ్య మిషన్ నందు గత ప్రభుత్వాలు అమలు చేసిన పీఆర్సీ బేసిక్ పే విధానాన్ని,హెల్త్కార్డులు ఉద్యోగులందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసే లోపభూయిష్టమైన ప్రభుత్వ జీఓ నం:16ను వెంటనే పునరుద్ధరించి.. 2006 సంవత్సరంలో జస్టిస్ ఉమాదేవి ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకుని రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నారు. ఈనెల 27న ధర్నా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు ఈనెల 27వ తేదీన పెద్ద ఎత్తున తరలివచ్చి హైదరాబాద్లోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం ఎదుట పబ్లిక్ హెల్త్, మెడికల్ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నారు. ధర్నాకు అన్ని జిల్లాల్లోని ఉద్యోగులు తరలిరావాలని ఇప్పటికే యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. ప్రజా సంఘాల మద్దతు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పది రోజులుగా జిల్లా వ్యాప్తంగా నిరసన, ధర్నాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఐఎన్టీయూసీ, టీఆర్ఎస్కేవీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, జేఏసీ నాయకులు తమ మద్దతును తెలియజేస్తున్నారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జీఓ నంబర్16ను పునరుద్ధరించాలి అస్పష్టమైన జీఓ నంబర్16ను పునరుద్ధరించాలి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. గత ప్రభుత్వం అమలు చేసిన రెగ్యులర్ ఉద్యోగ నియామకాల్లో 45 శాతం మార్కులు ఇచ్చి రెగ్యులర్ చేయాలి. -ఆర్.మనోజ్కుమార్రెడ్డి, కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్ సూర్యాపేట పీఆర్సీ అమలు చేయాలి గత ప్రçభుత్వాలు అమలు చేసిన విధంగానే రెండో ఏఎన్ఎంలకు కూడా పీఆర్సీ అమలు చేయాలి. సుప్రీం కోర్టు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే బాగుంటుంది. ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. -మద్దిరెడ్డి భవాని, రెండో ఏఎన్ఎం, కోదాడ