avasarala Srinivas
-
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మూవీ
టాలీవుడ్ నటుడు అవసరాల శ్రీనివాస్.. ఆ మధ్య పిండం సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈగల్లోనూ ముఖ్య పాత్రలో కనిపించాడు. కిస్మత్లోనూ కీలక పాత్రలో మెరిశాడు. ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిస్మత్ మూవీ థియేటర్లలో పెద్దగా సౌండ్ చేయలేదు. ఈ చిత్రంలో నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వదేవ్, రియా సుమన్ ప్రధాన పాత్రలు పోషించారు. బీటెక్ బాధితులను దృష్టిలో పెట్టుకుని తీసినట్లుగా ఉంటుందీ సినిమా. వారికైతే కచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఈ మూవీ ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. కథేంటంటే? ముగ్గురు స్నేహితులు బీటెక్ చదువు పూర్తి చేసుకుని ఊరికి వచ్చేస్తారు. తమ జీవితంలో ఏదైనా అద్భుతం జరగాలని ఆశిస్తుంటారు. విశ్వదేవ్ నమ్మకం కోల్పోయి ఉంటాడు. రియా సుమన్తో నరేశ్ అగస్త్య ప్రేమలో ఉంటాడు. అభినవ్ గోమఠానికి సినీ రచయిత అవ్వాలన్నది కల. ఇంట్లో వాళ్ల పోరు తట్టుకోలేక హైదరాబాద్ వచ్చి ఉద్యోగం కోసం వేట మొదలుపెడతారు. ఆ తర్వాత జరిగిన ఓ సంఘటన వల్ల ఈ ముగ్గురి కిస్మత్ (అదృష్టం) ఎలా మారిందనేదే కథ! ఇక ఈ చిత్రాన్ని శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ, అధీరా ప్రొడక్షన్స్ పతాకాలపై రాజు నిర్మించారు. మార్క్ కె రాబిన్ సంగీతం అందించాడు. చదవండి: కావాలయ్యా.. సాంగ్పై దారుణ ట్రోల్స్.. మైండ్సెట్ మారాలన్న మిల్కీబ్యూటీ -
ఇండస్ట్రీకి 'అవసరాల' బుల్లోడి అరుదైన ఫోటోలు..
-
ఓటీటీలో దూసుకెళ్తున్న ‘పిండం’
ప్రముఖ నటుడు శ్రీరామ్ అలాగే శ్రీనివాస్ అవసరాల, సీనియర్ నటి ఈశ్వరి రావు ముఖ్య పాత్రల్లో దర్శకుడు సాయి కిరణ్ దైదా తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ చిత్రం “పిండం”. ఇటీవల మంచి ప్రమోషన్స్ నడుమ అలాగే మోస్ట్ స్కేరియెస్ట్ సినిమాగా థియేటర్స్ లో విడుదలై థియేటర్ ఆడియాన్స్ తో ప్రశంశలు పొందింది. తాజాగా ఈ చిత్రం అయితే ఇప్పుడు ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. పిండం సినిమా ఇప్పుడు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమ్ అవుతొంది. అలాగే తెలుగు, తమిళ్ భాషల్లో ఆహలో అందుబాటులో ఉంది. ఇక ఈ చిత్రానికి కృష్ణ శౌరబ్ సూరంపల్లి సంగీతం అందించగా యశ్వంత్ దగ్గుమాటి నిర్మాణం వహించారు. థియేటర్స్ లో మిస్ ఆయన ప్రేక్షకులు ఇంట్లో ఫ్యామిలీ మొత్తం తో కలిసి చూడొచ్చు. హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు అన్ని ఏజ్ గ్రూప్స్ కిలిసి చూసే విధంగా సినిమాను తెరకెకించారు సాయి కిరణ్ దైదా. ‘పిండం’ కథేంటంటే.. క్రైస్తవ మతానికి చెందిన ఆంథోని(శ్రీరామ్) రైస్ మిల్లులో ఓ అకౌంటెంట్. భార్య మేరి(ఖుషి రవి), ఇద్దరు కూతుళ్లు(సోఫియా, తార), తల్లి సూరమ్మతో కలిసి శుక్లాపేటలోని ఓ ఇంట్లో నివాసం ఉంటాడు. అది పురాతమైన ఇల్లు. తక్కువ ధరకు వస్తుందని భావించి ఆ ఇంటిని కొనుగోలు చేస్తాడు ఆంథోని. ఆ ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఆంథోని ప్యామిలీకి ఉహించని సంఘటనలు ఎదురవుతాయి. గర్భవతిగా ఉన్న భార్య మేరి ఆస్పత్రి పాలవుతుంది. మూగదైన చిన్నకూతురు తారను ఓ ఆత్మ ఆవహిస్తుంది. ఆ ఫ్యామిలీని చంపేందుకు క్షుద్రశక్తులు ప్రయత్నిస్తాయి. అలాంటి సమయంలో వారికి సాయం చేయడానికి అన్నమ్మ(ఈశ్వరీరావు) రంగంలోకి దిగుతుంది. ఆంథోని ఫ్యామిలీని వేధిస్తుంది ఒక ఆత్మ కాదని..ఆ ఇంట్లో చాలా ఆత్మలు ఉన్నాయని అన్నమ్మ గుర్తిస్తుంది. అసలు ఆ ఆత్మల కథేంటి? వాళ్లు ఎలా చనిపోయారు? ఆంథోని ఆ పురాతన ఇంటిని ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఆ ఇంట్లో అంతకు ముందు ఏం జరిగింది? ఆ ఇంటి నుంచి ఆత్మలను తొలగించేందుకు అన్నమ్మ ఏం చేసింది? చిన్న కూతురు తారను ఆవహించిన ఆత్మను విదిలించేక్రమంలో అన్నమ్మకు ఎదురదైన సమస్యలు ఏంటి? చివరకు ఆంథోని ఫ్యామిలీని అన్నమ్మ ఎలా రక్షించింది? 1932లో జరిగిన ఈ సంఘటన గురించి తెలుసుకునేందుకు లోక్నాథ్(అవసరాల శ్రీనివాస్)ఎందుకు ఆసక్తి చూపాడు? అనేది తెలియాలంటే ‘పిండం’సినిమా చూడాల్సిందే. -
2023లో బాగా భయపెట్టిన చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తుంది
టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల అయి బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టింది. టైటిల్, ఫస్ట్లుక్తోనే ఆసక్తి కలిగించిన ఈ చిత్రం 1930, 1990.. వర్తమానం.. ఇలా మూడు కాలక్రమాల్లో జరిగే కథగా అద్భుతంగా డైరెక్టర్ చూపించారు. ఇందులో అవసరాల శ్రీనివాస్, ఈశ్వరీ రావు, రవివర్మ కీలకపాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే ఈ హారర్ మూవీ పిండం ఇప్పుడు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్లలో ప్రేక్షకులను బాగా భయపెట్టిన పిండం చిత్రాన్ని వచ్చే ఏడాది అంటే 2024 జనవరి మొదటి వారంలో నెట్ఫ్లిక్స్లోకి రానున్నట్లు సమాచారం. 2023లో బాగా భయపెట్టిన చిత్రంగా పిండం గుర్తింపు పొందింది. ఈ సినిమా టైటిల్ 'పిండం' అని ఎందుకు పెట్టారో దర్శకుడు గతంలో ఇలా చెప్పారు. మొదటి సినిమానే ఇలాంటి పేరుతో ఎందుకు తీస్తున్నావని అందరూ ప్రశ్నించారు. అది నెగెటివ్ పదమని అంతా అనుకుంటారు. కానీ, పిండం అంటే ఆరంభం.. అంతం రెండూ ఉంటాయి. అందుకే ఆ పేరు పెట్టాను.' అని ఆయన అన్నారు. సినిమా చూశాక ఇదే సరైన టైటిల్ అని అందరికీ అనిపించింది.. హరర్ సినిమాలను అమితంగా ఇష్టపడే వారు తప్పక చూడాల్సిన సినిమా అని చెప్పవచ్చు. -
నాతో నేనే ప్రయోగాలు చేయాలనుకుంటున్నాను: అవసరాల శ్రీనివాస్
‘‘దర్శకత్వం, నటనల కంటే నాకు రైటింగ్ అంటే ఎక్కువ ఇష్టం. నేను ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా తీసినప్పుడు ఆ తరహా చిత్రాలు అప్పుడు రాలేదు. అలానే ‘జో అచ్యుతానంద’ కూడా. ఇలా నా కథలతో నాతో నేనే ప్రయోగాలు చేయాలనుకుంటున్నా’’ అని అన్నారు రచయిత, దర్శక–నటుడు అవసరాల శ్రీనివాస్. శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన హారర్ ఫిల్మ్ ‘పిండం’లో అవసరాల శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. సాయికిరణ్ దైదా దర్శకత్వంలో యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘సాయికిరణ్ చేసిన ‘స్మోక్’ షార్ట్ ఫిల్మ్ చూసి, తనలో రచన, దర్శకత్వ ప్రతిభ ఉందని గ్రహించాను. తను చెప్పిన ‘పిండం’ కథ నచ్చింది. ఈ సినిమాలో అతీంద్రియ శక్తులపై పరిశోధనలు చేసే లోక్నాథ్ పాత్ర చేశాను. ‘ప్రేమకథా చిత్రమ్’ చూసినప్పుడు కొంచెం భయపెడితే ప్రేక్షకులు సినిమాను శ్రద్ధగా చూస్తారని అర్థమైంది. కానీ కథలో హారర్తో పాటు భావోద్వేగ సన్నివేశాలు కూడా ఉండాలి. అప్పుడే కనెక్ట్ అవుతారు. ఇక ప్రస్తుతం ‘ఈగల్’, ‘కిస్మత్’, ‘కన్యాశుల్కం’ సినిమాల్లో నటిస్తున్నాను. రైటర్గా, దర్శకుడిగా ఓ మర్డర్ మిస్టరీ సినిమా స్క్రిప్ట్ రాస్తున్నాను. నా తర్వాతి చిత్రం ఇదే కావొచ్చు. అలాగే ‘కుమారి శ్రీమతి’ వెబ్ సిరీస్ సీజన్ 2 ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు. -
'మరణించిన తర్వాత అసలేం జరుగుతుంది?'.. ఆసక్తిగా ట్రైలర్!
శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం పిండం. ఈ చిత్రానికి సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించారు. హారర్ ఫిల్మ్గా తెరకెక్కించిన ఈ మూవీ ది స్కేరియస్ట్ ఫిల్మ్ అనేది ఉప శీర్షిక. ఆరోహి దైదా సమర్పణలో యశ్వంత్ దగ్గుమాటి నిర్మించారు. ఈ సినిమాను డిసెంబరు 15న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. అయితే తాజాగా ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూడగానే ప్రేక్షకులను భయపెట్టడమే లక్ష్యంగా సినిమా తీసినట్లు తెలుస్తోంది. నిజంగానే దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయా? అనే కోణంలోనే చిత్రాన్ని తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రంలో ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు కృష్ణ సౌరభ్ సూరంపల్లి సంగీతం అందించారు. ఈనెల 15న మిమ్మల్ని భయపెట్టేందుకు వస్తోంది. -
'ఇది అన్ని కుక్కల్లా లేదు.. ఏదో తేడాగా ఉంది'
శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటిస్తోన్న తాజా చిత్రం పిండం. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, ఈశ్వరీ రావు, రవివర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు. టైటిల్, ఫస్ట్లుక్తోనే ఆసక్తి పెంచేశారు మేకర్స్. తాజాగా ఈ చిత్ర టీజర్ను రిలీజ్ చేశారు. టీజర్ రిలీజ్ చేస్తూ..'ఇప్పటి వరకూ చూడని భయంకరమైన చిత్రం’ అనే ట్యాగ్లైన్తో విడుదల చేశారు. టీజర్ చూస్తే ఈ చిత్రం ఓ ఆత్మ చూట్టు తిరిగే కథాంశంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 1930, 1990.. వర్తమానం.. ఇలా మూడు కాలాల్లో జరిగే కథనే ఈ మూవీలో చూపించనున్నారు. టీజర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ..'చిన్నప్పుడు విన్న ఓ కథను హారర్ జోనర్లో తెరకెక్కించాలని అనిపించింది. ఈ మూవీ స్క్రీన్ప్లే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. టైటిల్ పేరు వినగానే అందరూ ఈ పేరు ఎందుకు పెట్టావని అన్నారు. మీ మొదటి సినిమానే ఇలా ఎందుకు తీస్తున్నావని ప్రశ్నించారు. అది నెగెటివ్ పదమని అంతా అనుకుంటారు. కానీ, పిండం అంటే ఆరంభం.. అంతం రెండూ ఉంటాయి. అందుకే ఆ పేరు పెట్టా. సినిమా చూశాక టైటిల్ సరైందే అని మీకందరికీ అనిపిస్తుంది.' అన్నారు. -
PAPA Review: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ
టైటిల్: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' నటీనటులు - నాగ శౌర్య, మాళవిక నాయర్, శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య తదితరులు నిర్మాణ సంస్థలు : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి దర్శకుడు: శ్రీనివాస్ అవసరాల సంగీతం: కళ్యాణి మాలిక్, వివేక్ సాగర్(కాఫీఫై సాంగ్) సినిమాటోగ్రఫీ: సునీల్ కుమార్ నామ ఎడిటర్ : కిరణ్ గంటి విడుదల తేది: మార్చి 17, 2023 Rating: 2.5/5 Phalana Abbayi Phalana Ammayi Review: 'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' లాంటి బ్లాక్బస్టర్స్ తర్వాత నాగశౌర్య, శ్రీనివాస అవరాల కాంబినేష్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(మార్చి 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్కు మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఈ సినిమా కథంతా 2000 నుంచి 2010 మధ్యకాలంలో సాగుతుంది. బీటెక్లో జాయిన్ అయిన సంజయ్ని సీనియర్స్ ర్యాగింగ్ చేస్తుంటే.. అతన్ని సేవ్ చేస్తుంది అనుపమ(మాళవికా నాయర్). అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఇక ఎంఎస్ కోసం ఇద్దరు కలిసి యూకేకి వెళ్తారు. అక్కడ ఇద్దరు ప్రేమలో పడతారు. సహజీవనం కూడా చేస్తారు. ఎంఎస్ పూర్తవ్వగానే అనుపమకు వేరే సిటీలో ఉద్యోగం వస్తుంది. తనకు చెప్పకుండా ఉద్యోగానికి అప్లై చేసిందని అనుపమపై కోపంగా ఉంటాడు సంజయ్. అదే సమయంలో అతనికి పూజ(మేఘా చౌదరి)దగ్గరవుతుంది. ఆమె కారణంగా సంజయ్, అనుపమల మధ్య దూరం పెరుగుతుంది. ఇద్దరు విడిపోతారు. కొన్నాళ్ల తర్వాత అనుకోకుండా ఇద్దరు కలుస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? పూజ ప్రేమను సంజయ్ అంగీకరించాడా? అనుపమ జీవితంలోకి గిరి(అవసరాల శ్రీనివాస్) ఎలా వచ్చాడు? చివరికి సంజయ్, అనుపమలు కలిశారా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. సినిమా భాషలో కాంబినేషన్ అనే మాటకి విలువెక్కువ. ఓ హీరో, డైరెక్టర్ కలిసి చేసిన సినిమా హిట్ అయితే.. అదే కాంబోలో వస్తున్న కొత్త చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడటం సహజం. కానీ ఆ అంచనాలను దర్శకుడు అవసరాల శ్రీనివాస్ నిలబెట్టుకోలేకపోయాడు. ‘ఉహాలు గుస గుస లాడే , జ్యో అచ్యుతానంద’ బ్లాక్బస్టర్స్ తర్వాత నాగశౌర్యతో కలిసి చేసిన హ్యాట్రిక్ మూవీ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఆ స్థాయిలో ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. కథలో చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. ఎలాంటి ట్విస్టులు లేకుండా చాలా రొటీన్గా కథనం సాగుతుంది. కొన్ని సీన్లలో శ్రీనివాస అవసరాల మార్క్ కామెడీ కనిపిస్తుంది. కానీ మొత్తంగా ఎక్కడో క్లారిటీ మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో మొత్తం ఏడు చాప్టర్లు ఉంటాయి. ఒక్కో చాప్టర్ ఒక్కో థీమ్ తో ఉంటుంది. ప్రేమ, ద్వేషం, హాస్యం ఇలా అన్ని భావోద్వేగాలు ఉంటాయి. కానీ వాటిని ఆకట్టుకునే విధంగా తెరకెక్కించడంతో దర్శకుడు విఫలమయ్యాడు. కాలేజీలో హీరోహీరోయిన్ల స్నేహం.. ప్రేమ.. సహజీవనం తదితర సన్నివేశాలతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్ ఇద్దరి మధ్య మనస్పర్థలు.. విడిపోవడం.. ఇలా భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. అయితే కలిసి జీవించాలనుకున్న ఈ జంట.. విడిపోవడానికి గల కారణాలను బలంగా చూపించలేకపోయారు. పార్ట్ పార్ట్లుగా చూస్తే కొన్ని సీన్స్ ఆకట్టుకుంటాయి. కానీ ఓవరాల్గా మాత్రం అంతగా మెప్పించదు. ఎవరెలా చేశారంటే... సంజయ్గా నాగశౌర్య మెప్పించాడు. లుక్స్ పరంగా చాలా మార్పులు ఉన్న పాత్ర తనది. ఇలాంటి రొమాంటిక్ ఫీల్ గుడ్ సినిమాలు.. పాత్రలు నాగశౌర్యకు కొత్తేమి కాదు. గత సినిమాల్లో మాదిరే లవర్ బాయ్గా సంజయ్ చక్కగా నటించాడు. ఇక అనుపమగా మాళవికా నాయర్ తనదైన నటనతో ఆకట్టుకుంది. సినిమా మొత్తం వీరిద్దరి పాత్రల చుట్టే తిరుగుతుంది. గిరిగా అవసరాల శ్రీనివాస్ ఉన్నంతలో మెప్పించాడు. వాలెంటైన్ గాఅభిషేక్ మహర్షి తనదైన కామెడీతో నవ్వించాడు, కీర్తిగా శ్రీవిద్య, పూజగా మేఘ చౌదరితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. కళ్యాణి మాలిక్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు కథకి తగ్గట్టుగా ఉన్నాయి. సునీల్ కుమార్ నామ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి వెబ్డెస్క్ -
ఈ సినిమాలో వచ్చే ఎమోషన్ ఏ తెలుగు సినిమాలోనూ చూడలేదు: అవసరాల
నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. టీజీ విశ్వప్రసాద్, దాసరి పద్మజ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం మేం చాలా కష్టపడ్డాం. మా కష్టం థియేటర్స్లో తెలుస్తుంది. నా కెరీర్లో ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాల గురించి ఎలా చెప్పుకున్నానో ‘ఫలానా..’ సినిమా గురించి అంతే బాగా చెప్పుకుంటాను. ఈ సినిమా విజయం పట్ల నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలోని పాత్రలు నిజజీవితంలో చూసినట్లుగా ఉంటాయి. ఎమోషనల్ మూవీ ఇది. నటనపై ఆధారపడ్డ సినిమా కాబట్టే సింక్ సౌండ్ ఉండాలని నిర్ణయించుకున్నాను. ఈ సినిమాలోని సంజయ్ పాత్రకు నాగశౌర్య బాగా సరిపోయాడు. ఏడు చాప్టర్లు ఉండే ఈ సినిమాలోని నాలుగో చాప్టర్ నాకు చాలా ఇష్టం. ఇంటర్వెల్కి ముందు వచ్చే ఈ చాప్టర్లో వచ్చే ఎమోషన్ ఇంతవరకు నేను తెలుగు సినిమాల్లో చూడలేదనేది నా అభిప్రాయం’’ అన్నారు అవసరాల శ్రీనివాస్. ‘‘నాగశౌర్య, మాళవికల సహజ నటన కోసం ఈ సినిమా చూడొచ్చు’’ అన్నారు చిత్ర సహనిర్మాత వివేక్ కూచిభొట్ల.‘‘ఇంత మంచి సినిమాలో మమ్మల్ని భాగం చేసిన విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్లగారికి థ్యాంక్స్’’ అన్నారు దాసరి ప్రసాద్. -
ముద్దు సీన్ గురించి మాళవికకు ముందే చెప్పాను: అవసరాల శ్రీనివాస్
‘‘నటీనటుల నుంచి సహజమైన నటనను రాబట్టుకోవడం అనేది దర్శకుడిగా నాకున్న బలం. ఫ్రేమ్లో నటీనటులు ఎలా యాక్ట్ చేస్తున్నారనే విషయాన్నే నేను ముందు చూస్తాను. నన్ను, నా కథను, నా కొత్త ప్రయోగాన్ని మా నిర్మాతలు నమ్మారు. ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమా విజయం సాధిస్తుంది’’ అన్నారు రచయిత, దర్శక–నటుడు అవసరాల శ్రీనివాస్. నాగర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటించారు. టీజీ విశ్వప్రసాద్, దాసరి పద్మజ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకర్ల సమావేశంలో చిత్రదర్శకుడు అవసరాల శ్రీనివాస్ పంచుకున్న విశేషాలు. ► ఈ సినిమాలో ఏడు అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయం నిడివి దాదాపు 20 నిమిషాలు ఉంటుంది. కథ రీత్యా 18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల వయసు వరకు నాశౌర్య, మాళవిక పాత్రల ప్రయాణం ఉంటుంది. ఏడు చాప్టర్లూ ఈ పదేళ్ల వ్యవధిలోనే జరుగుతాయి. ► వయసుకి తగ్గట్లుగా పాత్ర తాలూకు ప్రవర్తన, ఆహార్యంలో వ్యత్యాసం చూపించడానికి నాగశౌర్య ఎంతో కష్టపడ్డారు. నిజజీవితంలో నేను చూసిన కొన్ని ఘటనల ఆధారంగా ఈ సినిమా కథ రాసుకున్నాను. పాత్రలు, సంభాషణలు చాలా సహజంగా ఉంటాయి. మనకు తెలిసిన కథలా, మనలో ఎవరో ఒకరి కథలా ఈ సినిమా ఉంటుంది. ► నాకు ఇష్టమైన యాక్టర్స్లో నాగశౌర్య ఒకరు. ఈ సినిమా యూకే షెడ్యూల్ కోసం 40 మందికి వీసాలు అప్లయ్ చేస్తే పదిమందికే ఓకే అయ్యాయి. దీంతో షూటింగ్ కోసం కొన్ని ఇబ్బందులు పడ్డాం. కానీ సెట్స్లో తన యాక్టింగ్తో నాగశౌర్య ఆ ఇబ్బందులను మర్చిపోయేలా చేసేవారు. ఈ సిని మాలో నాగశౌర్య పెర్ఫార్మెన్స్ ఎంత బాగుందనేది థియేటర్స్లో చూస్తారు. అలాగే ఈ సినిమాలో ముద్దు సీన్ ఉన్నట్లు మాళవికకు ముందే చెప్పాను. ఓ సన్నివేశానికి సరైన కారణాలు ఉంటే, కథకి ఖచ్చితంగా అవసరం అనిపిస్తే నటీనటులు ఆ సీన్లో యాక్ట్ చేయడానికి ఓకే అంటారన్నది నా అభిప్రాయం. ‘అష్టా చమ్మా’ చిత్రం నుంచే నాకు సంగీత దర్శకుడు కళ్యాణీ మాలిక్ తెలుసు. ఈ సినిమాకు ఆయన మంచి మ్యూజిక్ ఇచ్చారు. ‘కనుల చాటు..’ పాటను కీరవాణిగారు మెచ్చుకోవడంతో కళ్యాణీగారు ఇంకా సంతోషంగా ఉన్నారు. ► హిందీ ‘బ్రహ్మాస్త్రం’ టీమ్ ఓ సారి నాకు ఫోన్ చేసి తెలుగు డైలాగ్స్ రాస్తారా? అని అడిగారు. అప్పటికే ఆ సినిమా గురించి నాకు అవగాహన ఉండటంతో సరే అన్నాను. అలా ‘అవతార్ 2’కూ అవకాశం వచ్చింది. అయితే ఇంగ్లిష్ సినిమాలకు తెలుగు డైలాగ్స్ రాయడం చాలా కష్టం. కానీ చాలెంజ్గా తీసుకుని రాశాను. ఇక నటుడిగా ‘కన్యాశుల్కం’ వెబ్ సిరీస్ చేశాను. దర్శకుడిగా నా తర్వాతి చిత్రం గురించి త్వరలో అధికారికంగా చెబుతాను. -
అవతార్-2కి డైలాగ్స్ రాసిన అవసరాల శ్రీనివాస్
ప్రపంచ సినీ ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం ‘అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్’. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులోనూ అదే తేదీన థియేటర్స్కి రానుంది. అవతార్ 2 కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఉన్న థియేటర్స్ లో 90 శాతం అవతార్ 2 కి కేటాయిస్తున్నారు..స్టార్ హీరో సినిమాకి కాకుండా ఒక హాలీవుడ్ డబ్ చిత్రానికి ఈ రేంజ్ రిలీజ్ రావడం ఇదే తొలిసారి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా తెలుగు వెర్షన్కి రచయిత–దర్శకుడు, నటుడు శ్రీనివాస్ అవసరాల డైలాగ్స్ రాశారు. విలక్షణ నటుడిగా, రచయితగా, డైరెక్టర్గా తన మార్క్ని చూపించిన అవసరాల ఇప్పుడు అవతార్-2తో ఏ విధంగా మెప్పిస్తారన్నది చూడాల్సి ఉంది. -
లండన్లో ‘ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి’ టీం సందడి
నాగశౌర్య హీరోగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,దాసరి ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాళవిక నాయర్ కథానాయిక. ప్రస్తుతం ఈ మూవీ లండన్లో షూటింగ్ జరుపుకుంటుంది. అక్కడ హీరోహీరోయన్లపై కీలక సన్నివేశాలతో పాటు పాటలను చిత్రీకరిస్తున్నారు. అంతేకాదు ప్రధాన తారాగణం కూడా ఈ షూటింగ్ షెడ్యూల్ పాల్గొంది. గతంలో నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటించిన కళ్యాణ వైభోగమే ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. అలాగే శ్రీనివాస్ అవసరాల, నాగశౌర్య కాంబినేషన్లో రూపొందిన ఊహలు గుసగుసలాడే, జో అచ్చుతానంత చిత్రాలు కూడా మంచి విజయం సాధించాయి. ఇప్పుడు వీరి కాంబినేషన్లో అంటే.. కథానాయకుడిగా నాగశౌర్య, ఆయనకు జోడీగా మాళవిక నాయర్, దర్శకునిగా అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ఇలాంటి విజయవంతమైన చిత్రాల నాయకనాయికలు, దర్శకుడుతో పాటు ప్రతిభ కలిగిన సాంకేతిక వర్గంతో మా ఈ చిత్రం నిర్మించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. -
అదే జరిగితే నేను ఫ్లాప్ అయినట్టే: అవసరాల శ్రీనివాస్
Srinivas Avasarala Comments On Nootokka Jillala Andagadu ‘‘నా రచన, నటన, దర్శకత్వం నన్ను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాయి. సినిమాలన్నీ రైటింగ్ అండ్ ఎడిటింగ్ టేబుల్పైనే జరుగుతాయని నా ఫీలింగ్. అందుకే నాకు రచనే సంతృప్తినిస్తుంది. దర్శకత్వం నన్ను ఒత్తిడికి గురి చేస్తుంది’’ అన్నారు రచయిత, నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్. రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వంలో అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ జంటగా నటించిన చిత్రం ‘నూటొక్క జిల్లాల అందగాడు’. ‘దిల్’ రాజు, క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్రెడ్డి, క్రిష్ జాగర్లమూడి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ చిత్రానికి కథ అందించి, హీరోగా నటించిన అవసరాల శ్రీనివాస్ చెప్పిన విశేషాలు. ► హిందీలో వచ్చిన ‘బాల’ చిత్రానికి మా ‘నూటొక్క జిల్లాల అందగాడు’ రీమేక్ కాదు. 2019 అక్టోబరులో మా సినిమా ఓపెనింగ్ జరిగింది. అప్పటికి ‘బాల’ రాలేదు. తర్వాత ‘బాల’ వస్తుందని తెలిసి వీలైనంత తొందరగా పూర్తి చేసి, ‘బాల’కు పోటీగా ఈ సినిమాను విడుదల చేద్దామనే ప్రయత్నం చేశాం.. కుదర్లేదు. 2020 ఏప్రిల్లో విడుదల చేద్దామనుకుంటే.. మార్చిలోనే లాక్డౌన్ విధించారు. అయితే ‘బాల’ సినిమా ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి మా సినిమాలో ఏమైనా మార్పులు అవసరం అవుతాయా? అని నేనా సినిమా చూశాను. మార్పులేవీ అవసరం లేదనిపించింది. మా సినిమా కథ వేరేలా ఉంటుంది. ► పక్కవారిలో ఏదైనా లోపం ఉంటే దాన్ని ఎత్తి చూపిస్తూ కొందరు కామెడీగా, హేళనగా మాట్లాడుతుంటారు. దీనివల్ల ఆల్రెడీ తాము బాగోలేమనే ఆత్మన్యూనతాభావంలో ఉన్నవారి ఆత్మవిశ్వాసం మరింత దెబ్బ తింటుంది. ఇలాంటి ఓ అంశం ఆధారంగా సినిమా చేసే ఆలోచన ఉందని క్రిష్గారితో చెబితే ఐడియా బాగుందన్నారు. ఇది ఎమోషన్తో కూడిన హ్యూమర్ మూవీ. ఇలాంటి కామెడీ ఎక్కువ కాలం నిలిచిపోతుందన్నది నా నమ్మకం. ► నేను డైరెక్షన్ చేస్తున్న ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’ (వర్కింగ్ టైటిల్) సినిమా యాభై శాతం పూర్తయింది. మిగతా భాగం అమెరికాలో షూట్ చేయాలి. టీమ్కి వీసాలు కావాలి. అందుకు కాస్త ఆలస్యం అవుతుంది. ఈ లోపు ఓ సినిమా చేద్దామని ‘నూటొక్క జిల్లాల..’లో నటించాను. నా డైరెక్షన్లో ఓ సినిమా సెట్స్పై ఉన్నప్పుడు మరో సినిమాకు నేను దర్శకత్వం వహించడం నాకు కరెక్ట్ కాదనిపించింది. అందుకే నా అసోసియేట్ డైరెక్టర్ విద్యాసాగర్ ‘నూటొక్క జిల్లాలకు..’ డైరెక్షన్ చేస్తే బాగుంటుందని నిర్మాతలతో చెప్పాను. ► ఒక్క సినిమాతో ప్రపంచంలో సమస్యలు పరిష్కారం కావు. సందేశం ఇవ్వాలని ఈ సినిమా చేయలేదు. అయితే ఎవరికైనా సందేశంలా అనిపిస్తే ఓకే. ఎవర్నీ కించపరచాలనో, అవహేళన చేయాలనో ఈ సినిమా తీయలేదు. నిజంగా మా సినిమాలోని సన్నివేశాలు, హ్యూమర్ ఎవరి మనోభావాలను అయినా దెబ్బతీసినట్లయితే.. ఒకవేళ సినిమా సక్సెస్ అయినా కూడా నేను ఫ్లాప్ అయినట్లే. ఏ పాయింట్ని అయినా కాస్త నవ్విస్తూ చెబితే ప్రేక్షకులకు బాగా రీచ్ అవుతుందని నా నమ్మకం. ► నా కెరీర్ గురించి నాకు కంగారు లేదు. నా సినిమా కథలను నేనే రాసుకుంటున్నా. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా రాయడానికి మూడేళ్లు పట్టింది. ‘జో అచ్యుతానంద’ చిత్రాన్ని రెండేళ్లల్లో రాశాను. ఆ నెక్ట్స్ సినిమాకి రెండేళ్లు పట్టింది. ఈ కథ నాది కాదనే ఫీలింగ్ ఉంటే ఆ సినిమాకు నేను డైరెక్షన్ చేయలేను. ► యాక్టర్గా నన్ను నేను భిన్నమైన పాత్రల్లో చూడాలనుకుంటాను. అందుకే ‘జెంటిల్మేన్’లో విలన్గా చేశా. అలాగే బాగా నచ్చి చేసిన ‘బాబు బాగా బిజీ’ ఆడకపోయినా చేసినందుకు రిగ్రేట్ ఫీల్ కావడం లేదు. ► నేను రాసిన కథలకు ఇప్పటివరకు ఏ ప్రాబ్లమ్ రాలేదు. హింసాత్మక చిత్రాలు నాకు పెద్దగా నచ్చవు. ఇప్పట్నుంచి ఎక్కువగా రచన, దర్శకత్వంపైనే ఫోకస్ పెడదామని అనుకుంటున్నాను. ఓటీటీలో నిత్యా మీనన్ లీడ్ రోల్ చేయనున్న ‘కుమారి శ్రీమతి’ అనే షోకి రన్నర్గా చేయనున్నాను. -
సైకో పాత్ర చేయాలని ఉంది: హీరోయిన్
‘‘మనకు బాహ్యసౌందర్యం మాత్రమే ముఖ్యం కాదు.. మన అంతర్గత వ్యక్తిత్వం, స్వభావం కూడా ఉన్నతంగా ఉండాలి. మనల్ని మనంగా ఒప్పుకునే తత్వమే అందం’’ అన్నారు రుహానీ శర్మ. అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ జంటగా రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. ఈ సినిమా సెప్టెంబరు 3న విడుదల కానుంది. (చదవండి: టాలీవుడ్ డ్రగ్ కేసు: ముగిసిన పూరి జగన్నాథ్ విచారణ) ఈ సందర్భంగా రుహానీ శర్మ మాట్లాడుతూ – ‘‘బట్టతల ఉన్న ఓ యువకుడు తనను తాను ఇష్టపడడు. కానీ ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. తన ప్రేమను గెలిపించుకోవడానికి అతను ఏం చేశాడు? ఫైనల్గా తనను తాను ఎలా ప్రేమించుకున్నాడు? అన్నదే కథ. శ్రీని (అవసరాల శ్రీనివాస్) బ్రిలియంట్ డైరెక్టర్, యాక్టర్ అండ్ రైటర్. లవ్లీ కోస్టార్. డైరెక్టర్ విద్యాసాగర్ బాగా హెల్ప్ చేశారు’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘తెరపై ఎంతసేపు కనపడతామన్నది నాకు ముఖ్యం కాదు. పాత్ర ప్రాధాన్యం ముఖ్యం. హిందీ, మలయాళం, తమిళ భాషల్లోనూ సినిమాలు చేస్తున్నాను. అయితే ఎక్కువ ఫోకస్ తెలుగు చిత్రాలపైనే. నాని నిర్మిస్తున్న ‘మీట్ క్యూట్’ ఆంథాలజీలో సత్యారాజ్తో కలిసి ఓ భాగంలో యాక్ట్ చేశాను. తెలుగులోనే మరో ఆంథాలజీలో కూడా నటించాను. వ్యక్తిగతంగా నాకు లవ్స్టోరీలు, సైకో థ్రిల్లర్స్ ఇష్టం. సైకో పాత్రలో నటించాలని ఉంది’’ అన్నారు రుహాని. -
ఈ నటుడు '101 జిల్లాలకు అందగాడు'
నటుడిగా, దర్శకుడి గుర్తింపు పొందిన అవసరాల శ్రీనివాస్ ఇప్పుడు కథానాయకుడిగానూ అలరించేందుకు రెడీ అవుతున్నారు. అవసరాల శ్రీనివాస్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’ రిలీజ్కు రెడీ అయ్యింది. ఆగస్ట్ 27న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఎస్వీసీ-ఎఫ్ఈఈ బ్యానర్స్పై ‘దిల్’ రాజు, డైరెక్టర్ క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మించారు. బట్టతల ఉండే యువకుడి పాత్రలో అవసరాల నటించగా, ఆయన ప్రేయసి పాత్రలో రుహానీ శర్మ నటించారు. శక్తికాంత్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. -
101 జిల్లాల అందగాడు: నిజాన్ని దాచేస్తే..!
అవసరాల శ్రీనివాస్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. రాచకొండ విద్యాసాగర్ దర్శకుడు. రుహానీ శర్మ కథానాయికగా నటించారు. ‘దిల్’ రాజు, డైరెక్టర్ క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘మనసా వినవా..’ అనే పాట బుధవారం విడుదలయింది. ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, శ్రీరామచంద్ర, ధన్య బాలకృష్ణ పాడారు. రచయిత భాస్కర భట్ల మాట్లాడుతూ– ‘‘ప్రేమలో నిజాయతీ ఉండాలనుకునే అమ్మాయి... దొరక్క దొరికిన ప్రేమను, ప్రేయసిని వదులుకోకూడదనుకునే యువకుడు కొన్ని నిజాలను దాస్తాడు. ఆ నిజం బయటపడితే వారి ప్రేమలో ఎలాంటి పరీక్షలు ఎదురవుతాయి? వారి మధ్య ఊసులు కరువై ఊహలే ఊసులైన వేళ ఎలా ఉంటుంది? తన ప్రేమలో నిజాయతీ ఉందని, తాను ఊరకనే మోసం చేయలేదని ప్రేమికుడు.. తెలిసి నిజాన్ని దాచి పెట్టడం తప్పు అనే ప్రేయసి పాడుకునే పాట ‘మనసా వినవా..’’ అన్నారు. చదవండి: వైరల్: కూతుర్ని గుండెలపై ఎక్కించుకున్న అల్లు అర్జున్ -
అవసరాల శ్రీనివాస్ బట్టతల వీడియో.. అసలు విషయం ఇదే!
రెండు రోజుల నుంచి నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్కు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతున్న విషయం తెలిసిందే. అతని దగ్గర మూడేళ్లుగా పనిచేస్తున్న కోడైరెక్టర్ మహేశ్ ఓ వీడియో బయటపెట్టడం చర్చనీయాంశంగా మారింది. అవసరాల శ్రీనివాస్కు మహేశ్ మధ్య గొడవలు రావడంతో అతన్ని తిట్టి ఆఫీస్ నుంచి బయటకు పంపించేశాడు. దీంతో శ్రీనివాస్పై కక్ష పెంచుకున్న మహేశ్.. అతని ఆఫీస్కి వెళ్లి నానా హంగామా చేశాడు. అవసరాల నిజస్వరూపాన్ని అందరికీ చూపిస్తానంటూ.. ఫొటో షూట్ చేయించుకుంటున్న అవసరాల దగ్గరకు వెళ్లి, నన్నెందుకు తిట్టావ్ అని ప్రశ్నిస్తూ వీడియో రికార్డింగ్ చేశాడు. వీడియో బయటకెళ్తే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని అవసరాల శ్రీనివాస్, మహేష్ కు వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే మహేష్ ఫొటో షూట్ చేయించుకుంటున్న అవసరాల శ్రీనివాస్ క్యాప్ను తీసేయగా.. అతను బట్టతలతో కనిపించడం నెటిజన్లకు షాక్ ఇచ్చింది. అయితే ఈ వీడియో చూసి ఎంతో మంది షాక్కు గురవ్వగా.. కొంతమంది సందేహం వ్యక్తం చేశారు. ఇది నిజంగానే జరిగిందా లేక సినిమా ప్రమోషన్ కోసమా అనే కన్ఫ్యూజన్లో ఉండిపోయారు. తాజాగా, ఆ సందేహాలే నిజమనేలా అవసరాలకు సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది. అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న చిత్రం.. ‘నూటొక్క జిల్లాల అందగాడు’. ఈ సినిమా పోస్టర్ను తాజాగా విడుదల చేసింది చిత్రయూనిట్. త్వరలో టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొన్న ఈ పోస్టర్ను చూసిన ఎవరికైనా బట్టతల వీడియోపై స్పష్టత వచ్చేస్తుంది. ఇందులో రెండు విభన్నగెటప్లో ఉన్న అవసరాల శ్రీనివాస్.. ఒక ఫ్రేమ్లో పూర్తి జుట్టుతో చేతిలో బట్టతలతో ఉన్న బొమ్మను పట్టుకొని ఉండగా. మరోపక్క బట్టతలతో ఉండి చేతిలో జుట్టున్న బొమ్మను పట్టుకొని కనిపిస్తున్నాడు. దీంతో బట్టతల వీడియో సినిమా ప్రమోషన్కు అని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో అవసరాల గొత్తి సూర్యనారాయణగా అలరించనున్నాడు. వైవిధ్యమైన కథాంశంతో ఫన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తానే స్వయంగా కథ రాసుకున్నాడు. చి.ల.సౌ ఫేమ్ రుహనీ శర్మ హీరోయిన్గా నటిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. రామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి స్వీకార్ అగస్తి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను త్వరలోనే విడుదల చేసేందుకు నిర్మాత దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నారు. చదవండి: షాకింగ్ వీడియో.. అవసరాల శ్రీనివాస్ గుట్టు రట్టు! తను నాతో ఎక్కువ టైం ఉండట్లేదు..: కాజల్ Introducing GSN - గొత్తి సూర్యనారాయణ! #101JAFirstLook#GottiSuryaNarayana from #NootokkaJillalaAndagadu. Teaser Coming Soon!#SrinivasAvasarala @iRuhaniSharma #SagarRachakonda #DilRaju @DirKrish #Shirish @YRajeevReddy1 #JSaiBabu @SVC_official @FirstFrame_Ent @MangoMusicLabel pic.twitter.com/eZKSGjccnU — BARaju (@baraju_SuperHit) March 25, 2021 -
షాకింగ్ వీడియో.. అవసరాల శ్రీనివాస్ గుట్టు రట్టు!
నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్కు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతని దగ్గర మూడేళ్లుగా పనిచేస్తున్న కోడైరెక్టర్ మహేశ్ ఈ వీడియో బయటపెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మహేశ్కి శ్రీనివాస్కి మధ్య గొడవలు రావడంతో అతన్ని తిట్టి ఆఫీస్ నుంచి గెంటేశాడు. దీంతో కక్ష పెంచుకున్న మహేశ్.. శ్రీనివాస్ ఆఫీస్కి వెళ్లి రచ్చ రచ్చ చేశాడు. అవసరాల శ్రీనివాస్ నిజస్వరూపం బయటపెడతానంటూ అతని ఒరిజినల్ ఫేస్ చూపించి షాకిచ్చాడు. సినిమాల్లో ఉంగరాల జట్టుతో అందంగా కనిపించే శ్రీనివాస్కు బట్టతల ఉంది. ఈ విషయాన్ని మహేశ్ బహిర్గతం చేసే వరకు ఎవరికీ తెలియదు. వీడియోలో మహేశ్ ఏమన్నారంటే.. ‘అందరికీ ఒక విషయం చెప్పాలని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా.. ఇండస్ట్రీలో అవసరాల శ్రీనివాస్ అనే ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్ ఉన్నాడుగా.. అతని దగ్గర నేను గత మూడేళ్లుగా పనిచేస్తున్నాను. నేను ఎలాంటి తప్పు చేయకపోయినా.. ఈరోజు నన్ను అందరి ముందు నిలబెట్టి తిట్టి ఆఫీస్ నుంచి బయటకు పంపించేశాడు. ఒక్క రీజన్ కూడా లేదు. అతని నిజస్వరూపం మీకు చూపిస్తా చూడండి’ అంటూ ఫోటో షూట్లో ఉన్న శ్రీనివాస్ దగ్గరకు వెళ్లి తలపై ఉన్న క్యాప్ని బలవంతంగా తీసేశాడు. క్యాప్ తీయడంతో శ్రీనివాస్ బట్టతల బయటపడింది. దీంతో ఆగ్రహానికి లోనైన శ్రీనివాస్.. మహేశ్ని బూతులు తిడుతూ.. ఈ వీడియో బయటకు వెళ్తే.. నిన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తా అంటూ బెదిరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది సినిమా ప్రమోషన్ కోసమే చేసి ఉండొచ్చని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చదవండి: అల్లు అర్జున్ కొత్త బిజినెస్: మహేష్కు పోటీగా! చాన్స్ కోసం నిర్మాత గదిలోకి వెళ్లమన్నారు: నటి -
వారిద్దరూ జంటగా '101 జిల్లాల అందగాడు'
అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ జంటగా తెరకెక్కిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. ఈ సినిమాతో రాచకొండ విద్యాసాగర్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. నిర్మాత ‘దిల్’ రాజు, డైరెక్టర్ క్రిష్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్స్పై శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ సినిమాను మే 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు కామెడీ పంచ్లతో ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా మంచి ఎంటర్టైనింగ్ కథను అందించారు అవసరాల శ్రీనివాస్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: రామ్, సంగీతం: శక్తికాంత్ కార్తీక్. -
50 శాతం పూర్తి.. వీసా కోసం వెయిటింగ్
కమెడియన్గా ఎంట్రీ ఇచ్చి తరువాత దర్శకుడిగా మారిన యువ నటుడు అవసరాల శ్రీనివాస్. అష్టా చమ్మా సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన అవసరాల కొద్ది రోజుల్లోనే ఊహలు గుస గుసలాడే సినిమాతో దర్శకుడిగా మారాడు. రెండో ప్రయత్నంగా జ్యో అచ్చుతానంద సినిమా డైరెక్ట్ చేసిన అవసరాల శ్రీనివాస్ లాంగ్ గ్యాప్ తర్వాత యంగ్ హీరో నాగశౌర్యతో మరో సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఆగిపోయిందంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అనేకవార్తలు వస్తున్నాయి. బడ్జెట్ పెరిగిపోవడం, ఇప్పటివరకు వచ్చిన అవుట్పుట్పై దర్శకనిర్మాతలు అసంతృప్తిగా ఉండటంతో సినిమాను ఆపేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తమ అధికారిక ట్విటర్ ద్వారా స్పందించింది. ‘నాగశౌర్య, అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్ర షూటింగ్ 50 శాతం పూర్తయింది. చాలా అద్భుతంగా సినిమా రూపొందుతోంది. మిగతా షూటింగ్ యూఎస్ఏలో ప్లాన్ చేశాం. వీసాల కోసం వేచి చూస్తున్నాం. యూఎస్ఏ షెడ్యూల్ కూడా త్వరగానే పూర్తిచేస్తాం. ఈ సినిమా ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలు నిరాధారమైనవి. పుకార్లను నమ్మకండి’అంటూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, నిర్మాత వివేక్ కూచిభొట్ల ట్వీట్ చేశారు. ఇక అశ్వథ్థామతో హిట్ ట్రాక్లో వచ్చిన యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలో జోరుపెంచాడు. అవసరాల శ్రీనివాస్తో ఓ సినిమా రూపొందుతుండగానే.. లక్ష్మీసౌజన్య అనే కొత్త దర్శకురాలితో మరో సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. చదవండి: ‘అశ్వథ్థామ’ మూవీ రివ్యూ 'ముద్దు సన్నివేశం నాకు తెలియకుండానే తీశారు' -
నూటొక్క జిల్లాలకే అందగాడు
ఒక వ్యక్తి బాగా అందంగా ఉంటే నూటొక్క జిల్లాల అందగాడు అని సంబోధిస్తారు. అప్పట్లో నూతన్ ప్రసాద్ని అలా పిలిచేవారు. ఇప్పుడు తాజా సినిమా కోసం అవసరాల శ్రీనివాస్ నూటొక్క జిల్లాల అందగాడిగా మారనున్నారు. అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ జంటగా తెరకెక్కనున్న చిత్రం ‘నూటొక్క జిల్లాల అందగాడు’. ‘దిల్’ రాజు, దర్శకుడు క్రిష్ సంయుక్తంగా ఈ సినిమాను సమర్పించడం విశేషం. శిరీష్, రాజీవ్రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. సాగర్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం శనివారం జరిగింది. ఈ చిత్రానికి రచయిత: అవసరాల శ్రీనివాస్, సంగీతం: స్వీకార్ అగస్తీ. -
వెనక్కి వెళ్లేది లేదు
‘‘హీరోతో పోలిస్తే ఎడిటర్ జాబ్ కొంచెం సులభం అని నా అభిప్రాయం. ఎడిటర్గా ఒక చోట కూర్చుని మన పని మనం చేసుకోవచ్చు. కానీ హీరోగా ఉండటం కష్టం. ప్రేక్షకులు, మీడియా ఫోకస్ అంతా నటులపైనే ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం? మన యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ అన్నీ గమనిస్తూనే ఉంటారు’’ అన్నారు నవీన్ విజయకృష్ణ. ఎడిటర్ నుంచి హీరోగా మారిన నవీన్.. సీనియర్ నటుడు నరేశ్ తనయుడనే విషయం తెలిసిందే. బాలాజీ సనాల దర్శకత్వంలో నవీన్ విజయ కృష్ణ, శ్రీనివాస్ అవసరాల, మేఘా చౌదరి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పీఎల్ఎన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ– ‘‘నాకు 16ఏళ్ల వయసులో రానా వాళ్ల యాడ్ కంపెనీలో చేరాను. నా ఎడిటింగ్ స్కిల్స్ చూసి కృష్ణవంశీగారు ‘డేంజర్’ సినిమాకు అవకాశం ఇచ్చారు. ‘రాఖీ, చందమామ’ మరికొన్ని సినిమాలకు ఎడిటర్గా పని చేశాను. ఆ తర్వాత హీరోగా మారాలనుకున్నప్పుడు మా నాన్నగారు కష్టం అన్నారు. దానికి కారణం నేను చాలా లావుగా ఉండేవాణ్ణి. శ్రమించి బరువు తగ్గాను. నా కెరీర్కు సంబంధించిన ప్రతి విషయం నాన్నగారితో చర్చించి, ఆయన్ను ఇబ్బంది పెట్టను. కానీ నాన్న విలువైన సలహాలు ఇస్తుంటారు. మహేశ్ అన్న కూడా బాగా సపోర్ట్ చేస్తారు. ప్రతీ సినిమా ఫంక్షన్కు ఆయన్ను పిలవడం కరెక్ట్ కాదు. 16 ఏళ్లకు ఎడిటింగ్ మొదలుపెట్టాను. 32 ఏళ్లకు హీరోగా మారాను. ఈ సినిమా విషయానికి వస్తే ప్రేక్షకుడి దృష్టిలో పడాలంటే టైటిల్ భిన్నంగా ఉండాలి. అందుకే ‘ఊరంతా అనుకుంటున్నారు’ అనే టైటిల్ పెట్టాం. రెండు జంటల ప్రేమ, వాళ్ల ఊరి కట్టుబాట్లకు మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా. మళ్లీ ఎడిటింగ్ వైపు వెనక్కి వెళ్లను. భవిష్యత్తులో దర్శకత్వం చేసే ఆలోచ నలు ఉన్నాయి’’ అన్నారు. -
ఆగస్ట్ 9న అనసూయ ‘కథనం’
అనసూయ ప్రధాన పాత్రలో రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కథనం’. ఈ సినిమాను ది గాయత్రి ఫిల్మ్స్ , ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై బి.నరేంద్రరెడ్డి, శర్మచుక్కా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రోషన్ సాలూరి సంగీతం సమకూరుస్తుండగా, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్, రణధీర్, ధన్రాజ్, వెన్నెలకిషోర్, పెళ్లి పృధ్వీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చెసుకున్న ఈ మూవీ ఆగస్టులో విడుదలకు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాల గురించి నిర్మాత నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ... ‘అనసూయగారు ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన చిత్రమిది. ఆవిడ కెరీర్లో ఇదొక బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకం ఉంది. సెన్సార్ పూర్తయింది. యు/ఎ సర్టిఫికేట్ లభించింది. సెన్సార్ సభ్యుల ప్రశంసలు లభించాయి. ఆగస్ట్ 9న సినిమా విడుదల చేస్తున్నాం’ అన్నారు. దర్శకుడు రాజేష్ నాదెండ్ల మాట్లాడుతూ... ‘ఇది నా మొదటి చిత్రం.. క్షణం, రంగస్థలం తర్వాత అనసూయ చేస్తున్న ఈ కథనం సినిమాతో హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. తప్పకుండ ఆమె తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. నరేంద్రరెడ్డిగారు పంపిణీదారునిగా ఏ సినిమా చేసిన హిట్. నిర్మాతగా కూడా సక్సెస్ అవుతారన్నారన్న నమ్మకం ఉంది’ అన్నారు. -
విలువలు.. బంధాలు.. వెటకారం
నవీన్ విజయకృష్ణ, శ్రీనివాస్ అవసరాల, మేఘా చౌదరి, సోఫియా సింగ్ హీరో హీరోయిన్లుగా బాలాజి సానల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.ఎన్. రెడ్డి, ఎ. పద్మనాభరెడ్డి నిర్మించారు. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, హీరో సాయిధరమ్ తేజ్ ముఖ్య అతిథులుగా హాజరై ఈ చిత్రం టీజర్ను విడుదల చేశారు. ఇంద్రగంటి మాట్లాడుతూ– ‘‘నవీన్ మంచి నటుడే కాదు బ్రిలియంట్ ఎడిటర్ కూడా. ఈ సినిమా పోస్టర్ చూస్తుంటే నాకు ‘అష్టా చమ్మా’ రోజులు గుర్తుకు వస్తున్నాయి. పల్లెటూరి ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న ఈ సినిమా టీమ్కి ఆల్ ది బెస్ట్. రాధాకృష్ణన్ మంచి సంగీతం ఇచ్చారు. నిర్మాత శ్రీహరిగారు మూడు పాటలు రాశారని తెలిసింది’’ అన్నారు. ‘‘నవీన్ మా ఫ్యామిలీ మెంబర్లాంటి వాడు. నేను లో ఫేజ్లో ఉన్నప్పుడు నాకో పిల్లర్లా ఉన్నాడు. మంచి సినిమా చేశారు. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు సాయిధరమ్ తేజ్. ‘‘ఈ సినిమా నాకు ఆశీర్వాదంలా వచ్చింది. ఒక కుటుంబంలా కలిసి ఈ సినిమా చేశాం’’ అన్నారు నవీన్. ‘‘నవీన్, అవసరాల ఇద్దరూ బాగా నటించారు. బాబు కెమెరా వర్క్, రాధాకృష్ణన్ సంగీతం ఓ ఆకర్షణ’’ అన్నారు బాలాజి. ‘‘నవీన్తో వర్క్ చేయడం హ్యాపీ. ప్రేక్షకులు మంచి సంగీతాన్ని ఆస్వాదిస్తారు’’ అన్నారు రాధాకృష్ణన్. ‘‘మంచి సినిమా చేసే అవకాశం వచ్చింది’’ అన్నారు శ్రీహరి. ‘‘పల్లెటూరి విలువలు, బంధాలు, వెటకారం ఇలా అన్ని అంశాలను సినిమాలో వడ్డించాం’’ అన్నారు నిర్మాత పద్మనాభరెడ్డి. ‘‘బాలాజీ గొప్ప దర్శకుడు అవుతాడు’’ అన్నారు పి.ఎల్.ఎన్ రెడ్డి. -
మరో ఇంట్రస్టింగ్ టైటిల్తో అవసరాల
కమెడియన్గా ఎంట్రీ ఇచ్చి తరువాత దర్శకుడిగా మారిన యువ నటుడు అవసరాల శ్రీనివాస్. అష్టా చమ్మా సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన అవసరాల కొద్ది రోజుల్లోనే ఊహలు గుస గుసలాడే సినిమాతో దర్శకుడిగా మారాడు. రెండో ప్రయత్నంగా జ్యో అచ్చుతానంద సినిమా డైరెక్ట్ చేసిన అవసరాల శ్రీనివాస్ లాంగ్ గ్యాప్ తరువాత మూడో సినిమాకు రెడీ అవుతున్నాడు. నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కూడా తన మార్క్ ఇంట్రస్టింగ్ టైటిల్ను ఫిక్స్ చేశాడు. అచ్చమైన తెలుగు టైటిల్స్ను ఎంచుకున్న ఈ యువ దర్శకుడు తదుపరి చిత్రాన్ని పలానా అబ్బాయి.. పలానా అమ్మాయి అనే టైటిల్ను ఫిక్స్ చేశాడు. ఈ సినిమాలో నాగశౌర్యకు జోడిగా మాళవిక నాయర్ నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. -
లక్కీ హ్యాండ్
అనసూయ ప్రధాన పాత్రలో రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కథనం’. అవసరాల శ్రీనివాస్, రణధీర్, ధన్రాజ్, ‘వెన్నెల’ కిషోర్, ‘పెళ్లి’ పృథ్వీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్, ది గాయత్రి ఫిల్మ్స్ పతాకాలపై బట్టేపాటి నరేంద్ర రెడ్డి, శర్మ చుక్కా నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ని హీరో రామ్చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల విడుదల చేశారు. రాజేష్ నాదెండ్ల మాట్లాడుతూ– ‘‘క్షణం, రంగస్థలం’ తర్వాత అనసూయగారు ‘కథనం’ సినిమాతో హ్యాట్రిక్ సాధించబోతున్నారు. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. నరేంద్రరెడ్డిగారు పంపిణీదారునిగా ఏ సినిమా చేసినా హిట్. ఆయనది లక్కీ హ్యాండ్’’ అన్నారు. ‘‘అనసూయగారి కెరీర్లో ఇదొక బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నరేంద్ర రెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: సతీష్ ముత్యాల, లైన్ ప్రొడ్యుసర్: ఎమ్. విజయ చౌదరి. -
వెబ్ లక్ష్మీ
‘‘మిసెస్. సుబ్బలక్ష్మి’ కథను రమణీగారు నా దగ్గరకు తీసుకొచ్చారు. నాకు చాలా బాగా నచ్చింది. సినిమాగా చేద్దాం అనుకున్నాం. కానీ వెబ్ సిరీస్గా తీసుకొస్తున్నాం. ఇదో ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ íసిరీస్కి స్త్రీలు, పురుషులు అందరూ సమానంగా కనెక్ట్ అవుతారు’’ అని లక్ష్మీ మంచు అన్నారు. లక్ష్మీ మంచు, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు వంశీ కృష్ణ రూపొందించిన వెబ్ సిరీస్ ‘మిసెస్. సుబ్బలక్ష్మి’. రచయిత్రి బలభద్రపాత్రుని రమణి కథను అందించారు. ‘రావల్సినంత ప్రేమ, గుర్తింపు రావడంలేదని, తన లోటు భర్తకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇంట్లో నుంచి చెప్పకుండా వచ్చిన భార్య ప్రయాణంతో సాగే కథే ‘మిసెస్. సుబ్బలక్ష్మి’. ఉమెన్స్ డే సందర్భంగా పది ఎపిసోడ్లు ఉన్న ఈ వెబ్ సిరీస్ ‘జీ5’ డిజిటల్ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో లక్ష్మీ మంచు మాట్లాడుతూ – ‘‘ సినిమా తీయడానికి సుమారు 150 మంది చాలా కష్టపడతాం. అది పూర్తయి థియేటర్కు వెళ్లేటప్పుడు భయమేస్తుంది. ఆ సినిమాను ఆడనిస్తారా? కొత్త సినిమా వస్తుందని తీసేస్తారా? తెలియదు. ఎందుకంటే సినిమా థియేటర్లు కొంతమంది ఆధీనంలోనే ఉంటున్నాయి. డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఆడియన్స్కు కావల్సిన వినోదాన్ని అందించవచ్చు. ఎలాంటి ప్రయోగం అయినా చేయొచ్చు. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ను ఇంట్లోనే ఇస్తున్నాం. వంశీ కృష్ణ మంచి సహకారం అందించాడు. వెబ్ సిరీస్లలో ఇది ఒక బెంచ్మార్క్ అవుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు. ‘‘మంచు లక్ష్మిగారు చాలా రోజులుగా ఈ వెబ్ సిరీస్తో ట్రావెల్ అవుతున్నారు. ఈ సిరీస్ని అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాం’’ అన్నారు వంశీకృష్ణ. ‘‘అనుకున్న పాయింట్ను సరదాగా చెప్పాం. సీక్వెల్ ప్లాన్ కూడా ఉంది’’ అన్నారు బలభద్రపాత్రుని రమణి. -
హ్యాట్రిక్ లక్ష్యంగా!
నాగశౌర్య హీరోగా దర్శక నటుడు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పుడు వీరిద్దరు హ్యాట్రిక్ పై గురిపెట్టారు. అవును... నాగశౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తాజాగా ఓ సినిమా రూపొందనుంది. ఇందులో మాళవికా నాయర్ కథానాయికగా నటిస్తారు. నాగశౌర్య, మాళవిక జంటగా ‘కల్యాణ వైభోగమే’లో నటించిన విషయం తెలిసిందే. తాజాచిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, దాసరి పద్మజ నిర్మిస్తారు. వివేక్ కూచిభొట్ల సహనిర్మాత. ఇక తాజా సినిమా షూటింగ్ ఈనెల రెండో వారంలో స్టార్ట్ కానుంది. -
‘ఎన్ఆర్ఐ’ షూటింగ్ ప్రారంభం
-
‘ఎన్ఆర్ఐ’ని క్లాప్ కొట్టి ప్రారంభించిన అమల
అవసరాల శ్రీనివాస్.. నటుడిగా, దర్శకుడిగా, హీరోగానూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు. తాజాగా ఆయన హీరోగా తెరకెక్కుతున్న నాయనా రారా ఇంటికి (ఎన్ఆర్ఐ) చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు హాజరయ్యారు. అక్కినేని అమల క్లాప్ కొట్టి మూవీ షూటింగ్ను ప్రారంభించారు. ఈ చిత్రంలో మంచు లక్ష్మీ, మహతి కథానాయికలుగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగిన ఈ ఈవెంట్కు నాని, అక్కినేని అఖిల్, సిరివెన్నెల సీతారామశాస్త్రిలాంటి ప్రముఖులు హాజరయ్యారు. పూర్తి హాస్యభరితంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగబాబు ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అవసరాల హీరోగా.. ‘ఎన్నారై’
దర్శకుడిగానే కాకుండా.. మంచి నటుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నారు అవసరాల శ్రీనివాస్. తాజాగా అవసరాల శ్రీనివాస్.. హీరోగా ఓ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్డేట్ను ప్రకటించారు. నాగబాబు, మంచు లక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 20న ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. 'నాయనా ..! రారా ఇంటికి'( ఎన్ ఆర్ ఐ) అనే టైటిల్తో రాబోతోన్న ఈ చిత్రం.. బుధవారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకి, హైదరాబాద్ - అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభం కానున్నట్లు తెలిపారు. -
నవీన్లో మంచి ఈజ్ ఉంది
‘‘టైటిల్ బావుంటే సినిమా సగం సక్సెస్ అయినట్టే. ‘ఊరంతా అనుకుంటున్నారు’ అనే టైటిల్లో నేటివిటీ ఉంది. ఇంగ్లీష్ టైటిల్స్ ఎక్కువ వస్తున్న టైమ్లో ఇలాంటి టైటిల్తో రావడం బాగుంది’’ అని సూపర్స్టార్ కృష్ణ అన్నారు. నవీన్ విజయ్కృష్ణ, అవసరాల శ్రీనివాస్ హీరోలుగా బాలాజి సానల తెరకెక్కించిన చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. మేఘా చౌదరి, సోఫియా సింగ్ కథానాయికలు. శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.యల్.యన్. రెడ్డి, ఎ. పద్మనాభరెడ్డి నిర్మాతలు. నవీన్ విజయ్కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం టైటిల్ లోగోను కృష్ణ, ఫస్ట్ లుక్ను విజయ నిర్మల రిలీజ్ చేశారు. నవీన్ లుక్ టీజర్ను నరేశ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ – ‘‘నవీన్ చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలో పెరిగాడు. తనలో మంచి ఈజ్ ఉంది. పాటలు, ఫైట్లు బాగా చేస్తున్నాడు. ఆర్టిస్ట్గా మంచి భవిష్యత్తు ఉంది. కథ బావుందని నరేశ్ అన్నాడంటే సినిమాలో విషయం ఉన్నట్టే. ఈ చిత్రం విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘నందిని నర్సింగ్ హోమ్’ నవీన్కు హీరోగా మంచి పేరు తెచ్చింది. ఆర్టిస్ట్గా నిలదొక్కుకోవాలన్నది అతని తాపత్రయం. నేను బాగున్నాయి అన్న సినిమాలు 99 శాతం ఫెయిల్ అవ్వలేదు’’ అన్నారు నరేశ్. ‘‘ఈ సినిమా అంతా పాలకొల్లులో షూట్ చేశాం. అక్కడే సెటిల్ కావాలనిపించేంతగా నచ్చింది’’ అన్నారు నవీన్. ‘‘గ్రామీణ నేపథ్యంలో అందంగా సాగే సినిమా ఇది. విలేజ్ బాయ్గా నవీన్ మెప్పిస్తాడు. నవీన్లోని పలు షేడ్స్ ఇందులో కనిపిస్తాయి’’ అన్నారు నిర్మాతలు. -
వారాహి బ్యానర్లో నిఖిల్, అవసరాల..?
హాస్యనటుడిగా ఎంట్రీ ఇచ్చిన అవసరాల శ్రీనివాస్ తరువాత దర్శకుడిగానూ సత్తా చాటారు. ఊహలు గుసగుసలాడే, జ్యోఅచ్చుతానంద సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్ దర్శకుడిగా తన మూడో చిత్రాన్ని కూడా వారాహి బ్యానర్లోనే చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్లో నిఖిల్ హీరోగా నటించనున్నారట. ముందుగా ఈ ప్రాజెక్ట్ను నాగశౌర్య హీరోగా తెరకెక్కించాలని భావించినా నాగశౌర్య సొంత సినిమాలతో బిజీ కావటంతో నిఖిల్ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. నిఖిల్ ప్రస్తుతం తమిళ సూపర్హిట్ కనితన్కు రీమేక్గా తెరకెక్కుతున్న ముద్ర సినిమాలో నటిస్తున్నాడు. టీఎన్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్నారు. -
నాగశౌర్యతో అవసరాల మరో సినిమా?
నాగశౌర్యను హీరోగా విజయాన్ని అందించిన తొలి దర్శకుడు అవసరాల శ్రీనివాసే. ఊహలు గుసగుసలాడే సినిమా విజయం సాధించడంతో హీరో నాగశౌర్యకు, డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్కు మంచి గుర్తింపు లభించింది. తరువాత నాగశౌర్య హీరోగా దిక్కులు చూడకు రామయ్య, ఛలో వంటి హిట్లు అందుకున్నారు. రెండో ప్రయత్నంగా జో అచ్యుతానంద సినిమాను డైరెక్ట్ చేసిన అవసరాల నాగశౌర్యకు మరో హిట్ను అంధించారు. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుందన్న టాక్ వినిపిస్తోంది. ఫారిన్ బ్యాక్డ్రాప్లో నాగశౌర్య హీరోగా ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ను తెరకెక్కించేందుక అవసరాల శ్రీనివాస్ రెడీ అవుతున్నాడట. ఈ సినిమాను వారాహి సంస్థ నిర్మించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై నిర్మాతల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదలకాలేదు. -
మహానటి : కేవీ రెడ్డి, ఎల్వీ ప్రసాద్ల ప్రోమోలు విడుదల
-
‘మహానటి’లో కేవీ రెడ్డి, ఎల్వీ ప్రసాద్..!
టాలీవుడ్ తెలుగు ప్రేక్షకుల దాహాన్ని ఈ వేసవిలో తీరుస్తోంది. వరుసగా పర్ఫామెన్స్ ఓరియంటెడ్ మూవీస్ ప్రేక్షకుల మనసులను గెల్చుకుంటున్నాయి. రంగస్థలం, భరత్ అనే నేను, నా పేరు సూర్యలు స్టార్ హీరోల సినిమాలే అయినప్పటికీ నటనా పరంగా అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. కమర్షియల్ హంగులను కూడా జోడిస్తూ తెరకెక్కించిన ఈ సినిమాలు బాక్స్ఫీస్ రికార్డులను పరుగులు పెట్టిస్తున్నాయి. అయితే తెలుగు ప్రేక్షకుల దృష్టి ఇప్పుడు మరొక సినిమాపై ఉంది. ఆ చిత్రమే ‘మహానటి’. ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెండు తరాలకు చాలా దగ్గరైన నటి సావిత్రి. ఒక హీరోయిన్ ఇంత మందికి దగ్గరవ్వడం, అభిమానాన్ని సంపాదించడం, ఇంతటి ఉన్నత స్థానాన్ని అందుకోవటం ఒక్క సావిత్రికే చెల్లింది. ఇంకా సినిమాపై అంచనాలను పెంచేట్టుగా రోజుకో పోస్టర్ను, ఒక్కో పాత్రధారునికి సంబంధించిన లుక్స్ను రిలీజ్ చేస్తున్నారు చిత్రయూనిట్. సావిత్రి జీవితం ఎంతో మంది దిగ్గజాలతో ముడిపడి ఉంటుంది. ఎల్వీ ప్రసాద్, ఎస్వీ రంగారావు, కేవీ రెడ్డి, ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇలా మహామహుల గురించి కూడా ప్రస్థావించాల్సి ఉంటుంది. ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్ బాబు, ఏఎన్నార్ పాత్రలో నాగ చైతన్య నటించిన విషయం తెలిసిందే. తాజాగా కేవీరెడ్డి, ఎల్వీ ప్రసాద్ పాత్రలకు సంబంధించిన ప్రోమో వీడియోలను మహానటి చిత్ర బృంధం విడుదల చేసింది. నాని వాయిస్ఓవర్ ఇస్తూ రిలీజ్చేసిన ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం సాంకేతిక రంగం ఎంతో అభివృద్ధి చెందింది. ఇంట్లోనే ఉండి షూటింగ్ తీసేసి, ప్రపంచంలో ఏ మూలో తీశామని ప్రేక్షకులను నమ్మించవచ్చు. గ్రాఫిక్స్ , విజువల్ఎఫెక్ట్స్ అంటూ సినిమా రూపురేఖలనే మార్చేశాయి. మరి ఇవేవి లేని ఆ కాలంలోనే మాయాబజార్ అంటూ సినిమా తీసి నిజంగానే మాయ చేసేశాడు కేవీ రెడ్డి. తెలుగు సినిమా గురించి చెప్పుకునే ప్రతి సందర్భంలో మాయాబజార్ గురించి చెప్పుకోవాల్సిందే. మాయాబజార్ను తీసిన విధానం, కథనం, పాండవులే లేని మహాభారతాన్ని ఒక్క మాయాబజార్లో చూడగలం. అది కేవీ రెడ్డికే సాధ్యమైంది. అంతటి మేధావి కేవీ రెడ్డి పాత్రను ఈ తరంలో ఎవరు ఉన్నారు అన్న ప్రశ్నకు.. సమాధానం మహానటి డైరెక్టర్ నాగ్అశ్విన్ ఇచ్చేశాడు. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురం సినిమాలతో అభిరుచి గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రిష్ .. కేవీ రెడ్డి పాత్రలో అలరించనున్నారు. ఇప్పుడు రిలీజైన ప్రోమోలో క్రిష్ అచ్చం కేవీ రెడ్డిలానే ఉన్నాడు. తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో పేరు తెచ్చిన మహానుభావుడు ఎల్వీ ప్రసాద్. మొదటి తరం హీరో, కథానాయకుడు, నిర్మాత, దర్శకుడు ఇలా అన్నింట్లో తన సత్తా చాటుకున్నారు ఎల్వీ ప్రసాద్. ఎన్టీఆర్, సావిత్రిని వెండితెరకు పరిచయం చేశారు. మిస్సమ్మగా సావిత్రిని తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. అలాంటి మహానుభావుడి పాత్రను ఈ తరం యువ కథానాయకుడు, రచయిత, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ పోషించారు. నాని వాయిస్ఓవర్ ఇస్తూ విడుదల చేసిన రెండు ప్రోమోలు ప్రస్తుతం వైరల్గా మారాయి. -
మెగా హీరోను లాంచ్ చేయనున్న అవసరాల
విభిన్న దర్శకుడు అవసరాల శ్రీనివాస్ స్టైలే వేరు. ఆ విషయం అతని గత సినిమాలను చూస్తే అర్థమవుతుంది. సినిమా కథను నడిపించే విధానం, కథనం అన్నింట్లోనూ తన మార్క్ కనిపిస్తుంది. డైరెక్టర్గా కొనసాగుతూనే నటుడిగానూ బిజీగా ఉన్నారు అవసరాల శ్రీనివాస్. ప్రస్తుతం అవసరాల మెగా కాంపౌండ్ హీరోతో సినిమాకు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరోను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను అవసరాల శ్రీనివాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. వైష్ణవ్ తేజ్ (సాయి ధరమ్తేజ్ సోదరుడు), అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా పట్టాలెక్కబోతోందని సమాచారం. అవసరాల టాలెంట్పై ఉన్న నమ్మకంతోనే మెగాస్టార్ చిరంజీవి అతనికి అవకాశం ఇచ్చినట్లు మెగా కాంపౌండ్ చెబుతోంది. ఈయన సినిమాలు సగటు ప్రేక్షకుడికి నచ్చుతాయి. రొమాంటిక్ కామెడీలను తెరకెక్కించటంలో తనదైన ముద్ర వేసిన అవసరాల వైష్ణవ్ కోసం ఎలాంటి కథ రెడీ చేస్తున్నాడన్న ఆసక్తి నెలకొంది. అంతేకాదు చిరు చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్( చిరు చిన్న కూతురు శ్రీజ భర్త)తో కూడా అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్లో సినిమా ఉండబోతోందన్న ప్రచారం జరుగుతోంది. -
అందుకే నిర్మాతగా మారా!
‘‘తెలుగులో కొత్త సినిమాలు, కొత్త కథలు రావడం లేదని అందరూ అంటున్నారు. నేనూ అలా అనుకోవడం ఎందుకు? మార్పు నా నుంచే మొదలవ్వాలి. నేనే ముందుగా చేస్తే బాగుంటుంది కదా? అనుకొని ‘అ’ చిత్రం తీశా’’ అని హీరో నాని అన్నారు. కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, రెజీనా, ఈషా, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘అ’. ప్రశాంత్ వర్మను దర్శకునిగా పరిచయం చేస్తూ వాల్ పోస్టర్ సినిమా పతాకంపై హీరో నాని సమర్పణలో టి. ప్రశాంతి నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాని పంచుకున్న విశేషాలు.. ► ప్రశాంత్ వర్మ చెప్పిన కథ చాలా వైవిధ్యంగా ఉంది. తనకు నిర్మాతలు లేరని నేనే ఇద్దరు ముగ్గురు నిర్మాతలకు కథ వినమని చెప్పా. కానీ కమర్షియల్ సినిమాలు తీస్తున్న వారు ఇలాంటి కథ తీసేందుకు ముందుకు రారు. అటువంటప్పుడు ప్రశాంత్ని ఎందుకు నిరుత్సాహపరచడం. పైగా కథ వైవిధ్యంగా ఉంది కాబట్టి నేనే నిర్మిస్తానని చెప్పా. తనకు అవసరమైన నటీనటులు, టెక్నీషియన్స్ని ఇచ్చా. ► హీరోగా కూల్గా ఉంటాను. నిర్మాతగానూ టెన్షన్ లేదు. నిర్మాతగా ‘అ’ సినిమా చూసినప్పుడు నటుడిగా నా తొలి సినిమా ‘అష్టా చమ్మా’ చూసిన ఫీలింగ్ కలిగింది. చాలా హ్యాపీ. అయితే ‘నానీకి ప్రొడక్షన్ అవసరమా?’ అంటారేమో అని చిన్న భయం. టాలీవుడ్కి ‘అ’ లాంటి సినిమాల అవసరం ఉంది. పైగా తెలుగు ప్రేక్షకులు ఇలాంటి కొత్త సినిమాలు కోరుకుంటున్నారు. అందుకే నాకు ప్రొడక్షన్ అవసరం. ► ఓవైపు హీరోగా ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాతో బిజీగా ఉన్నా. మరోవైపు ‘అ’ సినిమా పనుల్లో ఉండటంతో ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపా. సినిమా అంటే నాకు పిచ్చి. ఓ ఎగై్జట్మెంట్. అందువల్లే నాకు నటన, ప్రొడక్షన్ కష్టం అనిపించలేదు. ‘అ’ చిత్రంతో నిర్మాతల కష్టాలేంటో పూర్తి స్థాయిలో తెలిసాయి. ► ‘అ’ కమర్షియల్ సినిమా కాదు. నాపై నమ్మకంతో సినిమా కొనే డిస్ట్రిబ్యూటర్లను ఎందుకు రిస్క్లో పడేయడం? సినిమాపై నాకు నమ్మకం ఉంది. ఆ రిస్క్ ఏదో నేనే పడదామనుకుని సొంతంగా రిలీజ్ చేస్తున్నా. తమిళ, మలయాళం భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తున్నాం. ► మా 18 మంది కజిన్స్లో యూజ్లెస్ ఫెలో నేనే. అటువంటి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది సినిమా. నా వద్ద ఉన్న ప్రతి రూపాయి సినిమా ఇచ్చిందే. ఆ డబ్బుని తిరిగి సినిమాపై పెట్టేందుకు నేను వెనకాడను. ► ‘అ’ సినిమా కమర్షియల్గా హిట్ సాధించకున్నా పర్లేదు. కానీ.. ఓ ఇరవై ఏళ్ల తర్వాత.. తెలుగులో వైవిధ్యమైన సినిమాలకు ‘అ’ సినిమాతోనే మార్పు ప్రారంభమైంది అంటే చాలు. మా లక్ష్యం నెరవేరినట్లే. వాల్పోస్టర్ సినిమా బ్యానర్లో కొత్త తరహా చిత్రాలే వస్తాయి. అందుకు రెండు మూడేళ్లు అయినా పట్టొచ్చు. ► నేనిప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే నా దర్శక–నిర్మాతలే కారణం. సొంత బ్యానర్ పెట్టాను కదా. నా సినిమాలు నేనే చేసుకుంటానంటానేమో? అనుకుంటారు. నేనెప్పుడూ నటుణ్ణే. నా బ్యానర్లో నేనెప్పుడూ నటించను. ‘అ’ విషయంలో నేను నిర్మాతనే. కాజల్, నిత్య, రెజీనా, అవసరాల నటులే. మేమంతా ఫ్రెండ్స్ కదా అని రెమ్యునరేషన్ తగ్గించలేదు. డేట్స్ని బట్టి తీసుకున్నారు. ► ఏడాదికి మూడు సినిమాలతో బిజీ. నేను హీరోగా చేయడంతో పాటు నా పాత జాబ్ అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్నా. నా డైరెక్టర్లకి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటున్నా. యాక్టర్గా నా పేరు వేయకున్నా పర్లేదు.. డెరెక్షన్ డిపార్ట్మెంట్లో నా పేరు వేయమని చెబుతుంటా (నవ్వుతూ). ► శేఖర్ కమ్ముల, వెంకీ కుడుముల దర్శకత్వంలో నేను సినిమాలు చేస్తున్నానన్నది అవాస్తవం. మేర్లపాక గాంధీతో ‘కృష్ణార్జున యుద్ధం చేస్తున్నా’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునగారు, నేను చేయబోయే సినిమా పూజ ఈ నెల 24న ఉంటుంది. మార్చిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. తర్వాత కిశోర్ తిరుమల, విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో సినిమాలు చేస్తా. -
అ! ట్రెండ్సెట్టర్ అవుతుంది – రాజమౌళి
‘‘అ’ ట్రైలర్ చూశా. చాలా బాగుంది ప్రశాంత్. ట్రైలర్ చూడగానే సినిమా చూడాలనిపించింది’’ అని దర్శకుడు రాజమౌళి అన్నారు. కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, ఈషా, అవసరాల ముఖ్య తారలుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హీరో నాని సమర్పణలో టి. ప్రశాంతి నిర్మించిన చిత్రం ‘అ!’. ఫిబ్రవరి 16న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుకలో రాజమౌళి మాట్లాడుతూ– ‘‘రిలీజ్కు ఓ రోజు ముందుగానే షో వేయించుకుని చూడాలనిపిస్తోంది. ట్రైలర్ చూశాక ఈ సినిమా సూపర్హిట్ అనే ఫీలింగ్ వచ్చింది. నాని హిట్స్ మీద హిట్స్ సాధిస్తున్నాడు. ఓ భారీ హిట్ తర్వాత తనకి ‘వరుసగా హిట్స్ అందుకుంటున్నావ్.. దాన్ని దాటి నువ్వింకా ఓ మెట్టు పైకి ఎదగాలి’ అని మెసేజ్ పెట్టా. ట్రై చేస్తా సార్ అన్నాడు. సడెన్గా చేపకి వాయిస్ ఓవర్ ఇస్తూ కనిపించాడు. నాని సినిమా చేస్తున్నాడంటే అది హిట్టే అని అందరికీ గ్యారెంటీ వచ్చేసింది. ఈ చిత్రంలో నేను చూసిన ఫస్ట్ లుక్ రెజీనాది. మెండ్ బ్లోయింగ్. ఇంతమంది నటులు ఈ సినిమా చేస్తున్నారంటే కథలో ఏదో ఉందనే ఫీలింగ్ కలిగింది. ఈ సినిమా ట్రెంyŠ సెట్టర్ అవుతుంది’’ అన్నారు. నాని మాట్లాడుతూ– ‘‘మనందరి లోనూ ఓ తిక్క ఉంటుంది. ఆ తిక్కను సంతృప్తిపరిచే సినిమా ఇది. హీరోగా బాగా సంపాదిస్తున్నాడు? ఎందుకు ప్రొడక్షన్ చేస్తున్నాడని చాలామంది అనుకున్నారు. డబ్బుల కోసం నిర్మాతగా మారలేదు. ఈ సినిమా తీశాక నిర్మాతలపై గౌరవం పెరిగింది. చేప వాయిస్ ఓవర్ కోసం వచ్చిన ప్రశాంత్ కథ చెప్పాడు. కానీ తనకు ప్రొడ్యూసర్స్ లేరు. నేను నిర్మాతలను సెట్ చేస్తానన్నాను. కానీ, ఎవరికీ చెప్పలేకపోయా. ఫైనల్లీ నేనే నిర్మిస్తానని చెప్పా. ఇప్పటివరకూ నేను సంపాదించినదంతా సినిమాలతోనే. కాబట్టి సినిమాపై ఇన్వెస్ట్ చే యడానికి ఆలోచించను. ఈ చిత్రకథ విన్న రవితేజ అన్న వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అయితే మనమిద్దరం ప్రొడ్యూస్ చేద్దామా? అన్నారు. కథపై అంత కాన్ఫిడెన్స్ ఆయనకి. ‘అ!’ సినిమా చూశాక గర్వంగా అనిపించింది. ట్రేడ్ విశ్లేషకులు ఒకరు.. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటే రిలీజ్ చేయండి. లేవు.. రిస్క్ అనుకుంటే అమ్మేయండన్నారు. వాణిజ్య అంశాలు లేవు. రిస్క్ అనిపించింది. అందుకే నేనే రిలీజ్ చేస్తున్నా’’ అన్నారు. ‘‘కొత్తవాళ్లతో చిన్న సినిమాగా నేనే తీద్దామను కున్నా. బట్ నానీగారు వచ్చాక ఈ సినిమా పెద్దది అయింది. రోహిణీగారికి కథ చెబితే తెలుగులో ఇలాంటి సినిమా తీస్తున్నారా? అన్నారు. కాజల్గారు హిందీలో తీద్దామన్నారు. నానీతో సినిమా అంటే ఆయన ఇన్వాల్వ్ అవుతారని, మార్పులు చేర్పులు చేస్తారని కొందరు భయపెట్టారు. ఆయన ఎటువంటి మార్పులు అడగలేదు’’ అన్నారు ప్రశాంత్ వర్మ. ‘‘అ!’ సినిమా ఫస్ట్ లుక్ నుంచి మంచి ఇంట్రెస్ట్ ఉంది. కచ్చితంగా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను’’ అన్నారు అనుష్క. ‘‘ఇప్పటివరకూ ఇలాంటి పాత్ర చేయలేదు’’ అన్నారు కాజల్ అగర్వాల్. ‘‘తెలుగులో ఇలాంటి మూవీ వస్తుందనుకోలేదు’’ అన్నారు నిత్యామీనన్. ‘‘ప్రశాంత్ కథ చెప్పినప్పుడే నా పాత్ర బాగా నచ్చింది’’ అన్నారు రెజీనా. సంగీత దర్శకుడు కీరవాణి, చిత్రసంగీతదర్శకుడు మార్క్ కె.రాబిన్ తదితరులు పాల్గొన్నారు. -
రిలీజ్ డేట్ అనౌన్స్.. చేపను చూసేందుకు సిద్ధమా..!
సాక్షి, హైదరాబాద్: వరుస విజయాలతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న సినిమా ‘అ!’. నిత్యామీనన్, కాజల్ అగర్వాల్, రెజీనా, ఈషా, అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ విడుదల తేదీని వాల్ పోస్టర్ సినిమా గ్రూప్ భిన్నంగా ప్రకటించింది. వినూత్న కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీని ఫిబ్రవరి 16న విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘అన్ని సినిమాలయందు ‘అ!’- సినిమా వేరయా! విశ్వదాభిరామ ఫిబ్రవరి 16th రిలీజ్ రా మామా!!’ అంటూ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ ట్వీటర్ లో పోస్ట్ చేశారు. చేప పాత్ర ఉందని చెప్పి అందరి దృష్టి ఆకర్షించిన యూనిట్, విడుదల తేదీని తాజాగా ప్రకటించింది. చేప కథేంటో చూసేందుకు టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ సినిమాలో రెండు కీలక పాత్రలకు నాని, రవితేజలు డబ్బింగ్ చెబుతున్నట్లు సమాచారం. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇప్పటికే ఒక్కో పోస్టర్ తో ఒక్కో పాత్రను ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చిన హీరో నాని, తాజాగా మూవీ రిలీజ్ డేట్ను అదే తీరుగా పద్యరూపంలో వెల్లడించాడు. మార్క్ కె రోబిన్ సంగీతమందిస్తున్న విషయం తెలిసిందే. Here's an అ!some update you all have been waiting for! #AWEReleaseOnFEB16th pic.twitter.com/WxwSMErd5Z — Wall Poster Cinema (@walpostercinema) 29 January 2018 -
ఊరంతా అనుకుంటున్నారు
‘నందిని నర్సింగ్ హోమ్’ చిత్రంతో ప్రేక్షకులకు నవ్వులు పంచడంతో పాటు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో నవీన్ విజయ్కృష్ణ. ప్రస్తుతం తండ్రి నరేష్తో కలిసి ‘విఠలాచార్య’ సినిమాలో నటిస్తున్న నవీన్ పుట్టినరోజును(మంగళవారం) పురస్కరించుకొని మూడో సినిమా ప్రకటించారు. బాలాజీ సనాల దర్శకత్వంలో రోవస్కైర్ ఎంటర్టైన్మెంట్స్–యు–ఐ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై శ్రీహరి మంగళంపల్లి– ఎ.పద్మనాభరెడ్డి నిర్మించనున్న ఈ సినిమాకి ‘ఊరంతా అనుకుంటున్నారు’ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్ను నవీన్ విజయ్కృష్ణ మిత్రుడు హీరో సాయిధరమ్ తేజ్ రిలీజ్ చేశారు. ‘‘లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ కీలకపాత్ర పోషించనున్నారు. ఈ నెల 22 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. మేఘా చౌదరి, సోఫియా సింగ్, జయసుధ, అన్నపూర్ణమ్మ తదితరులు ముఖ్యపాత్రలు పోషించనున్న ఈ చిత్రానికి సంగీతం: కె.ఎం.రాధాకృష్ణ, కెమెరా: జి.లింగబాబు, లైన్ ప్రొడ్యూసర్: శ్రీరమ్య గోగుల. -
నా నమ్మకం నిజమైంది – అల్లు శిరీష్
‘‘నా కెరీర్లో 2017కి చాలా ప్రత్యేకత ఉంది. మలయాళ సినిమా ‘1971 బియాండ్ బోర్డర్’లో మోహన్లాల్గారితో నటించా. నా పాత్రకి మంచి స్పందన వచ్చింది. డిసెంబర్ 28న విడుదలైన ‘ఒక్కక్షణం’ నాకు మరచిపోలేని సినిమాగా నిలిచింది’’ అని హీరో అల్లు శిరీష్ అన్నారు. అల్లు శిరీష్, సురభి, అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్ ముఖ్య తారలుగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి నిర్మించిన ‘ఒక్కక్షణం’ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. అల్లు శిరీష్ మాట్లాడుతూ– ‘‘నా తొలి సినిమా ‘గౌరవం’ సరైన విజయం అందుకోలేదు. దాంతో కొత్తగా చేద్దామనే ఆలోచన తగ్గిపోయింది. ‘కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు’ వంటి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేశాక మళ్లీ ధైర్యం తెచ్చుకుని, ఏదైనా కొత్తగా చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ‘ఒక్కక్షణం’ చేశా. ఈ రోజు నా నమ్మకం నిజమైంది. సినిమా చూసినవారందరూ అభినందిస్తున్నారు. భవిష్యత్లోనూ మంచి సినిమాలు చేయాలనే కాన్ఫిడెన్స్ ఇచ్చిన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు. ‘‘మాకు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులు సహా అందరికీ థ్యాంక్స్. రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించిన నిర్మాతలకు, సహకారం అందించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’’ అన్నారు వీఐ ఆనంద్. ‘‘ఒక్కక్షణం’ సక్సెస్తో 2018కి మేం సంతోషంగా స్వాగతం పలికేలా చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు సీరత్ కపూర్. నిర్మాత చక్రి చిగురుపాటి, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
కసి ఉన్నవాళ్లతో పనిచేస్తే ఎనర్జీ వస్తుంది
‘‘ఒక్కక్షణం’ సినిమాకి వస్తున్న ఫీడ్బ్యాక్, రెస్పాన్స్తో హ్యాపీగా ఉన్నా. ప్రత్యేకించి ఈ సినిమాలోని కథతో పాటు హీరో గురించి మాట్లాడుతున్నారు. ఓ యాక్టర్గా అది నాకు బాగా అనిపించింది. గత సినిమాలకంటే ఈ సినిమాలో నటుడిగా ఎదిగావు. యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయంటుంటే వెరీ హ్యాపీ’’ అని హీరో అల్లు శిరీష్ అన్నారు. అల్లు శిరీష్, సురభి, అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్ ముఖ్య తారలుగా వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి నిర్మించిన ‘ఒక్కక్షణం’ ఈ గురువారం విడుదలైంది. ఈ సందర్భంగా అల్లు శిరీష్ చెప్పిన విశేషాలు. ► ‘కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు’ సినిమాలతో సేఫ్ గేమ్ ఆడా. ఏదైనా కొత్తగా చేయాలనుకుంటున్నప్పుడు ఆనంద్ ‘ఒక్కక్షణం’ కథ తీసుకొచ్చారు. తను కథ చెప్పిన విధానం నచ్చి వెంటనే ఓకే చెప్పేశా. ఆ తర్వాత నాన్నగారు (అల్లు అరవింద్) కథ విని బాగుందన్నారు. అన్నయ్యకి (అల్లు అర్జున్) స్టోరీ లైన్ తెలుసు. కథ పూర్తిగా తెలీదు. ఫస్ట్ కాపీ చూసి బాగుందన్నారు. ► ‘ఒక్కక్షణం’ ప్రాజెక్ట్ కొంచెం ఆలస్యమైంది. అయితే సినిమాపై నమ్మకంతో వేరే ఏ సినిమా నేను ఒప్పుకోలేదు. ప్యారలల్ లైఫ్ పాయింట్ కొత్తగా అనిపించింది. కథను నేను బాగా నమ్మడంతో ఇన్వాల్వ్ అయి చేశా. కథకి అవసరం మేరకే మూడు ఫైట్స్ ఉన్నాయి. అవి అనవసరం అనిపించవు. ► ఆనంద్ చెప్పిన కథని అంతే చక్కగా తెరకెక్కించారు. సినిమా విడుదల తర్వాత ఆయనపై నాకు మరింత గౌరవం పెరిగింది. అమ్మ సెంటిమెంట్ సీన్కి చాలామంది కనెక్ట్ అయ్యారు. కెమెరామ్యాన్ శ్యాం కె.నాయుడుతో పనిచేయాలనే నా కోరిక ఈ చిత్రంతో తీరింది. మరో సినిమాకి ఆయనతో పనిచేయనున్నా. ఈ చిత్రంలో సంగీతం కంటే నేపథ్య సంగీతానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. మణిశర్మగారు చాలా బాగా చేశారు. ఆయనలా ఎవరూ చేయలేరు. ► ప్రమోషన్ సాంగ్ను ఇంటర్వెల్ తర్వాత పెట్టాలని షూట్ చేశాం. లెంత్ ఎక్కువ అవుతుందని పెట్టలేదు. ఎండింగ్ టైటిల్స్ అప్పుడు ఆ పాట ఉంటుంది. కొన్ని కామెడీ సన్నివేశాలు తీసేశాం. ► లవ్స్టోరీ, ఫ్యామిలీ డ్రామాలంటే ఇష్టం. అన్నీ అటువంటివే చేయాలని కాదు. నా పాత్ర కొత్తగా ఉండాలి. వైవిధ్యమైన సినిమాలు చేస్తేనే ప్రేక్షకులకు నచ్చుతుంది. ► మంచి పాత్ర అయితే వేరే హీరోల సినిమాలో చేయడానికి రెడీ. నా సినిమాలో ఏ హీరో చేయడానికైనా అభ్యంతరం లేదు. మల్టీస్టారర్ మూవీ కథలను రచయితలు రాయడం లేదు. మలయాళంలో ‘1971’ సినిమాలో మోహన్లాల్గారితో కలిసి నటించడం మరచిపోలేను. ‘ఒక్కక్షణం’ మలయాళంలో డబ్బింగ్ చేయడానికి అక్కడివారు ముందుకొచ్చారు. ► ఓ నిర్మాత కొడుకుగా అది కావాలి.. ఇది కావాలి.. అంటూ నేను నిర్మాతలను డిమాండ్ చేయను. ప్రాజెక్ట్పై ఎంత శ్రద్ధ ఉంటుందో పబ్లిసిటీ, డిస్ట్రిబ్యూషన్పైనా అంతే శ్రద్ధ పెట్టమని చెబుతానంతే. ► నాన్నగారు వేరే హీరోతో హిట్ సాధించారంటే ఓ కొడుకుగా సంతోషిస్తా. అదే నేను హీరోగా చేసిన సినిమా హిట్ అయిందంటే నాకు మరో పది రెట్లు సంతోషంగా ఉంటుంది (నవ్వుతూ). ► కొత్త డైరెక్టర్లతో పనిచేయాలనే ఎగై్జట్మెంట్ ఉంది. ఇప్పుడొస్తున్న మంచి సినిమాలన్నీ కొత్తవారి నుంచి వస్తున్నవే. ఆనంద్ ఓ కొత్త డైరెక్టర్లా కష్టపడ్డాడు. అంత కసి ఉన్నవాళ్లతో పనిచేస్తుంటే ఎనర్జీ వస్తుంది. కొత్త, పాత డైరెక్టర్లు చెప్పిన రెండు మూడు కథలు విన్నా. నెలలోపు ఫైనలైజ్ చేస్తా. నేను క్రమశిక్షణతో పనిచేస్తా. కొత్త ఏడాది నుంచి మరింత క్రమశిక్షణగా పనిచేయాలనుకుంటున్నా. -
‘నిర్మాత లేకుంటే ఇండస్ట్రీయే లేదు’
‘‘ఓ కొత్త కథను అరటిపండు వలిచినట్టు అందరికీ అర్థమయ్యేలా అందంగా చెప్పారు ఆనంద్. తను చెప్పిన కథ వినగానే నేను ఎగ్జయిట్ అయ్యా. ‘ఒక్క క్షణం’ వంటి మంచి సినిమాను శిరీష్తో తెరకెక్కించినందుకు ఆనంద్గారికి థ్యాంక్స్. ఈ సినిమాను ప్రేక్షకులు తప్పకుండా హిట్ చేస్తారనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. అల్లు శిరీష్, సురభి, సీరత్ కపూర్, అవసరాల శ్రీనివాస్ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘ఒక్క క్షణం’. వీఐ ఆనంద్ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రీ–రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ–‘‘నిర్మాతగారి అబ్బాయిలుగా నిర్మాత విలువేంటో నాకు తెలుసు. నిర్మాత లేకుంటే ఇండస్ట్రీయే లేదు. నేను ‘దిల్’ రాజుగారితో జర్నీ స్టార్ట్ చేసినట్లే.. చక్రిగారితో శిరీష్ జర్నీ స్టార్ట్ చేశాడు. తన జర్నీ ఇలాగే సక్సెస్ఫుల్గా కొనసాగాలి. ఆనంద్గారి ‘టైగర్’ సినిమా చూశా. చాలా బాగుందని శిరీష్కి చెప్పా. తను పెద్దగా విన్నట్లు కనపడలేదు. తర్వాత ఓ రోజు నన్ను కలిసి నేను ఆనంద్గారితో సినిమా చేయబోతున్నాను అని అన్నాడు. అలా ఈ సినిమా ప్రారంభం కావడంలో నేను కూడా ఓ చిన్న పాత్ర పోషించాననిపిస్తోంది. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా నేను గర్వపడే చిత్రం అవుతుందనుకుంటున్నా. జనవరి 1న టీజర్ రిలీజ్ అవుతుంది’’ అన్నారు. ‘‘నాపై నమ్మకంతో చక్రిగారు సినిమా మేకింగ్లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. 14 నెలలుగా శిరీష్ ఈ సినిమా కోసమే వర్క్ చేశారు’’ అన్నారు వీఐ ఆనంద్. ‘‘ప్యారలల్ లైఫ్ అనే కాన్సెప్ట్తో చేసిన సినిమా ఇది. ప్రేక్షకులకు కొత్త రకం సినిమా అవుతుంది’’ అన్నారు అల్లు శిరీష్. నటుడు నాగబాబు, సురభి, అవసరాల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అందుకే రెండు పడవల ప్రయాణం
‘‘నేను దర్శకుడి కంటే ముందు రచయితని. నాలోని రచయితనే ఎక్కువ ఇష్టపడతాను’’ అన్నారు నటుడు–దర్శకుడు అవసరాల శ్రీనివాస్. అల్లు శిరీష్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న ‘ఒక్క క్షణం’లో ముఖ్య పాత్ర పోషించారు అవసరాల. చక్రి చిగురుపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా అవసరాల శ్రీనివాస్ పలు విశేషాలు పంచుకున్నారు. ► ప్యారలల్ౖ లెఫ్ కాన్సెప్ట్తో వస్తున్న చిత్రమిది. ఒక జంట లైఫ్లో జరిగిన సంఘటనలు మరో జంటకు సంవత్సరం తర్వాత జరుగుతుంటాయి. అలా ఎందుకు జరుగుతాయి? అన్నది మాత్రం సస్పెన్స్. నేను ఆర్కిటెక్ పాత్రలో కనిపిస్తాను. వీఐ ఆనంద్ తను చూసిన సంఘటనలతో ఈ కథ బాగా రాసుకున్నారు, బాగా తెరకెక్కించారు. ► ఇండస్ట్రీలో నా ప్రయాణం అంత సులువుగా జరగలేదు. ‘అమృతంలో చందమామ’ తర్వాత అవకాశాలు రాలేదు. ‘ఊహలు గుస గుసలాడే’తో మళ్లీ నటుడిగా బిజీ అయ్యాను. నాకు ఒకే బాటలో ఉండిపోవటం ఇష్టం ఉండదు. అందుకే నటుడిగా, దర్శకుడిగా రెండు పడవల్లో ప్రయాణం చేస్తున్నాను. ► దర్శకత్వం, రచన ఈ రెండిటిలో నేను రచనకే ఓటు వేస్తాను. ఒక సినిమా విజయం కథ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం రచయితకు సరైన గుర్తింపు లభించడం లేదు. వాళ్ళ ఇగోను సంతృప్తిపరుచుకోవటానికి దర్శకులుగా మారుతున్నారు. డైరెక్టర్గా వారాహి సంస్థకు ఒక ప్రేమకథను, సితార ఎంటర్టైన్మెంట్స్కు ఒక థ్రిల్లర్ మూవీని చేయబోతున్నా. నేను ఇచ్చిన కథతో ఇతర దర్శకులు రెండు సినిమాలు తెరకెక్కిస్తున్నారు. నటుడిగా ‘అ!, మహానటి’ సినిమాలతో బిజీగా ఉన్నాను. -
క్షణం ఊహించలేరు
ఊహించలేరట.. ఎవరూ ఊహించలేరట. ‘ఒక్క క్షణం’ స్క్రీన్ప్లేని సినిమా చూస్తున్నప్పుడు ఎవరూ ఊహించలేరట. ‘శ్రీరస్తు శుభమస్తు’ వంటి విజయవంతమైన చిత్రం తరువాత అల్లు శిరీష్ హీరోగా సురభి హీరోయిన్గా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేం వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఇది. లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్ జంటగా కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 28న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. నిర్మాత మాట్లాడుతూ – ‘‘ఇటీవల విడుదలైన టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో రెండు జంటల మధ్య జరిగే సంఘటనలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. మొదటి రీల్ నుంచి చివరి రీల్ వరకు ఆడియన్స్ థ్రిల్ ఫీలవుతారు’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రం ప్యారలల్ లైఫ్తో ముడిపడి ఉంటుంది. ఒక జంటది ప్రజెంట్, మరొకరిది ఫ్యూచర్ అనే కాన్సెప్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఎవ్వరూ ఊహించలేని స్క్రీన్ప్లేతో ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అని అన్నారు. కాశీ విశ్వనాథ్, రోహిణి, వైవా హర్ష తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, మాటలు: అబ్బూరి రవి, కో–ప్రొడ్యూసర్స్: సతీష్ వేగేశ్న, రాజేష్ దండ. -
సినిమాల్లో హంతకుణ్ణి అయితే నిజంగానే హత్యలు చేస్తానా?
‘‘నటుడిగా నాలోని భిన్న కోణాలు చూపించుకోవాలని తాపత్రయపడతాను. అందుకే ఒకదానికి ఒకటి పోలిక లేని పాత్రలు చేస్తున్నాను’’ అని అవసరాల శ్రీనివాస్ అన్నారు. ఆయన హీరోగా నటించిన హిందీ ‘హంటర్’ రీమేక్ ‘బాబు బాగా బిజీ’ ఈ శుక్రవారం విడుదల కానుంది. నవీన్ మేడారం దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మించారు. అవసరాల చెప్పిన విశేషాలు.. ‘అష్టా చమ్మా’లో నేను చేసిన పాత్ర అందరికీ నచ్చింది. ఆ తర్వాత అలాంటి పాత్రలు దాదాపు 30 వరకూ వచ్చాయి. అవి చేసి ఉంటే, ‘అవసరాల ఇలాంటి పాత్రలకే పనికొస్తాడు’ అని నాకో ఇమేజ్ ఫిక్స్ చేసేసేవారు. నేను కూడా అందులోంచి బయటకు రావడానికి ఇష్టపడకుండా రొటీన్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తే, నాకే బోర్ కొట్టి ఉండేది. అందుకే డిఫరెంట్ రోల్స్ చేస్తున్నా. ఎవరైనా సరే సినిమాని సినిమాగా చూడాలి. అలాగే, తెర మీద నటించే ఆర్టిస్ట్ని కాకుండా పాత్రను చూడాలి. సినిమాలో హంతకుడి పాత్ర చేస్తే నిజజీవితంలో నేను హత్యలు చేస్తానని కాదు కదా? సినిమా వరకే హంతకుణ్ణి. ∙‘క్లీన్’ ఇమేజ్ ఉన్న నేను ‘బాబు బాగా బిజీ’లాంటి అడల్డ్ సినిమా సెలక్ట్ చేసుకోవడం కొంతమందిని ఆశ్చర్యపరచి ఉండొచ్చు. ‘వర్క్ ఈజ్ వర్క్’. నా వ్యక్తిత్వానికి సినిమాల్లో చేసే పాత్రలకూ సంబంధం ఉండదు. వాస్తవానికి ‘హంటర్’ సినిమా చూసి, చేయాలా? వద్దా అనుకున్నాను. చివర్లో ఇచ్చిన మెసేజ్ చూసి, చేయాలని నిర్ణయించుకున్నాను. నేనే పని చేసినా ఇతరుల సలహాల మీద ఆధారపడను. నా సొంత నిర్ణయాలకే ప్రాధాన్యం ఇస్తాను. ఆ తర్వాత వాటి గురించి ఆలోచించను. ∙నేను డైరెక్షన్ చేస్తానన్నప్పుడు నటుడిగా చేస్తున్నావ్. డైరెక్షన్ ఎందుకని చాలామంది అన్నారు. ఒకవేళ డైరెక్షన్ చేస్తే, కమర్షియల్ స్క్రిప్ట్స్ సెలక్ట్ చేసుకోమని సలహా కూడా ఇచ్చారు. మనల్ని ఏది ఎగై్జట్ చేస్తుందో అది చేయడమే మంచిదని నా ఫీలింగ్. అందుకని నా ఇష్టానికి తగ్గట్టుగా సినిమాలు చేస్తున్నా. ∙ధనార్జనే ధ్యేయం అనుకుని ఉంటే ఈ సినిమాని ఇంకా వల్గర్గా తీయొచ్చు. కానీ, దర్శక–నిర్మాతల ప్రధానోద్దేశం అది కాదు. అందుకే కథకు ఏం కావాలో అదే చూపించాలనుకున్నారు. అభిషేక్ నామాకి ఇది మొదటి సినిమా అయినా రాజీపడకుండా నిర్మించారు. నా మొదటి సినిమా ‘అష్టా చమ్మా’ నిర్మాత రామ్మోహన్కు మొదటి సినిమా. ఆ సినిమా సక్సెస్. ఇప్పుడు అభిషేక్ పిక్చర్స్కి ఇది మొదటి సినిమా. సెంటిమెంట్గా ఆలోచిస్తే.. ఇది కూడా హిట్టే. ∙దర్శకుడిగా నా మూడో సినిమా మంచి థ్రిల్లర్. కొత్త జానర్లో ఈ సినిమా ఉంటుంది. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు నిర్మాతలకు కథ చెప్పాను. చేద్దామన్నారు. నటుడిగా ‘అల్లరి’ నరేశ్ కాంబినేషన్లో ఓ సినిమా చేస్తున్నా. అందులో నాది సీబీఐ ఆఫీసర్ పాత్ర. వీఐ ఆనంద్ దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న సినిమాలో కీలక పాత్ర చేస్తున్నా. ‘అమీ తుమీ’ రీలీజ్కు సిద్ధమవుతోంది. -
అమీ-తుమీ టీజర్ వచ్చేసింది
ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన మల్టీస్టారర్ "అమీ తుమీ" టీజర్ సోమవారం విడుదల చేశారు. నేచురల్ స్టార్ నాని దీన్ని అధికారికంగా లాంచ్ చేశారు. డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ టీజర్ ఆ సక్తికరంగా ఉంది. టాప్ కమెడియన్ తనదైన కామెడీతో అలరించనున్నారు. ఈ సందర్భంగా ఇంద్రగంటి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన హీరో నానీ టీజర్ లింక్ను ట్విట్టర్ లో షేర్ చేశారు. టీజర్ సూపర్ ఫన్గా ఉందంటూ ట్వీట్ చేశారు. కాగా కహాన్-కన్నవ్ సమర్పణలో కె.సి.నరసింహారావు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోబిజీగా ఉంది. అద్భుతమైన కామెడీ ఎంటర్ టైనర్ గా ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న "అమీ తుమీ" తెలుగు ప్రేక్షకులను మనస్ఫూర్తిగా నవ్వుకొనేలా చేస్తుందని చిత్ర నిర్మాత కె.సి.నరసింహారావు ఇటీవల ప్రకటించారు. మే నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అవసరాల శ్రీనివాస్, అడివి శేష్, ఈషా, అదితి మ్యాకల్, వెన్నెల కిషోర్ తనికెళ్లభరణి, అనంత్, మధుమణి, కేదార్ శంకర్, వేణుగోపాల్, శ్యామల తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందించారు. -
31 రోజుల్లో షూట్ చేసేశాడు..!
అష్టా చమ్మా, అంతకు ముందు ఆతరువాత, జెంటిల్మన్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. జెంటిల్మన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఇంద్రగంటి నాగచైతన్య హీరోగా ఓ సినిమాను తెరకెక్కించాలని భావించాడు. అయితే చైతు డేట్స్ కాలీ లేకపోవటంతో ఈ గ్యాప్ లో ఓ కామెడీ ఎంటర్టైనర్ ను రెడీ చేస్తున్నాడు. అమీ తుమీ పేరులో అవసరాల శ్రీనివాస్, అడవి శేష్, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రల్లో ఓ సినిమాను రూపొందించాడు. ఈ సినిమాను దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ కేవలం 31 రోజుల్లో పూర్తి చేశాడు. ఈ సందర్భంగా తనకు సహకరించిన నటీనటులకు యూనిట్ సభ్యులకు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపాడు. గ్రీన్ టీ ప్రొడక్షన్స్ పతాకం పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈషా, అదితి మాయకల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. IT'S A WRAP FOR 'AMI TUMI'👍 IN THIRTY ONE DAYS FLAT😊 THANKS TO THE ZANY AND BRILLIANT CAST AND THE DEDICATED CREW👏👏 NOW OFF TO POST😊 — Mohan Indraganti (@mokris_1772) 22 March 2017 -
అమీ తుమీ
అవసరాల శ్రీనివాస్ – అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి ‘అమీ తుమీ’ అనే టైటిల్ నిర్ణయించారు. ‘వెన్నెల’ కిషోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ఈషా, అదితీ మ్యాకల్ కథానాయికలు. కహాన్–కన్నవ్ సమర్పణలో కె.సి.నరసింహారావు నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగోను హైదరాబాద్లో విడుదల చేశారు. కె.సి.నరసింహారావు మాట్లాడుతూ –‘‘హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకునేలా ఉంటుంది. అందరూ తెలుగు ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో ఈ చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉంది. ఈ నెల 23తో టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తవుతుంది. త్వరలో పాటలు, సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. తనికెళ్ల భరణి, అనంత్, మధుమణి, శ్యామల, తనికెళ్ల భార్గవ్, తడివేలు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా పి.జి.విందా, సంగీతం: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినయ్. -
అంతా తెలుగుమయం!
సాధారణంగా తెలుగు సినిమా తెర పైన, తెర వెనకా పరభాషా నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేస్తుంటారు. కళాకారులకు భాషాబేధం లేదు కాబట్టి, తెలుగు ప్రేక్షకులు అందర్నీ ఆదరిస్తారు. కానీ, ఓ సినిమాకి 24 శాఖల్లోనూ తెలుగువారే పని చేశారంటే కాస్త ఎక్కువ ఆనందిస్తారు. ఇంద్రగంటి మోహనకృష్ణ అలాంటి ఆనందాన్ని ఇవ్వ నున్నారు. అవసరాల శ్రీనివాస్, అడివి శేష్ హీరోగా ఆయన దర్శకత్వంలో కేసీ నరసింహారావు నిర్మిస్తున్న సినిమాకి 24 శాఖల్లోనూ తెలుగువారిని ఎంపిక చేశారు. సినిమా అంతా తెలుగుమయం. ‘వెన్నెల’ కిశోర్ ముఖ్యపాత్ర చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్లు ఈష, అదితీ మ్యానికల్ లు తెలుగమ్మా యిలే. ఈ నెల 1న ప్రారంభమైన ఈ చిత్రం షెడ్యూల్ నేటితో పూర్తవు తుంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వినయ్, సంగీతం: మణిశర్మ. -
నవ్వులే నవ్వులు
వైవిధ్యమైన కథాచిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దిట్ట. ‘క్షణం’తో సక్సెస్ ట్రాక్లో ఉన్నారు అడివి శేష్. ‘అష్టా చమ్మా’ ద్వారా నటుడిగా పరిచయమై, ‘ఊహలు గుసగుసలాడే’తో తనలో మంచి దర్శకుడు ఉన్నాడని కూడా నిరూపించుకున్నారు. సక్సెస్లో ఉన్న ఇంద్రగంటి–శేష్–అవసరాల కాంబినేషన్లో ఓ సినిమా మొదలైంది. అడివి శేష్, అవసరాల శ్రీనివాస్, ఈష, అదితీ మ్యానికల్ ముఖ్య పాత్రల్లో ‘ఎ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ ’ పతాకంపై ఇంద్రగంటి దర్శకత్వంలో కె.సి. నరసింహారావు నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ క్లాప్ ఇచ్చారు. నటుడు తనికెళ్ళ భరణి గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ‘వెన్నెల’ కిశోర్ ముఖ్య పాత్రలో కనిపిస్తారు. నేటి నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తు్తన్నాం’’ అన్నారు. తనికెళ్ల భరణి, అనంత్, మధుమణి, కేదార్ శంకర్, వేణుగోపాల్, శ్యామల, తనికెళ్ళ భార్గవ్, తడివేలు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.జి.విందా, సంగీతం: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినయ్. -
ముగ్గురూ ముగ్గురే
అవసరాల శ్రీనివాస్ మంచి నటుడే కాదు.. రచయిత కూడా. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ చిత్రాల్లో రచయితగా అవసరాల చమత్కారాలు చూశాం. నటుడు అడివి శేష్ కూడా రచయితే. గతేడాది సూపర్హిట్ ‘క్షణం’కి కథ, స్క్రీన్ప్లే అందించింది ఆయనే. ఇప్పుడీ ఇద్దరూ కలసి హీరోలుగా ఓ సినిమా చేయనున్నారు. ‘అష్టా చమ్మా’, ‘అంతకు ముందు ఆ తర్వాత’, ‘జెంటిల్మన్’ చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. ‘ఎ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్’ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్న కేసీ నరసింహారావు మాట్లాడుతూ – ‘‘అవసరాల, అడివి శేష్, ఇంద్రగంటి... ముగ్గురూ ముగ్గురే. ఈ కాంబినేషన్కి తగ్గట్టు స్క్రూబాల్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందనుంది. నిర్మాతగా నా తొలి సినిమాని ఇంద్రగంటి దర్శకత్వంలో చేయడం ఆనందంగా ఉంది. ఫిబ్రవరి 1న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘వెన్నెల’ కిశోర్ ముఖ్య పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి కెమేరా: పీజీ విందా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వినయ్, సంగీతం: మణిశర్మ. -
అవసరాల శ్రీనివాస్తో సరదాగా కాసేపు
-
రీమేక్ కత్తి గురూ!
హీరో డేట్స్ రెడీ. కానీ డెరైక్టర్ హ్యాపీగా లేడు. ఎందుకంటే కథ లేదు. స్టార్ హీరోకి కథ అంటే మాటలా? అప్పటికప్పుడు కొత్త కథ అంటే కష్టమే! మరేం చేయాలి? ఐడియా... వేరే లాంగ్వేజ్ సినిమాలు చూస్తే? ఓ సినిమా నచ్చింది. దాన్ని కాపీ కొట్టేస్తే? ‘ఫ్రీమేక్’ చేశాడని అంటారు. అందుకే, రీమేక్ చేద్దామనుకున్నాడు. హీరోగారికి కూడా సినిమా నచ్చేసింది. షూటింగ్ షురూ! ఫలితం... ఇప్పుడు తెలుగులో అరడజనుకు పైగా కత్తి లాంటి సినిమాలు రీమేక్ అవుతున్నాయ్. చిరంజీవి సేఫ్ గేమ్! ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి చూశారూ.. అవి చాలా డేంజర్. ఓ పట్టాన నిర్ణయానికి రానివ్వవు. చిరంజీవి హీరోగా నటిస్తున్న 150వ సినిమా విషయంలో ఇదే జరిగింది. ఏడెనిమిదేళ్ల గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా కావడం, మెగాస్టార్ హీరోగా 150వ సినిమా కావడంతో అంచనాలు పెరిగిపోయాయ్. దాంతో ఏ కథతో సినిమా చేస్తే బాగుంటుందో మెగా కాంపౌండ్ ఓ పట్టాన డిసైడ్ చేసుకోలేకపోయింది. స్టార్ డెరైక్టర్లు, స్టార్ రైటర్లు చెప్పిన కథలు విన్నప్పటికీ ‘ఇంకా ఏదో కావాలి’ అనిపించి ఉంటుంది. అలాంటి సమయంలోనే తమిళ ‘కత్తి’ మీద దృష్టి పడి ఉంటుంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. ఆల్రెడీ ఓ భాషలో ప్రూవ్ చేసుకుంది.. కథలో మాస్ మసాలా ఎలిమెంట్స్తో పాటు మెసేజ్ కూడా ఉంది కాబట్టి ఇది ‘సేఫ్’ అవుతుందనుకున్నారేమో. చివరికి 150వ సినిమాకి స్ట్రైట్ స్టోరీని కాకుండా రీమేక్ని సెలక్ట్ చేసుకున్నారు. ‘ఖైదీ నం. 150’ పేరుతో వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దీన్ని రామ్చరణ్ నిర్మిస్తుండటం విశేషం. మూవీ జానర్: యాక్షన్ డ్రామా. ‘కత్తి’ బడ్జెట్: దాదాపు 100 కోట్లకు పైగా, వసూళ్లు: సుమారు 124 కోటు్లూ పవన్ కల్యాణ్ డబుల్ ధమాకా! పవన్ కల్యాణ్ కెరీర్లో మంచి హిట్ సాధించిన వాటిలో ‘సుస్వాగతం’, ‘ఖుషి’, ‘గబ్బర్సింగ్’ మూడూ రీమేక్సే. ‘తమ్ముడు’ సినిమా కూడా హాలీవుడ్ చిత్రం ‘బ్రేకింగ్ ఎవే’కి ఇన్స్పిరేషన్ అంటారు. సో.. రీమేక్స్ పవన్కి కలిసొస్తాయనే చెప్పాలి. మరి.. కథలు దొరక్కో.. లేక ‘సర్దార్ గబ్బర్సింగ్’ ఆశించిన ఫలితం సాధించకపోవడం వల్లో రీమేక్ మూవీకి ఓటేసారు. పైగా ఒకటి కాదు... ఏకంగా రెండు సినిమాలు ఒప్పుకోవడం విశేషం. ఒకటి ‘వీరమ్’, ఇంకోటి ‘వేదాలం’. అజిత్ హీరోగా శివ తెరకెక్కించిన ‘వీరమ్’ బాక్సాఫీస్ని షేకాడించింది. ‘వేదాలం’ కూడా అజిత్-శివ కాంబినేషన్లో తెరకెక్కినదే. తమిళంలో ఈ సినిమా నిర్మించిన ఎ.యం. రత్నం తెలుగు రీమేక్కి కూడా నిర్మాతగా వ్యవహిస్తున్నారు. ‘కాటమరాయుడు’ పేరుతో ‘వీరమ్’ని శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ‘వేదాలం’ బడ్జెట్: 60 కోట్లు, వసూళ్లు: 125 కోటు్లూ (జానర్: యాక్షన్ మసాలా). ‘వీరమ్’ బడ్జెట్: 50 కోట్లు, వసూళ్లు: 130 కోటు్లూ (జానర్: యాక్షన్ మూవీ). వెంకీ.. రీమేక్ రాజా! బహుశా వెంకటేశ్ చేసినన్ని రీమేక్ చిత్రాలు వేరే ఏ హీరో చేసి ఉండరేమో. భారతంలో అర్జునుడు, త్రిమూర్తులు, టు టౌన్ రౌడీ, చంటి, చినరాయుడు, సుందరాకాండ, కొండపల్లి రాజా, అబ్బాయిగారు, సూర్యవంశం, వసంతం, రాజా, శీను, ఘర్షణ, జెమిని, సంక్రాంతి, ఎ వెన్స్డే, నాగవల్లి, బాడీగార్డ్, మసాలా, దృశ్యం, గోపాల గోపాల.. ఏంటండీ.. లెక్క చాలా ఎక్కువగా ఉందనుకుంటున్నారా? మరందుకే రీమేక్ రాజా అన్నది. ఈ చిత్రాల్లో సక్సెస్ అయినవే ఎక్కువ. అందుకే వెంకీ నటిస్తున్న తాజా చిత్రం ‘గురు’పై బోల్డన్ని అంచనాలు. సుధా కొంగర దర్శకత్వంలో హిందీలో ‘సాలా ఖడూస్’గా, తమిళంలో ‘ఇరుది సుట్రు’గా ఏకకాలంలో రూపొందిన చిత్రానికి ‘గురు’ రీమేక్. తెలుగు చిత్రానికి కూడా సుధా కొంగరే దర్శకురాలు. ఈ సినిమాలో బాక్సర్గా కనిపించడానికి వెంకీ కండలు పెంచారు. ‘గురు’ లుక్ ఇప్పటికే బోల్డన్ని కాంప్లిమెంట్స్ అందుకుంది. వాస్తవానికి హిందీలో వసూళ్లు ఆశించిన విధంగా లేకపోయినా మంచి సినిమా అనిపించుకుంది. తమిళంలో ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ అయింది. మూవీ జానర్: స్పోర్ట్స్ డ్రామా.‘ఇరుది సుట్రు’ బడ్జెట్: దాదాపు 5 కోట్లకు పైగా, వసూళ్లు: సుమారు 15 కోటు్లూ డిస్కషన్స్లో ఉన్న చిత్రాలు మలయాళ స్టార్ మోహన్లాల్ నటించిన చిత్రం ‘ఒప్పమ్’. ఇది క్రైమ్ థ్రిల్లర్. హీరో అంధుడు. సంబంధం లేని ఓ నేరంలో ఇరుక్కున్న అతడు ఎలా బయటపడ్డాడు? అనేది కథ. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. 7 కోట్లతో తీసిన ఈ సినిమా సుమారు 50 కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ చిత్రం తెలుగు డబ్బింగ్, రీమేక్ హక్కులను ఓ నిర్మాత పొందారని సమాచారం. మరి.. అనువదించి విడుదల చేస్తారో లేక రీమేక్ చేస్తారో చూడాలి. ఒకవేళ రీమేక్ చేస్తే.. వెంకటేశ్ హీరోగా నటించే అవకాశం ఉందని వినికిడి. ఇక.. వార్తల్లో ఉన్న మరో చిత్రం ‘అప్పా’ (నాన్న అని అర్థం). దర్శక-నటుడు సముద్రఖని నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ఇది. మంచి ఎమోషనల్ మూవీ అనిపించుకున్న ఈ చిత్రాన్ని 12 భాషల్లో రీమేక్ చేయాలని సముద్రఖని భావిస్తున్నారట. - డి.జి. భవాని నా దృష్టిలో రీమేక్లు చేయడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి.. ఓ మంచి చిత్రాన్ని మన ప్రేక్షకులకు కూడా చూపించాలనే ప్రయత్నం. రెండు.. కొత్త కథలతో ఎందుకొచ్చిన గొడవ. పక్క భాషలో హిట్టయింది కదా, ఇక్కడా హిట్ వచ్చేస్తుందనే భావన. సేఫ్గా రీమేకులే చేద్దామనుకునే వాళ్లు లైఫ్లో కొత్తగా చేయలేరు. కొత్త కథలు విందాం, చేద్దామనే ఫైర్ హీరోల్లో ఉంటే కొత్త కథలు వస్తాయి. రిస్క్ తీసుకునే గట్స్ హీరోలకు ఉండాలి. - పూరి జగన్నాథ్ అవసరాల బోల్డ్ స్టెప్ బోల్డ్ కంటెంట్తో తీసిన హిందీ చిత్రం ‘హంటర్’. తెలుగులో హోమ్లీగా కనిపించిన రాధికా ఆప్టే ఈ చిత్రంలో చాలా చాలా బోల్డ్గా నటించడం హాట్ టాపిక్ అయింది. ఈ సినిమా తెలుగు రీమేక్లో ఆ పాత్రను రెజీనా చేస్తున్నారు. కాగా, దర్శకుడిగా-నటుడిగా పద్ధతిగా ఉన్న చిత్రాలూ, పాత్రలూ చేసిన అవసరాల శ్రీనివాస్ ఈ రీమేక్లో సెక్స్ అడిక్ట్గా నటించడానికి రెడీ కావడం ఓ బోల్డ్ స్టెప్. నవీన్ మేడారం దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మూవీ జానర్: అడల్ట్ కామెడీ. ‘హంటర్’ బడ్జెట్: దాదాపు 6 కోట్లు, వసూళ్లు: సుమారు 13 కోటు్లూ పంజాబీ సినిమా రీమేక్లో చైతు? మలయాళ ‘ప్రేమమ్’ అక్కడ సూపర్ డూపర్ హిట్. అదే పేరుతో నాగచైతన్య హీరోగా రీమేక్ అయిన ఆ చిత్రం ఇక్కడ కూడా సూపర్ డూపర్ హిట్. చైతూ మరో రీమేక్లో నటించనున్నారు. నిజానికి ‘ప్రేమమ్’ విడుదలకు ముందే ఆ రీమేక్ని ఫైనలైజ్ చేశారు. పంజాబీలో మంచి విజయం సొంతం చేసుకున్న ‘సింగ్ వర్సెస్ కౌర్’ నచ్చి ఈ చిత్రం తెలుగు రీమేక్లో నటించడానికి నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని విశ్వసనీయ వర్గాల సమాచారం. విశేషం ఏంటంటే.. భారతీయ భాషలన్నింట్లోనూ సినిమాలు తీయాలనుకున్న డా. డి. రామానాయుడు తీసిన తొలి పంజాబీ సినిమా ఇది. కొత్త దర్శకుడు కృష్ణ దర్శకత్వంలో ఈ రీమేక్ రూపొందనుందని భోగట్టా. మూవీ జానర్: రొమాంటిక్ కామెడీ. ‘సింగ్ వెర్సస్ కౌర్’ బడ్జెట్: 35 లక్షలు, వసూళ్లు: సుమారు 1 కోటీ 60 లక్షలుూ తెలుగులో రెండు రాష్ట్రాలు ప్రముఖ రచయిత చేతన్ భగత్ అద్భుత నవలల్లో ‘ఫైవ్ పాయింట్ సమ్వన్’ను ‘త్రీ ఇడియట్స్’గా, ‘త్రీ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్’ను ‘కై పోచే’గా హిందీలో తీశారు. ఈ రెండు చిత్రాలూ మంచి ఆదరణ పొందాయి. ఆయన రాసిన ‘టు స్టేట్స్’ నవల అదే పేరుతో హిందీలో రూపొందింది. చిన్న బడ్జెట్తో తీసిన ఈ సినిమా పెద్ద హిట్. ఈ చిత్రం తెలుగు రీమేక్ హక్కులను అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా దక్కించుకున్నారు. ఈ చిత్రం ద్వారా వెంకట్ కుంచెమ్ దర్శకునిగా పరిచయం కానున్నారు. మూవీ జానర్: రొమాంటిక్ కామెడీ డ్రామా. ‘టు స్టేట్స్’ బడ్జెట్: 35 కోట్లు, వసూళ్లు: సుమారు 150 కోటు్లూ తెలుగులో ఫస్ట్ రీమేక్..! ఇప్పటివరకూ రామ్చరణ్ చేసినవి తొమ్మిది చిత్రాలు. వీటిలో హిందీ ‘జంజీర్’ ఒకటి. అమితాబ్ బచ్చన్ నటించిన ‘జంజీర్’కి ఇది రీమేక్. అయితే అది ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఒక్కోసారి రిజల్ట్ అటూ ఇటూ ఉంటుంది. అంత మాత్రాన రీమేక్ కలసి రాదు అనడానికి లేదు. అలా ఆలోచించే రామ్చరణ్ తమిళ చిత్రం ‘తని ఒరువన్’ తెలుగు రీమేక్లో నటించాలనుకుని ఉంటారు. తమ్ముడు ‘జయం’ రవితో అన్న మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం బంపర్ హిట్. రామ్చరణ్ టైటిల్ రోల్లో ‘ధృవ’గా గీతా ఆర్ట్స్ రీమేక్ చేస్తోంది. తెలుగులో రామ్చరణ్ చేస్తున్న తొలి రీమేక్ మూవీ ఇది. ఇందులో ఐపీయస్ ఆఫీసర్గా కనిపించడం కోసం రామ్చరణ్ మేకోవర్ అయ్యారు. ఇప్పటికే ఫస్ట్ లుక్కి మంచి స్పందన లభించింది. మూవీ జానర్: యాక్షన్ థ్రిల్లర్. ‘తని ఒరువన్’ బడ్జెట్: దాదాపు 20 కోట్లు, వసూళ్లు: సుమారు 105 కోటు్లూ -
నాని కూడా మొదలెట్టేస్తున్నాడు
ఈ జనరేషన్ హీరోలు దర్శకులు నిర్మాణ రంగం మీద కూడా దృష్టి పెడుతున్నారు. రెమ్యూనరేషన్ రూపంలో వచ్చే కొద్ది మొత్తం కన్నా.. సినిమా లాభాల్లో వాటా అయితే పెద్ద మొత్తంలో డబ్బు చేతికందుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే స్టార్ హీరోలు కొందరు సొంతం నిర్మాణ సంస్థలను స్టార్ చేయగా తాజాగా ఓ యంగ్ హీరో కూడా ఈ లిస్ట్లో చేరడానికి రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని త్వరలోనే నిర్మాణరంగంలోకి అడుగుపెట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. తన బంధువుతో కలిసి బ్యానర్ను స్థాపించే ఆలోచనలో ఉన్నాడు. బ్యానర్లో తెరకెక్కబోయే తొలి సినిమాలో తానే హీరోగా నటిస్తుండగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నాడు. అయితే గతంలోనూ నాని ఓ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యాడు. డి ఫర్ దోపిడి తో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టినా..? పూర్తి స్థాయి నిర్మాతగా సొంతం బ్యానర్ మాత్రం స్థాపించలేదు. త్వరలోనే తను హీరోగా నటించనున్న సినిమాతో నిర్మాతగా మారేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు ఈ నాచ్యురల్ స్టార్. -
ఇటు వెంకీ.. అటు నాని అవసరాల రెడీ!
అగ్ర హీరోల్లో ‘విక్టరీ’ వెంకటేశ్ది విభిన్నమైన శైలి. వినోదంతో ప్రేక్షకులను నవ్విస్తూనే, మరుక్షణం కంటతడి పెట్టించగలరు. దోసెడు నవ్వులు.. చిటికెడు కన్నీళ్లు.. అంటూ ‘జ్యో అచ్యుతానంద’తో దర్శకుడిగా రెండో సినిమాతోనూ ప్రేక్షకులను ముందు నవ్వించి, ఆ తర్వాత ఏడిపించిన నటుడు అవసరాల శ్రీనివాస్. ఈ ఇద్దరి కలయికలో.. అంటే వెంకటేశ్ హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయాలనేది సితార ఎంటర్టైన్మెంట్స్ సూర్యదేవర నాగవంశీ ఆలోచన. వెంకీ హీరోగా మొన్నామధ్య విడుదలైన ‘బాబు బంగారం’ తీశారాయన. అవసరాలను కథ రాయమని అడిగారట. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముందు నాని.. తర్వాత వెంకీ!! ఫిల్మ్నగర్ వర్గాల సమాచారం ప్రకారం... వెంకటేశ్తో సినిమాకి ముందు అవసరాల శ్రీనివాస్ మరో సినిమా చేయనున్నారు. అందులో నాని హీరో. వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాల తర్వాత అవసరాలతో హ్యాట్రిక్పై సాయి కొర్రపాటి కన్నేశారు. అయితే.. ఇంకా ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదట. ప్రస్తుతం అవసరాల స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాతే వెంకీ కథపై ఆలోచిస్తారట. ఇప్పుడు హిందీ హిట్ ‘హంటర్’ రీమేక్లో అవసరాల హీరోగా నటిస్తున్నారు. నటుడిగా మరో రెండు మూడు సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. నాని కూడా హీరోగా బిజీనే. ఇద్దరూ తమ చేతిలోని ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత కలసి సినిమా చేసే అవకాశం ఉంది. ఈ సినిమా పక్కన పెడితే.. దర్శకుడిగా అవసరాల తీసిన రెండు సినిమాలూ అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. అయితే ఇప్పటివరకూ చేసిన రెండు చిత్రాలూ ఒక ఎత్తు. ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరో ఎత్తు అనాలి. ఎందుకంటే దాదాపు 75 సినిమాలు చేసిన వెంకీ, పాతిక సినిమాలు చేసిన నానీతో సినిమా అంటే అవసరాలకు సవాలే. -
తిరుమలలో జ్యో అచ్యుతానంద టీమ్
తిరుపతి : ‘జ్యో అచ్యుతానంద’ చిత్ర బృందం సోమవారం ఉదయం కలియుగ వైకుంఠదైవం శ్రీనివాసుడిని దర్శించుకుంది. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్రాజు, చిత్ర దర్శకుడు అవసరాల శ్రీనివాస్, సంగీత దర్శకుడు కోడూరి కళ్యాణ్, నటి సుధాతోపాటు పలువురు ఆర్టిస్టులు స్వామివారిని దర్శించుకున్నారు. సినిమా పూర్తైన తర్వాత తిరుమల వెంకటేశ్వరుడి దర్శించుకోవాలని ముందే అనుకున్నామని... అందుకే వచ్చామన్నారు. సినిమా విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ...‘సినిమా హిట్కు, ఫ్లాప్కు సంబంధం లేకుండా తిరుమల వద్దామని ముందే అనుకున్నాయి. అయితే సినిమా మంచి విజయం సాధించటం చాలా ఆనందంగా ఉంది. మంచి వసూళ్లు కూడా వస్తున్నాయి. ఇక నెక్ట్స్ ప్రాజెక్ట్ అంటే కొర్రపాటి సాయి గారితో ఇంకో సినిమా చేస్తున్నాను. కాకపోతే కొంచెం టైమ్ పడుతుంది' అని తెలిపాడు. మ్యూజిక్ డైరెక్టర్ కోడూరి కళ్యాణ్ మాట్లాడుతూ.... ’జ్యో అచ్యుతానంద’ పదాన్ని అన్నమాచార్య కృతి నుంచి తీసుకుని సినిమా టైటిల్గా పెట్టుకున్నాం. సినిమా సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉంది. సాయి గారి బ్యానర్లో మరో సినిమాకు సంగీతం అందించబోతున్నా..అని తెలిపారు. -
తిరుమలలో జ్యో అచ్చుతానంద టీమ్
-
స్నేహం కోసం నాని..?
హ్యాట్రిక్ హిట్స్తో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్లో కూడా నానికి ఇప్పుడు మంచి మార్కెట్ ఉంది. రొటీన్ సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో సినిమాలు చేసే నాని, ఇప్పుడు యంగ్ జనరేషన్లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఎదిగాడు. ఈ క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు రెడీ అయ్యాడు ఓ యంగ్ డైరెక్టర్. ఊహలు గుసగుసలాడే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన అవసరాల శ్రీనివాస్, రెండో ప్రయత్నంగా తెరకెక్కించిన సినిమా జ్యో అచ్యుతానంద. నారా రోహిత్, నాగశౌర్యలు హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమాలో నాని, అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అవసరాల శ్రీనివాస్తో ఉన్న స్నేహం కారణంగానే నాని ఈ క్యారెక్టర్కు అంగీకరించాడు. సినిమా క్లైమాక్స్లో వచ్చే కీలక మైన పాత్రలో నాని అలరించనున్నాడు. కథను మలుపు తిప్పే ఈ పాత్రం సినిమాకే హైలెట్ అన్న టాక్ వినిపిస్తోంది. -
అవసరాల డైరెక్షన్లో నాని
అష్టాచమ్మ సినిమాతో యంగ్ హీరో నాని, నటుడు కం దర్శకుడు అవసరాల శ్రీనివాస్ల కెరీర్ ఒకేసారి మొదలైంది. ఈ సినిమా తరువాత నాని హీరోగా సెటిల్ అవ్వగా, అవసరాల శ్రీనివాస్ మాత్రం కామెడీ పాత్రలు చేస్తూనే దర్శకుడిగా కూడా గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉన్నాడు. ఇప్పటికే రెండు సినిమాలు పూర్తి చేసిన అవసరాల దర్శకుడిగా మరిన్ని సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం తన దర్శకత్వంలో రూపొందిన జ్యో అచ్యుతానంద సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న అవసరాల శ్రీనివాస్.. ఆ తరువాత నాని హీరోగా ఓ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. వరుస సక్సెస్లతో నాచురల్ స్టార్గా ఎదిగిన నాని కూడా అవసరాలతో కలిసి పనిచేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నమైన సినిమాలు చేసే ఈ ఇద్దరి కాంబినేషన్పై ఇండస్ట్రీ వర్గాల్లో కూడా మంచి అంచనాలే ఉన్నాయి. -
ఊహించని క్లైమాక్స్ ఉంటుందట
'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో దర్శకుడిగా మారిన నటుడు అవసరాల శ్రీనివాస్. కొంత గ్యాప్ తరువాత 'జ్యో అచ్యుతానంద' పేరుతో ఓ ట్రైయాంగిల్ లవ్ స్టోరీని తెరకెక్కించాడు. జ్యో, అచ్యుత్, ఆనంద్ల ప్రేమకథే ఈ 'జ్యో అచ్యుతానంద'. నారా రోహిత్, రెజీనా, నాగ శౌర్యలు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఆ ఇద్దరు హీరోల్లో ఆమె మనసు ఎవరు గెలుచుకుంటారనేదే ప్రశ్న. అయితే ఈ సినిమాకు క్లైమాక్సే ప్రాణం అనే టాక్ వినిపిస్తోంది. ప్రేక్షకులు ఊహించని విధంగా ముగింపు ఉంటుందని, కచ్చితంగా థ్రిల్కు గురవుతారని చిత్ర యూనిట్ చెబుతున్న మాట. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుందట. వారాహి చలన చిత్ర బ్యానర్ఫై సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రానికి కళ్యాణ రమణ సంగీతం అందించారు. ఈ సినిమా సెప్టెంబరులో విడుదల కానుంది. -
అవసరాలకు మంచి డేట్ దొరికింది
ఊహలు గుసగుసలాడే సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్, రెండో ప్రయత్నంగా తెరకెక్కిస్తున్న సినిమా జ్యో అచ్యుతానంద. ట్రయాంగులర్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో నారా రోహిత్, నాగశౌర్య, రెజీనాలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వారాహి చలనచిత్ర బ్యానర్పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. సినిమా సక్సెస్ విషయంలో కాన్ఫిడెంట్గా ఉన్న యూనిట్కు ఇప్పుడు రిలీజ్ విషయంలో కూడా కలిసొచ్చింది. ముందుగా ఈ సినిమాను భారీ పోటి మధ్య సెప్టెంబర్ 9న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే అదే రోజు రిలీజ్ అవుతాయనుకున్న సినిమాలు ఒక్కొక్కటిగా వెనక్కు తగ్గటంతో ఇప్పుడు జ్యో అచ్యుతానంద సోలోగా బరిలో నిలిచింది. నాగచైతన్య ప్రేమమ్, నాని మజ్ను, సునీల్ వీడి గోల్డెహే సినిమాలు వాయిదా పడ్డాయి. నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా విషయంలో మాత్రం క్లారిటీ లేదు. దీంతో థియేటర్ల సంఖ్యతో పాటు తొలి వారం కలెక్షన్ల విషయంలోనూ జ్యో అచ్యుతానంద సత్తా చాటుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. -
ఆ హీరోకి మొహం చాటేశారు
సినిమా రంగం సక్సెస్ వెంటే పరిగెడుతుంది అన్న నిజం మరోసారి రుజువైంది. మొన్నటి వరకు చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా కనిపించిన ఓ యంగ్ హీరోకి, ఒక్క ఫ్లాప్ వచ్చేసారికి ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. 'చందమామ కథలు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్య ఆ తరువాత వరుస సక్సెస్లతో బిజీ హీరోగా మారిపోయాడు. కానీ ఒక్క ఫ్లాప్ ఈ యంగ్ హీరో కెరీర్నే టర్న్ చేసింది. 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాగశౌర్య తరువాత 'దిక్కులు చూడకు రామయ్య', 'లక్ష్మీ రావే మా ఇంటికీ' సినిమాలతో మంచి విజయాలు సాధించాడు. అయితే ఈ సినిమాలన్నింటిలో లవర్బాయ్గా కనిపించిన నాగశౌర్య, యాక్షన్ టర్న్ తీసుకొని చేసిన 'జాదుగాడు' సినిమాతో తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ ఫెయిల్యూర్ నాగశౌర్య కెరీర్నే కష్టాల్లో పడేసింది. 'జాదుగాడు' సినిమాకు ముందు చేతినిండా సినిమాలతో బిజీగా కనిపించిన నాగశౌర్య ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు. గతంలో నాగశౌర్య ఖాతాలోనే ఉన్న అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఊహలు గుసగుసలాడే సీక్వెల్తో పాటు, మల్లెలతీరంలో సిరిమల్లెపువ్వు దర్శకుడు తెరకెక్కిస్తున్న మరో సినిమాలకు కూడా ఇప్పుడు వేరే హీరోలను ఫైనల్ చేశారు. ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా మాత్రమే ఉన్న నాగశౌర్య ఆ సినిమాతో అయిన హిట్ కొట్టి తిరిగి ఫాంలోకి రావాలని ట్రై చేస్తున్నాడు. -
నవ్వుల మాస్టర్... ఇకపై క్విజ్ మాస్టర్!
తొలి సినిమా ‘అష్టా చెమ్మా’తోనే తన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపారేశాడు అవసరాల శ్రీనివాస్. కామెడీతో కడుపుబ్బ నవ్వించాడు అందరినీ. సరదాగా కాసేపు, పిల్ల జమిందార్, అంతకుముందు ఆ తర్వాత, చందమామలో అమృతం వంటి చిత్రాలతో తన నట ప్రతిభను కళ్లకు కట్టిన శ్రీనివాస్... మంచి రచయిత, దర్శకుడు కూడా. ఇప్పుడు సరికొత్తగా... టీవీ హోస్ట్ కూడా కాబోతున్నాడు. ఓ టీవీ చానెల్ రూపొందిస్తోన్న క్విజ్ ప్రోగ్రామ్ ద్వారా టెలివిజన్ రంగంలోనూ అడుగిడుతున్నాడు శ్రీనివాస్. నిజానికిది పెద్ద వెరైటీ షో ఏం కాదు. హైస్కూల్ స్థాయి విద్యార్థుల పరిజ్ఞానాన్ని పరీక్షించే ఓ క్విజ్ షో. అయితే శ్రీనివాస్ ఈ మామూలు క్విజ్ షోకి, తన స్టయిల్లో వినోదాన్ని మేళవించి ప్రత్యేకతను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడని వినికిడి. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్లు షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ షో, త్వరలోనే మొదలవ బోతోందట. చూద్దాం... ఆ షోకి శ్రీనివాస్ ప్లస్ అవుతాడో, లేక అతడి కెరీర్కి ఈ షో ప్లస్ అవుతుందో! -
మేకింగ్ ఆఫ్ 'ఊహలు గుసగుసలాడే'
-
'ఊహలు గుసగుసలాడే' టీంతో సాక్షి చిట్ చాట్
-
‘నిన్నే పెళ్లాడతా’ లాంటి సినిమాలో చేయాలని ఉంది
‘‘కెరీర్లో ఎప్పటికైనా నాగార్జునగారి ‘నిన్నే పెళ్లాడతా’ లాంటి సినిమాలో నటించాలనేది నా కల. అలాగే... ప్రముఖ దర్శకులందరితో పనిచేయాలనుంది’’ అంటున్నారు యువ నటుడు నాగశౌర్య. ఆయన కథానాయకునిగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మించిన ‘ఊహలు గుసగుస లాడే’ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందడం ఆనందంగా ఉందని నాగశౌర్య ఆనందం వెలిబుచ్చారు. సినిమా అవకాశాలకోసం తిరిగి తిరిగి చివరి ప్రయత్నంగా ఈ ఆడిషన్స్లో పాల్గొన్నానని, మంచి పాత్రతో ప్రోత్సహించిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలని నాగశౌర్య తెలిపారు. కెరీర్ని జాగ్రత్తగా మలచుకోవాలనుకుంటున్నానని, ప్రస్తుతం సాయి కొర్రపాటి నిర్మాణంలోనే ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమా చేస్తున్నానని, రాజమౌళి సహాయకుడు కోటి ఈ సినిమాకు దర్శకుడని, అలాగే ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ సినిమా కూడా చేస్తున్నానని శౌర్య చెప్పారు. -
'ఊహలు గుసగుసలాడే' టీంతో చిట్ చాట్
-
ఊహలు గుసగుసలాడె మూవీ ఆడియో లాంచ్
-
ఊహలు గుసగుసలాడె మూవీ పోస్టర్స్, వర్కింగ్ స్టిల్స్
-
చందమామలో అమృతం మూవీ ఆడియో లాంచ్
-
మెగాఫోన్ పట్టనున్న అవసరాల శ్రీనివాస్
ఆష్టా చెమ్మా, పిల్ల జమిందార్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ నటుడు అవసరాల శ్రీనివాస్. త్వరలో ఓ తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు వర్థమాన నటుడు అవసరాల శ్రీనివాస్ బుధవారం చెన్నైలో వెల్లడించారు. హాస్య ప్రధానంగా నడిచే కథకు హీరోతోపాటు ప్రముఖ హస్య నటులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించిన కథను రూపొందించినట్లు తెలిపారు. తాను నిర్మించనున్న చిత్రానికి సాయి కోర్రపాటి నిర్మాతగా వ్యవహారిస్తున్నారని చెప్పారు. ఆయన గతంలో ఈగ, అందాల రాక్షసి లాంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారని శ్రీనివాస్ తెలిపారు. అలాగే ప్రముఖ దర్శకుడు శ్రీనివాస్ గోగినేనితో మరో చిత్రానికి పని చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఆ చిత్రం కూడా ప్రధానంగా వినోదభరితంగా ఉంటుందన్నారు. ఆ రెండు చిత్రాలు త్వరలో ప్రారంభంకానున్నాయన్నారు.